నడవడి యే అసలైన అలంకారం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ గే ట్ ”మరియు చెత్త రాజకీయం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కస్ట జీవులే కలకాలం బతుకుతారు -84 ఏళ్ళ శ్రీమతి మల్లు స్వరాజ్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 148- శతాధిక గ్రంధ కర్త, హయగ్రీవోపాసకులు బెల్లం కొండ రామరాయ కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

148- శతాధిక గ్రంధ కర్త, హయగ్రీవోపాసకులు  బెల్లం కొండ రామరాయ కవి

వైష్ణవ సంప్రదాయం లో జన్మించి అద్వైతాన్ని ఆలింగనం చేసుకొని దాని లోతులను తరచిన మహా కవి ,విమర్శకులు శ్రీ బెల్లం కొండ రామ రాయకవి .గుంటూరు జిల్లా నరసరావు పేట దగ్గర పమిడి పాడు లో నియోగికులం లో సంపన్న గృహస్తుఇంట  రామరాయకవి 1876లో జన్మించారు .భారద్వాజ గోత్రీకులు .ఆశ్వలాయ సూత్రులు ,రుక్ శాఖకు చెందిన వారు .చిన్నతనం లో నే పితృ వియోగం కలిగింది .

స్వయం కృషితో విద్య –పిన్న వయసులోనే రచనా వ్యాసంగం

స్కూలు లో చేరి మొదట కొంతకాలం ఇంగ్లీష్ విద్య నేర్చుకొన్నారు .అది మానేసి సంస్కృతం అభ్యసించారు .హయగ్రీవ ఉపాసకులై విశిస్టాద్వైత మతానికి మారారు .చిన్నతనం నుండి సంస్కృతం లో కవిత్వం రాయటం అలవడింది .సంస్కృత పాండిత్యమూ అప్పటికి గోప్పదేమీకాదు .  కాళిదాసు రాసిన రఘువంశం , కుమార సంభవం లలో రెండేసి సర్గలు మాత్రమె నేర్చుకొన్నారు .మేఘ దూతం చదవటం మొదలు పెట్టి పూర్తిగా చదవకుండా అంతా విన్నారు .సంస్కృత జ్ఞానం బాగా ఏర్పడింది .తర్వాత అన్నిటిని స్వయం గా అభ్యసించారు .14 వయేత ‘’రుక్మిణీ పరిణయం ‘’,రమా పరిణయం ‘’ అనే చంపూ కావ్యాలు రాశారు .నెల్లూరుకు చెందిన సింగరాజు వెంకట రమణయ్య ,గారి రెండవ కుమార్తె ఆడి లక్ష్మమ్మ గారిని రామ రాయకవి వివాహం చేసుకొన్నారు .

అంతర్ముఖత్వం –హయగ్రీవ ఉపాసన

కంఠం లోతు నీటిలో నిలబడి హయగ్రీవ మంత్రాన్ని అనుష్టానం చేసేవారు . చింత తోటలోకి చేరి అరుగుమీద కూర్చుని ఉపాసన చేసేవారు .ఇంటి లో హయగ్రీవార్చన నిత్య కృత్యం గా చేసేవారు .చదువుమీద శ్రద్ధ ఉన్న విద్యార్ధులకు తన ఇంట్లోనే ఆహార వసతులను కలిపించి సాహిత్యాలంకార శాస్త్రాలను బోధించేవారు .పురిఘళ్ళ రామ శాస్త్రి  సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుల వద్ద తర్కాన్ని వ్యాకరణాన్ని నేర్చారు .వ్యాఖ్యా వ్యాకరణాలను స్వయం గా నేర్చారు .

ద్వైతి- శంకరాద్వైతిగా మారటం    రామరాయ కవితా యశోభూషణం

‘సిద్ధాంత కౌముది పై ‘’శరద్రాత్రి ‘’అనే వ్యాఖ్యానం రాశారు .అనునిత్యం వేదాంత గ్రంధ పఠనం చేసి అద్విత వేదాంతాన్ని మొత్తం గా స్వయం గా ఆకళించుకొని నిష్ణాతులయ్యారు .అప్పటిదాకా ఉన్న విశిష్టాద్వైత మతాభిమానం తొలగించుకొని పూర్తిగా  అద్వైతి అయ్యారు రామరాయకవి .వంశ పారంపర్యంగా వచ్చిన ద్వైతాన్ని విసర్జించి ఆ గురువులకు దూరమై పోయి అద్వైతానికి అంకితమయ్యారు .శంకర వేదాంత గ్రంధాలను బోధించారు .జీవితకాలం లో రామ రాయ కవి 143 గ్రంధాలు రచించిన బహు గ్రంధ కర్త .తానె స్వయం గా కొన్ని గ్రంధాలను ముద్రించారు ఇంత చిన్న వయసులో ఇన్నిఉద్గ్రంధాలు   రాసిన వారెవ్వరూ లేరు .వీరికి వీరే సాటి గా నిలిచారు

.                    రామరాయ కవితా యశోభూషణం

రామరాయ కవి రాసిన వాటిలో స్తోత్ర గ్రంధాలు, శతకాలు అనేకం ఉన్నాయి .అందులో  అష్టకాలు ,స్తోత్రాలు కలిసి 68 ఉన్నాయి .వీటన్నిటిలో శాంకరాద్వైతాన్నే ప్రతిపాదించారు కవిగారు ఇందులో ‘’హకారాది హయగ్రీవ సహస్ర నామావళి ‘’చాలా ప్రాచుర్యం పొందింది ..శంకర భగవత్పాదులు రాసిన ‘’గీతా భాష్యం ‘’కు వ్యాఖ్య రాశారు .శంకర భాష్య టీకా గా ‘’గీతా భాష్యార్ధ ప్రకాశిక ‘’,దశోపనిషత్తులకు ‘’వేదాంత ముక్తావళి ‘’,అద్వైతం పై ‘’శంకరా శంకర భాష్య విమర్శ ‘’ స్వామి మధుసూదన సరస్వతి రాసిన గ్రంధానికి ‘’సిద్ధాంత సింధువు ‘’వ్యాఖ్య , అద్వైత తత్వాన్ని ప్రతిపాదిస్తూ ‘’వేదాంత కౌస్తుభము ‘’,రాశారు .’’అద్వైతాన్య మత ఖండనం ,,’’కౌముదికి వ్యాఖ్యగా ‘’శరద్రాత్రి ‘’,చంపూ భాగవత వ్యాఖ్య  మురారి రాసిన అనర్ఘ రాఘవ నాటకానికి వ్యాఖ్య ,సముద్ర మధన చంపూ కావ్యం ,శ్రీ కృష్ణ లీలా తరంగిణి కావ్యం రాశారు .రామరాయ కవి గ్రంధ రచనను ఒక మహా తపస్సుగా చేశారు .అద్భుత ధారా శుద్ధి  శబ్ద శుద్ధి రామరాయ కవి గారి ప్రత్యేకత .

అంతర్ముఖుడైన సమావిస్టూడైన యోగిగా రామ రాయ కవిని లోకం గుర్తించి కీర్తించింది .హయగ్రీవ ఉపాసకులకు అసాధ్యమేదీ లేదని నిరూపించిన సిద్ధ యోగి పుంగవులు శ్రీ బెల్లం కొండ రామ రాయ కవి కేవలం 39 సంవత్సరాలు మాత్రమె జీవించి శతాధిక గ్రంధ రచన చేసి 1914 లో ముక్తిని పొందారు .

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆఫ్గనిస్తాన్ లో బమియాన్ బుద్ధ ధగ దగ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంజని -నందివాడ కధల పోటీ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్య మర్మమెరిగిన కారా మాస్టారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రంగాచార్య – కవిత -”కొలిమంటు కొంది ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మిలిటంట్లకు శివంగి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్యం లో సవాల్ అంటే శారీరక బాల ప్రదర్శనమా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశికా పూరి -తెలుగు వారి శివానంద లహరి

kashi 1 001 kashi2 001కాశికా పూరి -తెలుగు వారి శివానంద లహరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విరాట రాజు గద్దె కాదు -బౌద్ధ స్థూపం

viratraj gadde 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమరావతిలో బౌద్ధమత ప్రాభవం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సూర్యుడు బ్రౌన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిదంబర దేవాలయం లో ”సభలు ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాతీయ స్థాయి బుచ్చిబాబు -దా.వేదగిరి రా0 బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇందిరా ఎమర్జెన్సీ పెట్టి 40 ఏళ్ళయింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనీ‘షి’ -అడుసుమల్లి మల్లికార్జున-కద

మనీ‘షి’

  • 14/06/2015
  • |

  • -అడుసుమల్లి మల్లికార్జున

కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రచన
***
ఓం
భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యమ్
భర్గో దేవశ్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్!’
ధ్యానం ముగించుకుని గాయత్రి మంత్రం స్మరిస్తూ – తలుపు తీశాను. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ రాముడు.
‘ఒరే రాముడూ!’ ఆనందంతో బిగ్గరగా కేక వేశాను.
‘అంత బిగ్గరగా అరవకు. ఎక్కడో సీతమ్మ దగ్గరున్న రాముడు కంగారుపడి పరుగెత్తుకొచ్చేను’ అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు రాముడు అని నేను పిలిచే రామచంద్రయ్య. చిన్ననాటి నుంచి వదలకుండా ఇంకా మిగిలి వున్న ఏకైక నేస్తం.
‘పద్మ ఎప్పుడు వస్తుందిరా?’
‘నిన్ననే కదరా వెళ్లింది. వాళ్ల తమ్ముడు కూతురు సంబంధం విషయమై వెళ్లింది. రెండు మూడు రోజులు పడుతుంది’ అన్నాను.
‘ఈ మూడ్రోజులు బతుకు పో’ అందా?’
‘మరి? ఆడాళ్లు అప్పుడప్పుడు అలా వెళ్లకపోతే మగాళ్లు చచ్చిపోరట్రా’
మా ఆఫీసులో ఈ మధ్య ఓ జోకు –
సుబ్బారావని అటెండరు. ఈ మధ్య ‘హార్ట్ స్ట్రోక్’ వచ్చింది. ఏమయ్యా! నీకు షుగర్ లేదు. బి.పి. లేదు. ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందయ్యా అని డాక్టర్ అడిగారట. ‘్భర్య వుందిగా’ అన్నాడట మెత్తగా. డాక్టర్ తేరిపార చూసి ‘నిజమేనయ్యా! ఆ విషయం మర్చిపోయా’ అన్నాడట అంతకంటె మెల్లిగా.
ఇద్దరం భలే నవ్వుకున్నాం. వాడుంటేనే ‘్భలే’ అనే పదానికి అర్థం.
‘నేను స్నానం, ధ్యానం ముగించుకుని వస్తాను. అంతవరకు వీటి జోలికెళ్లకు’ అంటూ నాలుగు పొట్లాలు టేబుల్ మీద పెట్టాడు.
‘ఏమిటివి?’
‘వస్తూ వస్తూ
కనుక్కున్నాను. శీనయ్య హోటల్‌లో ఇడ్లీ, పెసరట్టు ఉప్మా బావుంటాయని తెలిసింది. అవే ఇవి’ అంటూ టవల్ అందుకున్నాడు.
నేను నోరు తెరుచుకుని చూస్తూండిపోయాను.
నేను బాపట్ల వచ్చి నాలుగైదు నెలలు. ఆ శీనయ్య హోటలు సంగతి నాకింతవరకు తెలీదు. వీడు అడుగుపెట్టింది ఈ రోజే. ఇప్పుడే కాదు వాడు ఎప్పుడూ అంతే. ఏదైనా టూర్ వెళ్లినపుడు – మేమంతా పట్టించుకోని విషయాలు, అతి చిన్న విషయాలు వాడికి తెలిసిపోయేవి. ఏదైనా ఊరు వెళ్లి వస్తే ఆ ఊరు ఆహార వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. ఈనాటికి వాడికి ఆ ‘ఉత్సుకత’ తగ్గలేదు. అడిగితే ఏమనుకుంటారో అనే ‘్భతి’ నాకూ తగ్గలేదు.
రాముడు వాళ్ల నాన్నగారు మిలట్రీ ఆఫీసర్. కాళ్లకు చెప్పుల్లేకుండా మేము హైస్కూలు వెళ్తున్నపుడు – వీడు టై, టక్, బూట్లతో ప్రత్యక్షమయ్యేడు. అందరూ ‘సిటీ బాయ్’ అన్నారు. వాడి చదువు కూడా అట్లాంటి చోటే సాగింది. వాడి దగ్గరకు వెళ్లాలంటే అందరికీ బెరుకు. తను మాత్రం అందరితో ఫ్రీగా వుండేవాడు. నాతో మరింత దగ్గరగా వచ్చేవాడు. అలా ఆనాటి నుంచి మంచి స్నేహం.
చాలా సున్నితమైన విషయాలు కూడా నాకు చెప్పేవాడు.
పైట చూసి ఆమడ దూరం పరుగెత్తే వయసులో తను మాత్రం మగ పిల్లలతో మాట్లాడినంత మామూలుగా వాళ్లతో మాట్లాడేవాడు. వాళ్లూ హాయిగా మాట్లాడేవాళ్లు.
చిత్రం చూడండి.
చూట్టానికి అలా వుంటారుగాని
ఆడాళ్లు – భలే వాళ్లు.
రాముడంటే చాలామంది అమ్మాయిలు ఇష్టపడేవాళ్లు. జీవితమంతా అలాగే ఆడుతూ పాడుతూ గడిపేశాడు. అందుకే నేను ‘ఒరే రాముడు – కాదు కృష్ణుడు’ అనేవాణ్ని.
ఉదయానే్న ధ్యానం చేస్తాడు. గాయత్రి మంత్రం జపిస్తాడు. సాయంకాలం ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు వెళ్తాడు. రాత్రి ‘బోట్స్ క్లబ్’కెళ్లి సరదాగా గడిపేస్తాడు. ‘దేనికదే’ అంటాడు. అందరూ అలా జీవించలేరు. ఏదో బ్రతుకీడుస్తూ ఉంటారు. ఆ ఆనందాన్ని, అదృష్టాన్ని చూసి విధి కుళ్లుకుంది. హాయిగా విశ్రాంతి తీసుకునే వయసులో భార్య చనిపోయింది.
ఒక కొడుకు, కూతురు – ముచ్చటైన సంసారం. కొడుకు ఏరోస్పేస్ ఇంజనీర్‌గా బ్రిస్టల్‌లో వుంటున్నాడు. వాడికి పెళ్లి చేశాడు. కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చిన్న యాక్సిడెంట్‌లో భార్య చనిపోయింది. నేనూ, పద్మా వెళ్లి వారం రోజులు అక్కడే వుండి వచ్చాం. ఎన్ని వున్నా ఇల్లాలు లేని లోటు ఎవరు తీర్చగలరు.
రాముడు ప్రాక్టికల్ మనిషి. రాత్రులు చందమామను చూసి కలలు కనవచ్చు. పగలు అది తల్చుకుని పని పాడు చేసుకోకూడదు – అనే మనస్తత్వం. త్వరలోనే కోలుకున్నాడు. ఉద్యోగరీత్యా నేను ఎన్ని ఊళ్లు తిరుగుతున్నా ‘కావలి కబుర్లు’ వాడి ద్వారా ఎప్పటికప్పుడు తెలిసేవి. నిజంగా తెలిసీ తెలియని యవ్వనం ఎంత మధురం. ఎప్పుడు తలుచుకున్నా పెదవులు సుతారంగా విచ్చుకుంటాయి.
ఇంతలో రాముడు వచ్చాడు.
‘్ధ్యనం ఎంత మంచి అలవాటు. మనసు ప్రశాంతంగా ఉంటుందిరా’
‘నిజమే రాముడు. దాని ప్రభావం తప్పక కనిపిస్తుంది’
‘నిన్ను చూసేరా.. ఈ ధ్యానం, గాయత్రి మంత్రం అలవాటైతే.. మంచి అలవాటైనా – వదలటం కష్టం’ అంటూ నవ్వాడు.
‘అవున్రా! నాకే తెలీదు. ఈ ఉప్మా పెసరట్టు సంగతి’
‘నీ తలకాయ్.. నువ్వు బైట తింటే కదా తెలిసేది. బాపట్ల ఎట్లా ఉంది? ఈ ఊరు స్పెషల్ ఏమిటి?’
టిఫిన్ తింటూ కబుర్లలో పడ్డాం.
‘మన కావలి, బాపట్ల ఒకలా ఉంటాయిరా. సముద్ర తీరానికి పది కిలోమీటర్లలోపు. మనకు రాతి నేల. ఇక్కడ ఇసుక నేల. మల్లెపువ్వులు, ఆకు కూరలు కావాలంటే మాత్రం బాపట్లేరా’
‘ఆహా! మల్లెపూలు ఉంటే ఆడాళ్లెందుకురా!’ అన్నాడు కొంటెగా నవ్వుతూ.
‘పువ్వులు పెట్టుకోటానికి’ అన్నాను నవ్వుతూ.
‘ఓహో! మర్చిపోయాను’
* * *
రాముడు తీరిగ్గా అసలు విషయం బైటపెట్టేడు.
‘చందన సంబంధం విషయం వచ్చాన్రా. బాపట్లలో ప్రసాదరావుగారని. వాళ్లబ్బాయి ఐ.బి.ఎం.లో వున్నాడట. పాప కూడా హైదరాబాదే కాబట్టి – ఒకే ప్రొఫెషన్. అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అన్ని వివరాలు తెలుసుకుంటే బావుందనిపించింది. నువ్వూ ఇక్కడకే చేరావు. అదీ సంగతి’
‘చాలా ఆనందంగా ఉందిరా’
‘వచ్చిన పని పూర్తయితే కదా’
‘దానికేంరా. కుందనపు బొమ్మ. తప్పకుండా ఈ సంబంధం కుదురుతుంది. పద్మ వుంటే సంబరపడిపోయేది తెలుసా. చందన పెళ్లి తర్వాత నువ్వూ ఇక్కడకు వచ్చేయ్‌రా. ఒక్కడివి ఏం చేస్తావ్? అందరం కలిసే ఉందాం’
ఆ మాటతో రాముడి కళ్లు చెమ్మగిల్లాయి.
కాసేపు మాట్లాడలేదు.
‘నేను మనస్ఫూర్తిగా చెప్తున్నారా. మాకు ఎవరున్నారు? ఎవరి దారి వారిది. నేను పద్మ. మేము నీ గురించి అదే అనుకుంటూ ఉంటాం’
‘ఎప్పుడైనా పొరపాటున రాత్రి తొలి గంటలో మన ‘సెషన్’ చూసిందంటే – తర్వాత మంచి నీళ్లు కూడా పుట్టవు తెలుసా’ అంటూ నవ్వేశాడు.
‘సరే. ఎప్పుడు వెళ్దాం ప్రసాదరావుగారింటికి’ అడిగాను.
‘సాయంత్రం వెళ్దాం’
* * *
చల్లని సాయంకాలం
ఇద్దరం పటేల్‌నగర్‌లోని ప్రసాదరావు ఇంటికి వెళ్లాం. ఇంటి వాతావరణం చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. ముందు వైపు పూల మొక్కలు, జామ, ఉసిరి చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
మేము వెళ్లేసరికి ప్రసాదరావు గారు బైట మొక్కల మధ్య పడక కుర్చీలో కూచొని సంజీవదేవ్ ‘తెగని జ్ఞాపకాలు’ చదువుతున్నారు.
నన్ను పరిచయం చేసుకుని, రాముణ్ని పరిచయం చేశాను. కావలి నుంచి వచ్చాడని చెప్పగానే – ఆయనకు అర్థమైంది.
‘రండి రండి… చాలా సంతోషం. కృష్ణమూర్తిగారు చెప్పారు’ అని ఆప్యాయంగా పలకరించారు.
ఈ అపార్ట్‌మెంటు బతుకుల్లో ఏం కోల్పోతున్నామో, ప్రసాదరావు గారిల్లు చూస్తే తెలిసిపోతుంది.
ఆ మాటే అన్నాను.
‘ఈ క్రెడిట్ అంతా మా ఆవిడదే. పని చేసేది ఆవిడ. ఆస్వాదించేది నేను’ అన్నారు.
ఆయన కూడా సరదా మనిషే.
కుర్చీలు తెప్పించి ఆ మొక్కల మధ్య, చెట్ల నీడలో వేయించారు. తను లోనికెళ్లి వాళ్ల బాబు ఫొటోలు తెచ్చారు. చాలా బావున్నాడు. రాముడు కూడా వాళ్ల పాప ఫొటోలు చూపించాడు.
ఈడూ జోడూ ముచ్చటగా ఉంటుంది.
రాముడు అక్కడి వాతావరణం, ఆ ఇల్లు చూశాక కాస్త ఆలోచనలో పడ్డాడు. కొడుకు ‘బ్రిస్టల్’లో వున్నా, కూతురు ఉద్యోగం చేస్తున్నా ఆర్థికంగా పెద్ద పొజిషన్ కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందాన ఉంది. వాళ్లు కాస్త ఎక్కువలోనే ఉంటారు. అయినా వెళ్లిరా. దేవుడి దయ ఉంటే, రాసి పెట్టి ఉంటే అంతా సవ్యంగా జరుగుతుందని కృష్ణమూర్తిగారు చెప్పబట్టి వచ్చాడట.
నిజం చెప్పాలంటే అబ్బాయే అందంగా ఉన్నాడు. కుటుంబ పరంగా, ఆర్థికపరంగా చూసినా అన్ని విధాలా కాస్త ఎత్తులోనే ఉన్నారు ప్రసాదరావుగారు. ఇలాంటి విషయాలు వాళ్లు మాట్లాడుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. నేనే మొదలుపెట్టాను.
కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు – అన్నీ విడమరిచి చెప్పాను. నేను మాట్లాడినంతసేపు ప్రసాదరావు గారు చిరునవ్వుతో విన్నారు. చివరగా ఆయన అన్నారు.
‘కృష్ణమూర్తిగారు మాకు ఫ్యామిలీ ఫ్రెండు. రామచంద్రయ్య గారి గురించి పూర్తిగా చెప్పారు. నాకు చాలా సంతోషం కలిగింది. మా బాబు పెళ్లి విషయంలో వాళ్లమ్మ ఇష్టమే వాడిష్టం. నా మీద అంత నమ్మకం మరి’
మేము నవ్వాం.
తనూ నవ్వి-
‘నిజమండీ. నాకు మాత్రం అన్ని విధాలా నచ్చింది. ముఖ్యంగా రామచంద్రయ్యగారు, మీరు. మీ మాటలు, పాప, కుటుంబం – రాసిపెట్టి ఉంటే అంతే మరి’ అన్నారు.
నాకు తృప్తి కలిగింది.
రాముడి ముఖంలో కూడా కాంతి.
ఆడపిల్లకు పుట్టిల్లు కంటె అత్తారిల్లు ప్రాముఖ్యత ఎంతో ఉంది. జీవితాంతం వీడని అనుబంధం కదా.
ప్రసాదరావుగారిని చూసినా, వారి మాటలు విన్నా ఆడపిల్లల తండ్రులకు భయం తీరిపోతుంది.
మమ్మల్ని తీసుకెళ్లి తన మినీ లైబ్రరీ చూపించారు.

కృష్ణశాస్ర్తీ, చలం, బుచ్చిబాబులతోపాటు ఆధునిక రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి. పోతన భాగవత మాధుర్యం గురించి ముచ్చటించారు. సాహిత్యంలో పడి కాలం ఇట్టే గడిచిపోయింది.
‘మరి మేము సెలవు తీసుకుంటాం’ అన్నాం.
‘వుండండి. మా ఆవిడ వస్తుంది. శ్రావణమాసం కదండీ. పూజలూ అవీ ఉంటాయి’ అంటూ ‘శారదా’ అని పిలిచారు.
కాఫీ తీసుకుని వచ్చిందావిడ.
‘నమస్కారమండి’ అంది.
మేము ప్రతి నమస్కారం చేశాం.
ఆవిడను చూసి రాముడు మ్రాన్పడిపోయాడు. ఆవిడ స్థితి కూడా అలాగే ఉంది.
కలా! నిజమా! అన్నట్లు చూస్తూండిపోయారు.
నేను రాముణ్ని పరిచయం చేశాను. ఈలోపు ప్రసాదరావుగారు విషయం పూర్తిగా చెప్పారు.
ఆవిడ శాంతంగా విన్నారు.
పాప ఫొటో తీసుకున్నారు.
ఆదరంగా, ఆప్యాయంగా మాట్లాడారు.
బాబుతో మాట్లాడి తప్పకుండా త్వరలో అభిప్రాయం చెప్తామన్నారు.
నోట మాట రాకుండా గుడ్లప్పగించి అట్లాగే ఉండిపోయాడు రాముడు.
నమస్కారం చేసి బైటకొచ్చాం.
ఇంటికి వచ్చేవరకు రాముడు మాట్లాడలేదు.
మనిషి కలత చెందినట్లు కనిపించాడు. దిగులుగా వున్నాడు.
‘ఆలోచించకు. నేను మాట్లాడతాను. ఈ సంబంధం కుదురుతుంది’ అన్నాను.
‘నాకు ఆశ లేదు. ఈ సంబంధం కుదరదు’ దృఢంగా అన్నాడు రాముడు.
నాకు అర్థం కాలేదు.
నిదానంగా అన్నాడు.
‘ఆ రోజుల్లో కట్నం నచ్చక ఒక మంచి అమ్మాయిని చేసుకోలేక పోయానని నీకు చెప్పాను గుర్తుందా? ఆ అమ్మాయే ఇప్పుడు మనం చూసిన ఆవిడ’
విషయం చిన్నగా అర్థమైంది.
కారణం ఎవరైనా కానీ ఆ రోజుల్లో వాళ్లు చాలా ప్రాధేయపడ్డారు. డబ్బులు పెద్దగా ఇవ్వలేమని తర్వాత వీలైతే అడిగినంత ఇవ్వగలమని రాముడు వాళ్లను బ్రతిమాలారు. అందరూ మంచివాళ్లే. కాని పెళ్లి జరగలేదు. ఆడపిల్ల గలవాళ్లు చాలా బాధ పడ్డారు. రాముడు కూడా ఆటలో బొమ్మలా అలా ఉండిపోయాడు.
విధి విచిత్రమంటే అదే కాబోలు.
ఈ రోజు తన కూతురు భవిష్యత్తును నిర్ణయించే అధికారం, అవకాశం ఆవిడకే వచ్చింది.
రాముడు చెప్పాక – విషయం పూర్తిగా అర్థమైన తర్వాత, నాకు కూడా సంశయం కలిగింది.
‘చూద్దాంరా. ఇంతకంటే మంచి సంబంధం వస్తుందిలే’ ధైర్యం చెప్పాను.
వౌనంగా ఉండిపోయాడు రాముడు.
జీవితాన్ని ఆడుతూ పాడుతూ ‘సిటీ బాయ్’గా – రాముడు కాదు కృష్ణుడుగా, గడిపిన రాముడు ఒక్కసారిగా డీలా పడిపోయాడు. కూతురు విషయమై ఏ తండ్రి అయినా ఆలోచన చేయటం సహజం. కానీ చేతిదాకా వచ్చింది, నోటిదాకా రాకపోయేసరికి – నిజంగా ఆడపిల్ల తండ్రి అయిపోయాడు.
మరుసటి రోజు వాణ్ని ట్రైన్ ఎక్కించి-
‘నువ్వేమీ ఆలోచన పెట్టుకోకు. చందనకు మంచి సంబంధం నేను చూస్తాను’ అని ధైర్యం చెప్పాను.
సరిగ్గా వారం రోజుల తర్వాత-
ప్రసాదరావుగారు మా బ్యాంక్‌కి వచ్చారు. నన్ను చూసి చిరునవ్వుతో నా దగ్గరకు వచ్చి-
‘నమస్కారం’ అన్నారు.
నేను నమస్కారం పెట్టి-
బాయ్ చేత ‘కాఫీ’ తెప్పించాను.
‘బ్యాంకులో పని ఉందా?’ అని అడిగాను.
‘లేదండి. మీ దగ్గరకే వచ్చాను. మీ రామచంద్రయ్యగారి సంబంధం మాకు బాగా నచ్చింది. కట్నం విషయం ఆలోచన వద్దు. మీ ఫ్రెండ్‌కు చెప్పండి. ముందుగా మీకు చెప్పాలని వచ్చాను’ అని చెప్పారు.
సంతోషానికి అర్థమేమిటో తెలిసింది.
ఆ సాయంత్రం-
పళ్లు, స్వీటు తీసుకుని ప్రసాదరావు గారింటికి వెళ్లాను.
ఎదురుగా ఆవిడ.
ఆవిడకు ఇచ్చి, రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాను.
మానవత్వానికి, మంచితనానికి ప్రతీకగా ఆమె అలాగే నిలబడి ఉంది.
నేను వడివడిగా బైటకొచ్చాను – ఈ విషయం రాముడికి చెప్పాలి కదా! ఈలోపు మీకు కనిపించినా వాడి చెవిలో ఈ శుభవార్త వేయండి.

అడుసుమల్లి మల్లికార్జున
15-5-56, వేదాంతంవారి వీధి, బాపట్ల – 522 101
గుంటూరు జిల్లా.. 99895 99175
*

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇన్‌స్టెంట్’ కిల్లర్స్!

ఇన్‌స్టెంట్’ కిల్లర్స్!

రెండు నిమిషాల్లో వేడివేడిగా, ఘుమఘుమలాడుతూ నోరూరించే ఆ నూడిల్స్.. నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఎందరికి తెలుసు? తెలిసినా పట్టించుకునేవాడేడి? ప్రపంచవ్యాప్తంగా ఇంటిల్లిపాదికీ అప్పటికప్పుడు, చిటికెలో తయారయ్యే రుచికరమైన ‘ఇన్‌స్టెంట్ నూడిల్స్’ అంటే చచ్చేంత ఇష్టం. అయతే ప్రమాదకరమైనవని ఇప్పుడు తేటతెల్లమవుతోంది. నిజానికి నూడిల్స్ మంచి ఆహారమే. కానీ, రుచిని పెంచడానికి వాటి తయారీలో వాడే రసాయనాల పరిమాణం పెరిగితే అది మనిషి ఆరోగ్యానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలా ప్రమాదకర రసాయనాలతో తయారైన మ్యాగీ నూడిల్స్‌పై ఇపుడు దేశవ్యాప్తంగా వివాదం రేగింది. ‘ఆకలి రుచి ఎరుగదు…నిద్ర సుఖమెరుగదు’ అన్నది అలనాటి సామెత. కానీ, ‘ఆకలి రుచిని కోరుతోంది.. ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న’ది నేటి సామెత. ఇపుడు సర్వత్రా చెలరేగిన మ్యాగీ నూడిల్స్ వివాదం ఇదే చెబుతోంది. ఒక్క నూడిల్స్ గురించే ఎందుకు చెప్పుకోవాలి. ‘జంక్ ఫుడ్’గా భావించే ఆహార పదార్థాలన్నీ ఆ కోవలోకే వస్తాయి. కూల్‌డ్రింక్స్, మినరల్ వాటర్ బాటిల్స్‌లో పురుగుమందులు, ఐస్‌క్రీములు, చాక్లెట్లు, పాలపొడి ఒకటేమిటి? నాగరికపు ఆహార పదార్థాలైన బర్గర్లు, పిజ్జాలలో రుచి పెరిగేందుకు వాడే ఎంఎస్‌జి (మోనో సోడియం గ్లుటామేట్) వంటివి దర్శనమిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘ప్రాసెస్‌డ్ ఫుడ్’లో పరిమితికి మించి వాటిని వాడుతూనే ఉన్నారు. *** నూడిల్స్…ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినోటా విన్పిస్తున్నమాట. నిన్నమొన్నటివరకు దేశంలో దాదాపు ప్రతి వంటింట్లో ఘుమఘుమలాడిన ఈ నూడిల్స్‌పై ఇప్పుడు ధుమధుమలాడేవారు ఎక్కువయ్యారు. మానవుడి ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాల పరిమాణం ఎక్కువగా ఉన్నాయంటూ అత్యంత జనాదరణ పొందిన మ్యాగీ నూడిల్స్ దేశంలో సంచలన వార్తాకథనాలు వెల్లువెత్తాయి. చాలా ప్రాంతాల్లో వీటిపై నిషేధం విధించారు. వేల ఏళ్ల క్రితమే నూడిల్స్ తయారీ ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఇన్‌స్టెంట్ ఫుడ్‌లో నూడిల్స్‌దే సింహభాగం. వీటిని కనిపెట్టింది చైనా. ఇప్పటికీ వాటి తయారీలోను, వాడకంలోనూ ఆ దేశానిదే అగ్రస్థానం. చైనాలోని ఎల్లో రివర్ ప్రాంతంలో పురాతత్వ శాస్తవ్రేత్తలు 2002లో జరిపిన తవ్వకాల్లో నూడిల్స్‌తో ఉన్న ఓ బౌల్ దొరికింది. అందులో నిండుగా నూడిల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత పురాతన నూడిల్స్‌గా రికార్డు సాధించాయి. శాస్తవ్రేత్తల అంచనా ప్రకారం 206 బిసిఇ- 220 సిఇలో నూడిల్స్ వాడుకలోకి వచ్చాయి. టాంగ్ రాజవంశం పరిపాలించినప్పుడు ఇవి బహుళ వ్యాప్తిలోకి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. నూడిల్స్‌లో ఏముంటుంది? నిజానికి పురాతన పద్ధతి ప్రకారం తయారు చేసిన నూడిల్స్‌లో అన్నీ పోషక పదార్థాలే వాడేవారు. ముఖ్యంగా మొక్కజొన్న పిండి లేదా వరి, గోధుమ పిండి, పామ్ ఆయిల్, కాస్తంత ఉప్పు కలిపి వీటిని తయారు చేసేవారు. వందలాది సంవత్సరాల పాటు ఇవే పదార్థాలు వాడేవారు. తీగలుతీగలుగా వీటిని పేని, ముక్కలుగా, రకరకాల ఆకారాల్లో విరిచి వండేవారు. రెండో ప్రపంచయుద్ధం ముగిసేవరకు అదే పరిస్థితి. సేమియా, పాస్తావంటివి ఆ తరువాత నూడిల్స్‌కు మరోరూపంగా తయారయ్యాయి. ఇక నూడిల్స్‌లో సన్నగా తరిగిన కాయగూరలు, ఇతర ఆహార పదార్థాలను కలిపి వండుకోవడం ఆ తరువాత మొదలైంది. ‘ఇన్‌స్టంట్’ ప్రభంజనం రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమిపాలైన తరువాత సైనికులు, సాధారణ పౌరులు ఆకలితో అలమటించిపోయారు. ధరల పెరుగుదల, క్షామం, ఉపాధి లేమి వంటి పరిస్థితుల్లో వారు ఆహార పదార్థాలను కొనుగోలు చేసుకోలేక ఆకలితో అలమటించారు. తప్పనిసరి పరిస్థితిలో అమెరికా నుండి బ్రెడ్‌ను జపాన్ దిగుమతి చేసుకుంది. కానీ, జనం ఆకలి తీర్చలేకపోయింది. అ బాధలు చూసిన తైవాన్-జపనీస్ వ్యాపారవేత్త మొమొఫుకు ఆండో నిమిషాల్లో తయారయ్యే ఆహార పదార్థం, చౌకగా అందించేలా తయారు చేయాలని భావించాడు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఇన్‌స్టెంట్ నూడిల్స్. నీటి ఆవిరితో సగం ఉడికించి లేదా పామాయిల్‌తో సగం వేయించి ప్యాక్ చేయించి మార్కెట్‌లోకి వదిలాడు. 1958లో ఇది జరిగింది. తొలిసారిగా వచ్చిన చికెన్ రామెన్ నూడిల్స్ మొదట్లో ఖరీదు ఎక్కువగాను, అది ఓ హోదాకు చిహ్నంగా ఉన్నా అనతికాలంలో అతిచౌకగా, పేదలకు అందుబాటులోకి వచ్చి ఆదరణకు నోచుకుంది. ఇక నిమిషాల్లో తయారయ్యే నూడిల్స్ అంటే లోకం పడి చచ్చిపోతోందన్న పరిస్థితి నెలకొంది. ఇక 1971లో కప్ నూడిల్స్‌నూ ప్రవేశపెట్టాడు. ఆ తరువాత వాటికి రకరకాల ప్లేవర్స్, నాన్‌వెజిటబుల్ నూడిల్స్, వెజిటబుల్ నూడిల్స్ మొదలయ్యాయి. అతడు జపాన్‌లో ప్రవేశపెట్టిన తొలి ఇన్‌స్టెంట్ నూడిల్స్ పేరు ‘రామెన్ నూడిల్స్’. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ అమ్ముడయ్యే నూడిల్స్ ఇవే. ఆ తరువాత అమెరికాలో వినియోగదారుల ఇష్టాయిష్టాలను గమనించి మరికొన్ని మార్పులతో రకరకాల నూడిల్స్ తీసుకొచ్చాడు. 2007లో అతడు మరణించినా నూడిల్స్ ప్రస్తావన వస్తే మొమొ పేరు స్ఫురణకు రాక తప్పదు. జపాన్‌లో అతడి పేరుమీద, రామెన్ నూడిల్స్ పేరుతోను రెండు మ్యూజియంలు నెలకొల్పారు. ఇప్పుడెందుకు సమస్య ఇన్‌స్టెంట్ నూడిల్స్ రుచికరంగా ఉండటానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కొన్ని రసాయన పదార్థాలు వాడతారు. ముఖ్యంగా మోనో సోడియం గ్లుటామేట్, సీసం (లెడ్) ఉపయోగిస్తారు. మోనో పొటాషియం గ్లుటామేట్, ఆటోలైజ్డ్ ఈస్ట్, అజినోమోటో, సోడియం కేసినైట్ అని పిలిచే ఎంఎస్‌జి సాంద్రత నిజానికి 0.01 పిపిఎం ఉండాలి. మనదేశంలో ఈ మధ్య మార్కెట్లో లభ్యమైన మ్యాగీ నూడిల్స్‌లో ఈ పరిమితి ఆరురెట్లు అధికంగా ఉందన్నది అధికారిక ఆరోపణ. అది నిజం కాదని, తమ పరిశోధనల్లో అంతా సవ్యంగానే ఉందని చెబుతున్న మ్యాగీ నూడిల్స్ ఉత్పత్తిదారు నెస్ట్లే యాజమాన్యం వినియోగదారుడి మనసు నొప్పించకుండా ఉండేందుకు ఆ స్టాక్‌ను వెనక్కి రప్పించుకుంది. ఎంఎస్‌జి అంటే… మోనో సోడియం గ్లుటామెట్ అనేది రుచిని అందించే లవణం. దానిని 1909లో జపాన్‌కు చెందిన అజినొమొటో కంపెనీ అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదులకు తోడుగా దీన్ని ఏడో రుచిగా చెప్పుకుంటారు. ఎంఎస్‌జిని తయారు చేసిన అజినోమోటో కంపెనీ పేరుకు ‘ఎసెన్స్ ఆఫ్ టేస్ట్’ అని అర్థం. భారతీయ వంటకాల్లో దీని వాడకం ఎక్కువే. ఆహార పదార్థాల్లో వీటిని వాడితే రుచి పెరుగుతుంది. కొన్నాళ్లు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. ఒక్కోచోట ఒక్కో పేరు భారతదేశంలో నూడిల్స్ అంటే నెస్ట్లే ఉత్పత్తి చేసే మ్యాగీయే గుర్తొస్తుంది. కానీ వివిధ సంస్థలు ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. మనదేశం సహా బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్, సింగపూర్, మలేసియా, బ్రూనే, కొన్ని పాశ్చాత్య దేశాల్లోనూ మ్యాగీదే పైచేయి. జపాన్‌లో రామెన్ నూడిల్స్‌కే జనం పట్టం గట్టారు. హాంకాంగ్‌లో సాన్‌టావో, దక్షిణకొరియాలో షిన్‌రామెన్, ఇండోనేషియాలో ఇండోమీ, థాయ్‌లాండ్‌లో మామ, నేపాల్‌లో గండకి నూడిల్స్ అంటే జనానికి పిచ్చి. మారిషస్‌లో అపోలో నూడిల్స్‌కు ఆదరణ ఎక్కువ. ఇవన్నీ జనాదరణ పొందిన బ్రాండ్లు. ఆయా దేశాల్లో మరికొన్ని ఇతర బ్రాండ్లు ఉన్నా వాటికి ఆదరణ అంతంతమాత్రమే. భారత్‌లో మ్యాగీది అగ్రస్థానం కాగా ఐటిసి కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ‘యప్పీ’ ఈ మధ్య కాలంలో గణనీయంగా మార్కెట్‌ను పెంచుకుంది. విషతుల్యం అదొక్కటే కాదు… ప్రజలు ఆరగిస్తున్న ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో కేవలం నూడిల్స్‌లో మాత్రమే పరిమితికి మించి ఎంఎస్‌జి ఉందని చెప్పలేం. చాలా పదార్థాల్లో అనేక నిషేధిత పదార్థాలు కన్పించాయి. వివాదాలూ రేగాయి. మనదేశంలో లభ్యమయ్యే కోకోకోలా సహా 12 రకాల కూల్‌డ్రింక్స్‌లో క్రిమిసంహారక మందులు ఉన్నట్లు చాలాకాలం క్రితమే ఆరోపణలు వచ్చాయి. ఉండవలసిన పరిమాణం కన్నా 17 రెట్లు ఎక్కువగా డిడిటి కోకోకోలాలో ఉందని పరీక్షల్లో తేలింది. ఆహార పదార్థాల్లో ఆయా రసాయనాల వాడకాన్ని నిషేధించే లేదా ఉత్పత్తిదారులపై చర్య తీసుకునే ఫుడ్‌సేఫ్టీ వ్యవస్థ ఈ ఏడాది ఏర్పడింది. అలాగే వివిధ కంపెనీలు విక్రయిస్తున్న పనె్నండు రకాల తేనెలో పరిమితికి మించి యాంటీ బయాటిక్స్ ఉన్నట్లు తేలింది. క్లోరోంఫెనికోల్, సిప్రోఫ్లాక్సాసిన్, ఎరిత్రోమైసిన్ వంటి యాంటీ బయాటిక్స్ అందులో ఉన్నట్లు రూఢీ అయింది. కోళ్ల ఎదుగుదల కోసం యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నట్లు వాటి మాంసాన్ని పరీక్షించినప్పుడు స్పష్టమైంది. మనదేశంలోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాల్లో చికెన్, బీఫ్ నూడిల్స్‌లో గుర్రం మాంసం దర్శనమిచ్చిన సందర్భాలున్నాయి. మన దేశంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ భారత ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల సాధికార సంస్థ నిబంధనలు రూపొందించింది. ఇప్పుడు మ్యాగీ వివాదంలోకి వచ్చిందికానీ మున్ముందు ప్రాసెస్డ్ ఫుడ్ విక్రయించే ఏ సంస్థ అయినా దోషిగా నిలబడవచ్చు. ప్యాక్‌డ్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఆ కోవలోకే వస్తాయి. ఇంతకాలం వీటిని పరిశీలించి, పరీక్షించి, నియంత్రించే వ్యవస్థ లేకపోయింది. బహుళజాతి సంస్థల ఉత్పత్తులపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కాగా దేశీయ సంస్థల ఉత్పత్తులు, స్ట్రీట్‌ఫుడ్, ప్రభుత్వ సంస్థలు విక్రయించే పదార్థాలు ప్రమాణాలకు దీటుగా ఉన్నాయా? అంటే లేదనే చెప్పాలి. రుచికన్నా ఆరోగ్యం ముఖ్యమన్న స్పృహ తినేవారిలో ఉంటే జంక్‌ఫుడ్ జోలికి వెళ్లరు. ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మెరుగైన ఆహారమే మేలు. ‘ప్రచారకర్త’లకు బాధ్యత లేదా? చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు మొదలు భారీ సైజు టీవీలు అమ్ముడుపోవాలన్నా వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు సెలబ్రిటీలు ‘ప్రచారకర్తలు’గా అవతారం ఎత్తాల్సిందే. ప్రకటనల్లో నటించినందుకు భారీగా పారితోషికాలు అందుకునే సెలబ్రిటీలకు మాత్రం సంబంధిత ఉత్పత్తుల నాణ్యతాప్రమాణాలపై ఎలాంటి సంబంధం ఉండదు. ప్రచారం చేయడం వరకే తమ పాత్ర అని, ఉత్పత్తుల విషయమై ఎలాంటి ఫిర్యాదులొచ్చినా తాము బాధ్యులం కామంటూ వారు తెగేసి చెబుతుంటారు. ప్రస్తుతం ‘మ్యాగీ’ నూడుల్స్‌పై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న సందర్భంలోనూ సెలబ్రిటీలు తమ పాత పాటే వినిపిస్తున్నారు. ప్రజారోగ్యంతో సంబంధం ఉన్న ఆహార ఉత్పత్తులపై ప్రచారం చేస్తున్నపుడు సెలబ్రిటీలు అన్ని విషయాలూ క్షుణ్ణంగా తెలుసుకోరా? వారికి సామాజిక బాధ్యత లేదా? అన్న విమర్శలు వస్తూనే ఉంటాయి. శీతల పానీయాల్లో పురుగుమందుల అవశేషాల వివాదం నుంచి తాజాగా ‘మ్యాగీ’లో హనికర రసాయనాల వరకూ ‘ప్రచారకర్త’లైన మన సెలబ్రిటీలు ఏమీ తెలియని అమాయకులే! ‘మ్యాగీ’కి ఇంతటి ప్రాచుర్యం కల్పించి వాటి విక్రయాలు కోట్లలో పెరగడానికి కారకులైన బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలపైనా కేసులు నమోదు చేయాలన్న వాదనలు విన్పించాయి. ‘మ్యాగీ’ వివాదం తీవ్రంగా రాజుకోవడంతో ఆ ముగ్గురిపైనా కొన్ని చోట్ల కేసులు పెట్టడం, నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. ‘మ్యాగీ’ ప్రకటనల్లో నటించి చాలాకాలమైందని, ప్రస్తుత వివాదంతో తమకెలాంటి సంబంధం లేదని ఆ సెలబ్రిటీలు సెలవిచ్చారు. అయితే, ఆహారోత్పత్తులకు సంబంధించి ఇకపై ‘ప్రచారకర్త’లుగా బాధ్యతలు నిర్వహిస్తే అన్ని విషయాలూ ఆలోచిస్తామని వారు ప్రకటించారు. ‘ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలతో ప్రచారకర్తలకు సంబంధం లేదా’ అన్న చర్చ అప్పుడప్పుడూ మొదలు కావడం మళ్లీ పాతబడిపోవడం షరామామూలుగానే మారింది. ప్రకటనల్లో నటించినపుడు ఉత్పత్తుల నాణ్యత గురించి ఏ సెలబ్రిటీ కూడా ఆరా తీయడం జరగదు. ఉత్పత్తిదారులు కూడా ఆ విషయాలను ‘ప్రచారకర్త’లకు చెప్పడమూ ఉండదు. తమకు ముట్టజెప్పే పారితోషికం తప్ప మిగతా విషయాలు వారికి అనవసరం. వివాదాలు మరింతగా ముదిరితే, ఆ ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం తప్ప సెలబ్రిటీలు చేసేది ఏమీ ఉండదు. బాలీవుడ్‌కు సంబంధించి షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అక్షయ్‌కుమార్, బిపాసా బసు, కంగనా రనౌత్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు నటించిన ప్రకటనలు గతంలో వివాదాస్పదంగా మారాయి. కోకోకోలాలో పురుగుమందుల అవశేషాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఇక ఆ శీతల పానీయం కోసం ప్రచారకర్తగా తాను వ్యవహరించేది లేదని ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ గతంలోనే స్పష్టం చేశారు. వరకట్నం ప్రస్తావన ఉన్నందున ఓ కంపెనీ టీవీల ప్రచారానికి కూడా ఆయన దూరమయ్యారు. ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్‌పై ఆరోపణలున్నందున- ఉత్పత్తిదారులిచ్చే రెండు కోట్ల రూపాయల పారితోషికం కోసం తాను నటించలేనని యువనటి కంగనా రనౌత్ తెగేసి చెప్పింది. పొగాకు, మద్యం విక్రయాలకు సంబంధించి తాను ప్రచారకర్తగా వ్యవహరించనని నటుడు జాన్ అబ్రహాం ప్రకటించారు. సామాజిక ప్రయోజనం లేనందున ఓ విలాసవంతమైన కార్లకు ప్రచారం చేసేందుకు సిద్ధంగా లేనని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. ఇలాంటి నిర్ణయాలతో కొందరు నటీనటులు జనం నుంచి జేజేలు అందుకున్నా, మరికొందరు మాత్రం వివాదాలకు కేంద్ర బిందువులయ్యారు. ‘మాజీ విశ్వసుందరి’, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఆ మధ్య ఓ నగల కంపెనీ కోసం నటించిన ప్రకటన వివాదం రేపింది. నలుపురంగులో ఉన్న ఓ పేద బాలిక ఐశ్వర్యకు గొడుగు పడుతున్నట్లు చిత్రీకరించిన ఆ ప్రకటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు ఆ ప్రకటన ఉందన్న ఆరోపణలు రావడంతో దాన్ని ప్రచారం నుంచి ఉపసంహరించారు. నల్లగా ఉన్నవాళ్లు తెల్లగా మారండంటూ ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ గురించి షారుఖ్ ఖాన్ ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. కొందరి మనసులను గాయపరిచే ఇలాంటి ప్రకటనల్లో నటించనని అమీర్ ఖాన్ చెప్పగా, షారుఖ్ మాత్రం ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. నటుడు అక్షయ్‌కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా డెనిమ్ బ్రాండ్ జీన్ ప్యాంట్ల ప్రకటన మరీ అశ్లీలంగా ఉందన్న విమర్శలు వచ్చాయి. 1998లో ఓ బ్రాండ్ లోదుస్తుల ప్రకటనలో నటి బిపాసా, అప్పటి ఆమె ప్రియుడు డినో మోరియా నటనపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. 1991లో పూజా బేడీ, మార్క్ రాబిన్సన్ నటించిన ఓ కండోమ్ ప్రకటన కూడా విమర్శలను మూటగట్టుకుంది. మలైకా అరోరా, ఆర్బాజ్ ఖాన్ నటించిన ఓ కండోమ్ ప్రకటన 1993లో వివాదం సృష్టించింది. నటి కంగనా రనౌత్ ‘లెవిస్’ జీన్స్ ప్రకటనలో మరీ సిగ్గు విడిచి నటించిందన్న విమర్శలు గతంలో వచ్చాయి. లైంగిక విజ్ఞానం గురించి చెప్పడానికి బదులు ‘డూరెక్స్’ కండోమ్ ప్రకటనలో నటుడు రణ్‌వీర్ సింగ్ నటన మరీ శ్రుతి మించిందన్న వ్యాఖ్యానాలున్నాయి. గుట్కా ప్రకటనలో సంజయ్ దత్ నటించడంతో ఎంతోమంది యువకులు ఆయన బాటను అనుసరిస్తున్నారని గతంలో కొందరు వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సినీతారలు యువతకు ఆరాధ్యదైవాలుగా కనిపిస్తున్న నేటికాలంలో వారు నటించే ప్రకటనల ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. ప్రకటనలకు, ప్రచారకర్తలకు సంబంధించి వివాదాలు చెలరేగడం కొత్తేమీ కాకపోయినా- తాము చెప్పే మాటలను జనం సులువుగా నమ్ముతారన్న విషయాన్ని సెలబ్రిటీలు గుర్తుంచుకుంటే వారు విమర్శలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ప్రచారకర్తలుగా బాధ్యతలు స్వీకరించేముందు సంబంధిత ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, ప్రజారోగ్యం, నైతిక విలువలు వంటి విషయాలను వారు తెలుసుకుంటే మరీ మంచిది. *** అందమైన చిహ్నం…ఆవిరైన నమ్మకం అందమైన పక్షిగూడు….అమ్మ తెచ్చే ఆహారంకోసం నోళ్లు తెరిచి ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్న పిల్లలు, వాటికి ఆప్యాయంగా ఆహారాన్ని ఇచ్చేందుకు వచ్చిన పక్షి…వెరసి ప్రఖ్యాత ఆహార పదార్థాల తయారీ సంస్థ నెస్ట్లే వ్యాపారసంస్థ చిహ్నం. దశాబ్దాలుగా భారతీయుల ప్రేమను పొందిన ఆ సంస్థపై విశ్వాసం ఇప్పుడు పరీక్షకు నిలిచింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందిన ఈ సంస్థ ఎన్నో ఇతర ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నప్పటికీ మ్యాగీ పేరుతో ప్రారంభించిన నూడిల్స్ అంతర్జాతీయ ఖ్యాతిని పొంది భారీ మార్కెట్‌ను అందించాయి. ఒక్క భారత్‌లోనే నూడిల్స్ విభాగంలో ఆ సంస్థ 70శాతం మార్కెట్‌ను కొల్లగొట్టింది. ఏటా 8వేలకోట్ల పైబడి రాబడి సాధిస్తున్న మ్యాగీ కేవలం లాభాలపైనే దృష్టిపెట్టి, వినియోగదారుడి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టిందా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. వివిధ రాష్ట్రాల్లో మ్యాగీ నూడిల్స్‌తో నిషేధం విధించడం, ఆ నూడిల్స్‌ను నిషేధించాలని కేంద్రం ప్రభుత్వ సంస్థ ఆదేశించడంతో విధిలేని పరిస్థితుల్లో నెస్ట్లె తమ నూడిల్స్‌ను మార్కెట్‌నుండి వెనక్కు రప్పించింది. మ్యాగీ నూడిల్స్‌లో పరిమితికన్నా ఏడెనిమిది రెట్లు ఎక్కువగా ఎంఎస్‌జి, సీసం ఉన్నాయన్నది అభియోగం. ఈ వివాదంవల్ల దాదాపు 4వేల కోట్ల రూపాయల మేరకు ఆ సంస్థకు దెబ్బతగిలింది. అయితే భారతీయ వినియోగదారుడి మనసు చూరగొనేలా, విశ్వాసాన్ని పొందేలా మళ్లీ మార్కెట్‌లోకి వస్తామని ఆ సంస్థ గట్టిగా చెబుతోంది. నెస్ట్లె చిహ్నం చూసి ఎంతో నమ్మకంతో ఆ సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసే భారతీయులు ఇప్పుడు అపనమ్మకంతో ఉన్నారు. మ్యాగీ నూడిల్స్‌లో పరిమితికి మించి ఎంఎస్‌జి, లెడ్ ఉండటంవల్ల ఎన్నో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని తేలడం నెస్ట్లె వ్యాపారానికి గట్టి దెబ్బ తగిలింది. కేవలం ఆ సంస్థ ఉత్పత్తి చేసే పదార్థాలే కాదు. ఇప్పుడు ఇతర సంస్థలు తయారు చేస్తున్న ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ పరీక్షించాలని భారత కేంద్ర ఆహార పదార్థాల నాణ్యత, ప్రమాణాల సంరక్షణ సాధికార సంస్థ నిర్ణయించింది. అయితే ఆయా ఉత్పత్తుల తయారీకి, చాలాకాలంగా వస్తున్న ఆరోపణలకు స్పందించకుండా ఉండటానికి రాజకీయ నేతలు, అధికారులే కారణమని భావించాలి. అసలు ఆహార పదార్థాలా నాణ్యత, ప్రమాణాలను పరీక్షించే సంస్థ ఇన్నాళ్లూ లేకపోవడం ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏపాటిదో చెబుతోంది. ఇదీ నూడిల్స్ సామ్రాజ్యం మన దేశంలో ఇప్పుడు అందరినోటా విన్పిస్తున్న మాట మ్యాగీ నూడిల్స్. నిజానికి ‘యెప్పీ’ అనే రకం నూడిల్స్ కూడా ఈ మధ్య జనాదరణ పొందాయి. ప్రపంచవ్యాప్తంగా నూడిల్స్ అంటే ఇష్టపడేవారి సంఖ్య తక్కువేమీకాదు. భారతదేశంలో ఇన్‌స్టెంట్ నూడిల్స్ మార్కెట్‌లో మ్యాగీ వాటాయే ఎక్కువ. దాని వార్షిక అమ్మకాల విలువ 8,900 కోట్ల రూపాయల పైమాటే. మనదేశంలో సైనికులు బాగా ఇష్టపడే ఆహారం కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 102.7 బిలియన్ ప్యాకెట్ల నూడిల్స్‌ను జనం తిన్నారు. భూగోళంమీద ఉన్న ప్రతి ఒక్కరికి వీటిని పంచితే ఏడాదికి ఒక్కొక్కరు 14 ప్యాకెట్లు తిన్నట్లు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను ‘గ్లోబల్ ఫుడ్’ గా కీర్తిస్తే, భారతదేశంలో ‘కంఫర్ట్ ఫుడ్’ గా భావిస్తారు. వీటిని ఇష్టపడి బాగా తినే దేశాల్లో చైనా, హాంకాంగ్ మొదటి స్థానంలో ఉన్నాయ. ఇక్కడ ఏటా 44,400 మిలియన్ల ప్యాకెట్లు తినేస్తూ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇండోనేషియా, జపాన్ తరువాతి స్థానాల్లో ఉండగా భారత్ నాల్గో స్థానంలో ఉంది. *** మొక్కజొన్న పిండి లేదా వరి, గోధుమ పిండ్లతో నూడిల్స్ తయారైన తరువాత వాటికి ఇతర రుచులు మేళవించాక, సగం ఉడకబెట్టడమో, లేక పొడిబారేట్లు చేయడమో అయ్యాక, 320 డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు. దీంతో అందులో ఉండే నీరు ఆవిరై, క్రిస్పీగా తయారైన ఇన్‌స్టెంట్ నూడిల్ సిద్ధమవుతుంది. దీనిని మనం తినాలనుకున్నప్పుడు మరుగుతున్న నీళ్లలో వేసినప్పుడు అత్యంత వేగంగా నీటిని అవి పీల్చుకుని త్వరితగతిన ఉడికి తినడానికి వీలుగా సిద్ధమవుతాయి. ఈ మధ్య కాలంలో ‘బ్లోడ్రై’ పద్ధతిలో ఇన్‌స్టెంట్ నూడిల్స్‌ను సిద్ధం చేస్తున్నాయి. 176 డిగ్రీల ఫారన్‌హీట్ వేడితో ఉండే హాట్‌ఎయిర్‌తో 30నుండి 60 నిమిషాలపాటు మగ్గబెట్టి గట్టిపడిన తరువాత ప్యాకింగ్ చేస్తున్నారు. నిషేధంపై భిన్న వైఖరులు..! హానికర రసాయనాలున్నాయన్న వార్తలు రావడంతో దేశ వ్యాప్తంగా కుతకుతలాడిన ‘మ్యాగీ’ నూడుల్స్‌పై వివిధ రాష్ట్రాల్లో విభిన్న నివేదికలు రావడం విశేషం. మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావడంతో- ‘మ్యాగీ’పై రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడి ఆగమేఘాలపై నిషేధాజ్ఞలు విధించాయి. ప్రజారోగ్యానికి చేటుతెచ్చే ఆహారోత్పత్తులను తాము అనుమతించేది లేదంటూ కేంద్రం సైతం జూలు విదిల్చింది. వివాదం ముదురుపాకాన పడడంతో ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాలు ‘మ్యాగీ’ నమూనాలను నిపుణుల పరీక్షల నిమిత్తం పంపాయి. ఈ నూడుల్స్‌లో సీసం (లెడ్) వేర్వేరు రాష్ట్రాల్లో ప్రామాణిక స్థాయి (2.5 పిపిఎం)ని మించి అనేక రెట్లు అధికంగా ఉన్నట్లు నివేదికలు రావడం ఆశ్చర్యకరం. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వ్యతిరేక ఫలితాలు రావడం ఇంకో విడ్డూరం. ఓ ప్రముఖ బహుళజాతి సంస్థ నిర్ణీత ప్రమాణాలతో ఒక ఉత్పత్తిని ఒకే పద్ధతిలో తయారుచేస్తే నాణ్యతకు సంబంధించి ఇంతటి తేడాలు రావడం ఏమిటన్నది శేషప్రశే్న! వివిధ రాష్ట్రాల్లో ఒకే ఉత్పత్తిపై పరీక్షలు జరిపితే ఇలాంటి వ్యత్యాసాలు ఎలా ఉంటాయన్నది అర్థం కాని విషయమే. ఈ నేపథ్యంలో ‘మ్యాగీ’పై కేంద్రం వైఖరి ఒకలా ఉండగా, వివిధ రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు ‘మ్యాగీ’కి ‘క్లీన్‌చిట్’ ఇవ్వగా, ఇంకొన్ని చోట్ల నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి. నిపుణుల పరీక్షలకు నిర్దిష్టమైన విధి విధానాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న వాదనలు లేకపోలేదు. తొమ్మిది రకాల నూడుల్స్‌ను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం ‘నెస్లే’ సంస్థకు సూచించింది. కాగా, ‘మ్యాగీ’లో అభ్యంతరకర అంశాలేవీ లేవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తొమ్మిది రకాల ఉత్పత్తుల్లో సీసం మోతాదు మించినట్లు కనిపించలేదని మహారాష్ట్ర ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. రుచి కోసం వాడే ఎంఎస్‌జి కూడా పరిమితికి లోబడే ఉందని ఆ సంస్థ అధికారులు తేల్చారు. అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే ‘మ్యాగీ’పై తాము తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని అంశాలు ‘మ్యాగీ’లో కనిపించాయని భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రకటించింది.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవ్వించి నవ్వించి కరగించిన సినిమా -నిర్మాత లగడపాటి శ్రీధర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ భాగ్యం నాకు మిగిలింది ”అన్న బుచ్చిబాబు భార్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ యుద్ధానికి ఇం”ధనం ”

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సిద్ధయోగి శివానంద మూర్తి -డా శ్రీ ఆర్ అనంత పద్మనాభ రావు-మాజీ రేడియో స్టేషన్ డైరెక్టర్

సిద్ధయోగి శివానంద మూర్తి -డా శ్రీ ఆర్ అనంత పద్మనాభ రావు-మాజీ రేడియో స్టేషన్ డైరెక్టర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జిల్లెల్ల మూడి అమ్మ -ఆరాధనోత్సవం -మరియు అసూయకు పతనమే

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లోక కల్యాణానికి వెలసిన కొప్పెశ్వర స్వామి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీరీ పండిట్ ల అజ్ఞానం

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

రెండు స్తాయిల్లో దేవుడు -అరవింద రావు ,- ధర్మం రెండు రకాలు -పరిపూర్నానంద ,పతంజలి యోగం -రవి శంకర్



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోడీ -ముస్లిములు

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

ఆపరేషన్ బర్మా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -11 (చివరి భాగం )

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -11 (చివరి భాగం )

kp9 001 kp76 001 kp77 001 kp78 001 kp80 001 kp81 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక – 10

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -10kp68 001 kp69 001 kp70 001 kp71 001 kp72 001 kp73 001 kp74 001 kp75 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -9

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -9kp66 001 kp67 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -8

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -8kp56 001 kp57 001 kp58 001 kp59 001 kp60 001 kp61 001 kp62 001 kp63 001 kp64 001 kp65 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

11-6-15 గురువారం -ఉదయం -విజయవాడ

11-6-15 గురువారం -ఉదయం -విజయవాడ స్టెల్లా కాలేజి రోడ్డు లో శ్రీ సాయబాబా గుడి వద్ద ఉన్న  ”సంయుక్త వేదిక ”లో శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి మనవ రాళ్ళు (కుమారుడు కృష్ణ కుమార్తెలు  )ఛి.  సెరీనా,  ఛి . శ్రేయ లకు ”చీరెల సంబరం ”దృశ్యమాలిక -మరియు -స్టేట్ బాంక్ కాలనీలో మా తోడల్లుడి గారింట్లో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సద్గురు శివానంద మూర్తి శివైక్యం –

 
 
 

 

 


Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -7

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -7kp46 001 kp47 001 kp48 001 kp49 001 kp50 001 kp51 001 kp52 001 kp53 001 kp54 001 kp55 001

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -46

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -46

18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -5(చివరిభాగం )

జోలాను కుట్ర తో చంపారు

ఎమిలీ జోలా మరణం పై అనేక అనుమానాలున్నాయి ఆయన ప్రత్యర్ధుల  కుట్రవల్లనే కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయి౦దని అంతకు ముందు రెండు మూడు సార్లు వారు హత్యాప్రయత్నం చేశారని అన్నారు .కాని ఇది రుజువుకాలేదు ఒట్టి అపోహ మాత్రమె నని తేలింది .కొన్ని దశాబ్దాల తర్వాత పారిసాన్ రూఫర్ మరణ శయ్యపై ఉండి తానె రాజకీయ కారణాలవలన జోలా ఉన్న ఇంటి చిమ్నీ మూసేశానని చెప్పాడు .జోలాను మొదట పారిస్ లోని క్లేమేటోరి డీ మాంట్ మెట్రి శ్మశాన వాటికలో ఖనం చేశారు .నాలుగేళ్ల తర్వాతా అలేక్సాండర్ డ్యూమాస్ విక్టర్ హ్యూగో ల ను ఖననం చేసిన పా౦ధియన్ లో అవశేషాలను భద్ర పరచారు .1953 లో ఒక విచారణ సంఘం పూర్తీ విచారణ చేసి ఎమిలీ జోలా ది హత్య మాత్రమె నని   ,ప్రమాద వశాత్తు జరిగిన మరణం కాదని  తేల్చింది .చిమ్నీ స్వీపర్ హెన్రి బూరోన్ ఫెస్స్ తానె రాజకీయ వాదుల కోరిక పై చిమ్నీ ని మూసేశానని ఒప్పుకొన్నాడు .కనుక ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని తేలింది .

రెండు కుటుంబాల కద

జోలా రాసిన 20 భాగాల రోగాన్ మాక్వార్ట్  నవల సెకండ్ ఫ్రెంచ్ ఎంపైర్ కు చెందిన విషయ౦  అని ముందే చెప్పుకొన్నాం .1851-71 మధ్య ఉన్న ఇరవై ఏళ్ళలో జరిగిన ఒక కుటుంబ గాధ అది .ఇందులో మూడొందల అధ్యాయాలున్నాయి .ఇది రోగాన్  మరియు మాక్వార్ట్ అనే రెండు కుటుంబాల కద .దీనికి జోలా పెట్టిన ఫ్రెంచ్ పేరుకు ఇంగ్లీష్   పేరు ‘’the natural and social history of a family   ,under the second empire ‘’దీన్ని ఫ్రెంచ్ మూడవ రిపబ్లిక్ కాలం లో రాశాడు .మూడవ నెపోలియన్ కాలం లో ఫ్రెంచ్ సైన్యం దారుణంగా ఓడిపోవటమే ఇందులోని విషయం .నానా నవలలో కూడా దీని గురించి రాశాడు .

శాస్త్రీయ పరిశోధనా నవల కు ఆద్యుడు జోలా

‘’లి రోమన్ ఎక్స్ పెరిమెంటల్ ‘’నవలలో నేచరలిస్ట్ నవల ధోరణి ప్రారంభమై ,సైంటిఫిక్ పరిశోధనానవలగా పేరు తెచ్చుకొన్నది .క్లినికల్ ఫిజియాలజికి దారి తీసింది .జోలా దృష్టిలో ‘’no character should appear larger than life ‘’ Although Zola would not accept that it was either scientifically or artistically justifiable to create larger-than-life characters, his work does present a number of larger-than-life symbols which, like the mine Le Voreux in Germinal, take on the nature of a surrogate human life. The mine, the still in L’Assommoir and the locomotive La Lison in La Bête humaine impress the reader with the vivid reality of human beings. The great natural processes of seedtime and harvest

జోలా ఒక రచయిత ,కవి సైంటిస్ట్ మాత్రమె కాక ఆశావాది .’’పాజిటివిజం ‘’అంటే మక్కువ .మానవాభ్యున్నతిపై అచంచల విశ్వాసం ఉన్నవాడు జోలా .ఆయన జీవితం పై సినిమా కూడా తీశారు . “I wish to explain how a family, a small group of human beings, conducts itself in a given social system after blossoming forth and giving birth to ten or twenty members, who, though they may appear, at the first glance, profoundly dissimilar one from the other, are, as analysis demonstrates, most closely linked together from the point of view of affinity. Heredity, like gravity, has its laws’’

 అని తన సీరియల్స్ కు ముందుమాట రాశాడు జోలా .సంఘం లో ఉన్న పరిసరాల పరిస్థితులు ,హింస ,తాగుడు వ్యభిచారం ఏవిదం గా ప్రజలను  ‘’సెకండ్ వేవ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ‘’కాలం లో ప్రభావితం చేశాయో వివరించాడు .బ్రెజిల్ ఫ్రాన్స్ దేశాల రచయితలపై జోలా ప్రభావం అధిక౦ .అయిదుగురు నేచరలిస్ట్ రచయితలకు జోలా ఆదర్శనీయుడు .

      Inline image 1     Inline image 2 Inline image 3Inline image 4

          సశేషం

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొ

అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు -లుక్రేషియా కాఫిన్ మొట్

బాల్యం-ఉద్యోగం వివాహం సంతానం

unnamedఅమెరికా లోని మసా చూసేట్స్ రాష్ట్రం లో నాన్ టకేట్ లో లుక్రేషియా కాఫిన్ 3-1-1793 జన్మించింది .ఎనిమిది మంది సంతానం లో రెండవ పిల్ల కాఫిన్ .తల్లి పీటర్ ఫోల్గేర్ మేరీ ఫోల్గేర్ లకు ముని మనుమరాలికి మనవ రాలు .బెంజమిన్ ఫ్రాన్క్లిన్ కు కూడా చుట్టరికం ఉన్నది .డచేస్ కౌంటిలో ఉన్న ‘’నైన్ పార్ట్నర్స్ స్కూల్ ‘’లో13 వ ఏట చేరి చదివింది .ఇది న్యూయార్క్ లోని సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ నిర్వహించే స్కూల్ .గ్రాడ్యుయేట్ అయి అక్కడే టీచర్ గా చేరిపని చేసింది .ఆ స్కూల్ లో అప్పుడు మగ మేస్టర్లకు ఆడ టీచర్లకంటే మూడు రెట్ల జీతం ఇస్తూ ఉండేవారు .ఇది గమనించి కాఫిన్ మహిళలకు సమాన హక్కులు కావాలనే అభిప్రాయం లోకి వచ్చింది .తండ్రి కుటుంబాన్ని ఫిలడేల్ఫియాకు మార్చటం తో పీటర్ మొట్ అనే టీచర్ తో సహా అక్కడికి వెళ్ళింది .మొట్ ను పెళ్ళాడింది .సంతానం కలిగారు .ఆమెపిల్లలు ఆమెలాగే బానిసత్వ నిర్మూలన ఉద్యమం లో క్రియాశీలంగా పని చేశారు .

బానిసత్వ నిర్మూలనోద్యమం

ఇతర క్వేకర్ ల లాగానే కాఫిన్ కు బానిసత్వం అంటే నచ్చేదికాదు .బానిసత్వం సాంఘిక దురాచారం అని భావించింది .ఇతర బానిసలు నేసిన నూలు దుస్తులు వారు తయారు చేసిన పంచదార ,మొదలైనవి ఉపయోగించేదికాదు . మొట్ క్వేకర్ మినిస్టర్ అయింది ఆత్మజ్ఞానం పొందిన కాఫిన్ ప్రతివారిలోను భగవంతుని దర్శించింది .భర్తకు చేదోడుగా సహకరించి ప్రజలలో బానిసత్వం యెడల విముఖతకలిగేట్లు ప్రచారం చేసింది .భర్త ‘’అమెరికన్ యాంటి స్లేవరి సొసైటీ ‘’స్థాపించటానికి ఎంతగానో సహకరించింది .ఫిలడెల్ఫియాలో బహిరంగ వేదికలపై మాట్లాడే నేర్పు అలవడింది .అందరిని ఒప్పించే గుణం ఆమెలో ఉండేది .అప్పటికి ఆమె ఒక్కతే బహిరంగ సభలలో ఉపన్యాసం ఇచ్చేది. ఇంకెవరూ అంతటి సాహసం చేయ లేక పోయేవారు .కనుక ఏకైక మహిళా వక్త అయింది .ప్రజాబలం కూడగట్టుకొని కొద్దికాలం లోనే ‘’ఫిలడెల్ఫియా యాంటి స్లేవరి సొసైటీ ‘’ని స్థాపించింది .అక్కడి నల్ల జాతివారి సహాయ సహకారాలు ఆమెకు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. జాతి వివక్షతపై పోరు బాట సాగించింది .నల్లజాతివారి మత ఉత్సవాలలో పాల్గొని వారి అభిమానాన్ని పొందింది .బంధు మిత్రులతోకలిసి ‘’రోచెస్టర్ యాంటి స్లేవరి సొసైటీ ‘’నికూడా ఏర్పాటు చేసింది .
కుటుంబ ఆదాయాన్ని బట్టి ఖర్చు చేస్తూ మిగిలిన డబ్బును ఉద్యమ విస్తరణకు విని యోగించేది. ఇంటికి వచ్చిన అతిధులకు సేవల౦ద జేసేది .కుటుంబ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తూనే సాంఘిక న్యాయం కోరే మహిళగా గుర్తింపు పొందింది .అందరిని కూడగట్టి ఉత్సవాలు ఊరేగింపులు చేస్తూ వచ్చిన రాబడిని బానిస విమోచనానికి ఖర్చు చేసేది 1837, 38,39 లలో జరిగిన ;;యాంటి స్లేవరి కన్వెన్షన్ ఆఫ్ అమెరికన్ వుమెన్ ‘’సభలు మూడింటికి హాజరై ప్రాతినిధ్యం వహించింది మొట్ .1838లో ఫిలడెల్ఫియాలో సమ్మేళనం జరిపే హాల్ ను దుండగులు తగల బెట్టారు .ఆరుబయటనే మీటింగ్ నిర్వహించి బానిసవిమోచనశంఖా రావం పూరించింది .అగ్గి మీద గుగ్గిలమైనవ్యతిరేకులు మొట్ ఇంటినీ నల్లజాతివారి ఇళ్ళను దోచుకొన్నారు .భీభత్సం సృష్టించారు

ప్రపంచ సభలో పాల్గొనటం

1840 జూన్ నెలలో లండన్ లో జరిగిన ‘’ప్రపంచ బానిస వ్యతిరేక సభ ‘’లో మొట్ పాల్గొన్నది .అప్పటికే అంతర్జాతీయంగా గుర్తింపు పొంది ఆరుగురు అమెరికన్ ప్రతినిదు లతో హాజరైన ఆమెను అక్కడి’’ మగ పురుషులు ‘’తమతో అమెరికన్ మహిళలు కూర్చోటానికి వీలు లేదని వ్యతిరేకించి పాల్గొన కుండా చేశారు . పాపం మహిళలు వేరేగా కూర్చోవాల్సి వచ్చింది .ఈ సభలో ఆడవారి హక్కుల విషయం ప్రస్తావి౦చ రాదని నిషేధం విధింఛి బానిస విమోచనాన్ని నీళ్ళు గార్చే ప్రయత్నం చేశారు .అప్పడు లండన్ లో ఉన్న న్యాయ చట్టాల ననుసరించి స్త్రీలు బహిరంగం గా రాజకీయ సభలలో పాల్గొన రాదు అనే నియమం కూడా ఉంది . మగవారికి వారికి అది కలిసొచ్చింది .కాని అమెరికా నుండి వచ్చిన పురుష ప్రతినిధులైన గారిసన్ ,నేతానియాల్ పి.రోజేర్స్ ,విలియం ఆడమ్స్ ,ఆఫ్రికన్ –అమెరికన్ యాక్టివిస్ట్ చార్లెస్ లేనాక్స్ రిమాండ్ మొదలైనవారు స్త్రీలకోసం కేటాయించిన స్థలం లోనే స్త్రీ ప్రతినిధులతో బాటు కూర్చుని నిరసన తెలియ జేశారు . ఐరిష్ పత్రిక మొట్ ను ‘’మహిళా సింహం ‘’అని కీర్తించింది .ఇంగ్లాండ్ స్కాట్ లాండ్ సభలలో పాల్గొని అమెరికాకు తిరిగి వచ్చింది .

బానిస రాష్ట్రాల పర్యటన

న్యూయార్క్ లోను బోస్టన్ లోను బహిరంగ సభలలో మొట్ ఉపన్యసించింది .బానిసలున్న రాష్ట్రాలలో పర్యటన చేసి బాల్టిమోర్ వర్జీనియా మేరీలాండ్ లలో ప్రసంగించి చైతన్యం తెచ్చింది .బానిస యజమానులతో సమావేశమై వారి మనసు మార్చటానికి ప్రయత్నించింది .40 మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల సమావేశం లో ప్రసంగించి వారికి విమోచన పై అవగాహన కలిగించింది .ఆసభకు వచ్చిన’’ ప్రెసిడెంట్ జాన్ టేలర్’’ మొట్ వ్యక్తిత్వానికి ,ఉపన్యాసానికి ముగ్ధుడైపోయాడు .అక్కడే ఉన్న బానిస విమోచనాన్ని వ్యతిరేకించే సెనేటర్ ‘’కల్హాన్ ‘’ ఆమెకు అప్పగిస్తానని ప్రకటించాడు .
న్యూయార్క్ లోని సేనేకా ఫాల్స్ లో మొట్ మరియు మరోనాయకురాలుసాంటన్ తో కలిసి మహిళాహక్కుల సభ 1848లో జరిపారు .స్త్రీ వోటు హక్కు కోసం నినదించారు .విమోచన ఎంతముఖ్యమో స్త్రీ వోటుహక్కూ అంతే ముఖ్యం అన్నారు .మానవ హక్కుల నాయకుడు ఫ్రెడరిక్ డగ్లాస్ ఇందులో కీలక పాత్ర పోషించాడు .మొట్ ప్రభావం యునిటేరియన్లు అయిన ధియోడర్ పార్కర్ ,విలియం ఎల్లరి చానింగ్ , విలియం పెన్ ల పై అధికం .యూని వరసల్ రైట్స్ కోసం పోరాడాలని నిర్ణయించారు .మొట్ క్రమంగా దూరమైంది అనారోగ్య రీత్యా .
‘’the kingdom of God is within man ‘’అని అభిప్రాయపడింది మొట్ .తర్వాత రెలిజియస్ లిబరల్స్ ఏర్పరచిన ‘’ఫ్రీ రేలజి యన్ అసోసియేషన్ ‘’లో చేరింది .దీనిలో మహా వేదాంతి ఎమర్సన్ ,మొదలైన గొప్పవారు కూడా సభ్యులయ్యారు మొట్ ‘’సేర్మాన్ టు మెడికల్ స్టూడెంట్స్ ‘’రాసి 1849లో ప్రచురించింది ‘’డిస్కోర్స్ ఆన్ వుమెన్ ‘’అనే కరపత్రం వెలువరించింది .క్వేకర్ ఉద్యమనాయకురాలుగా ఉండి మహిళా హక్కులకోసం, బానిస విమోచనం కోసం అహరహం శ్రమించిన మహిళా మాణిక్యం లుక్రేషియా కాఫిన్ మొట్ ..87 ఏళ్ళు జీవించి 11-11-1880 న మరణించింది .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి

IMG_4253గబ్బిట దుర్గా ప్రసాద్ సాహితీ ప్రియులకు , అటు అంతర్జాల చదువరులకు సుపరిచితమైన పేరు . వృత్తి రీత్యా సైన్స్ మాస్టర్ అయిన , ప్రవృత్తి రీత్యా సాహిత్య వేత్త , బహు గ్రంధ రచయిత . ఇప్పటి వరకు తన స్వీయ రచనలు తొమ్మిది పుస్తకాలు వెలువరించారు . స్వీయ సంపాదకత్వంలో సరస భారతి ప్రచురణలో ఏడు గ్రంధాలను ప్రచురించారు . ప్రస్తుత రచన “ గీర్వాణ కవుల కవితా గీర్వాణం” .

ఈ పుస్తకం సుమారుగా 146 వ్యాసాల సమాహారం . ప్రసిద్ధ కవులు వ్యాస , వాల్మీక , శ్రీ హర్షుడు , విశాఖ దత్తుడు , భారవి , శూద్రక , దండి , హర్షవర్ధనుడు , మాఘుడు , బాణుడు ,భోజుడు ,కవిరాజు , కల్హణుడు , గౌడ డిండిమ భట్టు మొదలైన కవులు లతో పాటుగా అలంకార శాస్త్ర రచయితులైన దండి , ఉద్భుటుడు , వామనుడు , ఆనందవర్ధనుడు , రాజశేఖరుడు ,రుద్రుటుడు , అభినవ గుప్తుడు , విశ్వనాధుడు , వామనభట్టు , బాణుడు , మధుసూదన సరస్వతి , జగన్నాధ పండితరాయులు గురించి వివరణ కూడా పొందుపరిచారు .

అదే విధంగా కవియిత్రులు గంగాదేవి , ప్రణయ కవియిత్రి మోరిక , స్వభావోక్తి కవియిత్రి మురళ , నంజన గూడు తిరుమలాంబ , రామ భద్రాంబ , పద్మా వతి , గౌరీ వారి విశేషాలతో పాటు నాట్యం , సంగీతం కళలకు తమ రచనల ద్వారా వన్నె తెచ్చిన కవులు , పండితులు భరతముని , జయదేవుడు , జాయపసేనాని, సింగభూపాలుడు . కొమారగిరి రెడ్డి,నారాయణతీర్ధులు మొదలైన వారి జీవిత విశేషాలు , రచనల వివరాలు పొందుపరిచారు .

అపర శంకరులు . శంకర భాగాత్వాదులు మొదలుకొని శతావధాని గణేష్ వరకు ఎందరో సంస్కృత పండితుల సమాచారం పొందుపరిచారు రచయిత . కేరళలో కాలడి గ్రామంలో జన్మించిన అపర శివావతారులే ఆది శంకరాచార్యులు . అద్వైత మత స్థాపనాచార్యులు , త్రిమతాచార్యులలో ప్రధములు , శంకరాచార్యుల బాల్యం గురించి , గురుదర్శనం , స్తోత్రరత్నాలు , అద్వైతం మొదలైన ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి . అర్ధ శాస్త్ర రచయిత కౌటిల్యుడు విశేషాలు , భరత నాట్య సృష్టి కర్త భరతముని వివరాలు , భరతముని రచించిన నాట్య శాస్త్రాన్ని పి.యస్ .అప్పారావు తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని అందుకున్నారు .

క్రీ.పూ 1వ శతాబ్దానికి చెందిన ఘటకర్పకుడు గురించి వివరణ ఉంది . భాసుడే ఘటకర్పకుడు అనే ప్రచారం ఉంది అని , అది నిజం కాదు అనే వివరణ కూడా రచయిత ఆ పుస్తకంలో ఇచ్చారు . ఘటకర్పకుడికి యమక చక్రవర్తి అనే బిరుదు కూడా ఉంది . బౌద్ద వేదాంత కవి అశ్వ ఘోషుడు గురించి సమాచారం విపులంగా తెలియజేశారు . తెలుగు సాహిత్యంలో శ్రీనాధుడి పేరు సుపరిచితమే . శ్రీహర్షుడు సంస్కృతంలో రచించిన నైషధీయ చరిత్రను శ్రీనాధుడు తెలుగులోకి అనువదించాడు . అలాగే సంస్కృతం నైషదీయంలో శ్రీహర్షుడు మంత్ర శాస్త్రాన్ని నిక్షిప్తం చేశాడని మహా పండితుడు కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప వ్యాఖ్యానం రాశారు .

మహా కవి శూద్రకుదు , ఈయన నాటక నవలాకారుడు ,3 వ శతాబ్దానికి చెందినవాడు . శూద్రక అనేది కలం పేరు . అభీర రాజులలో ఒకడై ఉంటాడని ఊహ . ప్రకరణ రచనకు ఆద్యుడు శూద్రకుడు . అలాగే మృచ్చకటికం గురించి , నామ ఔచిత్యం గూర్చిన వివరణ కూడా తెలియజేశారు రచయిత . విశాఖ దత్తుడు అనగానే ముద్రారాక్షసం నాటకం గుర్తుకు రాక మానదు . ఆయన దేవీ చంద్ర గుప్తా నాటకం అభిసారికా వంచితం మొదలైన నాటకాలను కూడా రాశాడు . అలాగే విశాఖ దత్తుడు అర్ధ , నాట్య , న్యాయ , రాజనీతి శాస్త్రాలలో నిష్ణాతుడు .

పాల్కురికి సోమన గురించి తెలియని తెలుగు వారు అరుదు . కాని ఆయన సంస్కృతి పాండిత్యం అంతగా తెలియక పోవచ్చు . సోమనాధుని “వీర శైవాగ్రేసరుగు” అంటారు . బసవేశ్వరుని చరిత్రను పురాణంగా రాసి కొత్త దారి తీశాడు . చరిత్రకు పురాణ వైశిష్ట్యతను కలిగించిన మొదటి కవి పురాణ కర్త సోమన . ఎవరైనా ఏ పుస్తకం మీదనైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లినాధ సూరి వ్యాఖ్యానంలా ఉంది అంతం పరిపాటి . ఈయన 1350- 1450 కాలంలోని వాడు . కాళిదాసు కుమారా సంభవం , భారవి కిరాతార్జునీయం , మాఘడు , హర్షుడు వారి కావ్యాలకి వ్యాఖ్యానాలు రాసాడు సూరి .

రేడియోలో సంస్కృత పాఠాలు బోధించిన సర్వోదయ ప్రచారకులు కేశిరాజు వెంకట అప్పారావు 1913 మార్చి 14 న తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో జన్మించారు . తెనాలి నుండి వెలువడే సామ్య యోగం ‘సర్వోదయ పక్ష పత్రికకి గౌరవ సంపాదకులుగా సేవ చేశారు . వీరి కావ్యాలు పంచవటి , గంగాలహరి . వీటిని తెలుగులోకి అనువాదం చేసారు . బృందావనం అనే కావ్యాన్ని హిందీ , తెలుగు , సంస్కృతి భాషలలో రచించి తమ ప్రతిభను చాటుకున్నారు . చివరి వ్యాసంగా శతావధాని గణేష్ పరిచయం వివరాలతో ముగుస్తుంది . సంస్కృత , కన్నడ , ఆంద్ర భాషలలో శతావధానం చేసి ఆశు కవిత్వంలో దిట్ట . అవధానాలతో పాటు శతావధాన శారద , శతావధాన శ్రీవిద్య , శతావధాన శాశ్వత గ్రంధాలను రాశారు . షేక్ స్పియర్ రాసిన నాటకం హామ్లెట్ కు కన్నడ అనువాదంగా హొరాషియో రాసి , తానే ముఖ్య పాత్ర పోషించారు .

విరూపాక్ష కవి , సంబందు , మయూరుడు , అమరుక కవి , భట్టి మురారి , వాక్పతి రాజు , దిజ్నాగుడు , పరిమళ పద్మ గుప్తుడు , రుమ్యకుడు , జినరత్న , వామన భట్ట బాణుడు , నంజన గూడు , తిరుమలాంబ , నుదురుపాటి వెంకన్న , రాజవర్మ , శొంటి భద్రాద్రి రామ శాస్త్రి మొదలైన కవులు సమాచారం కూడా పొందుపరిచారు . అలాగే కాళిదాసు కుమారా సంభవం కావ్యాన్ని కన్నడంలోకి అనువాదం చేసిన కవి ఎవరు ?, జైన తీర్ధం కురులలో చివరి వాడైన మహా వీరుని జీవితం పై వచ్చిన మొదటి గ్రంధం ఏది ?, అభినవ కాళిదాసు అని ఎవరిని పిలుస్తారు ?, షేక్ స్పియర్ నాటకాలను సంస్కృతంలోకి అనువదించిన రచయిత ఎవరు ?, సంస్కృతంలో ఉత్తరాలు రాసిన రచయిత పేరేమిటి ? ఇత్యాది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే .

ఇది వరకు వచ్చిన “పూర్వ ఆంగ్ల కవుల చరిత్ర పుస్తకం ఆంగ్ల సాహిత్యానికి ఒక కర దీపికగా లభించిందో ,ఈ పుస్తకం పేర్కొన్న కవులు, రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకత కలిగిన వారే . సంస్కృత సాహిత్యాన్ని అభిమానించే వారికి ఈ గ్రంధం అపురూప కానుక . సంస్కృత సాహిత్యాన్ని చదవాలి అనుకునే వారికి ఈ గ్రంధం ఒక కరదీపిక అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు .

– అరసి

ప్రతులకు :

గబ్బిట దుర్గా ప్రసాద్  

శివాలయం వీధి  ,ఉయ్యూరు  

కృష్ణా జిల్లా

సంచార వాణి:9989066375

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నమస్తే హేమలత గారు -”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ” గ్రంధం పై శ్రీ /శ్రీమతి” అరసి ”గారు ”లోనారసి ”విపులమైన అర్ధ వంతమైన సమీక్ష చేసి  గ్రంధం ఔచిత్యాన్ని ,ప్రస్తుత సమాజానికి దాని అవసరాన్ని ,అందులోని వివిధ విశేషాలను ఆసాంతం ఆస్వాదనీయం గా రాశారు వారికి నా తరఫున సరసభారతి తరఫున కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను ..సమీక్ష రాయించి విహంగ లో ప్రచురించిన మీకు ధన్యవాదాలు . -దుర్గాప్రసాద్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -45

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -45

18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -4

నిరుపేద సంపన్నుడయ్యాడు  –

ఈ సిరీస్ లో వచ్చిన నవలలు జోలాకు గౌరవాన్నికాని ఆర్ధిక లాభాలను   కాని తెచ్చి పెట్టలేదు .కాని ఏడవ భాగమైన ‘’ది ద్రాం షాప్ అండ్ ది బరూం ‘’చాలా సంచలం తెచ్చి అభియోగం మోపెంత దాకా తెచ్చింది . విమర్శల జడివనే కురిసింది .’’literary street cleaner ‘’,poet of the disgusting ‘’,purveyor of muck ‘’అంటూ విశేషణాలు తగిలించారు .కాని పుస్తకం రికార్డ్ స్థాయిలో అమ్మకం కొనసాగించి జోలా ఫ్రాన్స్ దేశం లో అందరి కి సుపరిచతమైన రచయిత అయి పోయాడు .పిచ్చికల్ని కాల్చుకు తిన్న దరిద్రం పోయి అధిక సంపన్నుడయ్యాడు .విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నాడు .అతని ఆకలిమాత్రం అదే స్థాయిలో పెరిగిపోయి౦ది .చాలాఖరీడైన ఆహారం తింటున్నాడు అరుదుగా లభించే వైన్ సంపాదించి తాగుతున్నాడు .పిట్టాలా ఉండే వాడి  పొట్టపెరిగి బలిసి చాలాలవుగా ,వైభవోపేతంగా దర్జాగా కనిపిస్తున్నాడు .డబ్బు తెచ్చిన మార్పులివి .సంభాషణలు  దైవ వాక్యాలుగా ,ప్రామాణికాలుగా  భారీగా ఉంటున్నాయి .రచన జిలేబీ చుట్టల్లా ఉండి,ముతక గా మారింది .

సాంఘిక సంస్కర్త జోలా

అయితేనేం విజయ పరంపరసిరీస్ లో  13వ డైన ‘’జేర్మినల్ ‘’వరకు  కోన సాగి జోలా సాంఘిక సంస్కర్త అవతారం ఎత్తాడు .బొగ్గు గని కార్మికుల జీవన స్థితి వారి సమ్మెలు హక్కుల పోరాటాలు ప్రోలిటరేనియన్  సంస్కృతీ అన్నీ అందులో ప్రతిఫలింప జేశాడు దీనితో రచయితల దృక్పధమే మారిపోయింది .ఇదే తర్వాతా ప్రోలిట రేనియన్ నవలకు నాంది పలికింది .రావి శాస్త్రి గారి నవలలకూ విషయమైంది .జేర్మినల్ నవల లో మార్క్స్ సిద్ధాంతాన్నీ జోడించాడు . దీన్ని గూర్చి సోషల్ సైన్సెస్ కు చెందిన విజ్ఞాన సర్వస్వం ‘’zola  implanted in its readers a faith in the revolution as an investable catastrophe which must precede the happier era when rival classes will be supplanted by a society of free individuals bound only by ties of cooperative labor  and love ‘’అని విశ్లేషించి రాసింది .

జోలా’’ నానా’’ నవల

ఈ సిరీస్ లో వచ్చిన నవల ‘’నానా ‘’ఉత్క్రుస్టం అని పించుకోలేదుకాని సెన్సేషనల్ నవలగా పేరొంది ఇప్పటికీ బాగా ప్రాచుర్యం లోనే ఉంది ..జోలా అంటే ‘’నానా ‘’నవలే గుర్తొస్తుంది .దీనితర్వత ‘’ రైతు జీవితం పై రాసిన’’లాటెర్రె’’కూడా ఆదరం పొందింది .దీని ఇంగ్లీష్ అనువాదం లో కార్మికుల పోరాటం వారందరూ భూమిలోకి చేరిపోవటం విషయం లో చాలా బలమైన మాటలు౦డటం తో ఇంగ్లీష్ వారికి నచ్చక దీన్ని నిషేధించారు .అనువాదకుడిని జైల్లో పెట్టారు .ఆ పుస్తకం ఆంగ్లానువాదం దాదాపు యాభై ఏళ్ళు ఇంగ్లీష్ చదివే వారికి అందుబాటులో లేకుండా చేశారు .ఒకప్పుడు రైతులంటే ఇష్టపడని జోల వారిపై సంచలనాత్మక నవల రాసి వారికీ చేరువైనాడు .’’లా డిబాకిల్ ‘’నవలలో సెకండ్ ఎంపైర్ అని పిలువబడే నిరాశ నిస్పృహలతో ఓడిపోయినా సైన్యానికి సంబంధించిన విషయాలు రాశాడు   .జోలా ధోరణీ మారింది .’’An artist must learn to be lavish and live at top pitch ‘’అన్నాడు .నీతి జాడ్యానికి చికిత్స చేసే వాడుగా జోలా కనిపిస్తున్నాడన్నారు .దీనికి సమాధానం గా తన రాతలు విద్య నేర్పించాటానికే కనుక నీతి తో ఉండటం సహజం అన్నాడు .’’సంఘ రాజకీయ శరీరానికి’’ తాను  డాక్టర్ ను అని చెప్పుకొన్నాడు ఆయన వెలువరించిన తీవ్ర విషయాలను ‘’కల్చరల్ అటాప్సీలు’’ ( సాంస్కృతిక స్వీయ వీక్షణలు )అన్నారు

నడి వయసులో ఘాటు ప్రేమ

.1888లో తన సీరియళ్ళ సీరియస్ ప్రచురణలో ఉండి అమాంతం’’ జినీ రోజెరాట్ ‘’అనే తన ఎస్టేట్ సర్వెంట్ తో ప్రేమలో  పడ్డాడు మనోడికి నలభై యదు ఆమెకు ఇరవై లోపు వయసు .’’జోలా అండ్ హిస్ టైం ‘’లో మాథ్యూ జోసేప్ఫ్సన్ రాస్తూ ఆమె చాలా అరుదైన సౌనదర్యం కలిగి ఉండేదని రాశాడు. పల్లెటూరి ప్రాంతం నుంచి వచ్చిన పిల్ల .ఇప్పుడిప్పుడే ఇంటి పనులు చేయటం నేర్చుకొన్నది .మన రచయితలో ఇప్పటిదాకా ఆనకట్ట వేయబడిన శృంగారం గేట్లు తెంచుకొని ఉరక లెత్తి అడ్డూ ఆపూ లేకుండా .పారింది . ఈ శృంగారం ఫలించి జోలాకు ఇద్దరు పిల్లని కన్నది .ఈ వ్యవహారాన్నిజోలా భార్య అలేక్సాండ్రిన్  మొదటవ్యతిరేకించినా చివరికి రాజీ పడి ఆమోదించింది. జోలా చనిపోయిన తర్వాత అతని భార్య చేత అనుమతి పొంది ఈ పిల్లలకు జోలా పేరు పెట్టుకొన్నది కొత్త పెళ్ళాం .వారే జోలా వారసులయ్యారు .

డ్రేఫస్ అఫైర్ –దోషి అని ముద్రపడిన కెప్టెన్  డ్రేఫస్ ను  నిర్దోషిగా నిరూపించిన జోలా

జోలాకు యాభై వ ఏడు వచ్చేసరికి ఫ్రాన్స్ దేశం లో కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రీ ఫేస్ దేశానికి ద్రోహం చేశాడని నేరం ఆరోపి౦ప బడి , శిక్ష అనుభవించటానికి ‘’డెవిల్స్  ఐలాండ్ ‘’ కు పంపారు .ఈ కేసునే ‘’డ్రీఫాస్ అఫైర్ ‘’అంటారు ఫ్రాన్స్ దేశపు అవినీతి ,రాజకీయ కుళ్ళు దీనితో అందరికి తెలిసింది .తర్వాత ఈ కేసును అందరూ మర్చే పోయారు .చివరికి రెండేళ్ళ తర్వాతా ఎమిలీ జోలా తన వద్ద ఉన్న పూర్తీ ఆధారాలతో డ్రీఫాస్ నిరపరాధి అని నిరూపించాడు .సైన్యం లోని కొందరు పెద్దలు జర్మనీకి రహస్య విషయాలను చేరవేశారని వారే అసలైన నిందితులని చెప్పాడు .అప్పటి వరకూ జనసామాన్యానికి ద్డ్రీఫాస్ పై సాను భూతి లేదు . ఏది ఏమైనా తన పట్టు విడువకుండా స్తైర్యం గా డ్రీప్ఫెస్ వైపు నిలబడ్డాడు జోలా . ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫెలిక్స్ ఫారె కు జోలా ఒక బహిరంగ లేఖ రాయటం తో కద క్లైమాక్స్ కు చేరింది .తన దగ్గర ఉన్న డాక్యు మెంట్ల ద్వారా ఒక్కో అధికారి గుట్టు బయట పెట్టి ముచ్చెమటలు పట్టించాడు .తాను ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలియ బర్చాడు .మానవత్ర్వం కోసం మానవ హక్కుల పరి రక్షణ కోసమే నని చెప్పాడు .దీనిపై క్రోధం పూనిన సైన్యం అధికారులు సైన్యాన్ని అవమాన పరచాడనే అభియోగం మోపి జలులో పెట్టారు .నేరం రుజువైందని చెప్పి మూడు వేల ఫ్రాన్కుల జరిమానా  ఒక ఏడాది జైలు శిక్ష విధించారు .ప్రజా బలం జోలా వైపే ఉంది అయినా సైన్యానికున్న సర్వాధికారాలు ఉపయోగించి ,పత్రికల నోళ్ళు మూయించారు .ప్రజల దృష్టిలో జోలా అమర వీరుడయ్యాడు .సైన్యానికి వ్యతిరేకం గా ప్రజలు ఆగ్రహ జ్వాలలు కురిపించారు. కాని ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది

కేసును పునర్విచారించారు .జోలాకు దేశ బహిష్కార శిక్ష విధించారు 1898జులై లో రహస్యం గా లండన్ చేరి ఒక ఏడాది మారు పేరుతొ ప్రవాస జీవితం గడిపాడు .జోలా నిరంతర పోరాట ప్రయత్నం వలన మళ్ళీ కేసు విచారణకు వచ్చి కెప్టెన్ ద్రేఫాస్ పై నేరాన్ని ఉపసంహరించి అతనికి క్షమా భిక్ష పెట్టింది ప్రభుత్వం .అప్పుడు జోలా పారిస్ కు తిరిగి వచ్చాడు .ఆయన హీరో గానూ లేక గాయపడిన వాడుగానూ ఉండలేదు .పగ ద్వేషం అనే అగ్ని నుండి బయటపడ్డాడు. శుద్ధ మనస్కుడు అని నిపించాడు   .ఈ సందర్భం గా ‘’truth having been vanquished ,justice reigning at last I am re born and take my place again upon French soil ‘’అన్నాడు .ఇలా ఏ విషయమైనా అంత లోతుగా అధ్యయనం చేసే సామర్ధ్యం ఉన్నవాడు ఎమిలీ జోలా .జోలా అంటే చాంపియన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ .

అసంపూర్తి నవల –విషాదంగా సంపూర్ణమైన జీవితం

ఇంగ్లాండ్ లో ఉండగా జోలా’’ ది ఫోర్ గాస్పెల్స్ ‘’అనే కొత్త సీరియల్ రాయటం ప్రారంభించాడు .ఈ నవల గురించి చెబుతూ ‘’about a humanity enlarged for the needs of tomorrow –‘’దీన్ని a Utopia of social harmony a dramatization of the Dreyfus case ,and justice ,’’అన్నారు .విమర్శకులు . కాని దీన్ని పూర్తీ చేయలేక పోయాడు .ఒక ఆటం రోజు రాత్రి జోలా చలికి తట్టుకోవటం కోసం  సేవకులు అసాధారణమైన మంట వేశారు నెగడులో .కాని ఫైర్  లో గాలి వెళ్ళే మార్గం లో ఏదో లోపం ఉంది ఎవరూ గమనించలేదు .అందుకని రాత్రి వేళ చిమ్నీ లోంచి గాలి అసలు బయటికి పోలేదు లోపలే ఉండిపోయింది. కనుక జోలా ఆ రాత్రి అంతా గదిలో ఉండిపోయిన  కోల్ గాస్ తో నిండిన విషపు  గాలినే అంటే కార్బన్ మోనాక్సైడ్ నే  పీల్చాడు పాపం . తెల్లారి  సేవకులు వచ్చి తలుపులు పగల కొట్టి చూసేసరికి జోలా  చని పోయి ఉన్నాడు .అప్పటికి ఆయన వయస్సు 62.మరణించిన తేది 19-9-1902.

అంతిమ యాత్ర

ఎమిలీ జోలా అంత్య క్రియలకు రికార్డ్ స్థాయిలో ముప్ఫై వేలమంది జనం హాజరయ్యారు.’’మినిస్టరూ , ప్రెసిడెంట్ ఆఫ్ ది సోఅసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ లెటర్స్’’  జోలాపై గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు మిగిలిన పెద్దలూ ఉపన్యసించారు .జోలా సహచర ప్రముఖ రచయిత అనటోల్ ఫ్రాంక్ చివరగా నివాళులర్పిస్తూ ‘’Zola was a fighter for justice as well as an author .He has honored his country and the world with an immense work a magnificent action .Envy him his destiny and his heart ,which made his lot that of the greatest .He was a moment’s embodiment of humanity ‘s conscience ‘’అని ప్రశంసించాడు .

Inline image 1 Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శివైక్యం పొందిన ఆధ్యాత్మికవేత్త శివానందమూర్తి

శివైక్యం పొందిన ఆధ్యాత్మికవేత్త శివానందమూర్తి

వరంగల్, జున్ 10:  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మానవతావాది సద్గురు శివానందమూర్తి(87) శివైక్యం పొందారు. ఎండవేడిమిని తట్టుకోలేక నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున వరంగల్‌ జిల్లాలో ములుగురోడ్డులోని గురుధామంలో తుదిశ్వాస విడిచారు. డిసెంబర్‌ 21, 1928న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శివానందమూర్తి జన్మించారు.
సంస్కృతీ, సంప్రదాయాలపై శివానందమూర్తి పలు పుస్తకాలను రచించారు. హిందూవివాహ వ్యవస్థ, మహర్షుల చరిత్ర, గౌతమబుద్ధ ఆయన ప్రముఖ రచనలు. శివానంద కల్చరల్‌ ట్రస్ట్‌, ఆంధ్రా మ్యూజిక్‌ అకాడమీ స్థాపించి కళాకారులకు ఎనలేని సేవలను అందించారు.
ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. విశాఖ జిల్లా భీమిలిలో ఆనందవనం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. శివానందమూర్తి రచించిన కఠయోగా అనే పుస్తకం కంచిపీఠం పరమాచార్య, శృంగేరి శంకరాచార్యల మన్ననలను పొందింది. సన్యాసులు సహా అందరూ ప్రజా సంక్షేమానికి సంరక్షకులుగా తమవంతు కర్తవ్యం నిర్వర్తించాలని శివానందమూర్తి తన ప్రసంగాల్లో తరచూ చెబుతుండేవారు.
 శివానంద అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన కుమారుడికి ఫోన్ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శివానంద మూర్తికి దేశవిదేశాల్లో లక్షలాది మంది అభిమానులు, శిష్యులు ఉన్నారు. శివానందమూర్తి మృతిపట్ల పలువురు పీఠాధిపతులు విచారం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం గురుధామంలో శివానందమూర్తి అంత్యక్రియలు జరుగనున్నాయి. శివానందమూర్తి మృతి పట్ల ఆయన అభిమానులు, శిష్యులు విచారం వ్యక్తం చేశారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -6

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -6kp36 001 kp37 001 kp38 001 kp39 001 kp40- 001 kp41 001 kp42 001 kp43 001 kp44 001 kp45 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -5

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -5kp30 001 kp31 001 kp32 001 kp33 001 kp34 001 kp35 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -4

రాళ్ళబండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -4kp28 001 kp29 001 kp22 001 kp23 001 kp24 001 kp25 001 kp26 001 kp27 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -2

రాళ్ళ బండి కవితా ప్రసాద్ పై మూసీ స్మృతి సంచిక -2kp7 001 kp8 001 kp9 001 kp10 001 kp11 001 kp12 001 kp13 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment