ఆదిలో అరణ్యాలు విజ్ఞాన నిలయాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

/తల్లి తాలజ్ఞానం అబ్బుతుందా ?మంగళం పల్లి బాలమురలీకృష్ణ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్షమాపణ ల కేజ్రీవాల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

50 ఏళ్ళ కితం దివాలా తీసిన ”హరిశ్చంద్ర ”

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

32 గ్రామాల శిల్పుల సమ్మె

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్లాగోతం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యుద్ధ విమానం ”రాఫెల్ ”మంచి ఛాయిస్?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెట్టింట’ గగ్గోలు

నెట్టింట’ గగ్గోలు

  • 26/04/2015
  • -పి.ఎస్.ఆర్.

* పగలంతా ఉద్యోగ బాధ్యతలతో అలసిపోయి సాయంత్రం ఇంటికి చేరాక ‘యూట్యూబ్’లో పాత పాటలో, అలనాటి సినిమాలో చూస్తుంటే మనసుకెంత హాయి..! నచ్చిన సినిమాలను ‘నెట్’లో చూస్తూ ఇంట్లో సేదతీరాలంటే- ఇక ఎంతోకొంత ‘చేతి చమురు’ తప్పదంటే ఎలా..? *** ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని మనకు నచ్చిన ఎలక్ట్రానిక్ వస్తువులను దర్జాగా ‘ఆన్‌లైన్’లో బుక్ చేసుకోవడం.. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పద్ధతిలో ఆ వస్తువును ఇంటి ముంగిట అందుకోవడం.. ఇలాంటి పనులకు ‘అదనపు చెల్లింపులు’ అనివార్యమంటే ‘నెటిజన్ల’కు కష్టమే మరి.. *** పాత వస్తువులకు ఫొటోలు తీసి ‘నెట్’లో పెట్టడం, వాటిని ఎంతోకొంత ధరకు వదిలించుకోవడం.. ఈ తరహా సేవలకు వెబ్‌సైట్లను వాడుకునేవారిపై ఆర్థిక భారం పడితే ఎలా? *** ఎక్కడికైనా ప్రయాణం చేయదలిస్తే టాక్సీస్టాండ్‌లకు వెళ్లి ఆయాస పడకుండా, ‘ఓలా’ వంటి యాప్‌లను వాడుకుని మన గుమ్మం ముందుకు టాక్సీలను రప్పించుకోవడం ఇక ఖరీదైన వ్యవహారమేనా? *** అవసరమైన సమాచారం కోసం, మన మనోభావాలను ఇతరులతో పంచుకునేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను స్మార్ట్ఫోన్లలో యథేచ్ఛగా వాడుకోవడం ఇక కుదరదా? *** … సామాజిక వెబ్‌సైట్లు, ఈ-కామర్స్ పోర్టళ్లు, పలురకాల యాప్స్ లేకుండా నేడు జీవితాన్ని ఊహించలేం. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్నివర్గాల వారు ఇంటర్నెట్‌కు బాగా అలవాటు పడిన నేటి రోజుల్లో- సేవల వినియోగానికి ‘ఆంక్షల చట్రాలు’ బిగిస్తే నిరసన సెగలు, ఉద్యమాలు తప్పవు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతోంది ఇదే. మనం వాడుతున్న నెట్ కనెక్షన్ – బిఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్, ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్.. ఇలా ఏ ‘సర్వీస్ ప్రొవైడర్’దైనా కావొచ్చు. ఇపుడు అన్ని వెబ్‌సైట్లు, చాలా యాప్స్ అందరికీ ఉచితమే. ఇందుకు భిన్నంగా ‘ఫేస్‌బుక్’ వాడాలంటే నెలకు ఇంత, వాట్సాప్ వినియోగించాలంటే ‘చెల్లింపులు’ తప్పవంటే ‘నెటిజన్ల’లో సహజంగానే ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటాయి మరి! ఏ వెబ్‌సైట్‌నైనా, యాప్‌నైనా ఉచితంగా, స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగాలంటూ దేశవ్యాప్తంగా నేడు ఓ ఉద్యమం ఉరకలెత్తుతోంది. అదే- ‘ఇంటర్నెట్ న్యూట్రాలిటీ’ ( అంతర్జాల సమానత్వం) పోరాటం. ఈ ఉద్యమానికి సినీ, రాజకీయ సెలబ్రిటీల మొదలుకొని అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. కొన్ని యాప్‌లు ఉచితమని, మరికొన్నింటికి డబ్బు చెల్లించాలంటే వాటి తయారీదార్లపైనే కాదు, వినియోగదార్లపైనా ఆర్థిక భారం ఖాయమన్న వాదనలు బలం పుంజుకుంటున్నాయి. ఇంటర్నెట్.. ప్రపంచ గమనానే్న మార్చేసిన ఓ అనూహ్య విప్లవం, ఓ అద్భుత ఆవిష్కరణ. వెబ్‌సైట్లు, యాప్‌లను వాడుకోవాలంటే ఎవరి అనుమతులు అక్కర్లేదు. కేవలం నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఈ-కామర్స్, బ్లాగులు, ఆన్‌లైన్ గేమ్స్.. ఇలా మనకు అభిరుచి, ఆసక్తి ఉన్న సైట్లలో వీరవిహారం చేయొచ్చు. ఇదంతా ‘నెట్ నూట్రాలిటీ’ ఫలితమే. ఆదాయ మార్గాల కోసం టెలికాం ఆపరేటర్ల సరికొత్త వ్యూహాలు సఫలమైతే- మనకు ఇష్టమైన సైట్లను, యాప్‌లను స్వేచ్ఛగా వాడుకోలేని పరిస్థితి దాపురించవచ్చు. అంతర్జాల సేవల విషయంలో నూటికి నూరుపాళ్లూ తటస్థంగా ఉండాల్సిన టెలికాం సంస్థలు నష్టాలను నివారించుకోవడానికో, అదనపు ఆదాయం కోసమో తమ స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదని ఆసేతుహిమాచలం నెటిజన్లు నిరసన గళం వినిపిస్తున్నారు. కొన్ని సైట్లకు, యాప్‌లకు అదనంగా రుసుము చెల్లించాలన్న టెలికాం కంపెనీల ప్రతిపాదనలు సరికావని, ఈ పరిణామాలు గుత్త్ధాపత్యానికి దారితీయడమే గాక చిన్న తరహా సంస్థలకు చేటు కలుగుతుందని ‘నెట్ సమానత్వా’న్ని సమర్థిస్తున్నవారు ఆరోపిస్తున్నారు. నెట్ వినియోగంలో మన దేశం ఇప్పటికే ప్రపంచంలో రెండో స్థానాన్ని ఆక్రమించిన నేపథ్యంలో అదనపు ఆదాయం కోసమే టెలికాం సంస్థలు ఆరాటపడుతున్నాయన్న విమర్శలు చెలరేగుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ స్మార్ట్ఫోన్లను వాడుతున్నందున ‘నెటిజన్ల’ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. విజ్ఞానం కోసం, వినోదం కోసం వెబ్‌సైట్లను, యాప్‌లను వినియోగించడం సర్వసాధారణమైంది. నేడు మన దేశంలో 25 కోట్ల నెట్ కనెక్షన్లు ఉండగా, ఇందులో 18 కోట్లు మొబైల్ కనెక్షన్లు కావడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షల సరిహద్దులు గీస్తే సహించేది లేదని నెటిజన్లు తెగేసి చెబుతున్నారు. అందరికీ స్వేచ్ఛగా దక్కాల్సిన ‘అంతర్జాలం’పై పట్టు బిగించాలని, ఎడాపెడా డబ్బులు దండుకోవాలని టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తే భంగపాటు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. సర్వత్రా సంఘీభావం.. ‘నెట్ న్యూట్రాలిటీ’ని ఆకాంక్షిస్తూ దేశం నలుచెరగులా నెటిజన్లు పోరుబాటలో నడవడం, ‘ఇంటర్నెట్‌ను పరిరక్షించండం’టూ ప్రారంభమైన ఆన్‌లైన్ ఉద్యమానికి సెలబ్రిటీలు సైతం మద్దతునివ్వడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నెటిజన్ల ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుండడంతో కొన్ని టెలికాం కంపెనీలు, ఈ-కామర్స్ పోర్టళ్లు పునరాలోచనలో పడుతున్నాయి. కొన్ని సైట్లను ఉచితంగా ఇవ్వడం, మరికొన్నింటికి డేటా రుసుము వసూలు చేయడం వంటి చర్యలు ‘నెట్ సమానత్వాని’కి భంగం కలిగిస్తాయని దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘్ఫ్లప్‌కార్ట్’ వెనకడుగు వేసింది. ‘ఎయిర్‌టెల్ జీరో’ నుంచి తప్పుకుంటున్నట్లు ‘్ఫ్లప్‌కార్ట్’ ప్రకటించాక మరికొన్ని సంస్థలు అదే బాట పడుతున్నాయి. ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’నుంచి వైదొలగుతున్నట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్ ‘క్లియర్‌ట్రిప్’ స్పష్టం చేసింది. రంగంలోకి దిగిన సర్కారు.. ‘నెట్ న్యూట్రాలిటీ’కి మద్దతుగా సామాజిక మీడియాలో ప్రచారం పతాక స్థాయికి చేరుకోవడంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించక తప్పలేదు. టెలికాం కంపెనీల తాజా ప్రతిపాదనలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించారు. నెట్ న్యూట్రాలిటీ వల్ల కలిగే లాభనష్టాలు, ఆంక్షలపై వచ్చే నెల రెండోవారంలో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. టెలికాం కంపెనీలు అందిస్తున్న పథకాలను, వాటిలో గుత్త్ధాపత్య ధోరణుల గురించి కూడా కమిటీ అధ్యయనం చేస్తుంది. లక్షల్లో ఫిర్యాదులు.. దేశ వ్యాప్తంగా టెలికాం కంపెనీలను నియంత్రించే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ట్రాయ్) కూడా ‘నెట్ న్యూట్రాలిటీ’పై స్పందించి నెటిజన్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏ ర్పాట్లు చేసింది. ఇందుకోసం ‘ట్రాయ్’ ప్రత్యేక ఈ-మెయిల్ ఐడిని ఏర్పాటు చేయగా తొలి రెండురోజుల్లోనే 3 లక్షల ఫిర్యాదులు అందాయి. మరో నాలుగురోజులకు ఆ సంఖ్య 8 లక్షలకు చేరింది. ఏప్రిల్ 24వరకు ఫిర్యాదులు స్వీకరించిన ప్రభుత్వం తరువాత ఏం చేయాలన్న దానిపై మే రెండోవారంలో నిర్ణయం తీసుకుంటుంది. టెలికాం నియంత్రణ సంస్థగా తాను నిర్వహించాల్సిన బాధ్యతలను విస్మరించి, కార్పొరేట్ కంపెనీల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న ‘ట్రాయ్’ అంతర్జాల సమానత్వం కోసం ప్రజల అభిప్రాయాలను కోరడం విడ్డూరంగా ఉందని ఇండియా ఇన్ఫోసెక్ కన్సార్షియం (ఐసిసి) ప్రతినిధులు విమర్శిస్తున్నారు. నెట్ సమానత్వాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్న టెలికాం సంస్థల ఎజెండాకు ‘ట్రాయ్’ మద్దతునిస్తోందని ‘ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఐఎఎంఎఐ) ఆరోపిస్తోంది. నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా తాము చేపట్టిన ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఫేస్‌బుక్ స్పష్టం చేయగా, ఈ పథకం నుంచి వైదొలగుతున్నట్లు క్లియర్‌ట్రిప్, టైమ్స్ గ్రూప్ సంస్థలు ప్రకటించాయి. దుమ్మురేపిన వీడియో హాస్యం వికటించి, వివాదాలకు మారుపేరుగా మారిన కమెడియన్ల గ్రూప్ ‘ఆలిండియా బక్‌చోద్’ (ఏఐబి) ఇప్పుడు చేసిన సీరియస్ ప్రయోగం దేశవ్యాప్తంగా నెట్ న్యూట్రాలిటీ (అంతర్జాల సమానత్వం) ఉద్యమానికి ఊపిరినిచ్చింది. సాధారణంగా హాస్య సన్నివేశాలు, శ్రుతిమించిన వ్యాఖ్యానాలతో, రక్తి కట్టించే నటనతో రూపొందించిన దృశ్యాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేసే ఏఐబి తాజాగా నెట్‌న్యూట్రాలిటీపై ‘సేవ్ ఇంటర్నెట్’ అన్న నినాదంతో 9 నిమిషాల నిడివిగల షార్ట్ఫిల్మ్‌ను ఆవిష్కరించింది. టెలికాం కంపెనీలు, ‘ట్రాయ్’ తీసుకునే నిర్ణయాల ఫలితంగా ఇంటర్నెట్ వినియోగదారులకు ఎదురయ్యే కష్టనష్టాలను ఆ వీడియోలో వివరించారు. ఇంటర్నెట్ ఆడంబరం కాదని, నిత్యావసరమని చెబుతూ నెట్ న్యూట్రాలిటీ వల్ల కలిగే మేలును అందరికీ అర్థమయ్యేలా దృశ్యరూపంలో చిత్రీకరించారు. సాంకేతిక అంశాలతో కూడిన నెట్ న్యూట్రాలిటీ గురించి సులువుగా అర్థమయ్యేట్లు ఇందులో వ్యాఖ్యానాలు, గ్రాఫిక్స్ చేశారు. నెట్ ప్రొవైడర్ సంస్థ ‘ఎయిర్‌టెల్’ ప్రవేశపెట్టదలచిన ‘ఎయిర్‌టెల్ జీరో’ పథకంతో మొదలైన ‘నెట్టింటి కల్లోలం’ ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. భావప్రకటన స్వేచ్ఛను హరించి, ఆర్థిక భారాన్ని మోపే టెలికాం సంస్థల ప్రయత్నాలు, వారికి తలూపుతున్న ‘ట్రాయ్’ చేష్టలను ఈ వీడియో విమర్శించింది. 20 ప్రశ్నలతో ‘ట్రాయ్’ విడుదల చేసిన 118 పేజీల కన్సల్టేషన్ పేపర్ గురించి కూడా ఈ వీడియో ప్రస్తావించింది. అందులో వేసిన 20 ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో రాసి, ఆ కాపీని అందుబాటులో ఉంచింది. దానిని ‘ట్రాయ్’కు పంపిస్తే చాలని సూచించింది. ఏఐబి వీడియోతో దేశంలో నెట్ న్యూట్రాలిటీ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. మొత్తానికి ఏఐబి గత వివాదాల నుంచి బయటపడి ఇపుడు ప్రజల దృష్టిలో మంచిమార్కులు కొట్టేసింది. అసలు సమస్య ఇదీ.. నెట్ న్యూట్రిలిటీ అంటే అందరికీ అందుబాటులో అంతర్జాలం ఉండటం. ఎవరికైనా, ఏ వెబ్‌సైటైనా, ఏ యాప్ అయినా ఒకేవేగంతో, ఒకేలా లభించే సౌలభ్యం ఉండటం. ఇదంతా ఇంతవరకూ ఉచితంగానే ఉంది. మనదేశంలో ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఎక్కువమంది మొబైల్ ఫోన్లలోనే నెట్‌ను వినియోగిస్తున్నారు. అధికజనాభాతో ఉన్న మనదేశంలో నెట్ వినియోగదారుల సంఖ్య కూడా ఎక్కువే. విస్తృతమార్కెట్ ఉండటంతో లాభాల కోసం, వ్యాపారం కోసం టెలికాం సంస్థలు, అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాయి. ఫేస్‌బుక్ ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని టెలికాం కంపెనీలతో ‘ఫేస్‌బుక్’ ఒప్ప ందం కుదుర్చుకుంది. ఆ టెలికాం సంస్థ వినియోగదారులకు ఉచితంగా, వేగంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఇలా ఏర్పాటు చేయాలన్నది వారి ఆలోచన. ఎయిర్‌టెల్ కూడా ‘ఎయిర్‌టెల్ జీరో’ పథకాన్ని ప్రకటించింది. తమ వినియోగదారులకు కొన్ని యాప్‌లు, కొన్ని సైట్లు వేగంగా, ఉచితంగా అందిస్తుందన్నమాట. అవికాక వేరే వెబ్‌సైట్లు, యాప్‌లు కావాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో నెట్ ఆలస్యంగా కనెక్టవుతుందన్నమాట. ఇలాంటి మాయలన్నీ ఉంటాయని బయటకు పొక్కడం, నెట్ న్యూట్రాలిటీ కోసం నెటిజన్లు గళం విప్పడంతో నెమ్మదిగా ఒక్కో సంస్థ వెనుకడుగు వేస్తున్నాయి. కేబుల్ టీవీ సంస్థల మాదిరిగా కొన్ని ఛానల్స్‌ను మాత్రమే ప్రసారం చేసే విధంగా నెట్‌ను, వెబ్‌సైట్లను నియంత్రించి, తమకు ఇష్టమైన వాటిని అందుబాటులో ఉంచడం, వినియోగదారులకు కావాల్సినవి అందించాలంటే డబ్బులు రాబట్టడం ఆ కొత్త ఆలోచనల ఆంతర్యం. ఈ విషయం విపులంగా అర్థం కావడంతో నెటిజన్లు ససేమిరా అంటున్నారు. విదేశాల్లో ఇదే అంశంపై దశాబ్దకాలంగా వివాదం సాగినా చివరికి నెటిజన్ల మాటే నెగ్గింది. ఇప్పుడు భారత్‌లో ఇదే వివాదం మొదలైంది. మార్చి 27న ‘ట్రాయ్’ విడుదల చేసిన 118 పేజీల కన్సల్టేషన్ పత్రం, 20 ప్రశ్నలతోకూడిన పేపర్ ఉద్యమవేడికి ఆజ్యం పోసింది. మే 8న ఈ విషయంపై నివేదిక అందాక ‘ట్రాయ్’, కేంద్రప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటాయి. మేం వ్యతిరేకం కాదు.. అంతర్జాల సమానత్వానికి ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’ ఏ మాత్రం వ్యతిరేకం కాదని ‘ఫేస్‌బుక్’ చైర్మన్ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. మొబైల్ ద్వారా కంటే ఆన్‌లైన్‌లో అనుసంధానమైతే సమాచారాన్ని, అభిప్రాయాల్ని అత్యంత వేగంగా పంచుకోవచ్చని, ఇందుకు ‘ఇంటర్నెట్ డాట్ ఓఆర్‌జి’ వంటివి దోహద పడతాయని, నెట్ సమానత్వానికి లోబడే ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ‘సేవ్ ద ఇంటర్నెట్’, ‘్ఛంజ్ డాట్ ఓఆర్‌జి’ పేర్లతో నెటిజన్లు నిర్వహిస్తున్న ప్రచారోద్యమం నానాటికీ ఊపందుకుంటోంది. అభిప్రాయ సేకరణ కోసం ట్రాయ్ విడుదల చేసిన ప్రశ్నావళికి జవాబిస్తూ వీరు రూపొందించిన ప్రతాన్ని అందుబాటులో పెట్టి దానినే నెటిజన్లంతా ట్రాయ్‌కు పంపాల్సిందిగా ఈ సంస్థలు చేసిన విజ్ఞప్తికి అద్భుతమైన స్పందన కన్పించింది. సర్వే చెబుతున్నది ఇదీ.. నెట్ న్యూట్రాలిటీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం, ట్రాయ్ వ్యవహారశైలిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ సర్కిల్స్ అనే సామాజిక మీడియా నిర్వహించిన తాజా సర్వేలో 77 శాతం మంది నెట్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. కాల్‌డ్రాప్, పూర్ డేటా తదితర సర్వీసుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించడంలో కేంద్రం, ట్రాయ్ విఫలమైనట్లు సర్వేలో అధిక సంఖ్యాకులు ఆరోపించారు. ఈ సర్వేలో ఐదు ప్రశ్నలపై 35వేల మంది అభిప్రాయాలు సేకరించగా, వారిలో నెట్‌న్యూట్రాలిటీ ఉండాల్సిందేనని 20వేల మంది మద్దతు ప్రకటించారు. డేటా సర్వీసు, వాల్యూయాడెడ్ సర్వీసుకు సంబంధించి టెలికం కంపెనీలు వసూళ్లు చేస్తున్న ఛార్జీలపై 53శాతంమంది అనుమానం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల మద్దతు ‘ఇంటర్నెట్ సమానత్వాన్ని పరిరక్షించండం’టూ దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సైతం నెటిజన్లకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ‘ఆప్’ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ‘ట్వీట్’ చేశారు. టెలికాం కంపెనీల వాదనలను సమర్థించేలా వ్యవహరిస్తున్న ‘ట్రాయ్’ దూకుడుకు పగ్గాలు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), ఆదిత్య ఠాక్రే (శివసేన) వంటి రాజకీయ నాయకులు ఇప్పటికే ‘ట్రాయ్’ తీరుపై నిరసన గళం వినిపించారు. బాలీవుడ్‌కు చెందిన షారుఖ్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, కునాల్ ఖేమ్, విశాల్ దధాని, సిద్ధార్థ మల్హోత్రా, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్, అర్జున్ కపూర్, పరీణతి చోప్రా వంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే ‘ట్రాయ్’కి లేఖలు రాశారు. పలువురు మీడియా సంస్థల ప్రతినిధులు, పత్రికాధిపతులు కూడా నెటిజన్ల పోరుకు మద్దతు ప్రకటించారు. భద్రతపై ‘యాప్స్’ ప్రభావం..? నెట్ సమానత్వంపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘ట్రాయ్’ సరికొత్త వాదనలను తెరపైకి తెచ్చింది. నెట్ ఆధారిత కాల్స్, మెసేజీలకు కొన్ని అప్లికేషన్లు స్వేచ్ఛగా అవకాశం కల్పిస్తున్నందున వ్యక్తిగత, దేశ భద్రతపై ప్రభావం పడుతుందని, ఈ విషయాలపైనా నెటిజన్లు స్పందించాలని ‘ట్రాయ్’ కోరుతోంది. ఉబెర్, ఓలా వంటి వెబ్‌సైట్లు టాక్సీ సర్వీసులను ‘యాప్స్’ ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయని ‘ట్రాయ్’ గుర్తు చేస్తోంది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఇటీవల ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఉబెర్ టాక్సీలను నిలిపివేసిన నేపథ్యంలో ‘ట్రాయ్’ ఈ వాదన వినిపించడం గమనార్హం. కోట్లాది రూపాయల్లో వ్యాపార లావాదేవీలు జరుపుతున్న ఈ-కామర్స్ సైట్లు పన్నులు, లైసెన్సింగ్‌కు సంబంధించి స్థానిక నిబంధనలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాలకు, వినియోగదారులకు నష్టం జరగకుండా ఉండాలంటే కొన్ని విధి విధానాలు ఉండాలని ‘ట్రాయ్’ భావిస్తోంది. వాట్సాప్, స్కైపె, వైబెర్, గూగుల్ టాక్ వంటి ‘యాప్స్’ విషయంలోనూ నియమ నిబంధనలు అవసరమని ‘ట్రాయ్’ ప్రతిపాదిస్తోంది. వినియోగదారుడు ఉండే ప్రాంతాన్ని తెలియజేసేలా జిపిఎస్ వంటి యాప్స్ ఉపయోగపడుతున్నాయని, ఇలాంటి సమాచారం తెలియడం వల్ల నేరాలు జరిగేందుకు అవకాశం ఉందని ఆ సంస్థ వాదిస్తోంది. దేశ భద్రతతో పాటు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు సమాచారం అందుబాటులో ఉంటోందని, ఈ విషయాలన్నింటిపై చర్చ జరిగితే నివారణోపాయాలు కనుగొనవచ్చని ‘ట్రాయ్’ ఇటీవల విడుదల చేసిన పత్రంలో పేర్కొంది. వీడియోగేమ్స్‌తో మద్దతు మన దేశంలో ఇప్పుడైతే వేడిపుట్టింది కానీ విదేశాల్లో ఈ సమస్యపై ఎప్పుడో ఉద్యమాలు పుట్టాయి. అమెరికాలో ఆ మధ్య ఇలాంటి పరిస్థితి ఏర్పడినపుడు ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా ‘నెట్ న్యూట్రాలిటీ’ కోసం మద్దతు ప్రకటించారు. ఎఫ్‌సిసి రూపొందించిన నిబంధనావళిని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. పాశ్చాత్య దేశాల్లో ఆ వేడి తగ్గినా ప్రకంపనలు ఇంకా ఉన్నాయి. తాజాగా నెట్ న్యూట్రాలిటీ అవసరాన్ని అర్థమయ్యేలా వివరిస్తూ, ఇంటర్నెట్ నియంత్రణవల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కొందరు విద్యార్థులు ఓ వీడియోగేమ్‌ను రూపొందించారు. అది మార్కెట్‌లో హాట్‌కేక్‌లా అమ్ముడవుతోంది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ ఉతాహ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్‌కు చెందిన విద్యార్థులు కొందరు ‘404 సైట్’ పేరిట వీడియోగేమ్‌ను విడుదల చేశారు.ఇది ఉచితంగా అందరికీ అందుబాటులోకి తెచ్చారు. 3డి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగించారు.


గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాకీ గుర్తింపు వద్దు దేవుడా..! (కథల పోటీలో ఎంపికైన రచన

నాకీ గుర్తింపు వద్దు దేవుడా..! (కథల పోటీలో ఎంపికైన రచన)

  • తులసి బాలకృష్ణ
  • 24/04/2015
TAGS:

‘‘ఎలా వుంది నీకిప్పుడు వొంట్లో?’’ అంటూ భార్య నుదుటిమీద చేయ వేసిన రఘుపతి- అసంకల్పిత ప్రతీకార చర్యగా చటుక్కున వెనక్కి తీసుకున్నాడు చేతిని. పెనంలా కాలిపోతోంది ఆవిడ వొళ్ళు. ‘‘ఈ రోజు తగ్గిపోతుంది జ్వరం.. పథ్యం పెట్టవచ్చు.. అనుకుని బీరకాయ కూర చేసి, చారు పెట్టానే సరస్వతీ.. మళ్లీ తిరగబెట్టినట్లుంది.. చ్ చ్చ్ చ్చ్…’’ అన్నాడు నొచ్చుకుంటూ… భయంతోనూ, బాధతోను వణుకుతూన్న గొంతుతో. నీరసంగా, సన్నగా నవ్విందావిడ భర్త కళ్ళలోకి చూస్తూ. ‘‘్భయం లేదు లెండి.. అదే తగ్గిపోతుంది’’ జిగురుగా అంటుకున్న నోటిని ప్రయత్నం మీద విప్పిన ఆమె నోట్లోంచి మాటలతో బాటు వేడి ఆవిరి కూడా వెలువడింది.
లోపల్నుంచి తన్నుకొస్తూన్న దుఃఖాన్ని కనురెప్పల వెనకే కుక్కుకుంటూ, అరిచేత్తో ఆమె నుదుటిమీద పడుతూన్న జుట్టుని పైకి తోస్తూ వౌనంగా వుండిపోయాడాయన. భర్త కళ్ళల్లోని బెంగని గమనిస్తూ అంత నీరసంలోనూ ఆయనకి ధైర్యం కలిగించడానికి, నవ్వడానికి ప్రయత్నిస్తూన్న సరస్వతికి తమ గత వైభవపు రోజులు గుర్తొస్తున్నాయి.
***
మద్రాసు టీనగర్‌లో వుండే రోజులు. పొద్దునే్న ఆరింటికల్లా స్నానాదులు ముగించుకుని వంటింట్లోకి వచ్చి, పీట వాల్చుకుని బాసిం మఠం వేసుక్కూచుని తను వడ్డించే ఇడ్లీలో, దోసెలో, పెసరట్లో శుభ్రంగా కడుపు నిండా లాగించేసి, గ్లాసుడు చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగేసి, ‘బ్రేవ్’మని త్రేంచి, మరచిపోకుండా ‘‘అల్పాహార దాతా.. సుఖీభవా!’’ అంటూ తనని దీవించేసి వరండాలోకి పోయి కూర్చునే వాడాయన. ఓ అయిదు, పది నిమషాల తేడాతో ఏదో ఒక సినిమా ప్రొడక్షన్ తాలూకు కారో, వ్యానో వచ్చేది. వేసేవి హీరో వేషాలో, పూర్తి నిడివి వేషాలో కాకపోయినా, కొంచెం చిన్నవే అయినా, మంచి గుర్తింపు వుండే వేషాలు మాత్రం అయ్యుండేవి. కథా చర్చ ముగియగానే ‘ఇది రఘుపతిగారి వేషం’ అని వెంటనే నిర్ణయించేసేవాళ్ళు డైరెక్టర్లు. అలా ‘గుర్తింపు’ వుండేది, రాబడీ బావుండేది.
రోజులు మారాయి.. మనుషులు మారారు.. కథలు కొత్త పుంతలు తొక్కాయి.. హీరో హీరోయిన్లు, గూండాలు… అంతే! కేరెక్టర్ నటుడికి డిమాండ్ క్షీణించింది.. ఫలితం… ఎలాంటి వేషాలు లేవు… రాబడి లేదు. ముందుచూపు లేక డబ్బు పొదుపు చేసుకోలేదు. కూతురి పెళ్లికి ఉన్న కొద్దో గొప్పో ఖర్చయిపోయింది. ఇపుడు తమ పల్లెటూరి పూరింట్లో.. ఆ ఇల్లున్న దీన స్థితిలోనే తనూ, ఆయనా…
***
‘టక టక టక’’ మని వేళ్లతో తలుపు తట్టుతూన్న ధ్వని. తలుపు తీసాడు రఘుపతి. ఎదురుగా పక్కింటి సుభద్రమ్మగారు. ఆవిడ వెనక ఓ పాతికేళ్ళ యువకుడు.
‘‘ఎలా వుందండీ సరస్వతమ్మ గారికి?’’ అనడిందావిడ. గుమ్మానికి అడ్డు తొలిగి, భార్య కుక్కి మంచంవైపు చూపించాడు రఘుపతి భారంగా ఊపిరి వదుల్తూ.
ఆవిడ తన వెనక వున్న యువకుడితో ‘‘నువ్వ బాబాయ గారితో మాట్లాడుతూ వుండు రాజూ..’’ అని లోపలికి నడిచింది.
‘నాపేరు రాజండీ..’ అంటూ చేతులు జోడించి నమస్కరించాడు అతను రఘుపతికి. గడప దాటి బయటకొచ్చి బల్లమీద కూర్చుంటూ, ‘‘కూర్చో.. నాయనా’’ అన్నాడు రఘుపతి.
నాన్చకుండా తనను పరిచయం చేసుకుని, తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక్క పది నిముషాల వ్యవధిలో ఆయన ముందు ఉంచాడు రాజు. తల పంకించి ఆలోచనలో పడ్డాడు రఘుపతి.
పది నిముషాలు పోయాక సుభద్రమ్మగారు బయటకొస్తూ, ‘మాట్లాడావా..?’ అన్నట్లుగా రాజువైపు చూసి, అతను ‘ఆఁ’ అంటూ తల వూపాక, రఘుపతితో- ‘‘ఆలోచించండి అన్నయ్యగారూ.. ఇతను మా వాళ్ళబ్బాయే. మంచివాడు. మిమ్మల్ని జాగర్తగా చూసుకుంటాడు. ఇక్కడ సరస్వతమ్మగారు ఒక్కరే ఉంటారని మీరేం భయపడక్కరలేదు. మేమంతా వున్నాంగా.. మాకు పెద్ద పనేం వుంటుంది… రోజుకి పదిసార్లు వచ్చి చూసి పోతుంటాం. ఆవిడకి తగ్గేవరకూ మందులూ అవీ ఇచ్చి, ఇంత జావా అదీ కాచి ఇస్తాం’’ అని నమ్మకంగా చెప్పి రాజుతో బాటు వెళ్లిపోయారు. నెమ్మదిగా లేచి లోపలి గదిలోకి నడిచాడు రఘుపతి.
‘‘ఏం నిర్ణయించుకున్నారండీ?’’ నూతిలోంచి వచ్చినట్లు వుంది సరస్వతి గొంతు.
ఉలిక్కిపడి ఆమె ముఖంలోకి చూస్తూ, ‘‘ఆవిడ నీకు చెప్పారా?’’ అనడిగాడు రఘుపతి. ఔనన్నట్లుగా తల ఊపి, పెదాల మీదకు నవ్వు తెచ్చుకుంటూ, ‘‘వెళ్లిరండి’’ అంది.
తెల్లబోయాడు రఘుపతి. ‘సరస్వతీ.. ఆవిడ నీకేం చెప్పారో.. నువ్వేం విన్నావో? ఆ అబ్బాయి టీవీ సీరియళ్ళకి జూనియర్ ఆర్టిస్టు సప్లయర్‌ట. మా రోజుల్లో ఎక్స్‌ట్రా సప్లయర్ అనేవాళ్ళు. నేను సిటీకి వెళితే రోజువారీ వేషాలు ఇప్పించగలననీ, రోజుకి నాలుగు వందలిస్తారనీ, అందులో రెండు వందలు తనకి ఇవ్వాలనీ, తన వద్ద వున్న మరో పది మందితో బాటు నాకూ తల దాచుకోవడానికి గూడు ఏర్పాటుచేస్తాననీ, పొద్దున్న టిఫిను, మధ్యాహ్న భోజనం షూటింగ్ వున్న యూనిట్ వాళ్ళు పెడతారనీ, రాత్రి భోజనం నేను చూసుకోవాలనీ చెప్పాడు ఆ అబ్బాయి. వాళ్ళిద్దరిదీ మనకి మేలు చేసి, ఇంత ఆలంబన కలిపించాలనే సదుద్దేశమే. కుర్రాడు కూడా మంచివాడు లాగే వున్నాడు. ఏదీ దాచకుండా ఉన్నది కచ్చితంగా చెబ్తున్నాడు. నా గత చరిత్ర తనకు తెలిసిందనీ, ఇప్పటి కుర్రాళ్ళమధ్య ఓ జూనియర్ ఆర్టిస్టుగా ఉండడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి నా పేరును రాఘవయ్య అని మారుద్దాం అని అన్నాడు. అంతా బాగానే వుంది గానీ ఈ పరిస్థితుల్లో.. నిన్ను ఒంటరిగా వదిలి.. నెలకి వెయ్యి రూపాయలు వస్తూన్న కొట్లో గుమాస్తా ఉద్యోగం వదిలి….’’- అని నసిగాడు.
తనకేమీ కాదని, కొట్లో గుమాస్తా ఉద్యోగం కంటే ఎక్కువ గడించవచ్చనీ, ఆ రంగంలో పడ్తే మనసుకి కూడా ఆహ్లాదంగా ఉంటుందని, ఇంటి ఆర్థిక పరిస్థితితోబాటు ఆరోగ్యాలు కూడా బాగుపడతాయనీ, తప్పక వెళ్ళమని బలవంతంగా ఒప్పించింది సరస్వతి.
ఈ అవకాశం లభించిన ఆనందంతో ఆమెలో కొంత శక్తి కూడా వస్తూన్నట్లు తోచిన రఘుతికి- తనూ, ఆమె ఆనందంగా గడిపిన పాత రోజులు కూడా గుర్తొచ్చి, కొత్త ఊపిరి అందినట్లయ్యింది.
***
గడచిన ఇరవై రోజుల్లో పదిహేను రోజులు షూటింగులు వుండి కొంత రాబడి వుండడం, భార్య దగ్గర సుభద్రమ్మగారు ఏర్పాటుచేసిన సెల్ ఫోన్‌లో అప్పుడప్పుడు మాట్లాడగలగడం, ఆమె ఆరోగ్యం కూడా కుదుటపడుతూండడం.. రఘుపతికి బాగానే ఉంది గానీ, లోలోన… పేరు మార్చుకుని, ఓ అనామకుడిగా… ఓ ఎక్స్‌ట్రాగా.. ఈనాటి ఫీల్డ్‌లో వున్న భాష ప్రకారం ఓ జూనియర్ ఆర్టిస్టుగా.. ‘గుర్తింపు’ లేకుండా చెట్ల కింద కూర్చుని ఒళ్ళో పళ్ళెం పెట్టుకు తింటూ.. ‘‘రా..’’, ‘‘పో..’’ అంటూ ఏకవచన ప్రయోగంతో పిలిపించుకుంటూ వుంటే… కొంచెం బాధాగానే ఉంటోంది. మరో పది రోజులు గడిచాయి. ఓ సీరియల్ షూటింగ్‌లో తన పాత్రలో నటిస్తూన్నాడు రఘుపతి.
అసోసియేట్ డైరెక్టర్ అహంకారాన్ని ప్రదర్శిస్తూ- రఘుపతిని ఉద్దేశించి, ‘తన’ స్టయిల్ని ఫాలో కావట్లేదని, తనకి కావాల్సిన ఎఫెక్ట్ వచ్చేలా నటించడం లేదనీ, ‘‘ఎక్కడి నుంచి తెస్తారయ్యా బాబూ ఈ మొహాల్ని? ఓ డైలాగ్ చెప్పలేరు.. ఓ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వలేరూ…’’ అంటూ, రాజు మీద విసుక్కుంటూన్నాడు.. కొంతదూరంలో కూర్చుని నెక్ట్స్ సీన్ల స్క్రిప్ట్ తిరగేస్తూన్న డైరెక్టర్ పెద్ద గొంతుతో ‘‘తీసిపారేయండయ్యా అట్టాంటోళ్ళనీ.. టైం వేస్టు..’’ అని అరుస్తూన్నాడు.
అదే సమయంలో… షూటింగ్ స్పాట్‌కి వచ్చాడు ఆ సీరియల్ ప్రొడ్యూసర్. ఎప్పుడూ షూటింగ్‌కి రాని ఆయన వచ్చేసరికి కంగారుపడ్డ అందరూ డైరెక్టర్‌తో సహా గబుక్కున లేచి నిలబడి విష్ చేశారు. ‘ప్లీజ్ సిట్‌డౌన్. కమాన్ కంటిన్యూ షూటింగ్. డోంట్ స్టాప్. లీజర్ టైం దొరికితే సరదాగా వచ్చానంతే..’’ అంటూ నవ్వు ముఖంతో ముందుకు నడిచి.. డైలాగ్ చెబ్తూన్న రఘుపతి వైపు చూసి… కళ్ళు చిట్లించి… బాగా పరికించి చూస్తూ.. అసోసియేట్ డైరెక్టర్‌ని ‘‘ఈయన రఘుపతి గారు కదూ..?’’ అని అడిగాడు.
‘‘ఎవరో రాఘవయ్యట సార్.. జూనియర్ ఆర్టిస్టు… చంపేస్తున్నాడు… మార్చేద్దాం అనుకుంటున్నాం’’ అన్నాడు అసోసియేట్.
చటుక్కున కోపంగా అతని ముఖంలోకి చూసిన ప్రొడ్యూసర్ ‘‘ఏం మాట్లాడుతూన్నావయ్యా నువ్వు?’’ అని, డైరెక్టర్‌తో ‘‘ఏం సార్.. మీకూ తెలియదా ఆయన?’’ అని అడిగాడు. తెలీదన్నాడు డైరెక్టర్. ‘‘అదీ సంగతి. అందుకనే జూనియర్ ఆర్టిస్టుగా ట్రీట్ చేస్తూన్నారన్నమాట!’’ అన్నాడు ప్రొడ్యూసర్ కోపంగా. దెబ్బతిని, భ్రుకుటి ముడిచి అర్థంకాక చూసాడు డైరెక్టర్.
‘‘సినిమాల్లో ఒకప్పటి మహానటుడయ్యా ఆయన. ఆయన దురదృష్టంకొద్దీ పెద్ద వేషాలు దొరక్కపోయినా, వేసిన వేషాలు మాత్రం ఆయనే వేయదగ్గవీ అన్న క్రెడిట్ ఆయనకుంది. ఎంతసేపూ ఈ కాలపు గెంతులూ, ఎగురుళ్ళు తప్పితే.. పాత సినిమా కళాకారుల గురించి ఏమీ తెలియనట్లుంది మీకు..’’ అంటూ ముందుకి నడిచి, రఘుపతికి చేతులు జోడించి నమస్కరిస్తూ, ‘‘అయ్యా! మా వాళ్ళకి మీ పూర్వ వైభవం, మీ ప్రతిభ తెలియక, ఇలాంటి గుర్తింపు లేని వేషం ఇచ్చారు. తీసెయ్యండి ఈ వేషాన్ని. మీరు మా సీరియల్‌లో నటించడం మా అదృష్టం’’ అంటూ డైరెక్టర్ వైపు తిరిగి, ‘‘వీరికి మంచి రన్నింగ్ రోల్ ఇవ్వండి. మన సీరియల్ టిఆర్‌పి ఒక్కవారంలో పెరిగిపోతుంది. టాప్‌లో నిలుస్తుంది’’ అని, రఘుపతితో ‘‘వస్తానండీ.. థాంక్ యూ వెరీ మచ్’’ అని వెళ్లిపోయాడు ప్రొడ్యూసర్ హడావుడిగా.
డైరెక్టర్ పూడుకుపోయిన గొంతుని సవరించుకుంటూ, ‘‘సారీ సర్.. మంచి థ్రూ అవుట్ రోల్‌కి పిలుస్తాను మిమ్మల్ని రెండు రోజుల్లో. తీసెయ్యండి ఈ వేషం..’’ అన్నాడు తలొంచుకుని రఘుపతితో. ‘‘అయ్యో నాయినా.. ఈ వేషమైనా ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని..’’ అన్నాడు రఘుపతి.
రూమ్‌కి తిరిగి వచ్చిన రఘుపతి గుండెల్లో పూలు పూస్తున్నాయి. ఎవరైనా తన ప్రతిభని గుర్తించి ప్రశంసించి ఎనే్నళ్ళు అయ్యింది? మళ్లీ ఇన్నాళ్ళకు.. ‘గుర్తింపు!’ ఈ సీరియల్‌లో మంచి గుర్తింపు వున్న రోల్ దొరికితే తన టాలెంట్ చూపించుకోవచ్చు. మరిన్ని సీరియల్స్‌లో మంచి వేషాలు లభిస్తాయి. మళ్లీ సినిమా వాళ్ళూ పిలవవొచ్చు. తనకీ, సరస్వతికీ తిరిగి మంచి రోజులు ఖాయం..
ఒక రోజు గడిచింది.. రెండవ రోజు.. మూడు, నాలుగు, ఐదు.. ఎలాంటి పిలుపూ లేదు. మరో వారం గడిచింది.. పిలుపు లేదు.. అది వస్తుందన్న ఆశ నీరుగారిపోతోంది.
ఓ రోజున రాజుతో, ‘‘నాయనా! పోనీ జూనియర్ ఆర్టిస్టుగా నాకు నువ్విప్పించే రోజువారీ వేషాలయినా….’’ అని అంటూండగానే- రాజు ‘‘ఇప్పుడు మీ గొప్పదనం గురించి అన్ని ప్రొడక్షన్స్‌కీ తెలిసిపోయింది సార్. జూనియర్ ఆర్టిస్టుగా మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళగలను?’’ అన్నాడు నిరాశగా.
మరో పది రోజులు గడిచాయి. అయనా ఎవరి నుంచి పిలుపు లేదు. జూనియర్ ఆర్టిస్టుగా తను ‘పనికిరాట్ట!’ రాజుకి ఇవ్వడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. తిండి లేదు. ఊళ్ళో సరస్వతి తిరిగి అనారోగ్యం పాలైనట్లుగా సమాచారం. తిరిగి వెళ్లిపోయినా కొట్లో గుమాస్తా ఉద్యోగం మళ్లీ దొరకదు. తనని ఎవ్వరూ గుర్తించకపోతేనే హాయిగా వుంది. అయ్యో భగవంతుడా…! ఒక్కోసారి గుర్తింపు కూడా ఇంతలా బాధిస్తుందా? ‘‘నాకీ గుర్తింపు వద్దు దేవుడా!’’ అంటూ ఆకాశంవైపు చూస్తూ గొంతు చించుకుని, కంఠ నాళాలు తెగిపోయేలా అరిచాడు రఘుపతి.. కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా.. ఆ కేకలు దేవుడు విన్నాడో లేదో.. ఆ దేవుడికే ఎరుక!
*
రచయత సెల్ నెం. 8790 11 55 44

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుదిరితే కప్పు కాఫీ..! -శైలజామిత్ర

కుదిరితే కప్పు కాఫీ..!

  • -శైలజామిత్ర
  • 18/04/2015
TAGS:

కథల పోటీలో ఎంపికైన రచన
======================
‘‘ఎంత మాటన్నావు? ఎంత ధైర్యం నీకు? అసలు ఏం చూసుకుని నీకు అంత పొగరు?’’ రొప్పుతూ అన్నాడు శ్రీ్ధర్.
‘‘నా ఇష్టం. నేనెలాగైనా మాట్లాడతాను. నువ్వు మాత్రం తక్కువ మాటన్నావా?’’ అంది జుట్టుకు మరింత గట్టిగా రబ్బర్ బిగిస్తూ రమ.
‘‘నేనేమన్నాను? మా అమ్మకు విలువ ఇచ్చి మాట్లాడమంటే తప్పా? ఏం? ఆమె మీ అమ్మలాంటిది కాదా? రేపు నేను కూడా మీ అమ్మను ఇలా అంతలేసి మాటలంటే నీకు బాధ కలగదా?’’
‘‘మీ అమ్మ మాత్రం నన్ను తిట్టలేదా? నెలకు 50 వేలు సంపాదిస్తున్నది మీ అమ్మదగ్గర – ‘పని రాదు.. కాస్త పని నేర్చుకోవాల’ ని అనిపించుకోవడానికి కాదు. నాకు పనిచేయాల్సిన ఖర్మ ఏం పట్టింది?’’.
‘‘మీ అమ్మ కూడా నన్ను అందిగా. నన్ను పొద్దునే్న లేవమని, వాకింగ్ చేయమని. నేను రాత్రి రెండు గంటలవరకు టీవీ చూడకూడదని.. ఆమె ఎవరు అనడానికి? నా ఇష్టం. నేను ఎలా ఉండాలో మీ అమ్మ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం, ఖర్మ ఏమీ పట్టలేదు. నాకూ 50వేల రూపాయల జీతం వస్తుంది’’ అన్నాడు అదే వాయిస్‌తో శ్రీ్ధర్.
‘‘మా అమ్మ క్రమశిక్షణగా ఉండమంది. మీ అమ్మ పనిచేయమంది. దానికి, దీనికి చాలా తేడా ఉంది’’ అంది అక్కడున్న గ్లాసును దూరంగా విసిరేస్తూ రమ.
‘‘అత్తగారిని గౌరవించే విషయంలో మీ అమ్మ క్రమశిక్షణ నేర్పలేదా?’’ అన్నాడు వ్యంగ్యంగా శ్రీ్ధర్.
‘‘షటప్’’
‘‘యూ.. షటప్’’
ఈ అరుపులు సుశీలమ్మకు మామూలే! రోజూ దేనికో ఒకదానికి ఇలా అరచుకోవడం వీరిద్దరికీ మామూలే. వినలేక, అక్కడ్నించి బయటపడలేక ఎంతో సతమతమవుతోంది పాపం. కలుగజేసుకుందామంటే- కోడలి నుంచి ఏ మాట వినాల్సి వస్తుందోననే భయంతో దూరంగా ఉండిపోతోంది. తన స్నేహితురాలు బిరియానీ తెచ్చిందని చాలా బావుందని చెబితే- ‘నువ్వూ వంట నేర్చుకోమ్మా’ అన్న మాటకు ఇంత రాద్ధాంతం జరగడంతో సుశీలమ్మ బాధపడతోంది. అనవసరంగా వీరిద్దరిమధ్య గొడవకు తాను కారణమైనట్లు కుమిలిపోయింది.
మా కాలంలోనే నయం. ఉండీ లేని కుటుంబమైనా భర్తకు విలువనిచ్చి చెప్పినట్లు వినేవారం. ‘నువ్వెంత? అంటే నువ్వెంత?’ అని ఒక్కనాడైనా అనుకునేవారం కాదు. ఆయన సంపాదనతో ముగ్గురు పిల్లల్ని పెంచినా ఏ రోజూ బతుకు భారంగా అనిపించలేదు. ఇపుడు నేనిక్కడ, ఆయన మరో కొడుకు దగ్గర ఉంటున్న తీరు మరింతగా బరువుగా ఉంది. ఒక్కసారైనా ఇద్దరూ కలిసి ఏదైనా ప్రశాంతంగా ఉండే చోటుకు వెళ్లి బతకాలనిపించగానే భర్త గుర్తొచ్చాడు. మాట్లాడాలనిపించింది. కానీ, అబ్బాయిని ఫోను అడగాలి. అదీ భర్త వద్ద ఉన్న మరో అబ్బాయికి చెయ్యాలి. వీడికిష్టమయితే ఇస్తాడు. వాడికిష్టమయితేనే తండ్రికిస్తాడు. ఆయనక్కడ.. నేనిక్కడ.. అనుకుంటూ భయంగా కూర్చుంది ఒక స్టూలు మీద.
అంతలో శ్రీ్ధర్ సెల్‌ఫోన్ రింగయ్యింది. ‘‘కుదిరితే ఒక కప్పు కాఫీ.. వీలయితే రెండు మాటలు’’- వెంటనే సెల్ ఆఫ్ చేస్తూ ‘‘ఈ రింగ్‌టోన్ ఒకటి. ఇలాంటివి పెట్టుకునే నన్ను పడేశావ్. ఇంకా ఎంతమందిని పడేస్తావ్?’’ అంది ఫోన్ అందుకుని చూస్తూ రమ.
‘‘ఇదిగో.. నోరు కంట్రోల్‌లో పెట్టుకో. నీ ఒక్కదానే్న భరించలేక చస్తున్నాను. ఇక మరొకటా? బుద్ధుంటే ఆ పని చేయను’’ అన్నాడు తన సెల్‌ను లాక్కుంటూ.
‘‘అంటే నేను నీకంత భారమైపోయానా? అపుడే చెప్పాడు మా డాడీ. వద్దు వాడు నీకు సరిపోడని’’ అంది విసురుగా సోఫాలో కూర్చుంటూ.
‘‘మీ నాన్న మాట వినుండాల్సిందే. పీడా విరగడయ్యేది’’ అనేసరికి ఏకంగా భద్రకాళి అయ్యింది. ‘‘ నేనంటే నీకసలు ప్రేమే లేదన్నమాట. మరెందుకు నా వెంట కుక్కలా తిరిగావు?’’
‘‘తిరిగాను. నువ్వుకూడా నా వెంట తిరిగావు కదా? నీది కూడా కుక్క జాతేనా?’’ అంటూ మాటకు మాట పెరిగిపోతూ, చేతికందినవి విసిరేసుకుంటూ, ఇంటి పరిస్థితిని గందరగోళం మార్చేసారు.
సుశీలమ్మకు ఏమీ తోచడంలేదు. ఎదురుగా ఏడుకొండలవాడి పటాన్ని చూస్తూ వేడుకుంది- ‘‘దేవుడా..! వీరినిద్దరికి పొంతన కుదుర్చు. రోజూ ఈ గోల భరించలేకపోతున్నాను’’ అంటూ.
***
ఉదయం లేవగానే కోడలికి కాఫీ అందించింది. ఆమె వౌనంగా తీసుకుంది. టిఫిన్ బాక్స్‌లో బిరియానీ పెట్టానమ్మా. తిని చూడు. నీ కోసం నేర్చుకుని మరీ చేశానని అంది చేతికి బాక్స్‌ను అందిస్తూ.
‘‘మీరు బిరియానీ చేశారా? ఎలా?’ అంది రమ.
‘‘నీకిష్టమని పుస్తకంలో చదివి చేశాను. తిని చూడమ్మా.. బావుంటే ఇంకాస్త ఎక్కువ చేస్తాను’’ అంది మెల్లగా సుశీలమ్మ.
మారు మాట్లాడకుండా చాలని తలూపి వెళ్లిపోయింది. రమ వెళ్లిన కాస్సేపటికి శ్రీ్ధర్ కూడా బయలుదేరబోయేంతలో..
‘‘శ్రీ్ధర్ ఒక్కసారి ఆగు’’ అంది సుశీలమ్మ.
‘‘ఏంటమ్మా?’’
‘‘మరేం లేదురా… చినికి చినికి గాలివాన అవుతుందిరా. ఆ అమ్మాయి ఏదో అందే అనుకుందాం. వినీ విననట్లు వదిలేయ్. ఒకసారి అంటుంది. రెండుసార్లు అంటుంది. మూడోసారి ఊరుకుంటుందిగా.. ఏమంటావు? ఎక్కడో బయటనుండి వచ్చిన అమ్మాయి. మన పద్ధతులు, మనం ఎలా అర్థం అవుతాము? సంసారంలో ఒకరు కోపగించుకున్నపుడు మరొకరు ఊరుకోవడం ఉత్తమం. అర్థమయ్యిందా?’’ అంది చేతికి మంచినీళ్ళు అందిస్తూ తల్లి.
‘‘ఏం.. నేనే ఊరుకోవాలా? ఆడది తను ఊరుకోవచ్చుగా? తనకే అంత అహంకారముంటే మగాడ్ని నాకెంత ఉండాలి?’’ అన్నాడు విసుగ్గా.
‘‘ఏం చేద్దాం? సంపాదనంటూ వీధుల్లో పడినపుడు ఇక ఆడ, మగ ఏంటి? అంతా సమానమే. ఆర్థిక స్వాతంత్య్రం వచ్చాక ఇపుడు మీరు స్నేహితుల్లా మెలగాలి తప్ప ఇక మగ, ఆడ అనే తేడాలు పెట్టుకోకూడదు’’ అనగానే ‘‘సరేలే, చూద్దాం’’ అంటూ బయలుదేరబోయాడు.
‘‘ఓరేయ్ శ్రీ్ధర్’’
‘‘మళ్ళీ ఏంటి?’’
‘‘మీ నాన్నని గుడికి రమ్మనరా. చూసి చాన్నాళ్లయ్యింది’’ అంది మెల్లగా సుశీలమ్మ.
‘‘అలా అంటే ఎలాగమ్మా? ఈ రోజు ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు వంట బాగా చేస్తావని గొప్పగా చెప్పాను. రేపో.. ఎల్లుండో..?’’ నసిగాడు శ్రీ్ధర్.
‘‘అలాగా! అయితే సరేలేరా! మీకు పెళ్ళయ్యాక మీ స్నేహితులకంటూ ఏమీ చేయలేదు. సరే మీరేమి వండమంటారో చెబితే…’’ అంది మెల్లగా ఇక తప్పదన్నట్లు.
‘‘కొడుకు చెప్పిన లిస్టు అందుకుని ఈసురోమంటూ వంటింట్లోకి నడిచింది. ఆడదానికి అందునా ఉద్యోగం లేని ఆడవారికి చచ్చేంతవరకూ వంటిల్లే జీవితం అన్న భర్తమాటలు నిజమేననిపించింది.
***
‘‘ఒరేయ్! చిన్నోడా!’’
‘‘ఆ…! ఏంటి నాన్నా?’’
‘‘ మీ అమ్మను చూడాలని ఉంది.. గుడి దగ్గరకు రమ్మంటే’’ అని నసిగాడు.
‘‘ఈ రోజా..? కుదరదు నాన్నా! ఈ రోజు మీ కోడలు విద్య పుట్టిన రోజు. సాయంత్రం చిన్న పార్టీ అని అందర్నీ పిలిచాను. పిల్లలకు హోంవర్క్ చేయించాలి. సాయంత్రం అంతా చాలా హడావుడిగా ఉంటాము. ప్లీజ్.. మరోసారి..’’ అన్నాడు రిక్వెస్టింగ్‌గా.
‘‘సరేలేరా మరెప్పుడైనా..!’’ అని లోనికి వెళ్లాడు దిగులుగా తండ్రి ఆంజనేయులు.
ఆంజనేయులుకు ఇది కొత్త కాదు. తల్లిని ఒకరు, తండ్రిని ఒకరు ఇంట్లో పెట్టుకుని పోషిస్తామన్నారు కొడుకులిద్దరూ. ఆరు నెలలు దాటాక ఇద్దరూ ఇల్లు మారాలట. అంటే పెద్దకొడుకు దగ్గర ఉన్న తల్లి చిన్నకొడుకు దగ్గరకు, చిన్నకొడుకు దగ్గరున్న తండ్రి పెద్దకొడుకు దగ్గరకు మారాలి తప్ప, ఏ ఒక్కరోజూ- ‘‘మీరిద్దరూ ఎపుడు కలిసి మాట్లాడుకుంటారు?’’ అనే మాటే లేకపోవడం ఇద్దరినీ మరింత కుంగదీస్తోంది. పోనీ విడిగా ఉందామా? అంటే వేలకొద్దీ అద్దెలు కట్టుకునే స్థాయి లేదు. వచ్చే పదివేల రూపాయల పెన్షన్ అన్నింటికి సరిపోదు. ఏదైనా హోంలో చేరుదామంటే ఇద్దరినీ రానియ్యరట. అందులోనూ స్ర్తిలది వేరు, పురుషులది వేరు. అక్కడా ఇదే రాత. విడిగా జీవిద్దామనుకుంటే ఏ క్షణంలో ఏ జబ్బు వచ్చేస్తుందో, అపుడు వారు చేరదీస్తారో లేదో అని సుశీలమ్మ బాధ. ఆమె బాధతో ఇష్టం లేకున్నా భరించక తప్పడం లేదు ఆంజనేయులకు కూడా.
అందుకని ఎప్పుడో ఒక రోజు కుదిరితే మాట్లాడుకుంటూ, పిల్లల విషయాలను చర్చించుకుంటూ గడుపుతారు. వృద్ధాప్యం అంటే- వీరి నడుములేమీ వంగిపోలేదు. అలాగని గట్టిగానూ లేవు. కన్నకొడుకుల ప్రవర్తనతో మనసు మాత్రం కుంగిపోయింది. సరే అనుకుని ఎప్పటికప్పుడు సర్దుకుపోతున్నారు. ఎపుడెపుడు సుశీలను చూడాలా? అని ఆంజనేయులు, భర్తను చూసి ఎంతకాలమయ్యిందో? అని సుశీల జీవితాలను గడిపేస్తున్నారు.
***
రమకు తెలియని ఆవేదనగా ఉంది. ఎంత వద్దనుకున్నా ఏదో వెలితి. శ్రీ్ధర్ ఎంతగా ప్రేమించానన్నాడు? తాను లేకపోతే చనిపోతానని కూడా అన్నాడు. ఇపుడేమో అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని అంటున్నాడు. అంత మాట అనడానికి కారణం నేనేనా? పెళ్ళయి ఆరు నెలలు తిరక్కుండానే ఇంతలా పోట్లాడుకుంటుంటే ఇకపై జీవితం? పోనీ విడాకులు తీసుకుంటే?.. అమ్మో! శ్రీ్ధర్ లేకుండా తన జీవితమా? కుదరదేమో! ఒకవేళ అది జరిగినా మళ్లీ పెళ్లి.. మళ్లీ వచ్చేవాడు కూడా ఇలానే ఉంటే? ఇలా వదులుకుంటూ పోవడమేనా జీవితం? నోనో.. అనుకుంటూ తన సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకుంది రమ శ్రీ్ధర్‌కు సారీ చెబుదామని. కానీ… మళ్లీ ఫోన్ తీయకుండా ఉంటే తనకెంత అవమానం? అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అత్తగారు గుర్తుకురాగానే పాపం..! తనకోసం బిరియానీ నేర్చుకుని వండిందంటే నేనంటే ఎంత ప్రేమో కదా? పైగా నచ్చుతుందో లేదో అనే భయం. నేనే తొందరపడుతున్నానా ఆమె విషయంలో… అనుకుంటూ బస్సులో ప్రయాణమంతా గడిచిపోయింది.
ఇక్కడ శ్రీ్ధర్ పరిస్థితీ అంతే! రమని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అపుడు వంట రాదని తెలుసు కూడా. అపుడు రాని కోపం ఇపుడెందుకు వస్తోంది? తనలానే చదువుకుంది. వంట నేర్చుకునే సమయం ఎక్కడుంది? తనకిష్టమని ఈ రింగ్ టోన్ పెట్టుకున్నాడు. ఈ రోజు ఇదే రింగ్ టోన్ తనకింత అసహ్యం అయ్యిందంటే తన ప్రవర్తనే కారణం అనిపిస్తోంది. జీవితమంటే రింగ్‌టోన్ పెట్టుకున్నంత సులభం కాదు కదా? ఛ! పెళ్ళయి ఆరునెలలు తిరగకుండానే ఇద్దరిమధ్య ఇంత అగాధమా? వద్దు. ఇద్దరూ విడాకులు తీసుకుంటే… అమ్మో! రమ లేకుండా తను ఎలా బతకగలడు? ఎన్ని ఏళ్ళు వెంటపడి పెళ్లి చేసుకున్నాడు? ఇపుడు నలుగురిలోనూ నవ్వులపాలు అవ్వడమే కాదు. ఇకపై జీవితంలో ఎవరినీ ఆహ్వానించలేడు. తర్వాత పెళ్లి చేసుకున్నది కూడా ఇలానే ఉంటే? ఇలా కాదనుకుంటూ పోతుంటే ఇక మిగిలేది ఏముంది? అనుకున్న మరుక్షణం వెంటనే చెయ్యి ఫోన్ మీదికి వెళ్లింది. రమకు క్షమాపణ చెప్పాలని.. ఏమో! మళ్లీ ఇదో నాటకమా అంటే? అని అనుకుంటుంది. వెంటనే తల్లికి ఫోన్ చేశాడు. ‘‘అమ్మా! నువ్వు సాయంత్రం రెడీగా ఉండు, గుడికి పంపుతాను’’ అన్నాడు మొదటి మార్పుకు నాంది పలుకుతూ.
***
‘‘బావున్నారా? అరగంట నుండి వేచి చూస్తున్నాను. ఇంత ఆలస్యమైతే ఎలా? అంది మూతిని తిప్పుతూ సుశీల.
‘‘నాకేం గుండ్రాయిలా ఉన్నాను. నువ్వెలా ఉన్నావోయ్ ముసలీ’’ అంటూ నవ్వాడు ఆంజనేయులు.
‘‘అప్పటికి మీరేదో కుర్రాడయినట్లు’’ అంది నవ్వుతూ.
‘‘నేనెప్పుడూ కుర్రాడినే. అసలు మన పిల్లలకు మనం థాంక్స్ చెప్పాలోయ్’’
‘‘ఎందుకూ? మనల్ని ఇలా విడదీసినందుకా?’’ అంది కోపంగా.
‘‘విడదీశారని ఎందుకు అనుకుంటున్నావు? మనల్ని ప్రేమికుల్ని చేశారనుకుని చూడు. వారిమీద నీకు కోపమే రాదు’’ అన్నాడు నవ్వుతూ.
‘‘మనల్ని ప్రేమికుల్ని చేయడమేంటి? విడ్డూరం!’’ అంది చెంపలు నొక్కుకుంటూ.
‘‘కాకపోతే మరేమిటి? నువ్వేమో గుడి దగ్గర ఎదురుచూడటం, నేను కాస్త ఆలస్యంగా వస్తే- ఇంత లేటా? అని నువ్వు అలగటం, నువ్వు ఏదయినా స్వీటు వండితే కొంగులో దాచుకుని వచ్చి నాకివ్వడం, నేను ఏదో ఇవ్వడం.. ఇలా మనల్ని ఏకంగా యాభై ఏళ్ళ వెనక్కు తీసుకెళ్లి డ్యూయెట్లు పాడుకునేలా చేశారంటే- అంతా వారి గొప్పదనమే కదూ?’’ అన్నాడు బిగ్గరగా నవ్వుతూ.
‘‘్ఛ! అవేం మాటలండీ? ఎవరైనా వింటే నవ్విపోతారు’’ అంది సిగ్గుపడుతూ.
‘‘ఇందులో నవ్వుకోవడానికి ఏముందే పిచ్చిదానా? అసలు ప్రతి తల్లిదండ్రులు ఇలా అనుకుంటే అసలు సమస్యే రాదు’’ అన్నాడు ఆంజనేయులు.
ఇందాక బయలుదేరేటపుడు అబ్బాయి అన్నాడు- ‘‘అమ్మా.. ఇకపై మీ ఇద్దరూ కలిసి ఉండేలా ఏర్పాటుచేస్తాము. మిమ్మల్ని విడదీసిన పాపమే మా మధ్య అపార్థాలకు కారణమవుతుందేమో! ఈ విషయం తమ్ముడితో మాట్లాడతా.. ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండండ’’ని అన్నాడు. అంతా ఆ ఏడుకొండలవాడి దయ… అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ సుశీల.
‘‘అంత మాటన్నాడా? వాడికెంత ధైర్యం? ఇపుడిపుడే ప్రేమించుకుంటున్న మనల్ని మళ్లీ భార్యాభర్తల్ని చేసేస్తానంటాడా? అందుకు నేనొప్పుకోను… అంతే..!’’ అన్నాడు చిన్నపిల్లాడిలా ఆంజనేయులు.
‘‘మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మనం భార్యాభర్తల స్థాయి నుంచి తల్లిదండ్రుల స్థాయికి ఇపుడు తాతా నానమ్మల స్థాయికి వచ్చాము. ఇంకా మీతో గొడవలంటే నావల్ల కాదంతే..’’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వడంతో అక్కడున్న చల్లని వాతావరణంలా వారి మనసులు హాయిగా నవ్వుకున్నాయి.
*

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏడుకొండలవాడికి ఆరువేల ఎకరాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒక నిశ్శబ్ద పోరాటం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఐ ,మీ ,సేల్ఫీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గజేంద్ర మోక్షం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విగతుడు విచారణ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేలమట్టమైన నేపాల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతీ యతీశ్వరుల 13వ ఆరాధనోత్సవములు

ఆస్తిక  మహాశయులకు నమస్కారం,

మీ సంపూర్ణ సహాయ సహకారాలవల్ల శ్రీ శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతీ యతీశ్వరుల 13వ ఆరాధనోత్సవములు, ఈ సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ నాడు  (ది 21-04-2015 న) హైదరాబాదు యందు విజయవంతంగా జరిగాయని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము. సార్వజనీన సభలో భాగంగా బ్రహ్మశ్రీ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ గారికి శ్రీ జనార్దానానంద సరస్వతీ పురస్కారప్రదానం జరిగింది. అలానే శ్రీ శిష్టి లక్ష్మీకుమారశాస్త్రి గారు, శ్రీతూములురు శాయినాథ  శర్మ గారు, శ్రీ కుప్పా కృష్ణముర్తి గారు, శ్రీ  పసుమర్తి బ్రహ్మానంద శర్మ గారు శ్రోతలనుద్దేశించి ప్రసంగించారు.

సభా కార్యక్రమ ఫోటోలు జతచేయటమైనది.

మీకు శ్రీ గురుదేవుల పరిపూర్ణ అనుగ్రహం లభించాలని ఆకాంక్షిస్తూ ,

తూములురు శాయినాథ  శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతీ  స్వామి సంస్మృతి ట్రస్ట్, +91-94905-13438 
పసుమర్తి బ్రహ్మానంద శర్మ, శ్రీ జనార్దనానంద సరస్వతీ  స్వామి సంస్మృతి ట్రస్ట్ , +91-98490-11009

కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి, శ్రీ వేదవ్యాస పాఠశాల, +91-40-6444-8800

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-4

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-4

అమెరికా ప్రయాణం –ఇంగ్లీష్ ఆయన సాయం

అమెరికా ప్రయాణం అంటే అంత ‘’వీజీ కాదు ‘’.ఇంటినుంచి మద్రాస్ చేరిన రామయ్యగారు ఇదివరకే కలిసిన ఇంగ్లీష్ ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టారు .రామయ్యగారికి అన్నిటికంటే ఉన్న విద్యా తృష్ణ కు ముచ్చటపడ్డారు .ఆయన స్పష్టంగా అర్హత ఉన్నవాడు తప్పక విజయం పొండుతాడనే నమ్మకం లేదన్నారు .రామయ్యగారి వద్ద ఉండాల్సినంత డబ్బు లేదని తెలిసింది ఆయనకు .కనుక ‘’గర్వం గుర్రానికి’’ కళ్ళెం వేయాలని చెప్పాడు .పులి అవతారం ఎత్తేదాకా జాగ్రత్తపడాలని గుంటనక్కలు ఎప్పుడూ చీకట్లో కనిపించకుండా వెటాడతాయని జాగ్రత్తలు చెప్పారు .నిర్మొహమాటంగా తానేమీ రామయ్యగారి తరఫున వకాల్తా పుచ్చుకోనేవాడిని కానని  ,దానగుణం తనకు లేదని తానూ బ్రిటిష్ వాడినని ,తన పూర్వీకులు సేల్ట్ లను ఓడించిన మొనగాళ్ళని ,తన తాత బెంగాల్ ,మద్రాస్ లను లోబరచుకొన్న లార్డ్ క్లైవ్ సహచరుడని ,అయినా తానూ రామయ్య గారికి ఎందుకు సాయం చేస్తున్నాడంటే తనకు ఆ సామర్ధ్యం ఉండటం వల్లనేనన్నాడు .బెంగాల్ వికసిన్చినట్లే ఇప్పుడు మద్రాస్ కూడా అభివ్రుద్ధిమార్గం లో ఉందని కనుక నాగరికతా విస్తరణలో తనకు ఆనందం ఉందని అన్నాడు .ఒకప్పుడు పకడ్బందీ గా సాగు వ్యవస్థ బెంగాల్ లో ఉండేదని ఈ మధ్య అక్కడికి వెళ్లి చూస్తె అంతా దరిద్రం తాండ విస్తున్నట్లు కనిపించి గుండె చెరురువైన్దన్నాడు. హిందువులను ఏడిపించే ఇంగ్లీష్ వాడికి శాపం తగుల్తుందని ,అందుకే ఈ కొంచెం సాయం చేస్తున్నానన్నాడు

యువభారత్ లో కొత్త యుగం వస్తుందని చెప్పాడు .కొత్త విషయాలెన్నో వచ్చి తలుపు తడతాయన్నాడు .వాటి ఫలితాలను ఎవరు ఎక్కడ ఉన్నా అందుకోవాలి .అలా మేము చేయలేకపోతే వారిని నాశనం చేసిన వాళ్ళం అని పించుకోవాల్సి వస్తుంది .’’నువ్వు నా తలుపు తట్టడం  నూతన భారతం నా ఇంటి తలుపు తట్టినట్లుగా అనిపిస్తోంది .నీకు సహాయం చేయటానికి మరో కారణం’’ నువ్వు నాకు నచ్చావ్’’ .’’అని అభినందించి సిఫార్సు ఉత్తరాలు అందజేశాడు రామయ్య గారికి .

ఈ సంఘటన తర్వాత రామయ్య గారు మనసులో కొంత మధన పడ్డారు .తాను ఈ ఇంగ్లీష్ వాడి దగ్గరకు ఎందుకు బిచ్చం కోసం వచ్చానా అని వితర్కి౦చు కొన్నారు .కాదని సమాధాన పడ్డారు .ఆయన చాలా నిర్మోహ మాటం  గా నిర్దుష్టం గా నిష్కర్ష గా చెప్పినవన్నీ సత్యాలే .ఆయనలో మంచితనం కనిపించింది .దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఆయనకు తెలుసునని వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని ఆయన కోరికగా అర్ధం చేసుకొన్నారు .సమస్యలను సామరస్యం తో సానుకూలంగా పరిష్కరించుకోవాలన్నది ఆ ఇంగ్లీష్ ఆయన తత్త్వం గా అర్ధం చేసుకొన్నారు .తాను  ఏమీ తప్పు చేయలేదని తన మార్గం రాజమార్గమేనని నమ్మకం కలిగింది .ఈ బ్రిటిష్ వాడు గర్వాన్ని వదిలేసి చాలా వినమ్రంగా ఉండటం రామయ్యగారిని బాగా ఆకర్షించింది .ఒకప్పుడు తండ్రిగారు తనను ఇంగ్లీష్ యూని వర్సిటీలో ఏమి చదువుకొంటావు అని ప్రశ్నిస్తే తాను ఠక్కున   కేమిస్త్రి, ఫిజిక్స్ ,గణితం అని   జవాబు చెప్పిన మాట గుర్తుకొచ్చింది .హూణులకు అంతటి విజ్ఞానం ఉందా అని తండ్రి ఆశ్చర్య పోయారట .

ప్రయాణ సన్నాహం

ఇప్పటిదాకా ఉన్నమద్రాస్ జీవితం తనకు జాతి వివక్షత గురించి మంచి చెడులగురించి పాఠాలు బోధించింది . ఒక రోజు ఓడరేవు దగ్గర కొందరు మాట్లాడు కొంటు౦డగా దగ్గరకు వెళ్లి విన్నాడు .అందులో ఒక బ్రాహ్మణపండితుడు  ,తెల్లవాళ్ళు ,మాల్గాసీ ,మొదలైన వారున్నారు. ఆ పండిట్ మిగిలిన వారితో కలిసి బీరు కొడుతున్నాడు. అయితే వారు  భేదభావం లేకుండా ఉన్నారని అర్ధమయ్యింది .ఇలా చూడటం ఇదే జీవితం లో మొదటిసారి .అందరూ ఒకే కప్పుతో  మందు కొడుతున్నారు .ఇంక ఎక్కడి డిగ్నటి ?అనిపించింది .

టీచర్ గారి జ్ఞాన బోధ

అక్కడ ఒక టీచర్ కూడా ఉన్నాడు .రామయ్యగారు అతనితో తన అమెరికా ప్రయాణం గురించి చెప్పుకొన్నారు .ఈయన ఏర్పాట్ల గురించి ఆయన తెలుసుకొన్నాడు .’’నాయనా నీ దగ్గర గౌరవం గా ఓడలో ప్రయాణం చేసేంత డబ్బు ఉన్నట్లు లేదు .ప్రయాణం చేయటమేకాడు నాయనా లంచాలివ్వటానికి ,పోలీసులనుంచి, కాపాడుకోవటానికి డబ్బుకూడా సంపాదించుకోవాలి .ఒక ఉపాయం ఉంది చెబుతాను .నేను నావ కెప్టెన్ తో మాట్లాడి ,నీతో కొంత పని చేయించుకొంటూ తీసుకొని వెళ్ళమని నచ్చ చెబుతాను .అలా అమెరికా చేరుకోవచ్చు .ఏదో డబ్బు విపరీతంగా వచ్చి మీద పడుతుంది అని అనుకోవద్దు .అమెరికాలో కూడా నిన్ను విదేశీయుడిగానే చూస్తారు .ఇంగ్లీష్ వారికన్నా ‘’యాంకీలు ‘’పొడిచేసిన్దేమీలేదు .ఒక విషయం గుర్తుంచుకోబాబు ! ప్రజలు కులాల వలన ,రంగు వల్లవిభజింప బడలేదు తెలుసా ?వాలెట్ అంటే జోలె వల్లనే విడగొట్ట బడతారు అని నీతి బోధ చేశాడు .ఇతర ప్రయాణీకులతో కలిసి మెలిసి ఉండు .తెల్ల వారందరూ  శత్రువులు కాదు , నీజాతి వాళ్ళంతా మంచి వారూకాదు అని తెలుసుకో ముందు .కాళీమాత దయ తో ఏదో కొంత సంపాదించుకో .’’అన్నాడు .

పౌరుషం పొడుచుకొచ్చింది రామయ్యగారికి ‘’నా దగ్గర రెండు వేలరూపాయలున్నాయి  నాకు దేవుడిమీద నమ్మకం లేదు తెలుసా ?’’అన్నారు గర్వంగా .అప్పుడాయన నవ్వి మంచిదేనని తనను గురించి అంత గొప్పగా ఊహించుకోవద్దని ,బుర్ర  ,కాళ్ళు  చేతులు సరిగా ఉపయోగించమని చెప్పాడు. స్నేహితులు లేకుండా కూడా  రాణించలేవు అనీ అన్నాడు .అక్కడ అమెరికాలో వాళ్ళ ముందు శాకాహారం తో ఉండగలనా అని ప్రశ్నించారు రామయ్య .అప్పుడాయన ‘’ఇండియా వదిలి వేడుతున్నావు అంటే విశాల హృదయం తో ఆలోచించటం ,ప్రవర్తించటం నేర్చుకో .బృహదారణ్యక లోను ఋగ్వేదం లోను మాంస భక్షణ ఉందన్నాడు .బియ్యం ఉడికిస్తే జీవాన్ని చంపెసినట్లే అలాగే బీఫ్ తినటం కూడా అన్నాడు ఈ మాటలు రామయ్య గారిని ఆశ్చర్య  చకితుల్ని  చేశాయి .మళ్ళీ ఆ టీచర్ ‘’నువ్వు మనుషుల మధ్య జీవిస్తున్నావని గ్రహించు ‘’అన్నాడు .ఇన్ని విరుద్దాల మధ్య ఎటూ తేల్చుకోలేక పోయారు ఆ క్షణాన .

మోసం గురో

ఆ టీచర్ మర్చంట్  షిప్ కెప్టెన్ తో రామయ్యగారికి ముందే చెప్పినట్లు మాట్లాడి ఒప్పించి  ఎక్కిన్చుకోనేట్లు చేశాడు .తనదగ్గరున్న డాలర్లను జాగ్రత్త చేసుకోమన్నాడు .ఇక్కడే రామయ్యగారు పప్పులో కాలేశారు .కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద తనలాగే అభిరుచిబాగా ఉన్న ఒక స్టూడెంట్ కూడా తనతో వస్తానంటే సరేనన్నారు .అతడు ఇతరులతో రామయ్యగారు సంభాషించే అణువులు ,వాటి మార్పులు వగైరా వాటిని వినేవాడు. ఆసక్తి చూపేవాడు ఆతను మలబారీ వాడు గోవాలో పెరిగాడు . కాని అతనికుటుంబం  శ్రీలంక లో ఉంది. ఆతను .కేధలిక్ క్రిస్టియన్ .మద్రాస్ లోని సాన్ తోమే చర్చ్ నుండి యూవివర్సిటిలో చేరినవాడు .చాందస సభావాలు బాగా ఉన్న మలయాళీ అతను .ఆ భాష అంటే రామయ్యగారికి సంగీతం విన్నంత హాయి అనిపిస్తుంది .అ భాష నేర్చుకోవాలని కూడా అనుకొన్నారు .తాను  కొలంబో లో ఎక్కుతానని చెప్పి రామయ్యగారి దగ్గరున్న రెండు వేల రూపాయలను డాలర్లుగా మార్చుకు వస్తానని చెప్పి వెళ్ళాడు .యెంత సేపు చూసినా తిరిగి రాలేదు .అప్పుడు పోర్ట్ లో  టీచర్ చెప్పిన ‘’తెల్లవారంతా శత్రువులుకాదు ,నీవారందరూ స్నేహితులూ కారు’’ అన్నమాట గుర్తుకొచ్చింది .వాడు జంప్ జిలానీ .యూని వర్సిటీలోను , కేథలిక్ మిషన్ దగ్గారా వెతికారు. ఎక్కడా మళ్ళీ  కనిపిస్తే ఒట్టు .ఈ విషయం టీచర్ కు తెలియ జేశారు .ఆయన స్నేహితులనుండి కొలంబో వరకు సరిపడా టికెట్ డబ్బులు వసూలు చేసి ఇచ్చాడు .అక్కడ బహుశా ఆ మలబారీ వాడు కనపడవచ్చని రామయ్యగారి షిప్ నే వాడూ ఎక్కవచ్చని కొంచెం ధైర్యం చెప్పాడు .రామయ్య గారికి ‘’బాన్ వాయెజ్ ‘’చెప్పటానికి ‘’’’నా అన్నయ్య’’ అనంత రామయ్య గారు వచ్చారు .ఇలా చేతిలో చిల్లిగవ్వ లేకుండా రామయ్యగారు 1921 లో అమెరికా ప్రయాణానికి ఓడ ఎక్కారు ..

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-4-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

25-4-15 శనివారం మచిలీపట్నం లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ మద్దూరి విశ్వం గారింట్లో ”ప్రధానోపాధ్యాయ మార్గదర్శి ”శ్రీ సోమంచి రామంగారి దంపతులకు మాజీ ప్రధానోపాధ్యాయ బృందం చేసిన సత్కారం

25-4-15 శనివారం మచిలీపట్నం లో రిటైర్డ్ హెడ్ మాస్టర్ మద్దూరి విశ్వం గారింట్లో ”ప్రధానోపాధ్యాయ మార్గదర్శి ”శ్రీ సోమంచి రామంగారి దంపతులకు మాజీ ప్రధానోపాధ్యాయ బృందం చేసిన సత్కారం .మరియు శ్రీ కోసూరు ఆదినారాయణ గారి జన్మ దినోత్సవ సందర్భంగా ఆదినారాయణ  దంపతులతో బాటు మా దంపతులకూ విశ్వం దంపతుల సన్మానం .

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

25-4-15 శనివారం మచిలీపట్నం లో శ్రీ కోసూరు ఆదినారాయణ గారి మనవడు – అనిరుద్ ఉపనయన చిత్రమాలిక 

25-4-15 శనివారం మచిలీపట్నం లో శ్రీ కోసూరు ఆదినారాయణ గారి మనవడు – అనిరుద్ ఉపనయన చిత్రమాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

24-4-15 శుక్రవారం సాయంత్రం ఉయ్యూరు శాంతినికేతన్ హైస్కూల్ వార్షికోత్సవ సభ చిత్రాలు 

24-4-15 శుక్రవారం సాయంత్రం ఉయ్యూరు శాంతినికేతన్ హైస్కూల్ వార్షికోత్సవ సభ చిత్రాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పతంజలి మహర్షి యోగ శాస్త్ర బోధనా -రచన గురు రవిశంకర్ మరియు యక్ష ప్రశ్నలు -జవాబులు

యోగ జ్ఞానం ఒక బహుమతి
ఇంతలో మరొకరికి ఉత్సుకత కలిగింది. ‘‘తెర వెనుక గురువుగారు ఏం చేస్తున్నారో నేను చూడాలి’’. ఇక ఉత్కంఠ భరించలేక తెర పైకెత్తి చూశాడు. మరుక్షణమే అక్కడ ఉన్న 999 మంది శిష్యులూ కాలి బూడిదైపోయారు. దాంతో పతంజలి చాలా విచారించాడు. తన జ్ఞానాన్ని సంపూర్ణంగా   వారికి తెలియజేయాలని అతడు ఆశించాడు. తీరా చూస్తే ఇలా జరిగింది.

అదే సమయంలో, లఘుశంకకు బయటకు వెళ్ళి కుర్రవాడు తిరిగివచ్చాడు. నువ్వెక్కడికి వెళ్లావని
అతడిని పతంజలి అడుగగా, ఆ కుర్రవాడు జరిగింది చెప్పి క్షమించమని వేడుకున్నాడు. పతంజలి దయతో అతడిని క్షమించి, ఈ ఒక్కడైనా మిగిలాడని అనుకున్నాడు. యోగ సూత్రాలలోని మిగిలిన భాగమంతా పతంజలి ఆ శిష్యునికి బోధించాడు. అక్కడికి విద్య పూర్తి అయింది కాని, ఈ శిష్యుడు నియమాన్ని అతిక్రమించి తప్పు చేశాడనే విషయం పతంజలి మర్చిపోలేదు. దానికి శిక్ష అనుభవించాల్సి ఉంది. కాబట్టి ‘‘నువ్వు బ్రహ్మరాక్షసుడిగా మారి ఆ చెట్టుకు వేలాడు’’ అని ఆదేశించాడు. తన జ్ఞానాన్ని మరొక శిష్యునికి బోధించినపుడు అతడికి శాపవిముక్తి కలుగుతుందని చెప్పి పతంజలి మహర్షి అదృశ్యమైనాడు.
ఇక బ్రహ్మరాక్షసుడు ఆ చెట్టుకు వేలాడుతూ ఉండి దారిన పోయేవారిని ఒక ప్రశ్న అడిగేవాడు. వారు సమాధానం చెప్పలేకపోతే వారిని తినివేసి తన ఆకలిని తీర్చుకునేవాడు. అంతకంటే వేరే గత్యంతరం లేకపోయింది. కొన్ని వేల సంవత్సరాల పాటు ఇదే కథ సాగింది. అతడి వద్ద విద్య నేర్చుకునేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. అతడు బ్రహ్మరాక్షసుడిగానే చాలా కాలం ఉండిపోవలసి వచ్చింది. ఈ కథనుండి మనం నేర్చుకునే నీతి ఏమిటి? గొప్ప జ్ఞానం కలిగినవారు ఎవరైనా తప్పు చేసినపుడు బ్రహ్మరాక్షసుని వంటి స్థితిని పొందుతారు. తెలివితేటలు బాగా ఉన్నవారు నేరస్తులు కావటం అనేది అమాయకులు నేరం చేయటం కంటే ఎక్కువ ప్రమాదకరం. మరి విజ్ఞానం అంతా తెలుసుకున్న మనిషి నేరాలు చేయటం మొదలుపెడితే అది చాలా చాలా హానికరం కదా.
అలా చాలాకాలం పాటు బ్రహ్మరాక్షసుడు శాపవిమోచనం కోసం ఎదురుచూస్తూ ఉండటం చూసి దయాహృదయుడైన పతంజలి మహర్షి తానే ఒక శిష్యుని రూపంలో వచ్చి అతని వద్ద విద్య నేర్చుకుని దానిని తాళపత్రాలపై రాశాడు. ఒక్కో శిష్యుని ఉద్ధరించడానికి సాక్షాత్తూ గురువే శిష్యుని రూపంలో వస్తాడని దీని భావం.
బ్రహ్మరాక్షసుడు ఏ చెట్టుపైనైతే కూర్చొని ఉన్నాడో ఆ చెట్టుపైనే పతంజలి కూడా కూర్చొని యోగసూత్రాలను లిఖించాడు. రాక్షసులు నిశాచరులు కాబట్టి పాఠం రాత్రిపూటే సాగేది. బ్రహ్మరాక్షసుడు చెప్తూ ఉండగా పతంజలి ఒక్కో ఆకునూ కోసి, తన చేతిపై చిన్న గాటు పెట్టుకుని స్రవించిన రక్తంతో ఆ ఆకుపై రాసేవాడు. ఇలా ఏడురోజుల పాటు విద్య సాగింది. పూర్తయ్యేసరికి పతంజలి అలసిపోయాడు. అప్పటివరకూ రాసిన ఆకులన్నిటిని ఒక గుడ్డలో చుట్టి చెట్టుకింద పెట్టి తాను స్నానానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఒక మేక ఆ ఆకులను చాలా భాగం తినివేస్తూ కనిపించింది. చేసేదేమీ లేక పతంజలి ఆ మిగిలిన ఆకులనే తీసుకుని వెళ్ళాడు. ఆ కొద్ది భాగమే మనకు లభించిన పతంజలి యోగ. అదీ కథ!
శ్రీశ్రీశ్రీ రవి శంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు

2 చిక్కు ప్రశ్నలు.. వాటికి ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు – 2వ భాగం

మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షప్రశ్నలకు ఒక ప్రత్యేక స్థానముంది. పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని- నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఒక అశరీరవాణి- “నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు” అని హెచ్చరిస్తుంది. దీనిని పట్టించుకోకుండా- నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు. చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. అశరీరవాణి మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.. కిందటివారం 35 ప్రశ్నలు, వాటి జవాబులు తెలుసుకున్నారు. ఈ వారం మరికొన్ని…

36. సుఖాల్లో గొప్పది ఏది? జ. సంతోషం

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? జ. అహింస
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? జ. మనస్సు
39. ఎవరితో సంధి శిధిలమవదు? జ. సజ్జనులతో
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? జ. యాగకర్మ
41. లోకానికి దిక్కు ఎవరు? జ. సత్పురుషులు
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?  జ. భూమి, ఆకాశములందు
43. లోకాన్ని కప్పివున్నది ఏది? జ. అజ్ఞానం
44. శ్రాద్ధవిధికి సమయమేది? జ. బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
45. మనిషి దేనిని విడచి స్వ్రజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును?

జ. వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో…

46. తపస్సు అంటే ఏమిటి? జ. తన వృత్తికుల ధర్మం ఆచరించడం
47. క్షమ అంటే ఏమిటి? జ. ద్వందాలు సహించడం
48. సిగ్గు అంటే ఏమిటి? జ. చేయరాని పనులంటే జడవడం
49. సర్వధనియనదగు వాడెవడు? జ. ప్రియాప్రియాలను సుఖ దుఃఖాలను సమంగా ఎంచువాడు
50. జ్ఞానం అంటే ఏమిటి? జ. మంచి చెడ్డల్ని గుర్తించగలగడం
51. దయ అంటే ఏమిటి? జ. ప్రాణులన్నింటి సుఖము కోరడం
52. అర్జవం అంటే ఏమిటి? జ. సదా సమభావం కలిగి ఉండటం
53. సోమరితనం అంటే ఏమిటి? జ. ధర్మకార్యములు చేయకుండుట
54. దుఃఖం అంటే ఏమిటి? జ. అజ్ఞానం కలిగి ఉండటం
55. ధైర్యం అంటే ఏమిటి? జ. ఇంద్రియ నిగ్రహం
56. స్నానం అంటే ఏమిటి? జ. మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-3

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-3

మదనపల్లి లో విద్యాభ్యాసం –డిగ్రీ పొందటం

ఉయ్యూరు ఇంట్లో నుంచి అడుగు బయట  పెట్టినప్పుడు ‘’నా పాదాలు తప్పనాకు  తో తోడువచ్చేవారు లేరు ‘’అన్న వైరాగ్యభావన కలిగింది రామయ్యగారికి .తాను సంప్రదాయ కుటుంబం లో నుంచి వచ్చినవాడిని అయినా అన్ని కట్టు బాట్లు త్రెంచుకొంటున్నాననే గుబులు గుండెలో ఎక్కడో ఒక మూల గూడు కట్టింది .మద్రాస్ లో ఆ ఆంగ్లేయునికి ఇంటికి వెడితే మర్యాద పూర్వక స్వాగతమే లభించింది .కుర్రాడు లోలోపల ఇబ్బంది పడుతున్నాడని గ్రహించి ‘’అలంటి కుగ్రామం నుంచి ఇంత దూరం వచ్చావ్.అంటే నూతన భారత ఉషోదయం జరిగిందన్నమాట .ఇండియా జాగృత మౌతో౦దన్నమాట .కాని ఎలా మలచుకోవాలో తెలీని స్తితిలో ఉంది దేశం .పెద్ద చదువులు చదవాలన్న అభిలాషకు నువ్వు మొదలూ కాదు ,చివరివాడివీకాదు.నా మీద ఆశతో వచ్చావు .ఈ సిఫార్సు ఉత్తరానికిమద్రాస్ లో  విలువ ఏమీలేదు .నాకు చేతనైన రీతిలో నీకు సహకరిస్తాను .నువ్వు బాగా చదివే వాడవని అర్ధమైంది .నీకు యూని వర్సిటి లో  ఎక్కడా అన్యాయం జరక్కుండా చూసే పూచీ నాది .నువ్వే కాదు ఏ ఇండియన్ కూడా ఆ కమిటీ దగ్గరకు వెళ్లి మాట్లాడే అవకాశం లేనే లేదు .’’అని నిష్కర్షగా చెప్పాడు .గుండె మీదనుంచి కొంత బరువు దిగిపోయింది రామయ్యగారికి .

మదన పల్లి డాక్టర్ అనిబి సెంట్ నేషనల్ యూని వర్సిటి  లో 1917 లో 18 ఏళ్ళ వయసులో చేరటానికి పెట్టిన పరీక్షలన్నీ బాగా రాయటం తో యూని వర్సిటిలో చేర్చుకొన్నారు .రామయ్యగారికి క్రీడలు అంటే ఆసక్తి బాగా ఉండేది .పరుగుపందెం లో ఎప్పుడూ బెస్ట్ రన్నర్ .అదే జీవితం లోను బెస్ట్ రన్నర్ ని చేసింది .విశ్వవిద్యాలయ  ఎత్లేట్స్ లో అగ్రగామి రామయ్య గారే .ఇవన్నీ ఆయనకు బాగా కలిసి వచ్చాయి .పందాలలోపాల్గొన్నప్పుడు  ‘’పరిగెత్తు ఇంకా బాగా పరిగెత్తు ,విజయం సాధించాలి ‘’అని ప్రేక్షకుల చేసే చప్పట్లు అభినందనలే ఆయనకు ఆశీస్సులయ్యాయి .మంచి రన్నర్ ,లాంగ్  జంపర్ అయిన కోచ్ దగ్గర శిక్షణ పొందారు .యూని వర్సిటీకిపేరు తెచ్చే బాచ్ ని తయారు చేయాలని ఆ కోచ్ ఆరాట పడేవాడు .కాని జీవితం అంటే ఆటలే కాదు అంతకు మించి చాలా ఉందని ఆయనతో రామయ్య అనేవారు .’’sports for me is not the meaning but the poetry of body and movement ‘’అని రామయ్యగారి నమ్మకం .యూని వర్సిటీకి వచ్చింది అంతులేని విజ్ఞాన సంపదను మూట కట్టుకోవటానికేకాని గ్రౌండ్ లో గంతులు వేయటానికి కాదు .ఆ యూని వర్సిటి కేమిస్త్రి కంటే స్పోర్ట్స్ లో ము౦దున్నమాట మాత్రం నిజం .ఆటలతో కాలం వృధా అవుతోంది .లాగి వదిలిన బాణం లక్ష్యం చేరుకొన్నట్లే ఎక్కడికో సుదూర తీరాలకు ఎగిరిపోయి ఏదో ఎవ్వరికీ దక్కనిదాన్ని సాధించాలి .ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అలసత్వం పనికి రాదు .తొందరపడాలి అని అంతరాత్మ ఘోషిస్తోంది .ఒక్కోసారి మనసు నిశ్చేతనమైనప్పుడు ఏదో ఒక అజ్ఞాత శక్తి తన చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది అనే బలీయమైన భావం కలిగేది .తాను  ఎంచుకోన్నది రాజమార్గమే ననే నమ్మకం కలిగింది .ఇక వెనకడుగు ప్రశ్నే లేదు. ముందుకే ,మును ముందుకే అనుకొన్నారు .ఆంధ్రాలో అయినా ఇంకెక్కడైనా మనిషి తనంతట తాను బ్రతకలేడు .అనుకోని శక్తులేవో మనల్ని నడిపించిగమ్యం చేరుస్తాయి .నాలుగేళ్ల తరువాత 1921 లో బాచలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు రామయ్యగారు .మదనపల్లి లోని ఈ యూని వర్సిటి ఆ తర్వాత మద్రాస్ లోని అడయార్ కు  మారింది .

తండ్రి మరణం –  మలుపు తిరిగిన జీవితం

విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య నేర్వాలనే కోరిక మనసంతా నిండి పోయింది .వేరే ఆలోచనే రావటం లేదు .దాని నుంచి తప్పించుకో లేని పరిస్తితి .అందరికంటే తాను భిన్నం అనే భావమూ బాగా ఉంది రామయ్యగారిలో .వెనక్కు మళ్ళని పురోగామి అడుగు వేయాలి .దీనితో జీవితం మలుపు తిరగాలి .ఈ స్తితిలో తండ్రికి బాగాలేదని ఉయ్యూరు నుంచి కబురు తెలిసింది .అప్పుడంటే మద్రాస్ కు నడిచి వచ్చాడుకాని ఇప్పుడా సావకాశం లేదు కదా .స్టీమర్ ఎక్కారు అది నత్త నడక నడుస్తుంటే విసుక్కొన్నారు .మొత్తం మీద ఇంటికి చేరుకొన్నారు అప్పటికే తండ్రి చనిపోయారు ఆఖరి చూపు దక్కలేదన్న బాధ మనసంతా ఉండేది .ఆలస్యం స్టీమర్ వల్లనే అని దాన్ని తిట్టుకొన్నారు .తండ్రి లేకపోయినా ఆయన తాలూకు అనుభూతులు గుండె నిండా ఉన్నాయి వాటినే నెమరేసుకొన్నారు .కానీ తండ్రి మరణించలేదు అనే అనుకొనేవారు తన గుండెల్లో తండ్రి నిలిచే ఉన్నారని మార్గ దర్శకం చేస్తున్నారని భావించేవారు .దినవారాలు అన్నీ శాస్త్రోక్తంగా జరిగిపోయాయి .

‘’ నాఅన్నయ్యతో ‘’ తమ్ముడు సీతారామయ్యగారి సంభాషణ

అన్న అనంత రామయ్య గారినితమ్ముడు  సీతా రామయ్యగారు’’నా అన్నయ్య ‘’అని బహుగౌరవం గా చెప్పుకొనేవారు . ఒక రోజు ఉదయం  అన్న అనంత రామయ్య గారి దగ్గర కూర్చుని  తానుఉన్నత విద్యకోసం ఇండియా వదిలి ఇతర దేశాలకు వెడతానని చెప్పారు .ఎప్పుడు అంటే ఆ రోజే నని స్పష్టం గా చెప్పారు .బ్రాహ్మణుడు సముద్రం దాటి వెళ్ళటమా అని అన్న ప్రశ్నిస్తే మౌనమే సమాధానం .కాని మనసులో తమిళనాడు ఆంధ్రకు విదేశం కాదా ,?ఇప్పుడు ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా ఉండటం లేదా?ఇప్పుడు అంతా ఇండియాయే కదా ..ప్రపంచం ఇప్పుడు సంకోచించి పోయి౦ది కదా  .అదంతా ఈ కాలం లో ఒక్కటే అని పిస్తోందికదాఅని తనకు తాను  సమాధానం చెప్పుకొన్నారు ..’’హూణ దేశానికి వెడతావా ?’’ వాళ్ళు కిరాతకులు హంతకులు అక్కడికి వెళ్ళాలా ?అని అడిగితె ‘’నేను వెళ్ళటానికే నిశ్చయించుకొన్నాను .తాసీల్దార్ కావాలనే ఆలోచన నాకు లేదు. సైంటిస్ట్ కావాలన్న తపన నాలో ఉంది .అయినా తెల్లవారందరూ హూణులు కారు .’’అని నెమ్మదిగా నిర్భయం గా నిస్సంకోచంగా చెప్పేశారు .’’వాళ్ళు నిన్ను కుక్కలాగా చీదరించుకొంటారు ,ద్వితీయ శ్రేణి పౌరునిగా అవమాన పరుస్తారు .హూణులంటే హూణులే .మనకు గొప్ప సంస్కృతీ సంప్రదాయం ఉంది అవన్నీవదిలేసి  అక్కడికి వెడితే మట్టిలో కలిసిపోతాయి .నువ్వు వెళ్ళద్దు .నీకు నా ఆశ్రీర్వాదం ఉండదు ‘’అన్నారు అంతకంటే తీవ్రంగా అన౦త రామయ్యగారు .చీకటి పడింది. మళ్ళీ అన్నగారిని చేరి నిలబడే తాను  వెళ్లి పోతున్నానని తేల్చి చెప్పేశారు .ఆయన ఏమంటారో నని వొణుకు వస్తోంది .ఆయన వెళ్ళద్దు కూచోమని చెయ్యిపట్టుకోని కూచో పెట్టారు .

తండ్రికి ముందే తెలిసిన కొడుకు జీవితం

అన్న అనంత రామయ్యగారు శాంతంగా ‘’ఇలా జరుగుతుంది అని నాకు తెలుసు .మనకుటుంబం లో నువ్వొక్కడివే వరప్రసాదివి లేక శాపోపహతుడవు .నువ్వు ఈ లోకానికి చెందిన వాడివి కావని నాన్న గారు నిన్ను అమితంగా ప్రేమించారు .నాకూ అలానే అనిపిస్తోంది .నీ చిన్నతనం లోనే నాన్నగారు కృష్ణ స్వామి  అనే జ్యోతిశాస్త్ర వేత్త దగ్గర నీ జాతక చక్రం వేయించారు .నిన్ననే నాకు ఆ జాతక చక్రం కనపడింది .అది చాలా భయంకర సత్యాలు చెప్పింది .’’అని చెప్పి  తల అడ్డంగా ఆడించారు వెళ్ళ వద్దన్న భావం తో ..దాన్ని తమ్ముడు సీతారామయ్యగారికి ఇవ్వటానికి అసహ్యమేసింది ఆయనకు .ఆయనా తట్టుకో లేక పోతున్నారు .లాల్ గోవింద్ మొండిపట్టుదల చిన్నప్పటి నుండి తెలిసిన వారేకదా .తాపీగా తమ్ముడితో ‘’జాతక చక్రం వేయించాటానికన్నా ముందే నాన్నగారికి నీ సంగతి బాగా తెల్సు . నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోతావని ఒక్కసారి మాత్రమే వచ్చి కనిపిస్తావని తెలుసు .ఇదిగో నీ కోసం రెండు వేల రూపాయలు దాచి ఉంచారు .నీకు ఇవ్వమన్నారు ‘’అన్నారు .

నోటి వెంట మాట రావటం లేదు రామయ్యగారికి .తన కోసం తండ్రి అంతటి త్యాగం చేశారా అని పించింది .తన గురించి అన్ని విషయాలు తెలుసుకోన్నారా అని ఆశ్చర్యమేసింది .తండ్రిపై   ఆరాధనాభావం మరింత పెరిగింది .ఏ దేశానికి వెడతావు అని అడిగితె అమెరికా అని చెప్పారు. ముందు కెమిస్ట్రీ కి నిలయమైన జెర్మని  వెళ్లాలని ఉంది  .కాని ప్రస్తుత పరిస్తితులలో అక్కడ జనాలకు తిండి కూడా దొరకటం లేదు .తిండి లేకపోతే  స్పోర్ట్స్ మన్ అయిన తాను  బలహీనుడి నౌతాననే భయమేస్తోంది ‘’అన్నారు .మళ్ళీ అన్నగారు ‘’ఎప్పుడు నీ ప్రయాణం ?’’అని అడిగితె ‘’ఇప్పుడే ‘’అని ఠక్కున సమాధానం చెప్పారు .’’దేవతలు నిన్ను క్షమించర్రా’’అన్నగారి చివరి హితావు లాటి హెచ్చరిక .ఇద్ద్దరిమధ్య సుదీర్ఘ మౌనం రాజ్యమేలింది .అప్పుడు అన్నగారు చొరవ తీసుకొని ‘’ఇంతదాకా  వచ్చింది కనుక నాన్న చెప్పినవి అన్నీ చెప్పేస్తాను విను .’’నువ్వు కులాన్ని వదిలేయాలి .ఇదే ఆత్మ స్వాతంత్రానికి మొదటి మెట్టు .సంప్రదాయాల్ని పెద్దలను సారించిన పద్ధతుల్ని విసర్జించాలి అప్పుడే ఆయన మనసుకు శాంతి ,ఆనందం .సంతోషంగా ఉండటమే కాదు దీవి౦చె వారి సంతోషాన్ని కూడా చూడాలి ‘’అని చివరిమాటగా అనంత రామయ్య గారు బోధించారు .అమాంతం ‘’నా అన్నయ్య ‘’అని చెప్పుకొనే అన్న గారు అనంత రామయ్యగారి రెండు పాదాలకు వంగి రామయ్య గారు నమస్కరించారు .చలించిపోయారు అన్నగారు .తమ్ముడు దూరమవుతున్నాడనే బాధ ,బెంగా ఆయన్ను నిలవ నీయటం లేదు .

ఆచరించాల్సిన మూడు సూత్రాలు

తమ్ముడిని అప్యాయం గా దగ్గరకు తీసుకొని ‘’ఇందాక చెప్పిన మాటలేకాదు –నాన్న గారు కొన్ని ఆజ్ఞలు జారీచేశారు .వీటిని నువ్వు ఆచరి౦చకపోయినా ఫవాలేదు కాని ‘’మూడిటిని’’మాత్రం తప్పకుండా ఆచరణలో పెట్టమని నాన్నగారు చెప్పమన్నారు .1-మద్యం తాగరాదు 2-పొగ త్రాగరాదు 3-తెల్లజాతి అమ్మాయిని పెళ్లి చేసుకో కూడదు ‘’అని తెలియ జేశారు .వాటిని తాను  మనస్పూర్తిగా అంగీకరించి త్రికరణ శుద్ధిగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు .తానూ వాటిని పాటిస్తున్నాననీ  కాని తనకు దేవునిపై నమ్మకం లేదని చివరిమాటగా అన్నగారు మనసులోని మాట తమ్ముడికి చెప్పి ఆశీర్వ దించి విశాల విశ్వం లోకి సీతారామయ్యగారిని పంపించేశారు . నిజమే అనంత రామయ్యగారి ముఖాన వీబూది కాని బొట్టు కాని ఎప్పుడూ పెట్టుకోగా నేనెప్పుడూ చూడలేదు నాకు ఆశ్చర్య మేసేది .ఆయన నిరీశ్వర వాదికాదు  .లోకాతీత ఉత్తమ భావాలున్న ప్రజ్ఞా మూర్తి .బ్రహ్మ జ్ఞాని అనంత రామయ్యగారు .అలాంటివారికి ఈ   భౌతిక జంజాటాలు అక్కర్లేదు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-15 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శంకరుడొక్కడే!

శంకరుడొక్కడే!

ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్ల పంచమినాడు మనం శ్రీ శంకర భగవత్పాదుల జయంతి జరుపుకుంటాం. శ్రీశంకరులు చిన్న వయస్సులోనే భరతఖండమంతా సంచారం చేసి తత్త్వప్రచారము చేశారు. ఆదిశంకరుల తత్వ ఉపదేశాలను సంక్షిప్తంగా చెప్పటం చాలా కష్టం. కానీ ప్రధాన ఉపదేశాల సారాంశాన్ని తెలుసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరతాయి.

శ్రీ శంకరులకు పూర్వమే మనకు దర్శనకారులైన తత్త్వవేత్తలు ఉన్నారు. వీరిలో వేద ప్రమాణాన్ని అంగీకరించిన వారిని ‘‘వైదిక దర్శనకారులు’’ అని అంటారు. వేదం చివరి భాగాలైన ‘‘వేదాంతములు’’ అనబడే ఉపనిషత్తులలోని తత్త్వ విచారాన్ని అంగీకరించినవారిని ‘‘శ్రీ బాదరాయణులు’’ అంటారు. ఈ బాదరాయణులు బ్రహ్మసూత్రాలు రచించారు. శ్రీ శంకరులు వ్రీ బాదరాయణుల సూత్రాలకి ఉపనిషత్‌ ప్రతిపాద్యమైన పరబ్రహ్మతత్త్వాన్ని వారి భాష్య గ్రంథాలలో శ్రుతి యుక్తి అనుభవాలతో ప్రతిపాదించారు. ఉపనిషత్‌లలో ఉన్న ప్రక్రియను అనుసరించి మెలుకువ- కల- నిద్ర అనే మూడు అవస్థల అనుభవంలో మిగతా అన్నిటిని ఇమిడ్చి మనందరికీ ఒక్క పరమేశ్వరుడే ఆత్మగా ఉన్నాడని, అతడే సర్వసాక్షి అని, మనందరి అనుభవసారమ్‌ అతడని ప్రతిపాదించారు. ఈ పరమాత్మను తెలుసుకోవటమే మానవ జీవన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే – వేదసారాన్ని గ్రహించాలి.

సర్వసమానత్వం..

శ్రీ శంకరులు కుల, మత, వర్ణ, లింగ బేధ రహితంగా తత్త్వ ఉపదేశముచేశారు. ‘‘సర్వ కాలీనమైన’’ అంటే అన్ని కాలములకు ఒకే విధంగా అన్వయించే, ‘‘సర్వజనీనమైన’’ అంటే జాతి,దేశ, వర్ణ, కుల,మత, లింగ, వయస్సు భేదములు లేని సత్యములను వెలికితీశారు. శంకరులు వేదములను కేవలం నమ్మకంతో అనుసరించలేదు. దానిని యుక్తియుక్తంగా, అనుభవసారంగా విచారించి తాత్పర్యమును తెలియజేశారు. శ్రీ శంకరులు వేద ప్రమాణాన్ని పూర్తిగా విశ్వసించారు. వేదం మొదటి భాగమైన కర్మకాండ విశ్వాసానికి సంబంధించినదనీ, చివర భాగాలైన ఉపనిషత్తులలో ఉపదేశించిన తత్వం విషయంలో అనుభవం ప్రామాణికమని పేర్కొనారు.. ఇక్కడ అనుభవమంటే- లౌకికానుభవం, ఇంద్రియానుభవం, మానసికానుభవం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.

తేడా ఇదీ..

ఇతర తత్త్వ విచారకులకు మనసుపైనే ప్రధానంగా దృష్టి పెట్టి అంతర్ముఖులయ్యారు. ఇదే మనఃశాస్త్రం. శ్రీ శంకరులు మాత్రం-మనసుతో పాటుగా దానిని ఉపయోగించే, విచారించే వ్యక్తి ఎవరు? ఆ విచారము ఎలా పుడుతుంది? అది కేవలం కల్ఫనా? లేక నిజమా? ఈ విచారము పుట్టడానికి ముందున్న తత్వమేమిటి? మొదలైన ప్రశ్నలకు సమాధానం తెలియజేయగలిగారు. శ్రీ శంకరులు తెలియ చేసిన జ్ఞాన మునకు సంప్రదాయ శ్రద్ధ కావాలి. అంధ విశ్వాసములు పోగొట్టుకునే ధైర్యము ఉండాలి. ఇప్పటి కాలము, స్థితి, విచార సరళి, సమాజవ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని చూసినా కూడా ఆయన ఉపదేశాలు సర్వజనీనమై ఉంటాయి. శంకరుల బ్రహ్మసూత్ర భాష్యంలో- పూర్వజన్మలో కలిగిన ఉత్తమ సంస్కార వశం చేత విదురుడు, ధర్మవ్యాధుడు మొదలైన వారు ఆత్మజ్ఞానులయ్యారని పేర్కొంటారు. అంటే కుల, వర్ణ. జాతి, లింగ భేదాలకు అతీతంగా జ్ఞానాన్ని పొందవచ్చనేది ఆయన భావన.

శ్రీ శంకరులు తత్వజ్ఞానులు. వారిని మతస్థాపకులగానో, వర్ణాశ్రమ ఉద్ధారకులుగానో, మఠాధిపతులుగానో నిర్వచించటం సంకుచిత దృష్టి అవుతుంది. విశ్వం అంతా అద్వితీయ బ్రహ్మమునందు కల్పనయే అని ఉపదేశించిన శ్రీ శంకరులు జగద్గురువులనటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఆయన జన్మదినాన్ని శంకర జయంతిగా అధికారికంగా గుర్తించి.. ఆ రోజు సెలవుదినంగా ప్రకటించటం శంకరుడికి మనం అర్పించే నిజమైన నివాళి.

స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి

విశాఖ శారదా పీఠాధిపతి
99666696584

 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోరికల హరివిల్లు

కోరికల హరివిల్లు

మనుషుల కోరికలు అనంతంగా ఉంటాయి. ఈ కోరికలకే సంస్కృతంలో ‘పురుషార్థాలు’ అని ఒక పెద్ద పదం ఉంది. మనుషులు అర్థించే విషయాలు అనగా కోరుకునే విషయాలు అని దీని అర్థం.

జీవించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనవి ఆహారం, ఇల్లు, సమాజంలో భద్రత. వీటి తర్వాతనే అదనపు కోరికలు మొదలవుతాయి. ఉదాహరణకు ఉద్యోగం వచ్చేవరకూ దానికోసం కష్టపడటం, వచ్చిన తర్వాత పెళ్లి, కారు మొదలైన కోరికలు. అవి తీరిన తర్వాత మరిన్ని కోరికలు. ముసలితనం వచ్చే కొద్దీ పైవాడి గురించి, వాడిని మెప్పించే పద్ధతి గురించి ఆలోచనలు, కోరికలు. వీటన్నింటినీ నాలుగు భాగాలుగా మన ప్రాచీనులు విశ్లేషించి చెప్పారు. వీటికే ధర్మం, అర్థం, కామం, మోక్షం అని పేర్లు. ఈ చెప్పిన వరుస కూడా ముఖ్యమైనది. ధర్మం తర్వాతనే మిగతా మూడూను.
మన దేవుళ్లకు సాధారణంగా నాలుగు చేతులు చూస్తూంటాం. ఈ నాలుగూ పై చెప్పిన నాలుగు పురుషార్థాలకూ చిహ్నం. ఒక చేతిలో గద లేదా ఏదో ఒక ఆయుధం, ఒక చేతితో అభయముద్ర, ఒక చేతితో వరదముద్ర. మరొక చేతిలో ఒక పద్మం లేదా మరొక పువ్వు చూస్తాం. మనిషి ధర్మాన్ని పాటించకపోతే దానికి తగిన శిక్ష ఉంటుందని చెప్పడానికి గద. మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షమార్గం వైపు నడిపించేది అభయముద్ర. సంపదల్ని ఇవ్వడాన్ని సూచించేది వరదముద్ర. చేతిలో ఉన్న పువ్వు కామాన్ని సూచించేది. మనిషికున్న అన్ని విధాల కోరికలను సూచించే ముద్ర. సృష్టి వ్యవస్థనంతటినీ నడిపించేవి ఈ నాలుగూను.
మొదటి ధర్మం. ఒక వస్తువును జాగ్రత్తగా ధరించి ఉండేది అని ఈ పదానికి అర్థం. సమాజం విడిపోకుండా, ముక్కలు కాకుండా పట్టి ఉంచేది అని చెప్పవచ్చు. దీనికి ఇంగ్లీషులో సరైన పర్యాయపదం చెప్పలేం. నైతిక విలువలు, వాటిని అనుసరించాల్సిన విధానాలు, మతవిశ్వాసాలు మొదలైనవాటన్నింటినీ ఈ పదం సూచిస్తుంది. భారతీయ సంస్కృతిలో ధర్మానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. రాముణ్ణి ‘విగ్రహవాన్‌ ధర్మః’(మూర్తీభవించిన ధర్మం) అన్నారు. అలాగే భారతంలో ముఖ్యపాత్ర ధర్మరాజు, ధర్మానికి ప్రతీక.
వ్యక్తిని మంచి మార్గంలో పెట్టడానికి ధర్మశాస్త్రాలు ఒక జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి. ప్రతి వ్యక్తికీ మొత్తం జీవితకాలానికి అన్వయించే టైం టేబుల్‌ను ధర్మశాస్త్రం ఇస్తుంది. ఒక వ్యక్తి నియమం తప్పకుండా చెయ్యాల్సిన నిత్యకర్మలు, కొన్ని సందర్భాల్లో తప్పకుండా చెయ్యాల్సిన నైమిత్తిక కర్మలు మొదలైనవాటిని చెబుతుంది. (కర్మల్ని గూర్చి చెప్పిన మునుపటి వ్యాసంలో వివిధ రకాల కర్మల్ని తెల్సుకున్నాం). ఇలా చేయకుంటే మనిషి తన ఇష్టం వచ్చిన పనులు చేసే అవకాశం ఉంది. ధర్మాన్ని మనం ప్రేమతో కోరుకోం, భయంతోనే కోరుకుంటాం. ఎదుటివాడు మన సొమ్ము దోచుకొనిపోకుండా, మనపై దౌర్జన్యం చేయకుండా ఉండాలంటే అతన్ని ఏదో ఒక శక్తి ఆపాలి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మాన్ని కోరుకుంటాం. మన రక్షణ కోసమే దాన్ని కోరుకుంటాం. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే మాట వచ్చింది. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని దీని అర్థం. ఇది ఎలాగ అని మనకు వెంటనే అర్థం కాదు. వ్యక్తి తన సుఖం కోసం తన స్వతంత్రాన్ని కొంత వరకూ తగ్గించుకుని తనను నియంత్రించే బాధ్యత సమాజానికి ఇస్తాడు. ధర్మాన్ని తాను రక్షించడం అంటే ఇదే. ధర్మమనే భావన మనిషి బలహీనతలో నుండి పుట్టినది అని ఫ్రెడ్‌ రిక్‌ నీషే అనే జర్మన్‌ వేదాంతి చెపుతాడు. కాని ఇది సరైన సిద్ధాంతం కాదు.
ధర్మాన్ని పాటించకపోతే చట్టం చర్య తీసుకోకపోవచ్చు. ఉదాహరణకు పెద్దల్ని, గురువుల్నీ గౌరవించకపోవడం చట్టప్రకారం నేరం కాదు కానీ సమాజం నిందిస్తుంది. పుణ్యం, పాపం అనే మత విశ్వాసాలు కూడా దీన్ని గర్హిస్తాయి. దాన ధర్మాలు చేస్తే అలాంటి పనిని సమాజం ప్రశంసిస్తుంది.
ఎట్టి పరిస్థితులలోనైనా ధర్మాన్ని అనుసరించడం ముఖ్యమని చెప్పడానికే మొట్టమొదటిగా ధర్మం చెప్పబడింది. దీని తర్వాతే, ఇది అనుమతించిన మార్గంలోనే సంపదను పోగు చేసుకోవడం, కోరికల్ని తీర్చుకోవడం గూర్చి చెప్పారు. అందుకే ధర్మం, మోక్షం ఈ రెండింటి మధ్య అర్థం, కామం చెప్పబడ్డాయి. ప్రతి మనిషికీ అన్వయించేవి మొదటి మూడూను. మోక్షం అన్నింటికన్నా శ్రేష్ఠమైన మార్గం అని సిద్ధాంతం చెప్పినా  దీన్ని మనం సాధారణంగా కోరుకోం. వేలాది మందిలో ఒకరు మాత్రమే దీనికై ప్రయత్నిస్తారని శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు.
ధర్మం తర్వాత మనం కోరుకునేది సంపద. దీన్నే అర్థం అన్నారు. భారతీయులంతా ఆధ్యాత్మిక చింతనలో ఉంటారనీ, వీరికి సంపద పొందాలని మాత్రమే చెప్పారు గానీ, సంపద అనవసరం అని చెప్పలేదు. విద్యను, ధనాన్నీ ఆజన్మాంతం సాధిస్తూనే ఉండాలని మన పుస్తకాలన్నీ చెబుతాయి. ధర్మం పర్యవేక్షణలో లేని సంపద వ్యసనాలకు దారి తీయవచ్చు. కానీ ధర్మాన్ని అనుసరించడానికీ, ప్రతి మనిషీ విధిగా చేయాల్సిన పనులు చేయడానికి (అతిథుల్ని ఆదరించడం, దానధర్మాలు మొదలైన వాటికి) సంపద చాలా అవసరం. సంపద జ్ఞానానికి అడ్డురాదని గీతలో గమనిస్తాం. జనకుడు మొదలైన అనేక రాజర్షుల గూర్చి అందులో చూస్తాం. ఒక వైపు రాజ్యపాలన చేస్తూ, మరొకవైపు జ్ఞానులుగా ఉన్న వ్యక్తులు రాజర్షులు.
మూడవ పురుషార్థం కామం. శారీరకమైన కోరికలతో పాటు అన్ని రకాల కోరికలూ ఇందులో చెప్పవచ్చు. కామమంటే ఒక నీచమైన విషయమని భావించనక్కర్లేదు. ధర్మానికి విరుద్ధం కాని కామం దైవస్వరూపమని గీతలో చూస్తాం (7-11). భార్యాభర్తల మధ్య శృంగారం ఒక పవిత్రమైన విషయమనీ, యజ్ఞంతో సమానమైనదనీ పెళ్లి మంత్రాలు చెపుతాయి. ఇది ధర్మ రక్షణ కోసం నిర్మించబడిన సామాజిక వ్యవస్థ. మన సంస్కృతిలో గృహస్థుడయినవాడికే అనేక బాధ్యతలు చెప్పబడ్డాయి. అతిథుల్ని గౌరవించడం(అతిథి యజ్ఞం), జంతువులకు ఆహారం ఇవ్వడం(భూతయజ్ఞం) మొదలైన పనులన్నీ ఇతనికే కానీ బ్రహ్మచారికీ, సంన్యాసికీ కాదు. గృహస్థుడు సమాజానికి మూలస్తంభం లాంటి వాడు. ధర్మం, అర్థం, కామం ఈ మూడింటిలో భార్యాభర్తలు కలిసి ఉంటారు. మోక్షం మాత్రం ఒంటరి ప్రయాణం. అందుకే ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి అని పెళ్లి మంత్రాలు వింటూంటాం.
నాలుగవది మోక్షం. దీన్ని గురించి ఒక సంపర్ణం వ్యాసంలో ఇది వరలో తెలుసుకున్నాం. సమాజం మనకు అంటించిన కులం, మతం, Social Status, మొదలైన అన్నింటికీ అతీతంగా వెళ్ళి అన్నింటినీ సమభావంతో చూసే స్థితికి ఎదగడం. తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో అలాగే అందరినీ ఎలాంటి స్వార్థభావన లేకుండా ప్రేమించగలగడం. దీన్ని గీతలో సర్వాత్మభావం అన్నారు. మోక్షమనేది స్వార్థం లేని స్థితికి, ఒక Personal Identity లేని స్థితికి ఎదగడం.
పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రం ఇటీవలే మనిషి కోరికల్ని విశ్లేషించి ‘The Hierarchy of Human Needs’ అని చెప్పాయి. Maslow అనే శాస్త్రవేత్త వీటిని వివరించాడు. తిండి, రక్షణ మొదలైన శారీరకకోరికలతో ప్రారంభమై సామాజిక, సాంస్కృతిక స్థాయిల్లో ఎలాగ మనిషి పూర్ణత్వాన్ని కోరుకుంటాడు అన్నదే ఇందులోనూ విషయం.

డాక్టర్‌ కె. అరవిందరావు

రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.comకు పంపండి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్క మెదడులో 26 ఏళ్ళనుంచి ఉన్నచెల్లెలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతరిక్ష అద్భుతం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాతీయ పుస్తక దినోత్సవ సంధర్భము

   పుస్తకం !!

పురాణాలను మస్తకానికి చేర్చేది పుస్తకం !
పూర్వ పుణ్య ఫలాలను చాదస్తం కాదని చెప్పేది పుస్తకం !
వుణ్య భూమి పూర్వపరాలను ప్రతి నిత్యం చెప్పేది పుస్తకం !
పుస్తకం లేని సృష్టి సమస్తం అస్తవ్యస్తం !
పరి రక్షించు  పుస్తకాన్ని- సంరక్షించుకో నీ జీవనాన్ని !
దశ దానాలలో మిన్న పుస్తక దానం !
క్షరం కాని జీవనానికి సాక్ష్యం అక్షర మైన పుస్తకం !
ఇది త్రికాల వేదం – ఈ బందా నాదం !!
Posted in కవితలు | Tagged | Leave a comment

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో గంగా స్తోత్రము అర్థ విశేషాలు

శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో గంగా స్తోత్రము అర్థ విశేషాలు

ganaga stotram (1)

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సీతారాం ఏచూరి తల్లిగానే ఇష్టపడతా !

సీతారాం ఏచూరి తల్లిగానే ఇష్టపడతా !
‘‘ ఏవిటీ.. సడెన్‌గా నేను గుర్తొచ్చాను మీకు! అయినా సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యింది వాడు కదా.. నేను కాదే.
నా ఇంటర్వ్యూ ఎందుకు మీకు?’’ అంటూ మొదలు పెట్టారు కల్పకం ఏచూరి. బహుశా సీతారాం ఏచూరి తల్లి అంటేనే ఆమెను అందరూ సులువుగా గుర్తుపడతారేమో! వాస్తవానికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ తనను అలా గుర్తిస్తేనే ఒక తల్లిగా ఇష్టపడతానని అంటున్న కల్పకం ఏచూరి తన కొడుకు గురించి చెప్పిన ముచ్చట్లు…

‘‘దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ జైలుకెళ్లినప్పుడు వారి కుటుంబ బాధ్యతల్ని మా అమ్మ చూసుకునేవారు. ఆమె ఎనిమిదేళ్ల వయస్సులోనే ఒకరిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఆయనకు వేరే అమ్మాయితో పెళ్లి చేయించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని కూడా ఆంధ్ర మహిళా సభలో చేర్పించి బొమ్మలు తయారు చేయించటం నేర్పించి, ఆమె తనకాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఆమె ఎప్పుడూ ఒక్కటే చెప్పేవారు. ‘నువ్వు గొప్పదానివైతే సంఘానికి ఏం లాభం? సంఘానికి ఎంతోకొంత నువ్వు ఉపయోగపడితేనే ప్రయోజనం..’ అనేవారు. ఆ ప్రభావం నాపై పడింది. అందుకే ఇప్పటికీ నేను ఏదో ఒక పనిలో నిమగ్నమవుతూనే ఉన్నాను. నేను పుట్టింది, పెరిగిందీ అంతా మద్రాసులోనే. మా నాన్న కందా భీమశంకరం హైకోర్టు జడ్జి. ఆంధ్రా విడిపోవటంతో గుంటూరుకు, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో హైదరాబాద్‌కు మకాం మారాం. నా పెళ్లి కూడా చిన్నతనంలోనే జరిగింది. అయితే, నేను మద్రాసులోనే అమ్మ దగ్గర ఉండి ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత మావారు ఇంజనీర్‌ సర్వేశ్వర సోమయాజులు కేంద్ర ఆరోగ్య శాఖ రవాణా విభాగానికి బదిలీ కావటంతో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. మా ఇంట్లో చాలామంది లాయర్లే. నేనూ లాయర్‌ అవుదామనుకుంటే నాన్న వద్దన్నారు. దాంతో పీహెచ్‌డీ చేద్దామనుకున్నాను. అదీ కుదర్లేదు. ఇద్దరు కొడుకులనూ చూసుకోవటంతోనే సరిపోయింది’’

డాక్టర్‌ కావాలనుకుంటే లీడర్‌ అయ్యాడు..

ఏచూరి సీతారాం సౌమ్యుడు. వాణ్ణి నిద్రలేపాలంటే ఫ్యాన్‌ ఆఫ్‌చేస్తే సరిపోయేది. అంత సుకుమారుడు. చొక్కాలకు గంజి ఎక్కువ పెడితే వాడికి గుచ్చుకుంటుందని మా అమ్మ తక్కువగా పెట్టమని చెప్పేది. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో పీఎల్‌సీ చదివేప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. దీంతో మా నాన్న వాడిని ఢిల్లీకి పంపించేశారు. చిన్నప్పటి నుంచీ బ్రిలియంట్‌ స్టూడెంట్‌. అన్నింట్లోనూ ఫస్టే. వాడు డాక్టర్‌ కావాలన్నది నా కోరిక. అయితే, వాడు ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేరాడు. ఆ తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో చేరడం వల్ల.. జీవితం మలుపు తిరిగింది. తొలుత స్టూడెంట్స్‌ యూనియన్‌కు అధ్యక్షుడయ్యాడు. క్రమక్రమంగా సీపీఎంలో చేరిపోయాడు. ఇదంతా మాకు తెలియకుండానే జరిగింది. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ అంటే ఒక అలర్జీ. పైగా, మాదేమో కాంగ్రెస్‌ కుటుంబం. పనివాళ్లను కూడా ‘కాంగ్రె్‌స్‌కే ఓటెయ్యి’ అని చెప్పి పంపించేవాళ్లం. మా అమ్మ తండ్రి రామస్వామి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. దానికితోడు వీడేమో బాగా చదువుకుంటున్న, సుఖంగా బతుకుతున్న వ్యక్తి. ఒక్కసారిగా ఇంత కష్టపడటం ఎందుకు? అనిపించింది. చిన్నప్పటి నుంచీ ఏదో ఒకటి చేద్దాం అన్న తపనతోనే ఉండేవాడు. కానీ, ఏం చేయాలన్నది మాత్రం స్పష్టత లేదు. మా తమ్ముడు మోహన్‌ కందాకు (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరయ్యారు) మావాడికీ పెద్దగా వయస్సు తేడా లేదు. ఇద్దరిపైనా నాన్నగారి ప్రభావం ఎక్కువ. తమ్ముడు ఐఏఎస్‌ అయ్యాడు. మావాడు ఐఎ్‌ఫఎస్‌ అవ్వాలని కోరుకున్నాడు. అన్ని అవకాశాలూ ఉన్నాయి కనక నేను మాత్రం డాక్టర్‌ అయితే బాగుంటుందని చెప్పాను. కానీ వాడు ఎకనామిక్స్‌లో చేరగానే సరిపెట్టుకున్నాను. అయినా వదలకుండా నా కోరికను గుర్తు చేసేదాన్ని. ‘ఇప్పుడు చేరమంటావా చెప్పు’ అని సరదాగా అడిగేవాడు.

నేను దేవుడితోనే దెబ్బలాడతాను. ఆయనొక్కడే కేకలేయడు. తిట్టడు. చెబితే వింటాడు. వినకపోతే నోర్మూసుకుని

 అయినా ఊర్కుంటాడు. అలాంటి ఫ్రెండ్‌ గణేశుడు. ఐ టేక్‌ హిమ్‌ ఫర్‌ గ్రాంటెడ్‌. కానీ, మా అబ్బాయి మాత్రం దేవుడ్ని నమ్మడు. వాడు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాక నా కజిన్‌ ఒకరు ఫోన్‌ చేసి వెంటనే వినాయకుడి గుడికి వెళ్లి 11 కొబ్బరికాయలు కొట్టి, 11 రూపాయలు వెయ్యి అని చెప్పింది.
మావాడికి పదవి వచ్చాక ఒకరిద్దరు మీడియావాళ్లు ఫోన్‌ చేస్తే మాట్లాడలేదు. మా తమ్ముడు ఫోన్‌ చేసి.. ‘‘నీ కొడుకు 45 ఏళ్లు వాళ్లని భరించాడు. నువ్వు రెండు రోజులు భరించలేవా?’’ అని చెప్పాడు.
కాకినాడకు వెళ్లి ఆవకాయ పెట్టుకోవటం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు కూడా ‘మామిడికాయలు వచ్చాయి. నువ్వెప్పుడు వస్తున్నావ్‌’ అని అక్కడి నుంచి నాకు ఫోన్లు వస్తుంటాయి. ప్రతిసారీ వెళ్లి.. అందరికీ సరిపడా ఆవకాయ పెట్టుకుని వస్తాను.
తెలుగు భోజనం వదులుకున్నాడు..

మా నాన్న కారణంగా వాడికి ఇంగ్లీషుపై పట్టు, చర్చించటం, సౌమ్యంగా ఎదుటివారికి తాను చెప్పాల్సింది స్పష్టంగా, లౌక్యంగా చెప్పి తనవైపుకు తిప్పుకోవటం ఇలాంటివన్నీ అలవాటయ్యాయి. ముందు నుంచీ వాగ్ధాటి కలిగిన వ్యక్తి. కాబట్టి సహజంగానే నాయకుడయ్యాడు. అయితే వాడు సీపీఎంలో చేరటం నాన్నకు ఇష్టం లేదు. కానీ, ఆయన చనిపోయేముందు మాత్రం ‘అమ్మాయీ.. వాడు చెబుతోంది రైటేనేమోనే’ అని అన్నారు. అలా జడ్జిగారి ఆమోదం కూడా పొందాడు. ఒకసారి యూనివర్శిటీలో చదువుకుంటుండగా ఆందోళన చేశారని వీడినీ, స్నేహితులనూ అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌లో పెట్టారు. పోలీసులే మాకు ఫోన్‌ చేసి భోజనం తీసుకురావాలనుకుంటే తీసుకొచ్చి ఇవ్వండి అన్నారు. అందరికీ కలిపి నేను భోజనం తీసుకెళ్లాను. వీడేమో బల్లపై కూర్చుని అందరికీ ఏదో చెబుతున్నాడు. పోలీసులు కూడా శ్రద్ధగా వింటున్నారు. మనకెందుకురా ఇవన్నీ అన్నాన్నేను. ‘ఇలా ఉద్యమాలు చేసి పోలీసు స్టేషన్లకు, జైళ్లకు వెళ్లినవారే పైకొస్తారు. నీకెందుకు భయం’ అన్నాడు. ఆ గొడవల్లో పడి పీహెచ్‌డీ చేయలేకపోయాడు. నా మిత్రులంతా అనేవాళ్లు ‘ఆ పార్టీయే అంత. వాడిని పీహెచ్‌డీ చేయనివ్వదు’ అని. జేఎన్‌యూలో చేరిన కొన్నాళ్లకే హాస్టల్‌లో చేరిపోయాడు. ప్రతిరోజూ రాత్రిళ్లు చర్చలు. పగలు చదువుకోవటం, పార్టీ పనులు చూసుకోవటం. ఇదే దినచర్య అయ్యింది. వారాంతాల్లో అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి ఇంటికొచ్చేవాడు. వాడికి తెలుగు భోజనం అంటే మహా ప్రీతి. కొబ్బరి పచ్చడి, ఆవకాయపచ్చడి, పులుసు, గడ్డపెరుగు ఇలా అన్నీ కావాలి. కానీ, పార్టీలో చేరిన తర్వాత మాత్రం భోజనాన్ని వదులుకున్నాడు. పార్టీ కార్యాలయంలో స్టాండర్డ్‌ మెనూ ఉంటుంది. రాజ్మా చావల్‌, దాల్‌ చావల్‌.. ఇలా. కింది నుంచి పై వరకూ అంతా ఇదే భోంచేస్తుంటారు. దాంతో ఎప్పుడైనా వారాంతంలో అయినా రమ్మని చెప్పి వండిపెట్టాలని ఉంటుంది. వాడికి సమయం దొరికినప్పుడెప్పుడో వస్తుంటాడు.

పార్టీ కోసం జీవితాన్ని ధారపోయాలి..

ప్రధాన కార్యదర్శి పదవిని కూడా చాలా సౌమ్యంగానే, ఎన్నికల్లేకుండా పార్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఈ స్థాయికి రావాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. దీనికోసం పనిచేయలేదు. అసలు ఈ పార్టీ విధానమే వేరు. కిందికి పడటమే తప్ప పైకి రావటం లేదు. దీన్ని పైకి తీసుకురావటానికి బాగా కష్టపడాలి. పార్టీ కోసం కష్టపడితే సరిపోదు. అందరినీ కలుపుకుని, అన్ని పార్టీలనూ కలుపుకుని ముందుకెళ్లాలి. దేశంలో భిన్నమైన వ్యవస్థ, భిన్నమైన ప్రభుత్వం, భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అంతా కలిస్తే తప్ప అనుకున్నది సాధ్యం కాదు. ఏదో చేస్తానని అందరికీ ఆశ కల్పించిన వాడు ఇప్పుడు చేయకపోతే ఎలా? సీతారాం చేయాల్సింది చాలా ఉంది. తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. అందులో అపనమ్మకం లేదు. అయితే, దేవుడు కూడా సహకరించాలి. ఈ మాటను మాత్రం వాడు ఒప్పుకోడనుకోండి!! నేను మాత్రం దేవుడ్ని నమ్ముతాను. సీతారాం కూతురు ఎడిన్‌బరోలో ప్రొఫెసర్‌. కొడుకు జర్నలిస్టు. మూడోవాడు కాలేజీలో చదువుతున్నాడు. ఇంటిని ఎక్స్‌పోజ్‌ చేయడు. అయినా ఇప్పటికీ, తమ్ముడికైనా, ఇంట్లో ఎవరికైనా సలహాలన్నీ ఇస్తుంటాడు.

‘గుండోజీ’ అని ముద్దుగా పిలిచేవారు

సీతారాం పార్టీలో చేరినప్పుడు దుర్గాభాయమ్మ ‘వీడు పార్టీలో చేరిపోయాడు. మనం ఒక కన్నేసి ఉంచాలి’ అనేవారు. బొద్దుగా ఉండటంతో ఆమె ముద్దుగా ‘గుండోజీ’ అని పిలిచేవారు. సాయిబాబా జుట్టులాగా రింగులు తిరిగి ఉండేది. ఐదు రూపాయల నోటు ఇచ్చి జుత్తు కత్తిరించుకుని రారా! అని పంపించేవాళ్లు. ఆమె మేనల్లుడు, వీడు కలిసి వెళ్లి రెండు వెంట్రుకలు కత్తిరించుకుని వచ్చేవారు. ఏంట్రా అంటే.. ‘ఆ డబ్బుకు అంతే చేస్తారత్తా’ అనేవాళ్లు. దేశ్‌ముఖ్‌ గారు కూడా చాలా ప్రేమగా ఉండేవారు. దుర్గాభాయమ్మ కూడా తిండి బాగా తినమని చెప్పేవారు..’’ అని ఇంటర్వ్యూ ముగించారు కల్పకం ఏచూరి.

సామాజిక సేవకురాలు..
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీపాద కదా సూత్రం -వేదగిరి రాంబాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమన్వయం సాధించిన సనాతనుడు!

సమన్వయం సాధించిన సనాతనుడు!

  • – హెబ్బార్ నాగేశ్వరరావు
  • 23/04/2015
TAGS:

ఆదిశంకరాచార్యుడు సనాతనుడు…. కలియుగంలో జన్మించిన వారందరిలోను అగ్ర గణ్యుడు. ఆయన పుట్టక పూర్వం కాని పుట్టిన తరువాత కాని కలియుగంలో ఆయనతో సమానమైన ప్రతిభావంతుడు ప్రభావవంతుడు మరొకరు పుట్టలేదు. భవిష్యత్తులో పుట్టవచ్చుగాక! కృష్ణద్వైపాయన వ్యాసుడు, యదుకుల కృష్ణుడు వంటివారు ఆదిశంకరాచార్యుని కంటె పూర్వం భారతీయతకు మరింతగా మెరుగులు దిద్దారు వారు ద్వాపరయుగంలో పుట్టినవారు! వసిష్ఠుడు వాల్మీకి వంటివారు మరింత పూర్వం త్రేతాయుగంలో జీవించినవారు! సనాతన భారతీయతత్త్వం వీరందరికంటె పూర్వంనుంచి ఉంది, సృష్టి ఆరంభంలో వేద ద్రష్టలైన మహర్షులు సనాతన సాంస్కృతిక తత్త్వాన్ని ఆవిష్కరించడం పునరావృత్తవౌతున్న చరిత్ర! ఎందుకంటె సనాతనతత్త్వం సృష్టి ఆరంభం కాకపూర్వం కూడ ఉంది! భారతీయులు దర్శించిన వాస్త వం చరిత్ర…. సృష్టి ఆరంభం కావడం, నాలుగువందల ముప్పయి రెండు కోట్ల సంవత్సరాలపాటు కొనసాగడం చరిత్ర. ఈ కాల వ్యవధి ముగిసిన తరువాత నాలుగువందల ముప్ప యి రెండు కోట్ల సంవత్సరాలపాటు శూన్యం ఏర్పడడం చరిత్ర! ఇలా ‘శూన్య’స్థితి, ‘సృష్టి’ స్థితి ఒకదాని తరువాత ఒకటి, ‘రాత్రి’, ‘పగలు’వలె, నిరంతరం పునరావృత్తం కావడం ‘శాశ్వతమైన’అంటే ‘సనాతనమైన’ విశ్వవ్యవస్థ! ఈ పునరావృత్తి సాపేక్షం! ఒకప్పుడు భాసిస్తున్నది…. మరొకప్పుడు శూన్యంగా ఉంటున్నది! అందువల్ల సృష్టికి శూన్యానికి అతీతమైనది సత్యం! ఈ సత్యం బ్రహ్మము! సత్యాన్ని మరోసారి వివరించిన కారణజన్ముడు ఆదిశంకరాచార్యుడు! కనిపించని వినిపించని ‘సత్యం’ కనిపించడం వినిపించడం ‘ఋతం’! ఈ ‘ఋతం’విశ్వవ్యవస్థ. విశ్వవ్యవస్థ అసంఖ్యాక వైవిధ్యాల నిలయం. వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు….సమన్వయం ఉంది. స్వరూప వైవిధ్యాల మధ్య స్వభావ ఏకత్వం ఉంది! ఇదే సమన్వయతత్త్వం! ఈ సమన్వయ తత్త్వం వేద సంస్కృతిగా, భారతీయ సంస్కృతిగా, హైందవ సంస్కృతిగా, సనాతన సంస్కృతిగా సమాజ స్థితం కావడం చరిత్ర! ‘‘ఏకం సత్ విప్రాః బహుధావదన్తి’’అన్నది సనాతన సమన్వయ తత్త్వం. ‘‘సత్యం ఒక్కటే… దాన్ని వివిధ మతాలుగా పండితులు వివరిస్తున్నారు.’’ వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయ తత్త్వం భారతీయతే. కొడిగట్టిన ఈ సమన్వయతత్త్వాన్ని మళ్లీ వెలిగించినవాడు ఆదిశంకరుడు! వైవిధ్య మతాలమధ్య కల సమన్వయతత్త్వాన్ని మరోసారి ఆవిష్కరించాడు…..
ఉన్నది ఒక్కటే… అది సత్యం, దానికి భిన్నమైనది ఏదీ లేదు. ఈ ‘బ్రహ్మ జిజ్ఞాస’ అద్వైతం! విభిన్న స్వరూపాలమధ్య నిహితమైన స్వభావం ఒక్కటేనన్న, లక్ష్యం ఒక్కటేనన్న ‘ఋతం’ ధర్మజిజ్ఞాసకు ప్రాతిపదిక! భారతీయుల ఈ ‘్ధర్మజిజ్ఞాస’ మతాల మధ్య ఉన్న అద్వైత స్థితిని గుర్తించింది, వ్యక్తికీ సమాజానికీ మధ్య, సమాజానికి సృష్టికీ మధ్య, సృష్టికీ, సృష్టికర్తకూ మధ్య సహజంగా ఉన్న అద్వైత స్థితిని దర్శించింది! ఈ సమన్వయ భావ సాంస్కృతిక తత్త్వానికి గ్రహణం పట్టినప్పుడల్లా గ్రహణ విముక్తికోసం విజయవంతంగా కృషిచేసిన ‘ప్రభావకరులు’ అనాదిగా ప్రభవించారు, అనంతంగా ప్రభవిస్తూ ఉంటారు. ఈ ‘పరంపర’లోని కారణజన్ముడు ‘కాలడి’లో పుట్టిన శంకరుడు.
వైవిధ్యాల మధ్య వైరుధ్యం ఉందన్న ‘భ్రమ’వైవిధ్యాల విధ్వంసానికి దోహదం చేసింది. ఈ ‘భ్రమ’్భరతీయ స్వభావానికి, వేదతత్త్వానికి వ్యతిరేకమైనది! భారతదేశంలో మొదటి మానవుడు పుట్టాడు, మానవీయ సంస్కృతి మొదట భారతదేశంలో వికసించింది. క్రమంగా భారతదేశంనుండి వివిధ కారణాలవల్ల సరిహద్దులకు ఆవలికి వెళ్లిన ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడినారు!! క్రమంగా భారతీయతకు దూరమయ్యారు. అంటే వైవిధ్యాలను పరిరక్షించే ప్రవృత్తికి దూరమయ్యారు! ఇలా దూరమైనవారు మ్లేచ్ఛులు!! భారతదేశపు సరిహద్దులకు దగ్గరగా విదేశాలలో స్థిరపడినవారు కొన్ని భారతీయ సంస్కారాలను గుర్తుంచుకున్నారు. భౌగోళికంగా దూరంగా జరిగినవారు భారతీయ సంస్కారాలను పూర్తిగా మరచిపోవడం ప్రపంచ చరిత్ర! వైవిధ్య పరిరక్షక ప్రవృత్తికి ఇలా దూరమైనవారు తమదికాని ప్రతి వైవిధ్యాన్ని ధ్వంసంచేయడం ఆరంభించారు. తమది కాని మతాన్ని ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. తమది కాని భాషను, తమది కాని భావాన్ని, రీతిని, నీతిని ఇలా అనేకానేక వైవిధ్యాలను ధ్వంసం చేయడానికి భారతీయతకు దూరమైనవారు కృషిచేశారు! ఫలితంగా వైవిధ్యాలను పరిరక్షించే భారతీయులకూ, వైవిధ్యాలను ధ్వంసంచేసే విదేశీయులకూ మధ్య సంఘర్షణ మొదలైంది!
ఈ సంఘర్షణలో భారతీయులను విజయపథంలో నడిపించిన సమరశీల స్వభావాన్ని పునరుద్ధరించిన ‘కలియుగ కృష్ణుడు’ ఆదిశంకరాచార్యుడు!! భగవద్గీత లక్ష్యం జీవన సమర ధర్మాన్ని విస్మరించి చతికిలపడిపోయే అర్జునులను తిరిగి కర్తవ్యపథంలో నడిపించడం….. సరిహద్దుల రక్షణకోసం యుద్ధంచేయడం అనివార్యమన్న జీవన ధర్మాన్ని గుర్తుచేసి, స్వజాతిని కర్తవ్యపథంలో నడిపించిన కారణజన్ముడు శంకరుడు.
మహాభారత యుద్ధం జరిగిన తరువాత ముప్పయి ఆరేళ్లకు కలియుగం ఆరంభమైంది. అదే రోజున యదుకుల కృష్ణుడు పార్ధివ శరీరాన్ని పరిత్యాగం చేశాడు. కలియుగం ఆరంభమైన తరువాత ఈ మన్మథ సంవత్సరం ఉగాది నాటికి 5,116 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం 5117వ సంవత్సరం నడుస్తోంది. కలియుగంలో 1215వ ఏట గౌతమబుద్ధుడు జన్మించాడు. అది క్రీస్తునకు పూర్వం 1887వ సంవత్సరం. కలియుగంలో 2593వ సంవత్సరంలో ఆదిశంకరాచార్యుడు పుట్టాడు. అది క్రీస్తునకు పూర్వం 509వ సంవత్సరం. గౌతమబుద్ధుడు జన్మించిన సమయానికి ఆదిశంకరాచార్యుడు అవతరించిన సమయానికీ మధ్య నడిచిన 1378 సంవత్సరాలలో మన దేశ చరిత్రలో అనేక ప్రధాన సంఘటనలు దుర్ఘటనలు విఘటనలు సంభవించాయి! గౌతమబుద్ధుడు జన్మించిన తరువాత ఇప్పటికి 3902 ఏళ్లు అయింది. ఆదిశంకరుడు జన్మించిన తరువాత 2524 ఏళ్లు గడిచాయి. ఈ వైశాఖ శుద్ధ పంచమి ఈరోజు ఆదిశంకరుని 2525వ జయంతి.
గౌతమబుద్ధుడు హింసాకాండను నిరసించాడు. హింసను నిరసించడం అనాదిగా భారతీయ జీవన పద్ధతి! అహింస పరమ ధర్మము. వేదాలు పురాణాలు శాస్త్రాలు స్మృతులు హింసను నిరసించాయి. ‘‘నితాం తా పారభూతదయ’’ భారతీయ స్వభావం. అందువల్ల అహింస ప్రాతిపదికగా గౌతమబుద్ధుడు బౌద్ధమత ప్రచారం చేయడం సనాతన జీవన వైవిధ్యాలలో ఒకటి! అనేక శుభ లక్షణాల సమాహారం సనాతన సంస్కృతి! అయితే సమయానుగుణంగా ఒక్కొక్క శుభ లక్షణం ఒక్కొక్క సమయంలో ప్రాచుర్యం పొందుతుంది! ఇది సృష్టిగతమైన ధర్మం కూడ! ఎండవానలు రెండూ సృష్టిగతం! రెండూ అవసరమే….. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ప్రధానవౌతోంది! అలా బుద్ధ్భగవానుని ప్రభావంతో అహింసకు ప్రాధాన్యం వచ్చింది! కానీ శతాబ్దులు గడిచిన తరువాత ‘అహింస’ విపరీత అర్థాలకు, వక్రీకరణకు గురిఅయింది!
యుద్ధం చేయడం ‘హింస’కాదు, మనమీదికి దూకిన పిశాచాలనుండి, రాక్షసుల నుండి, క్రూర మృగాలనుండి కాపాడుకొనడానికై యత్నించడం ఆయుధ ప్రయోగం చేయడం హింసకాదు. నిష్కారణంగా నిష్కరుణగా ఇతరులను భౌతికంగా, మానసికంగా, బౌద్ధికంగా బాధించడం హింస! ఇతర దేశాలలోకి చొరబడి నిరాయుధులను వధించడం, ఇతర దేశాలలోని జాతీయ చిహ్నాలను, ధార్మిక కేంద్రాలను ధ్వంసం చేయడం, మహిళలపై అత్యాచారం జరుపడం వంటివి హింసారూపాలు. కానీ మన దేశం మీది ఇతరులు దండెత్తి వచ్చినప్పుడు వారిని ప్రతిఘటించడానికై యుద్ధం చేయడం హింస కాదు. వైవిధ్య విధ్వంసక శక్తులను తిప్పికొట్టడానికి వైవిధ్య పరిరక్షక శక్తులు సంఘర్షణ సాగించడం హింస కాదు!! కానీ శతాబ్దుల తరువాత బుద్ధ్భగవానుని ‘అహింస’ను వక్రీకరించిన వారు ‘్ధర్మయుద్ధం’ చేయడం హింసచేయడంలో సమానమని ప్రచారం చేశారు. ఫలితంగా బౌద్ధమత నిబద్ధులైన పాలకులు దురాక్రమించిన విదేశీయులను ప్రతిఘటించడం మానుకున్నారు. దేశపు సరిహద్దులు ఛిద్రమయ్యాయి. విదేశీయులు మన దేశంలోకి చొరబడి దోపిడీకాండ సాగించారు!
కలియుగం 2,269నుంచి 2775వ సంవత్సరంవరకూ ఆంధ్ర శాతవాహనులు ‘గిరివ్రజం’ రాజధానిగా మొత్తం భారతదేశాన్ని పాలించిన సమయంలో సరిహద్దుల భద్రత మరింత ఛిద్రమైంది. ఎందుకంటె ఈ ఆంధ్ర శాతవాహనులలో అత్యధికులు యుద్ధం చేయడం మానిన బౌద్ధులు. క్రీస్తునకు పూర్వం 833లో మొదలైన వీరి సార్వభౌమత్వం క్రీస్తునకు పూర్వం 327 వరకు కొనసాగింది! ఈ సమయంలోనే పారశీక రాజు డేరియస్ సైరస్ మన దేశంలోని వాయువ్య పశ్చిమ ప్రాంతాలను ఉత్తర ప్రాంతంలో కొన్ని భాగాలను ఆక్రమించాడు. కలియుగం 2552లో అంటే క్రీస్తునకు పూర్వం 550లో ఈ సైరస్ తన పేరిట కొత్త కాలగణన పద్ధతి- శకం-ని ఆరంభించాడు. భారతీయులు ఈ కొత్త ‘శకాన్ని’వాడడం ఆరంభమైంది.
ఈ భావదాస్య నేపధ్యంలో ‘సైరస శకం’ ఒకటవ శతాబ్దిలో జన్మించిన ఆదిశంకరాచార్యుడు తన పరిక్రమ ద్వారా ప్రబోధం ద్వారా స్వజాతీయులను, సనాతన భారతీయులను ప్రభావితం చేశాడు! ఈ ప్రభావం భారతీయులను శతాబ్దులపాటు జాగృతం చేసింది. విదేశీయుల దురాక్రమణనుండి దేశాన్ని రక్షించుకొనడానికై సంఘర్షణకు మళ్లీ శ్రీకారం చుట్టింది!! యుద్ధంచేయాలని భగవద్గీతను ఆవిష్కరించిన కృష్ణుడు ‘ద్వాపరం’లో బోధించాడు. ‘్భగవద్గీత’కు ‘్భష్యం’చెప్పిన ఆదిశంకరాచార్యుడు కలియుగంలో అదే కర్తవ్యాన్ని ధ్వనింపచేశాడు!! ఫలితం కలియుగం 2776లో అంటే క్రీస్తునకు పూర్వం 326లో అలెగ్జాండర్ అన్న గ్రీకు బీభత్సకారుడిని గుప్త చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు మన దేశంనుండి తరిమివేయడం…..ఇలా భౌగోళిక సమగ్రతను కాపాడడానికి పూర్వకంగా ఆదిశంకరుడు అంతర్గత సమన్వయం సాధించాడు! ఈ సమన్వయం వైదిక మతాల మధ్య మాత్రమేకాదు, వైదిక మతాలకూ, వైదికేతర మతాలకూ మధ్య కూడ ప్రస్ఫుటించడం చరిత్ర! శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణాపత్య, స్కాంద మతాలన్నీ ఒక సనాతన వేద సంస్కృతికి చెందిన వైవిధ్యరీతులన్నీ సత్యాన్ని ఆదిశంకరుడు పునఃప్రచారం చేశాడు!
ఈ సర్వమత హైందవ సంపుటంలో బౌద్ధ జైన మతాలు సమన్వయం పొందడం ఆదిశంకరుని ‘అద్వైత’ సాధనకు పరాకాష్ఠ!
ఆత్మకూ పరమ్మాకూ మధ్య అద్వైతం……
సాకార దేవతామూర్తుల మధ్య అద్వైతం…..
వ్యక్తికీ సమాజానికీ మధ్య అద్వైతం….
సమాజానికీ సృష్టికీ సృష్టికర్తకూ మధ్య అద్వైతం…..
ఆదిశంకరార్యుడు పునరావిష్కరించిన సనాతన జాతీయ తత్త్వం ఇది!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

22-4-15 మా కుటుంబం ద్వారక తిరుమల యాత్ర – భక్తాంజనేయస్వామి వారల ఆలయ తృతీయ వార్షి కొత్సవం

22-4-15 మా కుటుంబం ద్వారక తిరుమల యాత్ర మరియు మా రామారావు గూడెం అగ్రహారం లో మా స్థలం లో చందూరి సుబ్బారాగారి అమ్మాయి శ్రీమతి భారతి ,అల్లుడు శ్రీ కొలచల ప్రసాదరావు దంపతులు నిర్మించిన శ్రీ భక్తాంజనేయస్వామి వారల ఆలయ తృతీయ వార్షి కొత్సవం   ,ఏలూరులో శ్రీమతి గబ్బిట యజ్ఞశ్రీ ఇంటిలో ఆతిధ్యం  జంక్షన్ -నూజివీడు రోడ్ లో 45 అడుగుల ఎత్తు  శ్రీహనుమాన్ విగ్రహ౦ , జంక్షన్ హనుమాన్ విగ్రహ  సందర్శనం -చిత్రమాలిక 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-2

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-2

లాల్ గోవింద్  భవిష్యత్

మధ్యలో ఈ లాల్ గోవింద్ ఎవరు ?అను కుంటున్నారా?ఆయనే సీతారామయ్యగారు .చిన్నప్పుడు తండ్రిగారు పెట్టిన పేరు అది .పుట్ట్టగానే తండ్రిగారు సీతారామయ్యగారి జాతక చక్రం వేయించి ఆయన ఇండియాలో ఉండరని ,బాగా చదివి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని ,ఎప్పుడో ఒక కసారి మాత్రమె ఇండియాకు వస్తారని ,విదేశీ వనితనే వివాహం చేసుకొని సంతానం పొందుతారని తెలుసుకొన్నారు .అందుకోసం రామయ్య గారు ఏ నిర్ణయం తీసుకొన్నా సమర్ధించారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రత్యక్షంగా పరోక్షం గా సాయమూ చేశారు .ఇంగ్లీష్ వారు మనల్ని చాలా దారుణం గా అణచి వేసి మన స్వాతంత్ర్యాన్ని హరించి భాషా సంస్కృతులకు వినాశం కలిగించారని రామయ్య అభిప్రాయ పడ్డారు .కాని పది శతాబ్దాల క్రితం మనకు గొప్ప విశ్వ విద్యాలయం ఉండేదని అందులో దేశ విదేశాలకు చెందిన వారెందరో విద్య నేర్చి ఉన్నత స్థానాలు పొందారని చెప్పారు .13 వ శతాబ్దం లోనే భారతీయ నవలా సాహిత్యం పతనం చెందటం ప్రారంభించిందని ఆయన తండ్రి చెప్పేవారట .అయినా అద్భుత సాహిత్య సృష్టి జరిగింది అని అప్పటికి ఇంగ్లాండ్ లో సర్ వాల్టర్ స్కాట్ అనే నవలా కారుడు జన్మి౦ చనే లేదు అన్నారు .తన రాష్ట్రం లో కష్టపడితే తప్ప తిండి దొరికేది కాదని ‘చెమట గ్రామ లాండ్ స్కేప్’’ గా ఉండేదన్నారు .

ఒక సారినవాబుగారి రాణీకి పుట్టట గొడుగులు(ముష్రూమ్స్) ఇస్టమని  తమ పొలం లో ఉన్న కుక్క గొడుగులు ఏరుకొని వెళ్ళటానికి ఒక రాజ సేవకుడు వస్తే తండ్రి గారు అనుమతినిచ్చి ‘’మేము కుక్క గొడుగులు తినం ‘’అని వ్యంగ్యం గా అన్నారట .తండ్రికి మానవత్వం పై అపార గౌరవం అని చెప్పేవారు .ఆయనంటే ప్రాణం ,ఆరాధనా క్రమంగా పెరిగిందే తప్ప తరగనే లేదు .జీవితం లో ప్రతి దశలోనూ తండ్రి తనకు బాసటగా నిలుస్తున్నారని వెనక ఉండి నడిపిస్తూ ఆశీర్వ దిస్తున్నారని రామయ్యగారు భావించేవారు .అపార జ్ఞాన సంపద సాధించాలని ,కొత్తవాటిని కనుక్కోవాలని నూతన విషయాలను సృష్టించాలని చిన్నప్పటి నుండి అనుకొనేవారు .

కొలచల వారి మూలాలు

కోలచల వారిమూలం  మెదక్ జిల్లా లోని కోలచల గ్రామం  .మహా వ్యాఖ్యాన కర్త మల్లినాద సూరి ది అదే గ్రామం .కోలా అంటే ఎలుగు బంటి అని అర్ధం .అచలం అంటే కొండ .అక్కడ నుంచి వలస వచ్చి ఉయ్యూరు దగ్గర యాక మూరు లో ఉంటున్నారు .సీతారామయ్యగారు 15-7-1899 న జన్మించారు .7 గురు సంతానం లో ఈయన చివరివాడు .తండ్రి వెంకట కృష్ణ శాస్త్రి పురోహితులు . తల్లి మూర్తమ్మ .ఉయ్యూరులో ప్రాధమిక విద్య నేర్చి ,మచిలీపట్నం లో సెకండరీ విద్య అభ్యసించారు .తండ్రి గారు పౌరోహిత్యం చేస్తున్నా ఆధునిక భావాలున్నవారు .గ్రామం లో పెద్దమనిషిగా తగాదాలు పరిష్కరించేవారు .జ్ఞాన బోధ చేసేవారు .వంశానుగతంగా వచ్చిన వేద విద్య రామయ్యగారి దాకా నిలబడింది .కాని బ్రాహ్మణులు ఉద్యోగం చేయటానికి ఇష్టపడేవారు కాదు .ఎవరైనా ఈ విషయమై ప్రశ్నిస్తే నవ్వి ఊరుకోనేవారు .హరిజనుల విషయమై ఆయన అభిప్రాయం గొప్పగా ఉండేది .’’మనమంతా నిజాం నవాబుకు, బేగం కు హరిజనులమే’ మనం ఇప్పుడు విజ్ఞాన యుగం లో ఉన్నాం .పురాతనకాలం లో మనం  ఎవరు ఎవరి దగ్గర ’పడుకోన్నామో మనకు తెలీదు .అనేవారు  .దీనిపై కొందరు మండి పడ్డారు . మిగిలిన వారు పెద్దగా పట్టించుకొనే వారుకాదు .  అనంతకాల గమనం లో ఎవరు ఎవరికి వారసులో తేల్చటం కష్టం అని  అనే భావం ఆయనది .మన మంత్రాలలో ఎక్కడా ఆర్య శబ్దం లేదని చెప్పేవారు .ఈ భావాలన్నీ విన్న సీతారామయ్యగారికి తండ్రిపై ఉన్న ఆరాధనాభావం రెట్టింపు అయింది .

రామయ్య గారి ఉన్నత విద్యాభ్యాసం – నడిచి మద్రాస్ చేరటం

ఆయనకు ఫిజిక్స్ గణితం పై అభిమానం. వాటినే ఎన్నుకొని  మద్రాస్ లో చదువుకోవాలనుకొన్నారు .తండ్రిగారికి ఈ విషయం చెప్పారు .తండ్రిగారు పోరోహిత్యం ద్వారా సంపాదించినా కుటుంబ వ్యవహారాలకు దాన్ని జాగ్రత్త చేసేవారు .కాని ఈయన చదువుకోసం దాన్ని ఖర్చు పెట్టె ఆలోచనలో లేరాయన. మంచిదే నని కాని మద్రాస్ కు నడిచి వెళ్లాలని ఒక్కమాటలో చెప్పారు . మారు మాట్లాడకుండా ఇంట్లోనుంచి బయటికి నడిచి దారిపట్టారు రామయ్య గారు .ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని ఆశ్రయిం చాలో తెలీ కుండానే ఈ ప్రయాణం సాగింది .బెజవాడ లో కృష్ణా నదిని చూశారు అది గొప్ప ప్రబోధం చేసినట్లు అనిపించింది . తన దారిలో ఏ అడ్డంకులున్నా వాటిని అధిగమించి దారి చేసుకొని నిరంతరం ప్రవహిస్తూ సముద్రం వైపుకు సాగి పోతున్నానని అవసరాన్ని బట్టి దారి మార్చుకొంతటున్నానని చెప్పినట్లుంది .ఇలా ప్రతి నదీ గమ్యం వైపుకు పరుగులు తీస్తూనే ఉంటుంది అన్న సత్యం గ్రహించారు .తన అనంత గమ్యం లో విజయాలే వరిస్తాయో అపజయాలే చుట్టుముడతాయో తెలీదు లాల్ గోవింద్ కు .ఒక కల కంటున్నాడు .ఆకల సాకారం కోసం ప్రయత్నిస్తున్నాడు .తాను బుద్ధుడిని అని అనుకొన్నాడు .తన తో ఉండే హరిజన పిల్లాడు కుమార్ అంటే గోవింద్ కు అమితమైన ప్రేమ ఇల్లు వదిలి వచ్చేటప్పుడు అతని బాగోగులన్నీ చూసి వచ్చాడు. అది తన కర్తవ్యంగా భావించాడు ..మద్రాస్ కు సగం దారిలో ఉండగా  మేనమామ కలిశాడు .తండ్రికి డబ్బు అవసరం కలిగినప్పుడు ఈయనే సాయం చేసేవాడు .కుర్రాడు మద్రాస్ వెడుతున్నట్లు  ముందే తెలిసింది అన్నాడు ఆయన .అక్కడ ఒక జమీందార్ కు సిఫార్సు ఉత్తరం రాసిచ్చాడు .ఆ సిఫార్సు ఉత్తరాన్ని నవాబు గారి బేగం నుండి సాధించాడాయన .జమీందార్ అన్నీ చూసుకొంటాడని భరోసా ఇచ్చాడు కూడా .త్వరలో డిగ్రీ సాధించి అందరికి సంతోషాన్ని కలిగించమని ఆశీర్వ దించాడు .నడుచుకొంటూ నడుచుకొంటూ మద్రాస్ చేరారు సీతారామయ్య .అదే ఆయన చూసిన మొదటి సిటీ .దాని చూసిన అనుభూతి జీవితాంతం ఉందంటారు ఆయన .సిఫార్సు ఉత్తరం మీద ఎవర్ని కలవాలో ఉంది. తానుకలవాల్సింది ఒక ఇంగ్లీష్ ఆయన్ను అని తెలిసి కంగారు పడ్డారు .

 

..అక్కడి నుండి  మదన పల్లె చేరి అక్కడ డాక్టర్ అనీబిసెంట్ నేషనల్ యూని వర్సిటి లో 1917 లో చేరి బి ఎస్ సి డిగ్రీ1921లో  పొందారు . అక్కడి నుండి మద్రాస్ లోని అడయార్ కు ఆవిద్యాలయం మారింది .తండ్రి గారు చిన్నప్పటి నుండీ చెప్పిన ‘’ఏ పని అయినా అంకితభావం తో చేయాలి .ఇదే అత్యున్నత మైన యోగ .సంపూర్ణతను ప్రతి విషయం లో సాధించాలి పనిపై శక్తి యుక్తులన్నీ కేంద్రీకరించి పని చేయటం ఉత్తమ విధానం .’’యోగః కర్మ సు కౌశలం ‘’అనే గీతావాక్యం ప్రేరణ కావాలి  .ఇలా చేస్తేనే మానవులం అని పించుకొంటాం .మనవ జన్మ కు సార్ధకత ఇదే ‘’మాటలు సీతారామయ్యగారికి తారక మంత్రమే అయింది జీవితం లో అన్ని దశలలో దాన్ని పాటించి ఉత్తమ ఫలితాలు సాధించి సర్వోత్తమ మానవులుగా ఎదిగారు మనిషి మనీషి అయ్యారు

ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశ పయనం

జ్ఞానం సంపాదించాలి అనేది సీతారామయ్యగారికి స్తిర సంకల్పం అయింది .ఏ పని చేసినా అదే దృష్టితో ఉండేవారు . .

.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-1

రష్యా సీతారామయ్య రాక

అది 1963 వ సంవత్సరం మే  నెల .ఉయ్యూరు అంతా’’రష్యా సీతారామయ్య ‘’గారి రాక కోసం ఎదురు చూస్తోంది .ఆయన ఉయ్యూరువాడని ,రష్యా వెళ్లి 42 ఏళ్ళు దాటి మళ్ళీ ఇన్నేళ్ళకు, ఇన్నాళ్ళకు42రోజుల పర్యటనకు  ఉయ్యూరు వస్తున్నారని అందరు సంబర పడుతున్నారు .రష్యాలో ఆయన గొప్పఆయిల్  శాస్త్ర వేత్త అని ,అనంత రామయ్యగారి తమ్ముడు అని మాత్రమె తెలుసు .అంతకంటే ఇరవై మూడేళ్ళ వయసున్న మా లాంటి వారికి మిగిలిన వివరాలు తెలీవు .ప్రతి ఇల్లు తమ ఇంటి బంధువు వస్తున్నట్లు ఎదురు చూసింది .ఆయనకు అపూర్వ స్వాగత సత్కారాలు చేసి గౌరవి౦చు కోవాలనే ఉత్సాహం పెల్లుబికింది. అదీ ఆ సందడి కి కారణం .మా వంగల దత్తుగారి పుణ్యమా అని సీతారామయ్య గారి ని దగ్గరగా చూసే అవకాశం కలిగింది .అప్పటికే మేము దత్తు గారింట్లో ‘’బాల భారతి ‘’నిర్వహిస్తున్నాం ‘’నన్నయ కళాసమితి ‘’ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తున్నాం .అందువల్ల దత్తుగారింట్లో మాకు స్వతంత్రం ఎక్కువ .మా మిత్ర బృందం అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం .సెలవులైతే ఇక చెప్పక్కర్లేదు .ఆయన లైబ్రరీ ఆయన రేడియో మాకే స్వంతం .అంత చనువు .మాకంటే చాలా పెద్ద వయసు వారే అయినా దత్తుగారు మాకు స్నేహితునిలాగానే కనిపించేవారు .కనుక దత్తుగారింట్లో మాకున్న చనువుతో సీతారామయ్యగారిని మరింత దగ్గరగా చూడచ్చు ,మాట్లాడచ్చు అనే ఆనందం నాది .

సీతారామయ్యగారు ఉయ్యూరుకు దగ్గరున్న యాక మూరుచిన్న పల్లెటూరిలో   సుక్షేత్రమైన వ్యవసాయ క్షేత్రం లో స్వంత అన్నగారింటిలో దిగారని ,అక్కడి బంధు మిత్రులందరూ ఆనందాన్ని పట్టలేక పోయారని ,వారు ఆయనకు ఆప్యాయంగా నలుగుపెట్టి ,తలంటి పోశారని ,ఉయ్యూరువదిలి సుమారు అర్ధ శతాబ్దంఅయినా స్వచ్చమైన తెలుగు మాట్లాడుతున్నారని ,ఇంట్లో సంధ్యావందనం ,పూజ చేస్తున్నారని ,దేవాలయాలకు వెళ్లి దర్శిస్తున్నారని ,సంస్కృత శ్లోకాలు, తెలుగు కవుల పద్యాలు ధారాళంగా అవసరం వచినప్పుడు వారి నోటినుండి వెలువడుతున్నాయని ,శ్రీ శ్రీ మహా ప్రస్తానం వారికి వాచో విదేయమని ,సంస్కృత కవుల గురించి సాధికారంగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయని వార్తలు యాకమూరు నుండి ఉయ్యూరుకు ఏ రోజుకారోజు చేరేవి .విని ఆనది౦చే వాళ్ళం అంతటి సంస్కారం ,నిబద్ధత భారతీయ సంస్కృతిపై మక్కువ నా బోటి వారికి పరమానందాన్నే కలిగించింది .ఒక రకం గా ఆయన అభిమానినయ్యాను . కరడుకట్టిన కమ్యూనిస్ట్  దేశమైన రష్యాలో ఉంటూ ఈ దైవ భక్తీ, మాత్రు దేశ భక్తీ సంస్కృతీ ,సంస్కారాలు ఇంకా వంట బట్టి ఉండటం మరింత ఆశ్చర్యం కలిగించింది .రష్యాలో ఆయన పేరు ‘’కాన్ స్టాన్టిన్ సెర్జియో విచ్ ‘’అని తెలిసి ఇంకా ఆశ్చర్య మేసింది .ఆ పేరు మాకు ఒక మంత్రమే అయింది .తెలిసినవారందరికీ ఆపేరు ప్రచారం చేశాం .రష్యా సీతారామయ్యగారి అసలు పేరు’’ కొలచల సీతారామయ్య ‘’అని పూర్తిగా తెలుసుకొన్నాం. రష్యా పేరున్నా అక్కడ ఆయన ‘’రామయ్యా’’ అనే పిలువ బడేవారని, చెప్పుకొనే వారని తెలిసి మరీ ఆనందమేసింది .ఆయన రష్యా ఆవిడను పెళ్లి చేసుకొన్నారని ఆవిడ పేరు ‘’కాత్యా ‘’అని కాని రష్యాలో ఆమెను ‘’సీతమ్మ ‘’అని ఆప్యాయంగా పిలుచుకోనేవారని ,ఇంట్లో ఆతిధ్యం అచ్చంగా తెలుగు సంప్రదాయం లోనే ఇచ్చేవారని  మరిన్ని వివరాలు తెలుసుకొని ముక్కు మీద వేలేసుకోన్నాం .ఆయన ఇద్దరు కూతుళ్ళకు లీలావతి అని ,నీల వేణి అని భారతీయ పేర్లు పెట్టారని తెలిసి మరీ యెగిరి గంతేశాం .అంతకు మించి సీతారామయ్యగారి గురించి మాకు తెలియలేదు .తెలుసుకొనే తీరుబడీ లేదేమో !అప్పటికి మా నాన్న గారు చనిపోయి రెండేళ్ళు అవుతోంది .రాజమండ్రిలో బి .ఇ .డి .ట్రెయింగ్ పూర్తీ చేసికృష్ణా  జిల్లా పరిషత్ లో సైన్స్ మేస్టర్ ఉద్యోగం కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నాను .వేసవి సెలవలు కూడా .అప్పుడు రోహిణి లో రోళ్ళు బద్దలయ్యే ఎండలుండేవి.

దత్తు గారింట్లో –కొలచలవారింట్లో –సూరివారింట్లో సీతారామయ్యగారు

యాకమూరు నుంచి బంధుగణం తో ఒక రోజు దత్తుగారింటికి వచ్చారు సీతారామయ్యగారు .మేమందరం ఆయన చుట్టూ మూగి హడావిడి చేశాం .పెద్దవాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు .ఆయన ఏంతో ఓపికగా సమాధానాలు చెబుతున్నారు  .రష్యా అభివృద్ధి జర్మనీ అభి వృద్ధి విషయమై ప్రశ్నలేవరో వేశారు .అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది .మర్చిపోలేని విషయం అది. ‘’మన భారత దేశం లో అన్నీ ఉన్నాయి .ఆలోచనల్లో మనమే ముందు .కాని ఆచరణలో వెనక బడిపోయాం .దీనికి పరాయి పాలన కొంత కారణం .మన అశ్రద్ధ మిగతాకారణం  మీకు తెలియని విషయం ఒకటి నేను చెబుతున్నాను వినండి .ఇది ప్రైవేట్ సంభాషణ కనుక ఇబ్బంది లేదు .వేదిక మీద ఇలాంటివి చెప్పకూడదు .విమాన శాస్త్రాన్ని మన భరద్వాజ మహర్షి రాశారు .కాని దానిపై మనం ఆలోచించి ప్రయోగాలు చేయలేక పోయాం .కాని జర్మన్లు ఆ శాస్త్రాన్నిమన నుంచి  దక్కించుకొన్నారు .మన వాళ్ళను తీసుకొని వెళ్లి దాన్ని విశేషాలు నేర్చుకొని వాళ్ళ భాషలోకి మార్చుకొని విమానాలు  తయారు చేసి  ఆధునీ కరించారు .ఇలా ఎన్నో శాస్త్రాలు మననుంచి వారికి చేరాయి .వాటిని చక్కగా ఉపయోగించుకొన్నారు .మన దేశం లో లేని శాస్త్రం లేదు ధీరీ  ఉంది .దానిపై ప్రాక్టికల్స్, అప్లికేషన్లు మనం చేయలేకపోయాం  మనకు ఆర్ధిక స్తోమతా తక్కువే .దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు .మనం వెనక బడి పోయాం ‘’అనగానే అందరము  గట్టిగా చప్పట్లు కొట్టి  అభి నందించు కొన్నాం . మన గొప్ప తనానికా ?చేతకాని తనానికా ఆ చప్పట్లు అని ఇప్పుడని పిస్తోంది .దత్తు గారింట్లో కాఫీ టిఫిన్లు  భోజనాలు ఏర్పాటు జరిగింది .సాయంత్రంకాలేజి రోడ్డులోని  కొలాచల శ్రీరామ మూర్తి మామయ్య ఇంటికి సీతారామయ్యగారితో ఆటు అందరం చేరాం .అక్కడా ఇలాగే సంభాషణ పరంపర సాగింది .ఆయనా ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చాడు .ఆ తర్వాత సూరి అనంత రామయ్యగారింటికి వెళ్ళిన జ్ఞాపకం .అక్కడా మనసు విప్పి మాట్లాడారు పాత జ్ఞాపకాన్నీ తవ్వి తీశారు .అందర్నీ పేరు పేరునా ఆరా అడిగి తెలుసుకొన్నారు .రష్యాలో తమ జీవిత విధానం ,ఇంట్లో ఆడవాళ్ళ విషయం పిల్లలు ఏమి చేస్తున్నారు  అన్నీ సవివరంగా చక్కని తెలుగులో మాట్లాడుతుంటే చూసే వారందరం బొమ్మల్లా మారి పోయాం .అంతటి ప్రభావం కలిగించారు

పౌర సన్మానం .

ఉయ్యూరులో సీతారామయ్య గారు ఎక్కడికి వెళ్ళినా యాభై అరవై మంది ఆయన్ను అనుసరించి ఒక ఊరేగింపుగా వెళ్ళేవారు .చూడటానికి భలే ముచ్చటగా ఉండేది .ట్రావెలర్స్ బంగళాలో మే నెల 21 వ తేదీసాయంత్రం ఉయ్యూరు పంచాయితీ ప్రెసిడెంట్, పంచాయితీ  సభ్యులు ,పౌర సమితి తరఫున డాక్టర్ మిక్కిలినేని సాంబశివరావు గారు కలిసి బ్రహ్మాండమైన ఆత్మీయ పౌర  సన్మానం చేశారు సీతారామయ్యగారికి  .పుష్పహారాలతో ముంచెత్తారు .దీనికి కమ్యూనిస్ట్ పార్టీ వారు లీడ్ తీసుకొన్నారు .బహిరంగ సభలలో సీతారామయ్యగారు భారత రష్యా మైత్రీ బంధాన్ని గురించి చెప్పేవారు రష్యా అగ్రగామి దేశంగా మారిందని అన్నిరకాల భారత దేశ అభి వృద్ధికి అన్నిరంగాలలోనూ సహాయ సహకారాలు అంద జేస్తుందని తెలియ జేసేవారు. ఇంటర్వ్యులలోనూ ఈభావాన్ని చెప్పేవారు   .

మళ్ళీ  రష్యాకు

1963 ఏప్రిల్ 22 నుండి జూన్ 5 వరకు 42 రోజులు మాత్రమె మాత్రు దేశమైన భారత్ లోగడిపి  సీతారామయ్యగారు మళ్ళీ రష్యా చేరుకొన్నారు .ఆయన తాను ఇండియాకు ,రష్యాకు చెందినా ఉమ్మడి పౌరుడిని అని చెప్పి గర్వ పడే వారు రష్యాలో ఆయన్ను’’ ఆంధ్రా సీతా రామయ్య’’ అంటే ఇండియాలో మనం ఆయన్ను ‘’రష్యా సీతారామయ్య’’ అంటాం .అదే బంధుత్వం రెండు దేశాల మధ్య .ఆయన ఒక శాస్త్రీయ సాంకేతిక రాయబారి . భారత్ నుండి రష్యా వెళ్ళిన తర్వాత సుమారు 14 సంవత్సరాలకు ఉబ్బసం తీవ్రమై న్యుమోనియా తో బాధపడి  29-9-1977 న  సీతారామయ్యగారు 78 వ ఏట మరణించారు .

మనుమరాలు మూలాల  ఆచూకీకి  రాక

సుమారు పదేళ్ళ క్రితం  కొల చాల సీతారామయ్యగారి మనుమరాలు ‘’అనస్తేషియ ‘’తన తాతగారు జన్మించిన  గ్రామాన్ని దేశాన్ని సందర్శించాలని తన మోల్లాల అస్తిత్వాలను తెలుసుకోవాలని ఉత్సుకత తో , సంకల్పం తో ఇండియా వచ్చింది .’’హాం రేడియో అధిపతి’’ సూరి శ్రీరామ మూర్తి (సూరి)ఆమెను హైదరాబాద్ నుండి ఉయ్యూరు తీసుకొని వచ్చి ఉయ్యూరు కాలేజి దగ్గరున్న తన స్వగృహం లో శ్రీ వై. వి .బి .రాజేంద్ర ప్రసాద్  ఆధ్వర్యం ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేసి ,తాతగారు తిరగాడిన ప్రదేశాలన్నీ తిప్పి చూపింఛి  ,ఆమెకు గొప్ప స్పూర్తి కలిగించాడు  ఆమె వాళ్ళ మాకు ప్రేరణ కల్గించాడు .ఆమె భారత నారిలాగా చీరా జాకెట్ ధరించి బొట్టు గాజులుతలలో పూలు పెట్టుకొని అందరి అభిమానాన్నీ పొందింది .కలుపుగోలుగా మాట్లాడింది ప్రశ్నలు వేసి అక్కడికి చేరిన వారితో సీతారామయ్య గారి పరిచయాన్ని అడిగి తెలుసుకొన్నది .మళ్ళీ వస్తానని ,ఇక్కడ తాతగారికి ఏదో ఒక స్మ్రుతి చిహ్నం ఏర్పాటు చేయాలను కొంటున్నానై తెలియ జేసింది . .ఆమె ఏంతో ఆత్మీయంగా ,తన్మయంగా  మాట్లాడి కృతజ్ఞతలు తెలియ జేసింది . ఆసభలో నేనూ ప్రసంగిస్తూ ‘’మన బజారుకు’’ కొలచల సీతా రామయ్య బజారు ‘’అని పేరు పెట్టి గౌరవించి సార్ధకం చేసుకోవాలి అని ,దీనికి రాజేంద్ర చొరవ తీసుకోవాలని ‘’చెప్పాను .రాజకీయ నాయకుడు కనుక రాజేంద్ర ‘’ అదెంత పని .పంచాయితీ మనదే   .తీర్మానం చేసి పాస్ చేయిద్దాం ‘’అని హామీ ఇచ్చాడు .కాని ఇంతవరకు ఏమీ జరగలేదు  .ఎనస్తేషియా భావించిన స్మ్రుతి చిహ్నమూ యేర్పడ లేదు .ఇవన్నీ సభా వైరాగ్యాలే .Untitled

ఈ మధ్య మా మైనేని గోపాల కృష్ణగారు సీతారామయ్యగారి పై వచ్చిన ‘’A wreath for doctor Ramayya ‘’92cc227532d17e56e07902b254dfad10 by Ghen Shangin –Berezovsky ‘పుస్తకం కొని పోస్ట్ లోపంపారు .దాన్ని మూడు రోజుల్లో జుర్రేశాను .దాని నాదారంగా సీతారామయ్యగారి జీవితం ,పరిశోధనలు ,సాహిత్యం మొదలైన విషయాలపై ఏదో రాయాలనే సంకల్పం కలిగి మైనేని వారికి మెయిల్ రాశా .దానికి శీర్షిక కూడా ‘’పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’అనేది ,‘’కొలచల సీతారామయ్యాయణం ‘’అనే శీర్షికా మనసులో మెదిలి ఆయనకు తెలియజేశాను .  మొదటిది మైనేని వారికి బాగా నచ్చిందని చెప్పారు ..కాని రాత్రి ఎందుకో ‘’కేమోటాలజీ పిత కొలచల సీతారామయ్య ‘’అనేది సార్ధకం గా ఉంటుందని ,ఆయన వైజ్ఞానిక కృషికి అద్దం పడుతుందని అనిపించి మొదలుపెట్టాను .ఎలా రాయాలో తెలీక ఇలా ప్రారంభించా . దీన్ని ధారావాహికం గా రాస్తాను .అంతటి మహా విజ్ఞాన శాస్త్ర వేత్త మా ఉయ్యూరు వాడనే గర్వం ,ఆయన జీవితం అందరికీ తెలియాలనే తపన ,అది యువత కు ఆదర్శం కావాలనే కోరికా, మా గోపాల కృష్ణ గారి సౌజన్యానికి కృతజ్ఞత లే  ఈ వ్యాస పరంపర .సీతారామయ్యగారి ఫోటో కోసం గూగుల్ లో వెతికితే దొరక్కపోవటం దురదృష్టం .అందుకని ఆ పుస్తకం లోదే తీసు కొంటున్నాను.కింద ఫోటో జతచేశాను చూడండి  .k .sitaramayya 001

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-4-15 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

సరసభారతి నిర్వహించిన పాలగుమ్మి పద్మ రాజు గారి శత జయంతి

సరసభారతి నిర్వహించిన పాలగుమ్మి పద్మ రాజు గారి శత జయంతి palagummi100yrs 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విహారిగారు స్వర్గీయ గుత్తికొండ రామరత్నం గారిపై రాసిన ”స్మృతిగీత ”

విహారిగారు స్వర్గీయ గుత్తికొండ రామరత్నం గారిపై రాసిన ”స్మృతిగీత ”smrutigeeta 001

Posted in కవితలు | Tagged | Leave a comment

రావికొండలరావు కు ”నాటక రంగం అంటే ప్రాణం ‘

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జయకాంతన్ హృదయావిష్కరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాజీమంత్రులే” యెర్ర ”దొంగలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నీడ ఓ క్రీనాడ-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హాట్రిక్ కపూర్స్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంస్కృతీ వలనే సాహిత్యం పరిపుస్ట మవుతుంది-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీరాముని మెప్పించిన శబరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’జీవితం సప్త సాగర గీతం ‘’–రచన కీ .శే.వేటూరి సుందర రామ మూర్తి

‘’జీవితం సప్త సాగర గీతం ‘’–రచన కీ .శే.వేటూరి సుందర రామ మూర్తి

 

Inline image 1

సేకరణ- శ్రీమతి గబ్బిట సమత –తెలుగుపండిట్ –హైదరాబాద్

జీవితం సప్త సాగర గీతం –వెలుగు నీడల వేదం

సాగనీపయనం –కల ఇలా కౌగిలించే చోట

ఏది భువనము ,ఏది గమనము –తార తోరణము

ఈ ‘’చికాగో సియర్స్ టవర్ ‘’–ఏ స్వర్గ సోపానమో ?

ఏది సత్యం ఏది స్వప్నం ‘’డిస్నీ’’జగతిలో ?

ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము

హే బ్రహ్మ మానస గీతము

మనిషి గీసిన చిత్రము –చేతనాత్మక చిత్రము

మతి కృతి పల్లవించే చోట –జీవితం సప్త సాగర గీత౦

ఆ’’ లిబర్టీ ‘’శిల్ప కళలో –స్వేచ్చాజ్యోతులు

‘’ఐక్య రాజ్య సమితి ‘’లోన కలసే జాతులు

ఆకాశాన సాగిపోయే అంతరిక్షాలు

‘’ఈ మయామి బీచ్ ‘’కన్న ప్రేమ సామ్రాజ్యము

హే సృష్టికి ఇది అందం –దృష్టికందని దృశ్యము

కవులు రాయని కావ్యము –కృషీ కుషీ సంగమించే చోట

జీవితం సప్త సాగర గీతం –జీవితం సప్త సాగర గీతం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment