శివరాత్రి.. జ్ఞానదీప్తి

శివరాత్రి.. జ్ఞానదీప్తి

  • 15/02/2015
  • – పసుమర్తి కామేశ్వరశర్మ

‘శివ ఏవ కేవలః’ సృష్టికి ముందు నిరాకారము, నిర్గుణము, నామరూప రహితము అగు ‘సత్’ పదార్థమొక్కటి ఉన్నదని, అది శివుడని తెలుపుతున్నాయి- వేద మంత్రములు. సృష్టి, స్థితి, లయములనే ధర్మముల వలన ఆయనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే నామములు ఏర్పడ్డాయి. శివునికి ఉన్న నామ రూపాలలో ఒకానొక ప్రత్యేకత, విశిష్టత ఉంది. పరమ శివుని రూపములు రెండు. ఒకటి పురుష రూపం, రెండవది ‘లింగ’ రూపం. ‘శమయతీతి శివః’ అందరినీ బ్రహ్మానందంలో శమింపచేసేవాడు, శివుడు. ‘శీతే సజ్జన మనస్సు ఇతి శివః’ – సజ్జనుల మనస్సులలో శయనించి ఉండేవాడు, శివుడు. ‘శివం వేదః తద్యోగాత్’ శివమంటే వేదము. ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః అని ప్రపంచానికి శాంతి మార్గాన్ని దర్శింపజేసి, శాంతింపజేసే వేదము – శివమవుతుంది. దాని యోగము గలవాడు శివుడు. శివప్రదత్వాత్ శివః మంగళములను, శుభములను ఇచ్చేవాడు – శివుడు. ఇలా అనేక వ్యుత్పత్యర్థాలు ఉన్నాయి. ముఖ్యమయినది మరోటుంది. ‘శం నిత్య సుఖమానంద మికారః, పురుషః స్మృతః వకారః శక్తిరమృతా మేళనం శివ ఉచ్యతేః’ అన్నది శివపురాణమే. ‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము. ‘ఇ’ కారం – పరమ పురుషుడు. ‘వ’కారం అమృత స్వరూపిణి అయిన శక్తి. ఈ ముగ్గురి కలయికయే ‘శివం’ అవుతుంది. ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్థం. పరమశివుని కంఠం నుండి బయల్వెడిలింది ఓంకారము. దాన్ని విడదీస్తే ‘అ ఉమ్’ అయింది. ‘అ’ను ‘మ్’ ప్రక్కన చేరుస్తే ‘ఉమ’ అయింది. ఉమ అంటే బ్రహ్మ విద్య. ఓంకారం బ్రహ్మవిద్య. అందుకే ‘ఉమ’ను పరమశివుడు ఎప్పుడూ తన దేహార్ధ భాగంలో ఉంచుకొంటాడు. వేదమాత శివునికి అర్ధాంగిగా ఉంటుంది. వారి భార్యాభర్తృ సంబంధము నిత్యము, శాశ్వతము. దీనిననుసరించే భారతీయ వివాహ వ్యవస్థ స్థాపించబడింది. పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు, ఆదిదంపతులు. ‘సనాతన’ అంటే ఎల్లప్పుడూ, నిత్యనూతనం అని అర్థం. కాళిదాస మహాకవి తన రఘువంశ, కుమార సంభవములనెడి కావ్యముల ద్వారా భారతీయ దాంపత్య వ్యవస్థను పార్వతీపరమేశ్వరుల ద్వారా చెప్పాడు. వాగర్థా వివసంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ – పార్వతీ పరమేశ్వరులు వాగర్ధములలాగా శాశ్వత సంబంధం కలవాళ్లు. సప్త మహర్షులు హిమవంతుని దగ్గరకు, పరమశివుని తరఫున రాయబారంగా వెళ్లి, ‘తమర్థ మివ భారత్యాసుత యోక్తు మర్హసి’ వేద వాక్కుతో పరమార్థము జత చేసినట్లు, యోగము చేసినట్లు, నీ కూతురైన పార్వతితో, శివుని యోగము చేయమన్నారు. అందుకే, శివరాత్రి రోజున లింగానికి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటే, ఇటు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇదే మహా శివరాత్రి మహోత్సవమంటే. వ్యక్తమంటే కనిపించేది. ఆ వ్యక్తమంతా ఉమాస్వరూపం. కనిపించనిదంతా – అవ్యక్తం. ఆ అవ్యక్తం – శివస్వరూపం. ‘వ్యక్తావ్యక్త స్వరూపిణి’ అర్ధనారీశ్వర తత్త్వం. ఉమాశంకరుల యోగమునకు విష్ణువని పేరున్నదని రుద్ర హృదయోపనిషత్ చెబుతోంది. బాగా వికసించిన పుష్పములుగల వృక్షము నుండి చాలా దూరము వరకు సుగంధ పరిమళము వ్యాపిస్తుంది. పుణ్యకర్మలు చేసేవాడి నుంచి మంచి సుగంధము వస్తుంది. పరమశివుడు అనే తీగకు వేద రూప పుష్పములు పూయటం వలన, ఆ తీగె నుండి మంచి విద్యాగంధము వీస్తుందిట. ఆ గంధము ప్రజలకు పుష్టిని, వృద్ధిని సమకూరుస్తుంది. ఇహపరముల నిస్తుంది. అందుకే శివుణ్ణి ‘సుగంధి’ అని వేదము వర్ణించింది. ‘త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ఉర్వారుకమివ బంధనా న్మృత్యోర్ముక్షేయ మామృతాత్’ – ‘యజుర్వేదం త్రినేత్రుడు, పరిమళమును వెదజల్లువాడు, మంచి పుష్టిని చేకూర్చువాడు అయిన రుద్రుణ్ణి మేము ఆరాధించుచున్నాము. దోసపండును తొడిమ నుండి వేరు చేసినట్లు ఆ రుద్రుడు, మమ్మల్ని మృత్యువు నుండి వేరుచేసి, కాపాడి అమృతత్త్వాన్ని చేకూర్చుగాక’ అని అంటూ, మహాశివునికి లింగోద్భవకాలంలో పరమశివుడికి అభిషేకం చేస్తున్నాం. ప్రతిమాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. ‘శివరాత్రి’ అనే పదానికి, శుభప్రదమైన, మంగళకరమైన రాత్రి అని అర్థం. రాత్రి ‘చీకటి’ కదా.. అజ్ఞానానికి సంకేతం. ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, లింగోద్భవ కాల జ్ఞాన జ్యోతి దర్శనం, బిళ్వార్చన, నామసంకీర్తన, శివపార్వతుల కళ్యాణం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగింపబడుతుంది. శివారాధన వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. ‘చంద్రమా మననో జాతః’ మనస్సుకి అధిదేవత చంద్రుడు. చంద్రుని కళలు కృష్ణ పక్షంలో దినదినం క్షీణించి, చతుర్దశి నాడు కేవలం ఒక కళే ఉంటుంది. అలాగే. మనసుకు చేరిన 16 మాలిన్యములు (అష్టమదములు, అరిషడ్వర్గములు, మనస్సు అహంకారం) ఒక్కటే శేషించి ఉంటుంది. ఆ మాలిన్యాన్ని దూరం చేసేది – శివపూజ, శివాభిషేకం, శివనామ సంకీర్తనం. ఇక్కడే మనం మార్కండేయుడి కథను, ఆధ్యాత్మికతను జ్ఞప్తి చేసుకోవాలి. ‘మనుష్యాణాం సహస్రేషు’ అన్నట్టు, కోటికొకడుంటాడు. పట్టుదలగల సాహసికుడు, సాధకుడు. పట్టుదలుంటే చాలదు, పట్టుకోవటానికొక ఆలంబనముండాలి. అదే శివాకార వృత్తి. ‘లీనంగమయ తేతి లింగం’ అఖండమైన జ్ఞానం. మార్కండేయుడు శివలింగాన్ని వాటేసుకొన్నాడంటే ఏమిటి అర్థం? 16 ఏళ్ల వయసుకే మృకండ మహర్షి కుమారుడైన మార్కండేయుడు కాలధర్మం చెందవలసి ఉంది. దీనికి ప్రతీకారం చేయాలని శివలింగాన్ని పట్టుకున్నాడు. యముడు వచ్చి కాలపాశం వేశాడు. కానీ, శివలింగం వాటేసుకున్నాడు కాబట్టి శివుడు ప్రత్యక్షమైనాడు, కాలుణ్ణి పంపించి, అజరామరుణ్ణి చేశాడు మార్కండేయుణ్ణి. పదహారేళ్లవోకావు – షోడశ కళాత్మకమీ ప్రపంచం. కాలం వల్లనే దానితో సంబంధం. అది కాలంతోటే తిరుగుతుంది. అదే మృత్యువు. అదే కాలపాశం. కాలమనే పాశం. దాన్ని జయించే మార్గం – శివాకార వృత్తి. మృత్యుభయం లేదు. మానవుడికి, అమృతత్త్వానే్న ప్రసాదిస్తుంది. అసలు అమృతమనేది ఎక్కడుంది? అది సంసారంలోనే ఉంది. విషం లాంటి మృత్యువూ ఉంది. మన జీవిత సాగరాన్ని మధించాలి, అపుడు రెండూ దర్శనమిస్తాయి. హాలాహలం లాంటి కాలాన్ని కబళించి, కాలాతీతమైన శివతత్త్వమే నా స్వరూపమని గుర్తు చేసికొంటే అమృతత్వం లభిస్తుంది. త్యాగగుణం అలవడుతుంది. త్యాగం – నిశ్చల నిర్మల మనస్సునిస్తుంది. ‘త్యాగేనైకే అమృతత్త్వ మనసుః’ అన్నది శ్రుతి. దీనే్న బోధిస్తుంది మహాశివరాత్రి. శివుణ్ణి సాకారంగా అనగా మూర్తమైన విగ్రహంగా తీసికొంటే- ఆయన భస్మానులేపనం, పృథివికి, గంగాజటాజూటం – జలానికి, ఫాలనేత్రం – అగ్నికి, నాగభూషణత్వం వాయువుకి, దిగంబరత్వం ఆకాశానికి సంకేతమైతే, చంద్ర శేఖరత్వం మనస్సుకి, వృషభ వాహనం బుద్ధికి, గజచర్మ ధారణం అహంకారానికి, త్రిశూల ధారణం – త్రిగుణాలు తన కధీనమై ఉన్నాయని, త్రిగుణాతీతుడని వివరిస్తాయి. అమ్మవారు శరీరానే్న పంచుకొని ఉందంటే ఏమిటి అర్థం? చిద్రూపం శివ తత్త్వమైతే, సద్రూదం శక్తితత్త్వం. సచ్చిత్తులు అవినాభూతమయినవని చెప్పేది అర్ధనారీశ్వర తత్త్వం. ‘సత్యజ్ఞానానంద రూపా సామరస్య పరాయణా’ అన్నారు. మాఘ మాసంలో చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలం. ఈ రోజు శివుడు తేజోమయంతో లింగాకారం నుండి ఆవిర్భవించాడు. ‘అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్, అహేగ్‌ంశ్చ సర్వాజ్ఞమ్భయస్థ్య ర్వాశ్చయాతు ధాన్యః’ దేవతలకు ప్రప్రథమ వైద్యుడు రుద్రుడు. అందు శివునికి అభిషేకం చేస్తే సర్వరోగములు నశిస్తాయి. ఆయన గొప్ప శస్త్ర చికిత్సా నిపుణుడు. మనిషికి ఏనుగు తలను పెట్టినవాడు. అందుకే వైద్యులు లోపల శస్త్ర చికిత్స చేస్తుంటే జయప్రదంగా జరిగి, స్వస్థత చేకూరాలని, మానసికంగా రుద్రనమకాన్ని ముఖ్యంగా ఈ మంత్రాన్ని ‘అఘారేభ్యో…’ అనే మంత్రాన్ని పఠించి, దైవ బలాన్ని కూడా అర్థిస్తారు. శివరాత్రినాడు శివరాత్రి మహాత్మ్యాన్ని చెప్పుకోవాలి. ఒక వేటగాడు మహాశివరాత్రి పర్వదినాన మృగములను వేటాడే నిమిత్తం ఒక చెట్టుపై కెక్కాడు. చెట్టుకు సమీపంలో వలను వేసి ఎదురుచూస్తున్నాడు. ఎంత రాత్రి అయినా ఒక్క మృగము కూడా ఆ దిక్కుకు రాలేదు. మృగములు రాకను చాటుగా ఉండి చూడాలని చెట్టుపై నుండి కిందికి రాలేదు. కాలక్షేపానికి, ఏదో చేయాలి కాబట్టి, ఆ చెట్టు ఆకులను తెంపి కింద వేయసాగాడు. ఆ ఆకులు అప్రయత్నంగా కిందనున్న శివలింగంపై పడ్డాయ. అతను ఎక్కి కూర్చున్నది బిళ్వ వృక్షము. తనకు తెలీకుండానే శివునికి, శివరాత్రి రోజున శివునికి బిళ్వార్చన చేశాడు. పట్టుదలతో వేట దొరికిన తరువాతే ఇంటికి వెళ్లాలనుకుని రాత్రంతా జాగరణ చేశాడు. తెల్లవారింది. ఏమీ లేకుండానే ఇంటికి వెళ్లాడు. అతని భార్య కూడా భర్త రాక కోసం ఎదురుచూస్తూ జాగరణ చేసింది. ఉపవాసం చేసింది. దాని ఫలితంగా ఇద్దరూ శివసాన్నిధ్యం అందుకున్నారు. తెలియకుండా, అప్రయత్నంగా చేసిన దానికే ఇంత ఫలితాన్ని పొందితే, తెలిసి సంపూర్ణ భక్త్భివంతో చేస్తే ఆ పరమశివుడు ఇంకెంత ఇస్తాడో..! ఈశ్వరునికి వాహనము నంది. ఈశ్వర తత్త్వానికి లింగము ఎలా గుర్తో, జీవతత్త్వానికి ‘నంది’ అలా గుర్తు. జీవతత్త్వములోని పశుతత్త్వం. పశుతత్త్వముతో కూడిన ఈ జీవతత్త్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పకుండా ఈశ్వరుని వైపు తిప్పటం చేత భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందుతుంది. నందిని, ఈశ్వరుడిని రెండుగా విభజించి చూస్తారు. నందికి ఈశ్వరునికి ఎవరూ అడ్డు తగలకూడదు. అంటే జీవునికి, పరమాత్మకు అడ్డం ఉండకూడదు. నంది ధర్మానికి ప్రతీక. జీవుడు నంది శృంగముల మధ్య నుంచి లోపలున్న పరమాత్మను దర్శిస్తాడు. తనలో ఉన్న పశుతత్త్వాన్ని అణచివేసుకొని, ధర్మంతో అర్థ, కామాల్ని అనుభవిస్తే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని పొందుతాడు. అప్పుడు నంది, ఈశ్వరుడు అని రెండుగా ఉండవు. ‘నందీశ్వర’ అని రెండూ ఏకమై పోయినాయి. అప్పుడు అన్నీ ఒకే తత్త్వంగా భాసిస్తాయి. ఇదే శివరాత్రి మనకు అందించే ఆధ్యాత్మికత. బిళ్వార్చన విశిష్టతను, ఆంతర్యాన్ని తెలుసుకుంటే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయ. బిల్వపత్రం మూడు దళములతో కూడి ఉంటుంది. మానవులను ప్రభావితం చేసే త్రిగుణములకు, త్రికాలములకు, త్రితాపములకు ప్రతీక ఈ పత్రం. ఈ శరీరమే బిల్వదళం. త్రిగుణముల ఏకత్వమును సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది. ఆ ఏకత్వమును సూచిస్తుంది బిల్వదళార్చన. తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం దగ్గరలో ఉన్న చిన్న శివాలయంలో గ్రహణ సమయంలో ఒక దేవతా సర్పం ఆలయంలోని బిల్వ వృక్షం మీదకు ప్రాకి బిల్వదళాల్ని తుంచి, సోమ సూత్రం గుండా శివాలయంలోకి ప్రవేశించి శివలింగం మీద దళాన్ని ఉంచి, లింగాన్ని చుట్టుకొని, గ్రహణ సమయమంతా లింగం దగ్గరే ఉండి, గ్రహణం విడిచిన తరువాత, అదే సోమసూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వార్త, ఫొటోలు కూడా పత్రికలలో వచ్చినాయి. ఇది బిల్వపత్రార్చన విశేషం. మనలోని కామ పిశాచాన్ని, పశు రాక్షస తత్త్వాన్ని, దహింప చేసికోవాలి. పాశుపతమైన ఈ దీక్ష మనకుంటే, పశుపతి అనుగ్రహం మనకు లభిస్తుంది. తిరోధన అనుగ్రహాలు రెండూ పరమ శివుని చేతిలో ఉంటాయి. తిరోధానంతో శివుడే జీవుడయ్యాడు. అనుగ్రహంతో మరలా జీవుడైన తానే శివుడే భాసించాడు. ఇదే మహా శివరాత్రినాడు మనం తెలిసికోవలసిన శివలీలా వైభవం. నాదతనుమ నిశం- శంకరం, నమామియే మనసా శిరసా అని చిత్తరంజని రాగంలో త్యాగరాజ స్వామి కీర్తించిన కృతి, మహాశివరాత్రికి సంపూర్ణ స్ఫూర్తిని, దీప్తిని ఇస్తుంది. పంచభూత లింగ క్షేత్రములు ఈ శివ్వం పంచభూతమయం. పంచభూతములనగా – ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. శివునికి భూతపడి అనే నామము ఉంది. అందుకే ‘ఈవావాస్య మిదం సర్వం’ అన్నది శ్రుతి. పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికి పరమ శివుడు దక్షిణ భారతదేశంలో ఐదు క్షేత్రములందు ఆవిర్భవించి భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. అవి, చిదంబరంలోని ఆకాశలింగం, శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగము, అరుణాచలములో తేజో (అగ్ని), లింగము, జంబుకేశ్వరములో జలలింగము, కాంచీ క్షేత్రములో పృధివ లింగ రూపములు. ఇవే పంచభూత లింగ క్షేత్రములు. చిదంబరం.. చిదంబరం క్షేత్రంలోని నటరాజస్వామి ఆలయంలో ఉన్నదే ‘ఆకాశలింగం’. మానవ రూపంలో శివునకు విగ్రహం ఉన్న దేవాలయం చిదంబరంలో మాత్రమేనని చెప్తారు. చెక్కబద్దలతో చేసిన ఒక గడిలోపల, గుడ్డ తెరలు వేలాడదీసి ఉంటాయి. ఆ తెరను కొంచెం తొలగించి చూడమంటారు. దూరంగా గోడ మీద బంగారపు ఆకులలాటి వాటితోనున్న తోరణం లాంటిది ఒకటి వేలాడుతూ ఉన్నట్లనిపిస్తుంది. శివుడు ఆకాశ రూపంలో ఇక్కడ వెలిసియున్నాడని చెప్తారు. సృష్టిలో మొదటిది ఆకాశం. దాని నుంచి వాయువు. వాయువులో నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటిలో నుంచి భూమి పుట్టుకొచ్చాయని వేదం చెప్పింది. ఈ సృష్టిలో వున్నవన్నీ ఏదో ఒకనాటికి నశించిపోయి చివరకు శూన్యంలోకి చేరవలసినవే. మనస్సును ఆకాశంలాగా నిర్మలంగా ఉంచుకొనడమే మనిషికి నిజమైన సుఖమని చెప్తుంది- ఆకాశలింగం. ‘చిత్’ అంటే మనస్సు, ‘అంబరం’ అంటే ఆకాశం. ఇదే చిదంబరం, ఇదే చిదంబర రహస్యం కూడా. కేదార రాగంలో ‘ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం, ఆశ్రయామి శివకామ వల్లీశం’ అంటూ చిదంబర నటరాజ స్వామిని కీర్తించాడు – ముత్తుస్వామి దీక్షితులు. శివునికి ఉన్న రెండు అవస్థల్లో ఒకటి సమాధి అవస్థ. రెండవది తాండవ నృత్య అవస్థ. సమాధి నిర్గుణం, తాండవ నృత్యం సగుణం. శివునికి నాట్యం అంటే ఇష్టం. ప్రదోష కాలంలో పరమశివుడు నటరాజస్వామి అయిః నాట్యం చేస్తే, బ్రహ్మాది దేవతలందరూ ఆనందంతో చూస్తారు. శివతాండవం తొమ్మిది విధములని చెప్తారు. అవి : ఆనంద తాండవం, సంధ్యా తాండవం, ఉమాతాండవం, గౌరీ తాండవం, కాళికా తాండవం, త్రిపుర తాండవం, సంహార తాండవం, లలితా తాండవం, ఊర్థ్వ తాండవం. శ్రీకాళహస్తి.. సప్త మహర్షులలో శ్రేష్టుడైన వశిష్టునికి నూరు మంది కుమారులు. ఒకానొక సందర్భంగా వారంతా హతులయ్యారు. అమిత దుఃఖంతో కొండ మీద నుండి కిందికి దూకటానికి ఉద్యుక్తుడైనాడు వశిష్ఠుడు. భూదేవి రక్షించి, దుఃఖ శమనానికి పరమ శివుణ్ణి ప్రార్థించమన్నది. పట్టుదలతో దీక్షగా తపస్సు చేశాడు. ప్రత్యక్షమయిన పరమశివుణ్ణి- ‘బ్రహ్మ విద్యని ప్రసాదించమ’ని ప్రార్థించాడు. శివలింగం మధ్యలో నుంచి పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంతో వశిష్టునికి దర్శనమిచ్చి ఆయన కోరుకున్న వరాల్ని ప్రసాదించి వాయు రూపంగా అంతర్ధానమయినాడు. శివలింగం వశిష్టునికి ఎదురుగా ఉండిపోయింది. కైలాసంలో పార్వతీ దేవి భర్తను అనే్వషిస్తూ వచ్చి, జ్ఞాన భిక్ష నొసగే జ్ఞాన ప్రసూనాంబగా స్వయంభువుగా వెలిసింది. శివలింగం ప్రక్కనే. ప్రమధ గణమంతా వచ్చి తూర్పు దిక్కున, దుర్గాదేవి ఉత్తర దిక్కున ఆవిర్భవించారు. ఇప్పటికీ శ్రీకాళహస్తి ఆలయంలో దక్షిణామూర్తి విగ్రహం ఒకటి ప్రత్యేకంగా ఉండి, ప్రతిరోజూ పూజలందుకుంటోంది. ఆలయానికి ఉత్తరంగా ఊరి బయట దుర్గాదేవి ఆలయం కొండమీద ఉన్నది. ‘శ్రీ’ అంటే సాలెపురుగు. కాళ అంటే పాము. ‘హస్తి’ అంటే ఏనుగు. శివలింగాన్ని పూ జించి ముక్తిని పొందటం చేత ‘శ్రీకాళహస్తీశ్వరుడు’ అని ఆ స్వామికి పేరు వచ్చింది; ఆ ఊరిని ‘శ్రీకాళహస్తి’ అని పిలుస్తున్నారు. శ్రీకాళహస్తికి దగ్గరలో ‘ఉడుమూరు’ అనే బోయవారి గ్రామం ఉండేదట. ఆ ఊరికి ‘నాదనాథుడు’ అనే నాయకుడుండేవాడు, ఆయన కుమారుడే -తిన్నడు. తిన్నడు అడవిలో తిరుగుతూ ఉండే సమయంలో శ్రీకాళహస్తీశ్వర లింగం కనపడింది. భక్తిశ్రద్ధలతో పూజించటం ప్రారంభించాడు. అచంచల భక్తితో పరమేశ్వరుడు పెట్టిన పరీక్షలో తన రెండు కళ్లనూ స్వామికి అర్పించి కృతార్థుడై తిన్నడు భక్తకన్నప్ప అయినాడు. శ్రీకాళహస్తీశ్వర లింగం మీద సాలెపురుగు, పాము, ఏనుగు కలిసి ఉన్నట్లుగా పరీక్షగా వీక్షిస్తే దర్శనమిస్తాయి. ఆలయ గర్భగుడిలోనే స్వామి లింగం ప్రక్కనే తిన్నడి విగ్రహం కూడా ఉంటుంది. అందుకే శివుడు భక్తపరాధీనుడు, భోళాశంకరుడు. తమ తమ పూర్వ జన్మలలో సాలెపురుగు విశ్వకర్మ కొడుకైన ఊర్ణనాభుడని, పాము శంభుడనే నాగలోక వాసి అని, ఏనుగు హస్తి అనే ప్రమధుడు అని, తిన్నడు సాక్షాత్తు అర్జునుడేనని కొన్ని గాథలున్నాయి. ఈ క్షేత్రం గురించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మధురానగరంలో మాణిక్యవల్లి అనే వేశ్య ఉండేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వాళ్లిద్దరూ చిన్నతనం నుండి గొప్ప శివభక్తులు. తల్లి ఎంత చెప్పినా వారు వేశ్యావృత్తిలోకి రాలేదు. ఒకరోజున ఇద్దరు దొంగలు ఆ అక్కచెల్లెళ్ల వద్ద ఉన్న నగల్ని కాజేద్దామన్న దురుద్దేశంతో, వాళ్లిద్దరికీ శ్రీకాళ హస్తీశ్వర స్వామిని చూపిస్తామని చెప్పి తీసికొని వెళ్లారు. రాత్రిపూట ఆ దొంగలు వారిద్దరిని చంపాలని నిర్ణయించుకున్నారు. పరమేశ్వరుడు దుష్టుల్ని శిక్షించి, తన భక్తుల్ని రక్షించడమే కాదు మోక్షాన్ని ప్రసాదించాడు. ఆలయం దగ్గరలోనే వారిద్దరి పేరునా ఒక అందమైన మంటపం ఉంది. ఇదీ శ్రీకాళ హస్తీశ్వరుని కరుణ, భక్తిపరాధీనత. ‘శ్రీకాళ హస్తీశ శ్రీతజనావన జ్ఞాన ప్రసూనాంబికాపతే’ అని కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. అరుణాచలం ‘అరుణాచల నాథం స్మరామి అనిశం అసేత కుచాంబాసమేతం. అప్రాకృత తేజోమయ లింగం’ అంటూ సారంగ రాగంలో, అరుణాచలంలో అసేత కుచాంబా సమేతుడైన అరుణాచలేశ్వరుని స్మరించినంత మాత్రమున కైవల్యాన్ని ఇచ్చే స్వామి అని కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. కొండకి ప్రదక్షిణం చేస్తారు. కొండ శివాకారంగా ఉంటుంది. ఆలయ గాలి గోపురం నిర్మాం సుమారు 1560 ప్రాంతంలో శ్రీకృష్ణ దేవరాయల చేత ప్రారంభించబడి, తరువాత వారిచే పూర్తి చేయబడింది. కృతయుగంలో అగ్ని లింగంగాను, త్రేతాయుగంలో వజ్ర రూపంగాను, ద్వాపర యుగంలో బంగారపు కొండ రూపంలో ఉండేదని, కలియుగంలో శివాకారంగా రూపుదాల్చిందని స్కాంద పురాణంలో చెప్పబడింది. తిరువణ్ణామలై పేరు వినగానే జ్ఞప్తికి వచ్చేవారు – కార్తికేయ అంశభూతులైన భగవాన్ రమణ మహర్షి. జంబుకేశ్వరం… జలలింగం శ్రీరంగపట్టణంలో కలిసే ఉంటుంది. పరమశివుని లింగరూపం కింద వున్న పీఠం లోంచి నిరంతరమూ నీరు కొంచెం కొంచెంగా, బొట్లు బొట్లుగా ఊరుతూ ఉంటుంది. పీఠం చుట్టూ ఒక వస్త్రం కప్పి ఉంచుతారు. ఆ వస్త్రం తడిసిన తరువాత తీసి, పిండేసి మళ్లీ పరుస్తారు. స్వామివారి గర్భగుడి ప్రక్కగా అమ్మవారి ఆలయం, ఆ జగన్మాత ‘అఖిలాండేశ్వరి’. మొదట్లో అమ్మవారి విగ్రహ మూర్తి చాలా ఉగ్రంగా, భీకరంగా ఉండేదట. ఆదిశంకరులు తపస్సు చేసి, తల్లిని ప్రసన్నురాలిని చేసికొని శాంతమూర్తిగా చేశారు. జగద్గురు శంకరులే జాతి రత్నాలతో కూర్చిన శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారు. ‘తాటంక యుగళీభూత తపనోడుప మండలా’ అని లలితా సహస్ర నామంలో చెప్పినట్లు అఖిలాండేశ్వరీ అమ్మవారి కర్ణ్భారణములు మహిమాన్వితమైనవి. ఆ తల్లి సర్వదా చిరునవ్వుతూ ప్రసన్న వదనంతో ఉండేందుకు, ఆమె ప్రియ తనయుడైన వినాయకుని విగ్రహం ఒకదానిని ఆమె ముందు ప్రతిష్ఠించారు. పెద్ద పుష్కరిణి ఒడ్డున మంటపం. దీన్ని శ్రీరామచంద్రుడు నిర్మించాడన్నది స్థల పురాణం. ‘జంబూపతే పాహిమాం, పర్వత జాప్రార్థితాప్సు లింగ విభో’ అని ముదావహంగా కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. *

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు

సంగీత,సాహిత్య సమారాధకుడు శ్రీకృష్ణదేవరాయలు

andhraprabha –   Sun, 15 Feb 2015, IST

కృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప రసజ్ఞుడు, విద్వాంసుడు. ఆంధ్రభోజుడను బిరుదు కలవాడు. రాయలు తను విరామం దొరికినపðడు కవి పండితులతో గడిపేవాడు. దండయాత్రలకు వెళ్లేటపðడు కూడా పండితులను, కవులను తనతో తీసుకువెళ్లేవాడు. కవులకు, పండితులకు అగ్రహారాలు ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఇతడు కవి, పండితుల పక్షపాతి. కృష్ణదేవయాలు సంస్కృత కవులను, ఇతర దేశభాషలలో కవిత్వం రాసే

వారిని కూడా సమాదరించాడు.

జయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో ఉత్తమోత్తమ పరిపాలకుడిగా శ్రీకృష్ణదేవరాయలు

పేరు పొందాడు. మహావీరుడిగానే కాక సంగీత, సాహిత్యాలకు పెద్దపీటవేసిన వాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన పాలన కాలం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1530 వరకు విజయనరగ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. భారతదేశంలో గొప్ప రాజులలో శ్రీకృష్ణదేవరాయలొకరు. ఇతడు అపజయమెరగనివాడు. ఇతడు స్వయంగా గొప్ప విద్వాంసుడు. రాజనీతిజ్ఞుడు. ఇతడు రాసిన ‘ఆముక్తమాల్యద’ పాండిత్యానికి లోకజ్ఞతకు గొప్ప నిదర్శనంగా నిలిచింది. అనేకమంది విద్వాంసులను పోషించి గౌరవించాడు. ఏ విధంగా చూసినా భారతదేశ చరిత్రలో ఉన్నత స్థానం పొందాడు. మహామంత్రిగా ఖ్యాతి గడించిన తిమ్మరుసు అనేక పర్యాలు కుట్రల నుండి కృష్ణరాయలను కాపాడుతూ వచ్చాడు. కృష్ణదేవరాయల పట్ల తిమ్మరుసుకు అత్యంత అభిమానం ఉండెను. విజయ నగర కన్నడ తమిళం కూడా రాజుల చేత పోషించించబడి వర్ధిల్లింది. సాళువ, తుళువ ఆర్వీటి వంశాల పాలనలో తెలుగు భాషకు ఎనలేని గౌరవం పొందింది. విజయనగర రాజుల పాలన కాలంలో మొదటగా పేర్కొనదగినవాడు నాచన సోమన. ఇతనిని రెండవ బుక్కరాయల కాలం వాడిగా కొందరు నిర్ణయించారు. కాని శాసనాలలో విరుద్ధంగా ఉన్నవి. ఇతడు గొప్ప పండిత కవి. నాచన సోమునికి సర్వజ్ఞ బిరుదు కలదు. ఇది ఇతని పాండిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

సోమన ఉత్తర హరివంశంలో గొప్ప గ్రంథాన్ని రచించాడు. మొదటి దేవరాయల కాలంలో జక్కన అనేకవి విక్రమార్క చరిత్రను రాసాడు. దేవరాయలు సంస్కృత భాషను, కర్ణాటక భాషను కూడా సమాదరించి పోషించాడు. సాళువ నరసింహరాయలకు పిల్లలమఱ్ఱి పిన వీరభద్రుడు తాను రాసిన జెమిని భారతాన్ని అంకిత మిచ్చాడు. ఇతని కవిత్వం కొంత కఠినంగా ఉన్నా మిక్కిలి రమ్యమైనదని పండితుల చేత ప్రశంసలు పొందింది. సాలువ నరసింహరాయలకాలంలో అన్నమాచార్యుడు తిరుపతిలో నివసించి తన కృతులను రచించాడు.

విజయనగర రాజుల కాలంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల యుగం అఖండ ఐశ్వర్యాతో అనుభవించెను. దానివవల్ల ప్రజలలో భోగలాలసత్వం పెరిగింది. రాజులు, సామంతులు మొదలుగా గలవారు శృంగారరస ప్రధానమైన ప్రబంధ రచనలను ప్రోత్సాహించారు.

కృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప రసజ్ఞుడు, విద్వాంసుడు. ఆంధ్రభోజుడను బిరుదు కలవాడు. రాయలు తను విరామం దొరికినప్పుడు కవి పండితులతో గడిపేవాడు. దండయాత్రలకు వెళ్లేటప్పుడు కూడా పండితులను, కవులను తనతో తీసుకువెళ్లేవాడు. కవులకు, పండితులకు అగ్రహారాలు ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఇతడు కవి, పండితుల పక్షపాతి. కృష్ణదేవరాయలు సంస్కృత కవులను, ఇతర దేశభాషలలో కవిత్వం రాసే వారిని కూడా సమాదరించాడు. శ్రీకృష్ణదేవరాయలకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా పేరుపొందిన కవులుండేవారు. ప్రబంధ పరమేశ్వరుడనదగిన అల్లసాని పెద్దన వీరిలో అగ్రగణ్యుడు. రాయలితనిని యాధ్రకవితా పితామహుడనే బిరుదునిచ్చి గౌర వించాడు. అల్లసాని పెద్దన రాసిన ‘మనుచరిత్రను’ శ్రీకృష్ణదేవ రాయలకు అంకిత మిచ్చాడు. మను చరిత్ర ఒక గొప్ప శృంగార ప్రబంధం. దీనిలోని కవిత్వం మృదుమధురంగా ఉండి చదువరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ మను చరిత్ర తరువాత వచ్చిన ప్రబంధాలకు దారి చూపించింది. నంది తిమ్మన తను రాసిన ‘పారిజాతాపహరణ’ను రాయలకు అంకితం ఇచ్చాడు. కృష్ణదేవరాయలు గొప్ప కవి. అతడు ఆముక్తమాల్యద అనే గొప్ప గ్రంథాన్ని రాసి కవిగా తనేమిటో నిరూపించుకున్నాడు. దీనికి విష్ణు చిత్తీయమనే మరో పేరు కూడా కలదు. ఆముక్తమాల్యద భక్తిరస ప్రధానమైన గ్రంథం. సమకాలీన జీవితమును కృష్ణదేవరాయలు పరిశీలించినంతగా మరెవరు పరిశీలించి ఉండక పోవచ్చు.

రాయల ఆస్థానలో లొల్ల లక్ష్మీధర పండితుడు ఉండేవాడు. ఇతను మొదట గజపతుల దగ్గర ఉండి తదుపరి విజయనగరానికి వచ్చినట్లుగా చెబుతారు. ఇతడు శివానంద లహరి అనే గ్రంథానికి వాఖ్యానం అలాగే దైవజ్ఞాన విలాసమను గొప్ప గ్రంథాన్ని రాసాడు. దైవజ్ఞాన విలాసమొక విజ్ఞానగని. రాయల విఖ్యాతమంత్రి తిమ్మరుసు గొప్ప సంస్కృత విద్వాంసుడు. అతడు అగస్త్య భారతానికి వ్యాఖ్యానం రాసాడు. తిమ్మ రుసు మేనల్లుడు నాదెండ్ల గోపన ప్రబోధ చంద్రోదయమను గ్రంథంపై టీక రాసాడు. విజయనగర రాజాస్థానానికి ఎందరో మత బోధకులు వచ్చి శాస్త్ర చర్చలు గావించేవారు. శ్రీకృష్ణదేవరాయలను ఆశ్రయించి ఎందరో కవులు, పండితులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఆయన నుండి ఎన్నో బహుమతులు పోందేవారు. కవులను మిక్కి లిగా గౌరవించేవాడు. కృష్ణదేవరాయలు సాహిత్య చర్చల కోసం ‘భువనవిజయం’ అనే దానిని స్థాపించాడు. ఇందులో ఎందరెందరో కవులు పండితులు తమ పాండిత్య ప్రతిభను ప్రదర్శించేవారు. మత సంస్క ర్తలు విజయనగరాన్ని సందర్శించేవారు. అటువంటి వారిలో చైతన్యుడు, వల్లభా చార్యుడు వంటివారు ఉన్నారు. మాధ్వగురులగు వ్యాసతీర్థులు, విజయేంద్రులు, రామానుజ మతస్థులు డొడ్డయాచార్య, తాతాచార్య మొదలైనవారు విజయనగర రాజుల చేత అదరింపబడినారు. వ్యాసతీర్థుడు వేదాంతము, తర్కం వంటి విష యాలపై అనేక గ్రంథాలను రాసాడు. స్త్రీ రచయితలు కూడా విజయనగర రాజులచే గౌరవించబడినారు. వారిలో తిరుమలాంబ, గంగాదేవి మొదలైన వారు ఉన్నారు. తిరుమలాంబ వరదాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రాసింది. గంగా దేవి మధురావిజయమనే గ్రంథాన్ని రాసింది. సాహిత్యంతోపాటు సంగీతం, నాట్యం వంటి కళలను కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆదరించి కళాకారులను గౌరవించాడు. శ్రీకృష్ణదేరాయలు వీణావాదాన్ని నేర్చుకొని దానిలో ప్రావీణ్యాన్ని సాధించాడు. కృష్ణుడను సంగీత విద్వాంసుడు కృష్ణదేవరాయలకు సంగీత గురువు. విజయనగర రాజుల కాలంలో శిల్ప కళ, చిత్ర లేఖనం ఎంతో ఆదరాన్ని పొంది అభివృద్ధిని సాధించాయి. ఎన్నోదేవా లయాలను నిర్మించారు. కృష్ణదేవరాయల భువన విజ యం పేరిట గొప్ప సభా భవ నాన్ని నిర్మించాడు. ఈ మంటపం గజాకారం గల స్థంభా లపై నిలిచి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలం సాహిత్యానికి, కళలకు స్వర్ణ యుగం. అంతటి మహోన్నత పరిపాలకులు భారతావనిలో చాలా తక్కువ మందే ఉన్నారంటే అతిశ యోక్తికాదు. విశాల భూభా గాన్ని పరిపాలించి గొప్ప పరిపాలకుడిగా పేరుపొందాడు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం

కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం

ANDHRAPRABHA –   Mon, 9 Feb 2015, IST

కాలానికి లేని చూపును మానవులు చారిత్రిక సులోచనాల ద్వారా తమ కళ్ళల్లో పొదుగుకోవాలి. రచయితల, పాత్రికేయుల దృష్టిలో ‘కాలజ్ఞత’కు అర్థం -అనుకూల పరిస్థితులలోనే కాదు, మంచి మార్పుకోసం జరిగే నిరంతర సమరంలో ప్రతికూల పరిస్థితులలో కూడా తెగబడి మరీ తనతనాన్ని సార్దకం చేసుకోవడమని కూడా అర్థం. ‘ధర్మం’ అంటే ‘ఆయుధ’ మేనన్నది వ్యాసభారత సూక్తి. పాత్రికేయులకూ, రచయితలకూ అదే ఆయుధం. ఇది అక్షర సత్యమైన వ్యాఖ్యానం. అక్షరాన్నే ఆయుధంగా చేసుకొని దశాబ్దాల తరబడి పోరాడుతున్నవారు ఎబీకె. ఎబీకేను ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన జగమెరిగిన పాత్రికేయులు. ఇక ప్రస్తుత విషయానికొస్తే గత ఆరేడు సంవత్సరాల కాలం ఒక పత్రికలో ఆయన రాసిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, భాషా, సాహిత్య, సాంస్కృతిక వ్యాసాలను అన్నింటిని ఒక దగ్గరకు చేర్చి ‘కాలంతో కరచాలనం’ పేరుతో వ్యాససంకలనాన్ని వెలువరించారు.

ఈ వ్యాసాలు వారి బహుముఖీనమైన ప్రతిభకు మచ్చుతునకలు.

ఈ వ్యాస సంకలనంలో ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు విభజన రాజకీయాలు, జాతీయాంశాలు రాజ్యాంగమూ .. చట్టాలు… సిబిఐ, అంతర్జాతీయం, విదేశాంగ నీతి, అవి.. ఇవి, తెలుగు భాష, ఆర్థికాంశాలు, వాతావరణ సమస్యలు. పర్యావరణం మొదలగు విభాగాలున్నాయి. ఈ అంశాలను పరిశీలిస్తే ఏదో ఒక విభాగంలో ప్రజ్ఞకలిగిన వారిగా కాక ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ధుష్టమైన విధానంతో, విషయ పరిజ్ఞానంతో అందించే వారిగా మనకు ఏబికె కనిపిస్తారు. ‘ఫార్ములా -1’ రేసును ఇండియాలోకి దిగుమతి చేయడానికి ‘తాళి’ కట్టినవాడు చంద్రబాబు. ఈ మధ్య ఆయన గ్రేటర్‌ నోయిడాలో ‘ఫార్ములా’-1 రేసు ప్రారంభం కానున్నదన్న వార్త రాగానే మహాసంతోషంతో అందుకుతానే అసలు ప్రతిపాదకుడననీ, కానీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ విదేశీ కార్ల రేసు రాకుండా అడ్డుకున్నారని ‘గొప్పలు’ చెప్పుకోబోయారు. అన్న చంద్రబాబు మాటలను కోట్‌ చేస్తూ మింగమెతుకులేదు గాని, మీసాలకు సంపెంగనూనె పట్టించుకోవడంకోసం ఆరాటపడ్డాడట వెనకటికొకడు అంటూ వ్యాఖ్యానిస్తారు ఏబికె ‘వికృత క్రీడోన్మాదానికి ఓ ‘ఫార్ములా’! అనే శీర్షికతో రాసిన వ్యాసంలో.

అలాగే కేజీ బేసిన్‌ సంపదపై వైఎస్‌ వైఖరే ఆదర్శం, ఆంధ్రా గ్యాస్‌ అంబానీల సొత్తా? అనే శీర్షికతో ఒక వ్యాసం కనిపిస్తుంది. అలాగే వైఎస్‌ పట్టించిన గ్యాస్‌ దొంగ, వైఎస్‌ స్వతంత్రుడు… అందుకే దాడి, ‘పావురాల గుట్ట’పై ప్రశ్నల తుట్టె, తెలుగువారి సమైక్యతా వారధి బూర్గుల: వేర్పాటు’తోనే అసమానతలు తొలగవు వంటి వ్యాసాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ వ్యాసాలు ఆరేడు సంవత్సరాల కాలంలో రాసినవని గుర్తుపెట్టుకోవాలి.తనది ‘వీర తెలంగాణాయే గాని వేరు తెలంగాణ కాదు’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి తెలంగాణ భవితవ్యానికి, మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆవేదనతో చేసిన ప్రతిపాదనకు మించి శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో అదనంగా ప్రత్యేకించి చెప్పిందేమీ లేదంటారు ఏబికె ‘వేర్పాటుపై శ్రీకృష్ణ ఒంటరికాదు! అనే వ్యాసంలో. ఇందులో ‘కక్ష రాజకీయమే కూలింది’ పేరుతో రాసిన ఒక వ్యాసంలో జగన్మోహన్‌ రెడ్డిని అసలెందుకు నిర్భందించవలసి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వకుండా, క్షమాపణ చెప్పుకొనకుండా కాంగ్రెస్‌ నల్లిలాగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి కోసం కాంగ్రెస్‌ అధిష్టానం జగన్‌పై కక్ష సాధింపునకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చివరకు దొరికిపోయింది కాంగ్రెస్‌ ప్రభుత్వమూ, సిబిఐలేనంటారు ఈ వ్యాసంలో. ఏబికె కు కొన్ని నిర్దుష్టమైన నిశ్చితాభిప్రాయాలున్నాయి. వాటిని వ్యక్తం చేయడంలో ఎప్పుడూ వెనకంజ వేసిందిలేదు. నిర్మొహమాటంగా చెప్పటంలోనూ ఆయనెప్పుడు ముందే ఉంటారు.

‘వాగుడు కాయల కొలువులు’ పేరుతో ఒక వ్యాసమిందులో కనిపిస్తుంది. దాదాపు పన్నెండు చానళ్ళు ఒకే పార్టీపైనా, ఆ పార్టీ నేతపైనా వీక్షకుల తలమొత్తేలా వ్యతిరేక ప్రచారాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికల రుతువు ఆఖరి వారం రోజులలో అవి ఎంతహద్దు మీరాయో కూడా ప్రేక్షకులు గమనించారు. అక్కసుతో కూడిన ఆ దుష్ప్రచారం అంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పైనా, ఆ పార్టీ నాయకుడు జగన్‌పైన. అంటూ చానళ్ళ నైజమేమిటో తనదైన కోణంలో వివరిస్తారు.

ఒక వర్గం వారి ‘ఆడపిల్లలు ప్రత్యర్థి వర్గం జనాభాను పెంచే సంతానోత్పత్తి’ యంత్రాలు కాకూడదట! దీన్నిబట్టి చూస్తే పురుషాధిక్యతా రోగం, బడుగు, బలహీన వర్గాలు మైనారిటీల పట్ల ఏహ్యమైన చిన్నచూపు, దుర్మార్గపు మనస్తత్వం ఎంతగా గూడుకట్టుకుని ఇప్పటికీ ఊళ్లేలుతున్నాయో అర్థమవుతోంది. ఏ రాజకీయ పక్షానికీ మత వ్యవహారాలతో మతాలలో సంబంధం ఉండరాదని, మత సంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదని రాజ్యాంగ నిర్ణయ సభ తీర్మానం. కానీ పాలక పక్షాలు మత రాజకీయం ద్వారా ఎన్నికలలో ప్రజల్ని సమీకరించడానికి అలవాటుపడ్డాయని దుయ్యపడతారొక వ్యాసంలో. మారని మనిషి మోడీ! అనే వ్యాసంలో గుజరాత్‌లో ప్రభుత్వ కిరాతక చర్యలను ముఖ్యమంత్రి మోడీకి గుర్తుచేసి రాజధర్మం కాస్తా తప్పావు. ధర్మం పాటించడం నేర్చుకోమని నాటి ప్రధాని వాజ్‌పేయి స్వయానా పాఠం చెప్పారు! అయినా మోడీ బుద్దిమారలేదు. తాను గుజరాత్‌లో చేసిన పని తప్పుకాదని, ఒప్పేనని సమర్థించుకుంటున్నాడని మోడీ గురించి వివరిస్తారు. నక్సల్స్‌ మిలిటెంట్‌ కార్యకలాపాల గురించి కాంగ్రెస్‌ తీర్మానం గురించి వివరించిన ఒక వ్యాసంలో రాజకీయ కార్యక్రమం ఏదైనప్పటికీ కనీసం నాగాలాండ్‌ తరహా కాల్పుల విరమణకు ఉభయులూ సిద్ధమై, వాస్తవ జీవితంలో ప్రజాసమస్యల ఆధారంగా రాజకీయ పరిష్కారం వైపుగా సంప్రదింపులు జరపడం మంచిది. ఈ ఆశ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానంలో స్పష్టంగా ఉన్నందున నక్సల్స్‌ కూడా తెగేవరకూ లాగకుండా ఆచరణలో సమస్యల పరిష్కార దిశగా ప్రజలలో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి కార్యాచరణకు పూనుకుంటే ప్రజాబాహుళ్యం ఆహ్వానిస్తుందనడంలో సందేహం లేదంటారు ఏబికె. అలానే ఈ రోజున 230 జిల్లాలకు నక్సల్స్‌ మిలిటెంట్‌ కార్యకలాపాలు పరివ్యాప్తమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడుజాగ్రత్తగా సమస్యను ఒక కొలిక్కి తేవడానికి సంప్రదింపులద్వారానే శతథా ప్రయత్నించాలని హితవు పలుకుతారు ఏబికె. పార్లమెంటే ‘సర్వాధికారి’ కాదు!, కావాలి ప్రతి మహిళ ఒక కాళిక! సుప్రీం మాటే అంతిమం! అమెరికా అవుట్‌ సోర్సింగ్‌ ఔట్‌ కాక తప్పదా! అరబ్బుల ఆగర్భ శత్రువు అమెరికా, లాడెన్‌ హతం ‘అంతం’ కాదు, లాడెన్‌ మరణం ఒక మిస్టరీ! స్వేచ్ఛ పేర శత్రు సంహారం, వర్థమాన మహావీరుడు గడాఫీ, డ్రాగన్‌పై అమెరికా డేగ కన్ను, ఏ టాబ్లాయిడ్‌ పుట్టలో ఏ పామున్నదో?! అమ్మ భాష -అరణ్య ఘోష, మాతృభాషే సార్వత్రిక మాతృక! వంటి అనేకానేక వ్యాసాలు ఇందులో కనిపిస్తాయి. ఏబికే సాహిత్య సంపాదకీయాలు అసిధారా వ్రతంతో చేసిన రచనలు. అపరంజి రేకులు, రమ్యాలోక విలసితాలు. ఆయన మనస్సు మహితం. బుద్దిమహాతీక్షణం. విమర్శ నిష్పక్షపాతం. ఆయన ఊహలు సత్యధర్మ సంయుతాలు. ఆయన సంపాదక శిరోమణి అని తిరుమల రామచంద్ర గారన్నమాటలు ఇక్కడ ప్రస్తావించడం సమయోచితం.

పేజీలు: 494, వెల: 220 రూపాయలు, ప్రతులకు: ఏబికే ప్రసాద్‌, కేరాఫ్‌ సి.ఆర్‌.ఫౌండేషన్‌, వృద్ధాశ్రమం, రూమ్‌ నెం.10, కొండాపూర్‌, హైదరాబాద్‌ -84. మరియు -విశాలాంధ్ర, నవోదయ బుక్‌ హౌసుల్లో–


 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ది లాస్ట్ ఎమ్పరార్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అరదా రచన -అర్ధం చేసుకోరూ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎన్నికలు నేర్పిన పాఠం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాఘ బహుళ ఏకాదశి 15-2-15 ఆదివారం శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక 

మాఘ బహుళ ఏకాదశి 15-2-15 ఆదివారం శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి  వ్రతం  చిత్రమాలిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -12

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -12

6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ -2

మేల్విల్లీ ‘’కానిబాల్స్ ‘’ఆటవిక జాతుల తో కలిసిపోయాడు .వాళ్ళ బట్టలే వేసుకొన్నాడు .వాళ్ళలాగే నగ్నం గా సముద్ర స్నానాలు చేసేవాడు .ఇవన్నీ ‘’టైపీ’’నవలలో అచ్చం గా జరిగింది జరిగినట్లు రాశాడు .ఈయన సమక్షం లో ఆ జాతివారు తమ నర మాంస భక్షణ చేయలేదు .వాళ్ళ పండుగా పబ్బాలలో వారిలాగే పాల్గొని ప్రవర్తించాడు .ఆ జాతి మనుషులు  సౌందర్యారాధకులు .’’ సెక్సానందం ‘’లో నిష్ణాతులు .నిజం గా అదొక స్వప్న లోకమే అందులో ఉండిపోవాల్సి వచ్చింది మెల్ విల్లీ . ‘’బంగారు యుగం లో కంచుబంగారు మనుషుల’’ తో గడిపాడు .రెక్కాడితెకాని డొక్కాడని జీవులు వారు .వ్యాపారం వర్తకం తెలీని అమాయకులు .ఈ సంస్కృతిని మేల్విల్లీ ‘’స్నివిలై జేషన్ ‘’అన్నాడు సరదాగా .అదునాతన అమెరికా వాసి అనామక ఆటవిక జాతి మధ్య అదే ఆటవిక జీవితం గడపటం వింతల్లో వింత .ఇస్టపడే  అక్కడ ఉన్నా ఇంటి బెంగ పట్టుకోంది కొంతకామైన తర్వాత . ..కాలికి గాయం అయి వాళ్ళు ఎన్నిరకాల మందులు వేసినా నయం కాక బాధ ఎక్కువైంది .వాళ్ళ విపరీతమైన ఆపేక్ష ,నిఘా లను ఎలాగో అలాగా వాళ్ళ మనిషి సాయం తోనే తప్పించుకొని బయటపడ్డాడు .అక్కడ నుండి ఆస్త్రేలియన్ వేలింగ్ షిప్ ‘’లూసీ ఆన్ ‘’ఎక్కి పారిపోయాడు .

ఈ నౌక ప్రయాణమూ మహా ఘోరంగానే ఉంది .కెప్టెన్ తాగు బోతు,జగడాల మారి .షిప్ –పాపిటే చేరగానే సిబ్బందిని  అందర్నీ బందీలుగా పట్టుకొన్నారు .మేల్విల్లీని వదిలేశారు కాలిగాయం ఉండటం వలన .రెండు సార్ల సముద్రయానం ఏమీ లాభించాలేదని తిమింగిల వేటకు సిద్ధపడ్డాడు .చార్లెస్ అండ్ హెన్రి నౌకా ప్రయాణానికి రిజిస్టర్ చేయిన్చుకొన్నాడు .ఇది అతని మూడవ వేల్ హంట్ షిప్ .హవాయ్ చేరాక ఒక ఇంగ్లీష్ స్టోర్ కీపర్ దగ్గర గుమాస్తాగా చేశాడు .ఏదైనా చిలక కొట్టుడే కాని కాసుల వర్షం రాలలేదు .హోనోలూలు చేరాడు .అక్కడా అదృష్టం వెక్కిరించింది .వేల్ హంట్ బోర్ కొట్టింది .నాలుగు నెలలు హవాయి లో గడిపి అమెరికా ప్రయాణానికి బయల్దేరాడు .

పద్నాలుగు నెలలు  నేవీ ‘’లో సైలర్ గా ఉండి మళ్ళీ మార్క్వేస్ దీవి మీదుగా దక్షిణ అమెరికా వెళ్ళాడు .అక్కడ శిధిల ,అవినీతిమయ మైన లిమా సిటీ చూశాడు .ఆ అనుభవం జీవితం లో ఎన్నడూ మరచిపోలేదు .కొద్ది మంది స్నేహితుల సాయం తో ఓడ ఎక్కాడు .నావికా సిబ్బంది పాశవికం గా ప్రవర్తించేవారు .1844అక్టోబర్ 3 న అమెరికా లోని బోస్టన్ చేరుకొన్నాడు .నేవీ సర్వీస్ నుండి విడుదలయ్యాడు .దాదాపు పాతికేళ్ళు ఏ రకమైనఉత్సాహ ప్రోత్సాహాలు ,స్తిరాదాయం లేకుండా గడిపాడు దుర్భర జీవితాన్ని ..

అపార అనుభవం మాత్రం వచ్చింది రాయటం మొదలు పెట్టాడు పదాలు దూసుకొచ్చి కాగితాలు నిండిపోతున్నాయి అదొక మానసిక చేతనా వస్థ.నూకు –హియా దీవి అనుభవాలతో’’ టైపీ’’నవల రాశాడు .ఇందులో మేల్విల్లీ జీవిత చిత్రణ ఏదో కల్పనా ఏదో తెలియ నంత అద్భుతం గా సాగి అందరికి నచ్చింది .’’Herman Melvillie is the morning of the  imagination’’అన్నాడు లెవీస్ మంఫోర్డ్ .ఆయనే హెన్రి డేవిడ్ తోరో తో పోల్చాడు .ఇద్దరూ వాస్తవానికి రూపు కట్టించారని మెచ్చాడు .నేటివిటి కి ప్రాణం పోశారిద్దరూఅనాగరక జాతుల మధ్య తిరిగినా  అమెరికా  మామూలు సంస్కృతీ సంప్రదాయం లోకి చేరారు .అమెరికా నిత్య జీవితాన్ని కొంత  ఏవ గింపు తో అక్షరబద్ధం చేసిన రచయితలూ ఈ ఇద్దరు .టైపీ నవల సెన్సేషనల్ హిట్ కొట్టింది .విపరీతమైన క్రేజ్ తో జనం కొని చదివి ఆనందించారు ,రచయితను బాగా ప్రోత్సహించారు .టిప్సీ జాతి మనుసుల మధ్య మేల్విల్లీ గడిపిన ఈవితం ఏంతో ఆసక్తిగా ఉండటం అలా అంతకు ముందు ఏ రచయితా ఆ జాతి జీవుల గురించి ఆచార వ్యవహారాల గురించి రాయకపోవటం చదువరులను ఏంతో బాగా ఆకర్షించి అభిమానులయ్యారు మేల్విల్లీకి .సూపర్ డూపర్ హిట్ అయింది టైపీ .ఇరవై ఎనిమిదేళ్ళనాటికే ఈ అపూర్వ విజయం హెర్మాన్ కు దక్కింది  . రెండో పుస్తకం బిల్లీ బాడ్ రాసి ప్రచురించాడు

క్రమం గా మేల్విల్లీ కి సాహిత్యాభిమానులు స్నేహితులు ఏర్పడ్డారు .వారు అతన్ని ఒక ‘’ఐకాన్ ‘’గ భావించారు .గతాన్ని హాయిగా మర్చి పోయి కొత్త ఉత్సాహం తో ముందుకు దూసుకొని వెళ్ళే అవకాశం నమ్మకం  వచ్చింది .ఎలిజ బెత్ షా అనే చిన్న నాటి నుండి తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .అందంగా లేకపోయినా అభిమాన వతి అయిన భార్య .భర్తపై ఆరాధనా భావం ఉన్నభార్య .రచనే తన జీవితా సర్వస్వం అని మేల్విల్లీ భావించి రాస్తున్నాడు అతని దృక్పధాన్ని అర్ధం చేసుకొని ఆమె సహకరిస్తోంది .డబ్బు అప్పుతెచ్చో నగలు అమ్మో అతని రచనా వ్యాసంగానికి ఇబ్బంది లేకుండా సంసారం గడుపుతోంది .భార్య పై మేల్విల్లీకి అమిత ఆపేక్ష ,ప్రేమ స్నేహభావం .ఆమెతో రోజూ వాకింగ్ చేసేవాడు .తను  రాసింది చదివి  వినిపించేవాడు .హడావిడి హనీమూన్ పూర్తీ చేసుకొని మళ్ళీ పూర్తిగా రచనలో మునిగిపోయాడు మేల్విల్లీ .భర్తకు అవసరమైన కొత్త రాతబల్లా కుర్చీలు సౌకర్యాలు ఆమె చూసేది .

మేల్విల్లీ మూడో నవల ‘ మెర్డి’’ప్రచురించాడు .తాను  ఇరవై తొమ్మిదో ఏడు దాకా మహాకవి షేక్స్పియర్ గురించి తెలుసుకోనందుకు బాధ పడ్డారు .ఆయన జీసస్ తో సమానం అని భావించాడు .మహాకవి రాచనలన్నీ చదివి జీర్ణించుకొన్నాడు .ఇప్పుడు రాసే దానిలో ఆయన ప్రభావం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది .మార్డి నవల ఒక సెటైర్  వేదాంతం గా ,కవితగా ,దృష్టాంతం గా కలగలుపుగా సాగింది .దీని నేపధ్యం దక్షిణ సముద్రమే .అందులోని మితికల్  దోమినారో  ఇంగ్లాండ్ కు ,ప్రాఫెర్రో .ఈజిప్ట్ కు ,ఫ్రాంకో ఫ్రాన్స్ కు వివెంజా అమెరికాకు చెందిన పాత్రలు .మార్డి విమర్శకులను అప్రతిభులను చేసింది కాని రీడర్స్ ను చేర లేక పోయింది .నిరాశ మిగిల్చింది .మళ్ళీ సముద్రయాన సాహసాల కధలు రాయటం మొదలు పెట్టాడు .’’రెడ్ బరన్ ‘’పేరిట మొదటి యూరాప్ పర్యటన లో షిప్ బాయ్ గా అనుభవాలు రాశాడు .అంతగా’’ పేలలేదు’’కాని సముద్ర ప్రయాణ జీవితం బాగా వచ్చింది .డబ్బుకోసమే దీన్ని రాశానని చెప్పుకొన్నాడు .కొడుకు పుట్టాడు ఖర్చులు పెరిగాయి పొగాకు కొనుక్కోవటానికైనా డబ్బు లోస్తాయని రాశానన్నాడు .అందులో మేల్విల్లీ నిజాయితీ అడుగడుగునా ప్రత్యక్షమై విపరీతమైన సానుభూతి వచ్చి మార్డీ నవల కంటే రెట్టింపు అమ్మకాలు జరిగాయి .తర్వాత ‘’వైట్ జాకెట్ ‘’ మూడుభాగాలుగా రాశాడు .ఇందులో  యునైటెడ్ స్టేట్స్ ‘’అనే నౌక పై తన నేవీ అనుభవాలను రాశాడు .కొంత సింబాలిజం కూడా జోడించి  వైట్ జాకెట్ వండాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ .14-2-15 –ఉయ్యూరు

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ కృష్ణుని జాతక చక్రం – శివుని దశావతారాలు-వాసవి స్రవంతి -ఫిబ్రవరి

krishna jatakam 001 dasha shiva 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వట్టి కోట ఆళ్వారుస్వామి జైలుకధాలు – వేటూరి వారి మానవీయత -మూసీ -ఫిబ్రవరి

veturi1 001 veturi2 001 veturi3 001vattikota1 001 vattikota2 002

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరుదేశ్వార్ మరయు జోశ్యం వారి శివ స్తుతిపద్యాలు -మూసి-ఫిబ్రవరి

marudesvar 001 sivaratri 001

మరుదేశ్వార్ మరయు జోశ్యం వారి శివ స్తుతిపద్యాలు -మూసి-ఫిబ్రవరి

kuvempu-1 001 kuvempu2 001 kuvempu3 001

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విలువల ముఖ్యమంత్రి సాహితీ వేత్త సంజీవయ్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సాహితీ హెమింగ్వే -కేశవా రెడ్డి మృతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-3

మినీ  ద్విపద్స్-3

21-ఓడిన ఒక ఎన్నిక కే’’ మోడీ ‘’

  బావురుమని  అయ్యాడు ‘’మూడీ ‘’

22-నాగార్జున నీటికి’’ తాళం ‘’

   తెలుగోళ్ళ మద్య ఇదేం ‘’మేళం?’’

23-ఇవాళ ‘’వేలంటైన్ డే’’

    రేపు’’ విడాకుల డే?’’

24-పచ్చనిపోలాల్లో రాజదానేమిటి ?

   ఉండవల్లి అసహనం ఇప్పుడా ఏమిటి?

25- నాలుగేళ్ళు గడ్డుకాలమే’’డిగ్గీ ‘’

    హస్తానికి ఆయనే పెట్టాడు’’ బుగ్గి ‘’

26-సామాన్యుని పట్టాభిషేకం’’ నేడే ‘’

     ఏడాది చెర నేటితో ‘’వీడే’’ .

27-నేడే వరల్డ్ కప్ ‘’టెంపర్ ‘’

  ప్లేయర్స్ కు ఆఫర్ ‘’బంపర్  ‘’.

28-  సాహితీ’’ వేత్త’’ సంజీవవయ్య ‘’

    విలువల  సి .ఏం. గా ‘’.అయ్యే ‘’.

29-ఐ ఎస్ ఐ పై  ఒబామా ‘’దూకుడు’’

    ప్రతిస్ట కోసం  పాపం’’ పాకుడు ‘’

30-తెలుగు సాహితీ ‘హెమింగ్వే ‘’

    కేశవ రెడ్డి ని అయ్యో కేన్సర్ ‘’మింగే ‘’.

     సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-2-15- ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -11

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -11

6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ

ఆమెరికా సాహిత్య చరిత్రలో అత్యద్భుత అత్యు న్నత నవలా నిర్మాతగా  , ద్రస్టగా ,కవిగా విజయ వంతమైన రచయితగా పేరొందిన వాడు హెర్మన్ మేల్విల్లీ .ఇంత గొప్పవాడు చనిపోయే ముందు ఒక అజ్ఞాత వ్యక్తిగా ఉండిపోవటం దురదృష్టకరం .అయన ఇంటి నుంచి పారిపోయి నరమాంస భక్షకులతోకలిసి జీవించాడని మాత్రమే అమెరికన్ జనాలు గుర్తుపెట్టుకొన్నారు .మిగిలినవన్నీ మర్చే పోయారప్పటికి  .అమెరికా గర్వించదగిన ఉన్నత కుటుంబం లో 1-8-1819 లో న్యూయార్క్ సిటి లో జన్మించాడు .తలిదండద్రులిద్దరివైపు వారూ అమెరికన్ రివల్యూషనరీ యుద్ధం లో  వీరోచిత పోరాటం చేసిన వారే  .పాల్గొన్నవారే .తాత బోస్టన్ టీ పార్టీ నిర్వహణ సమయం లో మేజర్ గా ఉంటె ,మాతామహుడు పీటర్  గేంస్ వర్త్ ఫోర్ట్  స్టాన్విక్స్ ను  బ్రిటిష్ మూకల దాడి నుండి కాపాడి రక్షించిన యోధుడు .తల్లివైపు వారిది  డచ్ –అమెరికన్ సంప్రదాయం .గాల్వనిస్ట్ విధానాన్ని తూ చా గా పాటించే వారు .ఎనిమిది మంది సంతానం లో మేల్విల్లీ మూడవ వాడు .ఇల్లు మంచి వాతావరణం లో తలిదండ్రులు నడుపుతున్నారు .హంగూ ఆర్భాటాలు లేవు .తండ్రి దిగుమతి వ్యాపారస్తుడు .కమీషన్ వ్యాపారి .ఎప్పుడూ ఇతర దేశాలు తిరిగే వాడు .మంచి స్కూల్ లో చేర్పించి మేల్విల్లీ ని చదివించాడు .తండ్రితో అప్పుడప్పుడు ఇతర ప్రదేశాలు వెళ్లి చూసేవాడు .

కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు .ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవటం సహజం .1830 లో దేశం లో డిప్రేషన్ వచ్చి వ్యావారాలన్నీ దెబ్బతిన్నాయి .మేల్విల్లీ తండ్రి దివాలా తీశాడు .కుటుంబాన్ని ఆల్బనికి ,తల్లి బంధువుల సమీపానికి మార్చాడు .అక్కడ ఫర్ బిజినెస్ చేసి అప్పుల్లో నిండా మునిగిపోయాడు .శారీరక మానసిక ఆరోగ్యం కోల్పోయాడు .మానసిక వ్యాధి కూడా వచ్చింది .ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి నలభై ఏళ్ళకే చనిపోయాడు .అన్న గాన్సూవేర్ట్ తండ్రివ్యాపారాన్ని బుజాన వేసుకొని నిర్వహించాడు .అన్న వ్యాపారమూ లాభించలేదు .హెర్మన్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పొట్ట పోషించుకొంటూ కుటుంబాన్ని ఆదుకొనేవాడు .పద్దెనిమిదో ఏట టీచర్ గా చేరాడు పిట్స్ ఫీల్డ్ లో .కుటుంబం లాన్సింగ్ బర్గ్ కు చేరింది .ఇంజినీర్ అవ్వాలనే ఉద్దేశ్యం లో మేల్విల్లీ సర్వేయింగ్ లో చేరాడు .స్తానిక పత్రికలలో వ్యాసాలూ రాసేవాడప్పుడప్పుడు.1839లో లివర్ పూల్ వెళ్ళే సెయింట్ లారెన్స్ నౌక లో కేబిన్ బాయ్ గా నమోదయ్యాడు .అతని తోపాటు అందులో పని చేసేవాళ్ళు ‘’రఫ్ అండ్ టఫ్  ‘’టైపు మనుషులు .అల్లకల్లోల సముద్రం భయానక ప్రయాణం అతని మనసుపై ముద్ర వేసింది .హృదయం అల్లకల్లోలమైంది సముద్రం తో పాటు .ఎన్నో కొత్త కొత్త భావాలు ఊపిరి సలపనివ్వకుండా ముసురుతున్నాయి .నౌకలో అతనిపని కోడి పిల్లల్ని మాంసం కోసం శుభ్రం చేయటం పందులకు పడుకొనే సదుపాయం కలిగించటం .’’గాడిద చాకిరి చేయించేవారు నన్ను’’ అని చెప్పుకోన్నాడు..చాలా నీచం గా క్రూరం గా డబ్బున్న మనుషులు హీనం గా’’అలబామాలో ఉన్న ఆఫ్రికన్ ‘’లాగా  చూసేవారు .ఇంత హీన నీచ పరిస్తితులలో పని చేస్తున్నా ఏమాత్రం అసహ్యించుకోకుండా గాడిద చాకిరీ చేస్తూనే ఉన్నాడు .దీఇకి ముఖ్య కారణం సముద్ర ప్రయాణం మీద ఉన్న మోజే .ఈ వింత విపరీత విషయాలన్నీ మేల్విల్లీ రాయబోయే  బృహత్తర నవలలకు ముడి సరు కైంది.ఈ మొదటి విదేశీ ప్రయాణంలో  నాలుగు నెలలు  గడిపాడు  మేల్విల్లీ .లివర్ పూల్ లో దుర్భర జీవితాన్నే గడిపాడు .మళ్ళీ న్యూయార్క్ చేరాడు కాని జీవితం  అనిశ్చితం  అనిపించింది . పల్లెటూరి స్కూళ్ళలో టీచర్ గా పని చేశాడు.దీనితో గ్రామీణ వాతావరణానికి బాగా అలవాటు పడ్డాడు .ఈ నేపధ్యం లో కొన్ని రచనలు చేశాడు .దీని అప్రెంటిస్ వర్క్ అన్నారు .

ఎన్నిప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం రాలేదు అందుకని ‘’ఆషు నెట్ ‘’అనే ‘’వేలింగ్ షిప్’’ లో ప్రయాణించటానికి సభ్యుడైనాడు మేల్విల్లీ .ఇది సుదీర్ఘ ప్రయాణం .తెరచాపలు అల్లాడు .‘’వేల్ వేట’’లో ఆనందం పొందాడు. ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకొని పదేపదే మననం చేసుకొనేవాడు .రాయబోయే చారిత్రాత్మక విశేష నవల ‘’మోబీ డిక్ ‘’కు కావలసిన విషయమంతా మనసులో సుళ్ళు తిరిగింది .నౌకలోంచి సముద్రం లోకి దూకే వాడు .నౌక మీద విపరీతం గా శ్రమపడి  అసలైన ట్రేయినిం గ్ పొందాడు .దాన్ని గురించి తెలియ జేస్తూ ‘’వేల్ షిప్ అంటే హార్వర్డ్ ,నాఏల్ కాలేజి ‘’అన్నాడు .అంత పరస్పర సంబంధం ఉందని అన్నాడన్నమాట .’’ఆషునేట్ షిప్ ‘’1841జనవరి మూడున మాసచూసేట్స్ లోని న్యు బెడ్ ఫోర్డ్ నుండి బయల్దేరింది .బాగా  కిక్కిరిసిన జనం తో బయల్దేరింది .కెప్టెన్ ఒక కిరాతకుడు .మూడీ ఫెలో . ప్రయానణీకులూ మూడీ ఫెలోస్ గానే ఉన్నారు .ఏడాదిన్నర ప్రయాణం చేసి మార్క్వేయాస్ చేరింది. అప్పుడు మేల్విల్లీ  ఇంకో తోటి మనిషితోకలిసి నౌకను వదిలేశారు .నూకూ హివా అనే మారుమూల ప్రదేశానికి పారిపోయారు .అక్కడి టైపీస్ జాతి నరమాంస భక్ష కుల  మధ్య గడిపారిద్దరూ .వీరిద్దరిని బందీలుగా చేసి గౌరవంగానే చూశారు .Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-2-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

క్షేత్రాలు పై స్పందన

spandana1 001 spandana2 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఫ్రెడరిక్ ది ,గ్రేట్ పీటర్ ది గ్రేట్,చంద్రబాబు ది గ్రేట్ -రామ్ కుమార్

capital1 001 capital2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వరల్డ్‌ కప్‌ కోసం కీరవాణి పాట

వరల్డ్‌ కప్‌ కోసం కీరవాణి పాట

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ జీవితంపై నీరజ్‌ పాండే రూపొందిస్తున్న ‘ఎం.ఎస్‌. ధోని – ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రం కోసం తయారుచేస్తున్న ‘ఫిర్‌ సే’ అనే పాటను వరల్డ్‌ కప్‌లో పాల్గొంటున్న భారత క్రికెట్‌ జట్టుకు అంకితం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడైన ఎం.ఎం. కీరవాణి ఇప్పటికే ఈ పాటకు బాణీలు సమకూర్చగా, మనోజ్‌ ముంతషిర్‌ సాహిత్యం అందించాడు. స్వతహాగా క్రికెట్‌ ప్రేమికుడైన నీరజ్‌ ఈ పాటకు వీడియోను కూడా రూపకల్పన చేస్తున్నాడు. ప్రపంచ కప్‌లో భాగంగా ఈ నెల 15న భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఒకదానితో ఒకటి తలపడనుండగా, అదే రోజు ఆ పాటను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని నీరజ్‌ తెలియజేస్తూ ‘‘మొత్తం దేశపు భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా ‘ఫిర్‌ సే’ పాట ఉంటుంది. భారత జట్టు నుంచి దేశంలోని ప్రతి ఒక్కరూ ఏం ఆశిస్తున్నారో అది ఈ పాటలో ఉంటుంది. ఇది ఒక ప్రార్థనాగీతం, ఒక ఆశయ గీతం. ఎం.ఎం. క్రీమ్‌ సాబ్‌ చాలా అందమైన బాణీలు సమకూర్చారు. మన జట్టుపై మనకుండే ప్రేమకు, దేశం కోసం మన ఆటగాళ్లు పడే తపనకు ఇది మేం అందిస్తున్న నీరాజనం’’ అని చెప్పాడు. ‘ఎం.ఎస్‌. ధోని’ చిత్రాన్ని ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, ఇన్‌స్పైర్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తుండగా, టైటిల్‌ రోల్‌ను సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుట్‌ పోషిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌ 22న ఈ చిత్రం విడుదల కానున్నది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కర్మ మేనేజ్ మెంట్ -శ్రీ అరవింద రావు

కర్మ మేనేజ్మెంట్

మనిషి శాసీ్త్రయ పద్ధతిలో నిరూపించలేని విషయాల గూర్చి, ఎవరూ చూడలేని విషయాల గూర్చి మత ప్రచారకులు వాదులాడుతుంటారని మనకు తెలిసిన విషయమే. అలాంటి వాటిలో కర్మ ఒకటి. హిందూమతంలో ఉన్న కర్మ సిద్ధాంతం ప్రజల్ని బానిసత్వంలో ఉంచే ఉద్దేశంతో చెప్పబడింది అనే వాదన ఇటీవలి కాలంలో వచ్చింది. ఒక సామాజిక వర్గం వారు ఇలాంటి పనిచేశారు అంటూ ఆ వర్గం పట్ల ద్వేషం రగిలించడం కూడా జరుగుతోంది. అందువల్ల దీన్ని తెలుసుకోవడం అవసరం.
కర్మ అంటే పని అని అర్థం. ఆఫీసుకు వెళ్లడం లేదా టీ తాగడం లాంటి పనులనే అర్థం కాదు. సమాజంలోని ఇతర వ్యక్తులతో వ్యవహరించడంలో మన ప్రవర్తనకు కర్మ అని పేరు. మన ప్రవర్తన నైతికంగా ఉండవచ్చు. అనైతికంగా ఉండవచ్చు. అసాంఘిక ప్రవర్తన అదుపు చేయడానికి ప్రతి సమాజంలో చట్టాలు ఉంటాయి. కాని కొన్ని రకాల ప్రవర్తనకు చట్టం ప్రకారం శిక్ష లభించవచ్చు. కొన్ని చట్టపరిధిలోకి రాకపోవచ్చు. చట్టపరిధిలోకి రాని అనేక పనులు ఎదుటివాళ్ళను హింసించేటట్టు ఉండవచ్చు. ఇలాంటి పనులు జరగకుండా మేనేజ్‌ చేయడం, ప్రజలందరూ మంచి మార్గంలో నడిచేటట్టు చేయడం అందరు మత పెద్దల ముందున్న పెద్ద సమస్య. దీనికై మతాలు తమ తమ ధోరణిలో కొన్ని విశ్వాసాల్ని చెప్పాయి. ఫలానా పని చేయడం వల్ల స్వర్గం అనే బహుమతి పొందుతారనీ, మరో విధమైన పనివల్ల నరకం అనే శిక్షను పొందుతారనీ అన్ని మతాలూ చెబుతాయి. ఈ బహుమతి, శిక్ష అనేవి మనం చేసిన కర్మకు ఫలం. ఈ ఫలాన్ని కూడా కర్మ అనే పేరిట పిలుస్తూంటాం. కర్మను అనుభవించాల్సిందే అనే మాటను వాడుతూంటాం.
కర్మఫలం మేనేజ్‌మెంట్‌పై అనేకులు అనేకరకాలుగా చెప్పారు. మంచి చేసేవాడికి మంచి ఫలితం రావాలి. చెడు చేసేవాడికి చెడ్డ ఫలితం రావాలి అనేది న్యాయసమ్మతం. ఈ విషయంలో మతాలు ముఖ్యంగా రెండు విధాలుగా చెప్పాయి. 1. ప్రతివ్యక్తీ కర్మఫలం తప్పక అనుభవించవలసిందే అని, మనం చేసే పనులు అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి అనేక జన్మలు ఉంటాయి అని చెప్పడం. 2. ఫలానా మతాన్ని నమ్మితే మీ పాపాలన్నీ దేవుడు తీసుకుంటాడని చెప్పడం మరో పద్ధతి. ఏది ఏమైనా కర్మఫలం ఉంటుందని దేవుణ్ణి నమ్మే వారందరూ ఒప్పుకున్న విషయమే.
మనం చేసే మంచి, చెడు పనులన్నింటినీ లెక్కపెట్టడానికి దేవుడి వద్ద ఏదో ఒక విధానం ఉందని అన్ని మతాలూ చెబుతాయి. ఒక ఉర్దూ కవి ఇలా వాపోయాడు- పకడే జాతే హై ఫరిష్తోంకే లిఖే పర్‌ నా హక్‌ – అంటే కుడిభుజం పై కూర్చున్న దేవదూత పుణ్యకార్యాలన్నింటినీ నోట్‌ చేసుకుని, ఎడమ భుజంపై ఉన్న దేవదూత పాపకార్యాల్ని లెక్క వేసుకొని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు కానీ నా సంజాయిషీ వినడం లేదు అని ఆయన బాధ. కర్మ ఎకౌంటింగ్‌కుగాను యమలోకంలో చిత్రగుప్తుడు కంప్యూటర్‌లాగ లెక్క వేస్తాడని పురాణాల్లో చూస్తాం.
ఒక వ్యక్తి తను చేసిన పనుల ఫలితాన్ని మరో జన్మలో అనుభవిస్తాడనీ, లేదా ఈ జన్మలో ఉన్న స్థితికి ఇంత క్రితం జన్మల్లో చేసిన పనులు కారణమనీ నమ్మడాన్ని కర్మసిద్ధాంతం అంటారు. కర్మ సిద్ధాంతాన్ని హిందూమతమే కాకుండా బౌద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ఆసియా మతాలన్నీ నమ్ముతాయి. బౌద్ధం, జైనం దేవుణ్ణి అంగీకరించకున్నా కర్మసిద్దాంతాన్ని నమ్ముతాయి. చైనా, జపాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక మొదలైన దేశాలన్నీ బౌద్ధదేశాలు. అంటే ప్రపంచంలో దాదాపు యాభైశాతం ప్రజలు జన్మ ఉందని నమ్ముతారు. బుద్ధుని జాతక కథలు, జైనుల తీర్థంకరుల కథలు ఇవన్నీ కర్మ, మరో జన్మను తెలుపుతాయి.
భారతీయ సంస్కృతిలో కర్మ సిద్ధాంతాన్ని చెప్పడానికి కారణాల్ని ఇలా చెప్పారు.
1. మనిషి ఎన్నెన్నో పనులు చేస్తూంటాడు. వాటన్నింటికీ ఫలితం అతను బ్రతికుండగానే అనుభవించే అవకాశం ఉండదు. దీనికి మనం చాలా ఉదాహరణలు చూస్తూంటాం. ఇంత మంచి వ్యక్తి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడని లేదా ఇన్ని దుర్మార్గాలు చేసిన వ్యక్తి ఇంత సుఖంగా ఉన్నాడనో అనుకుంటూంటాం. దీన్ని పరిష్కరించడానికి మళ్ళీ జన్మ ఉంటుందని ఊహించాలి. అలా కాకుంటే ఒక వ్యక్తి తన చేయని తప్పుకు ఈ జన్మలో శిక్ష పొందుతున్నట్లు లేదా, చేయని పుణ్యానికి లాభం పొందుతున్నట్లు చెప్పవలసి వస్తుంది.
2.సృష్టి వైచిత్రి- అంటే ఛీజీఠ్ఛిటటజ్టీడ. ఒకరు రాజభోగాలతో పుడితే, మరొకడు కటిక పేదగా ఉంటాడు. ఒకడు ఆరోగ్యవంతుడిగా ఉంటే మరొకడు అవిటివాడుగా పుడతాడు. దీనికి కారణం చెప్పలేం. సృష్టి అనేది ఒక యాక్సిడెంట్‌ అనీ, యఽథాలాపంగా జరిగినది అని చెప్పాలి. లేదా దేవుడు కొంతమందిపై పక్షపాతబుద్ధి చూపాడని చెప్పాలి. కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే పై విధంగా చెప్పాల్సిన పనిలేదు.
3. సమాజంలో మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం.
4. వ్యక్తి హుందాగా తాను చేసిన పనికి తానే బాధ్యత వహించాలని చెప్పడం. భగవంతుడు ఎవరి పాపాల్ని గాని, పుణ్యాన్ని గానీ తీసుకోడు అని ధైర్యంగా చెబుతుంది. భగవద్గీత (5-15) ఆ తర్వాత 18 వ అధ్యాయంలో తాను అర్జునుణ్ణి అన్ని పాపపుణ్యాలనుండీ గట్టెక్కిస్తాననీ చెబుతాడు కృష్ణుడు. ఇలా చెప్పడం పైకి విరుద్ధంగా కనిపిస్తుంది. గత వ్యాసాలలో భగవంతుడి స్వరూపాన్ని గురించి చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుందాం. పరమాత్మ అంటే శుద్ధ చైతన్యమే. దీనికి ప్రపంచాన్ని సృష్టించటం, పోషించడం, పోలీసింగ్‌ చేయడం మొదలైన పనులేమీ ఉండవనీ తెలుసుకున్నాం. పై చైతన్యంలో ప్రకటమయ్యే ఒకనొక సృజనాత్మకశక్తి (ఛిట్ఛ్చ్టజీఠ్ఛి ఞౌఠ్ఛీట) నే మనం సృష్టికర్త. దేవుడు అని భావించుకుంటున్నామని తెలుసుకున్నాం. శుద్ధ చైతన్యానికి పుణ్యపాపాలతో సంబంధం లేదు. సృష్టికర్త అనే స్థాయిలో కూడా దేవుడు మనకు సరైన బుద్ధిని ప్రసాదిస్తాడు. అంతే కానీ పాపాల్ని మాఫీ చేయడు. దదామి బుద్ధి యోగం – అంటాడు కృష్ణుడు. మనిషే సరైన బుద్ధి ద్వారా పాపం, పుణ్యం అనే బంధాలనుండి తప్పుకుని బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడని దీని అర్థం.
ఇటీవల మానసిక శాస్త్రవేత్తలు పునర్జన్మపై అనేక ప్రయోగాలు చేశారు. ఞ్చట్ట జూజీజ్ఛ ట్ఛజట్ఛటటజీౌుఽ అనే విషయంపై పరిశోధించి మనిషికి మరో జన్మ ఉన్నట్లు చెప్పిన అనేక పరిశోధనా వ్యాసాలను చూడగలం. కర్మసిద్ధాంతం అంటే మనిషి కర్మకు బానిస అని అర్థం కాదు. తను ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తన ఖర్మ. దీన్నుండి తప్పించుకోలేం అనుకోవడం జ్చ్ట్చజూజీటఝ అవుతుంది. మన సిద్దాంతం దీన్ని అంగీకరించదు. ఒక మనిషి పుట్టుక మాత్రమే (ధనవంతుడిగానో, ఆరోగ్యవంతుడిగానో) కర్మను బట్టి ఉంటుంది. ఆ తర్వాత మనకిష్టమైన పనిని ఎంచుకునే స్వాతంత్య్రం మన బుద్ధికి ఉంది. దీన్నే ఇంగ్లీషులో జట్ఛ్ఛ ఠీజీజూజూ అంటారు. ప్రతివ్యక్తి మంచి కర్మల్ని ఎంచుకుని జ్ఞానానికి అర్హుడు కాగలడనీ, మనుష్య మాత్రుడెవడైనా మోక్షానికర్హుడనీ మన సిద్దాంతం చెబుతుంది. మనుషుల్ని బానిసత్వంలో ఉంచడానికి ఇది చెప్పబడింది అనే హాస్యాస్పదమైన భావం మన పుస్తకాల్లో ఎక్కడ వెతికినా చూడలేం. కర్మ సిద్దాంతాన్ని నమ్మిన బౌద్ధమతాన్ని స్వీకరించిన అంబేద్కర్‌ తనంత తాను బానిసత్వంలోకి వెళ్లాడని చెప్పలేం కదా!
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను  navya@andhrajyothy.com
పంపండి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సౌర సాగు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యూరప్ కు గ్రీక్ విషాదం తప్పదా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కలిసి రండి అన్న బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ నార్ల వెంకటేశ్వర రావు 30వ వర్ధంతి మార్చి 13, 2015

శ్రీ నార్ల వెంకటేశ్వర రావు 30వ వర్ధంతి మార్చి 13, 2015



Narla Venkateswara Rao

 

Narla Venkateshwara Pramastenakshmi Preval Argurananda Veramesh Kashturambigrana Mitall Rao

or V. R. Narla (1 December 1908 – 13 March 1985) is a Telugu language writer, journalist and politician from

Andhra Pradesh in India. He was Rajya Sabha member twice from 3 April 1958 to 2 April 1970, and wrote a

satakam in Telugu along with several other books.

Narla Venkateswara Rao started as a journalist and ascended the pinnacle of fame as a humanist. It was

great evolution worthy of emulation by future generations.

http://en.wikipedia.org/wiki/Narla_Venkateswara_Rao







 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -89 భారతం పై తుది తీర్పు

నా దారి తీరు -89

భారతం పై తుది తీర్పు

జగ్గయ్య పేట గెంటేల శకుంతలమ్మ డిగ్రీ కాలేజి లో ఒక రోజు సాయంత్రం ఆరు గంటలు ‘’భారతం పై తుది తీర్పు ‘’అనే కార్యక్రమం జరుగుతుందని ఈ నాడు పేపర్లో చదివి ఆ రాత్రికి ట్యూషన్ లేదని చెప్పి జగ్గయ్య పేట వెళ్లాను .కాలేజి చిల్లకల్లు నుంచి జగ్గయ్య పేట కోచ్చే అయిదు కిలోమీటర్ల దారిమధ్య లో ఉంటుంది .ఉయ్యూరునుంచి వచ్చినప్పుడల్లా ఆకాలేజి మీదనుంచే బస్ లో కాలేజీని చూసేవాడిని .ఇప్పుడు మొదటిసారిగా కాలేజిలో అడుగుపెడుతున్నాను  గెంటేల వారు బ్రాహ్మణులు .శకు౦తలమ్మ గారి పేర భర్తా మిగిలిన కుటుంబ సభ్యులు దాతలు కలిపి  కట్టిన  కాలేజి.  మంచి పేరే ఉంది .   ఈ కార్యక్రమం ముగ్గురు మాత్రమె ముఖ్య పాత్రలుగా నిర్వహిస్తూ రాష్ట్రం అంతా తిరిగి ప్రదర్శిస్తున్నారు .అందులో జడ్జి పాత్రను ప్రముఖ ఐఎస్ ఆఫీసర్ ,సాహితీ వేత్త డా.శ్రీ కనుపుల వెంకట శివయ్య గారు ,పాండవుల తరఫున న్యాయ వాది.గా డా. శ్రీ ప్రసాద  రాయ కులపతి ,కౌరవ ప్లీడర్ గా డా. శ్రీ మొవ్వ వృషాద్రి పతి ధరించారు .ముందుగా న్యాయాధిపతి కేసు పూర్వాపరాలను వివరించి  కక్షిదారుల ప్లీడర్ లను వాదించ మంటాడు .అంటే దీని ఉద్దేశ్యం ధర్మం న్యాయం పాండవుల పక్షాన ఉందా ?కౌరవుల పక్షాన ఉందా ?అన్నదానిపై ఆర్గ్యు మెంట్లు .చివరికి జడ్జి గారి తీర్పు .రసవత్తరం గా దాదాపు గంటన్నర సేపు కులపతిగారు, వృషాద్రిపతి గారు తమ వాగ్దోరణితో రసవత్తరమైన భారత పద్యాలతో వ్యాస శ్లోకాలతో ఎవరి వాదన వారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాదించారు .అది వింటూ ఉంటె న్యాయం ఎవరి పక్షాన ఉందొ తెలియనంత కన్ఫ్యూజన్ కు లోను చేశారు .శివయ్య గారు ధర్మ న్యాయ పక్షపాతం గా పాండవుల వైపే తీర్పు చెప్పటం తో క్లైమాక్స్ బాగా పండింది .ముగ్గురూ ఆంద్ర దేశం లో దిగ్గజాలైన పండితులు ,కవులు విమర్స కులు కులపతిగారు అష్టావధాన శతావధాన   దురంధరులు .అవధానాలపై పుస్తకాలు రాసిన వారు . వృషాద్రిపతి గారు నాగార్జున యూని వర్సిటిలో తెలుగు లెక్చరర్ అని గుర్తు .   చివరికి నాకేమనిపించింది అంటే ‘’అసలు భారతం మీద తుది తీర్పు చెప్పే యోగ్యతా ,సామర్ధ్యం మనకు ఉందా?’’ అని .ఏమైనా ఒక కొత్త ప్రయోగం .ఈ ముగ్గురే మిగిలిన కవి పండితులను కలుపుకొని’’ భువన విజయం ‘’ చాలా చోట్ల ప్రదర్శించి నీరాజనాలు అందుకొన్నారు .’’తీర్పు ‘’ అంత క్లిక్ అయినట్లు లేదు .అవదుకూడా  .

నా సూచన –ముట్నూరి కృష్ణారావు గారి సాహితీ దర్బార్

అంతా అయిపోయిన తర్వాత  ఒక కాగితం మీద కులపతి గారికి ‘’అయ్యా !ఈ వాదాలు తీర్పుల వలన ధర్మ చ్యుతి తప్ప ధర్మ సంస్థాపన జరగదు .నెగటివ్ భావ వ్యాప్తి చేయటం మంచిది కాదు. అయినా మీ ప్రదర్శన ప్రదర్శనగా బాగుంది .నాదొక విన్నపం –ఎన్నో చోట్ల భువన విజయం ఆడారు .సంతోషం .కాని మహాను భావుడు  ,ఆలోచనా సంస్కారం ఉన్నవారు కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారి సమక్షం లో  విశ్వనాధ, కాటూరి, పింగళి ,బాపిరాజు  వంటి ప్రసిద్ధులు ‘’దర్బారు ‘’జరిపే వారని మనకు తెలుసు .ఆ ప్రక్రియను కూడా చేబట్టి ప్రదర్శిస్తే ఏంతో ఉచితం గా ఉన్నతం గా ఉంటుంది .ఆ ప్రయత్నం చేసి నాబోటి’’ కృష్ణరాయ ‘’విధేయులకు ఆనందం కల్గించండి –‘’అని రాసి  అడ్రస్ రాసి ఇచ్చి ,అప్పటికే రాత్రి తొమ్మిది అయినందువల్ల  ,బయల్దేరి బస్ ఎక్కి చివరిబస్ లో గండ్రాయి రాత్రి పదిన్నరకు చేరుకొన్నాను .

అమలైన నా సూచన -ముట్నూరి సాహితీ దర్బార్

నాఆలోచనా, సూచనా వారు చదివారో లేదో నాకు తెలియదు .కాని అది అమలయింది .కృష్ణా పత్రిక ఎడిటర్ శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లుగారు కృష్ణా రావు గారుగా , కులపతి గారు ,వృషాద్రి పతి గారు  మొదలైన వారంతా కలిసి ‘’ముట్నూరి వారి సాహితీ దర్బార్ ‘’నిర్వహిస్తున్నట్లు పేపర్ లో చదివి పిరాట్ల వారితో నాకు సాన్నిహిత్యం ఉండటం వలన ఒక కార్డు రాసి ఈ కార్యక్రమం జరగటం ముదావహవమని ,నేను సుమారు అయిదేళ్ళ క్రితం ఈ సూచనను రాత పూర్వకం గా జగ్గయ్య పేట లో కులపతి గారికి  తెలియ జేశానని నాకల ఈ నాడు సాకారం అయిందని రాశాను .ఇందులో నాపాత్ర ఉందొ లేదో నాకు తెలీడుకాని నేను కోరింది జరిగింది .ఈ దర్బారునూ చాలా చోట్ల ప్రదర్శించి పేరు తెచ్చుకొన్నారు .’’మై డ్రీం హాస్ కం ట్రూ ‘’   అదీ నాకు మహదానందం .ఈ ముఠాయే ‘’ఇంద్ర సభ ‘’కూడా దేశమంతా ప్రదర్శించారన్న సంగతి సాహితీ వేత్తలకు తెలిసిన విషయమే .

ప్రభావతి గండ్రాయి రాక

గండ్రాయి లో నా ‘’ఒంటి గది కాపురం ‘’చూడటానికి నా భార్య  ప్రభావతిని ఒక సారి ఉయ్యూరు నుంచి వస్తూ నాతొ తీసుకొచ్చాను .ఒక వారం ఉందని జ్ఞాపకం .నాకు కావలసినవన్నీ ఉన్న ఒకే  స్టవ్ మీద  ఉన్నకాసిని గిన్నేలతో వంట చేసి పెట్టింది .ఒక సారి మా మరదలు దుర్గా వాళ్ళింటికి మిర్యాల గూడా వెళ్లి వచ్చాము .ఆ తర్వాత దుర్గ భర్త శంకరం కూడా వచ్చారు గండ్రాయికి .మా ఇంటి వారి ఆతిధ్యానికి అందరూ ఆశ్చర్య పోయారు .అలాగే ఖమ్మం మేమిద్దరం వెళ్లి మా పెద్ద తోడల్లుడి గారింటికి ఒక రోజు వెళ్లి వచ్చాం .పేటలో శోభనాద్రి ఇంటికి వెళ్లి  సత్యవతి పిన్నిని కుటుంబాన్ని చూసి వచ్చాం .ఒక రోజు మధ్యాహ్నం మా హెడ్ మాస్టారు సుబ్రహ్మణ్యం గారిని భోజనానికి ఆహ్వానించి ఆ ఇరుకు గదిలోనే షడ్రసోపేత భోజనం వండించి పెట్టాం.ఆ యన సంత్రుప్తికి అవధుల్లేవు . ఇంత లిమిటెడ్ సామగ్రితో మీ శ్రీమతి ఎన్ని వడ్డించారండీ అని ఆయన నాతొ  ఆశ్చర్య పోతూ అని , స్టాఫ్ అందరితోనూ చెప్పారు .సుధాకర్ దంపతులనూ పిలిచి భోజనం పెట్టాం .ప్రైవేట్ పిల్లకు లడ్డూ ,బూంది చేసి తినిపించాం .

మామయ్య మరణం

గండ్రాయి లో పనిచేస్తున్న కాలం లోనే మా మేనమామ గుండు గంగయ్య గారు అనే గంగాధర శాస్త్రి దాదాపు అయిదేళ్లుగా పక్షవాతం తో తీసుకొని ,మూడవ కొడుకు మోహనాయ్ రోడ్డుమీద యాక్సి డెంట్ లో చనిపోవటం తో కుంగిపోయి చిక్కి శల్యమై హాస్పిటల్ లో చేరి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు .నాకు తెలియంగానే వెళ్లి కార్యక్రమాలో పాల్గొన్నాను .మా మయ్య లేని లోటు మా కుటుంబానికి తీరది కాదు .నేనంటే మహా అభిమానం ఆయనకు .అప్పుడేవో శలవలోచ్చాయి ,శలవల్లో ట్యూషన్ పెట్టి కోర్సు లాగించాను .

నా సైన్స్ టీచరే మా గజెటెడ్ ఇన్స్పెక్టర్

నేను ఉయ్యూరు హైస్కూల్ లో ఎస్ ఎస్ ఎల్ సి చదువుతున్నప్పుడు మాకు సైన్స్ టీచర్ గా1956లో  వచ్చిన శ్రీ మతి పుష్పావతమ్మ గారు కొద్ది కాలమే అక్కడ పని చేశారు అప్పుడు ఆమె భర్త ఎదోకాలేజీ లో లెక్చరర్ గా పని చేసేవారు .ఉయ్యూరులో వాళ్ళ నాన్నగారింట ఉండేవారు .తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ప్రమోషన్ పొంది చాల చోట్లపని చేసి ఇప్పుడు విజయవాడ డివిజన్ కు గజెటెడ్ ఇస్పెక్టర్ గా అంటే సహాయ జిల్లా విద్యా శాఖాదికారిణిగా (డి వై ఇ ఒ ) వచ్చి ,గండ్రాయి హైస్కూల్ కు ఇన్స్పెక్షన్ కు వచ్చారు .నేను ఆమె శిష్యుడనని గుర్తు చేస్తే  ఏంతో సంబరపడ్డారు .అన్ని సబ్జెక్టులు ఆమె తనిఖీ చేశారు .నా ఫిజిక్స్ బోధన బాగా ఉందని నేచురల్ సైన్స్ లో అంతగా సంతృప్తి చెందలేదని చెప్పారు .ఆ మాట నిజమే .పుష్పావతమ్మగారు నేను మంగళాపురం హెడ్ మాస్టారుగా పని చేసినపుడు మచిలీపట్నం గజెటెడ్ ఇన్స్పెక్టర్ గా వచ్చారు. మళ్ళీ ఆమెతో పరిచయం కలిగింది .ఆమె కు ఒక కన్ను మెల్ల .ఆ కన్ను సగం మూసి చూస్తారు .మంచిమాటకారి .హుందాగా ఉండేవారు .రూల్స్ బాగా తెలిసిన వారే .

వత్సవాయి హైస్కూల్ లో టెన్త్ పరీక్షల ప్రహసనం

1987 మార్చ్ టెన్త్ క్లాస్ పరీక్షలకు నన్ను డిపార్ట్ మెంట్ ఆఫీసర్ గా ,తెలుగు మేష్టారు సుధాకరరావు ఇన్విజిలేటర్ గా వత్సవాయి హైస్కూల్ కు నియమించారు .రోజూ గండ్రాయి నుండే వెళ్లి వచ్చే వాళ్ళం .అక్కడ హెడ్ మాస్టారు లింగం వెంకటేశ్వరరావు  గుడివాడ ప్రాంతం వాడు .కాని విపరీతమైన కాపీలు చేసేవారుపిల్లలు .ఎక్కడేక్కడి నుంచో స్లిప్పులు  గైడ్లు వచ్చిపడేవి .కాపలా కాయటం చాలా కష్టం గా ఉండేది .ఇంవిజిలేషన్ కు వచ్చిన టీచర్స్ కూడా కాపీకి సాయం చేసేవారు .అక్కడ చదువు అంతంత మాత్రమే .నేను సహించలేక పోయాను .పరీక్ష హాల్ లోకి వచ్చిన పిల్లల్ని ముందే చే చేయించి నేనూ  చేసి ఆడపిల్లలను లేడీ టీచర్స్ చేత చెక్ చేయించి లోపలి పంపేవాడిని .రెండున్నర గంటల పరీక్ష లో ఒక్క క్షణం కూడా కూర్చునే వాడిని కాను .భయం వేసి క్రమంగా రెండో రోజునుంచి కాపీలు తగ్గి కంట్రోల్ లోకి వచ్చింది సెంటర్ .సుధాకరరావు కూడా బాగా సహకరించాడు .ఇద్దరం కలిపి ముతక భాషలో చెప్పాలంటే ‘’రేకాడించాం ‘’.సోషల్ పేపర్ ఎక్కడో లీక్ అయి ఆ పరీక్ష వాయిదా పడింది .దానికోసం మళ్ళీ రావాల్సి వచ్చింది పదిహేను ఇరవై రోజుల తర్వాత .అలాంటి స్కూల్ కు నేను తర్వాత హెడ్ మాస్టారు గా ప్రమోషన్ మీద వచ్చాను. చాలా విచిత్రం గా ఉంది .ఈ అనుభవం .

నా హెడ్ మాస్టర్  ప్రమోషన్

అప్పటికే సుమారు గా 24 ఏళ్ళు సైన్స్ మేస్టరుగా పని చేశాను. ఎప్పుడెప్పుడా ప్రమోషన్ అని ఎదురు చూస్తున్నాను .మా తమ్ముడు మోహన్ పూనా నుంచి అప్పటికే హైదరాబాద్ వచ్చి స్తిరపడ్డాడు .మా హెడ్ మాస్టర్ పరీక్షా ఫలితాలు ముందుగా గెజిట్ లో ప్రచురిస్తారు .అవి జిల్లాకు చేరటానికి వారం పది రోజులు పడుతుంది .అప్పుడు నెట్ సర్వీస్ లేదు .అందుకని మోహన్ కు ముందే చెప్పి ఉంచా గెజెట్ నోటిఫికేషన్ రాగానే ఒక కాపీ తీసుకొని నాకు అర్జెంట్ గా పంపమని .అలాగే చేశాడు .ఆగస్ట్ మొదటి వారం లో ఒక కాపి ఉయ్యూరుకు అందింది .నేను ఉయ్యూరు వెళ్లి దాన్ని’’ ట్రూకాపీలు’’ తీయించి (అప్పటికి జిరాక్స్ రాలేదు ) కాపీలు చేతితో తీసుకొని బందర్ వెళ్లాను. జిల్లాపరిషత్ కు వెళ్లాను అనుకోకుండా అప్పుడు చైర్మన్ శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు గారు  ఆఫీసులోనే ఉన్నారు .ఆయన్నుకలిసి నేను టెస్ట్ పాస్ అయ్యానని కొత్తగా తీసే హెచ్ ఏం పానల్ లో నన్ను చేర్చమని ఒక గజెట్ కాపీ ఇచ్చాను. ఆయన వెంటనే అక్కడే ఉన్న కాంప్ క్లెర్క్ కు ఇచ్చి దీని విషయం  అర్జెంట్ గా   చూడమని చెప్పారు . .పరిషద్ ఎడ్యు కేషన్ ఆఫీసర్ శ్రీ నూకల శ్రీరామ మూర్తి గారినీఆఫీస్ లోకలిసి కాపీ ఇచ్చి విషయం చెప్పాను .తప్పకుండా ఇంక్లూడ్ చేస్తామన్నారు . హెడ్ మాస్టర్  క్లెర్క్ శ్రీ శేష గిరి రావు నుకూడా కలిసి కాపీ ఇచ్చిపానెల్ ల లిస్టు లో  చేర్చమని ,మళ్ళీ వచ్చికలుస్తానని చెప్పి మా హెడ్ మాస్టర్ల  సంఘం అధ్యక్షులు, మా గాడ్ ఫాదర్ ‘’శ్రీ సోమంచి రామం గారిని ఫోర్ట్ రోడ్ లో వారింటిలోకలిసి చెప్పి ఆయన ఆశీస్సుల౦దుకొని ఉయ్యూరు ఇంటికి చేరా .మర్నాడు గండ్రాయి వెళ్లి హెడ్ మాస్టారికి మిగిలిన వారికీ తెలియజేశా .నాకు ప్రమోషన్ వస్తోందన్న సంతోషం నా ప్రైవేట్ పిల్లల ముఖాలలో కనిపించలేదు .నేను  వెళ్లిపోతున్నాననే బాధ కనిపించింది .రుణానుబంధం ఎన్నాళ్ళో తెలీదు కదా .నన్నుపేనల్లిస్టు  లో చేర్చమని అడిగానే కాని నేను కలిసిన ఎవరికీ నాకు ఫలానా చోటు కావాలని కోరలేదు. కోరాలని తెలియదుకూడా . తర్వాత తెలిసింది యెంత తప్పు చేశానో .

నన్ను వత్సవాయి హైస్కూల్ కు హెడ్ మాస్టర్ గా ప్రమోట్  చేస్తూ ఆర్డర్ వచ్సుస్తున్నాయని వార్తా ముందే తెలిసింది .మళ్ళీ ప్రభావతిని తీసుకొచ్చాను .హెడ్ మాస్టారి భార్య గారినీ ఆయన్ను మా ఇంటికి (గదికి-సింగిల్ రూమ్)  ఆహ్వానించి మంచి భోజనం పెట్టి నూతన వస్త్రాలు పెట్టాం .దంపతులు ఏంతో సంతోషించారు .ట్యూషన్ పిల్లలకూ స్వీటు హాటు చేసి అందరికి ఇచ్చి మా ఆనందం లో భాగస్వాములను చేశాం .అలాగే పిచ్చయ్యగారు భారతమ్మ దంపతులకు కూడా .గండ్రాయి నాకు సైన్స్ మేష్టారు గా చివరి మజిలి .నా జీవితం లో మరపు రాని అనుభూతులను నింపిన గ్రామం ,స్కూలు . ఇక్కడి విద్యార్ధుల మనస్సులోస్తిరమైన స్థానం పొన్ది ఆదరాభిమానాలకు మన్ననలకు గౌరవానికి పాత్రుడనవటం  నా అదృష్టం . ఎందుకు ఈ మాట అన్నానంటే ఆగిరిపల్లిలో మా దూరపు చుట్టరికం ఉన్న సూరి శోభనాద్రి గారనే అక్కడి సంస్కృత పాఠ శాల నిర్వాహకుడి కొడుకు సోమశేఖరం ఒక సారెప్పుడో కనిపించి మాటల సందర్భం గా నేను గండ్రాయి లో పని చేశానని చెబితే ఆశ్చర్య పడి ‘’యెట్లా పని చేశావయ్యా అక్కడ .అక్కడ ఉండాలంటేనే చిరాకేసింది నాకు ఉండలేక పోయాను యు ఆర్ గ్రేట్ ‘’అన్నాడు .అంతే కాదు గండ్రాయిలో నేనున్న పిచ్చయ్య గారికి బాగా ఇష్టమైన సైన్స్ మేస్టారు ప్రసాద్ ఇక్కడ పని చేసి వీరి కుటుంబానికి చాలా సన్నిహితుడై ఉండేవాడు  ఆతను తర్వాత కపిళేశ్వర పురం సైన్స్ మేస్టారుగా  చేసి ప్రమోషన్ మీద పునాదిపాడు హెడ్ మాస్టార్ అయి అక్కడే రిటైర్ అయ్యాడు .పిచ్చయ్యగారి కుటుంబం ఇతని కుటుంబానికి రాకపోకలు బాగా ఉన్నాయి. మంచి టీచర్ గా ప్రసాద్ కు ఇక్కడ పేరుంది .అలాంటి వాడి స్థానం లో నేను పని చేసి ఇ౦త అభిమానం పొందటం మామూలు విషయం కాదు. ఏదో దివ్య శక్తి నడిపించిందనే అనిపిస్తుంది .

గండ్రాయిలో లో 750-30-1020-35-1300 స్కేల్ లో  బేసిక్ 1055+14(f p I )గా1-8-86 నుంచి  జీతం తీసుకొన్నాను .rc no.6468 /81b1 dt 12-9-1987 of the p e.o and d.d.o..krishna  ననుసరించి నన్ను గండ్రాయి నుంచి వత్సవాయి హైస్కూల్ కు హెడ్ మాస్టారుగా ప్రమోట్ చేశారు 15-9-87  సాయంత్రం సైన్స్ మాస్టర్ గా రిలీవ్ అయ్యాను .ఇక్కడ ఉండగానే 1986  వేతన సవరణ అమలులోకి వచ్చింది.2070+14 గా1330-60-1930-70-2630  స్కేల్ లో బేసిక్ ఫిక్స్ అయింది .

నాకు స్కూల్ లో వీడ్కోలు విందు ఇచ్చారు .అందరూ అభిమానం చూపారు .పిల్లల మొహాల్లో ఏడుపే తక్కువ .నామీది అభిమానాని రాఘవులు సహించలేక వారి ఎమోషన్ కు అడ్డ కట్ట వేసినట్లు కనిపించింది .అందరికీ వీడ్కోలు పలికి  16 వ తేదీ ట్రాన్సిట్ వాడుకొని వత్సవాయి హైస్కూల్ లో 17-9-87ఉదయం హెడ్ మాస్టర్ గా జాయిన్ అయాను.

సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-15- ఉయ్యూరు .

..

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -88 గండ్రాయి శిష్యుడు గోపయ్య ఉదంతం

నా దారి తీరు -88

గండ్రాయి శిష్యుడు గోపయ్య ఉదంతం

గోపయ్య ఎనిమిదోక్లాస్ చదివేవాడు .ఎరుకుల కులం కుర్రాడు .ఎర్రగా అందం గా ఉండేవాడు. వెడల్పు నవ్వు ముఖం ..అసలు చదివే వాడుకాదు అల్లరి విపరీతం గా చేసేవాడని మిగిలిన మేస్టార్లు చెప్పేవారు. నేనే ఆ క్లాస్ టీచర్ని .ఇంగ్లీష్ సైన్స్ చెప్పేవాడిని నాక్లాసుల్లో అల్లరి అసలు చేసే వాడుకాదు. చాలా వినయం గా అమాయకం గా ఉండేవాడు .నేను క్లాస్ నుంచి బయటికి వస్తే చాలు మిగిలిన ఏమాస్టారు నైనా ఆటపట్టిన్చేవాడట .ఒకటి రెండుసార్లు క్లాస్ కు వెళ్ళకుండా దూరం గా ఉండి గమనించాను .అప్పుడు తెలిసింది నాకు వాడి విశ్వ రూపం .బాగా పేదవాడు .ఇంటి దగ్గర తీరు బాగా ఉండక పట్టించుకొనే వాళ్ళు లేక అలా తయారయ్యాడనిపించింది .రెండు నెలల తర్వాత ఒక రోజు ఇంటికి వచ్చి ‘’సార్!నాకు ట్యూషన్ చెప్పాలిమీరు మీ దగ్గర చదవాలని ఉంది .యెంత ఫీజు అడిగితె అంతా ఇచ్చి చేరతాను ‘’అన్నాడు చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడి .ఆహా దొరికాడు అనుకొన్నా .వాడిలో మార్పు రావాలి తేవాలి అనే దృఢమైన ఆలోచన వచ్చింది .’’ఒరే !క్లాసులో విపరీతంగా అల్లరి చేస్తావని అసలు చెప్పేదివినవని విననీయవని అందరూ చెబుతున్నారు .నిన్ను ప్రైవేట్ లో చేర్చుకొంటే వీళ్ళను కూడా చెడగోడ తావేమో  వద్దులే . నీ తంటాలేవో నువ్వు పడు ‘’అని బెదిరిస్తూ అన్నాను .వాడు కదలలేదు .అలాగే నిలబడ్డాడు ‘’సార్ !మీరు కొట్టండి చంపండి .ఏమైనా చేయండి మిమ్మల్ని వదలను. మీ దగ్గరే చదవాలినేను .మీరు కాదంటే స్కూల్ కూడా మానేస్తాను ‘’అన్నాడు మహా వినయం గా .దారిలోకి వచ్చాడనుకొని ‘’సరేరా !ఎంతిస్తావు ఫీజు ?’’అన్నా ‘’సార్!మీరెంత అడిగితె అంతా ఎక్కడో అక్కడ తెచ్చి మీకు ఇస్తా .చదువుకొంటా ‘’అన్నాడు నిశ్చయం గా .వీడు పనికోస్తాడనిపించింది .’’సరే ! నీబుద్ధి సరైన దారిలోకి వస్తోందనిపిస్తోంది .నువ్వు బాగుపడటం నాకు కావాలి .మీరు ఎస్ టి విద్యార్ధులు .ఏమాత్రం టెన్త్ పాసైనా మీకు ఉద్యోగాలను ప్రభుత్వం కళ్ళకు అద్దుకొని ఇస్తుంది .అవకాశాన్ని జార విడుచుకొంటే ఏ ఖూనీకోరువో దొంగవో అవుతావు  భవిష్యత్తు బాగా ఉండాలంటే కష్టపడాలి చదవాలి .నాకు ఒక్క రూపాయి కూడా ఫీజు అక్కర్లేదు .నువ్వు బాగు పడటమే నాకు ఫీజు ‘’అన్నాను .అమాంతం కాళ్ళ మీద పడిపోయాడు కళ్ళల్లో ఏడుపు తన్నుకొచ్చింది గోపయ్యకు  .నాకూ అదే పరిస్తితి .అంతే ఆ రోజు నుంచే ప్రైవేట్ కు వచ్చాడు .

మారిన గోపయ్యనే క్లాస్ లీడర్ చేసి బాధ్యత అప్పగించా .అంటే దొంగకు తాళం చెవి అప్పగించానన్నమాట .అంతే-అల్లరీ గిల్లరీ ఏమైపోయాయో తెలీదు .మహా బుద్ధి మంతుడుగా ఉన్నాడు .ఏ సబ్జెక్ట్ లోను వాడికి ప్రోగ్రెస్ లేదు .వాడికోసం పది లైన్లఇంగ్లీష్  స్టోరీని అయిదు లైన్లకి కుదించి ప్రత్యేకం గా వాడి నోటు పుస్తకం మీద నేనే రాసి చదివిన్చేవాడిని . రెండూ మూడు లైన్ల షార్ట్ ఆన్సర్ ను లైనున్నరకి కుదించి అనిపించి రాయించి అప్పగించుకొని వచ్చేట్లు చేశా .అక్కడ అందరూ బి సి ఎసి ఎస్ టి లే కనుక అసలే తక్కువలోనే నోట్స్ ఇచ్చేవాడిని. వీడికోసం ఇంకొంచెం కుదింపు .నాపద్ధతులన్నీ అలువాటు పడి కస్టపడి చదివి క్రమంగా హాఫ్ యియర్లీ పరీక్షలకు కొద్దిగా ఇంప్రూవ్ మెంట్ చూపించాడు .యాన్న్యువాల్ పరీక్షల్లో బాగా పికప్ అయ్యాడు. నేనంటే వాడికి దేవుడే అయ్యాను .నాకు అన్ని పనులు చేసి పెట్టేవాడు .ఇంత గణనీయ మైన మార్పు గోపయ్యలో రావటం నాకు ఏంతో ఆనందం గా ఉండేది. గర్వం గా ఉండేది .వాడిలో కృతజ్ఞతా భావం అడుగడుగునా కన్పించేది .నాకెందుకో వాడి కళ్ళల్లో వెలుగు ముఖం లో వర్చస్సు కనిపించేవి. అవే నన్ను వాడికి దగ్గరకు చేర్చాయి . స్వభావం వాడికి నచ్చింది .యక్కడ ఉయ్యూరు ఎక్కడ గండ్రాయి ?ఎక్కడిదీ అనుబంధం?తలచుకొంటే ఆశ్చర్యం కలిగిస్తాయి. గోపయ్యలో వచ్చిన మార్పుకు విద్యార్ధులు మేస్టార్లు తలిదండ్రులు చూసి మహదానంద పడ్డారు .

ఎనిమిది పాసై తొమ్మిదికి వచ్చాడు గోపయ్య .మళ్ళీ నాదగ్గరే ట్యూషన్ .ఇంకా జాగ్రత్తగా ఉన్నాడు .అంతేజాగ్రత్త నేనూ వాడివిషయం లో తీసుకొన్నాను .ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న హెడ్ మాస్టర్ ప్రమోషన్ నాకు వచ్చింది. ఆ వివరాలు తర్వాత రాస్తాను .వత్సవాయి హెడ్ మాస్టర్ గా ఆర్డర్ వచ్చింది .ఇక గోపయ్య ఏడుపుకి అంతు లేదు నన్ను వేల్లద్దంటాడు ఇక్కడే ఉండిపోమ్మంటాడు   ఉండటం కుదరదు అంటే వినడు .నాతొ వత్సవాయి వచ్చి అక్కడే స్కూల్ లో చేరతానంటాడు .నన్ను మాత్రం వదలనన్నాడు .ఆ భక్తీ ఏమిటో ఆ నమ్మకం ఏమిటో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇంతవరకు అలాంటి శిష్యుడు నాకు తటస్త పడలేదు .వాడికి నచ్చచేబుతూ ‘’ఒరే! నేను ఇక్కడ ఉండి వత్స వాయి రోజూ  వెళ్లి ఉద్యోగం చెయ్యకూడదు అక్కడే ఉండాలి .నేను లేనని నువ్వు చదువుమానేస్తే ణీ జీవితం బాగు పడదు ఎవరు ఉన్నా లేకున్నా నీ చదువు మీద నువ్వు దృష్టిపెట్టి చదువుకోవాలి. ఎవరూ ఎప్పుడూ వెంట ఉండరు .నిన్ను నువ్వే తీర్చిదిద్దుకోవాలి .నువ్వు నాతొ బాటు వస్తానన్నా నేను తీసుకుకు వెళ్ళను నీ భవిష్యత్తు నాకు ముఖ్యం ‘’అని చెప్పి ఒప్పించాను .ఆ తర్వాత అగోపయ్య టెన్త్  పాసవటం  ఇంటర్ డిగ్రీ చదివి డిగ్రీ సాధించటం బెజవాడలో  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించటం వరుసగా జరిగిపోయాయి .ఈ విషయాలన్నీ బాబ్జీ వాళ్ళు మొదటి సారి గండ్రాయి స్కూలు లో స్వాతంత్ర దినోత్సవం చేసినపుడు నేను వెడితే తెలిసింది .అప్పుడే మళ్ళీ నేను గోపయ్యను చూడటం తటస్తించింది .ఇప్పుడు గేజేటేడ్ హోదా కూడా వచ్చిఉంటుంది. బాబ్జీ బృందం తోకలిసి ఉయ్యూరు మా ఇంటికి వచ్చాడు నిజం గా నా ఆనందానికి అంతేలేదు గోపయ్యను చూసి గర్వపడతాను .గోపయ్యానే ముడి సరుకు వజ్రం గా మారింది ఆ గ్ఫ్హంత నాదే అయినా ఆటను ఆ ఒరిపిడికి తట్టుకొని నిలబడి తానేమిటో రుజువు చేసుకొన్నాడు

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

అపర భగీరధుడు k.l.rao

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా షార్ట్‌ స్టోరీ

 

నా షార్ట్‌ స్టోరీ
అందరిలా కాకుండా కాస్త భిన్నంగా కనిపిస్తే చాలు ఒకటికి నాలుగుసార్లు చూస్తారు. వింతగానూ చూస్తారు. అలాంటిది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తుతో ఉన్న మనిషి కనిపిస్తే… కళ్లముందు కనిపించేది మనిషా, బొమ్మా అని ఆశ్చర్యంగా చూడడం, వింతగా మాట్లాడడం ఖాయం. కానీ ఆ చూపులు, మాటలు వాళ్లనెంతగా బాధిస్తాయో ఆ మాటలు అనేవాళ్లకి తెలియదు. అలాంటి అనుభవాలు ఇరవైయొక్కేళ్ల జ్యోతి ఆమ్గేకు ఎన్నో ఉన్నాయి. తక్కువ ఎత్తుతో గిన్ని్‌సబుక్‌ రికార్డుల్లోకిఎక్కడమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆమె తన రోజూవారీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఓపెన్‌ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
‘‘నాకు మూడేళ్లు వయసులో నన్ను పరీక్షించిన డాక్టర్లు నాకున్న అరుదైన పరిస్థితి (మరుగుజ్జుతనం) గురించి అమ్మావాళ్లకి చెప్పారు. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలిశాక మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇంటికి ‘జ్యోతిహౌస్‌’ అని పేరు పెట్టారు. నాగపూర్‌లో నన్నందరూ ‘లివింగ్‌ డాల్‌’, ‘లిటిల్‌ వండర్‌’, ‘థంబెలినా’ అని పిలుస్తుంటారు. లేత గులాబీ రంగంటే నాకు చాలా ఇష్టం. అందుకే నా గదికి, మెట్లకి అదే రంగు వేయించారు మావాళ్లు. నా గది చూస్తే మీకు మిర్రర్‌ ఇమేజ్‌ ఏమైనా ఉందా అనుకుంటారు. ఎందుకంటే మామూలు సోఫాలు, కుర్చీలు ఒక పక్కన ఉంటాయి. అవే సోఫాలు, కుర్చీలు మరోవైపు మినియేచర్‌ సైజుల్లో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ‘బొమ్మరిల్లు’లా కనిపిస్తుందన్నమాట. నా కోసమే ప్రత్యేకంగా బెడ్‌, డెస్క్‌, కుర్చీ తయారు చేయించారు. వంటగదిలో గిన్నెలు, ప్లేట్లు కూడా రెండు సైజుల్లో ఉంటాయి. కుటుంబమంతటికీ ఒక సైజు నాకోసం మరో సైజు. నేను కడుపులో పడిన దగ్గర్నించీ ఇప్పటివరకు మా అమ్మ నన్ను మోస్తూనే ఉంది. అదెలాగంటే నేను ఎక్కువసేపు నడవలేను. అందుకని ఎక్కువ సమయం మా అమ్మ నన్ను ఎత్తుకునే ఉంటుంది.
హారర్‌ స్టోరీ అభిమానులను ఇచ్చింది
నేషనల్‌ జియోగ్రఫిక్‌ వాళ్లు తీసిన డాక్యుమెంటరీతో మొదలైన ప్రయాణం 2012లో బిగ్‌బాస్‌ షోలో, మైకా సింగ్‌ మ్యూజిక్‌ వీడియోలో కనిపించేలా చేసింది. 2014లో ‘అమెరికన్‌ హార్రర్‌ స్టోరీ’ అనే టెలివిజన్‌ షోలో నటించే అవకాశం వచ్చింది. అందులో ‘మా పిటైట్‌’ పాత్రలో కనిపించాను. ఆ పాత్ర దారుణంగా హత్యగావించబడుతుంది. అది చూసిన అభిమానులు ఇంటర్నెట్‌లో తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. విషాదకరమైన సందేశాలు పెట్టారు. పెద్ద మీడియా సంస్థలయిన ‘ప్యూపుల్‌’, ‘హపింగ్టన్‌ పోస్టు’, ‘ఎబిసి న్యూస్‌’, ‘స్లేట్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టునైట్‌’లలో నా లైఫ్‌స్టోరీని ప్రచురించాయి. అప్పటివరకు నన్ను నీడలా వెంటాడిన ‘బేబీ’, ‘డాల్‌’ అనే పదాలు ఒక్కసారిగా మాయమైపోయాయి. అదే విషయాన్ని నా ఫేస్‌బుక్‌ మెసేజ్‌లో ‘నన్ను బేబీ లేదా డాల్‌ అని పిలవనందుకు నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ అమెరికన్‌ హారర్‌ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. నా ప్రయత్నం నేను చేశాను’ అని పెట్టాను. ఈ షో ప్రీమియర్‌కి గులాబీరంగు గౌను వేసుకుని, జుట్టును రింగులు రింగులు తిప్పుకుని, భారీ మేకప్‌ వేసుకుని వెళ్లింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ ‘‘నేనిదంతా కల అనుకుంటున్నాను. ఇలా హాలీవుడ్‌లో ఉంటానని నేను అనుకోలేద’’ని తన సన్నటి గొంతుతో మాట్లాడింది జ్యోతి. ఎక్కువ సమయాన్ని తన స్మార్ట్‌ఫోన్‌ మీద వేళ్లు కదిలిస్తూ సోషల్‌ మీడియాలో ఉన్న అభిమానులతో బిజీగా ఉంటుంది. ఆమె ఉపయోగిస్తున్న ఐఫోన్‌ 5 ఆమె చేతిలో చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోను పొడవు ఆమె ముంజేయి వరకు ఉంటుంది. షూ బాక్స్‌లో తనకి చేతిరాతతో వచ్చిన ఉత్తరాలను, కార్డులను జాగ్రత్తగా పెట్టుకుంటుంది. అందులో ఆమెని పెళ్లాడతామంటూ వచ్చిన ఉత్తరాలు కూడా ఉంటాయి. అమెరికా వీరాభిమాని ఒకరు ఆమెను ఫేస్‌బుక్‌లో విపరీతంగా ఇబ్బందిపెడుతుంటే అతడ్ని బ్లాక్‌ చేద్దామని కూడా అనుకుందట.
పొడవు జుట్టుతో మరోసారి
ఆమెను తెరమీద, ఫోటోల్లో చూస్తే మరీ అంత తక్కువ ఎత్తు ఉన్నట్టు కనిపించదు. కానీ వాస్తవంగా వాటిలో కనిపించేదానికంటే ఎత్తు చాలా తక్కువగా ఉంటుందామె. ‘‘నా కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులు కొనుక్కోవడం అంటే ఇష్టం. అలాగే ఎత్తుమడమల చెప్పులు వేసుకోవడమంటే కూడా చాలా చాలా ఇష్టం. కాని నేనెప్పటికీ వాటిని వేసుకోలేను. చిన్నప్పుడు కాళ్లు విరిగిపోయాయి. అవి నన్ను ఇప్పటికీ బాధిస్తుంటాయి. ఎందుకంటే నా వంట్లో క్యాల్షియం తయారవదు. అందుకే ఎత్తుమడమలు వేసుకోవడం అనేది నాకు కలగానే మిగిలిపోతుంది. నా జుట్టు ఎప్పుడూ చక్కగా అల్లి జడవేస్తారు అమ్మావాళ్లు. అలాకాకుండా వదిలేసానంటే నాకంటే జుట్టే పొడవుగా ఉంటుంది. ఈ కారణంతో మరోసారి గిన్నిస్‌ బుక్‌ రికార్డు ఎక్కాలనుకుంటున్నాను. కానీ అతి తక్కువ ఎత్తున్న వాళ్లకి పొడవైన జుట్టు ఉండడం అనే విభాగం రికార్డుల్లో లేదు. ఆ విభాగం కూడా పెడతారనేది నా నమ్మకం.
కుర్చీ హ్యాండిలే నాకు సీటు
వయసు పెరిగే కొద్దీ మిగతా పిల్లలతో కలిసి ఆడుకునేందుకు బయటికి వెళ్లేందుకు నాకు ఓపిక ఉండేది కాదు. స్కూల్‌ అయిపోయిన తరువాత ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ కూర్చునేదాన్ని. నన్ను నేను స్ర్కీన్‌ మీద చూసుకున్నట్టు ఊహించుకుంటూ ఉండేదాన్ని. సల్మాన్‌ఖాన్‌ సినిమా ఒక్కటి కూడా వదలకుండా చూశాను. ఆయనతో కలిసి నటించాలనుకున్నాను కూడా. అయితే ఎత్తు తక్కువగా ఉండే నటులకు హారర్‌, మూఖాభినయం వంటి వాటిలోకి వెళ్లడం పెద్ద చాలెంజ్‌. అమెరికన్‌ హారర్‌ స్టోరీని విచిత్రమైనదిగా చూస్తారు. అయితే హారర్‌ షోలో నటించడం వల్ల విచిత్రవ్యక్తులవుతామని నేను అనుకోవడం లేదు. మేము కూడా మిగతా వాళ్లలా మామూలు మనుషులమే. అదే విషయాన్ని ఈ షో ద్వారా చూపించడం మాలాంటి వాళ్లకి ఆనందాన్నిస్తుంది.
మకావు నుంచి మనదేశానికి రాగానే థియేటర్‌కి వెళ్లి ిపీకే సినిమా చూశాను. తెర కనిపించడం కోసమని కుర్చీహ్యాండిల్‌ మీద కూర్చున్నాను. థియేటర్‌లో ఎప్పుడు సినిమా చూసినా కుర్చీ హ్యాండిలే నా సీటు. గదిలో ఉండే లైట్‌ స్విచ్‌లు వేయలేను. టేబుల్‌ మీద రిమోట్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ వంటివి పెడితే వాటిని అందుకోలేను. కారు సీటులో కూర్చోలేను. చిన్న పిల్లల మధ్య ఉన్నానంటే చాలా జాగ్రతగా ఉంటాను. ఎందుకంటే వాళ్లు నన్ను నెట్టేస్తారు. నన్ను చూసినప్పుడు ‘ఈమె పెద్దావిడా, చిన్న పిల్లా లేకపోతే బొమ్మా’’ అనే గందరగోళ పరిస్థితిలో ఉంటారా పిల్లలు.
ఆ భయం పోయింది
నాకున్న మరో సమస్య నా అంతట నేనుగా ఎక్కడికీ వెళ్లలేకపోవడం. నేను కాలేజికి వెళ్లాలంటే మా నాన్నో, అక్కల్లో ఎవరో ఒకరు ప్రతిరోజూ నాకు తోడుగా రావాల్సిందే. హోంసైన్సు చదువుతున్నాను. కాఫీ షాపు, మాల్స్‌ వంటి బహిరంగ ప్రదేశాలకి స్నేహితులతో వెళ్తే జనాలు చుట్టుముడతారు. నాతో వాళ్లు చాలా వింతగా ప్రవర్తిస్తారు. ఏమేమో మాట్లాడతారు. ‘జ్యోతీ, నీ పేరేంటి’ అని అడుగుతారు. ‘నా పేరు మీకు తెలిసినప్పుడు మళ్లీ నన్నెందుకు అడుగుతార’ని నేనంటే ‘ఓరి దేవుడా, ఈమె మాట్లాడుతుంద’ని ఆశ్చర్యపోతారు. నాకిష్టంలేకపోయినా, నేను వద్దని వారించినా నా ఫోటోలు తీసుకుంటారు. అటువంటివన్నీ చాలా చిరాకుగా అనిపిస్తాయి. నా జీవితంలో ఇప్పటివరకు నా వైపు ఆశ్చర్యంగా, వింతగా చూసేవాళ్లే ఎదురయ్యారు. దానివల్ల చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాను. అందుకే బయటకు వెళ్లాలంటే భయం వేసేది. కాని ఇప్పుడు ఎంతమంది శ్రోతలు ఉన్నా మైకులో భయం లేకుండా మాట్లాడగలను. ఎత్తు తక్కువ ఉన్న వాళ్లు కూడా బయటికి వచ్చి వాళ్ల అనుభవాలను నాలాగానే పంచుకోవాలి.’’
ప్రపంచం చుట్టి వస్తుందన్నాడు
నాగపూర్‌లో నివాసులైన రంజన, కిషన్‌జీ ఆమ్గే దంపతుల ఐదో సంతానం జ్యోతి. ఆమె జాతకం చూసిన జ్యోతిష్యుడు ‘ఈ అమ్మాయి వల్ల కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయ’ని చెప్పాడు. అంతేకాదు ఆ బిడ్డ ప్రపంచమంతా చుట్టి వస్తుందని, తనతో పాటు కుటుంబం కూడా పర్యటిస్తుందని చెప్పాడు. ఆ మధ్య తరగతి జంటకి అప్పట్లో అదో అందమైన కల. అందుకే ఆ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలను అంతగా పట్టించుకోలేదు వాళ్లు. ‘నాగపూర్‌ నుంచి ముంబయి వెళ్లడానికే మాకు కష్టం. అలాంటిది ప్రపంచం చుట్టి రావడం ఏమిటి అనుకున్నాం’’ అన్నారు కిషన్‌జి. కాని ఇప్పుడు వాళ్లు బ్రెజిల్‌, అర్జెంటీనా, జపాన్‌, టర్కీ, ఇటలీ, రొమేనియా,చైనా, కువైట్‌ దేశాలు చుట్టేసి వచ్చారు. ఇదంతా ఆఖరున పుట్టిన ఆ అమ్మాయి వల్లే సాధ్యమైంది. ఆ జ్యోతిష్యుడి మాటలు నిజమయ్యాయి. జ్యోతికి రాజకీయ కెరీర్‌ను చూపించే పనిలో ఉన్నాడు ఆమె నాన్న. దాంతోపాటు ఆమె కథను పబ్లిషర్లకు అమ్మే ప్రయత్నంలో కూడా ఉన్నాడు.
పేరు: జ్యోతి ఆమ్గే
ఎత్తు: 62.8 సెంటీమీటర్లు (24.7 అంగుళాలు)
బరువు: కేవలం
5 కేజీలు

నేషనల్‌ జియోగ్రఫిక్‌ ‘ది వరల్డ్స్‌ స్మాలెస్ట్‌ గర్ల్‌’ డాక్యుమెంటరీ తీసే సమయంలో జ్యోతిని తల్లిదండ్రులు ఒక దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడున్న ప్రజలు ఆమెను దేవిగా పూజించడం మొదలుపెట్టారు. ఇలా ఇబ్బంది పెట్టే విషయం ఆమెకు చాలాసార్లు ఎదురైంది. ‘‘ఒకవేళ నాలో నిజంగా ప్రత్యేక శక్తులు ఉంటే, నేను ఎత్తు పెరిగే దాన్ని కదా. నేను పొడవు అవ్వడం అనేది అసాధ్యం. ఒక రకంగా చెప్పాలంటే నా ఎత్తే నన్ను ప్రముఖురాల్ని చేసింది. ఇంకా ఎత్తు ఎదిగేలా చేస్తోంది కూడా’’ అంటుంది జ్యోతి.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాబు ఒంటరిపోరు సాగర్ నీటికి తాళం ,కల తప్పిన మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -87 గండ్రాయి –సహచరులు – నా ఐడియా

నా దారి తీరు -87

గండ్రాయి –సహచరులు – నా ఐడియా

గండ్రాయి స్కూల్ జీవితం సరదాగానే ఉంది .సోషల్ మేష్టారు రాఘవులు ఇదివరకు పెదఓగిరాల అప్పర్ ప్రైమరీ స్కూలో లో పని చేసి ,అక్కడ మంచి పేరుతెచ్చుకొన్నారు .అప్పుడు కొంత దూరపు పరిచయం ఉండేది .క్రిస్టియన్ అయిన ఆయన చాపకింద తేలులాగా బోధ చేసేవాడు .పాఠాలు చెప్పటం కంటే నీతి బోధ ఎక్కువ .హెడ్ గారికి తలలో నాలుక .ఇద్దరూ జగ్గయ్యపేట  నుండే వచ్చేవారు .రాఘవులు తిరుమల గిరి లో మామిడి తోట వేశారు .ఆ కబుర్లే ఎక్కువగా చెప్పేవాడు .కొంచెం స్వార్ధం ఉన్నమనిషి పైకి సాదు లోపల వ్యతిరేకం .అదీ స్ప్లిట్ పర్సనాలిటి .లెక్కల మేష్టారు కృష్ణ మూర్తి కూడా’’ పేట ‘’నుండే వచ్చేవాడు .అక్కడ హైస్కూల్ లో అవినీతి ఆరోపణ మీద సస్పెండ్ అయి కాళ్ళూ గడ్డాలు పట్టుకొని ఇక్కడికి బదిలీ చేయి౦చు కొన్నాడు .సబ్జెక్ట్ లో సరుకు లేదు. చెప్పటం అసలు వచ్చేదికాదు .సొల్లు కబుర్లు చెప్పేవాడు .కాని మంచి స్నేహితుడు అనిపించాడు. నాతొ బాగా ఉండేవాడు .అతని సస్పెన్షన్ పీరియడ్ రాటిఫై  అయితే కాని జీతం రాదు .రోజూ గోల పెట్టేవాడు .నేనొక ఉపాయం చెప్పాను .కృష్ణా జిల్లాలో కమ్యూనిస్ట్ హెడ్ మాస్టారు గా పేరొందిన వారు ,ఉయ్యూరు హైస్కూల్ ప్రారంభకులు అయిన శ్రీ వై గోపాలరావు గారురిటైరై  ఉయ్యూరులో ఉండగా చనిపోయారు .ఆయన కొడుకు రవీంద్ర కు జిల్లాపరిషత్ లో కంపాషనేట్ గ్రౌండ్స్ మీద గుమాస్తా ఉద్యోగం వచ్చింది .కొద్ది కాలం లోనే ఆతను ముదిరి పోయి లంచాలు మరిగి ట్రాన్స్ ఫర్లు ,బిల్లులు సాంక్షన్ చేయించటం పాస్ చేయించటం చాలా  ఈజీ  గా చేసేవాడని చెప్పుకొనేవారు .జిల్లాలో బాగా అందరికీ తెలిసిన విషయమే ఇది .మంచి అవకాశం  ఈ విషయం కృష్ణ మూర్తికి చెప్పి అతన్ని మేనేజ్ చేసి పని చేయించుకోమని సలహా ఇచ్చాను .అది క్లిక్ అయింది బందరు వెళ్లి కావాల్సినవి ‘’చూసి ‘’తన సస్పెన్షన్ పీరియడ్ ను రాటిఫై చేయించుకొని ఆర్డర్ తెచ్చు కొన్నాడు. హెడ్ మాస్టారు బిల్ చేశారు , బందరు వెళ్లి డబ్బు వెదజల్లి  బిల్ సాంక్షన్ చేయిన్చుకొన్నాడు .ఆల్ హాపీస్ .నన్ను ఈ సలహా  ఇచ్చినందుకు  ఏంతో అభినందించాడు కృష్ణ మూర్తి .’’తిలాపాపం తలా పిడికెడు ‘’.ఒక రోజు మా మొత్తం స్టాఫ్ కు జగ్గయ్య పేట లో వాళ్ళ స్వంత ఇంట్లో బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు .కార్య సాధకుడు కృష్ణ మూర్తి .ఒక ఐడియా ఆయన జీవితాన్నే కాదు కాదు’’ జీతాన్నే’’ మార్చేసింది .

అప్పుడు మా రెండో అబ్బాయి శర్మ హర్యానా రొహ్ టక్ లో మహర్షి దయానంద యూని వర్సిటి లో ఏం ఎస్ సి చదువుతున్నాడు .వాడికి డబ్బు పంపాలంటే గండ్రాయిలో ఆంధ్రా బ్యా౦క్  ద్వారా పంపేవాడిని .ఒకోసారి నా దగ్గర డబ్బు లేకపోతె తెలుగు మేష్టారు సుధాకరరావు సర్దేవాడు .జీతం రాగానే ఇచ్చేసేవాడిని .ఆ బ్యాంక్ మేనేజర్ కూతురు ఎనిమిదో క్లాస్ చదువుతూ నా దగ్గర ట్యూషన్ చదివేది .సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు సుబ్బారావు బ్రాహ్మణుడు . ఏలూరు వాడు .ఇక్కడికొచ్చి చేరి ఇక్కడే పని చేసి ఇక్కడే రిటైర్ అయ్యాడు .హెడ్ గారికి ఆఫీస్ వర్క్, టైం టేబిల్ వేయటం ఎక్సట్రా వర్క్ వేయటం అన్నీ ఆయన పనే .లేక పొతే  హెడ్ మాస్టారే చూసుకునేవారు .మాలో సీనియర్ రాఘవులు కనుక ఆయనే ఇంచార్జి హెడ్ .పరీక్షల నిర్వహణ ఆయనపనే .కృష్ణ మూర్తి వచ్చిన తర్వాత సీనియర్ అయినా ఈ బాదర బందీ అంతా పట్టేదికాదు.రాఘవులే చూసేవాడు .లేకపోతె తరువాత నేనే సీనియర్ ను  నేను చూసేవాడిని .రాఘవులు  ఊరి పెద్దలతో బాగా పరిచయం ఉంది .చాలాకాలం నుంచి ఇక్కడే ఉన్నాడు .అందరి ఇళ్ళకు వెళ్లి పలకరించేవాడు ,దీన్ని మేము ‘’గడప పూజ ‘’అనే వాళ్ళం .కొద్దిరోజులు కాపురం పెట్టి  ప్రైవేట్ కూడా చెప్పాడు .

నా గండ్రాయి శిష్యుదు బాబ్జీ

నాకు మంచి శిష్యులు దొరికారు గండ్రాయి లో .పిచ్చయ్యగారి అబ్బాయి ప్రసాద్ చాలా అణకువ గా ఉండేవాడు ఎప్పుడూ చేతులు కట్టుకొని తల వన్చుకొనే మాట్లాడేవాడు .బాబ్జీ అనే కుర్రాడు  పిచ్చయ్యగారి ఇంటికి కొద్ది దూరం లో ఉండేవాడు .వాళ్ళనాన్న ఏదో వ్యాపారం చేసేవాడు. ఎనిమిదీ తొమ్మిదీ బాబ్జీ నా దగ్గర ట్యూషన్ చదివేవాడు .చాలా మంచికుర్రాడు .లీడర్షిప్ లక్షణాలున్నవాడు.టెన్త్ పాసై డిగ్రీ చదివి ,బెజవాడ నారాయణ లో ఫిజిక్స్ లెక్చరర్ అయి ,ఇప్పుడు ఈడుపుగల్లు లో గాయత్రి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు .ఆ నాటి అభిమానం, గౌరవం ఇప్పటికీ చూపిస్తాడు ఫోన్లు చేస్తుంటాడు .గృహ ప్రవేశానికి కూడా పిలిస్తే వెళ్లి వచ్చాం .నా దగ్గర చదివిని మిగిలిన పిల్లల నందర్నీ కలుపుకొని ఉయ్యూరు వచ్చి చూసి వెళ్తాడు .అతని భార్య బెజవాడలో టీచర్ .అతని తండ్రికూడా ఏంతోఆప్యాయం గా ఉంటాడు. అతని తల్లి గండ్రాయి సర్పంచ్ గా పని చేసింది . బాబ్జీ స్నేహితులను అందర్నీ కలుపుకొని గండ్రాయి స్కూల్ లో అయిదేళ్ళ క్రితం స్వాతంత్ర దినోత్సవం జరిపాడు .విద్యార్ధులు బహుమతులు అందించారు ఈ స్నేహ బృందం .నన్ను గెస్ట్ గా ఆహ్వానిస్టే వెళ్లాను. నాకు సత్కారం చేయించారు హెడ్ మాస్టారితో ..అప్పుడు నేను ఆ ఏడాది టెన్త్ పబ్లిక్  లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్ధికి 500 రూపాయలు పారితోషికం అందజేసి ప్రతి ఏడాది ఇస్తానని ప్రకటించి ,అలా చేస్తూనే ఉన్నాను .ఒక వేళ హెడ్ మాస్టారు నాకు  ముందుగా  తెలియ జేయక పొతే, బాబ్జీ తో డబ్బు సర్దు బాటు చేయించి నేను తర్వాత అతనికి మని ఆర్డర్ పంపుతాను .అలాంటి కత్తి లాంటి శిష్యుడు బాబ్జి .స్కూల్ స్వర్నోత్సవానికి మళ్ళీ ఆహ్వానించి అక్కడ పని చేసిన వారందరినీ సత్కరించారు నాతొ సహా .హెడ్ సుబ్రహ్మణ్యం గారు రెండు సార్లూ రాలేదు రాఘవులు వచ్చాడు .మళ్ళీ పాత శిష్యులను కలిసే అవకాశం వచ్చింది .జగ్గయ్య పేటలో రాముడూ వాళ్ళింటికి వెళ్లి చూసి వచ్చాను .గంద్రాయిలో పిచ్చయ్యగారింటికీ వెళ్లి మాట్లాడాను .పాత రోజులన్నీ గుర్తు చేసుకోన్నాం .ఆ నాటి ఆప్యాయతే ఆ దంపతులు చూపారు .

మిగిలిన శిష్యులు

అప్పుడే నా దగ్గర చదివిన శిష్యులు అందరూ ఒక్కసారి కనిపించారు .దాదాపు అందర్నీ గుర్తు పట్టాను అందులో జానకి రామయ్య గోపయ్య ,మొదలైన వారున్నారు .అందరికి భోజనాలు పెట్టారు .మొత్తం ఖర్చు మిత్ర బృందమే భరించింది .అప్పటినుండి ప్రతిఏడాది స్వతంత్ర దినోత్సవం జరుపుతూనే ఉన్నారు మిత్ర బృందం .తారకేశ్వరి కూడా కనిపించింది ,నా దగ్గర ప్రైవేట్ చదివిన వారిలో బుడ్డి శిరీష అనే అమ్మాయి ,పోతిన రజని అనే అమ్మాయి చాల మంచి విద్యార్ధినులు .బాగా చదివేవారు .ఎప్పుడు ట్యూషన్ కు రమ్మంటే అప్పుడు వచ్చేవారు.శ్రద్దగా చదివి అభిమానం పొందారు .కాని శిరీష కు పెళ్లి అయి భర్త చనిపోయాడట బాబ్జీ చెప్పాడు .బెజవాడలో ఉంటోందట .రజని గుంటూరు అమ్మాయి అదే యాస తో మాట్లాడేది .నవ్వుముఖం .సరదాగా మాట్లాడేది. వాళ్ళ నాన్న వాళ్ళు ఇక్కడ పొలాలు కౌలు కు తీసుకొని పొగాకు పండించేవారు .పొగాకు నారు పెంచటాన్ని ‘’మట్లు ‘’పెట్టటం అని అంటారని రజని ద్వారానే తెలిసింది .ఇద్దరూ మంచిమార్కులతో పాసైనారు టెన్త్ క్లాస్ .శిరీష అన్న టెన్త్ లెక్కల్లో తప్పి నాదగ్గర అక్టోబర్ పరీక్ష కు లెక్కలు ట్యూషన్ కు వచ్చాడు .బాగా తెలివి ఉన్నవాడే .రెండు నెలల్లో మొత్తం సబ్జెక్ట్ అంతాబోధించాను బిట్స్ అన్నీ బాగా చేయించాను పాత పేపర్లు ఆన్సర్ చేయించాను .యిట్టె అందుకోనేవాడు పేరు. శ్రీనివాసని గుర్తు .సప్ప్లిమెంటరిపరీక్ష లో ఆతను 85 శాతం మార్కులు తెచ్చుకొని పాసవటం అతనికంటే నాకు చాలా ఆనందం గా ఉండేది .చెల్లెలు శిరీష ఎంతగానో పొంగిపోయింది .క్రాఫ్ట్ మేస్టారి బంధువుల అమ్మాయి లెక్కలు, సైన్స్ లో తప్పితే ఆయన నన్ను ప్రైవేట్ చెప్పమని కోరితే టైం లేక మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ టైం లో ఇంటికి వచ్చిన సమయం లో రమ్మంటే వచ్చేది .ఆ ముప్పావుగంట కాలం  ,సాయంత్రాలలో చెప్పితే ఆ అమ్మాయి శ్రద్ధగా చదివి పాసయింది .ఇదికూడా క్రెడిటే.అంత తెలివైన అమ్మాయికాకపోయినా కస్టపడి ఫలితం సాధించింది .హాస్టల్ కుర్రాడు హనుమంతరావు కూడా చాలా అణకువగా ఉండి చదివాడు .అలాగే ఇద్దరన్న దమ్ములు ఎనిమిదీ తొమ్మిదీ చదివారు బుద్ధిమంతులు ఇద్దరూ .మంచి ఉద్యోగాలలో స్తిర పడ్డారు .జానకి రామయ్య అనే కుర్రాడు తొమ్మిదో తరగతి నా దగ్గర ట్యూషన్ చదివాడు DSCN9981.ఏంతో వినయ విదేయతలున్న వాడు .పాలుపోసేవాడు .డబ్బిస్తే మంచి వెన్నపూస తెచ్చిపెట్టేవాడు . బాగా చదువుకొని డిగ్రీ పాసై ఇప్పుడు ఉయ్యూరు బాంక్ ఆఫ్ ఇండియా పని చేస్తూ ఈ మధ్యనే ఇంటికి వచ్చి కలిసి వెళ్ళాడు .ఇప్పుడూ అతని పద్ధతిలో ఏ మాత్రం తేడాలేదు . శ్రీరామ మూర్తి అనే కుర్రాడు వైశ్యుడు .బాగా చదివి వ్యాపారం లో స్తిరపడ్డాడు  .కొండపల్లి లక్ష్మి చివర్లో ట్యూషన్ లో చేరింది టెన్త్ లో .చురుకైన అమ్మాయి .మంచిమార్కులతో పాసై ఖమ్మం లో ఇంటర్ చదవటం తెలుసు ఒకసారి వాళ్ళ నాన్న గారు ఇంటికి రమ్మంటే వెళ్లాను .ఇంటివాడు ప్రసాద్ చదువులో ప్రగతి పెద్దగా సాధించలేదు .అసలైన ఇంకో సేలిబ్రటి  శిష్యుడు  గోపయ్య ది ఒక చరిత్ర .తర్వాత తీరికగా తెలియ జేస్తాను .

సశేషం

మీ- గబ్బిట  దుర్గాప్రసాద్ -11-2-15- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -10

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -10

5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-3(చివరిభాగం )

అనుకోకుండా అకస్మాత్తుగా విట్మన్ కు వార్ధక్యపు చాయలు చోటు చేసుకొన్నాయి .నడక మందగించిది .శరీర బాధలు ఇబ్బందిపెడుతున్నాయి .అశక్తత పెరిగింది .శక్తి క్షీణించింది .అప్పుడప్పుడు ఉద్రేకానికి లోనౌతున్నాడు .సరస్వతి కరుణించినా లక్ష్మీ ప్రసన్నం కాలేదు .కాండెన్ వీధుల్లో బాక్సులలో పుస్తకాలు మోసుకొంటూ హోమ్ డెలివరీ చేస్తున్నాడు .నడవ లేకపోయేవాడు . బరువు  మోయటం అసాధ్యమైపోయింది .యాభై వ పడిలో వచ్చిన స్ట్రోక్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఇంకో ఇరవై ఏళ్ళు అలాగే జీవితాన్ని లాగేలా చేసింది .అరవైలో కొంత కుదుటబడ్డాడు .అతి దూరంగా ఉన్న కొలరాడో వెళ్లి లింకన్ పై ప్రసంగాలు చేశాడు .అక్కడ ‘’when Lilacs last in the dooryard Bloomed ‘’కవిత చదివి అందరిని సమ్మోహితుల్ని చేశాడు .దాన్ని ‘’నేటివ్ క్లాసిక్ ‘’అన్నారు .

అరవై అయిదో ఏట ఒక చిన్న గదిలో రైల్వే క్రాసింగ్ దగ్గర  న్యూస్ పేపర్ల మధ్య గడిపాడు . రైళ్ళ మోత, ఫాక్టరీల రసాయనిక వాయువులు చిమ్నీలనుండి వెదజల్లే దుర్గంధం లో నరకం అనుభవించాడు .ఒక టైలర్ విధవ భార్య వండి పెట్టేది ఇంటిని చూసేది .చినిగిన చొక్కాలు ,పాంటులకు అతుకులు వేసేది .విట్మన్ వీరాభిమానాలు ముప్ఫై రెండుమంది ఒక గుర్రబ్బగ్గీ కొనిచ్చారు .  ఈ బృందం లో  శామ్యూల్ ఇ క్లేమిన్స్ కూడా ఉన్నాడు .అరవై తొమ్మిదో ఏట కొత్తగా పక్షవాతం ప్రవేశించింది .నరాల బాధ పెరగటమే కాక  కిడ్నీ ట్రబుల్ కూడా వచ్చిపడింది మూలిగే నక్క పై తాడి  పండు చందం అయింది ఆ మహా కవి బతుకు .డెబ్భై వ పుట్టిన రోజుకు లేచి నిలబడ్డాడు .ఆ తర్వాత ఓపిక తెచ్చుకొని దగ్గరలోనే ఉన్న ఫిలడెల్ఫియాలో లి౦కన్ లెక్చర్ ఇచ్చాడు .మిగిలిన కాలమంతా ఇంటి పై భాగానకాని ,కామ్దేన్ లో మికిల్ స్ట్రీట్ లోకాని గడిపాడు .చనిపోతున్నా ఓడిపోలేదు .శరీరం వేడి చేసుకోవటానికి స్టవ్ దగ్గర గంటల కొద్దీ ఏ ఆలోచనా లేకుండా కూర్చుని పోయే వాడు .చావు వచ్చి మీద పడుతోందని గ్రహించాడు తుది యాత్రకు ప్లాన్ సిద్ధం చేసుకొంటున్నాడు .

72 ప్రవేశించింది .1891 లో చివరి ఎడిషన్ గా ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’ను ౩౦౦ కు పైగా కవితలతో ప్రచురించాడు .దీనినే ‘’డెత్ బెడ్ ఎడిషన్ ‘’అంటారు అందులో తనను తాను ‘’hard cased dilapidated ,grim ,ancient selfish or time banged conch –no legs ,utterly un locomotive –cast up high and dry on the shore sands ‘’అని వర్ణించుకొన్నాడు .1891లో న్యుమోనియా సోకింది .దీనికి తోడూ క్షయ ముదిరిపోయిందని రిపోర్టులు తెలిపాయి .వింటర్ గడిచింది .26-3- 1892 న 73 వ పుట్టిన రోజు ఇంకొక రెండు నెలలు ఉందనగా అమెరికన్ ఆధునిక మహాకవి వాల్ట్ విట్మన్ భువి నుండి దివికి చేరాడు .

పెళ్ళికాని ముదురు బ్రహ్మ చారి విట్మన్ .ఎక్కడా లవ్ అఫైర్ లేనివాడు .ఆయన పుస్తకమే ‘’ఒక వర్డ్ ‘’అంటే శాసనం .ప్రజాస్వామ్య బైబిల్ ‘’అన్నారు లీవ్స్ ఆఫ్ గ్రాస్  పుస్తకాన్ని .’’a better ,fresher ,busier sphere ,a wide ,untried domain awaits –demands you ‘’అని అభయమిచ్చి పిలిచాడు .ఆధునిక కవిత్వ పరిధిని పెంచినవాడు విట్మన్ .అతని సాంకేతిక సృజన అతి వేగ వంతమైన నాగరకత కు అనునాదం .అతనికవిత్వం భాషలో గొప్ప ప్రయోగం .వాడుక భాషకు అందం కూర్చి  అందలం ఎక్కించాడు.  దాని మూలాలు  అతి విస్త్రుతమై భూమికి దగ్గరై ,ప్రజా హృదయాలకు చేరువైంది .అట్టడుగు జన ఘోషకు దర్పణమైంది .ఆ  భాషా చాతుర్యం అనితర సాధ్యం చేశాడు .గుండెలకు తాకే కవిత్వం విట్మన్ ది .నీ, నా,మనందరి భావాలకు ఆలవాలం .

తాను వివాదాస్పదుడినే   అని చెబుతూ ‘’very well .I contradict my self .I am large –I contain multitudes ‘’ ప్రపంచం అంతా నాలో ఉన్న విశ్వ రూపుడిని అన్నాడు .తన గడ్డిపరక ‘’is no less than the journey work of the stars ‘’అని దాని విస్తృత ప్రయాణాన్ని తెలిపాడు .అందుకే ఎమర్సన్ మహాశయుడు ‘’I expected him to make the songs of the nation –but he seems content to make the inventories ‘’అని విట్మన్ ప్రతిభా విస్తృతికి నీరాజనం పలికాడు .మంచిని చెడుని అందాన్ని వికారాన్ని సమానం గా ఆదరించాడు .లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’monumental mountanious book ‘’అంటారు .అనేక శృంగాలతో పార్శ్వాలతో దేదీప్యమానం గా వెలిగే పుస్తకం .ఆ శిఖరాలు మిరుమిట్లు గొలుపుతాయి .వాటిని చేరటం ,అధిగమించటం ఎవరి వల్లా సాధ్యం కాదు .’’అది ఒక మనిషి’’ ,-_the book is the man ‘’.వాల్ట్ విట్మన్ తన కాలం లోనే కాదు నేటికాలం లో కూడా ‘’టైటానిక్ ఫిగర్ ‘’.

Image result for walt whitmanImage result for walt whitman

మరోప్రముఖునితో కలుద్దాం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-2-15 ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘంటసాల గానం చేసిన సంప్రదాయ గణేశగీతం

ఘంటసాల గానం చేసిన సంప్రదాయ గణేశగీతం
ఘంటసాల గానంతోనే ఈ నాటికీ దినచర్యను ఆరంభించేవారెందరో ఉన్నారు… విఘ్నాలు తొలగించమంటూ తొలివేలుపుగా వినాయకుని పూజించడం మన సంప్రదాయం… గణపతి సంప్రదాయ గీతం ఘంటసాల గళంలో జాలువారి మనలో భక్తిభావాన్ని నింపింది… గణపతిని స్మరించుకోగానే ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని ధ్యానించుకోవడమూ ఎందరికో ఆచారం… అక్కడా ఆయన గాత్రంలో చిందులు వేసిన గీతమే మన మదిలో మెదలి పులకింప చేస్తుంది…
ఆ పాట నా నోట

హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని ‘ఘంటసాల సంగీత కళాశాల’లోకి ప్రవేశించగానే అదో ధ్యానమందిరంలా తోచింది. టైం పదకొండు అవుతోంది.. లోపలినుంచి ‘నమో వెంకటేశ నమోతిరుమలేశా’… పాట వినిపిస్తోంది. ఎదురుగా కుర్చీలో తామడ శరత్‌చంద్ర ఉన్నారు. ఆయన వెనుక గోడకి వేంకటేశ్వరస్వామి పెద్దచిత్రం ఉంటే.. ఆయనకి ఎదురుగా గోడకి ఘంటసాల వెంకటేశ్వరావు ఫొటో ఉంది. ఘంటసాలగారికి వేంకటేశ్వరుడు ఇష్టం, నాకు ఘంటసాల ఇష్టం అంటూ శరత్‌చంద్ర తన అంతరంగాన్ని ‘నవ్య’తో పంచుకున్నారిలా…
ఘంటసాల పాట సమ్మోహనం.. అది శ్రోతల్ని వివశుల్ని చేసి పరవశింపచేస్తుంది. అలాగే నేనూ పులకించిన వాణ్ణే. అందరూ ‘శరత్‌చంద్రది ఘంటసాల గొంతు…’ అంటారే గానీ అది నిజం కాదు… ‘ఘంటసాల లాగే పాడతాడు’ అనటం కరెక్ట్‌. నేనిలా ఉన్నానంటే అదంతా ఘంటసాల చలువే.. ఆయన పేరుమీద సేవ చేస్తున్నానంతే. మాది శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలోని లంకపేట గ్రామం. అమ్మ పేరు పద్మావతి, గృహిణి. నాన్నగారు బ్రహ్మం పేరున్న నాటకాల గురువు. ఆయన ధర్మరాజు, హరిశ్చంద్ర, అర్జునుడు వేషాలు వేసేవారు. తిరుపతి వేంకటకవుల పద్యాలు బాగా పాడేవారు. హార్మోనియం వాయించేవారు. ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండడం వల్ల సంగీత రుచి నాకు తెలిసింది… రాగజ్ఞానానికి మా నాన్నగారే నా తొలి గురువు. మేం ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండోవాణ్ణి.
ఆ అందమే చిత్తు చేసింది…
ఏడో తరగతి నుంచే మా ఊరి రామమందిరంలో రాముని చరితపై భజనలు చేసేవాడిని. అప్పటినుంచే భజనలకి హార్మోనియం వాయించటం నేర్చుకున్నాను. పదోతరగతిలో ఉండగా మా రమణాచారి మాస్టారు ‘బ్రతుకుతెరువు’ చిత్రంలో ‘అందమె ఆనందం …ఆనందమె జీవిత మకరందం..’ పాట నేర్పించారు. ఆ పాటని వింటూ పాడుతుంటే ఆ గొంతులో ఏదో తెలియని గమ్మత్తు ఉందనిపించేది.
ఇంటరుమీడియేట్‌లో చదివేటపుడు భజన కార్యాక్రమాలతో పాటు ‘పేరడీలు’ పాడేవాడిని. సినిమా పాటల ట్యూన్స్‌ ఆధారం చేసుకుని దేవుళ్ళ పాటలు పేరడీలుగా పాడేవాణ్ణి. పేరడీ వల్ల ఒరిజినల్‌ సాంగ్‌పై మక్కువ కలిగేది. మంచి హార్మోనిస్టుగా కూడా మా జిల్లాలో నాకు పేరుంది. డిగ్రీ చదివేటప్పుడు ఎలిశెట్టి రామ్మోహనరావు గారి ప్రోత్సాహంతో విజయనగరం జిల్లా గరివిడిలో ‘ఘంటసాల సంగీత సమాఖ్య’ను 1994లో నెలకొల్పాను. ‘జగదేకవీరుని కథ’ చిత్రంలో శివశంకరీ … , ‘పాండురంగమహత్యం’ చిత్రంలోని ‘అమ్మా అనిపిలిచినా…’ పాటలు స్టేజ్‌ ఎక్కి పాడుతుంటే శ్రోతలు ఎంతగానో స్పందించేవారు. తర్వాత తర్వాత నేను ఘంటసాల గారి ప్రభావానికి లోనయ్యాను. ఘంటసాల పాటంటే వెర్రెత్తిపోయేవాణ్ణి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఘంటసాల గారి పెద్దబ్బాయి విజయ పేరుమీద మ్యూజిక్‌ చేసేవారు. అందుకని ‘విజయ ఆర్కెసా్ట్ర’ నెలకొల్పి అక్కడిప్రాంతాల్లోని చాలామందిని గాయకులుగా తయారు చేశాను. సింగర్‌ టి.పి. రామకృష్ణగారు పరిచయం కావటం నా జీవితంలోని మరో ముఖ్యమైన మలుపు. వారి ఫ్యామిలీ నన్ను హైదరాబాద్‌ పంపించారు. హైదరాబాద్‌ వచ్చాక కోరమాండల్‌ సిమెంట్స్‌ అధినేతలు లక్ష్మీచంద్రమోహన్‌గారి సహాయంతో ‘స్వరనిధి’, ‘భాగేశ్వరీ సాంస్కృతిక సంస్థ’ లు ప్రారంభించి కొన్ని వందలమంది గాయకుల్ని తయారు చేశాను. ఎన్నో జిల్లాల్లో ప్రోగ్రామ్స్‌ చేశాను.
ఆరు సంవత్సరాల పాటు ఏకధాటిగా హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో సాధన చేశాను. ఘంటసాలగారి పాటలకి నోట్స్‌ తయారు చేసుకున్నాను. అప్పటి సంగీత దర్శకులు ప్లే చేసిన సంగీత పరికరాలు వాడి పాటలు పాడించేవాడిని. పాడేవాడిని. 1994 డిసెంబరు 14 వ తేదీ త్యాగరాయగానసభలో అక్కినేని, నటుడు టి.ఎల్‌.కాంతారావు, జమున, సినారే సమక్షంలో ‘ఘంటసాల సంగీత విభావరి’ చేశాను. అక్కడ దేవదేవ నారాయణ.., మురిపించే అందాలే పాటలు పాడినపుడు ఎంతోమంది నన్ను అభినందించారు. అక్కినేని గారు ‘దేవదాసు’ రాసిన శరత్‌చంద్రని ఎలా మర్చిపోలేనో ఈ శరత్‌ చంద్రని మర్చిపోలేను అన్నారు. సినారె ‘తరుణ ఘంటసాల’ అంటే లేత ఘంటసాల అని అన్నారు.
ఆ మహానుభావుడికి గుడి
2001లో శ్రీకాకుళం జిల్లాలోని లంకపేట గ్రామంలో ఆరెకరాల స్థలంలో ఘంటసాల గుడి ప్రారంభించాను. 2005లో ఆ గుడి పూర్తి అయ్యింది. ఘంటసాల ఆధ్యాత్మిక విగ్రహం ఉన్న ఆ గుడి పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. ఈ గుడిద్వారా సామాజిక సేవ చేస్తున్నాం. గ్రామాలకి మంచినీళ్ళు ఇస్తున్నాం. చెరువులు తవ్విస్తున్నాం. 18 పాఠశాలల్ని దత్తత తీసుకుని అందులోని పేద విద్యార్థులకి ‘స్వామి వివేకానంద మోరల్‌ అండ్‌ టెక్నిక్స్‌’ ద్వారా కంప్యూటర్స్‌ ఇచ్చి 200 మంది పేద పిల్లలకి ఉచిత విద్యను అందిస్తున్నాం. ఇవన్నీ ఘంటసాల పాటల కచ్చేరీల ద్వారా వచ్చిన డబ్బులతోనే సాధ్యమవుతోంది.
ఘంటసాల పాటలు ప్రపంచానికి తెలియజేయాలన్నదే నా ఉద్దేశ్యం. ‘ఘంటసాల సంగీత కళాశాల’ పేరుతో ఘంటసాల పాడిన ఎంతోమంది కవుల సినీ సాహిత్యాన్ని 24 వ్యాల్యూమ్స్‌గా విడుదల చేశాను. తెలుగురాషా్ట్రల్లో మొత్తం ఏడు సంగీత కళాశాలలు నెలకొల్పాను. హైదరాబాద్‌లో ‘ఘంటసాల సంగీత కళాశాల’ ప్రారంభించాను. 2012లో విశాఖపట్నం, ఏలూరు, మహబూబ్‌నగర్‌, తిరుపతి, గుంటూరు, వరంగల్‌ జిల్లాల్లో ఆరు కాలేజీలు నెలకొల్పాను. ఇందులో ఏడు కోర్సులు ఉంటాయి. కోర్సుల్లో ఘంటసాల సబ్జెక్టులు ఉంటాయి.
1. వేదిక (సినిమా సంగీతం), 2.వాహిని(లలిత సంగీతం), 3. విపంచి(లలిత సంగీతం), 4.సంకీర్తన(అన్నమాచార్యుల సిలబస్‌), 5.విశద(యాంకరింగ్‌), 6.సురభి(పద్యసంగీతం), 7.రాగిణి(వాద్యసంగీతం). ఇవి కంప్లీట్‌ చేసుకున్న వారికి సంగీతంలో డిప్లమో సర్టిఫికేట్‌ ఇస్తున్నాం.
ఆ సప్తస్వరాలు కాలేజీలకి అంకితం
ఘంటసాల పాటలపై 2012 సంవత్సరంలో శాంతాబయోటెక్‌ అధినేత వరప్రసాదరెడ్డి గారి సహాయంతో ‘సప్తస్వరాలు’ అనే ఏడు పుస్తకాల్ని విడుదలచేశాను. ఏడు కళాశాలలకు సంబంధించి స- షడ్జమం పుస్తకం హైదరాబాదు కళాశాలకి అంకితం చేశాను. అలానే రి- రిషభం(విశాఖపట్నం), గ-గాంధారం(ఏలూరు), మ-మధ్యమం(మహబూబ్‌నగర్‌), ప-పంచమం(తిరుపతి), ద- దైవతం(గుంటూరు), ని-నిషాదం(వరంగల్‌)కి అంకితం చేశాను. ఇందులో అన్నీ ఘంటసాల గారి పద్యాలు, పాటలే ఉన్నాయి.
ఆయనే నా ఆయుధం
ఘంటసాల సంగీత కళాశాలలో ఏడేళ్ల వయసు నుంచి 70 యేళ్ళవాళ్ల వరకూ విద్యార్థులున్నారు. సంవత్సరానికి 500 మంది విద్యార్థులు ఉతీర్ణులవుతుంటారు. మా కళాశాలలో ఓ ఘంటసాల పాట పాడాలంటే ముందు ఓ పద్యం పాడాలి. పద్యం అమ్మ లాగ, పాట తండ్రిలాగా భావిస్తాను. ప్రపంచంలోని భాషలన్నింటిలో తెలుగువారికి ఉన్న ఒకే ఒక గొప్ప సాహిత్యం పద్యం. ఈ సంగీత కళాశాలలో అందరూ సాధకులే. నేను ఇప్పటివరకూ 3870 కచ్చేరీలు చేశాను. నాకు ప్రదానం చేసిన ‘అభినవ ఘంటసాల’ బిరుదును ఎంతో అమూల్యంగా భావిస్తాను. భారతీయ మహిళాశక్తి సంస్థ గండపెండేరాన్ని తొడిగారు. ఆంధ్రాయూనివర్శిటీ తెలుగు సాహిత్యానికి సేవ చేసినందుకు సత్కరించింది. హార్మోనియంలో అన్ని ఇన్‌సు్ట్రమెంట్స్‌ను పలికించటం చూసి ముగ్ధులై అమెరికాలోని తెలుగువారు 500 ఇంసు్ట్రమెంట్స్‌ ఉండే కీబోర్డుని నాకు బహుమతిగా ఇవ్వడాన్ని నేను మర్చిపోలేను. ఘంటసాల ఆరాధకుడిని. ఆయన పాటే నా ఆయుధం.
నా దృష్టిలో ఘంటసాల
దేవుళ్ళందరూ కలిసి తయారుచేసిన గొప్ప వ్యక్తిగా ఘంటసాలగారు నాకు కనిపిస్తారు. గొప్ప తెలుగుభాషా సేవకుడిగా అనిపిస్తారు. 56 తెలుగు అక్షరాల్ని స్పష్టంగా పలుకుతూ పాడే ఘంటసాల గురించి ఎంత చెప్పిన తక్కువే… అందుకే ‘ఘంటసాల… సంగీత కళాశాల’ అంటాను నేను. ఆయన 658 చిత్రాల్లో 2700 పాటలు పాడారు. 450 పద్యాలు ఆలపించారు. ఘంటసాల ‘భగవద్గీత’ అద్భుతం. 110 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అందులో తెలుగుచిత్రాలు 83. సంగీతజ్ఞులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, జేసుదాసు, బాలు లాంటి గొప్పవారు ఘంటసాల గారిని గ్రేట్‌ అంటారు. నన్ను ఏ ప్రభుత్వాలూ, సంస్థలూ గుర్తించకపోయినా ఫరవాలేదు. ఘంటసాల పాటని ప్రపంచం నలుదిశలా విస్తరింపచేయటమే నా లక్ష్యం. ఓ మ్యూజిక్‌ యూనివర్శిటీని కూడా నెలకొల్పాలని ఉంది నాకు.
 నవ్య డెస్క్‌
ఫోటోలు: జి.శ్రీనివాస్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు –ఆహ్వానం సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

అక్షరం లోక రక్షకం

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు –ఆహ్వానం

76 వ సమావేశం –నమూనా ఆహ్వాన పత్రిక

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలను సరసభారతి 76వ సమావేశం గా ఉగాదికి(మార్చ్ 21) ఆరు  రోజులముందు అంటే 15-3-15 ఆదివారం సాయంత్రం 3-30 గం కు  ఏ .సి . లైబ్రరీలో నిర్వహిస్తోంది .సాహిత్యా భిమానులు ,కవులు పాల్గొని జయప్రదం చేయప్రార్ధన .ఇందులో  పేర్కొన బడిన వారు కాకుండా మరో ఇద్దరు ప్రముఖుల తో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం  .వారి అంగీకారం తెలియ గానే పూర్తీ వివరాలతో ఆహ్వాన పత్రిక ను ఫిబ్రవరి 23 వ తేదీ తర్వాత అంద జేస్తాము .దాన్ని బట్టి వేదిక కూడా మారవచ్చు .

పాల్గొను అతిధులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి మాజీ సభ్యులు

శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు –ఉయ్యూరు నగర పంచాయితీ  చైర్మన్

శ్రీ చలసాని రాజేంద్ర ప్రసాద్ –ఆంద్ర జ్యోతి ఇన్ చార్జ్  –విజయవాడ

డా. శ్రీ జి వి పూర్ణ చంద్-కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి

శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి పత్రిక సంపాదకులు

కార్యక్రమం

1-కవి సమ్మేళనం –జిల్లాలోని ప్రముఖ కవులందరు పాల్గొంటారు –విషయం –‘’నవ్యాంధ్ర ప్రదేశ్ -మరియు హుద్ హు ద్  తుఫాను’’ .-కవిత 10 పంక్తులకు మించ రాదని మనవి .

2-పుస్తకాల ఆవిష్కరణ

1-     శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచన –‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’(2000 ఏళ్ళ సంస్కృత సాహిత్యం లో 145 మంది ప్రముఖ కవుల సాహిత్య పరామర్శ )-

అంకితం –శ్రీ మైనేని గోపాల కృష్ణ(అమెరికా) గారికి –గ్రంధ ప్రాయోజకులు (స్పాన్సర్స్)- శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి మేనకోడలు -డా జ్యోతి ,ఆమె సోదర , సోదరీమణులు (అమెరికా).

‘’పేరడీలు ‘’  రచన – ప్రముఖ హాస్య రచయిత-శ్రీ తాడిమేటి సత్యనారాయణ –అంకితం –స్వర్గీయ బాపు –రమణ లకు  – ప్రచురణ –సరసభారతి

3-స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కార ప్రదానం

పురస్కార గ్రహీతలు -1.శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ –రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ –ఆకాశ వాణి-హైదరాబాద్

2-డా.శ్రీ శలాక రఘునాధ శర్మ –విశ్రాంత  సంస్కృత  ఆచార్యులు –శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం –రాజమండ్రి

3-శ్రీ గుత్తికొండ సుబ్బారావు –కృష్ణా జిలా రచయితల సంఘం –అధ్యక్షులు –మచిలీపట్నం

4-డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ –విశ్రాంత తెలుగు అధ్యాపకులు –గుంటూరు

4-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల ఉగాది ప్రోత్సాహక పురస్కార ప్రదానం

1-‘’స్వయం సిద్ధ ‘’ప్రత్యక పురస్కారంప్రదానం  –

పురస్కార గ్రహీత –శ్రీమతి పెద్దిభొట్ల సౌభాగ్య లక్ష్మి –తెలుగు పండిట్ –ఉయ్యూరు .

2- వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి పురస్కార ప్రదానం –

పురస్కార గ్రహీతలు –   1-శ్రీ కళాసాగర్ –‘ప్రముఖ చిత్రకారులు ‘’64 కళలు ‘’మాసపత్రిక సంపాదకులు – విజయవాడ

2-శ్రీమతి చలపాక శిరీష –డి.టి పి స్పెషలిస్ట్ –విజయవాడ

3-శ్రీ పాషా –ఈనాడు –విలేకరి –ఉయ్యూరు

4-శ్రీ రాజా –‘’మనచానల్ ‘’రిపోర్టర్ –ఉయ్యూరు

5- శ్రీ గూడవల్లి రామా రావు –పోస్ట్ మాస్టర్ –ఉయ్యూరు

6-శ్రీ జి వి.రమణ –మేనేజింగ్ డైరెక్టర్ –జాగృతి పొదుపు సహకార సంస్థ –ఉయ్యూరు

జోశ్యుల శ్యామలాదేవి    మాదిరాజు శివలక్ష్మి గబ్బిట వెంకట రమణ వి బి జి. రావు    గబ్బిట దుర్గా ప్రసాద్

గౌరవాధ్యక్షులు             కార్య దర్శి             కోశాధికారి        సాంకేతిక నిపుణులు   సరసభారతి అధ్యక్షులు

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

12-2-15 –ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అమరగాయకుడు ఘంట సాల వర్ధంతి-అక్షర నివాళి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వీడు సామాన్యుడు కాదు


 


 


గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-2

 మినీ  ద్విపద్స్-2

13-ధిల్లీ లో ‘’చీపురు ‘’

  తీసిన కాంగీ’’ ఉసురు ‘’.

14-భారీ మెజార్టీ లో’’ ఆప్’’

   బి .జె.పి. పరువు ‘’చుప్ ‘’

15-కేర్జీ’’ సామాన్యుడు ‘’

   నేడు ‘’అసామాన్యుడు ‘’.

16-వ్యూహం బెడిసి’’ అమిత్ షా ‘’

    రాచకీయ చదరంగానికి   ‘’బిగ్  షా ‘’.

17- వేతన జీవులకు భారీ హిట్ ‘’ఫిట్ మెంట్ ‘’

  బాబు ఆలోచనలో గొప్ప ‘’బెటర్ మెంట్ .’’

18- మళ్ళీ’’ నితీష్ ‘’బీహార్

  మాంఘి బతుకు ‘’బేజార్ ‘’.

19-కేజ్రీవాల్  నేడు ధిల్లీ’’ పాదుషా ‘’

   అమిత్ పని పొయ్యిలో ‘’బాదుషా’’.

20-అవినీతి అంతానికి ‘’పట్టాభిషేకం ‘’

  ధిల్లీ వోటర్ చేసిన’’హర్షాభిషేకం ‘’.

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-2-15- ఉయ్యూరు

 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -6(చివరిభాగం )

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -6(చివరిభాగం )

హైదరాబాద్ లో ‘’కదా సమ్మే ళనాలలో ‘’పాల్గొన్నారు .అజంతా ఎల్లోరాలు చూసి ఆ నేపధ్యం తో కద రాశారు .శ్రీ కృష్ణ దేవా రాయా౦ధ్ర భాషా నిలయం లో బుచ్చి బాబు అధ్యక్షత జరిగిన తోలి కధక సమ్మేళనం లో పాల్గొని బుచ్చిబాబు చేత ‘’ఇంత వరకు సాహిత్య వారసులు లేని నాకు –వారసుడై వచ్చి –నన్ను మురిపిస్తున్న వీరుడు ఈ వీర్రాజు –ముందు ముందు నన్ను మరిపించినా మరి పించగలడు’’అని సభా ముఖం గా వీర్రాజు గారికి కితాబిచ్చాడు .ఆ మాటల్లో ‘’బలమైన ఇతి వృత్తం  దొరికి –కొత్తగా చెప్పగల నేర్పుంటేనే రాయటానికి ప్రయత్నిం చాలనే ‘’హెచ్చరిక కనిపించింది .తన కధలన్నీ కలిపి’’ చేతి  కందేవి  ఓ పిడికెడు మాత్రమె ‘’అని అన్నారు .తురగా దంపతులు ,వాకాటి పోరంకిలు ,సింగరాజు ,నిఖిలేశ్వర్ వగైరా సాహితీ మిత్రులతో కాలక్షేపం బాగానే ఉండేది .తనను తానూ చైతన్య పరచుకొని –ఆధునిక చిత్రాలు వేశాకే –భాగ్య నగర చిత్రకారులు వీర్రాజు గారిని గుర్తించారు .వడ్లమాని మధుసూదన రావు ప్రతిభ గల చిత్రకారుడు .ఆయన్ను గురించి ఆర్ట్ మేగజైన్ ‘’కళా రత్న ‘’లో ప్రశంసా వ్యాసం రాశారు .ఆయన ఒక సంస్థకు ఆఫీస్ బేరర్ గా ఉండి ఆర్ట్ ఎక్సి బిషన్ లో పాల్గొనడం నచ్చక చిన్న చురక కూడా వేశారు వ్యాసం లో .దానికి ఆయనకు కోపం కూడా వచ్చింది .ఇద్దరికీ షస్టాస్టకం అయి అకాడెమీ మెట్లేక్కడం మానేశారు వీరాజీ .

పుస్తకాలకు ముఖ చిత్రాలేసి తృణమో ఫణమో రాబడిపొందారు .అదే తన ‘’కళా మార్గమైంది ‘’.’’సాహిత్యం పడుగై –చిత్రలేఖనం పేకై –కలనేతగా జీవితాన్ని  అల్లుకున్నాయి ‘’.’’జీవితాన్ని కళాత్మకం గా తీర్చి దిద్దుకొనే మిత్రుడు దివి శ్రీధర బాబు పరిచయం తో సంగీతం లోనూ వేళ్ళు పెట్టి అది రాని విద్యని రూఢి చేసుకొన్నారు .’’భారత్ కళా పరిషత్ ‘’లో సంయుక్త కార్య దర్శి పదవి కట్టబెడితే సమర్ధ వంతం గా పనిచేసి సభలు ప్రదర్శనలు నిర్వహించి ‘’కళ’’వార్షిక సంచికలను సుందరంగా తీర్చి చిత్రకళా రంగం లో గ్రంధాలు లేని లోటు తీర్చారు వీర్రాజుగారు .ఈ సంచికల సంపాదకుడు చలసాని ప్రసాద రావు ‘’మాటలకు అంటిన రాగాన్ని తుడిచి –కవిత్వాన్ని అద్దిన వాడు ‘’సామాన్యుల బాధల గూళ్ళల్లోకి కవిత్వాన్ని లాక్కొచ్చిన వాడు –వచన కవిత్వ జెండాను ఎత్తు గా ఎగరేసిన వాడు ‘’వచన కవిత్వానికి కేటలిస్టై వ్యాప్తిని వేగవంతం చేసినవాడు’’గా  కుందుర్తిని కీర్తించారు .

‘’కొడిగట్టిన సూర్యుడు ‘’కి ఫ్రీ వర్ష ఫ్రంట్ అవార్డ్ రావటం వీర్రాజు గారి ‘’సాహిత్య జీవితానికి తోలి బహుమతి ‘’.అడక్కుండానే ఒకటీ అరా  ఆకాశ వాణి ప్రోగ్రాములు వర్షించాయి .ఆ వాణి తనకు ‘’రాదారి కాదు ‘’అని తెలుసుకొన్నారు .’’సిగరెట్ పాకెట్ తెమ్మన్న ‘’అధికారి ఆధిపత్యాన్ని కాదని వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఆకాశ వాణి మెట్లు ఎక్కనే లేదు అభిమానధనుడైన వీర్రాజుగారు .ఆయన మీదేకాదు ‘’ఆకాశ వాణిమీద సైతం అసహ్యం తుళ్ళి పడి ఇప్పటికీ నన్ను –నా కాళ్ళు  ఆ మెట్లు ఎక్కనివ్వలేదు ‘’అని సగర్వం గా చెప్పుకొన్నారు .ఆంద్ర ప్రదేశ్ పత్రిక చిత్రాలకోసం  కుందుర్తి ,గోపాల చక్ర వర్తి తో బాటు కాకతీయ చిత్ర వైభవాలను కళ్ళారా చూసి ,యాదగిరి లో నరసింహ స్వామి గుడిప్రదక్షిణ కోసంసం అవిటికాలి చక్రవర్తికి బుజాలు ఆసరాగా తానకు  ఇష్టం లేకున్నా తిరిగారు .స్నేహితుడి ఊరికి వెళ్లి ‘’ఒక్క కరెంటు తీగైనా ఊరిని అల్లుకోకపోవటం ‘’చూసి ఆశ్చర్య పోయారు .

సాహితీ సాంస్కృతిక సంస్థ  వారి’’ యువ భారతి ‘’లో ‘’నా ముఖ చిత్రాను బంధం –నాకో చిక్కని సాధనమై –సాహితీ వేత్తలకు మా ఇంటికి రహదారి మార్గమైంది ‘’అని సంతోషం తో ఉప్పొంగారు .అది ‘’తెరిచిన ద్వారమే ‘’అయింది అందులో వందకు పైగా ముఖ చిత్రాలు వేసిన ఘనత రాజు గారిది .’’సాహితీ వేత్తలకు నేనొక చిత్రకారుడిని మాత్రమె –కవులకు కధకుడిని –కధలకు  కవిని ‘’అని ఆవేదన చెందారు .ఎవరికి వారు వీర్రాజుగారిని వారి రంగం లో చొరబాటు దారునిగానే భావించారు .అదీ ఆశ్చర్యం .ఒరిస్సా లో భువనేశ్వర్ వెళ్లి అక్కడి కళా సంస్కృతికి నీరాజనాలు అందించారు ‘’కలింగ రాజుల దిల్ప కళాభిమానానికి –శిధిల భువనేశ్వరం ఒక నిదర్శనం ‘’అన్నారు .’’లింగ రాజుదేవాలయం ‘’ఒక దేవాలయ గుచ్చం ‘’అని ముగ్ధులయ్యారు .అవన్నీ స్కెచ్ బుక్ నిండా నింపుకొని సంతోష పడ్డారు .వాటిని దర్శించటానికి రెండుకళ్ళు చాలవు అన్నారు .

యెర్ర భావాలు మనసులో పరచుకొని కొత్తగా రాసింది అంతా వామపక్షం గానే కనిపించింది .మెల్లగా కద వెనక బడి కవిత్వం ముందుకు సాగింది ‘’.మైనా నవలకు అకాడెమీ పురస్కారం వచ్చినా ఆ ప్రభావం పడలేదు. కదా ,నవలా  మళ్ళీ  బలాన్ని పుంజు కోలేదు ‘’అని నిజాయితీగా చెప్పారు .దిగంబర కవులలో ఆరుగురి లో అయిదుగురు  తన ఆత్మీయ మిత్రులే అయినా ‘’యెంత మాత్రం వారి చర్యల్ని సమర్ధిం చని వాడిని .’’అన్నారు ‘’రాజ్యం మీద చూపాల్సిన కోపాన్ని –సమాజం మీద చూపటం సరికాదు ‘’అని తన మనసులో మాట బయట పెట్టారు .’’విరసం తెలుగు సాహిత్యాన్ని –ఒక మలుపు తిప్పింది ‘’అని నమ్మారు .’’విరసీయున్ని ‘’కావటానికి ప్రయత్ని౦చ లేదన్నారు .

లేపాక్షి శిల్ప సౌందర్యాన్ని చూడటానికి వెడితే ‘’ఆరు బయట తాపీగా చతికిల బడి గత వైభవాన్ని నేమరేసుకొంటూ –ఇళ్ళ కప్పుల మీద నుంచే’’ మూపెత్తి’’స్వాగతం పలికాడు –నల్ల సేనాపు రాతి లేపాక్షి బసవయ్య ‘’.లేపాక్షి శిలా సంపదను కాపాడిన వాడు ‘’కల్లూరి సుబ్బారావు – అందుకాయనకు  తెలుగు  జాతి –రుణ పడి ఉండక తప్పదు ‘’అన్నారు .శ్రీధర బాబు జర్మనీ వెళ్లి అక్కడ వీర్రాజుగారి చిత్రాలను ‘’వన్ మాన్ షో  ‘’గా ఏర్పాటు చేయగా ‘’నా కళా జీవితానికి ఒక కలికితురాయి అయింది ‘’అని ఏంతో సంతృప్తి చెంది మిత్రునికి క్రుతజ్ఞాతాంజలి ఘటించారు .శ్రావణ  బెల్గోలా వగైరా దర్శించి రేఖల్లో చిత్రాలుగా మార్చుకొని లారీ ప్రయాణం లో ఆ ‘’చిత్ర సంపద ‘’క్రిష్ణార్పణ’’మై చేజారిపోయింది .గుర్తొచ్చినప్పుడల్లా అది ‘’మనసులో ముల్లై కలుక్కున –గుచ్చుకొని బాధిస్తూనే ఉంది ‘’అంటారు.

వీర్రాజు గారికి ‘’స్నేహం ఊపిరి –చైతన్య లహరి ‘’.’’కవితా జైత్ర యాత్రలో –రధం మీద రక్తం  సూర్యుడ్ని –జెండాగా పాతుకున్నకవి –కవిత్వాకాశం లో మధ్యందిన మార్తాండుడు ‘’కే శివారెడ్డి అని ఆయన తన సన్నిహిత మిత్రుడని చెప్పుకొన్నారు ‘’’స్వాతి మాస  పత్రికకి  -ఇంట్లోనే పురుడు పోసి –ఏడాదిపాటు సాకిన ‘సాహితీ చిత్రకళా మంత్రం సాని వీర్రాజుగారు  .’’నడిచే చదువుల చెట్టు-రోణంకి అప్పలస్వామి ‘’పట్ల గౌరవం తోబాటు మేన మామ కుటుంబం తో ఆయనకున్న సాన్నిహిత్యం మరీ దగ్గరకు చేర్చింది .ఉత్తరాయణం ప్రేమాయణం గా  మారి మేనమామ కూతురు ‘’ఉత్తరాల సుభద్రా దేవి ‘’తో వివాహం  అప్పలస్వామి గారి అధ్యక్షతన –వైదిక ఆచారాలకి –వేద మంత్రాలకీ  దూరం గా’’బంధు మిత్రుల చప్పట్లే –బాజా భజంత్రీలు బ్యాండ్ వాయిద్యాలుగా –సభా వివాహం గా ‘’జరిగింది .’’ఒకరికొకరు తోడుగా ఉండాలని –ఒకరి కొకరం నీడగా ఉండాలని –సమిష్టిగా నిర్ణయించుకొని –గట్టిగా చేతుల్ని పెనవేసుకొని –వ్యక్తీ నుంచి కుటుంబం లోకి –కుటుంబం నుంచి సమాజం లోకి –అడుగు తీసి అడుగు వేస్తూ –పరస్పరాభి రుచుల కల నేతగా –జీవితాన్ని నేయటానికి –శ్రీకారం చుట్టుకోన్నాం ‘’అని వీర్రాజు గారు వివాహ మహాత్మ్యాన్ని సింపుల్ గా వివరించి శుభం పలికారు .

శుభం భూయాత్

Inline image 1Inline image 2

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-2-15- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5

యువజనోత్సవాలలో గీసిన చిత్రాలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాటిని చూసి రాజమండ్రి సబ్ కలెక్టర్ ‘’పెంకులు విరిగిపడి ,గోడలు పెచ్చులూడి –రోగిష్టి రూపు తేరిన ‘’వీర్రాజుగారింటికి వస్తే ఆశ్చర్యం తో నమస్కారమైనా చేశాడో లేదో తెలీని అయోమయం లోపడ్డారు .చిత్రాలు చూసి  రెండుకోనుక్కొని వెళ్ళారు .హైదరాబద్ వస్తే కలవమని చెప్పారు .’’చిత్రకళలోనూ ,చదువు లోను విద్యార్ధి దశ దాటని నన్ను –వెతుక్కుంటూ వచ్చిన ఆ కళాభిమాని కి –కప్పూ సాసర్లు మంచివి లేవని –కాఫీ నీళ్ళయినా ఇవ్వనందుకు ‘’సిగ్గుపడ్డారు .కాని ‘’విరిగిన కప్పులనైనా ఆత్మీయం గా అందుకొనే ఆయన  హృదయ సౌందర్యాన్ని –గుర్తించని గుడ్డి  వాడి నయినందుకు  ‘’–మరింత సిగ్గు తో కుంచించుకు పోయారు .

పోటీల  ఇన్ చార్జి లెక్చరర్ రెబ్బా ప్రగడ సూర్య నారాయణ మూర్తిగారు ‘’వాటర్ బరీస్ కాంపౌండ్ టానిక్ ‘’ఇంటికొచ్చి మరీ చేతిలో పెడితే ఆయన అభిమానాన్ని వెర్రిగా భావించి ఫ్రెండ్స్ తో కలిసి పకపకా నవ్వుకున్నారు.కాని వారం తిరక్కుండా అనారోగ్యం పాలై పొడి దగ్గుతో బాధ పదడి డాక్టర్ కు చూపిస్తే అర్భకుడైన ఆయనకు బలమైన ఆహారం అవసరం అని చెప్పితే కాని లెక్చరర్ గారి ఔదార్యం తెలిసిరాలేదు .తెలిసి  ఎన్నో సార్లు కనిపించినపుడు చేతులెత్తి నమ్స్కరించారో తెలీదు .రోగం సంగతి కప్పిపెట్టి ఇంట్లో ఎవరికి చెప్పలేదు .రాసిన ప్రతి దానికీ డబ్బు రాలేదుకాని గీసిన ప్రతిదీ డబ్బు సంపాదించి ఇచ్చింది .ఆంద్ర ప్రభ వీక్లీ లో’’ పిల్లల బొమ్మల జాతకకధ’’లకు  ముప్ఫై వారాలపాటు చిత్రాలు గీసి  రెగ్యులర్ ఆదాయం పొందారు .మూడోపుస్తకం అమ్ముడై ,నవల ఒక ప్రసిద్ధ పత్రికలో సీరియల్ గా వచ్చింది .

కాకినాడ కరెంటాఫీసులో ఉద్యోగం వచ్చినా చేరకుండా హైదరాబద్ లో కృష్ణా పత్రిక లో ఉద్యోగానికే మొగ్గుచూపారు .పర్మనెంట్ ఉద్యోగం కాకపోయినా అభిరుచి అటు లాక్కెళ్ళింది .గోదావరి తీరాన్ని వదిలి ‘’మూసీ కే కినారే’’ కి చేరారు .’’నెలకు ఒకటిన్నర పచ్చ నోట్ల జీతం ‘’.’’అర్ధ రాత్రి దాటేవరకూ మేలుకొని –ఉదయం బారెడు పోద్దేక్కే దాక లేవక పోవటం –నవాబుల నగరానికి అలవాటు ‘’అని వచ్చిన రోజే గ్రహించారు .తోలి జీతం ఇంటికి పంపి తృప్తి చెందారు .కృష్ణా పత్రిక కాంట్రాక్ట్  కంట్రీబ్యూటర్ రావూరి భరద్వాజ .ఆయన రాస్తున్న సీరియల్ ‘’పరిస్తితుల వారసులు ‘’పత్రికలో వస్తోంది ‘’ఇప్పటికీ నాకు గుర్తుండిపోయిన మంచికద ‘’అని మెచ్చారు .’’మంజు శ్రీ గా లబ్ధ ప్రతిస్తుడైన అక్కిరాజు రమాకాంతరావు ‘’రిసేర్చ కుడు .‘’ నగ్నముని అయిన కేశవ రావు పుస్తక భా౦ డాగారుడు .రామడుగు రాదా కృష్ణ మూర్తీ మిత్రులయ్యారు

వీర్రాజు గారి పొడి దగ్గు క్షయ గా మారింది .’’’క్షయ పురుగులు ఊపిరి తిత్తుల్ని కావలించుకొని అల్లుకు పోయి,.మూడు చోట్ల కేవిటీలు (బొక్కలు)పెట్టాయి  ‘’అని చెప్పుకొన్నారు .ఆదుకొని హాస్పిటల్ లో చేర్పించిన వాడు కళాభిమాని పంజాబీ సింగు గారు. ‘’నిజం గా పునర్జన్మ ప్రసాదించిన మహానుభావుడు ‘’అని సింగుకు వందనం చేశారుకవిత్వం లో .ఇంట్లో వారికి తెలీకుండా మేనేజ్ చేశారు .ఆస్పత్రి వాతావరణాన్ని వర్ణిస్తూ ‘’బంధువుల పరామర్శల పవన స్పర్శలు లేవు-ఆత్మీయుల సానుభూతి శీతల తుషారాలు లేవు—మిత్రుల స్నేహ కరచాలనలూ లేవు ‘’అని బాధపడ్డారు మరి ఉన్నదేమిటి ?’’నిశ్శబ్దాన్ని తూట్లు పొడిచే రోగుల మూల్గులు తప్ప ‘’—భయం చిలుము పట్టి వన్నె తరిగిన పీడాకార ముఖాలున్నతప్ప –కన్నీటి కెరటాల మీద తేలి పోయే రోగిష్టి శరీరాలు తప్ప –‘’అని ఆ భయంకర వాతావరణాన్ని తెలిపి ఇంకాస్త వివరంగా ‘’గుండె గుబురులో –గుబులు ముళ్ళ గాయానికి –చిరు నవ్వు లేపనాల చల్లని పూతల్లేని –సంతోష సరోవరం లో ఆహ్లాద వివరాల్లేని –కంటి రెప్పల వెనక సుందర స్వప్నాలు లేని –భయ పెట్టె కల్లోల సముద్రం లో –చిల్లు పడవ ప్రయాణం –ఇదీ ఇక్కడి జీవితం ‘’ ఈ విచిత్ర భయానక పరిస్తితులలో’’అందాలోలికే  హాస్పిటల్ బిల్డింగ్ –‘’చిక్కటి చీకటి మధ్య తెల్లగా మెరిసిపోయే –సామూహిక సమాధి అవుతుంది ‘’అన్నారు .

ప్రక్రుతి ఎలాకనిపించింది  ‘’చల్లగా కనిపించే మచ్చల చంద్రుడు –చీడ పట్టిన ఊపిరి తిత్తి అవుతాడు –నిద్ర పోయే ముందు కన్ను గీటి కవ్వించిన నక్షత్రాలు –మెరిసే గుడ్ల గూబల కళ్ళవుతాయి .’’అని చెప్పారు .రోగులెలా ఉంటారు ?’’ఒకరికొకరు మిత్రులై –ఒకరికొకరు ఆత్మీయులై –ఆప్తులై –  యేకాంతాలను దాటుకొని తమ నుంచి తాము దూరం గా పారిపోతూ౦టారు ‘’అని క్షవ్యాదిగ్రస్తుల మనోభావాలను తెలిపారు .క్షయకు’’ స్త్రేప్టో మైసిన్ ‘సంజీవనిగా మందు వచ్చి నాలుగేళ్ళు అయినా ఇంకా జనాలలో భయం పోలేదన్నారు .’’ఒక్కన్నే-నే నోక్కన్నే-నాలో నేను చూసుకొంటూ –‘’గడిపానని చెప్పుకొన్నారు .పూర్తిగా వ్యాదినయమై ఇంటికి చేరారు ‘’తమ్ముళ్ళు చెల్లాయిల కళ్ళు పుచ్చపువ్వులయ్యాయి ‘’మిత్రులు కళ్ళతోనే చురకలేశారు .వీరాజీ మళ్ళీ జన జీవన స్రవంతిలో చేరిపోయారు .

‘’నిస్వార్ధ స్నేహానికి ,నిజమైన మైత్రికి –శిల్పించిన చిహ్నమై ‘’న మల్లెశుకు ‘’రంగుటద్దాలు ‘’అంకితమిచ్చి అభిమానాని ప్రకటించుకొన్నారు .వినుకొండ నాగరాజు నవల ‘’తాగు బోతు’’కు ‘’ముందుమాట రాయించి –లేని గౌరవం కల్పించటం ‘’అతని ఆత్మీయతకు చిహ్నం అని చెప్పుకొన్నారు .అరవై దశకం లోనే రెండు నవలలను పూర్తిగా ‘’చైతన్య స్రవంతి ‘’ శిల్పం లో చెక్కాడు నాగరాజు .’’ఎనిమిది నెలల శ్రమ ఫలితం గా ‘’మైనా ‘’నవల యెగిరి వచ్చింది .ఆ  నవలను ఆంధ్రపత్రికకు పంపిస్తే ‘’పాఠకులకు శైలీ ,ఇతి వృత్తాలు  అందుబాటులో లేవు  ‘’ అని తిరస్కరించి పంపిన నవల మైనా అవార్డ్ విన్నర్ అయింది తర్వాత..నగరం లోని సాహితీ వేత్తలకు పరిచయం చేశాడు వీర్రాజుగార్ని శ్రీ వాత్సవ .’’కొత్త ఆలోచనలకు అవకాశం లేని –చాదస్తాల ముక్క వాసనల మధ్య –ఊపిరి సలపక ‘’కృష్ణా పత్రిక ‘’నుండి వైదొలగారు .పరిచయాలు స్నేహాలతో –సాహిత్య  వాతావరణాన్ని నా చుట్టూ అల్లుకొని –నన్ను నేనే వెలిగించుకొంటూ –నాకు నేనే ప్రోత్సాహం ఇ చ్చుకొంటూ ‘’ మరోనవలకు శ్రీకారం చుట్టారు .

సమాచార శాఖలో ద్యోగం ఉందని చెప్పి బోయి భీమన్న ప్రభుతోద్యోగానికి ఇష్టపడని వీర్రాజుగారిని ఒప్పించి దరఖాస్తు చేయించారు .ఇంటర్వ్యు లో  సెలక్ట్ అయి ‘’సహాయ అనువాదకుడు ‘’గా చేరారు .’’ఆంద్ర ప్రదేశ్ ‘’మాసపత్రికకు ఎడిటర్ వడ్లమూడి గోపాల క్రిష్నయ్య సంతకం కింద ఎప్పుడూ ‘’వాజ్మయ మహాధ్యక్ష ‘’అని చేర్చి రాయటం అలవాటున్నవాడు .తన నీడను చూసి తానె భయపడే వింత మనిషి .ఆయనకున్న బ్రాహ్మణ ద్వేషమే వీర్రాజు ను దగ్గరకు తీసిందట ‘’విజ్ఞానం  తో వికసిం చాల్సిన బుద్ధి కుం చిం చుకు పోవటానికి హేతువు అక్కర్లేడుకదా “’అంటారు విశాల హృదయం తో .కుందుర్తి ఆంజనేయులు గోపాల చక్రవర్తి ‘’సమాచార శాఖకు కవితాలంకారులు ‘’అన్నారు .ఏడాది తర్వాత కవిత్వాన్ని మోసుకెల్లి  కుందుర్తి కి  చూపి దగ్గరయ్యారు ‘’ఇదేనోయ్ నేను కోరేదీ –నాకు కావాల్సిందీ ‘’అని మెప్పుకూడా లభించింది .ఆయన ‘’అభినందన చూపులతో ఆలింగనం చేసుకొంటే-ఆనంద బాష్ప దారనై కారిపోయాను నేను –దూదిపింజనై తేలిపోయాను ‘’ అని ఆ ఆత్మీయతకు కవితాత్మ చేర్చి పొంగిపోయారు .’’కవుల దారిలో చొరబాటు దారుడిని నేను ‘’కసురుకోకుండా మెచ్చుకున్నందుకు మురిసిపోయారు .కుందుర్తి పీఠికతో ‘’కొడిగట్టిన సూర్యుడు ‘’రాస్తే శ్రీపతి అచ్చేసి జనం ముందు నిలబెట్టాడు .

 

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-2-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మన్మథ నామ సంవత్సరపంచాంగ ఆవిష్కరణం

ఆస్తిక  మహాశయులకు నమస్కారం,

శ్రీ కంచికామకోటి పీఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ జయేన్ద్రసరస్వతీ స్వామివారు ఫిబ్రవరి 10 (మంగళ వారం) సాయంత్రం 4:30 కు , సికిందరాబాదు స్కందగిరి దేవాలయము నందు, మన శ్రీ జనార్దనానన్ద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ యొక్క మన్మథ నామ సంవత్సర పంచాంగమును ఆవిష్కరించబోవుచున్నారు.

కావున మీరందరూ ఈ కార్యక్రమముయందు పాల్గొని శ్రీ స్వామివారి ఆశీస్సులను పొందవలసినదిగా కోరుచున్నాము.

తూములురు శాయినాథ  శర్మ, శ్రీ జనార్దనానన్ద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ +91-94905-13438 
పసుమర్తి బ్రహ్మానంద శర్మ, శ్రీ జనార్దనానన్ద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ +91-98490-11009
కుప్పా శ్రీ ఆంజనేయ శాస్త్రి, శ్రీ వేద వ్యాస పాఠశాల, +91-40-6444-8800

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -9

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -9

5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-2

అమెరికా పేపర్లన్నీ విరుచుకుపడ్డాయి .’’A mass of mombast ,,egotism ,vulgarity ,and nonsense ‘’విట్మన్ రాసిన ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్’’ను నిజంగానే గడ్డిపరకల కింద జమకట్టాయి .ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’the author should be kicked from all decent society as below the level of the brute ‘’అన్నారు .విదేశాలలో సైతం ఇదే విమర్శలోచ్చాయి ‘’ది లండన్ క్రిటిక్ ‘’ఇంత అమర్యాద కవిని అమెరికా ఎలా భరిస్తోందో ?’’అని ఛీత్కరించింది .న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ‘’గడ్డిపరకల రచయిత సగం మనిషి సగం మృగం .అతని మూలాలు పంది దొర్లే బురద గుంటలో ఉన్నాయి ‘’అన్నది .వీటికి అతీతం గా మొదటి గుర్తింపు ,ప్రశంసా న్యు ఇంగ్లాండ్ ప్యూరిటన్ చార్లెస్ ఇలియట్ నార్టాన్ ‘’నుంచి లభించింది ‘’whitman is a new light in poetry ‘’అంటే ,ఎడ్వార్డ్ ఎవెరెట్ హేల్ అనే బోస్టన్ క్లేర్జిమన్ ‘’కొత్తదనం తో కవిత్వం వచ్చింది .తాజాగా ఉంది .చాలా సాధారణం గా ఉంది .మనసులోని భావాలను మాటల్లో ఎలా చేబుతామో కవిత్వం లో అలాచేప్పి కొత్త దారి తొక్కాడు ‘’అన్నాడు .

వీటన్నిటికి మించి గొప్ప కవి రచయితా దార్శనికుడు ఎమర్సన్ ‘’Dear sir ,I am not blind to the worth of the wonderful gift of ‘’Leaves of Grass ‘’.I find it the most extraordinary piece of wit and wisdom that America has yet contributed .I am very happy in reading it ,as great power makes us happy – I give you joy of your free and brave thought .I agree you at the beginning of a great career ‘’అని ఆ కొత్త గొంతుకను మెచ్చి వెన్ను తట్టాడు .ఆ దార్శనికుని అభినందన కోటి ఏనుగులబలమైంది విట్మన్ కు .అంతే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలగ లేదు .ఈ భవిష్యత్ దీవన ఫలించటానికి మరికొంతకాలం పట్టింది .మధ్యలో అనేక అవాంతరాలు అడ్డంకులు కల్లోలాలు ఎదురు దెబ్బలు వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వచ్చింది

విట్మన్ దృష్టిలో సెక్స్ అనేది మనిషి జీవితం నుంచి దూరంపెట్టాల్సిన విషయం కాదు జీవితం లో భాగమే .ఇప్పటి మన’’ జగన్’’ లాగా అందర్నీ కౌగలించుకొని ఓదార్చేవాడు .సానుభూతి చూపేవాడు .నుదురు మెడ వక్షోజాలు అన్నీ తాకి ఆడా మగా తేడా లేకుండా హత్తుకొని వారితో కలిసిపో యేవాడు .అందరు అతని ఒడార్పులో కరిగి నీరయ్యేవారు .దుఖోపశమానం పొందేవారు. హృదయం లో ఉన్న బాదాగ్ని ని అతని చల్లని స్పర్శ చేత పోగొట్టుకోనేవారు .అంటే అతనిది ‘’హీలింగ్ టచ్ ‘’అన్న మాట .’’సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’లో తన మనోభావాన్ని ‘’I celebrate my self ,and sing my self –And what I assume you shall assume –For every atom belonging to me ,as good belongs to you ‘’అని వారితో అభేదాన్ని పొందాడు .తాదాత్మ్యత చెందాడు. సహ వేదన చూపాడు. సాను భూతి ప్రదర్శించాడు .మమేకం అయ్యాడు . అమెరికా చరిత్రలో ఒక కవి ఇంతగా ప్రజా సన్నిహితుడు అవటం ఇంతకూ ముందెన్నడూ లేదు .ఇదే మొదలు అందుకే ఆరాధనీయుడయ్యాడు .దీనజన బా౦ధ వుడయ్యాడు .అదో జగత్ సహోదరులకు ఆప్తుడయ్యాడు .శ్రీ శ్రీ లాగా కవిత్వం రాసి వారి మానాన వారిని వదిలేయ లేదు .వారిలో ఒకడయ్యాడు .అదీ విట్మన్ ప్రత్యేకత .

గడ్డిపరకల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి .కొత్తవి చేర్చి ప్రచురిస్తూనే ఉన్నాడు .మూడవ ముద్రణ తర్వాత 456 పేజీలతో 124 కొత్త కవితలను చేర్చి ప్రచురించాడు .1891 విట్మన్ కంటి తో చూసుకొన్న తొమ్మిదవ ప్రచురణ వచ్చింది .పేజీలు  ముద్రణ సంఖ్యా పెరుగుతోన్దేకాని ఆదాయం దానిపైన ఏమీ పెద్దగా రాలేదు .దాదాపు రెండేళ్ళు నిరాహారం గా ఉండిపోయాడు అంటే ముక్కున వేలేసుకొంటాం .లాభం లేదని మళ్ళీ జర్నలిజం గడప తొక్కాడు .బ్రూక్లిన్ డైలీ టైమ్స్ ఎడిటర్ అయ్యాడు .బాగా రాసి దూసుకుపోతుండగా అమెరికన్ రాష్ట్రాల మధ్య అంతర్ యుద్ధం వచ్చి సోదరుడు జార్జి  ఫ్రెడరిక్ బర్గ్ యుద్ధం లో తీవ్రం గా గాయపడితే అతనికోసం బ్రూక్లిన్ వదిలి వెళ్ళాల్సోచ్చింది .

అప్పటికే నలభై రెండేళ్ళు వచ్చిన విట్మన్ ముసలాడినని భావించటం క్వేకర్ భావాలున్డటం వలన ఆయుధం పట్టకూడని  సైనికుడుగా నమోదు కాలేదు .గాయాలపాలైన జార్జికి కట్టు కడుతూ వాషింగ్టన్లోనే 12ఏళ్ళు ఉండిపోయాడు .అంతకు ముందే బ్రూక్లిన్ ,న్యు యార్క్ లలో సైనికుల గాయాలకు సేవ చేసిన అనుభవం ఉంది .దీనితో వాషింగ్టన్ హాస్పిటల్ లో మానవత్వం తో అసహాయుల పాలిటి సేవకుడై సేవలందించాడు .’’హాస్పిటల్ విజిట్స్ ‘’అనేదానిలో రాస్తూ ‘’there is something in personal love ,caresses ,and the magnetic flood of sympathy ‘’అని రాసుకొన్నాడు .దీనివలన మందులకంటే సైనికులకు విట్మన్ చూపిన ఆదరణ ఆత్మీయతలే గోప్పమందుగా పని చేసి కోలుకొన్నారు .అధికారుల పత్రాలను కాపీ చేసిపెట్టాడు ,పత్రికలకు ఏదో విషయం పై రాసి వచ్చేడబ్బును గాయపడి కోలుకొంటున్న సైనికులకు పళ్ళు , పొగాకు ,స్టాంపులు ,చేతి అవసరాలకు డబ్బు పండ్ల రసాలు ,పుస్తకాలకోసం ఖర్చుచేసి అందించి వారికి మానసిక సంతృప్తి కలిగించి తానూ ఆనందం పొందేవాడు మానవీయ విట్మన్ .క్షతగాత్రుల ప్రక్కలో కూచుని చక్కగా సంభాషించి ఊరటకల్గిన్చేవాడు .వారు రాయమన్న ఉత్తరాలు బంధువులకు రాసిపంపెవాడు .ఇవన్నీ చాలా హృదయ విదారకం గా ఉండేవి .వీటిని అక్షరబద్ధం చేసి సీరియల్ గా రాసి పత్రికలకు పంపుతూ గడిపాడు .ఇదంతా దయనీయమైన బాధామయమైన అనుభవమే .ఇతరులకోసం జీవించటం అనే గొప్ప మానవీయ కోణాన్ని విట్మన్ ఆవిష్కరింప జేసుకొన్నాడు .జీవితం లో టెర్రర్ ను, ప్రేమను అనుభవైక వేద్యం గా ‘’’డ్రం-టాప్స్ ‘’(మద్దెల దరువులు )రాసి చలించేట్లు చేయగలిగాడు .ఏదో దేశ భక్తీ రచనలు చేసి చేతులు దులుపుకోలేదు .యదార్ధ సంఘటనలకు మానవీయతను జోడించి రాసి స్పందింప జేశాడు .తోటివారితో సహజీవనం చేసిన మహా మనిషిగా మార్పు చెంది మాననీయుడనిపించుకొన్నాడు .

ఇప్పటికి పత్రికలూ కళ్ళు తెరచి అతని లోని మానవత్వాన్ని అర్ధం చేసుకొన్నాయి .లెంపలేసుకొన్న ‘’టైమ్స్ ‘’తన కధనం లో Whitman s devotion to the most painful of duties in the hospitals at Washinton during the war will confer honor on the memory when ‘’leaves of grass ‘’are withered and when the drum –taps have ceased to vibrate ‘’అన్నది .ప్రభుత్వమూ అతన్ని గుర్తించి ‘’ఇండియన్ బ్యూరో ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ ‘’లోప్రెసిడెంట్  అబ్రహాం లింకన్ కేబినేట్ లో  గుమాస్తా ఉద్యోగం ఇచ్చింది .కొంతకాలానికి ఇంటీరియర్ కు సెక్రెటరి గా ఉన్న జేమ్స్ హార్లాండ్ ఒక ప్రైవేట్  డ్రాయర్ సొరుగు లో విట్మన్ లీవ్స్ ఆఫ్ గ్రాస్ పుస్తకం చూసి కొంపలు మునుగుతాయేమోనన్న భయం తో ఎవరికీ చెప్పకుండా విట్మన్ ఉద్యోగం నుంచి తప్పించాడు  .దీన్ని జీర్ణించుకోలేని విట్మన్ కవి అభిమానులు విలియం డగ్లాస్ కానేరీ నాయకత్వం లో ‘’ది గుడ్ గ్రే పోయెట్ ‘’అనే పేర ఒక కరపత్రం ముద్రించి పంచారు .తప్పు తెలుసుకొన్న అధికారులు విట్మన్ ను అటార్నీ జెనరల్ ఆఫీస్ కు బదిలీ  చేశారు .యాభై మూడవ ఏడు వచ్చేదాకా ఇక్కడే హాయిగా విట్మన్ ఉద్యోగం చేశాడు కాని  జీతం చాలకు తన పుస్తకాలు స్వయం గా అమ్ముకొని బతికాడు కవి .

తలలో నొప్పుల బాధలు అనుభవించాడు .రోగులకు సేవ చేసినప్పుడు కొన్ని క్రిములు చేరి ఉంటాయని భావించాడు . వాషింగ్టన్ నగరమంటే చెప్పరాని మక్కువ ఏర్పడింది .సైనిలను ఒక తల్లిలాగా పలరించేవాడు ఆదరించేవాడు .అతనిలోని ఆ మాత్రు భావనకు వాళ్ళ హృదయాలు కరిగిపోయేవి .మరింత సన్నిహితులయ్యేవారు .’’I think to be a woman is greater than to be a man ‘’అని మహిళా శ్రేస్టతను, మాతృత్వ గరిమను చెప్పాడు విట్మన్ .పీటర్ డయోల్ అనే బాలుడికి తల్లి వాత్సల్యం తో ఉత్తరాలు రాసి అతనికి జీవితేచ్చ కల్గించి ఆదుకొన్నాడు .అతనితో పన్నెండేళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి మాతృ వాత్సల్యం పంచిన మహా మానవీయకవి వాల్ట్ విట్మన్ .

Inline image 1  Inline image 2    

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-2-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది

నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది

ANDHRAPRABHA –   Mon, 9 Feb 2015, IST
\

ఎవరిని గురించి రాస్తున్నారో వారిని పాఠకులుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని 1967లో సింహగర్జనతో దళిత పాంథర్స్‌ మరాఠీ, హిందీ సాహిత్యాల్లో ప్రవేశించారు. ఈ ప్రశ్నను బలంగా ముందుకు తెచ్చారు. నలభయ్యేళ్ల తర్వాత వర్ణఆధిక్యవాదులు ఈ ప్రశ్నను పట్టించుకోవడం మొదలైంది. అలా వారు నలభయ్యేళ్లుగా భారతీయ సాహిత్యంలో జరుగుతూ వస్తున్న పరిణామాలు ప్రధాన సాహిత్య స్రవంతిని మార్చి తామే ప్రధాన సాహిత్య స్రవంతిగా ఎదిగిన తీరును గమనించి వాస్తవాలను విశ్లేషించడం మొదలైంది.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇంగ్లీషులో వచ్చిన కథలను డిక్షనరీ ఆఫ్‌ షార్ట్‌ స్టోరీస్‌గా 1950 నుండి కథా నిఘంటువులను ప్రచురిస్తున్నారు. మా రెండో కొడుకు శ్రీకాంత్‌ కిరాయికున్న న్యూజెర్సీలోని కార్టరెట్‌ -ఎడిసన్‌ ప్రాంతంలో ఉన్న వాడకట్టు లైబ్రరీలో కూడా ఇవి కనపడ్డాయి. మా వాడి ఇంటి నుండి రోజూ ఆ లైబ్రరీకి నడిచి వెళ్లేవాడిని. కొన్ని గంటలు కూర్చుండే వాడిని. 50 దాకా ఇంటర్నెట్‌, కంప్యూటర్లు, సీడీలు, డీవీడీలతో లైబ్రరీ, అలాగే బుక్‌ లైబ్రరీ అందులో ఉంది. సగం బుక్‌ లైబ్రరీ, సగం సీడీల లైబ్రరీగా మార్పు చెందింది. అక్కడ కథల నిఘంటువులు ఆరు, ఏడు వందల పేజీలతో 15 -16 దాకా ఇటీవలి కథలతో సహా నిఘంటువులు కనపడ్డాయి. అలాగే డిక్షనరీ ఆఫ్‌ నావెల్స్‌, డిక్షనరీ ఆఫ్‌ సినిమాస్‌ ఇలా అనేక రంగాల డిక్షనరీలు అంత చిన్న లైబ్రరీలో దర్శనమిచ్చాయి. ఇంటర్నెట్‌ వచ్చాక మన ఇంట్లోకి టేబుల్‌పైకి ప్రపంచ గ్రంథాలయాలు అన్నీ నడిచివచ్చాయి. యుట్యూబ్‌ టెక్నాలజీ ద్వారా దృశ్య మీడియా ప్రక్రియలన్నీ అక్షరాల వలెనే మనింటికి చేరవచ్చాయి.

భారతీయ కథా పరిణామాలు: భారతీయ కథా పరిణామాలను ఒక విషయం తెలుస్తుంది. ఆయా సమాజాలను అనుసరించి, చరిత్రను అనుసరించి ఆయా ప్రక్రియల్లో పరిణామాలు సాగుతూ వచ్చాయి. వేల ఏళ్ళ నుండి వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతాలు, బౌద్ధ అట్టకథలు, పురాణాలు, మృచ్ఛకటికం, ముద్రారాక్షసం, పంచతంత్ర కథలు, బృహత్‌ కథ, సతీసావిత్రి, సతీ అనసూయ కథలు, శైవ, వైష్ణవ బౌద్ధ, జైన సాహిత్యం, భక్తి సాహిత్యం, భక్తుల కథలు, ఆయా కాలాలననుసరించి వెలువడుతూ వచ్చాయి. వ్యాస వాల్మీక, ఆది కవుల రచనలు, నేటికీ భారతీయ సమాజంపై బలమైన ప్రభావం వేస్తున్నాయి. కాళిదాసు రచనలు, ప్రబంధ సాహిత్యం, యక్షగానాలు, జానపద కళారూపాలు మరొక్కదశ. ఆలీబాబా 40 దొంగలు, సింద్‌బాద్‌ సాహసిక యాత్రలు, గలీవర్‌ కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, నసీరుద్దీన్‌ కథలు, తెనాలి రామలింగడు కథలు, పరమానందయ్య శిష్యుల కథలు మొదలైనవి సాహసిక, హాస్య, రస ఉత్పన్నం చేయడంతోపాటు వివేచనను పెంచుతాయి. బట్టివిక్రమార్క బేతాళ కథలు, హరివశం, విక్రమోర్వశీయం, నలదమయంతిల కథలు, సత్యహరిశ్చంద్ర కథలు, సాలభంజిక కథలు మొదలైనవి ప్రేమ, సత్యాన్వేషణ వంటి వాటికై సృష్టించబడ్డాయి. ఇవన్నీ నూతన ప్రక్రియగా ప్రారంభమయ్యే క్రమంలో సినిమాల్లో అదే వరుసలో ప్రవేశించాయి. చాలా సినిమాలు రామాయణ భారతాల కథల్ని సాంఘికాలుగా మార్చి తీసిన కథలే అని కొందరు విశ్లేషించారు.

18వ శతాబ్దినుంచి మధ్యతరగతి, కార్మికవర్గం ఎదుగుతూ వచ్చింది. కథలో వస్తువు మారింది. పాఠకులూ, ప్రేక్షకులూ మారారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రస్తుత ప్రక్రియల పరిణామం మలుపు తిరిగి ఈ దశను తీసుకుంది. ఇలా క్రీస్తుపూర్వందంతా ఒక పరిణామ దశ. తర్వాత ప్రతి 500 సంవత్సరాలకు ఒక దశగా పరిగణించి, పరిశీలించవచ్చు. 1500 నుండి 1800, 1800 నుండి 1850, 1851 నుండి 1900, 1901 నుండి 1950, 1951 నుండి 1980 అనే దశలుగా సాహిత్యాన్ని పరిశీలించవచ్చు. చివరి మూడు శతాబ్దాల్లో పరిణామాలు వేగంగా సాగాయి. సైన్స్‌ ఆవిష్కరణలు సమాజంలో అనేక మార్పులను తెచ్చాయి. వ్యవస్థలు మారాయి. ప్రజాస్వామ్యం, సోషలిజం, నియంతృత్వం వంటి పరిపాలనా వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాల స్థానంలో, దేశాల భావన స్థిరపడింది.

పాట, నృత్య, సంగీతాల ద్వారా సృజించబడే రసాలు, స్పందనలు, మూడ్స్‌ ప్రస్తుతం సినిమా, టీవీ ప్రక్రియల్లో బాగా సృష్టించబడుతున్నాయి. కథా నవల, వచన కవిత, ప్రక్రియల్లో ఈ మూడ్స్‌ని రసాలను, సాధించడం ద్వారా ధ్వని అనే సారానికి ఆకర్షణీయమైన రూపం ఏర్పడుతుంది. రూపం ద్వారా సారాన్ని చేరుకోవడమే సాహిత్యం, కళల అలంకార శాస్త్రాల జ్ఞాన శాస్త్రం.

ఇలా నేటి కథా నవల, సినిమా మధ్యతరగతి గురించి, కష్టజీవుల గురించి, ఉన్నత వర్గీయుల గురించి, సాహసికుల గురించి, వీరుల గురించి, నైతిక విలువల గురించి, సంస్కృతి గురించి, స్వేచ్ఛ గురించి, సత్యం గురించి, అస్థిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి, ఆశల గురించి, వస్తువుగా స్వీకరించి చిత్రిస్తున్నాయి. జీవితంలోని అనేక పార్శ్వాలను, కోణాలను చిత్రించడం అనేది బహుముఖాలుగా సాగుతున్నది. ఆయా వస్తువును అనుసరించి వాటిని వర్గీకరిస్తుంటారు. అలాగే ఆయా శిల్పాన్ని, శైలిని, ప్రెజెంటేషన్‌ని అనుసరించి, వర్గీకరిస్తుంటారు. ఇలాఆధునిక సాహిత్యం, కళలు, నేటి దశకు చేరుకున్నాయి.

స్త్రీవాద, అస్తిత్వవాద సాహిత్యం సిద్ధాంతాలు: స్త్రీవాద సిద్ధాంతాలు 1850 నుండే ప్రారంభమైనప్పటికీ 1960 ల నుండి నూతన సిద్ధాంతాలు బలంగా, ఉద్యమాలుగా ముందుకు వచ్చాయి. ఫెమినిస్టు తాత్విక సిద్ధాంతాల నేపథ్యంలో 1980ల నుండి నూతన సాహిత్య సిద్ధాంతాలు వేగం పుంజుకున్నాయి. మా గురించి మేమే రాసుకుంటాం అని స్త్రీలు, బహుజనులు, కష్టజీవులు, కార్మికులు సాహితీవేత్తలుగా ముందుకు వచ్చారు. తమ గురించి ఇంత దాకా రాసిన సాహిత్యమంతా తమపై గల సానుభూతితో రాసిన సాహిత్యమే తప్ప అనుభవాల నుండి రాసిన సాహిత్యం కాదని విశ్లేషించారు. స్వయంగా తమ అనుభవాలను, అనుభూతులను, సంస్కృతిని, జీవన విధానాలను, ఆశలను, ఆరాటాలను, దృక్పథాలను కథలుగా, నవలలుగా రాయడం వేగం పుంజుకుంది.మరాఠి, హిందీ సాహిత్యాల్లో ఇలాంటి ఆత్మకథల సాహిత్య విస్తారంగా ప్రాచుర్యం పొందింది.

భారతీయ భాషల్లో స్త్రీవాద సాహిత్యం అనేక కోణాలను ముందుకు తెచ్చి ఇంతదాకా కొనసాగిన సాహిత్యంలో పితృస్వామిక పురుషాధిపత్య భావాలు, సంస్కృతి, దృక్పథం ఎలా కొనసాగాయో కథలు, నవలల్లో చిత్రించారు. అలాగే బహుజనులు అనగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఇంతదాకా సాహిత్యంలో వర్ణాధిక్య, కులాధిక్య దృక్పథం కొనసాగుతూ తమ జీవితాలను, సంస్కృతిని తమపై గల అణచివేతను ఆధిపత్యాన్ని ఎలా కొనసాగిస్తూ వస్తున్నాయో విశ్లేషించారు. దాంతో సాహిత్యం రెండు చీలిపోయింది. ఎవరి గురించి, ఎవరి కోసం రాస్తున్నారో అనే ప్రశ్నబలంగా ముందుకు వచ్చింది.

నేను 1990 నుండి ఈ విషయమై వందలాది ప్రసంగాలు, వ్యాసాలు అనేక గ్రంథాలు వెలువరించడం జరిగింది. ఇంతకుముందే చెప్పినట్టు వీటిని సమగ్ర సామాజిక కథ యాభయ్యేళ్ల తెలుగు కథ తీరుతెన్నులు, కథలబడి కథా సాహిత్య అలంకార శాస్త్రం, గతితర్క తత్వదర్శన భూమిక, సాహిత్య చరిత్ర కొత్త చూపుతో తిరగరాయాలి, వ్యక్తిత్వ వికాసం సామాజిక నాయకత్వం, జీవితం అంటే ఏమిటి? అరవయ్యేళ్ల తాత్విక సామాజిక పరిణామాలు తదితర గ్రంథాల్లో కొంతమేరకు పొందుపరచడం జరిగింది. తెలుగు లేదా భారతీయ కథ గురించి పరిశీలించే ముందు ఈ ప్రక్రియ పుట్టిన ఐరోపా సమాజం గురించి ఆలోచించాలి. ఐరోపా సమాజంలోనూ, దాని నుండి పుట్టిన అమెరికా సమాజంలోనూ ప్రధాన మతం క్రైస్తవం. కథానిక పుట్టే నాటికి శారీరక కన్నా, ఆర్థిక కారణాల వల్ల దేవుడు చెప్పిన సిన్‌ (పాపం) చేసేవారు హెచ్చారు. సంపన్న వర్గాలు, రైతాంగం అన్న విభజిత సమూహాల మధ్య మధ్య తరగతి వచ్చింది. వీరు వర్తక వ్యాపారులు ధనం కలిగి వుండడం ద్వారా గౌరవనీయులు, సామాన్యులు అన్న విభజన వచ్చి సామాన్యులను న్యూనతగా చూడ్డం వచ్చింది. యూరోపియన్‌ కథ గొగోల్‌ ఓవర్‌ కోట్‌ నుండి పుట్టిందంటారు. అందులో కథకుడు న్యూనతగా చూడబడిన సామాన్యుడిని కథా నాయకుడ్ని చేస్తారు. మపాసా, చెకోవ్‌, లారెన్స్‌ వంటి తొలి విఖ్యాత కథకుల కథలన్నీ న్యూనతగా చూడబడేవారు ఎంత మాన్యులో, న్యూనతకు కారణమైన ఆర్థిక లేమి ఎటువంటిదో చెబుతాయి. వ్యక్తుల నైతిక స్థాయిని చూపిస్తారు. పాత్రలో పాఠకుడు తనను గుర్తు పడతాడు. (వివిన మూర్తి -ఒక దినపత్రిక, సాహిత్య వేదిక 24 జనవరి 2011) సాహిత్యం, కళలు జీవితంలో భాగంగా మారాలంటే అవి వారి జీవితాలకు కాలక్షేపాన్నయినా ఇవ్వాలి. మంచి సాహిత్యం, కళలు, సామాజిక శాస్త్రాలు జీవితంలో కాస్త స్ఫూర్తిని, ఉత్తేజాన్ని, వెలుగును, ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కలిగించాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాల్యం ఉన్నంత వరకు బాలానందం ఉంటుంది..!

బాల్యం ఉన్నంత వరకు బాలానందం ఉంటుంది..!

రేడియో అన్నయ్య, అక్కయ్య గారి ‘ఆంధ్రబాలానంద సంఘం’ … అంటే తెలుగువారికి ఇట్స్‌ ఎ బ్రాండ్‌ నేమ్‌. అందరూ ఈ సంఘాన్ని ముద్దుగా బాలానందం అని పిల్చుకుంటారు. పిల్లల మనోవికాసానికి పెద్దపీట వేస్తూ, పిల్లలకి అందమైన బాల్యాన్నిచ్చే సంస్థగా గుర్తింపు పొందిన బాలానందం స్థాపించి 75 యేళ్ళు . ఈ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ‘నవ్య’తో పంచుకున్నారు ఆ సంస్థ కార్యదర్శి జె.వి.కామేశ్వరి..
‘‘ఈ రోజుల్లో ఒక సంస్థ రెండు దశాబ్దాలు బతకటమంటే గొప్ప. అలాంటిది మా బాలానందానికి 75 యేళ్ళంటే మహదానందంగా ఉంది. బాలానందంతోనే నా జీవితం ముడిపడి ఉంది. నన్నందరూ ఇప్పటికీ రేడియో అక్కయ్యగారి పాప అనే అంటారు. ఒకరోజు అక్కినేని నాగేశ్వరరావు ఉదయాన్నే ఫోన్‌ చేసి ‘పాపా నీ పేరేమిటీ?’ అన్నారు. ఇన్నాళ్ళకు సందేహం ఎందుకొచ్చింది అని అడిగితే ‘నా భార్య అన్నపూర్ణ, నేను.. రేడియో అక్కయ్య, అన్నయ్యల గురించి మాట్లాడుతూ నిన్ను అక్కయ్యగారి పాప అనుకున్నాం. కానీ పేరు తెలీక ఇలా పెందలాడే కాల్‌ చేశాను’’ అన్నారు ఏఎన్నార్‌. ‘నా పేరు జె.వి.కామేశ్వరి’ అని చెప్పాను. అక్కయ్య, అన్నయ్య ఇద్దరూ పాప అని పిలుచుకోవటం వల్ల ఇలా అరవయ్యవ పడిలోనూ అందరిచేతా చంటిపిల్లలా ‘పాప’ అనిపించుకుంటున్నాన్నేను. అటు న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య) గారికి మా అమ్మ సొంత మేనకోడలు, ఇటు న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) గారికి మా నాన్న తమ్ముడు. నేను 1952 సంవత్సరంలో పుట్టాను. మా అమ్మ పేరు కమల, నాన్న సూర్యనారాయణ. అమ్మానాన్నల దగ్గర కాకుండా చిన్నప్పటి నుంచీ రేడియో అన్నయ్య, అక్కయ్యగారి దగ్గరే పెరిగాను. అక్కయ్యని అమ్మా అనేదాన్ని, అన్నయ్యగారిని మాత్రం మామా అనేదాన్ని. వాళ్లకి పిల్లలు లేకపోవటంతో నన్ను సొంత బిడ్డకంటే ఎక్కువగా చూసుకున్నారు.
రేడియోస్టార్‌లు..
అన్నయ్య, అక్కయ్యలది వాత్సల్యపూరితమైన అనుబంధం. అన్నయ్యకు సినిమాలంటే ప్రీతి. అక్కయ్య మనసున్న మనిషి. ఎనిమిది మంది బంధువుల పిల్లల్ని పెంచేది. మా ఇంట్లో ఎప్పుడూ పెళ్ళి వాతావరణముండేది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ బాలానందానికి చేరుకునేవారు. ఆహా.. ఆ రోజులు తల్చుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. బాలానందం ఏర్పాటు చేసే వేసవి శిక్షణా శిబిరాలు, పోటీల సమయంలో రేడియో అక్కయ్య, అన్నయ్యగార్లు వచ్చారనే వార్త విని వాళ్ళని చూడాలని తండోపతండాలుగా జనాలొచ్చేవారు. సినిమా స్టార్లకుండే ఫాలోయింగ్‌ వారి కుండేది.
ఆ ఇద్దరి ప్రేమకథ..
నిద్రకుముందు అక్కయ్యగారు నాతో బోలెడన్ని కబుర్లు చెప్పేవారు. వారిరువురి నేపథ్యం, ప్రేమ, పెళ్ళి విశేషాలను ఒక రోజున గుర్తు చేసుకుంటూ ‘‘మీ అన్నయ్యది బరంపురం. నాది విజయనగరం. బి.ఎ.లో ఇద్దరం క్లాస్‌మేట్స్‌. నేను గుర్రపుబండిలో కాలేజీకి వెళుతుంటే ‘మగరాయుడిలా ఆ చదువులేమిటీ?’ అంటూ చుట్టుపక్కల వాళ్లు ఎత్తిపొడిచేవాళ్లు. క్లాస్‌రూంలో అబ్బాయిలకి దూరంగా కూర్చొనేవాళ్లం. ఓ రోజు ఓ కుర్రోడు ‘అలా ఆడపిల్లల్ని దూరంగా ఎందుకు కూర్చోబెట్టారు? అనడిగాడు. వెంటనే ‘వాళ్ళు అంటరాని వాళ్లేమో!’ అనే డైలాగ్‌ వినిపించింది. ఎవరా అని విసురుగా ఆ అబ్బాయి వేపు చూశాను. అతనే న్యాయపతి రాఘవరావు. ఆ తర్వాత పరిచయం, ఆయన మనస్తత్వం నచ్చటంతో ఇష్టపడ్డాను. ఆయనా నన్ను అమితంగా ఇష్టపడ్డారు. ఇద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో వాళ్ళని అడిగి పెళ్ళి చేసుకున్నాం..’’ అంది అక్కయ్య. అదీ వారి ప్రేమ కథ!
ముఖ్యమంత్రే రమ్మన్నారు..
అక్కయ్యగారు బి.ఎ.లో ఇంగ్లీష్‌ స్షెషల్‌ చేశారు. ఆ తర్వాత బి.ఎడ్‌ చేశారు. అన్నయ్య ఎం.ఎ. మధ్యలోనే ఆగిపోయింది. ‘స్వరాజ్యం జన్మహక్కు’ అంటూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారట. పిల్లలకీ ఆశలుంటాయి, కలలుంటాయి. ఆ చిన్నారి మనసులకి ఆహ్లాదం కావాలి. అందుకు ఓ వేదిక అవసరం. అలాంటి వేదిక కోసమే అక్కయ్య, అన్నయ్యలు ఏకనిర్ణయంతో 1940లో ‘బాలానందం’ సంస్థను చెన్నైలో స్థాపించారు. ఆ ఏడాదే రేడియోలో అక్కయ్య, అన్నయ్యగారిద్దరూ శని, ఆదివారాల్లో బాలవినోదం, బాలానందం కార్యక్రమాలను చేసేవారు. అక్కయ్య అదనంగా మహిళా కార్యక్రమాలు చేసేది. దర్శకులు కె.ఎస్‌. ప్రకాశరావు గారు 1949లో బాలానందం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఇక్కడున్న పిల్లలనే నటీనటులుగా పెట్టి.. ‘బాలానందం’ పేరుతో మూడు చిన్నచిత్రాలు రూపొందించారాయన. స్వాతంత్య్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి అన్నయ్య, అక్కయ్య గారిని హైదరాబాద్‌ రమ్మని అడిగారు. సీఎం కోరిక మేరకు అక్కడి బాలానందాన్ని ఇంకొకరికి అప్పజెప్పి, 1956 జూన్‌లో హైదరాబాద్‌కి వచ్చి అదే సంవత్సరం అక్టోబరు 23 వ తేదీన నారాయణగూడలో ‘ఆంధ్రబాలానంద సంఘం’ స్థాపించి ప్రారంభించారు.
చిన్న జీతంతోనే పెద్ద కార్యం..
హైదరాబాద్‌కి వచ్చాక బాలనందంని గాడిలో పెట్టడానికి మూడు నెలలు పట్టింది. నారాయణగూడలోని అక్కయ్య గారి పేరుమీదున్న స్థలం బాలానందానికి కేటాయించింది. భార్యాభర్తలిద్దరూ బాలానందంలో ఉంటూనే అద్దె కట్టారంటే వాళ్లదెంత గొప్ప మనసు. మీ ఇంటికే అద్దె ఎందుకు అంటే ‘బాలానందం’ కోసం మా తరఫున కొంచెం సేవ అనేవారు. అన్నయ్యగారు హిందూ రిపోర్టర్‌గా వర్క్‌ చేస్తూ, అక్కయ్యగారు ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూనే హైదరాబాద్‌ రేడియో స్టేషన్‌లో ప్రోగ్రామ్స్‌ చేసేవారు. కేవలం వారిరువురికి కలిపి వచ్చే 130 రూపాయల జీతంతోనే బాలానందాన్ని బతికించుకున్నారు. తెలుగులో తొలి బాలల మ్యాగజైన్‌ అన్నయ్య, అక్కయ్య గారే ప్రారంభించారు. అదే ‘బాల’. అందులో ‘చందమామ’ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత ఆ పత్రిక ఉన్నతస్థాయికి వెళ్లింది. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడింది.
అదే లక్ష్యం..
తెలుగువారు తెలుగు మాట్లాడాలి, తెలుగు సంస్కృతీ-సంప్రదాయాలు తెలియాలన్న బాలానందం ఉద్దేశ్యాన్ని అలాగే కొనసాగిస్తున్నాం. వేమన పద్యాలు, రామదాసు, అన్నమాచార్య కీర్తనలు, లలితసంగీతం, కర్నాటక సంగీతం, కూచిపూడి, భరతనాట్యం మొదలైన వాటిని సాధారణ ఫీజుతో నేర్పిస్తాం. పిల్లలు రోజూ సాయంత్రం నాలుగున్నరకి వస్తారు. లలితసంగీతకారులు ఎమ్‌.చిత్తరంజన్‌ బాలానందం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ట్రస్ట్‌ కిందే ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇంతకు ముందులాగే ప్రతీ ఏడాది నవంబర్‌ రెండో వారానికి ముందు పిల్లల కోసం పోటీలు పెడుతున్నాం. ఈ పోటీల్లో రెండువేల మంది పిల్లలు పాల్గొంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఒక సంస్థను సేవాదృక్ఫథంతో నడపడం కష్టం. నిధులు కావాలి. అయితే మాకు అలాంటి ఇబ్బందులున్నా అధిగమిస్తున్నాము. రేడియో అన్నయ్య, అక్కయ్యల మీదున్న అభిమానంతో.. తలా ఒక చెయ్యి వేస్తున్నారు. అదే చాలు. ఇక సంస్థ అంటారా? ప్రతి తరానికి బాల్యం ఉంటుంది. కనక బాలానందమూ చిరకాలం వర్ధిల్లుతుంది..’’
‘‘మా ఇంట్లో ఎప్పుడూ పెళ్ళి వాతావరణముండేది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ బాలానందానికి చేరుకునేవారు. ఆహా.. ఆ రోజులు తల్చుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. బాలానందం ఏర్పాటు చేసే వేసవి శిక్షణా శిబిరాలు, పోటీల సమయంలో రేడియో అక్కయ్య, అన్నయ్యగార్లు వచ్చారనే వార్త విని వాళ్ళని చూడాలని తండోపతండాలుగా జనాలొచ్చేవారు. సినిమా స్టార్లకుండే ఫాలోయింగ్‌ వారి కుండేది..’’
 – నవ్య డెస్క్‌  
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు వచన శైలిపై రామతీర్ధ ప్రశ్నలకు నరసింహ మూర్తిగారి సమాధానం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షర ప్రపంచం లోకి అద్భుత యాత్ర-మృణాలిని

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

టివి ఆన్ న్యూస్ ప్రేసేన్తర్ బద్రి ప్రమాదం లో మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మినీ ద్విపద్స్-1

 మినీ  ద్విపద్స్-1

1-బుల్లి తెరపై చిరునవ్వు  ‘’సుమ ‘’

 మినీ మాక్సి రోడ్లపైపరిగెత్తే  ‘’సుమో ‘’.

2-యాంకర్ ‘’ఝాన్సీ’’

 ఏదైనా చేస్తుంది  ‘’ఫాన్సీ’’

3- మాటల మోడీ

  మోళీ ,గారడీ .

4- సి ఏం బాబు

 దర్పం తో ‘’డాబు ‘’

5-కేజ్రీ క్రేజీ చీపురు

 ఊడ్చేసిన  మోడీ చీపురు.

6-లేడీ లయన్’’ బేడీ’’

మోడీ ప్రోగ్రెస్ కు  ‘’బేడీ ‘’.

7-బీహార్ ‘సియం మా౦ఘీ

 వ్యూహం బెడిసి’ మాజీ ‘’.

8-ఆశల్లో ‘’నితీష్’’

నిరాశ లో ‘’అమితాష్  ‘’

9-ఉద్యోగుల ప్రోగ్రెస్’’ నిల్’’

 చంద్ర ది మాత్రం ‘’ఫుల్?’’

10-వాస్తు పిచ్చలో గులాబీ నాయన

 కుర్చీ  పై భయమే!నాయనా ?

11-ఉయ్యూరు రోడ్ క్వీన్’’ ‘’టు ట్వెంటీ టు ‘’

   కలెక్షన్ లో ఫోర్ ట్వెంటీ –ట్రూ ‘’

12-పామర్రు రోడ్డు’’ కింగ్ ‘’మూడు మూళ్లు’’

    బాగ్ నిండా చేరే  భారీ వసూళ్లు .

మీ-  గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-15- ఉయ్యూరు 

 

Posted in కవితలు | Tagged | Leave a comment