పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం

పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం
 
‘భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు’ అన్నాడు ప్రజాకవి వేమన. ఈ అద్భుతమైన పద్యభావాన్ని చాలా మంది ఈ చెవితో విని…. ఆ చెవిలో వదిలేశారు. కానీ… తుంగ సోమేశ్వరమ్మ మాత్రం ఈ అక్షర సత్యాన్ని ‘అరచేతులారా’ భక్తితో ఆచరిస్తోంది. దశాబ్ద కాలంగా ప్రజాకవి యోగి వేమన సమాధి వద్ద నిత్యదీపారాధనలో… భక్తుల సేవలో తరిస్తోంది. అనంతపురం జిల్లా కదిరి తాలూకా గాండ్లపెంట మండలం కఠారు పల్లిలో ఉన్న వేమన జీవసమాధి వద్ద సోమేశ్వరమ్మ ప్రస్తుతం మహిళా అర్చకురాలిగా అంకితమైంది…
‘‘దాదాపు 150 ఏళ్ల క్రితం వేమన రాయలసీమ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారని మా పూర్వీకులు చెబుతారు. ఊరూరూ తిరుగుతూ మూఢాచారాలు, కుటుంబ విలువలు, విగ్రహారాధన, కులతత్వం వంటి అంశాలపై ప్రజలను తన పద్యాల ద్వారా చైతన్యపరిచారు ఆ మహానుభావుడు. ఎక్కడికి వెళ్లినా సందర్బానుసారంగా ఆశువుగా పద్యాలు చెప్పి అందరినీ మెప్పించిన వేమారెడ్డి (వేమన) గారి వంశంలో పుట్టడం మా అదృష్టం. ఈ తరంలో వసంతరెడ్డి, వేమారెడ్డి, చండ్రాయుడు, వేమారెడ్డి, నాగిరెడ్డి, అయ్యవారు మొదలైన మూడు కుటుంబాలకు చెందినవారు ప్రధానంగా ఉన్నారు. నా భర్తపేరు వేమారెడ్డి. మాకు సంతానం లేదు. వేమన సమాధికి సమీపంలోనే ఉంది మా ఇల్లు. ఆలయంలోనే పూజలు చేస్తూ, భక్తులకు వేమన తత్త్వాన్ని చెబుతూ కాలం గడుపుతున్నాను. స్వామి సన్నిధిలో సేవలందిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.
పౌర్ణమి నుంచీ.. పౌర్ణమి వరకు..
మా మూడు కుటుంబాల్లోని వాళ్లందరం వంతులవారిగా వేమన సమాధి వద్ద పూజలు చేస్తాం. పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు మేము అర్చన చేస్తే… ఆ తర్వాత ఇంకో కుటుంబం వారు చేస్తారు. తరతరాలుగా ఈ ఆచారం ఇలాగే కొనసాగుతోంది. మేమందరం సఖ్యతగా ఉంటూ ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. వేమన ఉత్సవాలు మాకు పెద్ద పండగ కన్నా ఎక్కువ. అందుకే అత్యంత నియమనిష్ఠలతో నిత్యం పూజలు చేస్తాం. వేమన చరిత్రను తెలిపే ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాం. ఈ ఉత్సవాలకు నెల్లూరు, గుంటూరు, కడప, కర్ణాటక, చింతామణి, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తారు. ఉత్సవాలలో మహా కుంభాభిషేకం ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఆదివారం మాంసం వండి సమాధి వద్ద కొలువు చేస్తాం. ఇది మా సంప్రదాయం. ప్రతీ ఉదయం మంగళవాయిద్యాలతో స్వామిని కీర్తిస్తూ కీర్తనలు, పద్యాలు పాడతాం. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచి పెడతాం.
నిత్య దీపారాధన.. పవిత్రంగా పూజలు..
రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి స్నానాదులు ముగించి దీపారాధన చేస్తాను. ప్రత్యేక అర్చనలు చేసి.. గ్రామస్తులు, సందర్శకులకు తీర్థప్రసాదాలు అందజేస్తాను. ఇవన్నీ చాలా పవిత్రంగా జరిగే పూజా కార్యక్రమాలు. ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుతాను. నా భర్త గుర్రాలకు కడుపునిండా దాణా పెట్టి ఆలయానికి వస్తాడు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్లి వంటపనులుపూర్తీ చేస్తాను. ఉదయం నుంచీ సాయంత్రం దాకా గుడి పక్కనే టెంకాయ, తాంబూలాలు, వేమన సాహిత్య పుస్తకాలను విక్రయిస్తాం. వీటితో పాటు హారతి పళ్లెంలో భక్తులు వేసిన కానుకలే మాకు జీవనాధారం.
వేమన నడయాడిన నేలపై నిత్య కరువు..
గొప్ప దార్శనికుడుగా పేరుగాంచిన వేమన నడయాడిన నేల ఇప్పుడు భయంకరమైన కరువుతో తల్లడిల్లిపోతోంది. ఆ మహానుభావుడి సమాధి వద్ద.. ఆలయ ప్రాంగణంలో కనీసం తాగడానికి మంచినీళ్లూ కూడా దొరకవు. బోర్లన్నీ ఎండిపోయాయి. వానలులేక వ్యవసాయ భూములన్నీ బీళ్లుగా మారాయి. మాకు కొంత సేద్యం భూమి ఉంది. గతంలో కొంత పంట పండేది. కొన్నేళ్లుగా అదీ లేదు. ఇప్పుడు నాకూ, నా భర్తకూ ఆలయంలోని చిరువ్యాపారంతోనే జీవనోపాధి.
భక్తుల ఆకలి తీరుస్తున్నాం..
కఠారుపల్లెకు వచ్చే పేద భక్తులకు మా ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తున్నాము. మేం వండుకున్న దాంట్లోనే వారికీ పెడతాం. భక్తుల ఆకలి తీర్చడంలో చాలా సంతృప్తి ఉంటుంది. మాకు పిల్లలు లేరన్న బాధను మరచిపోవడానికే భక్తులకు, పేద పిల్లలకు వంటలు వండి పెడుతున్నాను. ఆలయ ప్రాంగణంలోని గర్భగుడిని తరతరాలుగా పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్నాం. చారిత్రక ఆనవాలు దెబ్బతినకుండా సహజత్వానికి భంగం కలగకుండా సమాధిని, పరిసరాల్ని రక్షించుకుంటున్నాం. అందుకే ప్రభుత్వం అడిగినా గర్భగుడిని పర్యాటక శాఖకు అప్పగించలేదు. ఆలయం బయటి ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయడం ఆనందంగా ఉంది. క్యాంటీన్‌, కాటేజీలు, పార్కు, రెస్టారెంట్‌, ఇలా మంచి వసతులు కల్పించారు. కానీ ఆలయంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ఆలయంలో కళ్యాణకట్ట, వంటగది నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
వేమన జీవితాన్ని వివరిస్తున్నా…
వేమన పూర్వాశ్రమంలో అల్లరిచిల్లరిగా తిరిగినా.. ఆ తర్వాత జ్ఞానబోధ పొందిన తర్వాత ఇహాపర సుఖాలపట్ల విరక్తి చెందాడు. మానవులకు అసలైన జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచడం కోసం ఎన్నో ప్రాంతాల్లో పర్యటించారు. అలా రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం ఆయనకు బాగా నచ్చినందున కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అణువణువూ ఆయనకు తెలుసునని చాలా మంది పెద్దలు చెబుతారు. వేమన వంటి మహాతాత్త్వికుడు అనంతలో జీవసమాధి పొందడం ఈ ప్రాంతవాసులుగా మేం చేసుకున్న అదృష్టం. అందులోనూ వారి వంశస్తురాలినైనందుకు నా జన్మధన్యమైందని భావిస్తున్నాను. నాకన్నా ముందు ఇక్కడ ఒక అవ్వ పూజలు చేసేది. కొన్నేళ్ల క్రితం ఆమె చనిపోయింది. అందుకే వేమన జీవితసారాన్ని, భావజాలాన్ని పుస్తకాల ద్వారా చదివి, మా పూర్వీకుల ద్వారా విని… ఆ…. విశేషాలను సందర్శకులకు నాకు తెలిసిన మేరకు వివరిస్తున్నాను. భవిష్యత్తులో కఠారుపల్లె ప్రపంచ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని నా నమ్మకం. ఇదే నా ఆకాంక్ష కూడా!
వేమన పూర్వాశ్రమంలో అల్లరిచిల్లరిగా తిరిగినా.. ఆ తర్వాత జ్ఞానబోధ పొందిన తర్వాత ఇహాపర సుఖాలపట్ల విరక్తి చెందాడు. మానవులకు అసలైన జ్ఞానాన్ని, ఆనందాన్ని పంచడం కోసం ఎన్నో ప్రాంతాల్లో పర్యటించారు. అలా రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం ఆయనకు బాగా నచ్చినందున కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అణువణువూ ఆయనకు తెలుసునని చాలా మంది పెద్దలు చెబుతారు. వేమన వంటి మహాతాత్త్వికుడు అనంతలో జీవసమాధి పొందడం ఈ ప్రాంతవాసులుగా మేం చేసుకున్న అదృష్టం. అందులోనూ వారి వంశస్తురాలినైనందుకు నా జన్మధన్యమైందని భావిస్తున్నాను.
డాక్టర్‌ ఉద్దండం చంద్రశేఖర్‌, అనంతపురం
ఫోటోలు : అమరనాథ్‌, గాండ్లపెంట
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ కవితాప్రసాద్ కు ‘’కవితాంజలి ‘’

 స్వర్గీయ కవితాప్రసాద్ కు  ‘’కవితాంజలి ‘’

మధురకవితా ప్రసాదీయం –గబ్బిట దుర్గాప్రసాద్

బందరు కవుల చేత ,గుంటూరు కులపతుల చేత  కనకాభిషేకాలు పొంది

ప్రధమ చతుర్ధ ప్రపంచ తెలుగు సభా నిర్వహణ సామర్ధ్యం చూపి

స్వర్ణ కంకణ ధారియై  ,భువన విజయ ‘’రాయలై’’

ఆశుకవితా ఝరి పారించి రసప్లావిత మొనర్చి

అవ్యవధాన అవధాన విద్యలోసాటిలేని మేటియై ,ధారణా బ్రహ్మయై

నవరసావదాన ,సాహిత్య ప్రక్రియావదాన మార్గ దర్శియై

‘’గ్రంధ ముఖి ‘’(ఫేస్ బుక్ )లో లక్ష పద్యార్చనం చేసి

‘’రసవదమృత పద్య రాజీవ బృందమ్ము –బ్రాహ్మికి కావ్య శిరస్సు లిడగ

‘’పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞా మహాయజ్న వేదికి –దివ్య హవిస్సులిచ్చి ‘

‘’ భూమాత హృదయమ్ము పూర్ణ కుంభమై-శ్రీంకార శబ్ద రోచిస్సు లివ్వగా ‘’

ద్విశతావధానం తో బాటు శతాధిక గ్రంధ రచన చేసి

‘’పలకరిస్తే పద్యం’’ తో ఆంధ్రావనిని పులకరింప జేసి

యువతకు అవధాన ప్రక్రియలో స్పూర్తిగా నిలిచి

శ్రీకాదంబినీ మాత’’ వర ప్రసాద రాజమై’’

కలియుగ సార్వ భౌముడు సప్త గిరి ధామునికి

భక్తీ తన్మయత్వం తో ఆత్మ నివేదన చేసి

సాంస్కృతిక శాఖకే వన్నె తెచ్చి

విభజన భజనలో తెలంగణ పాలై

‘’దొర ‘’పెత్తనానికీ ,’’బాస్ ‘’దాస్తీకానికీ బలై ,అనారోగ్యం పాలై

కమ్మని తెలుగు నేలకు ,ఆప్యాయతకు దూరమై

మానసిక క్షోభ ,అవమానం ,పెత్తనాలకు నీరుగారి

దివిజ కవి వరుల గుండియల్ డిగ్గురనగ

దివికేగిన  ‘’పెదబాబు ‘’ద్రువతార

మహాకవి –మధురమంజుల రవి

రసమయ కవితా శకటం కవితా ప్రసాద్ కు

కవితాంజలి ఘటిస్తున్నా –వినమ్రంగా .

గబ్బిట దుర్గాప్రసాద్ -2-4-15 –ఉయ్యూరు

 

 

 

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -94 త్రుటిలో తప్పిన —

నా దారి తీరు -94

త్రుటిలో తప్పిన —

నేను ఒకసారి ఉయ్యూరు నుంచి బయల్దేరి మంగళాపురం వస్తున్నాను .లక్ష్మీపురం ఉదయం తోమ్మిది౦తటి కే చేరుకొన్నాను .అక్కడి నుండి మంగళాపురం రావటానికి ఏమీ దొరకలేదు .కంగారుగా ఉంది. టైం కు స్కూల్ కు కు చేరకపోతే మాటపడాల్సివస్తుందని టెన్షన్ టెన్షన్ .గుండె మహా వేగం గా కొట్టుకొంటోంది .ఎమీపాలుపోవటం లేదు .ఇంతలో ఒక చిన్నకారు నా దగ్గరకు వచ్చి ఆగింది .డోర్  తీసి అందులోని పెద్దమనిషి ‘’నమస్తే హెడ్మాస్టారు .మీకు అభ్యంతరం లేకపోతే మాకారులో వెళ్దాం రండి ‘’అన్నారు అంతకు ముందెప్పుడూ నేను ఆయన్ను చూడలేదు .రక్షించావురా దేవుడా అనుకోని కారు ఎక్కాను .స్కూల్ దగ్గరే నన్ను దింపి వెళ్ళిపోయారు .అప్పుడే మొదటిగంట కొడుతున్నారు అంటే పావుతక్కువ పది అన్నమాట హమ్మయ్య అనుకొన్నాను .అసెంబ్లీ జరుగుపుతున్నాను .ఇంతలో  జీప్ శబ్దం వినబడింది .ఎవరా అని చూస్తె ‘’జిల్లా పరిషత్ లో మా మొగుడు ‘’అంటే పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ .మా జుట్టు అంతా ఆయన చేతిలోనే ఉంటుంది .ఆయన పేరు ‘’పరమ హంస ‘’కాని అప్పటికే ఆయనకు ‘’పరమ హింస ‘’అని పేరొచ్చింది .అందర్నీ ఇరికించి బాధపెడతాడని పుకారు .సరే గేట్ దాకా వెళ్లి ఆయన్ను ఆహ్వానించి నా కుర్చీలో కూచోబెట్టాను .పై అధికారివస్తే హెడ్ మాస్టర్ కుర్చీలో కూచోవటం ఒక ఆచారంగా వస్తోంది .హాజరు పట్టీ తెప్పించి సంతకాలు వెరిఫై చేశాడు .సైన్స్ మాస్టర్ పాల్ ఇంకా రాలేదు. సాకు దొరికింది ఆయనకు .రోజూ పాల్ లేట్ గా వస్తాడా అని అడిగాడు .లేదు అని టైం కే వస్తాడని కొంచెం ‘’కలర్’’ ఇచ్చాను .ఆయన సెలవు ముందే చెప్పి పెడతాడా అని రెండోప్రశ్న.అవునని నా సమాధానం .పాఠాలు బాగా చెబుతాడా అని మరొ బాణం .నేచురల్ సైన్స్ చెబుతాడని నా సమాధానం .ఫిజికల్ సైన్సు ఇంగ్లీషు నేనే చెబుతున్నానన్నాను .సంతోషించినట్లు మొహం కనిపించింది .టీచింగ్ నోట్స్ రాస్తాడా అంటే రాస్తాడని నేను’’ పూత ‘’.మీకు సహకరిస్తాడా అని అడిగితె ఇంచార్జ్ గా ఆయన సహకారం బాగా ఉంటుందని నా సమాధానం .మిగతా విషయాలన్నీ గుమాస్తా చూశాడు .పాల్ తప్ప అందరూ సమయానికి రావటం లెసన్ ప్లాన్లు అన్నీ వారం వారం నేను చెక్ చేసి సంతకం పెట్టటం అన్నీ హంసగారు గమనించారు .లాగ్ బుక్ విజిటర్స్ బుక్ కూడా చూపించాను రికార్డ్స్ అన్నీ పెర్ఫెక్ట్ గా ఉన్నాయని సంతృప్తి పొందాడు .పాల్ కు ఆబ్సేంట్ మార్క్ చేసి సాయంత్రం తనను ఆఫీసులో కలుసుకోమని చెప్పమని జీపెక్కి తుర్రు మన్నాడు ఆఫీసర్ హంస .నన్ను లక్ష్మీపురం లో ఆయనెవరో దేవుడిలాగా వచ్చి కారు ఎక్కించుకు రాకపోతే నా పని గోవిందో హారి .గొప్ప ప్రమాదం తప్పించాడు భగవంతుడు .

పాల్ వచ్చాడు .సారీ చెప్పాడు .ఆఫీసర్ చెప్పమన్నది చెప్పాను వణికాడు. మనిషి మినీ ఎస్వీ రంగా రావు లాగా ఉంటాడు. కాని భయపడ్డాడు .’’సార్ !నాకు ఇది కొత్త .ఆయనతో మాట్లాడటం భయం గా ఉంది .నాతొ పాటు మీరుకూడా వచ్చి నన్ను కాపాడాలి ‘’అన్నాడు .సరే నని ఆయన స్కూటర్ మీదనే సాయంత్రం స్కూల్ అయినాక ఇద్దరం జిల్లాపరిషత్ ఆఫీస్ కు వెళ్లాం .పరమహంసను కలిశాం .ముందు ఫైర్ అయ్యాడు .నెమ్మదిగా మాట్లాడి కూల్ చేశా .కొంత దిగాడు .అప్పుడు అసలు విషయం చెప్పాడు .’’మీ స్కూల్ లో పాల్ గురించి లెక్కల మేష్టారు గురించీ రోజూ ఆకాశ రామన్న ఉత్తరాలు వస్తున్నాయిచాలా రోజులుగా .అందుకని ఎంక్వైరీ కి వచ్చాను అన్నాడు .వాళ్ళు రాసినదేమీ నాకు అక్కడ కనిపించలేదు .స్కూల్ బాగా రన్ అవుతోందనే సంతృప్తి కలిగింది ‘’ అని నాతొ చెప్పి పాల్ ను ‘’నీ ప్రవర్తన మార్చుకో .మళ్ళీ కంప్లైంట్ వస్తే యాక్షన్ తీవ్రం గా ఉంటుంది ‘’అని హెచ్చరించాడు .అప్పటి నుంచి పాల్ పిల్లి అయ్యాడు భేషజం చూపించలేదు. నేను ఆయన్ను రక్షించాననే క్రుతజ్ఞతలో ఉండి పని చేశాడు ..వత్సవాయిలోస్కూల్ వదిలి ఇంటికి వచ్చేలోపు  అకస్మాత్తుగా డి ఇ వొ రావటం, ఇప్పుడు మంగళాపురం లో  హంసగారి విజిట్ లో నేను సమయానికి స్కూల్ లో ఉండటం దైవం కాపాడిన ఘటనలే నని నమ్ముతాను లేకపోతె సర్వీస్ రిజిస్టర్ లో యెర్ర ఎంట్రీ పడేది .

ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మా సూల్ మీద హంసగారి నిఘా కనపడింది .ఒకసారి ఏదో సందర్భం గా సెలవు ప్రకటించాను .అది ఆయన  దృష్టి కి వెళ్లి నోటీస్ పంపటం జరిగింది. నేను ముందే పర్మిషన్ కోసం ఆయనకు రాశాను కాబట్టి సరిపోయింది .ప్రయర్ పర్మిషన్ లేకుండా సెలవు డిక్లేర్ చేయకూడదని ఒక సలహా పారేశాడు .సరేనన్నా.పాల్ గారికేసు రెండు నెలల దాకా నలుగుతూనే ఉంది .చివరికి ఏదో కొంత చేతులు తడిపి పాల్ బయట పడ్డ జ్ఞాపకం .

మా వివాహ రజతోత్సవం

మా వివాహమై 25 ఏళ్ళు అయింది .నేను మొదటిసారిగా మోపిదేవి హైస్కూల్ లో నా ఉద్యోగ జీవితాన్ని 1963లో ప్రారంభించాను .1964 ఫిబ్రవరి 21.అందుకని మా శ్రీమతిని ముందు రోజుకే మంగళా పురం రమ్మన్నాను .వచ్చింది పిల్లలూ వచ్చారు .21 ఉదయం మేమిద్దరం మోపిదేవి వెళ్లి శ్రీ సుబ్రహ్మణ్యీశ్వర స్వామి దర్శనం చేసుకోచ్చాం .సాయంత్రం ఇంటి దగ్గర చేసిన స్వీటు హాటూ గారెలు పులిహోర ,పాయసం  ఆవడలు తో స్కూల్ స్టాఫ్ కు బ్రహ్మాండమైన విందు ఇచ్చాను .అప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు.అందరూ ఆశ్చర్య పోయి అభినందించారు .ఇది ఒక కొత్త వరవడిని సృష్టించింది .అ తర్వాత డ్రాయింగ్ మేష్టారు పాండురంగా చార్యులగారు కూడా ఏదో సందర్భం గా గ్రాండ్ పార్టీ చేశారు . తర్వాత మరికొందరు టీచర్లు చేసి ఉత్సాహ వాతావరణాన్ని కలిగించారు .

అప్పటికే నన్ను టెన్త్ పిల్లలు అక్కడే ఉండి ట్యూషన్ చెప్పమని వొత్తిడి చేశారు .ఎలాగూ గది తీసుకొన్నాను కనుక ఉన్న సమయం లో చెబుతానని చెప్పి ప్రారంభించా .చండ్ర ఉమా ,చండ్ర శిరీష ,మాలెంపాటి వెంకటేశ్వరరావు ,లు చేరారు అందులో ఉమా చాలా చురుకైన తెలివైన పిళ్ళ .వెంకటేశ్వరరావు మా అమ్మాయికి దగ్గర బంధువు మంచికుర్రాడు .ఒక తొమ్మిదో తరగతి అమ్మాయి కూడా చేరింది .డబ్బులేమి తీసుకొన్నానో జ్ఞాపకం లేదుకాని ఏదో కాలక్షేపం గా సాగుతోంది .సాయంత్రం అరున్నరనుంది రాత్రి తోమ్మిదివరకు ఉదయం ఆరున్నర నుండి తొమ్మిది వరకు నేను ఉండే రోజుల్లో చెప్పేవాడిని .లెక్కలు,ఫిజికల్ ససిన్స్ ఇంగ్లీష్ పై ఎక్కువ శ్రద్ధ  చూపేవాడిని .ఒకసారి ఏదో పనిమీద బందరు వెళ్లి మాజీ హెడ్ మాస్టారు జోశ్యుల గారింటికి వెళ్లి పలకరించాను .దంపతులిద్దరూ నన్ను గౌరవం గా ఆదరించారు .అక్కడినుంచి మా పిచ్చాలక్కయ్య వాళ్ళింటికి అంటే వారణాసి వారింటికి వెళ్లి చూసి వచ్చాను .స్పాట్ వాల్యుయేషన్ కు కాని పదవ తరగతి పరీక్షలకు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా కాని వేస్తె పిచ్చాలక్కయ్య వాళ్ళింట్లోనే ఉండేవాడిని. స్వంత తమ్ముడిలాగా ఆదరించేది అక్కయ్య బావగారు కూడా అదే సౌజన్యం చూపేవారు .పిచ్చాలక్కయ్య అంటే మా రేపల్లె బాబాయి రాయప్రోలు శివరామ దీక్షితులుగారి పెద్దమ్మాయి .మా రెండోఅక్కయ్య దుర్గ కు సహాధ్యాయి .ఉయ్యూరులో  మా ఇళ్ళలో కార్య కరామతులకు  ఎప్పుడూ వస్తూండేవారు .పిచ్చాలు, బాల,సీత అక్క చెల్లెళ్ళు ,బాల , సీత గుంటూరు లో ఉంటారు .అన్నయ్యా అన్నయ్యా అంటూ  మహా ఆప్యాయం గా ఉండేవారు .

స్కూల్ వార్షికోత్సవం

మంగళాపురం స్కూలు వార్షికోత్సవం అంతకు ముందెవరూ చేసినట్లు లేదు .నేను కొత్త సాంప్రదాయం ప్రవేశ పెట్టాలనుకొన్నాను స్టాఫ్ మీటింగ్ లో చెప్పి ఒప్పించాను .అసెంబ్లీలో చెప్పి పిల్లలకు తెలియ జేశాను .ఆటలలో పోటీలు వ్యాసరచన ,వక్తృత్వం   డ్రాయింగ్ ,లలో పోటీలు నిర్వహించాలని పై తరగతులలో ను కింది తరగతులలోనూ అన్నిటా ముందున్న ఉత్తమ విద్యార్ధులకు ,స్కూల్ పరీక్షలలో కన్సలిడేటేడ్ మార్కులను బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతిక్లాస్ లోను బహుమతులు ఇవ్వాలని నిర్ణయించాం .మరి దీనికి డబ్బు కావాలి .స్కూల్ ఫండ్స్ ఏమీ లేవు .అప్పుడు చండ్రఉమా స్కూల్ పీపుల్ లీడర్ గా ఒక సలహా చెప్పింది .ఊర్లోకివిద్యార్ధులే  వెళ్లి విషయం చెప్పి చందాలు వసూలు చేసి ఇస్తామని అంది .అందరూ ఒప్పుకొన్నారు .స్టాఫ్ అంతా జీతాలను బట్టి చందాలు వేశారు .వసూలు చేశాం .ఉమా ఐడియా బాగా పని చేసింది .స్వచ్చందంగా తలిదండ్రులు ముందుకు వచ్చి వాళ్లకు డబ్బులు అందజేశారు .ప్రెస్ వాళ్ళు ఆహ్వాన పత్రికలూ ,సర్టిఫికెట్లు ఉచితంగా ప్రింట్ చేసి ఇస్తామన్నారు .ఇవన్నీ చక్కగా కుదిరాయి .ఊళ్ళో చండ్ర ప్రసాద్ గారు అనే పెద్ద భూస్వామి కుర్రాడు ఉన్నారు .ఆయన్ను ఆహ్వానించాం .లక్ష్మీపురం షుగర్ ఫాక్టరీ మేనేజర్ గారినీ పిలిచాం పిల్లలకు గేమ్స్ స్పోర్ట్స్ పోటీలు జరిపించం గొప్ప పండగ వాతావరణం ఏర్పడింది .అందరూ ఉత్సాహం గా పాల్గొన్నారు .ఎన్నడూ లేని ఐక్యత వచ్చింది .వార్షికోత్సవం పరమ వైభవం గా జరిగింది .విద్యార్ధులందరికీ స్వీటు హాటు పాకెట్స్ ఇచ్చాం స్టాఫ్ కు ఊరి పెద్దలకు  టీ పార్టీ ఇచ్చాం .పిల్లలందరికీ దాదాపు ఏదో ఒక బహుమతియో సర్టిఫికేట్తో వచ్చేట్లు చేయటం తో వారి ఉత్సాహానికి అంతే లేకపోయింది .ఈ  యానివర్సరి చరిత్రలో చిరస్థాయి గా నిలిచింది .

డ్రాయింగ్ మాస్టారు పదవీ విరమణ

డ్రాయింగ్ మాస్టారు పా౦డు రంగాచార్యులు గారు ఉత్తములు .గొప్ప సహాయ కారి .సేక్రేటరిగా సమర్ధం గా పని చేశారు అందరి తోనూ సంప్రదించి చక్కని నిర్ణయాలు చేసేవారు .ఒకే కుటుంబ భావన కలిగించారు .ఆయన పదవీ విరమణ అందరికి బాధ కలిగించింది ఘన సన్మానంవీడ్కోలూ  చేశాం  నేను ఆయన మీద ఒక కవిత రాసి చదివానుకూడా .తెలుగు మేష్టారు కూడా పద్యాలు రాశారు ఆయనా అంతే గొప్పగా ఇంటి దగ్గరే  అన్నీ వండించుకొని వచ్చి గొప్ప పార్టీ ఇచ్చారు .ఒకటి రెండుసార్లు సాయంత్రం స్కూల్ అవగానే తనతో పెదకల్లెపల్లికి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లి భార్య చేత గారెలు వండించి టిఫిన్ పెట్టించేవారు అక్కడినుండి దేవాలయానికి తీసుకొని వెళ్లి దర్శనం చేయంచి బెజవాడ బస్ ఎక్కించేవారు .చాలా గౌరవం ,మర్యాదా ఉన్న పెద్దమనిషి .రిటైర్ అయిన రెండేళ్ళ లోపే చనిపోయారని తెలిసి విచారించాను .

తెలుగు మేష్టారు ముదిగొండ మల్లికార్జున రావు ఆరాధ్యులు .ఒక సారి సాహితీ మండలి  సమావేశం మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో జరిగితే వచ్చి మంచి సాహిత్యోపన్యాసమిచ్చారు .ఆయన పాండిత్యానికి అందరం అబ్బురపద్దాం .ఆయాసం తోనే అతగోప్పగా మాట్లాడారు .ఇన్ షర్ట్ వేసేవాడేప్పుడూ .వేసవికాలం లో గుంటూరు వెళ్లి అక్కడే అకస్మాత్తుగా చనిపోయినట్లు తెలిసింది .

రంగా యాజిటేషన్

వంగవీటి మోహన రంగా నిరాహార దీక్ష బెజవాడలో చేస్తుంటే ఏంటి రామారావు ముఖ్యమంత్రిగా ఉండి పోలీసులతో దీక్ష భగ్నం చేయించాడని ,రంగా మరణం తో అట్టుడికిపోయిన కాపులు కోపావేశం తో కమ్మవారి ఆస్తులన్నీ ధ్వంసం చేయటం దానికి ప్రతిగా కాపుల ఆస్తుల్ని వీరు ధ్వంసం చేయటం రాష్ట్రం లో ముఖ్యం గా కృష్ణా జిల్లాలో గొప్ప విపత్కర పరిస్తితిని తెచ్చింది .స్కూళ్ళు కాలేజీలు మూత పడ్డాయి. సెలవులు పొడిగించారు .కమ్యూనికేషన్ కూడా లేదు .ఒక సారి రివోపెనింగ్ కు బస్సులు లేక నేను నా లూనా మీద ఉయ్యూరు నుండి మంగళాపురం వెళ్లాను .పేపర్ చూసిన వారందరూ వచ్చారు .కాని ఎన్ డి ఎస్ అర్జునరావు మాత్రం హైదరాబాద్ లో చిక్కుకు పోయి రాలేదు .మర్నాడు బడికి వచ్చాడు .ఇప్పుడు ఏం చేయాలి ?అన్నది పెద్ద సమస్య రివోపెనింగ్ రోజున రాకపోతే సెలవులన్నీ జీతనస్టమై జీతం రాదు ,ఆయన వచ్చి బిక్క మొహం తో కూర్చున్నాడు. సంతకం పెట్ట నివ్వలేదు. డియి వొ  నుంచి పర్మిషన్ తెచ్చుకొంటేనే హాజరు లో సంతకం చేయాలి .అందరం తలలు పట్టుకు కూర్చున్నాం .డియి వొ ఆఫీసు కూదాకాలి బూదిదయింది .రికార్డులు ఏవీలేవు ఆధారానికి .దీన్లోంచి ఎలా బయటపడాలి .స్టాఫ్ మీటింగ్ వేసి అందర్నీ సంప్రదించాను .ఒకరిద్దరు ఆయనకు వ్యతిరేకం గా మాట్లాడారు .ఆ ఇద్దరినీ విడిగా పిలిచి నేను వారితో మాట్లాడాను ‘’ఇప్పటిదాకా స్కూల్ లో మంచి ఐక్యత కాపాడుకోన్నాం .మనం అందరం ఒకటిగా ఉంటె ఎవరూ మనల్ని ఏమీ చెయ్యలేరు .ఆయన ఏడుస్తున్నాడు .ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం .లీవ్ అదీ సాంక్షన్ కావాలంటే ఎంతోకాలం పడుతుంది.రికార్డులే తగలబడ్డాయి .జీతం రాకపోతే ఎవరికైనా ఇబ్బందేకదా మీరుకూడా సరే నంటే నిన్ననే ఆయన మనతో బాటు స్కూల్ కు వచ్చినట్లు సంతకం పెట్టిస్తాను ‘’అని నచ్చ చెప్పాను వాళ్ళిద్దరూ కూడా మెత్తబడి చివరికి ఆయనతో సంతకం చేయించటానికి అంగీకరించారు .అందరి సమక్షం లో అర్జున రావు తో ఆ కిందటి రోజు సంతకం చేయించాను .అందరూ కిమిన్నాస్తి .నన్ను అందరూ అభినందించారు .అర్జున రావు నాకాళ్ళమీద పడేంతగా కృతజ్ఞత మాటల్లో చేతల్లో చూపించాడు .హమ్మయ్య మళ్ళీ ఒక గండం గడిచి పిండం బయట పడిందని సంతృప్తి చెందాం .హెడ్ మాస్టారికి కొంత చాకచక్యం, కలుపుకు పోయే తత్త్వం ఉండాలని తెలిసింది .నావిజయ రహస్యం అదేనని పిస్తుంది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-4-15- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

కశ్మీర్‌ కష్టాలు!

కశ్మీర్‌ కష్టాలు!
కశ్మీర్‌లో వరదలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఏడునెలల క్రితం జరిగిన విధ్వంసం నుంచి ఆ రాష్ట్రం ఇంకా కోలుకోకముందే మరోమారు వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. గత అనుభవం వల్ల, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కారణంగా ఈ సారి మృతుల సంఖ్య పెద్దగా లేదు. గత వరదలతో పోలిస్తే తీవ్రత తక్కువ కావడం కూడా మరో కారణం. జీలం నది ఉధృతి తగ్గుతూండటం ఉపశమనాన్ని ఇస్తున్నా, బుధవారం నాటి కుంభవృష్ఠిని చూసినప్పుడు ప్రమాదం తొలగిపోలేదని అనిపిస్తున్నది. మరో మూడురోజుల పాటు వర్షాలు తప్పవనీ, అందులోనూ రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవని వాతావరణశాఖ చేసిన హెచ్చరిక ముప్పును తెలియచెబుతున్నది.
కశ్మీర్‌లో మార్చినెలలో ఇంతటి భారీ వర్షాలు కురవడం దాదాపు మూడుదశాబ్దాల తరువాత ఇదే మొదటిసారి. గతంలో మాదిరిగానే జీలం నది తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఆ నది పొడవునా ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అర్ధరాత్రి కమ్ముకొచ్చిన వరద వారిని భయపెట్టినా, గత అనుభవం దృష్ట్యా అధికశాతం ప్రజలు తమను తాము కాపాడుకోగలిగారు. కానీ, ఇళ్ళు కూలిపోయిన కారణంగా ప్రాణాలు పోతున్న వారి సంఖ్యే ఆందోళన కలిగిస్తున్నది. వరదలో కొట్టుకుపోయినవారు, ఆచూకీ తెలియనివారి లెక్కలు తేలడానికి సమయం పట్టవచ్చు. కొండచరియలు విరిగిపడి ఇళ్ళు ధ్వంసం కావడంతో పాటు, జమ్మూ నుంచి శ్రీనగర్‌ వరకు జాతీయ రహదారిమీద రాకపోకలు నిలిచిపోయి వందలాదిమంది ఇరుక్కుపోయారు. వరదనీరు నిలిచిపోయిన కారణాన కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి కశ్మీర్‌లో వరదల గురించి ఇంతగా విప్పిచెప్పడం ఇప్పుడు పీడీపీ నాయకులకు ఆగ్రహం కలిగిస్తున్నది. మీడియా ఈ బీభత్సాన్ని వర్ణించడం వల్ల కశ్మీర్‌కు నష్టమే తప్ప లాభం లేదంటున్నారు పీడీపీ ఎంపీ తారిఖ్‌ హమీద్‌. ఆయన వాదనలో వేదన లేకపోలేదు. మొన్నటి వరదల వల్ల మిగతా రంగాల్లో తప్పని నష్టంతో పాటు, మీడియా విస్తృత ప్రచారం కారణంగా కశ్మీర్‌ తన పర్యాటక ఆదాయాన్ని ఎన్నడూ లేనంతగా కోల్పోయింది. ఈ ఏడాది కాస్తోకూస్తో కూడదీసుకోవచ్చనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఉపద్రవం ముంచుకొచ్చి పర్యాటకులు పెద్దసంఖ్యలో ప్రయాణాలు రద్దుచేసుకుంటున్నారు. ఆదాయం దెబ్బతింటున్నదన్న ఆయన ఆవేదన అర్ధం చేసుకోదగినదే అయినప్పటికీ, అధికారంలో ఉన్న తాము కర్తవ్యాన్ని నెరవేర్చినదీ లేనిదీ ఓసారి ఆలోచించుకోవడం ముఖ్యం. వేసవి రాజధాని శ్రీనగర్‌లోనే రోజుల తరబడి వరద నీరు నిలిచిపోతున్నప్పుడు పర్యాటకుల రాకమీద దాని ప్రభావం ఉండకుండా పోదు. ఇటువంటి కుంభవృష్టికి దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాలే మునుగుతున్న మాట నిజమే కానీ, పర్యాటకులు రావాలనుకున్నప్పుడు దానికీ పరిష్కారాలు చూడక తప్పదు. ఏడునెలల క్రితం నాటి వరదలకు పూడుకుపోయిన డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటికీ శుభ్రపరచకుండా వదిలేసి, విమర్శలతో కాలయాపన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.
గత అనుభవం దృష్ట్యా ఇప్పుడు కూడా ప్రజలే తమ బాధలేవో పడుతున్నారు కానీ, వరద హెచ్చరికల దశ నుంచి ఆశ్రయం అందించే వరకూ అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. నిర్దిష్టమైన వ్యూహాలు, ప్రణాళికలు లేని తనం తెలిసిపోతూనే ఉంది. కశ్మీర్‌లోయను తరచూ ఇటువంటి ఉపద్రవాలు ముంచెత్తుతున్నప్పుడు సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకడం ముఖ్యం. వందేళ్ళ తరువాత మార్చినెలలో దేశం మొత్తంమీద అసాధారణ రీతిలో వర్షాలు కురిస్తే, కశ్మీర్‌లో ఇది మరింత అధికంగా ఉంది. పర్యాటకాభివృద్ధి పేరిట ఆ రాష్ట్రంలో ఎంతటి ప్రకృతి విధ్వంసం జరిగిందో తెలిసిందే. నదీ మార్గాలు, వరదనీటి మార్గాలు ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు నిలయమైపోయాయి. ఇటువంటి ప్రాంతాల్లో మరింత అధిక జాగ్రత్తలు తీసుకోవల్సింది పోయి, గతంలో పడిన గండ్లనే ఇంకా పూడ్చకుండా వదిలివేయడం దుర్మార్గం. వరదలు వచ్చినప్పుడు కనబరిచే ఆదుర్దా, హడావుడీ ఆ తరువాత ఉండవు. గత వరదల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమిని ముంచేసి అధికారంలోకి వచ్చిన పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే రీతిన చేష్టలుడిగి కూర్చుంది. ఈ ఏడునెలల కాలంలో అధికభాగం అధికారంలోకి రావడానికే సరిపోయింది.
వరదలను ప్రకృతివిపత్తుగా మాత్రమే చూసినప్పుడు రాష్ట్రాన్ని దాని ఖర్మానికి దాన్ని వదిలేయడమే అవుతుంది. కశ్మీర్‌లోయను వరద ప్రాంతంగా మార్చిన పరిస్థితులను చక్కదిద్దడంతోపాటు, ఇటువంటి సందర్భాల్లో సహాయక చర్యలను సత్వరమే అందించేవ్యవస్థలను ప్రత్యేకంగా శాశ్వత ప్రాతిపదికన సమకూర్చుకోవడం అవసరం. గత కాలపు వరదల్లో సామాన్యులతో పాటు సైన్యం కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంది. సైన్యం తప్ప ఆదుకోగలిగే వ్యవస్థంటూ అక్కడ లేదు. కేవలం విద్యుదుత్పత్తి కోసమే కాక, వరదల నివారణ కోసం కూడా డ్యాముల వంటివి నిర్మించడం వల్ల నష్టాన్ని తగ్గించగలం. గండం నుంచి గట్టెక్కిన ప్రతిసారీ ఊపిరిపీల్చుకుని కూర్చోకుండా భవిష్యత్తు గురించి కాస్తంతైనా ఆలోచించడం అవసరం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇంద్రభోగానికి అమరావతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు

ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు

                              1-భవిష్య వాణి రచయిత్రి –జోహన్నా  బ్రాంట్            

బాల్యం –విద్య –దేశ సేవ:

18-11-1876న దక్షిణాఫ్రికా లో ట్రాన్స్ వాల్  దగ్గర హీల్దేల్ బెర్గ్ లో  జన్మించిన జోహన్నా వాన్ వార్మెలో ఆఫ్రికా జాతీయతను ,దక్షిణాఫ్రికా ప్రచారాన్ని చేస్తూ ,బోయర్ యుద్ధం లో గూఢచారిగా పని చేసిన సాహసురాలు .ఆరోగ్య విషయాలపై వివాదాస్పద రచనలు చేసి ,ప్రాఫేసీ కూడా రాసిన రచయిత్రి .తండ్రి నెదర్లాండ్ కు చెందిన డచ్ రిఫార్మేడ్ మినిస్టర్ .తల్లి పూర్వీకులు ఎప్పుడో దక్షిణాఫ్రికా వచ్చి స్తిర పడిపోయారు .  కేప్ టౌన్ లో యువ విద్యార్ధినుల కోసం ఏర్పడిన గుడ్ హాప్ సేమిటరి  స్కూల్ లో రెండేళ్ళు చదివింది .జోహన్నా జన్మించిన ఆరేళ్ళకే తండ్రి చనిపోగా తల్లితో యూరప్ లో ఆరునెలలు పర్య టించింది .1899లో రెండవ బోయర్ యుద్ధం ప్రారంభమైంది .సోదరులతోకలిసి సైనికులకు నర్స్ గా  సేవలు చేసింది .ట్రాన్స్ వాల్ రాజధాని ప్రిటోరియను బ్రిటన్ ఆక్రమించింది .అయినా బోయర్లు వెంటనే లొంగిపోకుండా పోరాడారు .దీర్ఘకాలం గొరిల్లా యుద్ధం కొనసాగింది . ప్రిటోరియాలో ఉంటున్న బ్రాంట్ బోయర్ కు న్యాయం జరగాలని  తీవ్రంగా  ప్రచారం చేసింది .బ్రిటిష్ అధికారులపై నిఘా కోసం మహిళా దళాన్ని ఏర్పరచి గూఢ చారి గా తన దేశానికి విలువైన సమాచారాలను అంద జేసింది .ఖైదు నుండి తిరిగి వచ్చిన వారికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది .రివ్యు ఆఫ్ రివ్యూస్ పేపర్ లో డబ్ల్యు .టి స్టేద్ అనే ఆయన ఐరీన్ కాన్సేన్త్రేటెడ్ కాంప్ లో ఖైదీల దీనస్తితిని గురించి రాస్తే క్రమంగా బ్రిటిష్ వారు చేస్తున్న బోయర్ యుద్ధంపై తీవ్ర అసంతృప్తి రగులోక్కోన్నది  .

 స్వంత ఇంట్లోనే పరాయితనం:

 యుద్ధం పూర్తీ అయిన తర్వాత జోహన్నా బ్రాంట్ తానె స్వయం గా ఐరీన్ కాంప్ గురించి సమగ్ర వివరాలతో’’పెట్టికోట్ కమాండో ‘’పేరున  పుస్తకం రాసింది .ఇందులో తానూ ,తన తల్లి బోయర్ యుద్ధం లోఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులను ,అవమానాలను రాసి ప్రపంచం దృష్టికి తెచ్చింది .పుస్తకాన్ని తల్లికి అంకితమిస్తూ ‘’నా కోరికలకు,ఆలోచనలకు  విరుద్ధం గా బ్రిటన్ చేస్తున్న అరాచకాలను ప్రజా దృష్టికి తీసుకు రావటానికి చేసిన ప్రయత్నం ఇది ‘’అన్నది .వీరి గృహమైన ‘’హార్మని ‘’బ్రిటిష్ సైనికులకు విడిదిగా మారిపోయింది .హన్సి అనిపిలువబడే జోహన్నా ను తల్లిని బ్రిటిష్ సైనికులు అపకారులుగా భావించలేదు .క్రమంగా వారిద్దరిని ఎవరితోనూ కలవనీకుండా ఎవరితోనూ మాట్లాడనీయకుండా ఆంక్షలు విధించారు .దీనితో నిస్సహాయం గా ఉండిపోవలసి వచ్చింది. తమ దేశ ప్రజలకు ఏ మాత్రమూ సాయపడలేక పోయారు తల్లీ ,కూతురు .

  బ్రిటిష్ సైన్యం లో ఉన్నతాధికారులు వీరింటి ప్రక్కనే కాంప్ లలో ఉన్నారు .వీరిద్దరిని అపాయం లేని వారుగా భావించ టానికి జోహన్నా  అక్కభర్త క్లోటే ఒకప్పుడు  బ్రిటిష్ వారికి దక్షిణాఫ్రికాలో ఏజెంట్ గా ఉండటమే కారణం .విక్టోరియా మహారాణి నుండి ‘’ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖేల్ అండ్ సెయింట్ జార్జ్ ‘’పురస్కారం పొందటం కూడా కొంత సాఫ్ట్ కార్నర్ గా పని చేసింది .ఈ సౌకర్యాన్ని తల్లీ కూతురు గొప్పగా కాష్ చేసుకొన్నారు .వారితో సఖ్యంగా ఉంటూసైనికుల ఆనుపానులు తెలుసుకొంటూ ,ఆయుధ సామగ్రి వివరాలు గమనిస్తూ అన్ని విషయాలను తమ దేశ సైనికులకు రహస్యం గా’’ నిమ్మ రసం ఇంకు ‘’తో పైకి కనిపించకుండా కాగితం పై రాసి చేరవేసేవారు. తమ దేశ భక్తిని ప్రదర్శించుకొనే వారు .1902 లో జోహన్నా లూయీ ఎర్నెస్ట్ బ్రాంట్ ను వివాహం చేసుకొనగానే అనేక దేశాల నాయకులు ప్రజలు  అసంఖ్యాకం గా  ఆమెకు అభినందన సందేశాలను  పంపి కృతజ్ఞతను ఆనందాన్ని తెలియ జేశారు .

 నేషనల్ వుమెన్ పార్టీ సెక్రెటరి: 

   మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో జోహన్నా దక్షిణాఫ్రికా జాతీయుద్యమం లో చురుకుగా పాల్గొన్నది .లెఫ్టి నెంట్ కల్నల్ మెనీ మార్తిజ్ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని దక్షిణాఫ్రికా కు స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు .కాని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తిరుగుబాటును పూర్తిగా అణచి వేసింది .ఆరు నెలల తర్వాత ‘నేషనల్ వుమెన్ పార్టీ ‘’ట్రాన్స్ వాల్ లో ఏర్పడింది .విప్లవ కారులను విడుదల చేయటం ,వారి కుటుంబాలను ఆదుకోవటం,నేషనల్ పార్టీకి అండగా నిలబడటం అనేవి వీరి ధ్యేయాలు .జోహాన్స్ బర్గ్ లో జరిగిన మొదటి పార్టీ సమావేశానికి జోహన్నా కార్య దర్శిగా పని చేసింది .

 ఆరోగ్య సూత్రాలపై రచనలు:

  సాధారణ ఆరోగ్య సమస్యలపై ఇరవై దాకా  కరపత్రాలను రాసి ప్రచురించింది జోహాన్నా .’’ద్రాక్ష వైద్యం ‘’ ఆమెకు అభిమానమైనది .అందుకే ‘’గ్రేప్ క్యూర్  అండ్ ఫాస్టింగ్ బుక్ ‘’రాసింది .తనకే వచ్చిన ‘’ స్టమక్ కేన్సర్ ‘’ను గ్రేప్ క్యూర్ ట్రీట్ మెంట్ తో పూర్తిగా నయం చేసుకొన్న తర్వాతే ఆ పుస్తకం రాసింది .దీన్ని మొదట బోధించిన వాడు’’లివ్ ఆన్ ఫ్రూట్ ‘’పుస్తక రచయిత దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్నార్డ్ ఎహ్రేట్ .చాలామంది గ్రేప్ క్యూర్ ను అసంబద్ధం అన్నారు .

 ప్రాఫేసీ రచన :

 జోహన్నా తల్లి ప్రిటోరియాలో  7-12-1917న మరణించిన రోజున  బ్రాంట్ కు కొన్ని విచిత్ర విశేష అనుభూతులు కలిగాయని తెలుసుకొని వాటిని అక్షర బద్ధం చేసింది . వీటిని ‘’ది మిలీనియం ‘’పేరుతొ 1918 లో ప్రచురించింది .మరొక మత గ్రంధం గా ‘’పార్టికల్స్ ఆర్ కమింగ్ హోమ్ మదర్ ‘’రాసి 1936 లో విడుదల చేసింది .దక్షిణాఫ్రికా భవిష్యత్తు గురించి చెప్పేది .వారి భవిష్యత్తు అంధకారమే అని చెప్పింది .దాదాపు పది పుస్తకాలు రాసింది .88 ఏళ్ళు జీవించి 1964 లో జోహన్నా బ్రాంట్ మరణించింది .ఆమెపేర దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2000 సంవత్సరం లో  1.30 రాండ్ ల విలువగల పోస్టల్ స్టాంప్  ను విడుదల చేసి బోయర్ యుద్ధం లో ఆమెచేసిన  సేవకు గుర్తింపు కల్గించి గౌరవించింది .

   2-లిప్ స్టిక్ ఆర్టిస్ట్ –సారా జేన్ బ్రిటేన్

దక్షిణాఫ్రికా రచయిత్రి ,లిప్ స్టిక్ ఆర్టిస్ట్ సారా జేన్ బ్రిటేన్1974 ఆగస్ట్ 31 న జోహాన్స్ బర్గ్ లో జన్మించింది .అక్కడే .బ్రియాన్ స్టన్ ప్రైమరీ స్కూల్ లోను ,రెడ్ హిల్ హైస్కూల్ లోను చదివింది .విట్స్ యూని వర్సిటి లో డ్రామా కోర్సు చదివి డ్రమాటిక్ ఆర్ట్ లో బి ఏ ఆనర్స్ డిగ్రీ 1996లో సాధించింది .తర్వాత కమ్యూనికేషన్ స్టడీ లో మాస్టర్ డిగ్రీ పొందింది .అప్లైడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్ లో2005లో పి హెచ్ డి .చేసింది .యూని వర్సిటి లో జాతీయ అస్తిత్వం ,హాస్యం లపై పరిశోధన చేసి దక్షిణాఫ్రికా హాస్యం ను ప్రత్యెక విషయంగా మాస్టర్స్ రిసెర్చ్ ‘రిపోర్ట్ తయారు చేసింది .’’మేడం అండ్ ఈవ్ కామిక్ స్ట్రిప్ ‘’పై ప్రత్యేక కృషి చేసింది .పి హెచ్ డి .పరిశోధనా వ్యాసంగా ‘’వన్ నేషన్ ,వన్ బీర్ ,ది మైధాలజి ఆఫ్ ది న్యు సౌత్ ఆఫ్రికా ఇన్  అడ్వర్ టైజ్ మెంట్ ‘’రాసి పేరు పొందింది .

  ఫ్రీలాన్స్ కమ్యూనికేషన్  స్ట్రాట జిస్ట్   గా పని  చేయటానికి  ముందు జర్నలిజం లో  అడ్వర్ టైజ్ మెంట్ లోనుపట్టు సాధించింది .స్థానిక అవమానాలపై రెండు యువ నవలలు ,మూడు నాన్ ఫిక్షన్ పుస్తకాలు రాసింది .’’నా జాతి  ఏది ?నా అస్తిత్వం ఎక్కడుంది ?అని తెలుసుకోవటానికే దక్షిణాఫ్రికాలో జనం పొందిన అవమానాలను సేకరించి గ్రంధస్తం చేశాను .ఈ అవమాన మచ్చలు నా జాతి సమస్త అస్తిత్వానికి దారి చూపుతుంది ‘’అని సారా తెలియ జేసింది .జాతీయతను తెలుసుకోవటానికి  ఈ అవమానం   పట్టకం (ప్రిజం )లాగా పని చేస్తుందని విశ్వసిం చింది .

వెబ్ సైట్ రచయిత్రి:

 మెయిల్ అండ్ గార్డియన్ న్యూస్ పేపర్ వారి ‘’థాట్ లీడర్ ‘’అనే వెబ్ సైట్ లో నిత్యం వార్తలు ,అభిప్రాయాలను సారా రాస్తుంది .ఆమె రాసిన విభాగాలలో ‘’హౌ నాట్ టు ఎమిగ్రేట్ ఇన్ ,షుడ్ ఐ స్టే ఆర్ షుడ్ ఐ గో ‘’,టు లివ్ ఇన్ ఆర్ లీవ్ సౌత్ ఆఫ్రికా ‘’వంటివి ఎన్నో ఉన్నాయి .ఈ వెబ్ సైట్ సంపాదకుడు ముందుమాట రాస్తూ సారా అనుభవించిన ప్రవాస జీవితానుభవాలు ,ఆమె వివాహ జీవితాన్నే విచ్చిన్నం చేశాయి  అని తెలియ జేశాడు .సారా నిర్మొహమాటం గా సూటిగా అభిప్రాయాలను తెలియ జేస్తుంది .ప్రవాస జీవితం కుటుంబాలను దూరం  చేసి  చేదునే మిగిల్చింది ఆమె కు .’’థాట్ లీడర్ ‘’బ్లాగ్ లో వీటిని ప్రత్యేకించి రాసి తన క్షోభను అందరితో పంచుకోన్నది .దీనికి  ‘’గోండ్వానాలాండ్ ‘’ అనే ప్రత్యేకమైన పేరు పెట్టుకొన్నది .

 లిప్ స్టిక్ ఆర్టిస్ట్:

  నగర దృశ్యాలను ,ఇతర విషయాలను ,నిశ్చలన దృశ్యాలను లిప్ స్టిక్ తో చిత్రించటం సారా బ్రిటేన్ ప్రత్యేకత .స్టాక్ మార్కెట్ యాడ్స్  గా ఆమె చిత్రించిన ఎలుగు బంటి ,కుక్కలు , పిల్లులు ,గుర్రాలు షార్క్ చేపలు ,మొసళ్ళు ,ఖడ్గ మృగాలు ఆమె లిప్ స్టిక్  పెయింటింగ్ లో జీవం పోసుకొంటాయి .,దీనికి ఆమెకు  ప్రేరణ నిచ్చింది దక్షిణాఫ్రికా సైన్స్ ఫిక్షన్ రచయిత రాసిన ‘’జూ సిటీ ‘’నవల . జంతు లక్షణాలను నగర జనులలో ప్రతిబింబించే ట్లు చేసింది .అందులో న్యునిస్ అనే జంతువు  తనను ఎక్కువగా ఆకర్షించింది అంటుంది సారా .సారా బ్రిటేన్ తన మొట్ట మొదటి లిప్ స్టిక్ ఆర్ట్ ఎక్సి బిషన్ ను ‘’పల్స్ ఆఫ్ ది సిటి ‘’పేరుతొ నిర్వహించింది.దీనిని 2012జూలై లో బ్రాం ఫార్టీన్  నగరం వేలో గాలరీలో లో ఏర్పాటు చేసింది .ఆమెకు ఉత్తేజం కలిగించినవాడు లాండ్ రోవర్ అనే మార్కెటింగ్ ఏజెంట్ .

   ‘’  ది వరష్ట్ యియర్స్ ఆఫ్ మై లైఫ్ సో ఫార్ ‘’అనే రచనకు 2010 లో సన్ లాం  సిల్వర్ ప్రైజ్ ఫర్ యూత్ లిటరేచర్ ‘’కు సారా పొందింది .మళ్ళీ అదే సంస్థ 2002లో ‘’వెల్కం టు ది మార్టిన్  టుద్ హాప్ ‘’ నవలకు సిల్వర్ ప్రైజ్ అందజేసి గౌరవించింది . ఆమె రచనలు జెర్మని మొదలైన భాషలలోకి అనువాదం పొందాయి .’’ది  ఆర్ట్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికన్ ఇన్సల్ట్ ‘’నవల జగత్ ప్రసిద్ధమైంది .

     –  గబ్బిట దుర్గాప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2

 

12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -3(చివరిభాగం )

వాక్సిన్

యాభై అయిదు వయసులో పాశ్చర్ చాలా ప్రసిద్ధ వ్యక్తీ అయ్యాడు .క్షణం తీరిక లేకుండా బిజీ అయ్యాడు .సాధించినవాటి గురించి ఎక్కువ ఆలోచించ రాదు అన్నది ఆయన సిద్ధాంతం .ఇంకా సాధించాల్సింది ఏంతో ఉన్నదన్న భావన తో శ్రమించేవాడు .ఇప్పుడు చూపు అంతా బాక్టీరియాలజీ మీదనే కేంద్రీకరించాడు .దీనికి కారణం గొర్రెలకు ఒక కొత్త ప్లేగు లాంటి జబ్బు వచ్చితుడిచుపెట్టుకు పోయాయి .వందలో ఇరవై ఈ వ్యాధికి గురై చనిపోయాయి .ఈ జబ్బును ‘’స్ప్లీనిక్ ఫీవర్ ‘’లేక యా౦త్రాక్స్అన్నారు .కొన్ని జిల్లాలలో చనిపోయిన గొర్రెల శాతం ముప్ఫై నుంచి నలభై దాకా ఉంది .దీనిపై అధ్యయనం చేయటానికి పాశ్చర్ ‘’చార్త్రేస్ ‘’కు వెళ్ళాడు .వ్యాధితో చనిపోయిన గొర్రెల కళేబరాలనుండి రక్తం తీసి గినియా పందులకు ,చిట్టెలుకలకు ఎక్కించాడు .,  మళ్ళీ దీనిపై వైద్య బృందం తీవ్రం గా విరుచుకుపడింది పాశ్చర్ మీద .పాశ్చర్ చేసిన ఈ ‘’జేర్మ్ ధీరీ ‘’ని వారు వ్యతిరేకించారు .మతాదిపతులూ వారికి వంతపాడారు .ఒక మినిస్టర్ గారు ఇంకొంచెం ముందుకు వెళ్లి పూర్వం ఈజిప్షియన్ లను శిక్షించటానికి భగవంతుడు ఇలాంటి ప్లేగు  వ్యాధినే కలిగించాడు అన్నాడు .దేనికీ చలించని పాశ్చర్ తానూ చేబట్టే ప్రక్రియలో రక్తం ఎక్కించబడిన జంతువులలో ‘’యాంటి బాడీస్ ‘’ఏర్పడి రోగకారక సూక్షం జీవులతో యుద్ద్ధం చేసి సంహరిస్తాయని చెప్పాడు .దీనిపై అనేక పరిశోధనలు చేశాడు .చివరికి ఒక కల్చర్ ను సాధించాడు .ఇందులో ఆ వ్యాధి కారకాలు చాలా స్వల్పం గా ఉండేట్లు రూపొందించాడు .ఇవి ఆజీవుల్ని చంపటానికి బదులు రక్షించటానికి తోడ్పడుతాయని రుజువు చేశాడు .ఈ వైరస్ ను ఒక వాక్సిన్ గా రూపొందించి గొర్రెల ప్లేగు వ్యాధికి గొప్ప మందు తయారు చేశానని ప్రకటించి తన లక్ష్యాన్ని నేర వేర్చుకొన్నాడు .

అరుదైన గౌరవం

1881లో ఈ సీరం ను యాన్త్రాక్స్ బారిన పడిన  25 గొర్రెలకు ఇంజెక్షన్ గా ఇచ్చాడు .అవన్నీ మళ్ళీ ఆరోగ్యాన్ని పొంది సజీవంగా నిలిచి వైద్య చరిత్రలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. పాశ్చర్ కల సాకారమైంది .పాశ్చర్ సాధించిన ఈ ఘన విజయం  సంపూర్ణమైనదేకాదు ,నవ్యాతి నవ్యమైనది .వైద్య చరిత్రనే తిరగ రాసిన అపూర్వ ఘట్టమై చరిత్రలో నిలిచి పోయింది .ఆయన్ను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు వచ్చి వీరాభిమానులై శిష్యులైపోయారు .ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ ఘన విజయాన్ని గుర్తించి ‘’లీజియన్ ఆఫ్ ఆనర్ ‘’ఇచ్చి సత్కరించింది .ఫ్రెంచ్ అకాడెమీ లో ఏర్పడిన ‘’ఇమ్మో ర్టల్ సిర్కిల్ ‘’కు ఎన్నికయ్యాడు .ఈ సిర్కిల్ పాశ్చర్ ను  ప్రముఖ రచయిత అలేక్సాండర్ ద్యూమాస్ ను సందర్శించమని కోరితే ద్యూమాస్ తానె వచ్చి పాశ్చర్ సందర్శనం చేస్తానని చెప్పి వచ్చాడు .పాశ్చర్ కు కృత్రిమ పొగడ్తలు మెచ్చులూ మేహర్బానీలు నచ్చవు .వీటికి సహజం గా దూరంగా నే ఉంటాడు.

హైడ్రోఫోబియాకు మందు

‘’సాధంచిన దానికి సంతృప్తిని చె౦దీ అదే విజయమనిఅనుకోకోయ్ ‘’అన్న శ్రీ శ్రీ పాటకు తగ్గట్లే పాశ్చర్ జీవిత విధానం ఉండేది .ఆనాడు అందర్నీ భయ పెట్టిన జబ్బు హైడ్రో ఫోబియా  .ఇది ఆంత్రాక్స్ కంటే ప్రమాదమై పోయింది .పిచ్చి కుక్క కరచిన వాడికి వారం రోజుల దాకా ఏ ప్రమాద లక్షణాలు కనిపించవు .ఆ తర్వాత లక్షణాలు బయటపడి దారుణం గా ఉంటాయి .స్థిరం గా ఉండలేక పోవటం ,ఊపిరి పీల్చలేకపోవటం లోపలి ఏదీ తీసుకోలేక పోవటం మింగుడు పడక పోవటం ,మూర్చ, అపస్మారకం మొదలైనవాటికి గురై చివరికి చనిపోవటం జరిగేది .దీనికి విరుగుడు కనిపెట్టాలనుకొన్నాడు పాశ్చర్ .ముందుగా రోగకారక క్రిమిని వేరు చేసి దానితో రోగ జీవుల్ని సమర్ధ వంతం గా చంపగలిగే కల్చర్ తయారు చేసే పనిలో పడ్డాడు . ఆయన దగ్గరకు రెండు పిచ్చి కుక్కల్ని తెప్పించాడు. వాటి పళ్ళను రంపాలతో కోయిన్చేశాడు .చాలా జాగ్రత్తగా తానె భయం లేకుండా మాలిమి చేసుకొన్నాడు . గినియా పందులకు కుందేల్లకుకు ఈ వ్యాధికారక  ‘’రేబిస్ ‘’ఇంజెక్షన్ ఇచ్చాడు .ఈ రేబిస్ వల్లనే పిచ్చికుక్క కరిచినపుడు విషం మానవ శరీరం లోకి ప్రవేశించి నీటి భయం అంటే హైడ్రో ఫోబియా ఏర్పడ్తుంది .పాశ్చర్ చేసిన సాహసాన్ని వర్ణించాడు ఒక బయాగ్రఫార్ ‘’ఒక రోజు పాశ్చర్ ఒక పిచ్చికుక్క నుంచి చొంగ (సలైవా )సేకరించే ప్రయత్నం లో ఉన్నాడు .ఇద్దరు  అసిస్టంట్ ల చేత ఒక పిచ్చెక్కిన బుల్ డాగ్ ను బాగా చొంగ కారుస్తుండగా బోనులో నుంచి బయటికి తీయించి ఒక టేబుల్ మీద దాన్ని పడుకో బెట్టించి తన పెదవులమధ్య  ఒక రబ్బరు గొట్టం కొనను ఉంచుకొని రెండవ కొనను ఆ పిచ్చి కుక్క మూతి దగ్గర పెట్టి దాని  ప్రమాద భరిత సలైవా ను పీల్చి ఒక గ్లాసులోకి పట్టాడు ‘’ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశమిది .

ఒక ఎదాదిదాకా తన ప్రయోగ ఫలితాలను బయట పెట్టలేదు సందిగ్ధం లో ఉన్నాడు 1885లోపిచ్చి కుక్క కాటుకు విపరీతం గా రక్తం కారుతున్న  ఒక ఆల్సేషియన్ కుర్రాడిని పాశ్చర్ లేబరేటరీకి తీసుకొచ్చారు .ఆకుర్రాడి పరిస్తితి చూసి పాశ్చర్ చలించిపోయాడు వణికి పోయాడు కూడా .ఇంతవరకు మనుషులకేవరికీ ఆపరేషన్ చేయలేదు పాశ్చర్ .తానూ తయారు చేసిన సీరం ప్రభావం ఏంతో తెలీదు .ఆపరేషన్ చేస్తే తర్వాత పరిస్తితి ఏమవుతుందో సందేహం .ఇక ఉపేక్షించి మీన మేషాలు లెక్క పెడుతూ కూర్చోవటం మంచిదికాదని ఆకుర్రాడి దయనీయ పరిస్తితికి ఏదో చేసి ప్రాణం కాపాడాలని నిశ్చయానికి వచ్చి తానూ సేకరించిన సీరం ను రోజుకు ఒకసారి వంతున పది రోజులు ఇంజెక్షన్ గా ఆకుర్రాడికి ఇచ్చాడు.ప్రతిరోజూ డోసు పెంచి చేశాడు .కుర్రాడి పని కొద్దిగా ఆశాజనకం గా కనపడింది . రాత్రులు  పాశ్చర్ కు కంటి మీద కునుకు ఉండేదికాదు .కుర్రాడు ఆయాసపదడేవాడు .చేతులారా వాడిని  చంపేస్తు న్నానేమోనని బాధ పడేవాడు .నెల రోజుల నిరంతర ప్రక్రియ వలన ఆ అబ్బాయి బతికి బయట పడ్డాడు .హైడ్రో ఫోబియాకు విరుగుడుగా గొప్ప మందు కనిపెట్ట గలిగానని అప్పుడు ధైర్యం గా ఉత్సాహం గా ప్రకటించాడు పాశ్చర్ మహాశయుడు .అదీ ఆయన సహనం ..

గుర్తింపు –గౌరవం

 

ఈ సంఘటన దేశమంతా ప్రచారమైపోయింది .ఇప్పటికే ఫ్రాన్స్ ప్రజల ఆరాధ్య దైవం అని పించుకొన్న లూయీ పాశ్చర్ ను అనేక విశేషణాలతో కీర్తించటం ప్రారంభించారుజనం .’’రక్షకుడు,ప్రాణదాత , .భయంకర వ్యాధుల పాలిటి కాల యముడు .చావునుండి తప్పించే దైవం ‘’ అన్నారు .దేశ విదేశాలలో పాశ్చర్ పేరు మారు మోగింది ఆయన కీర్తి దిక్కులదాకా విస్తరించింది .సైంటిస్టులు డాక్టర్లు అందరూ వచ్చి అభినందించారు .ఆయన్ను తమ ‘’మాస్టర్ ‘’అని గౌరవించారు .వారందరికీ ‘’అపోజిల్ ‘’గ అంటే ‘’ప్రవక్త ‘’గా ఉండమని ప్రాధేయ పడ్డారు ‘’ది న్యూ యార్క్ ట్రిబ్యూన్ ‘’ఒక కాలం రాయటం ప్రారంభించి వర్కింగ్ క్లాస్ పిల్లలకు ట్రీట్మెంట్ కోసం  పాశ్చర్ దగ్గరకు పారిస్ కు పంపింది .ఇంగ్లాండ్ నుంచి రేబిస్ బాధితులు వచ్చి పాశ్చర్ ఇల్లంతా నిండిపోయారు .అలాగే హగేరి ,స్పెయిన్ ,హాలండ్  రష్యా లనుండి వ్యాధి గ్రస్తులు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని జబ్బు నయమై నవ్వు ముఖాలతో స్వదేశాలు చేరే వారు .ఈ దేశాల వారికి తెలిసిన ఒకే ఒక ఫ్రెంచ్ మాట ఏమిటో తెలుసా ?’’పాశ్చర్ ‘’అన్న ఒకే ఒక్కమాట .అంతగా పాప్యులర్ అయ్యాడు పాశ్చర్ .

14-11-1887లో ‘’పాశ్చర్ ఇన్ ష్టిట్యూట్ ‘’ఏర్పడింది .ఎందరో దాతలు  ఎన్నో దేశాలు విరాళాలిచ్చి దానికి తోడ్పడ్డారు రష్యా ఏంతో ఆర్ధక సాయం అందించింది .బీద జనం లెక్కలేనంత మంది ముందుకొచ్చి విరాళాలు అందజేశారు .అయిదేళ్ళ తర్వాత పారిస్ లోని సార్బోనే దియేటర్ లో అసంఖ్యాకం గా అనేక సైంటిఫిక్ సోసైటీలవారు ,ఫ్రెంచ్ అకాడెమీ సభ్యులు  ,స్థానిక ప్రొఫెసర్లూ ,విదేశీ ప్రముఖులు హాజరై పాశ్చర్ ను ఘనం గా సన్మానించి ప్రతభా విశేషాలను కీర్తించారు .ఏంతో  మంది శ్లాఘిం చినా  అందులో లిస్టర్ చెప్పిన ’’శతాబ్దాల కాలం నుండి ఇన్ఫెక్షన్ బారిన పడిన వారి కష్టాలకు తెర వేశావు .పుండ్ల కు చేసే చికిత్సకు కొత్తపద్ధతిని ప్రవేశ పెట్టావు .నీ నిరంతర పరిశోధన చీకటిలో ఇప్పటిదాకా మగ్గిపోయిన సర్జరీ పై కొత్త వెలుగులు ప్రసరింప జేశావు ‘’అన్నమాటలు చిరస్మరణీయాలుగా నిలిచిపోయాయి .ఉద్విగ్న భరితంగా ప్రసగించిన లిస్టర్ పాశ్చర్ దగ్గరకు వెళ్లి ఆప్యాయం గా కౌగిలించుకోవటం చారిత్రాత్మక ఘట్టమే అయింది .ఇద్దరూ పసి పిల్లలై ఆప్యాయాన్ని ఆత్మీయతను ప్రేమను ఆరాధన ను పంచుకొన్నారు .

టాక్సిన్స్ –యాంటి టాక్సిన్స్

రెండేళ్ళ తర్వాత పాశ్చర్ టాక్సిన్ యాంటి  టాక్సిన్ లపై పరిశోధన చేశాడు .డిఫ్తీరియా వ్యాధికి మందు కని పెట్టె ప్రయత్నం లో ఉన్నాడు .అకస్మాత్తుగా పాశ్చర్ కు ‘’యురేమిక్ పాయిజనింగ్ ‘’జరిగింది .రెండునెలలు చాలా ఇబ్బందిపడ్డాడు .చావుకు దగ్గరయ్యాడేమో నని పించింది. కొంచెం కుదుటపడ్డాక .డాక్టర్ల సలహా మేరకు  లేబరటరీకి వెళ్లి శిష్యుల పరిశోధనా ఫలితాలను తెలుసుకోనేవాడు .ఇక పాశ్చర్ పరిశోధనా శకం ముగిసి నట్లే .పాశ్చర్ ఇన్ ష్టి ట్యూట్ బయట లాన్ లో తాపీగా కూర్చునేవాడు .తన స్వగ్రామం విల్లెనీవ్ యిటాంగ్ కు వెళ్లి విశ్రాంతి జీవితం గడిపాడు .రేబీస్ పై ఇంకా పరిశోధన చేయాలి .

ప్రాణదాత మరణం

గుర్రపు శాలల్లో ఉంటూ డిఫ్తీరియా వ్యాధి మందుకోసమే ఆలోచించేవాడు అవే పరిశోధనాలయాలయ్యాయి .క్రమంగా ఆరోగ్యం తగ్గిపోతోంది .75 వచ్చేసరికి మృత్యు సమీపాన ఉన్నాడు ,మాట్లాడలేక పోతున్నాడు .సెప్టెంబర్ నాటికి తలకూడా కదల్చలేని బలహీనుడయ్యాడు .పాలకప్పు అందిస్తే తాగలేనని తల ఊపేవాడు .దిండుమీద వాలిపోయేవాడు .ఇరవై నాలుగు గంటలకాలం కోమాలో ఉండి28-9-1895జీవరాశికి ప్రాణదానం చేసిన ప్రాణదాత లూయీ పాశ్చర్73 వ ఏట  మరణించాడు .ఎనిమిది గ్రంధాలు రాశాడు .

కొన్నేళ్ళ తర్వాత ఫ్రెంచ్ ప్రజల హీరో ఎవరు అని ఒపీనియన్ పోల్ సేకరిస్తే లూయీ పాశ్చర్ మొట్ట మొదటి వ్యక్తిగా నియంత నెపోలియన్ అయిదవ వ్యక్తిగా నిలిచారు .అంతగా ప్రజా హృదయాలలో చోటు దక్కించుకొన్న చరితార్ధుడు పాశ్చర్ .ఫ్రాన్స్  జాతీయ నాయకుడుగా గుర్తింపు పొందాడు ‘’worship the spirit of  criticism. Without it ,every thing is fallible .It always has the last word’’ అన్న మహా వ్యక్తీ పాశ్చర్ .మానవ జీవితాన్ని రెండుమార్గాలు ప్రభావితం చేస్తాయి ఒకటి రక్తపాతం ,చావు .ఇవి ఎప్పుడూ వినాశానాన్నే కోరతాయి .దేశాలమధ్య విద్వేషాలు పెంచి ఎప్పుడూ యుద్దానికి సన్నద్ధం చేస్తాయి . .రెండవ మార్గం శాంతిమార్గం ఇందులో పని ఆరోగ్యం సృజన ,కొత్తమార్గాలు కనిపెట్టి మానవ ఉపయోగానికి తోడ్పడటం .ఉంటాయి .మొదటిమార్గం హింసాత్మక విజయం .రెండవది మానవాళికి మనశ్శాంతిని ,ఉపశాంతినీ కల్గించేది .ఇందులో ఏది చివరిదాకా నిలుస్తుందో దేవుడే చెప్పగలడు .కాని ‘’science will have tried ,by obeying the law of humanity to extend the frontiers of life ‘’ అన్నది శాంతికాముకుడు ,ప్రజా సంక్షేమంమూ కోరే లూయీ పాశ్చర్ అభిప్రాయం .అదే మానవాళికి శ్రేయోదాయకమైన మార్గం .

Image result for louis pasteur

Image result for louis pasteurImage result for louis pasteur

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-15- ఉయ్యూరు

.

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25

12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -2

 

పట్టు పరిశ్రమను కాపాడిన తీరు  –

ఆ సమయం లో ఫ్రాన్స్ దేశం లో పట్టు  పరిశ్రమ పట్టుపురుగుల కు సోకిన వ్యాదులవల్ల బాగా దెబ్బతినిపోయింది .నష్టాలతో బెంబేలెత్తి పోయారు .సుమారు మూడు వేలమంది ‘’సేరి కల్చరిస్టూలు దీనిపై ఆలోచించి పరిష్కారం కనుక్కొనే ప్రయత్నం లో ఉన్నారు .అందులో  పాశ్చర్ గురువు. సెనేటర్ పాశ్చర్ ను ఈ కల్లోలం గురించి ఆలోచించమని కోరాడు .దానికి సమాధానం గా పాశ్చర్ వాళ్ళ కోరిక మంచిదేనని ఉన్నతమైనదేనని కాని తానూ అంతవరకూ పట్టు పురుగును చూడనైనా చూడలేదని తెలిపాడు .స్వయం గా రంగం లోకి దిగి పట్టు పరిశ్రమ కేంద్రాలు చూసి పట్టుపురుగుల పెంపకాన్ని వాటికి వచ్చే వ్యాధులకు వారు వాడుతున్న ఫలితాల నివ్వని మందులనీ పరిశీలించాడు . పట్టుగుడ్లను  లార్వాను పురుగులను సేకరించి అధ్యయనం సాగించాడు వెంటనే పరిష్కారం సూచించలేదు .ముందుగా జబ్బుపడ్డవాటినుంచి ఆరోగ్యకరమైన వాటిని వేరు చేయించాడు . విత్తన వ్యాపారస్తులు పాశ్చర్ చర్యలను విమర్శించారు .కొందరైతే ఆయనమీద రాళ్ళే విసిరారు .వీటినన్నిటికీ చాలా ఓపికగా భరించి వాళ్ళతో ‘’మీరు సంయమనం పాటించాలి .నాతొ పాటు ఇక్కడే ఉండిచూడండి .’’అన్నాడు .పాశ్చర్ కు  నాలుగేళ్ళు పట్టింది వ్యాధికి కారణం కనుక్కోవటానికి .లక్షణాలను రికార్డ్ చేసేవాడు .వ్యాధి సోకినవాటిని వేరు చేసి ఆరోగ్యవంతమైన వాటి నుండి కొత్త విత్తనాలు అభివృద్ధి చేశాడు .చివరికి కదా సుఖాంతమై జబ్బు ల నుండి పట్టుపరిశ్రమను కాపాడగలిగాడు .దీనినే ‘’పాశ్చర్ సీడింగ్ ప్రాసెస్ ‘’అన్నారు .ఏ ఇబ్బందీ జబ్బూ  లేని పట్టుకాయలను (కకూన్స్)ఏర్పరచటమే ‘’పట్టు  పంట ‘’ అని రుజువు చేశాడు .ఈ పద్ధతిలో పట్టు పురుగులను పెంచి మొదటి సారిగా లాభాలు గడించటానికి 10 ఏళ్ళ సమయం పట్టింది .అదే పాశ్చర్ చెప్పిన రెండవ మంత్రం ‘’wait’’.

కుటుంబం లో విషాదం

‘’.   ఈ ఫలితాలు సాధించే కాలం లో ఆతను ఎన్నో కుటుంబ వ్యధలను  బాధలను అనుభవించాడు .పెద్దకూతురు జీనే టైఫాయిడ్ తో మరణించింది .రెండేళ్ళ చిన్న పిల్ల కామిల్లీ అంతుపట్టని జ్వరానికి లోనై తే ,పన్నెండేళ్ళ సిసిలీ టైఫాయిడ్ జ్వరం వచ్చి కొన్ని రోజులకే చనిపోయింది .పాశ్చర్ కు ‘’సెరిబ్రల్ హేమరేజ్ వచ్చి పాక్షికం గా పక్షవాతం వచ్చి ఎడమ బుజం  కదల్చలేక పోయే వాడు  .దాన్ని గురించి చెబుతూ ‘’నా ఎడమ భుజం సీసం ముక్కలా మొద్దుబారి పోయింది ఎవరైనా దాన్ని కోసేస్తే బాగుండును ‘’అన్నాడు అప్పటికే అధికశ్రమ చేసి ఉండటం ఈ కుటుంబ మరణాలు కలత చెందించాయి .కు౦గి పోయాడు .కాని మానసికం గా కుంగిపోకుండా ఉండటానికి  స్మైల్ల్స్ రాసిన ‘’సెల్ఫ్ హెల్ప్ ‘’,బాసూట్ రాసిన ‘’ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ సెల్ఫ్ ‘’గ్రంధాలు చదివి ఉత్తేజం పొందేవాడు .

పాస్చరైజేషన్

నలభైవ పడిలో పాశ్చర్ కనపడటమే ఒక శక్తిగా భావన పొందేవారుజనం .ముఖం లోప్రశా౦తత ,కళ్ళల్లో కాంతి తో రగులుతున్న శక్తి  కేంద్రంగా కనిపించేవాడు .పరిశోధనలను కొనసాగిస్తూ’’ మైక్రోస్కోపిక్ జీవులను ‘’కనిపెట్టాడు .అవే సారాయి ఆమ్లాన్ని ,తయారు చేస్తాయని చెప్పాడు .అయితే దాన్ని తాగలేమన్నాడు .వైన్ నువేడి చేసి అన్నిరకాల వ్యాదులనుండి కాపాడతానని చెప్పి ,దాన్ని కొద్దినిమిషాలు 50-60 డిగ్రీల సెంటి గ్రేడ్ వద్ద ఉంచాడు .ఈ ప్రక్రియే తత్వాత ‘’పాశ్చరైజేషన్ ‘’అన్న పేరును పొందింది .దీనితర్వాత  ‘’బీరు ‘’లో ఉండే హానికరమైన  సూక్ష్మజీవులు వాటివలన మానవులకు కలిగే వ్యాధులు పై   ద్రుష్టి సారించాడు .ప్రతి విషయాన్ని నోట్ బుక్ లో వివరంగా రికార్డ్ చేశాడు .ఇలాంటి జీవులు మనుషులలోనూ జంతువులలోను ఉండవచ్చునని ఊహించాడు .కాని  తన భావాలను తెలియ జేస్తూ ‘’if we are inclined to believe that it is so because we think it likely ,let us remember before we affirm it ,that the greatest disorder of the mind is to allow the will to direct the belief ‘’ అని జాగ్రత్త పడ్డాడు .

యుద్ధ సైనికుడైన కొడుకును కలుసుకొన్న దృశ్యం

వైన్ లో బీరు లో ,మానవులలో ఉండే వైరస్ లనుండి  ఫెర్మేంటే షన్ ను చేసే ప్రక్రియపై  అధ్యయనం చేసేముందు 1870 యుద్ధం ఎన్నో అవాంతరాలను కలిగించింది .ఒక్కగానొక్క కొడుకు యుద్ధం లో పాల్గొన్నాడు .ఎక్కడున్నాడో అతని జాడ తెలియ లేదు .తానె స్వయం గా వెదకటానికి బయల్దేరాడు .రోడ్లన్నీ పరాజిత సైనికులతో, క్షతగాత్రులతో  నిండి ఉన్నాయి. కాలు కదిపేట్లు లేని దృశ్యం .దారిలో తనకొడుకు పనిచేసే స్టాఫ్ ఆఫీసర్ కనిపించి అబ్బాయి క్షేమంగానే ఉన్నాడన్న వార్త తెలియజేయగా ఊరట కలిగింది .అయినా అతనేక్కడున్నాడో వెతుకుతుంటే దారిలో చచ్చి పడిఉన్న గుర్రాలు ,మనుష్యుల పోగులు హృదయ విదారకం గా ఉన్నాయి .చివరికి నీరసం తో శక్తి కోల్పోయి ,జీవచ్చవంగా ఉన్న కొడుకును కలుసుకొన్నాడు తండ్రీ కొడుకులు విపరీతమైన  ఉద్విగ్నత కు   లోనైనారు .అది భీకర కల్లోల కాల సముద్రం లో  ఒక చిన్న ఆన౦దపు అల లాగా అని పించింది .

స్టెరిలై జేషన్

ఈ యుద్ద  సైనికుల అకాల మరణాలు హాస్పిటల్ లో జరిగే మరణాలకంటే వేగం గా తీవ్రంగా ఉన్నట్లు గమనించాడు పాశ్చర్ .దాన్ని ‘’A pin prick is an open door to Death ‘’అన్నాడోక  ఫ్రెంచ్ సర్జన్.గాయపడిన వారికి ఆపరేషన్ చేస్తుంటే ఫలి౦చటం లేదు ,మరణిస్తున్నారు .దీనితో అసలు ఆ జోలికే వెళ్ళకుండా డాక్టర్లు నిస్తేజులయ్యారు .ఇన్ఫెక్షన్ ను ఆపలేని పరిస్తితి ఏర్పడింది .పాశ్చర్ ఇప్పుడు దీన్ని గురించే తీవ్రంగా ఆలోచించసాగాడు .గాయాలకు డ్రెస్సింగ్ యెంత ముఖ్యమో ,వాటికి వాడే పరికరాలు  బా౦డేజేస్  .లను పెర్ఫెక్ట్ గా’’ స్టెరిలైజేషన్’’ చేయాల్సిందే నని సూచించాడు .లేకపోతె ఇన్ఫెక్షన్ ను అరికట్టలేమని వివరించాడు

మైక్రోబ్స్ గుర్తింపు—ఆధునిక శస్త్ర చికిత్సకు  ప్రివెంటివ్ మెడిసిన్ కు  మార్గ దర్శనం

.అంతకు ముందే జోసెఫ్ లిస్టర్ పాశ్చర్ కు జాబు రాస్తూ అతని సూక్ష్మక్రిముల పరిశోధనను శ్లాఘిస్తూ ,ప్రస్తుత ఉపద్రవం అయిన ఇన్ఫెక్షన్ పై పాశ్చర్ దృష్టిని బలపరచాడు .దీనిని పూర్తిగా సాధించటానికి ‘’యాంటి సెప్టిక్ సిస్టం ‘’చాలా అవసరమని తెలిపాడు .దీని అంతూ తేల్చాలని తీవ్ర ఆలోచన చేశాడు పాశ్చర్ .ఆక్సిజన్ కాని వేరే ఇతర వాయువుకాని ఈ ఇన్ఫెక్షన్ కు కారణం కాదని ,గాలిలో వేలాడే సూక్ష్మాతి సూక్ష జీవులే దీని వ్యాప్తికి కారణమని పాశ్చర్ కనిపెట్టాడు .ఇదే ‘’ఆధునిక శస్త్ర చికిత్స’’కు ద్వారాలుతెరచింది .’’ప్రివెంటివ్ మెడిసిన్ ‘’కు  నాంది పలికింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4-15 ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ చక్ర ఆకారంలో అమ్మవారి ఆలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆప్ ను ఎలా అర్ధం చేసుకోవాలి ?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లీక్వాన్ స్పూర్తి ఏ సింగపూర్ కీర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతా రామమయం జగమంతా రామమయం

తెలుగువారికి శ్రీరామచంద్రుడు ఇలవేలుపు. రామనామ స్మరణంతో తెలుగుపల్లెలు నిద్ర లేస్తాయి. ప్రజల్లో రామభక్తి బాగా నాటుకుని పోవడానికి భద్రాచల రామదాసు కీర్తనలే కారణం. రామదాసు కీర్తనలు నోటికి రాని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. భద్రాచల రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న తెలుగువారిపై వేసిన ముద్ర మరే వాగ్గేయకారుడు వేయలేదు.
త్యాగరాజస్వామి తెలుగువారైనా,ఆయన తమిళ నాడులోని తిరువాయూర్‌లోనే పెరగడం వల్ల ఆయన కీర్తనలు తెలుగువారిలోనే కాక,తమిళుల్లో ప్రాచుర్యాన్ని పొందాయి. భద్రాచల రామదాసు కీర్తనల్లో తెలుగు తనం ఉట్టిపడుతుంది. సామాన్యుల భాషలో ఈ కీర్తనల్లో మనకు కనిపిస్తుంది.ఉదాహరణకు అబ్బ,ఈ దెబ్బల కు ఓర్వలేనంటూ రామదాసు ఆలపించిన కీర్తనలో ఎంతో సహజత్వం ఉంది.
అలాగే, మనం ఎవరి నుంచైనా ప్రత్యుపకారాన్ని ఆశించి భంగపడినప్పుడు పాత విషయాలను గుర్తు చేయడం,ఒక విధంగా దెప్పిపొడవడం చేస్తుంటాం. రామదాసు కూడా తానీషా భటులు తనను కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు తాను చేయించిన చింతాకు పతకంతో సహా నగలను అలంకరించుకుని కులుకు తున్న ఓ రామచంద్రా ఈ దెబ్బలను భరించ లేకున్నానయ్యా అంటూ రామదాసు కీర్తనల్లో శ్రీరామ చంద్రుణ్ణి ఎత్తిపొడవడంలో ఎంతో సహజత్వం ఉంది. అలాగే, శ్రీరాముడు తన మొర ఎంతకీ ఆల కించడం లేదని సీతమ్మతల్లికి రామదాసు మొరపెట్టుకునే కీర్తన
కూడా తెలుగునాట ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. ననుబోవమని చెప్పవే సీతమ్మతల్లి అనే కీర్తనలో ఎంతో ఆర్తి ఉంది.
సాధారణంగా తల్లి హృద యం వెంటనే కరుగు తుందనీ వెంటనే స్పంది స్తుందని మన నమ్మకం, అందుకే శ్రీరాముని కన్నా, సీతమ్మతల్లికి మొర పెట్టు కుంటేనే ఫలితం ఉంటుందని భావించి రామ దాసు ఈ కీర్తన ఆలపించి నట్టుగా అను కోవడంలో తప్పులేదు. ఇందులో కూడా ఎంతో సహ జత్వం ఉంది. అంతా రామ మయం, జగ మంతా రామ మయం అనే కీర్తనలో కూడా ఎంతో సహజత్వం ఉంది. శ్రీరామ నవమికి ఊరూ, వాడా అంతా రామ
క ల్యాణోత్స వాలతో ప్రతి గ్రామం, పట్టణం కళకళలా డాయి. వీధులను మూసివేసి చలువ పందిళ్ళు వేసి పెద్ద వేదికలపై శ్రీసీతారామ చంద్రస్వామి వారి పట్టాభిషేక మహోత్సవ తైలవర్ణ చిత్రాలు అలంకరించి ఆ వేదికలపై కల్యాణోత్సవాలను జరిపించి ఆనందించారు ప్రజలు. చిన్న,పెద్దా తేడా లేకుండా పానకం,వడపప్పు కోసం పోటీపడ్డారు. మండు టెండలను సైతం లెక్క చేయ కుండా రామ కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు ఆరుప దులు దాటిన వృద్ధుల నుంచి ఆరేళ్ళ వయసుగల బాల బాలికల వరకూ తరలి వచ్చారు. సీతా రామ కల్యా ణాన్ని తమ ఇంట్లో జరిగే పెళ్ళిలా సంభా వించడం తరతరాలుగా తెలుగువారికి అలవాటు అయింది. సీతా రామ కల్యాణాన్ని నిర్వహించక పోతే అరిష్టం కలుగు తుందన్న బెదురు, సెంటిమెంట్‌ బలంగా నాటు కునిపోవడమే ఇందుకు కారణం.మిగిలిన పర్వదినా లకూ,సీతారామ కల్యాణానికీ మధ్యతేడా ఉంది. మన ఇళ్ళలో జరిగే పెళ్ళిళ్ళకు శుభలేఖలపై సీతారాములు తలంబ్రాలు పోసుకుంటున్న చిత్రాన్ని ముద్రించడం, జానక్యాకమలాంజలిపుటే అనే శ్లోకంతో శుభలేఖ రాయడం తరతరాలుగా మనకు అలవాటు.తెలుగువారి జీవితాలతో సీతారామచంద్రుల కల్యాణోత్సవం ఎంతగా పెనవేసుకుని పోయిందోఈ శుభలేఖ ప్రచురణ సంకేతం. సీతారామచంద్రుల ప్రభావంతెలుగు వారిపై ఎంత ఉందో తెలియజేసేదే అంతా రామ మయం,జగమంతారామమయం అనే కీర్తన సారాంశం.

 

భవతరణం, పాపహరణం : నేడు కామద ఏకాదశి

Added At : Tue, 03/31/2015 – 06:33

చైత్ర శుద్ధ ఏకాదశి నాడు కామద ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం చేస్తారు. దీనినే సౌమ్య ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ‘ధర్మసింధు’ను అనుసరించి కామద ఏకాదశి నాడు విష్ణుపూజ, ఉపవాసం, జాగరణ ఆచరిస్తే శుభం చేకూరుతుంది. పాపాలు హరిస్తాయి. పాపాలను భస్మీపటలం చేస్తుంది కనుక దీనిని పాపవిమోచన ఏకాదశి అని కూడా పిలుస్తారు. స్త్రీలు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యదోషం ఉండదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈతిథినాడే శ్రీకృష్ణునిని ఆందోళికోత్సవం కూడా జరుపుతారు. ఊయలలోని చిన్ని కృష్ణుని దర్శించినంత మాత్రాన్నే కలిదోషాలు హరిస్తాయి. కృష్ణ ప్రతిమను ఉయ్యాలలో ఉంచి ఊచితే జన్మజన్మల పాపాలు తొలగడమే కాక విష్ణు సాయుజ్యం సైతం లభిస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా ప్రచురించిన పరిశోధనా వ్యాస సంకలనం లో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు వ్రాసిన “కోస్తాంధ్ర మధ్యతరగతి కుటుంబాలు “

Gabbita-1 Gabbita-2 Gabbita-3 Gabbita-4

 

 

 

 

 

 

 


000100200030004

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

స్వర్గీయ శ్రీ కవితా ప్రసాద్ కు ”కవితాంజలి ”

స్వర్గీయ శ్రీ కవితా ప్రసాద్ కు ”కవితాంజలి ”
Inline image 1

అవధాన విద్యా వాచస్పతి ,ఆశుకవితా సమ్రాట్ ,అష్ట దశావధాని ,, ద్విశతావధాని  ,సరస్వతీ పుత్రులు స్వర్గీయ శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారికి సరసభారతి మరియు మచిలీ పట్నం సాహిత్య సాంస్కృతిక సంస్థలు   ‘ -మచిలీపట్నం ”వివేకానంద మందిరం”లో  2-4-15 -గురువారం సాయంత్రం 6 గం లకు   నిర్వహించే ”కవితాంజలి ”  కార్య క్రమానికి కవులు , కళాకారులు సాహిత్యాభిమానులు  పాల్గొని  జయప్రదం చేయ మనవి   .

                                                              గబ్బిటదుర్గా ప్రసాద్
                                                          అధ్యక్షులు -సరసభారతి –

Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24

12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్

బాల్యం

నిశ్చయమైన పట్టుదల ,అనంతమైన సహనం- కోమల స్వభావి అయిన లూయీ పాశ్చర్ ను ముందుకు నడిపించి అద్భుతాలు సాధించేట్లు చేశాయి .’’will, work ,wait ‘’అనే మూడుమాటలు మంత్రాలుగా అయన కృషికి తోడ్పడ్డాయి .ఫ్రాన్స్ దేశం లో జూరా ప్రాంతం డోల్ లో 27-12-1822 జన్మించిన పాశ్చర్ తండ్రి నెపోలియన్ సైన్యం లో ఒక సాధారణ సైనికుడిగా ‘’పెనిన్సులర్ వార్ ‘’లో పాల్గొన్నాడు .తర్వాత కులవృత్తి అయిన తోళ్ళ పరిశ్రమ(చర్మకార వృత్తి)లోనే ఉండిపోయాడు .తల్లి  తోటమాలి కుటుంబం లోంచి వచ్చింది .ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు పుట్టినా లూయీ ఒక్కడే ఒక్కగానొక్క కొడుకు .కొడుకు పుట్టినతర్వాట కుటుంబాన్ని  ముందు మార్మోజ్ కు తర్వాత  ‘’టేనరింగ్’’పరిశ్రమకు అనుకూలమైన ఆర్బోయిస్ కు తండ్రి మార్చాడు .ఇక్కడికొచ్చాక లూయీ చదువుపై శ్రద్ధ తగ్గి చేపల వేటలో కాలక్షేపం చేసేవాడు .అక్కడి భౌగోళిక పరిస్తితులను అధ్యయనం చేసేవాడు  .అక్కడ ఉన్న నిక్షిప్త నిధి ‘’కోసం అన్వేషి౦చేవాడు .చదువుకంటే బొమ్మలు గీయటం మీద ఆసక్తి ఎక్కువ కనపరచాడు .కొడుకు ఆర్టిస్ట్ అయిపోతాడేమోనని తలిదండ్రులు బాధ పడేవారు .

చదువు

పారిస్ లోని సెయింట్ లూయీ సేకడరీస్కూల్ లో 16 వ ఏట చేరాడు .ఇంటి బెంగ తో ఇబ్బందిపడి ,నిజంగానే జబ్బుపడి ‘’తోళ్ళవాసన ఒక్కసారిపీలిస్తే ఆరోగ్యం కుదుట బడుతుంద’’ చెప్పి ఇంటికొచ్చేశాడు . స్కూల్ మాన్పించేశాడు తండ్రి .మనవాడి చాక్ పీస్ బొమ్మలూ ,ఫిషింగ్,అన్వేషణ  మళ్ళీ మొదలయ్యాయి . మళ్ళీ స్కూల్ కు వెళ్ళాడు .సంతోషించితలిదండ్రులు అభినందించారు  తండ్రికి కొడుకు గిఫ్ట్ పంపాడు కొన్ని రోజుల తర్వాత .అందుకున్న తండ్రి  ‘’నీ గిఫ్ట్ అందింది దీనికోసం  ఖర్చుచేసిన డబ్బు నీదగ్గరే ఉంటె వెయ్యి రెట్లు నీకు ఉపయోగపడేది  .స్నేహితులతో సరదాగా హోటల్ కు వెళ్లి  ఆనందించే వాడివి  ఇలా కొడుక్కి రాసే తలిదండ్రులు లోకం లో అరుదుగా ఉంటారు’’ కన్నా’’.నా సంతృప్తి మాటలతో చెప్పలేనిది అని గ్రహించు ‘’ అని రాశాడు .

ఉద్యోగం

19 వయసులో ‘’స్టూడెంట్- టీచర్ ‘’ అయ్యాడు పాశ్చర్ .జులాయితనం పోయింది. తన జీవితానికి  విజయాన్ని నిర్దేశించు కొన్నాడు .ఇదే మొదటిమంత్రం ‘’విల్ ‘’.అక్కలకు ఉత్తరం రాస్తూ ‘’మనసులో భావించటం గొప్ప విషయం .అప్పుడే కార్యాచరణ ,పని అనుసరిస్తాయి .పని ని విజయం అనుసరిస్తుంది .’’will open the doors –work passes them –and success is waiting to crown one;;s efforts ‘’ఇదీ పాశ్చర్ జీవితం లో అనుసరించి విజయాలు సాధించటానికి కీలక మైనాయి .ఇరవైవ ఏట ప్రసిద్ధ కెమిస్ట్ జే బి డ్యూమాస్ ఉపన్యాసాలు విని ప్రభావితుడయ్యాడు .బీసంకాన్ లోని రాయల్ కాలేజ్ లో అసిస్టంట్  మాధమాటికల్  ఇంస్ట్రక్టర్ గా చేరాడు .అక్కడే చదివి సైన్స్ లో  డిగ్రీ పొందాడు .అతని కేమిస్ట్రి ఆసక్తి దీనికి సరిగ్గా సరిపోయింది .25 వయసులో పారిస్ లోని ఈకోల్ నార్మేల్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాడు .1848లో డిజియన్ లో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ,తర్వాత స్ట్రాస్ బర్గ్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా చేరాడు .

ప్రేమాయణం –పెళ్లి

ఈ యూనివర్సిటీ లో చేరినతర్వాట రెక్టార్ మారెంట్ ప్రభావం లోనూ , ఆయన కూతురు మేరీ ప్రేమలోనూ పడ్డాడు .ఆమెకు తన కుటుంబ విషయాలను ఏమాత్రం దాచకుండా తండ్రి చర్మకారుడని  తల్లి చనిపోయిందని అక్కయ్యలె తండ్రిని కనిపెట్టుకొని స్వగ్రామం ఆర్బోయిస్ లో ఉంటున్నారని తమది దురదృష్టవంతమైన కుటుంబమని ,తమ కుటుంబ ఆస్తి యాభై వేల ఫ్రాంకులు మాత్రమె నని ,తనకు వచ్చే వాటాను తన అక్కయ్యలకే  ఇచ్చేయాలని   ఏనాడో నిర్నయి౦చు కోన్నానని  ,కనుక ప్రస్తుతం అదృష్ట హీనుడినని తనకున్నవి ప్రస్తుతం మంచి ఆరోగ్యం ,కొద్దిగా ధైర్యం ,యూనివర్సిటిలో ఇప్పుడున్న ఉద్యోగం మాత్త్రమే నని,భవిష్యత్తులోపారిస్ లో  కెమికల్ రిసెర్చ్ చేయాలనే సంకల్పం లో ఉన్నానని ,తాను  అందులో ఏదైనా ఘనత సాధిస్తే తన తండ్రి తన దగ్గరకు వచ్చి స్ట్రా బెర్గ్ లో ఉంటాడని ,అప్పుడు తన వివాహ విషయం మాట్లాడుతాడని ,తనదగ్గర అమ్మాయి ప్రేమించటానికి తగిన ప్రత్యేక విషయ౦  ఏదీ లేదని పూస గుచ్చినట్లు దాపరికం ఏ మాత్రం లేకుండా ఉత్తరం రాశాడు .

ఈ ఇరవై ఆరేళ్ళ కుర్రాడు ఆ అమ్మాయికంటే ఆమె తండ్రి అయిన రెక్టార్ కు బాగా నచ్చాడు .తండ్రి అనుమతితో ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేది .అందులో మనవాడు తనను తానూ కొంచెం కి౦చపరచుకొంటూ రాసేవాడు .తొందరాపడి నిర్ణయం తీసుకోవద్దని ,తననుఅపార్ధం చేసుకోవటమూ తగదని కాలమే తమనిద్దరిని కలుపుతుందని అంతదాకా ఓపిక పట్టటం మంచిదని రాసేవాడుపాస్చర్ .మామగారు లైన్ క్లియర్ ఇచ్చి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .29-5-1848  ముహూర్తం నిర్ణయించారు .మన కుర్ర సైంటిస్ట్ ‘’ప్రయోగం చేస్తూ సగం లో వదిలి పెట్టి రావటానికి ఇష్టపడక ‘’పెళ్లి ముహూర్తానికి ఆలస్యం గా వచ్చి చరిత్ర సృస్టించాడు .

అనుక్షణ ప్రయోగ శీలి

ప్రయోగాలే జీవిత పరమావధి అయ్యాయి పాశ్చర్ కు .స్పటికాలమీద సూక్ష్మాతి సూక్ష జీవులమీద ప్రయోగాలు పరిశోధనలు చేస్తున్నాడు .29 లో’’ టార్టారికాసిడ్ ‘’,’’రేసిమిక్ యాసిడ్ ‘’లపై తీవ్రంగా అధ్యయనం చేశాడు .’’I shall go to the end of the world .I must discover the source of racemic acid .i must follow up the tartars to their origin ‘’అని నిశ్చయ సంకల్పం తో ఉన్నాడు .ఈ ప్రయోగ పరంపరలోనే ‘’కిణ్వన ప్రక్రియ ‘’అంటే ఫెర్మెంటేషన్(పులియుట )పై  ద్రుష్టి కూడా సారించాడు .1854 లో లిల్లీ లోని న్యూ ఫాకల్టి ఆఫ్ సైన్స్ కు ప్రొఫెసర్ అయ్యాడు పాశ్చర్ .ఇక్కడ చేసిన ప్రయోగాలే అద్భుత ఫలితాలనిచ్చి రసాయన శాస్త్ర గమనాన్నే మార్చేశాయి .

జీవావిర్భావం యాదృచ్చిక సంఘటన అన్న సంప్రదాయ వాదం

ఈ ప్రయోగ ఫలితాలకు పూర్వం ‘’జీవం అనేది యాదృచ్చిక ఆవిర్భావం –life could originate by spontaneous generation ‘’అన్నదే యదార్ధం అనే నమ్మకం గా ఉండేది .చనిపోయిన లేక కుళ్ళిన పదార్దాలనుండే జీవులు పుడతాయని నమ్మారు .పూర్వమేదావులైన ఓవిడ్ ,ప్లిని ,లూక్రేటస్ ,విర్జిల్ వగైరా అందరూ ‘’స్పాంటేనియస్ జెనరేషన్ ‘’నే నమ్మారు .అదే తిరుగు లేని నిజం అని చెప్పారు .ఎద్దు మృత కళేబరం నుండి ‘’బీస్ ‘’పుట్టినట్లు వర్జిల్ చెప్పాడు .బ్యునాన్ని అనే ఇటాలియన్ శిధిలమైన కర్ర లో నుంచి సీతాకోక చిలుకలు ఆవిర్భవి౦చి నట్లు చెప్పాడు .వాన్ హేల్మాంట్ ఒక జార్ లో కుళ్ళిన గుడ్డముక్కల్ని వేసి కొంచెం గోధుమలు ,జున్నుముక్కలు కలిపి  అందులోంచి ఎవరైనా సరే ఎలుక పిల్లల్ని (మైస్)  సృష్టించవచ్చు నన్నాడు .ఇవన్నీ పాశ్చర్ మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి .

ఒక బిల్డింగ్ కొని దాన్ని పరిశోధనాలయం గా మార్చాడు .మెట్ల కింద ఒక ఒక స్టవ్ ఏర్పాటు చేశాడు .అక్కడే పగలూ రాత్రీ జీవుల సృష్టికోసం ఎదురు చూశాడు .ఫెర్మెంటేషన్ కు సహకరించే పదార్ధం కోసం అన్వేషిస్తున్నాడు .ఆల్ప్స్ పర్వతాలు ఎక్కి ఎత్తు పెరిగిన కొద్దీ జీవరాశి తక్కువగా ఉన్నట్లు పరిశోధించి తెలియ జేశాడు .

జీవం నుండే జీవం పుడుతుంది అన్న పాశ్చర్

వయసు నలభై లో యెడ తెగని పరిశోధనలలో మునిగి తేలాడు .’’జీవరాసి ఆవిర్భావం యాదృచ్చిక సంఘటన కాదు ‘’అని రుజువు చేయటమే లక్ష్యం గా ఉన్నాడు .జీవం అంటే ఒక సూక్ష్మ జీవి (జేర్మ్) ,కనుక జీవించిన దానినుండే మరొక జీవి ఆవిర్భవిస్తుంది అని భావించాడు .సంప్రదాయ వాదులు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించ లేదు .పాశ్చర్ పరిశోధనా ఫలితాలు ఒక మాకరి అంటే ఎగతాళి ,వెక్కిరింపు అని ఈసడిం చారు .వీటిని వేటినీ లెక్క చేయలేదు .అమితమైన ఓపిక పట్టాడు .సంయమనం పాటించాడు .ఈ లోగా తన సంకల్ప బలాన్ని నమ్మి ముందుకే వెళ్ళాడు .’’A man of science may hope for what may be said of him in the future but he can not stop to think of the insults –or the compliments –of  his  own day ‘’అన్న జీవిత సత్యాన్ని చెప్పాడు .ఇది అందరికి ఆదర్శనీయం ,అనుసరణీయం .

Louis Pasteur, foto av Félix Nadar Crisco edit.jpg

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-15- ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విలియం షేక్స్ పియర్ ఆంగ్ల సానెట్ కు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మగారి అనువాద కవిత

విలియం షేక్స్ పియర్ ఆంగ్ల సానెట్ కు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మగారి అనువాద కవిత

Inline image 1  View photo in message

అదృష్ట హీనునై అవమాన భరితునై-భ్రస్టునై ,ఒంటినై వగచినపుడు

వినని దైవంబునకు వినిపింప వ్యర్ధమై –ఉత్సాహ సంపన్ను నొకని తీరును కోరి

అతని సంపద అతని హిత ధనమ్ము- అతని నేర్పు ఇతని అవకాశ మును కోరి

మోదకారణ మేది  ముదము నీక –

పొద్దు పొడుచు చున్నంతనే పుడమి రోసి –దివి కవాటమున కెగసి ధృతిని మీరి

కీర్తనల నాల పించు కోకిల విధమ్ము –నన్ను నే నేవగించు  కొన్న సమయాన

తలపు నీవైన మరల సంతసము  కల్గి –మృదు మధుర మైన   నీ ప్రేమ స్మృతిని మెదిలి

ఎట్టి సిరిసంపదలు  లభించుగాక    –నృపతి పదవులనైన త్రుణీకరింతు .

Posted in సేకరణలు | Tagged | 1 Comment

29-3-15 ఆదివారం శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి సన్మానోత్సవం

29-3-15  ఆదివారం  ఉదయం బందరులో ఆర్ కే పారడైజ్ ఏ సి హాల్ లో ”శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి నవ్యాన్ధ్రప్రదేశ్ తొలి  ఉగాది సాహితీ పురస్కారాన్ని అందజేసిన సందర్భం గా వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన అభినందన ,సన్మానోత్సవం ,సుబ్బారావు గారిచ్చిన విందు  .మరియు మధ్యాహ్నం బాలసాహిత్య రచయిత్రి శ్రీమతి గుడిపూడి రాధికా రాణి ఇంట్లో మా సరసభారతి బృందం ఆత్మీయ సమావేశం ,వారింట్లో పెంచుకొంటున్న బుల్లి తాబేలూ –

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వ్యంజకాలు -ఒక పరిశీలన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహిత్యం లో రసం ధ్వని ఆవశ్యకత –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నటుడురంగనాధ్ అక్షర తపస్సు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవధాన ప్రక్రియపై చిన్నచూపు వ ద్దు – శాఖమూరి రవిచంద్రబాబు

అవధాన ప్రక్రియపై చిన్నచూపు వ ద్దు – శాఖమూరి రవిచంద్రబాబు
‘ఆ రెండు వ్యాసాలపై ఈ రెండు మాటలు’ (వివిధ, మార్చి 23) అంటూ పి. రామకృష్ణ రాసిన లఘు వ్యాసం చదివిన తర్వాత ఈయనలో ఏ కొంతైనా సాహి త్య రసజ్ఞత ఉన్నదా! అని నాకనిపించింది. ‘అసంబద్ధ నిబద్ధత’- అంటూ ఏ అంశంపట్లా తనకు నిబద్ధత లేదని తన మాటలతోనే రుజువు చేసుకున్నారు.
ఆయన పేర్కొన్న పోలికో లేక ఉపమానమో ఏదైనా కావచ్చు. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అత్తయైుతే కిన్నెర శ్రీదేవి కోడలవుతారా! ఇందులో ఏమైనా ఔచిత్యం ఉందా! సలక్షణమైన మగతనం కలిగిన వ్యక్తిని అత్తతో పోల్చడమా? లక్ష పద్యాలు ధారణ చేసిన డాక్టర్‌ మేడసాని మోహన్‌ వంటి విద్వత్కవి రాసిన మాటలకు స్పందించే తీరు ఇదేనా? మరి అవధాన ప్రక్రియను పనిగట్టుకొని విమర్శించడంలో రామకృష్ణ ‘అత్తల’ వరుసలో చేరుతారా? లేక కోడళ్ళ వరుసలో చేరుతారో వారి విచక్షణకే
వదిలేద్దాం.
‘తెలుగు సాహిత్యవేత్తలు మాత్రం అవధానాలు తెలుగు పద్యం గౌరవ ప్రతిష్టల్ని దిగజార్చాయని గుర్తించారు’ – అనడం కేవలం రామకృష్ణ దుస్సాహసం. వారి వాదానికి అనుకూలంగా ఎక్కడో ఒక రాయప్రోలు వారిని ఉదహరిస్తే సరిపోతుందా? ‘వానలో తడువని వారు, మా గురువులు చెళ్ళపిళ్ళవారి అవధాన పద్యధారలో తడవని వారు లేరు’ అన్న తాత్పర్యంతో గురు ప్రశంస చేసిన విశ్వనాథ సత్యనారాయణ గారినీ, ఇంకా ఇదే విధంగా పేర్కొన్న ఎందరో పెద్దల మాటలు ఒక్కసారి గుర్తుచేసుకోగలిగితే సత్యం బోధపడుతుంది.
‘మీడియా క్రికెట్‌కు ఇస్తున్న ప్రచారం అవధానాలకూ ఇవ్వాలన్న మేడసాని కోర్కె కొంత హాస్యాస్పదంగానూ, ఎక్కువ భయపెట్టేదిగానూ ఉంది’ – అంటూ రామకృష్ణ పేర్కొనడం బట్టి వారు భవిష్యత్తులో అవధాన ప్రక్రియకు మరింత ఆదరణ పెరుగుతుందేమో! అన్న భయం, ఆ ప్రక్రియ పట్ల ద్వేషం, అసూయ బాగా పెంచుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇటువంటివారు ఎంత గింజుకున్నా అవధాన ప్రక్రియకు భవిష్యత్తులో మరింత ఆదరణ పెరగడం తథ్యం. ఆ సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ప్రముఖ అవధానులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, డాక్టర్‌ గరికపాటి నరసింహారావు, డాక్టర్‌ వద్దిపర్తి పద్మాకర్‌ ప్రభృతులు బుల్లి తెరపై ఏదో ఒక చానెల్లో నిరంతరం తెలుగు వారికి కనిపిస్తూనే ఉన్నారు. వారివారి ప్రతిభా పాండిత్యాలు తెలుగు వారికి రుచి చూపిస్తూనే ఉన్నారు. పైగా సంప్రదాయ సాహితీ ప్రక్రియలెన్నో బహుశ ప్రచారం పొందుతున్నాయి. ఇటువంటి ప్రక్రియలన్నీ అవధాన కళామతల్లి మానస పుత్రికలే. ఇవన్నీ పరిశీలిస్తే అవధాన ప్రక్రియపై రసజ్ఞ లోకంలో దిన దిన ప్రవర్ధమానవమవుతున్న ఆదరాభిమానాలు సువ్యక్తం. కాబట్టి అవధాన ప్రక్రియను పనిగట్టుకొని విమర్శించే వారి ఆలోచనలలో డొల్లతనం ఉండవచ్చు గాని అవధాన పద్యంలో కాదు – అని రసజ్ఞ లోకం గుర్తించగలదు.
చివరగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి మార్క్సిస్టు ధోరణిలో విమర్శలు రాసుకున్నా, రామకృష్ణ వంటి వారు వారిని పైకి విమర్శించినట్లు కనబడుతూ పరోక్షంగా అస్పష్ట విమర్శలు రాసినా – అందులోని మంచి చెడులను రసజ్ఞ లోకం విశ్లేషించుకోగలదు. కానీ పనిగట్టుకొని అవధాన ప్రక్రియను చిన్న చూపు చూడరాదు – అని మా విజ్ఞప్తి.
– శాఖమూరి రవిచంద్రబాబు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జన సృజనం – కొలకలూరి ఇనాక్‌

జన సృజనం – కొలకలూరి ఇనాక్‌
అరవై పుటల కాలపత్రికలో
పుట తిప్పినప్పుడల్లా
ప్రకృతిలో పరవశం ప్రసవిస్తుంది
పండుటాకు రాలిన ప్రతిసారీ
కొత్త చివురు మొలుస్తూనే ఉంది.
ఆకురాలటం విధ్వంసంలాగా ఉన్నా
చిగురు మొలవటం జన సృజన విస్ఫోటనమే!
దానికిష్టం లేకపోతే
మనమొక గడ్డిపరకను మొలిపించగలమా?
అన్నం పెట్టే రైతన్న కళ్ళలో మొలుస్తున్న ఆశల అడవుల్ని
ఎవరు నీళ్ళు పోసి పెంచారు?
సెలయేళ్ళులా ప్రవహించేవాళ్ళు
అడవుల్నేం కర్మ, కీకారణ్యాలనే సృష్టిస్తారు.
ఎడారుల్లో చీకటిలా వ్యాపించేవాళ్ళు,
కీకారణ్యాలై పుట్టలేరు.
నిద్రపోతున్న గింజ భూమిని చీల్చుకొని, మొక్కై పుట్టాలంటే
ఉక్కు సంకల్ప వజ్రాణువు విస్ఫోటనం చెందాలి.
మనలోపల ఎండిపోయిన నదుల్ని
మళ్ళీ గట్లు ఒరుసుకొంటూ ప్రవహింప చేసే
కుండపోత వాన
మనమిక్కడ కూర్చుని కలలు కంటుంటే కురుస్తుందా?
కాళ్ళారజాపుకొన్న భూదేవికి
సారెపెట్టి, చీరకట్టే సోదరులు నీరసిస్తే
పంటేం పండుతుంది? కడుపేం నిండుతుంది?
గుళ్ళో దేవుణ్ణి పెట్టి, గుడికి తాళం వేసే జనం
సొంత గుండె గుడి తలుపులు తెరవకపోతే
ఏం ఆరాధిస్తారు? ఏం సాధిస్తారు?
నెత్తిమీద గంపలో సద్దినీ
కొడవల్నీ మోస్తున్న తల్లి
కలుపుమొక్కల్ని పెకలించటమేకాదు
కడుపు పండిన పంటభూమి పేగునుకూడా మోస్తుంది.
వీధుల్లో తిరుగుతున్న అరుపుల ములుకులు గుచ్చుకోకపోతే
సూర్యుడు కూడా ఉదయించటానికి బద్దకిస్తాడు.
పురోగతిని నిరోధించమని
ఈ మూకలకు కేకలెవరు నేర్పారు?
ఆకలేకాదు, అసమానతలు తొలక్కపోతే
దారులన్నీ గోదారులై గంగలో కలుస్తాయి.
పంచవర్ష, పంచవర్ణ పతాకాలు
సోదరతా సూత్రంతో ఎగరకపోతే
మనిషి నిలిచే చోటెక్కడ?
మనుగడ మిగిలే రోజెప్పుడు?
మనకు తెలియటంలేదు కానీ,
మనం నిశ్శబ్దంగా చరిత్రను నిర్మిస్తున్నామనటం సత్యం.
మనం వచ్చిన తోవలో
దాన్ని నిర్మించిన శ్రామికుల
ఆరని చెమటను తొక్కివచ్చాం.
కాళ్ళు కడుక్కొనే మనం
కన్న కొడుకుల్ని కడుక్కొనేదెప్పుడు?
ప్రేమకోసం
ప్రపంచం కార్చిన కన్నీటి సముద్రాలమీద
దేశాలన్నీ తేలుతున్న తెప్పలని
మనకు తెలియొద్దూ!
చుక్కాని పట్టొద్దూ!
నిన్న ఉండేవన్న పాపానికి
నేడవసరం లేని గుదిబండలు లాగలేం!
మురికి బట్టలతో ఎంతోకాలం వేగలేం!
మెడకొక డోలు కట్టుకొని
ఎల్లప్పుడు వాయించుకొంటూ ఊరేగలేం!
వీళ్ళ పుర్రెల్లోని పుళ్ళను,
వాళ్ళ కళ్ళల్లోని కుళ్ళును
ఎంతకాలం భరించటం?
బాజాభజంత్రీలు వాయించటం?
అన్నదమ్ములు విడిపోతే నెత్తిన గుడ్డేసుకొచ్చిన అన్న
కొంప కట్టుకోవటం అనివార్యమేకదా!
అది ఇంద్రభవనమో, చంద్రభవనమో, అతని అదృష్టం.
అన్నదమ్ములు వేరైనా అమ్మానాన్నల రక్తం రంగుమారదు
ఏ జాతీ ఎల్లకాలం పరాభవం పొందదు.
బిడ్డ గుక్కపట్టి ఏడవటం
ఆకలయ్యేకాదు,
అమ్మ ఎత్తుకోలేదని కూడా.
ఏడ్చేబిడ్డనెత్తుకోని తల్లేంతల్లి?
వైరుద్ధ్యాల సమన్వయ సాధనే సమర్థత.
సమర్థులే చరిత్రను నిర్మిస్తారు
భవిష్యత్తును శాసిస్తారు.
–  కొలకలూరి ఇనాక్‌
9440243433
(మన్మథనామసంవత్సర ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన కవి సమ్మేళనంలో
అధ్యక్షస్థానం నుంచి చదివిన కవిత)
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రామాణికము – మాండలికము – జి.ఎస్‌. రామ్మోహన్‌

ప్రామాణికము – మాండలికము – జి.ఎస్‌. రామ్మోహన్‌
కొన్ని అవసరాల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువమంది కలుస్తున్న చోట ఎక్కువమందికి అర్థమయ్యే భాషే ప్రాచుర్యం పొందుతుంది. ‘శాస్ర్తీయ’ సంగీతంలో ఘరానాల మాదిరి ప్రత్యేకతలను కాపాడుకోవాలనుకుంటే కాపాడుకోవచ్చును కానీ దాన్ని ఆధిపత్య స్థానంలో నిలబెట్ట ప్రయత్నించరాదు. అసలు భాష అనే పరికరం లాగే దీనికి కూడా సామాజిక అవసరమే ప్రాతిపదిక.
అంచున నిలబడి మాట్లాడితే ఉండే తక్షణాకర్షణ మామూలుగా మాట్లాడితే ఉండదు. ఆకర్షణ ప్రాధమికంగా మారిన వర్తమాన సన్నివేశంలో ఏ రంగమూ దీనికి అతీతంగా మనలేకపోతున్నది. ప్రామాణికం-మాండలికం వంటి అంశాల్లోనూ ఈ పోకడ ప్రముఖంగా కనిపిస్తున్నది. ప్రామాణికానికి వ్యతిరేకమైన ధోరణి ప్రబలంగా కనిపిస్తున్నది.
బక్తిన్‌ భాషా పరంగా కార్నివాల్స్‌కు ఎలాంటి పురోగామి లక్షణాన్ని ఆపాదించారో అలాంటి పాత్రను ఇక్కడ రావిశాస్ర్తి, నామిని, అల్లం రాజయ్య వంటివారి రచనలు పోషించాయి. మాండలికం ఆ రూపంలో ఆ మేరకు తన పాత్రను నెరవేర్చింది. అంతమాత్రాన ప్రామాణిక భాష దానికది విలన్‌ అయిపోదు.
మాండలికం అందంగా ఉంటుంది. కాకపోతే అందం లాగే అందమైనవీ శాశ్వతాలు కావు. మార్పుకు అతీతం కావు. ఆ మాట కొస్తే ఆ అందం కూడా మనం భావనాత్మకంగా ఏర్పరుచుకున్నది మాత్రమే. అది స్థిరంగా ఉండదు. కాలంతో పాటు ప్రయాణిస్తుంది. రాజ్‌కపూర్‌ కాలంనుంచి రణబీర్‌ కపూర్‌ కాలానికి అందం మారిపోలేదా! భాష కూడా అంతే. మాండలికంలో సాహిత్యం రాయడం దానికదిగా గొప్పచేసి మాట్లాడే ధోరణి ఇటీవల పెరిగిపోయింది. అందులో రాయకపోతే గొప్ప రచన కాలేదేమోనన్న భయం రచయితల్లో కలిగించేంతగా పెరిగిపోయింది. ఇది రచయితల మీద అనవసరమైన భారం మోపుతోంది. ఈ రచనకు మాండలికం అవసరం అని రచయిత అనుకొని రాయడం వేరు. మాండలికం రాయకపోతే గుర్తింపు పొందదేమో అనుకోవడం వేరు. రెండో రకమైన వత్తిడి ఇపుడు సాహిత్య ఆవ రణంలో కనిపిస్తోంది.
తెలుగులో వాడుకభాష కోసం ఉద్యమించినవారు తొల్దొలుత శిష్ట వ్యావహారికాన్ని ఆశ్రయించారు. దానికి పత్రికలను సాధనంగా మల్చుకున్నారు. శ్రీపాద వారి ఉద్యమ వేదిక ప్రబుద్ధాంధ్ర మొదలుకుని ఆంధ్రపత్రిక, కృష్ణా వరకు అనేక పత్రికలు తొలిదశలో దీనికి వేదికైనాయి. గురజాడ, గిడుగు, శ్రీపాద వంటి వారి కృషి ఉన్నది. అది ఆనాటి అవసరం. ఆ నాటికి అది పురోగామి అంశమే. నాగార్జున సాగర్‌, శ్రీశైలం నిర్మాణం జరక్కమునుపే శిష్ట వ్యావ హారికాన్ని ప్రామాణికంగా తీసుకున్నారని దాని కొనసాగింపే ఇవాళ మీడియాలో చూస్తున్న భాష అని గుర్తుంచుకోవాలి. ‘‘ఇప్పడు మహాపండితులైన బ్రాహ్మ ణులు మొదలుకుని కుటుంబ వ్యవహారాలు సరిపెట్టుకోవడానికి చాలిన ఏ కొద్ది మాటలు మాత్రమో బోధపర్చుకోగల నిమ్న జాతీయుని దాకా అందరూ అచిర కాలంలోనే నిమిషాల మీద విజ్ఞానవంతులు కావాలి…….అది పత్రికల వల్లనే సాధ్యమవుతాయి..’’ అన్న శ్రీపాద వారి సంపాదక వ్యాఖ్య విప్లవాత్మకమని భావించే రోజులు కాబట్టి ఆ ప్రామాణిక భాష మీద పరోక్షంగానైనా కులప్రభావం ఉన్నంతగా ప్రాంతీయ ప్రభావం ఉందనుకోలేము. సాహిత్యంపైనా దాని ప్రభావం బలంగానే ఉండింది. మాండలిక రచనలు అందులోని శిష్టత్వపు ఆధిపత్యాన్ని తీసేసి వర్కింగ్‌ క్లాస్‌ పలుకుబడులను వేదికనెక్కించాయి. బక్తిన్‌ భాషా పరంగా కార్నివాల్స్‌కు ఎలాంటి పురోగామి లక్షణాన్ని ఆపాదించారో అలాం టి పాత్రను ఇక్కడ రావిశాస్ర్తి, నామిని, అల్లం రాజయ్య వంటివారి రచనలు పోషించాయి. మాండలికం ఆ రూపంలో ఆ మేరకు తన పాత్రను నెరవేర్చింది. అంతమాత్రాన ప్రామాణిక భాష దానికది విలన్‌ అయిపోదు. ప్రామాణికము, మాండలికం రెండూ రైలు పట్టాల్లాగా విడివిడిగా ముందుకు సాగవు. జంక్షన్లలో కలిసినట్టుగా కలుస్తూ విడిపోతూ పరస్పరం ప్రభావితమవుతూ ఉంటాయి. ప్రజాస్వామికమవుతూ ఉంటాయి. తెలుగులో ప్రామాణిక భాష అనేదొకటి ఉన్నదా అని మరీ కడుపు చించుకోకుండా సాధారణ భాష అనుకుంటున్నదాన్నే ప్రామాణికం అని కనుక అనుకుంటే ఇవాళ వాడుతున్న ప్రామాణిక భాష గతం లో అదే పేరుతో కొనసాగిన భాష ఒక్కటి కావని సులభంగానే అర్థమవుతుంది. ప్రయత్నపూర్వకమైన సాహిత్యాన్ని పక్కనబెడితే నిత్య వ్యావహారికంలో ప్రామాణిక భాష అవసరం ఎక్కువ. ముఖ్యంగా పట్టణ జీవనంలో.
బాధిత దృక్కోణం నుంచి వేదికనెక్కే చాలా భావనలు అప్పటికి ఆధిక్యంలో ఉన్న ప్రమాణాలను సవాల్‌ చేయడానికి అవే ఆధిపత్య పదజాలాన్ని ఆశ్రయించడం, మాదే విశిష్టమైనది అనే వాదనను ముందుకు తేవడం చూస్తూ ఉంటాం. అది ఆ భావోద్వేగంలో చేసే పని తప్ప అందులో వాస్తవముండదు. ఏదీ విశిష్టమైనది కానక్కర్లేదు. మాండలికమైనా, భాషైనా. దేశ భాషలందు తెలుగు లెస్‌ కాకూడదు అనుకోవడం వరకూ అర్థం చేసుకోవచ్చు. కానీ లెస్స ఎందుకు కావలె? సమానమైనది, భిన్నమైనదనే పదజాలం ప్రజాస్వామికమైనది. విశిష్టమైనది, లెస్సైనది అనేవి ఆధిపత్యపరిభాష. మాండలికాలు వ్యాప్తి చెందక ముందు ’సాధారణ’ భాషలో రాయడమే ప్రామాణికంగా ఉన్న రోజున దాని ఆధిపత్యాన్ని సవాల్‌ చేయడానికి మాండలికానికి విలువల్ని ఆపాదించుకుంటూ పోతాం. ఆ తర్వాత అది ఇంతింతై వటుడింతై మన నెత్తిన మూడో పాదం మోపే స్థాయికి చేరుకుంటుంది. ఇపుడు అదే జరుగుతోంది. చివరకు భాషలో పలికే అన్ని ధ్వనులను లిపిలోకి తర్జుమా చేయడానికి వీరమాండలిక వాదులు ప్రయత్నిస్తున్నారు. ధ్వని ప్రాధమికమని, లిపి కేవలం దానికి సంకేతప్రాయమైన ద్వితీయ రూపం మాత్రమేనని మర్చిపోతున్నారు. భాష ప్రాధమికంగా వాగ్రూపం. ఆది యందు వాక్యము లేదు. శబ్దమే ఉన్నది. సంజ్ఞలు కూడా ఉన్నవి. స్థూలంగా శరీరభాష, శబ్ద రూపము కలగలిసిన వ్యక్తీకరణ రూపమే భాష. ఒక భాషా శాస్త్రవేత్త సైన్స్‌ ఆఫ్‌ సైన్స్‌(ఖిఛిజ్ఛీుఽఛ్ఛి ౌజ ఖిజీజుఽట) అన్నారు. తర్వాత వాళ్లు ఆధిపత్యం పాత్రను విశ్లేషించడంలో భాగంగా ‘ప్రొడక్షన్‌ ఆఫ్‌ మీనింగ్‌’ అంటూ చర్చను ఎంత దూరం తీసికెళ్లినా భాషకున్న ప్రాధమిక రూపాన్ని అయితే ధిక్కరించలేరు.
తమ తమ ప్రాంతాల్లో మాండలికాలు కరిగి పోతున్నాయని వగచేవారిని అయితే ఏంటి అని అడిగే వారు కరువైపోయారు. వాస్తవానికి వారి ఏడుపు మాండలిక ధ్వనులు పోయినవని కాదు. పాత సాధనాలు, వాటికి సంబంధించిన రాతలు పోయినవని. ఏది పోయినా ఏడవడమే. అటక పోయింది, అటకమీద ఉట్టిపోయింది. ఉట్టిలో సట్టిపోయింది. సట్టిలో పుల్నీరు పోయింది. కట్టెల పొయ్యిపోయింది. పొయ్యిపక్కనే పొంతబాన బోయింది. ఏమిరా నాయనా పోతే. అంతకంటే మెరుగైనదేదో రాబట్టే కదరా నాయనా అవి పోయినవి. ప్రయో జనము అంతరించిన సాధనములు పోవును. నీవు వాడని వాటికి నీకు అవసరం లేనివాటికి పోయినాయని వగచడమేమిట్రా నాయనా అనడానికి ఇంకా ఎక్కడో బెరుకు! పోయే ప్రతిదాని మీదా ఏడ్చేవాళ్లకు ఆంగ్లంలో ఒక పేరున్నది. కన్స ర్వేటివ్స్‌ అందురు. తెలుగులో మాత్రం పురోగామి ముసుగులోనే సంచరించు చున్నారు. అలాగని ప్రతి వేలంవెర్రి వయ్యారాన్ని ఆహ్వానించమని కాదు. కొంతమంది యాంకర్లు, రేడియో జాకీలకు కొట్టారు, తిట్టారు అనే చిన్నపదాలు కూడా పలకడం కూడా రాదు. అన్నింటికి చెట్టాపట్టాల ధ్వనే. తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్‌లో బాగా పాపులర్‌ అయిన ఒక వనిత ఉచ్చారణలో తెలుగుదనం అస్సలే మాత్రం కనిపించదు. వ్యవహారికంలో భాగంగా ధ్వనినుంచి నుంచి ఉచ్చారణను నేర్చుకోకుండా లిపినుంచి అర్థం చేసుకోవడం వల్ల వచ్చిన తిప్పలవి. అది సామాజిక అవసరం కాదు. ఆ పరిణామాల్లో భాగంగా వచ్చిన మార్పు కాదు. పిడికెడు మంది అశక్తత, అజ్ఞానం అందలమెక్కడం వల్ల కనిపిస్తున్న వికృత రూపం మాత్రమే. ప్రతి మార్పును శాస్ర్తీయమైన పద్ధతిలో చూడాలి. ఇరానీ చాయ్‌ దుకాణాలు అంతరిస్తూ ఉండడాన్ని హైదరాబాద్లో రియల్‌ ఎస్టేట్‌ వాల్యూ పెరగడంలో భాగంగా, మనుషుల సమయపాలనలో వచ్చిన మార్పుల్లో భాగంగా చూస్తామా లేక కేవలం సాంస్కృతిక దాడిగా చూస్తామా అనేది నీ దృక్కోణం మీద ఆధారపడి ఉంటుంది. రాడికల్‌గా కనిపించడం కోసం మాట్లాడతామా నిజంగా రాడికల్‌గా ఆలోచిస్తామా అనేదాన్ని బట్టి ఉంటుంది. భౌతిక పరికరాల విషయంలోనే కాదు, సాంస్కృతిక పరికరాల విషయంలో కూడా మార్పు తథ్యం. భాషలోనూ మాండలికాల్లోనూ ఉచ్చారణల్లోనూ మార్పు వస్తుంది. కాకపోతే భౌతిక పరికరాలలో వచ్చినంత వేగంగా కనిపించదు. నెమ్మదిగా జరుగుతుంది.
మనుషులు తమ అవసరాల కోసం వలసలు పోతూ ఉంటారు. వలస అనేది లేకపోతే మానవ పురోగతే లేదు. కోట్లు సంపాదించే వలసా, కూడు సంపా దించుకునే వలసా అని దీర్ఘాలు తీసి స్ఫూర్తి విషయంలో మొత్తంగా వలసలకే వ్యతిరేకంగా మాట్లాడనక్కర్లేదు. కూడు సంపాదించుకునే వాళ్లకే వలసలు ఎక్కువగా అవసరం. ఇప్పుడున్న సమాజంలో వలసలెక్కువ. ప్రయాణాలెక్కువ. మనుషుల కలయికలెక్కువ. వేలఏళ్లుగా చలనం లేకుండా గడ్డకట్టుకుని పోయిన రూపంలోనే ఇపుడు సమాజం లేదు. అవసరాలకోసం నిరంతరం ప్రవహిస్తున్నది. సామాజిక, వైయక్తిక అవసరాల కోసం మనుషులు పెద్ద ఎత్తున కలుస్తున్నపుడు భాషలో కూడా ఒకరకమైన సాధారణ రూపం ఏర్పడుతుంది. ఏకశిలా సదృశ్యం చేస్తున్నారు, వైవిధ్యాన్ని చంపేస్తున్నారు అని ఓ బాధ పడిపోనక్కర్లేదు. భిన్నత్వం భిన్నత్వం కోసం కాదుకదా! అవసరమైన భిన్నత్వం మిగులుతుంది. అంతరించా ల్సిందేదో అదే అంతరిస్తుంది. దైనందిన వ్యవహారాల్లో భాష అప్రయత్నంగా అర్థం కావడం అవసరం. ప్రయత్నంతో కూడిన సాహిత్యం కథ వేరే.
కొన్ని అవసరాల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువమంది కలుస్తున్న చోట ఎక్కువమందికి అర్థమయ్యే భాషే ప్రాచుర్యం పొందుతుంది. ‘శాస్ర్తీయ’ సంగీతంలో ఘరానాల మాదిరి ప్రత్యేకతలను కాపాడుకోవాలనుకుంటే కాపాడుకోవచ్చును కానీ దాన్ని ఆధిపత్య స్థానంలో నిలబెట్ట ప్రయత్నించరాదు. అసలు భాష అనే పరికరం లాగే దీనికి కూడా సామాజిక అవసరమే ప్రాతిపదిక. ఏర్పడతది అనే వారికి కూడా కనిపిస్తుంది అనేది అర్థమైనపుడు కనిపిస్తుంది అనేదే మిగులుతుంది. సొమ్మలు, బేపి అనేవారికి కూడా ఆవులు, కుక్క అనేవి అర్థమవుతున్నపుడు ఎక్కువ ఏది అర్థమవుతున్నదో అదే వ్యావ హారికంలో మిగులుతుంది. ‘లెక్కియ్యక పోతే మెట్టుతో గొడ్త నా బట్టా’ అంటే అందంగానే ఉండొచ్చు. కానీ లెక్క బదులు డబ్బు, మెట్టు బదులు చెప్పు ఎక్కువమందికి అర్థమవుతున్నపుడు అవే మిగులుతాయి. అందులో బాధపడాల్సిందేమీ లేదు. అందరికీ అర్థం కావడం అనేదాంట్లో కూడా ఆధిపత్య రాజకీయాలు లేవా, మీడియా పాత్ర లేదా అని ప్రశ్నించొచ్చు. అవన్నీ పాక్షికంగా సత్యాలే. ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే కానీ మొత్తంగా పిడుక్కీ బియ్యానికీ ఒకటే సూత్రం అంటే కుదరదు. బలవంతుల ప్రభావం భాషపై కూడా ఉంటుం దన్న జనరల్‌ సూత్రం కొంతవరకు వాస్తవమే కానీ వారి భాషే ప్రామాణి కమవుతుంది అనే బండ సూత్రీకరణ అంతిమ సత్యం ఏమీ కాదు. అదే నిజమైతే ఆ ఆధిపత్య ప్రాంతం వారి ‘ఎదర’ వారి ఎదరే ఎందుకు ఉండి పోయింది. మనందరిలో ఎందుకు భాగం కాలేకపోయింది? వారి ఎనకమాల వారి ఎనకమాలే ఎందుకు ఉండిపోయింది? వాస్తవానికి వారు మాట్లాడే పద్ధతి ఇవాళ సాధారణ భాషగా సాహిత్యంలో రాస్తున్న పద్ధతి ఒకటి కాదు. రాజకీయ కోపాన్ని మనం భాషలోకి తెచ్చి చాలా సార్లు అలాంటి తీర్మానాలు చేసేస్తుంటాం.
టీవీ ఇంటర్‌నెట్‌ శకం తర్వాత అన్నీ అందరూ పంచుకుంటున్న తరుణాన మన ప్రాంతానికే ప్రత్యేకమైనదేదో మార్పు లేకుండా యథాతథంగా మిగులుతుందనుకోవడం, మిగలాలనుకోవడం అచారిత్రకమైన ఆశావాదం కూడా కాదు, అనవసరమైన ఆశావాదం. తిండీ తిప్పలు, ఆటా పాటా, మొబైళ్లు, బీర్లు, బార్లు అన్నీ ఒకటైపోవాల. భాష ఒక్కటి అలాగే నిలిచిఉండాలంటే ఎలా! ఒకనాటి కోయిలకుంట్ల, జమ్మికుంట్లలో తిండితిప్పలు, ఆచారవ్యవహారాలు ఇవాళ ఉన్నట్టు లేవు. మనకు సుఖంగా అనిపించినవి, అవసరమనిపించినవి మార్చుకుంటూ వస్తున్నాం. అందులో మార్పు ఉన్నదని సైలెంట్‌గా మర్చిపోతున్నాం. కానీ భాష గురించి మాత్రం బాధపడిపోతూ ఉంటాం.
ఒకనాడు కొన్ని ప్రాంతాలను కొన్ని మాండలికాలను కళారూపాల్లో కించపరుస్తున్నారని భావించడం వల్ల ఆయా మాండలికాలకు మద్దతుగా మాట్లాడడం అవసరమై ఉండొచ్చు. ఆ మాటకొస్తే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మాండలికాలను పనికట్టుకుని అవమానపరిచే సన్నివేశాలు చాలా సినిమాల్లో ఉన్నాయి. అందులో పెట్టుబడితో పాటు వచ్చి చేరిన ఆధిపత్య భావ జాలంతో పాటు దేన్నైనా కేరికేచరింగ్‌ చేసే తెలుగు సినిమా థర్డ్‌ రేట్‌ ధోరణి కూడా కలగలసి ఉన్నది. ఇవన్నీ చర్చించొచ్చు. ఆ ఆవేదనతో కాళోజీ లాంటి వారు రెండున్నర జిల్లాల భాష అనేదాన్ని నిందావాచకం చేసి ఉండొచ్చు. ప్రాంతీయ ఉద్యమాల్లో దాని పాత్ర అది పోషించి ఉండొచ్చును. అదొక రాజకీయ అవసరం అయి ఉండవచ్చును. దాన్ని ఆ పరిమితుల్లో చూడాలి తప్పితే సర్వకాల సర్వావస్థలయందునూ వర్తించే శాశ్వతసత్యంగా భావించరాదు. ఇవాళ నగరాల్లో పట్టణాల్లో వాడుతున్న భాష ఏ ప్రాంతానిదీ కాదు. అన్నీ కలిసిపోయి కరప్ట్‌ అయిపోయింది సార్‌ నా భాష అని నిందార్థంలో వాడుతుంటాం. అది సరదాగా అయితే ఓకె అనుకోవచ్చును కానీ, వాస్తవానికి అది కరప్ట్‌ కావడమేమీ లేదు. విభిన్న ప్రాంతాలనుంచి ఎక్కువమంది పనుల నిమిత్తం పోగయ్యే చోట అందరికీ సులభంగా అర్థమయ్యేదేదో రూపొందుతుంది. అందులో లేశమాత్రం కించపడాల్సిందేమీ లేదు. గ్రామాల్లో కూడా పనుల కోసం వేర్వేరు చోట్లకు వెళ్లాల్సినవారికీ, సోషల్‌ లైఫ్‌ తక్కువగా ఉండి చలనం కరవైన వారికీ భాషలో తేడా తెలుస్తుంది. ఇది ఏ ప్రాంతానికీ పరిమితం కాదు. అందరికీ వర్తిస్తుంది. వాస్తవానికి తెలుగునాట ప్రామాణిక భాష కోసం ఇంతవరకూ నిర్దుష్టమైన కృషి జరగలేదు. పత్రికల ద్వారా ప్రాచుర్యం పొందిన సాధారణ భాషనే ప్రామాణిక భాషగా భావిస్తూ వస్తున్నాం. ‘‘అన్ని సీమల పలుకుబళ్లూ, బోధపరుచుకుని అన్ని సీమల జీవశక్తీ పూడ్చుకుని స్వస్వరూప జ్ఞానంతో ధృఢంగా నిలవగల భాష’’ కోసం 80 యేళ్ల క్రితం మన పూర్వీకులు కన్న కల ఇవాల్టికీ తీరలేదు. ఆ అవసరమైతే మునుపెన్నటికంటే ఎక్కువగా ఉన్నది.
జి.ఎస్‌. రామ్మోహన్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అప్పటి నుంచి సలహాలు ఇవ్వటం మానేశాను – చంద్రమోహన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూపర్ స్టార్ సినీ స్వర్ణోత్సవం (28-Mar-2015)

సూపర్ స్టార్ సినీ స్వర్ణోత్సవం (28-Mar-2015)

‘తేనేమనసులు’ చిత్రంతో మార్చి 31, 1965న తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన నట వైదూష్యంతో అభిమానుల హృదయాల్లో ‘పాడిపంటలు’ పండించారు నటశేఖర కృష్ణ. వెండితెరపై పండు వెన్నెల కురిపిస్తూ 50 ఏళ్ల నిండైన సినీ జీవితానికి చేరువయ్యారు. సినీ కళామతల్లి ముద్దు బిడ్డగా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సొంతం చేసుకున్నారు. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, అగ్నిపర్వతం… ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ సగటు అభిమానికి సూపర్ స్టార్ అందించిన ఆణిముత్యాలకు అంతులేదు. తన నటజీవితంలో ఆయన అందుకోని రికార్డులు లేవు, పొందని సత్కారాలు లేవు.
1943 మే 31న జన్మించిన కృష్ణ నటనకే పరిమితం కాలేదు. దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా సిల్వర్ స్ర్కీన్‌కి అమూల్యమైన సేవలు అందించారు. తన వారసుడిగా ప్రిన్స్ మహేష్‌ను టాలీవుడ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చి స్టార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సూపర్ స్టార్‌కి సినీ జీవిత స్వర్ణోత్సవ శుభాకాంక్షలు.
Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మిస్టర్ కూ ల్ అనే చెవిలో పువ్వు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పతంజలి దెయ్యపు పలకరింపు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సూర్యారావు మాస్తారు చెప్పిన పాఠాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూరీలో దేవుళ్ళ మార్చే ”నవ కళేబర ఉత్సవం ‘

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సీతారామ కళ్యాణ వైభోగం


 
 
 
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అరుదైన వ్యక్తికీ అరుదైన గౌరవం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్షర మాంత్రికుడు రోణంకి అప్పలస్వామి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లేదు… లవకుశకు సాటి-లోకనాథం సత్యానందం

లేదు… లవకుశకు సాటి

  • 27/03/2015
  • -లోకనాథం సత్యానందం

అర్థ శతాబ్దం దాటినా చెక్కు చెదరని రికార్డు -లవకుశది. ఉత్తర రామాయణ గాధ ఇతివృత్తంతో నిర్మితమైన సినిమా -ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ఎంత ఓలలాడించిందో.. కమర్షియల్‌గా అంత వసూళ్లు అందించి రికార్డుల శిఖరంపై స్థానాన్ని పదిలపర్చింది. వాణిజ్యపరంగా లవకుశ సాధించిన విజయం -్భరత సినీ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. సినిమా విడుదలైన సమయంలో -్థయేటర్లలో టిక్కెట్టు ధరలు పావలా నుంచి రూపాయి. అప్పటి లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా -మూడు కోట్లు. అలాంటి తరుణంలో ‘లవకుశ’ వసూలు చేసిన మొత్తం -కోటి రూపాయిలు. అంతేకాదు -75 లక్షల జనాభావున్న వంద కేంద్రాల్లో 1.98 కోట్ల టిక్కెట్లు అమ్ముడైనట్టు లెక్కలున్నాయి. అంటే ఉన్న జనాభాకు మించి మూడురెట్లు టిక్కెట్లు అమ్ముడయ్యాయి. సరాసరిన -ఒక్కొక్కరు సినిమాను మూడుసార్లు చూశారన్నమాట. ఇదీ లవకుశ అసాధారణ రికార్డు. ముక్తాయింపు ఏమిటంటే -ఇప్పటి లెక్కలను అప్పటి ‘లవకుశ’కు అన్వయిస్తే -వసూళ్ల మొత్తం వెయ్యి కోట్లు. గుండెలమీద చెయ్యి వేసుకోవాలనిపిస్తోంది కదూ! -శ్రీరామనవమి సందర్భంగా ‘లవకుశ’ ట్రాక్ రికార్డులు ప్రత్యేకవ్యాసంగా -పాఠకుల కోసం. అలనాటిమేటి చిత్రం -లవకుశ. 50ఏళ్లు పైబడినా వనె్నతగ్గని సినీకావ్యం. మునికుమారుల రూపాల్లో లవకుశలు గానం, అభినయంతో ఆకట్టుకుంటూనే -శ్రీరాముడినే ఎదిరించిన సన్నివేశాలను ఆనందించని ప్రేక్షకుడుండడు. రామాయణం ఇతివృత్తంతో ఎనె్నన్నో సినిమాలు వచ్చాయి. కానీ -లవకుశకు సాటి లవకుశే. ప్రతి ఫ్రేము తెలుగువాడి గుండెల్లో గూడుకట్టుకుంది. శ్రీరాముడు ఇలాగే ఉంటాడన్నంతగా ఎన్టీఆర్, సీతమ్మ ఈమేనేమో అన్నంతగా అంజలీదేవి.. ఆయా పాత్రలకు మిగిలిన నటులూ జీవం పోశారు. శ్రీరామనవమి వస్తేచాలు.. ఏదోక ఛానెల్‌లో ‘లవకుశ’ ప్రసారమవుతుంది. అజరామర రామకథను చూసి భక్తులు పరవశించిపోతారు. మొదటగా లవకుశను బెంగాలీలో తీశారు. దర్శకుడు దేవకీబోస్. రాముడు పృథ్వీరాజ్‌కపూర్. ఇది ఒక స్టేజ్ నాటకం ఆధారంగా నిర్మితమైంది. తెలుగులో రామాయణ నాటకానికి ఆదరణ లభించటంతో -దర్శకుడు సి పుల్లయ్యకు సినిమాగా మలచాలన్న ఆలోచన వచ్చింది. మొట్టమొదటి తెలుగు లవకుశకు రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతం. రాముడిగా పారుపల్లి సుబ్బారావు, సీతగా సీనియర్ శ్రీరంజని.. ఇలా 1934లో చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. నిర్మాత శంకర్‌రెడ్డి చరణదాసి (1956)లో ఒకచోట రామారావు, అంజలీదేవి సీతారాముల్లా కనిపిస్తారు. అప్పుడే శంకర్‌రెడ్డికి ‘లవకుశ’ను దర్శకుడు సి పుల్లయ్యతో తీయాలన్న ఆలోచన వచ్చింది. లవకుశకు -ఉత్తర రామచరితాన్ని కథావస్తువుగా తీసుకున్నారు. రావణసంహారం చేసి సీతాసమేతుడై వచ్చిన రామయ్య తండ్రినిచూసి ఆనందపరవశంతో అయోధ్య సంబరాలు చేసుకుంటుండగా -లవకుశ సినిమా ఆరంభమవుతుంది. లవకుశకు కథానాయకుడు శ్రీరాముడు -నందమూరి తారక రామారావు. రాముడంటే అతనేననే భావన తెలుగు ప్రజల్లో కలకాలం ఉండేంత గొప్పగా ఆ పాత్రను పోషించారు ఎన్టీఆర్. అప్పట్లో ఆయన పోస్టర్లకు పూజలు చేశారంటే -రాముడిగా ఆయన ఎంతగా ముద్రవేశారో ఊహించుకోవచ్చు. సీతాదేవి పాత్ర పోషించిన అంజలీదేవి ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ‘శ్రీరాముడి వేషంలోవున్న ఎన్టీఆర్‌ను ఒక్కోసారి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయేదాన్ని. సినిమా చివర ఒక సన్నివేశంలో ఆయన సీతా, సీతా అని విలపిస్తుంటే -మాకు తెలియకుండానే కన్నీళ్లుపెట్టేశాం. ఎన్టీఆర్ గురించి చెప్పడానికి కూడా యోగ్యత కావాలి’. ఇక -అప్పట్లో అంజలీదేవిని సీతమ్మగానే చూశారు తెలుగు ప్రేక్షకులు. తొలి లవకుశలో నటించిన సీనియర్ శ్రీరంజని సైతం సీతగా చెరగని ముద్రవేశారు. అప్పట్లో శ్రీరంజని పోస్టర్లను కత్తిరించి గోడకు అతికించి పూజలు చేసేవారట. అలాంటి సీత పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన అంజలీదేవి మరింతమంది అభిమానులను ప్రోదిచేసుకున్నారు. అప్పట్లో ఆమెను ప్రజలు భూదేవి బిడ్డలాగే చూసేవారు. తమ పొలాల్లో కాలుపెట్టాలని రైతులు కోరేవారు. ఆమె పాదాలవద్ద వరి కంకులుంచి నమస్కరించేవారు. మహిళలు హారతులు పట్టారు. పసుపుకుంకుమలు ఇచ్చేవారు. ఇలా అంజలీదేవి సీతమ్మదేవిగా చెరగని ముద్రవేసుకున్నారు. ఇక లవకుశుల ఎన్నిక కూడా పుల్లయ్యగారిదే. వాళ్లిద్దరూ చిత్ర విజయంలో ప్రధాన పాత్రధారులయ్యారు. కాకినాడ సమీపంలోని గొల్లపాలెంలో రంగస్థల నటుడు సుబ్బారావు, ఇద్దరు కొడుకులతో ఒక క్లబ్‌వారు నాటకం వేయించారు. ఆ నాటకంలో కుశుడి పాత్రను సుబ్రహ్మణ్యం అనే కుర్రాడు చేశాడు. అది పుల్లయ్యగారు చూసి తన సినిమాలో కుశుడిగా ఎంపిక చేసుకున్నారు. లవకుశ చిత్రంలో గొప్ప పేరు తెచ్చుకున్నా -తర్వాత అవకాశాలు లేక టైలర్‌గా స్థిరపడిపోయారు కుశుడి పాత్రధారి సుబ్రహ్మణ్యం. ఇక లవుడు పేరు నాగరాజు. ఇతని తండ్రి ఏవీ సుబ్బారావు సినిమా ఆర్టిస్టు. ఈ కుర్రవాడు ‘్భక్తరామదాసు’ చిత్రంలో తొలిసారి చేశాడు. అలా పుల్లయ్యగారి దృష్టిలోపడి లవుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇతని ఇంటి పేరు లవకుశ నాగరాజుగా స్థిరపడిపోయింది. ఇక లక్ష్మణుడిగా కాంతారావు, భరతుడిగా కైకాల సత్యనారాయణ, కౌసల్యగా కన్నాంబ, శత్రుజ్ఞుడుగా శోభన్‌బాబు, వాల్మీకిగా చిత్తూరి నాగయ్య, రేలంగి, రమణారెడ్డి, వరలక్ష్మి, గిరిజ వంటివారు తమతమ నటనతో అలరించారు. తెలుగు, తమిళంలో ఒకేసారి తీయటంతో తమిళంలో లక్ష్మణుడి పాత్ర జెమినీ గణేశన్ పోషించారు. లక్ష్మణుడి పాత్రకు కాంతారావు ఆశపడ్డారని తెలిసి -తెలుగులో కాంతారావుకే ఆ పాత్రను ఇచ్చారు. తమిళంలో లవుని పాత్రకు బేబీ ఉమ, కుశుని పాత్రకు మురళిని ఎంపిక చేశారు. ఈ లవకుశ చిత్రానికి కథా రచన శివసుబ్రహ్మణ్యం, సంగీతం ఘంటసాల, పాటలు సముద్రాల రాఘవాచార్య, సదాశివబ్రహ్మం, కొసరాజు అందించారు. వాల్మీకి ఆలపించిన సీస గీతం, సీతాదేవి భూదేవిని ప్రార్థించే శ్లోకం కంకంటి పాపరాజు వ్రాసినవి వాడుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరి సమష్టి ఫలితంగా చిత్రరాజం రూపుదిద్దుకుని, ఎన్నో రికార్డులు నెలకొల్పింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. నటీనటులకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. దిగ్గజాలయిన దర్శక, నిర్మాతలు ‘లవకుశ’ చిత్రానికి దర్శకునిగా చిత్తజల్లు పుల్లయ్యను నిర్మాత అల్లాడి శంకర్‌రెడ్డి ఎన్నుకున్నారు. ఇదివరకే ‘లవకుశ’ సినిమా తీసి హిట్ దర్శకుడు అనిపించుకున్న పుల్లయ్యకు -ఈ కథమీద అపారమైన ప్రేమ. అందుకే ఎన్నిసార్లయినా డైరక్ట్ చేస్తానన్న విధంగా ఒప్పుకున్నారు. లవకుశ నిర్మాణం కొంతసాగిన తర్వాత పుల్లయ్యగారికి ఆరోగ్యం బాగులేదు. షూటింగుకు రావడమే కష్టమైంది. మిగిలిన సినిమాను ఎవరు పూర్తిచేస్తారు? అన్న ప్రశ్నతో కొందరు పుల్లయ్య తనయుడు సిఎస్ రావు పేరు ప్రతిపాదించారు. మరికొందరు బిఎన్ రెడ్డిగారి పేరు ప్రతిపాదించారు. సిఎస్ రావు కూడా అలాగేనని బిఎన్ రెడ్డిగారిని కలిసి సినిమాను తీయమని కోరారు. ఆయన సున్నితంగా తిరస్కరించి ‘అది మీ నాన్నగారి సొత్తు. నాడు నేడు కూడా మీకే చెందాలి’ అంటూ సిఎస్‌ఆర్‌ను ఆశీర్వదించి పంపారు. బాగున్నప్పుడల్లా మధ్యమధ్యలో పుల్లయ్య వచ్చి చూసి నిర్మాణానికి సంబంధించిన సలహాలిచ్చేవారు. ఇక ఇంతటి గొప్ప చిత్రరాజం తీసి, తెలుగువారు, విదేశీయుల ప్రశంసలు అందుకున్న ఘనుడు, నిర్మాణ సాహసి అల్లారెడ్డి శంకర్‌రెడ్డి. ఈయన లవకుశ సినిమాను సాదాసీదాగా తీయాలని తలచలేదు. కొత్తదనంతో ఎక్కువ ఖర్చుతో అద్భుత కావ్యంగా తీయాలని నిశ్చయించుకున్నారు. ఉత్తరాదిలో రంగుల వైభవాన్ని తీసుకొచ్చినవారు మహబూబ్‌ఖాన్ అయితే, దక్షిణాదిలో పూర్తిరంగుల చిత్రంగా తీయాలని ఆలోచించి గేవా కలర్ సినిమాగా దీన్ని నిర్మించారు. ఈవిధంగా తెలుగింటి మహబూబ్‌ఖాన్‌గా శంకర్‌రెడ్డి పేరుగాంచారు. ఇక శంకర్‌రెడ్డి లవకుశ సినిమాకోసం పడిన కష్టాలు, సీతాదేవి పడిన కష్టాలుగా చెప్పుకోవచ్చు. 1958లో ప్రారంభమైన ‘లవకుశ’ నిర్మాణం 1963 వరకూ కొనసాగింది. మధ్యలో అనేక అవాంతరాలు. పుల్లయ్య అనారోగ్యం, నటీనటులు కాల్షీట్లు అయిపోవటం, చేతిలో డబ్బులేకపోవటం లవకుశులుగా నటించిన పిల్లలు పెద్దవాళ్లయిపోవటం, వీటితో సినిమా సాగటం చాలామందికి నమ్మకం లేదు. కానీ శంకర్‌రెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడు. అలాగే అతనికి మంచి మిత్రులు తోడయ్యారు. అలాంటి సమయంలో వజీర్‌చంద్ జబక్, చిట్టూరి గాంధి, చమ్రియా ఫిలింస్ అధినేత సుందర్‌లాల్ నహతా నైతికంగా, ఆర్థికంగా హామీ ఇవ్వటంతో మళ్ళీ ‘లవకుశ’ కదిలింది. అలా అతని కష్టాలన్నీ అధిగమించి అప్పటిలో ఈ సినిమాకు వెచ్చించింది 30 లక్షలు. తెలుగు సినిమా రంగం నోరెళ్లబెట్టే భారీ బడ్జెట్ అది. ఇక ఆ సినిమా ఆర్జించింది ఎంతో తెలుసా? దక్షిణాదిలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రమది. అన్నీ ప్రత్యేకతలే! ‘లవకుశ’ సినిమా బాలారిష్టాలన్నీ అధిగమించి రిలీజ్ అయ్యాక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 1963 మార్చి 29న 26 కేంద్రాల్లో విడుదలై అన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. తెలుగులో తొలి కలర్ సినిమా. ఐదేళ్ల నిర్మాణం జరుపుకున్న సినిమా. అప్పట్లో 30 లక్షలు వెచ్చించి తీసిన సినిమా. మొత్తం 72 కేంద్రాల్లో శత దినోత్సవం, 16 కేంద్రాల్లో రజతోత్సవం, 10 కేంద్రాల్లో 250 రోజులు, హైదరాబాద్‌లో 67వారాలు ఆడిన సినిమా. పత్రికల్లో వసూళ్లు ప్రకటించిన తొలి దక్షిణాది సినిమా. ఈ సినిమా వంద రోజులకు పాతిక లక్షలు వసూలుచేసి, 365 రోజులకు కోటి దాటింది. (అప్పటి సినిమా టికెట్ రేట్లు పావలా నుంచి రూపాయి వరకు). అప్పటి రాష్ట్ర జనాభా 3 కోట్లు. సినిమా 60 వారాల ప్రకటన వివరాల ప్రకారం 100 కేంద్రాల్లోనే కోటి 98 లక్షల మంది చూశారట. 100 కేంద్రాల్లో జనాభా 75 లక్షలకు మించిఉండదు. అంటే ఒకొక్కరు మూడుసార్లు చూసి ఉంటారని విశే్లషణలు చెపుతున్నాయి. లవకుశ సినిమాకు గ్రామీణప్రాంత ప్రజలు బళ్ళు కట్టుకువచ్చి సినిమా చూసేవారట. సికిందరాబాద్ క్లాక్‌టవరంతా ఆరోజుల్లో యాత్రలాగ ఉండేదట. మాట్నీకి టిక్కెట్టు దొరక్కపోతే పార్కులో పడుకుని తర్వాత ఫస్ట్ షో చూసుకుని వెళ్ళేవారట. బెజవాడలో ఈ సినిమా మారుతీ టాకీస్‌లో వచ్చింది. లవకుశ ఆడినన్నాళ్ళు తారాపేట గూడ్సు షెడ్డునుంచి కాళేశ్వరరావు మార్కెట్టు వరకూ ఎడ్ల బళ్ళు బారులుతీరి ఉండేవట. ఇలా ఎనె్నన్నో విశేషాలు. అర్ధ శతాబ్దం దాటినా సినిమా ఈనాటికీ ఆబాల గోపాలాన్ని అలరిస్తుంది. కాకపోతే ఇప్పుడు టీవీలలో అందరినీ ఆనందింపచేస్తుంది. అందలి నటులకు, దర్శకులకు, నిర్మాతకు, సాంకేతిక నిపుణులకు ఎనలేని యశస్సు సమకూర్చిన లవకుశకు మరొక్కమారు హ్యాట్సాఫ్.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనోమథన ‘మన్మథ’ ఉగాది

మనోమథన ‘మన్మథ’ ఉగాది

  • -సుధామ
  • 21/03/2015
TAGS:

కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది… ఈ మాట మన తెలుగువారి కాలగణన బట్టి వచ్చిందే. ఆంగ్ల సంవత్సరాలు ‘చక్రనేమి’యుతాలు కావు. 2015 సంవత్సరం వెళ్లిపోతే- మళ్లీ ఆ అంకెగల ఏడాది ఎప్పటికీ తిరిగిరాదు. కానీ, మానవ జీవనపు జనన మరణ చక్రం ఆత్మ- ‘ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ప్రవేశించడం’ అనే పునర్జన్మ విశ్వాసాల ఆధారంగానే మన ‘కాలగణనం’- ‘కాలచక్రం’గా సంభావింపబడుతోంది. అందుకే తెలుగు సంవత్సరాలన్నీ (అరవై) చక్రభ్రమణంలా నిరంతరాయంగా సాగుతూంటాయి. 1955లో వచ్చిన ‘మన్మథ’ నామసంవత్సరం ఈ ఏడాది మళ్లీ ప్రవేశించింది. చైత్రశుద్ధ పాడ్యమితో మొదలయ్యే తెలుగు సంవత్సరం ఫాల్గుణమాసంతో ముగుస్తుంది. మన్మథ తర్వాత ‘దుర్ముఖి’ వస్తుంది. అరవయ్యవ సంఖ్యగల సంవత్సరం ‘అక్షయ’ ముగిశాక మళ్లీ కాలచక్రంలో ‘ప్రభవ’ నుండి ఆ వృత్తం మొదలవుతుంది. అలా 29వ సంఖ్యగల ‘మన్మథ’ నామసంవత్సరం మళ్లీ 2075లో వస్తుంది. ఈ ‘కాలమానచక్రం’ మన భావన! కానీ, ఆంగ్లేయుల కాలమానమే నేడు ప్రపంచ వ్యాప్తంగా అధికంగా పరిగణనలో వుండడంవల్ల, ఉగాది సందర్భంగా ఈనెల 21న నూతన సంవత్సరంగా భావించి శుభాకాంక్షలు తెలుపుకోవడమన్నది చిత్రంగా తోచే తరం వచ్చేసింది.
తెలుగువారందరికీ ఈ ‘ఉగాది’యే ‘అసలు సిసలు కొత్త సంవత్సరం’ అన్న భావన నేటి తరంలో గాఢంగా పాదుకోవాల్సిన అవసరం వుంది. హిందూ శాస్త్రాల ప్రకారం అరవై తెలుగు సంవత్సరాలు క్రమంగా వస్తాయి. ప్రభవ నుండి అక్షయ దాకా కాలచక్రం అరవై రేకులతో తిరుగుతూ వుంటుంది. సుఖదుఃఖాలు, జనన మరణాలు అన్నీ కూడా అలా వస్తూపోతూండేవే!
బ్రహ్మ తన సృష్టిని చైత్రశుద్ధి పాడ్యమి నాడు ప్రారంభించాడు కనుక- ‘యుగాది’యే ఉగాది అయింది. మన భారతీయ గణిత శాస్తవ్రేత్త భాస్కరాచార్యులు ఈ రోజునే సూర్యోదయకాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయని గణన చేశాడు. మన కాలమానంలో కనురెప్పపాటు కాలము- ఆంగ్ల కాలగణనపు ఒక సెకను.
అసలు కొత్త సంవత్సర భావన ‘ఉగాది’ అనీ, వసంత ఋతువు ప్రారంభమై, బీడువడిన భూమిపై సస్యాలు మొలకెత్తి, కొత్త జీవితానికి నాందిలా ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకునే కాలమనీ, పచ్చని పంట పొలాలతో, విరగకాసిన చెట్లతో ఫల,పుష్ప భరితంగా సౌభాగ్య చిహ్నంగా కానవచ్చే కాలమనీ నేటితరానికి తెలిసేదెలా? పర్యావరణ పరిరక్షణ మందగిస్తున్న నేటి రోజుల్లో సంప్రదాయం చిగురులు వేసేదెలా?
ఉగస్య ఆదిః ఉగాదిః
‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది అంటే.. సృష్టి ఆరంభమైన దినమే ‘ఉగాది’. సంవత్సరం మనకు ఉత్తరాయణ, దక్షిణాయనాలుగా ‘ఆయనద్వయ’ సంయుతం కనుక ‘యుగం’ అనే పదంతో ‘యుగాది’ అని కూడా వ్యవహరించుకుంటాం. యుగాది అన్నా ఉగాది అన్నా ఒకటే. సోమకాసురుడు వేదాలను అపహరించగా శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో వాటిని తిరిగి బ్రహ్మకు అప్పగించిన శుభతరుణమే ‘ఉగాది’ అని పురాణ ప్రతీతి. అలాగే, శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి రోజున పట్ట్భాషేకం చేసుకుని, తాను యుగకర్తగా భాసిల్లిన కారణం వలన, ఆ శుభ సందర్భమే ఉగాది అయిందని ఒక చారిత్రక భావన. ఏమైనా జడప్రాయమైన జగతి నవ చైతన్య దీథితులను ప్రసరింపచేసే కాలరాంభ సూచి- ఉగాది. ఆంగ్ల సంవత్సరాది ఆరంభంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగే కోలాహలం మనకు తెలుసు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చెవులు దిమ్మతిరిగేలా అరుచుకోవడం తెలుసు. కానీ, తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ఏం చేయాలన్నదీ తెలియడం లేదు నేటి ఆధునిక కాలంలో కొందరికి.
‘్ధ్వజప్రతిష్ఠాపన’ విశిష్టాచారం..
ఉగాదినాడు ‘్ధ్వజప్రతిష్ఠాపన’ ఒకప్పుడు విధిగా ఆచరించేవారు. ఒక పట్టువస్త్రాన్ని వెదురుగడకు జెండాలాగా కట్టి, దానిపై కొబ్బరి కాయ వున్న కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడాకులు, నిమ్మ ఆకులు, పూల తోరణాలు కట్టి, ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించేవారు. ఉగాది రోజే- ఆ నిజమైన ‘జెండాపండుగ’ కూడాను. అయితే ఇప్పటికీ కలశ స్థాపన చేసి, పూర్ణకుంభదానం చేయడం కొందరిలో ఆచారంగా నిలిచి వుంది. రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా రంగులతో తీర్చిదిద్ది అందులో మామిడి, నేరేడు, మోదుగ, అశోక, వేప అనే పంచ పల్లవాలు సుగంధ చందనంతో కలిపి, పుష్పాక్షలతో ఆవాహనం చేసి, పూజించి ఆ కలశానికి నూతన వస్త్రాన్ని చుట్టి, పాత్రపై పసుపు, కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బొండాం పెట్టి, ఎవరైనా పెద్దలకు ‘పూర్ణకుంభదానం’ ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం- ఏటికేడాదికీ శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి వుంది. ఇది ఉగాది నాటి విశిష్టాచారం.
కాలపురుషుడికి అర్చన..
‘పంచాంగశ్రవణం’ ఉగాది రోజు విశేష ఫలితం ఇస్తుందని విశ్వాసం. ‘పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్’- ఉగాది రోజున పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేసినంతటి పుణ్యం లభిస్తుందట! ఈరోజు ‘పంచాంగ శ్రవణం’ చేసినవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని సంపదను, రాహువు బాహుబలాన్ని, కేతువు వంశాధిక్యతను కలిగిస్తారట! ఇప్పుడంటే పంచాంగాలు పుస్తకరూపంలో అందుతున్నాయి. ఒకప్పుడు తాళపత్రాలపై వుండేవి కనుక ఉగాది నాడు దేవాలయంలో గానీ, గ్రామ కూడలిలోగానీ, పండితులో,సిద్ధాంతులో అందరికీ వినిపించేవారు. అందరూ వారి చెంత చేరి, కందాయ ఫలాలు తెలుసుకుని, సంవత్సరం పొడుగునా నడుచుకునే జీవనసరళికి ప్రాతిపదికలు వేసుకునేవారు. ఉగాది నాడు పంచాంగాన్ని పూజించడం, పంచాంగ శ్రవణం, కాల స్వరూప నామార్చనకు గుర్తు. ‘కాలాయ తస్మై నమః’ అని కాలపురుషుడిని పూజించడం అంటే- జరామరణాలూ, ఆద్యంతాలు లేని ఆదిశక్తి స్వరూపాన్ని ఆవాహనం చేసుకుని, ‘కాలాతీత వ్యక్తులు’గా నిలిచిపోయేందుకే!
మనం- మనం జన్మించిన నామ సంవత్సరాన్ని జీవితంలో ఒక్కసారి చూడగల్గడం అయినా మళ్లీ సంభవిస్తే ఆ ఆనందంతో చేసుకునేదే ‘షష్టిపూర్తి’ (60 ఏళ్లు) పండుగ. కాలచక్ర పరిభ్రమణం ఒక్కసారైనా చూడకుండానే కనుమరుగయ్యేవారున్నారు. ఇక, తాము పుట్టిన నామ సంవత్సరాన్ని రెండోసారి చూడగలగడం అంటే- సంపూర్ణ ఆయుష్షుతో 120 సంవత్సరాలు జీవించడం అన్నమాట! ఆయుః పరిమాణం అనేది జన్మాంతర సుకృతాన్ని బట్టి నిర్ణయింపబడేదని ఆర్యోక్తి. నిత్య వ్యవహారాల కోసం అంతా ఇంగ్లీష్ క్యాలెండరే వాడుతున్నా- శుభకార్యాలకూ, పూజా పునస్కారాలకూ ‘పంచాంగం’ ఇంకా ఉనికిలో ఉన్నందుకూ ఆనందించాల్సిందే! తెలుగువారి విశిష్టతకు కనీస నిదర్శనంగా పంచాంగం ఇంకా అమలులో వుంది. కాగా, ఉగాది రోజున శక్తి ఆరాధనతో బాటు శ్రీరాముడిని ఆరాధించడం కూడా విశిష్టంగా చెబుతారు. దక్షిణాయన, ఉత్తరాయన సంవత్సర జీవన గమనానికి ఆదర్శం కనుకనే- ‘రామాయణం’ అని, ‘రాముడు నడిచినదారి’కి కూడా విశేష ప్రాధాన్యం ఇచ్చిన జాతి మనది! శ్రీరామనవమి ఉగాది వచ్చిన వారానికే వస్తూంటుంది కూడాను.
ఈ రోజు ప్రవేశించిన ‘మన్మథ’ నామ సంవత్సరం 1955లో వచ్చింది. ఆ మన్మథనామ సంవత్సరంలో తెలుగువారంతా కలిసి ‘విశాలాంధ్ర’గా ఏర్పడి రాజకీయ సంరంభం సాగితే, నేటి మన్మథ నామ సంవత్సరం నాటికి అదే తెలుగువారు రెండు రాష్ట్రాలుగా ప్రత్యేక అస్తిత్వాలలోకి పరిణమించారు.
కవి సమ్మేళనాలు
ఉగాదికి కవి సమ్మేళనాలు నిర్వహించడం ఓ ఆనవాయితీ. ఉగాది పచ్చడిలానే- షడ్రచుల సముపేతం అన్నట్లుగానే కవుల కలాల్లో ఉగాది ప్రకృతిపరంగా, రాజకీయపరంగా, సామాజిక జీవన పరంగా, వాణిజ్యపరంగా రకరకాలుగా పోకడలు పోతుంది. నానారుచుల ప్రతిఫలనంగా సాగుతుంది ఉగాది కవి సమ్మేళనం.
ఆ మాటలు నేడూ వర్తిస్తాయ…
కాగా, 1955 మన్మథ ‘ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక’లోని ‘ప్రస్తావన’లో సంపాదకులు ఉటంకించిన విషయాలలో కొన్ని అరవై ఏళ్ళ తర్వాత వచ్చి నేటి ‘మన్మథ’ కాలానికీ ఔచితీయుతంగా భాసిస్తున్నాయి.
‘నేటితో మన్మథ వత్సర వసంతోదయం ప్రారంభం అయింది. సంవత్సరారంభం మనకొక ప్రత్యేకమైన మహోత్సవం. ఈనాడాంధ్రులందరూ గత జీవిత ఘట్టాలొకసారి సుస్మరించుకొని, భవిష్యజీవన గమనంలో బంగారు కలలు కంటారు. ఎలాంటి వాస్తవికులకైనా కొంతవరకిది సహజమే. మానవుని మనోనిర్మితిలోనే ఈ విచిత్ర విన్యాసాలున్నాయి. పిన్నలు, పెద్దలు, యువకులు, ప్రజలు, నాయకులు, అందరూ అంతరాంతరాల్లో ఈనాడుత్సాహ డోలికల్లో ఉవ్విళ్ళూరుతుంటారు. మన్మథ సంవత్సరాది మహోత్సవ సమయంలో వీరందరికీ మా అభినందనాలందజేస్తున్నాము.’- అని అందులో పేర్కొన్నారు.
‘కేవలం రాజకీయ నినాదాలనే రచనా వస్తువులుగా స్వీకరించి, తాత్కాలిక లక్ష్యాల వాగుర
లలో చిక్కిన రచనలకు సారస్వత గౌరవం చేకూరదని స్పష్టపడింది. సాహిత్యానికీ రాజకీయ ప్రచారానికీ హస్తిమశకాంతరం వున్నదనీ, రాజకీయ ప్రచార రచన ఆయా లక్ష్యాల ఆవశ్యకతలు తీరిపోగానే అంతరించిపోగలవనీ తేలిపోయింది. సాహిత్యంలో సాంఘిక సమస్యా దృక్పథానికీ, ప్రచార వాఙ్మయంలో సాంఘిక సమస్యా దృక్పథానికి గల అంతరువులు కూడా ఈ చర్చలవల్ల విస్పష్టంగా వెల్లడి అయ్యాయి. బలీయమైన రాజకీయాధికార ముద్రవల్ల సారస్వతం ఏదయినా సన్నగిల్లి నిర్జీవమైపోగలదనీ, స్వతంత్య్ర వాతావరణంలోనే సజీవ సాహిత్యం వర్థిల్లగలదనీ రచయితలనేకులు సోదాహరణంగా ప్రతిపాదించారు. అంతేగాక ప్రతి జాతికీ సజీవమైన సంస్కృతి, సంప్రదాయము ఉన్నాయనీ, ఇవి విడిచి వ్యవహరించడం రచయితలకు కేవలం నేల విడిచిన సాముగా పరిణమించగలదనీ స్పష్టపడింది. ఈ చర్చలవల్ల ఆంధ్రదేశంలో సారస్వతంలో ఒక నూతనాధ్యాయానికి నాందీప్రస్తావన జరిగినదని అనవచ్చును. త్వరలోనే ఈ ఆశాభావం వాస్తవ రూపం ధరించగలదనీ మన ప్రభుత్వం ఆయా ఆర్థిక వ్యవసాయికాది రంగాలలోనే కాక భాషా సాహిత్యాది సాంస్కృతిక రంగాలలో కూడా తగినంత దోహదం కలిగించగలదనీ ఆంధ్ర ప్రజ సర్వతోముఖంగా అభివృద్ధి పొందగలదనీ ఆశిస్తున్నాము’’- అని కూడా పేర్కొన్నారు.
అరవై ఏళ్ళ క్రితం నాటి ఆశావహ దృక్పథమే ఈనాటికీ మన మనోనిర్మితిలో వుండడం విడ్డూరమేమీ కాదు కదా! ఆనాటి రాయప్రోలు సుబ్బారావుగారి మంగళ వాచకంతోనే స్వస్తి!
‘మంగళంబోయ్ మన్మథా! జయ
మంగళంబోయ్ మన్మథా! నవ
వత్సరాది మహోత్సవార్పిత
వాద్యగీత స్వరసుధా!
మంగళంబోయ్ మన్మథా,
జయమంగళంబోయ్!
నీదు తరుణ స్నేహ విరహము
నిలుపరాని దురాతపంబున
దిగులుపడి చెడి సొగసు మాసెను
తీగెలును పూలును వగన్, మంగళంబోయ్!
ఎన్ని యేండ్లో నడిచినవి మా
యింటిలో నీ వాడి కూడీ
పక్వకదళీ గస్తనీ ఫల
పాయసము భుజియించీ, మంగళంబోయ్
మంగళంబోయ్ మన్మథా!
జయమంగళంబోయ్!
…………………………..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జానకిరాముల సౌశీల్యం.. జగతికి ఆదర్శం

జానకిరాముల సౌశీల్యం.. జగతికి ఆదర్శం

  • -కె.లక్ష్మీ అన్నపూర్ణ
  • 27/03/2015
TAGS:

తండ్రి ఆమోదించిన వధువు కనుక రామునికి సీతమీద ప్రేమ
కలిగింది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన, సద్గుణ సంపత్తి వలనా ఆ ప్రేమ అనేక రెట్లయింది. భర్త అనే ఒక్క కారణం చేత రాముడికి తనపై వున్న ప్రేమ కంటే- సీతకు రామునిపై రెట్టింపు ప్రేమ వుంది. ఆ ప్రేమ ఎంతటిదంటే
వారిరువురూ హృదయంతో మాట్లాడుకునేవారు. దేవతా స్ర్తిలా, రూపుదాల్చిన లక్ష్మీదేవిలా వున్న సీతని రాముడు మరింత ప్రేమతో హృదయంలో
నిలుపుకున్నాడని అంటాడు ‘రామాయణం’లో వాల్మీకి. అంటే వారి
పరస్పర ప్రేమాభిమానాలు భాషకందనివి. కన్యాదాన సమయంలో
‘ ఛాయ వలే సీత నీ వెన్నంటి వుంటుంద’ని రాముడితో జనకుడు చెప్పిన మాట- వనవాసం సందర్భంగా నిరూపించబడింది.

కౌసల్యాదేవి నోముల పంట, దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగ పుణ్యఫలం- శ్రీరాముడు. చైత్రమాసంలో పునర్వసు నక్షత్రంతో కూడిన నవమి తిథిలో కౌసల్యకు ఇక్ష్వాకు వంశవర్థనుడిగా రాముడు జన్మించాడు. జనక మహారాజు యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతుండగా నాగటిచాలులో లభించిన దైవ ప్రసాద సంప్రాప్త సీతామాత. జనకుడు సీతను గురించి విశ్వామిత్రుడికి చెబుతూ ఆమె ‘వీర్యశుల్క’అని చెప్పాడు. స్వయంవరంలో శివధనుర్భంగం గావించినవానికి సీతను ఇచ్చి పెండ్లి చేయాలన్న తన సంకల్పాన్ని జనకుడు వివరించాడు. గురువు ఆజ్ఞ మేరకు శివధనుస్సును విరిచాడు రాముడు. వీరుడైన రాముడ్ని విజయంతో పాటు సీత వరించింది. తండ్రి అనుమతితో సీతను చేపట్టాడు రాముడు. ‘అలకలల్లలాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో’ అన్నట్లుగా రాముణ్ణి చూసి ముగ్ధుడై మురిసిపోయాడు విశ్వామిత్రుడు. ‘మా జానకి చెట్టాపట్టగ మహరాజువైతివి’ అని చనవుతో రాముని గురించి త్యాగయ్య అంటాడు. సీతామాత మహామహిమాన్విత కాబట్టి ఆమెను చేపట్టి రాముడు శ్రీరాముడైనాడని త్యాగయ్య భావన. ఈ జంట లోకానికి ఆదర్శప్రాయమై నిలిచిపోయింది. వనవాసం, అగ్నిప్రవేశం మొదలైన ఘట్టాలు సీతాదేవి పట్ల మొగ్గుచూపేలా చేసినప్పటికీ, ధర్మపక్షపాతి అయిన రాముని పట్ల కూడా వుండే భక్తికి కొదువ ఏమీ లేదు.
శ్రీరామనవమిని ఓ పండుగగా జరుపుకుంటూ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆచారమైంది. ఇది భక్తులకు సీతారాములపై గల భక్త్భివానికీ, అభిమానానికీ నిదర్శనం. రాముణ్ణి భగవంతుడిగా, తారకరాముడిలా భావించి ఆరాధించేవారికన్నా, సీతారాములను మనవారే అన్నంత సన్నిహితతత్వంతో ఆత్మీయులుగా భావిస్తారు తెలుగువారు. కనె్నలంతా రాముని వంటి భర్త లభించాలని, తల్లులంతా రాముడి లాంటి కొడుకు కలగాలని కోరుకుంటారు. సీతారాముల గుణగణాలను సర్వదా స్తుతిస్తుంటారు. రామనామాన్ని జపిస్తారు,లిఖిస్తారు. రాముణ్ణి మనసులో నిలుపుకుంటారు. ఏ మంచి పనికైనా శ్రీకారం చుట్టదలిస్తే ముందుగా ‘శ్రీరామ’ అని రాసే అలవాటు చాలామందిలో వుంటుంది. పెండ్లి శుభలేఖలన్నింటిలో సీతారాముల తలంబ్రాల ఘట్టాన్ని వర్ణించే శ్లోకం తప్పకుండా వుంటుంది. సీతారాముల కష్టాలను తలచుకుని సానుభూతి చెంది, ఎంతో బాధపడతారు. రామనామం వినగానే పారవశ్యం చెందుతారు. ఇలా తెలుగువారితోపాటు సమస్త భక్తజనానికీ ఆరాధ్య దైవం శ్రీరాముడు.
సౌందర్యము, సుగుణాలు, ధర్మము రాశి పోసినట్లుగా వున్న సీతారాముల చరితం లోకానికి ఆదర్శాన్ని, ధర్మాన్ని చాటి చెప్పింది. వీరి అన్యోన్య దాంపత్యం జనులందరి చేతా కొనియాడబడింది. వీరి నడవడి అందరికీ ఒరవడి అయింది. సీత హృదయం నిండా రాముడే వుండేవాడు. రాముడి హృదయం నిండా సీతే వుండేది. అలా అన్యోన్యానురక్తులై వారు చాలాకాలం గడిపారు.
తండ్రి ఆమోదించిన వధువు కనుక రామునికి సీతమీద ప్రేమ కలిగింది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన, సద్గుణ సంపత్తి వలనా ఆ ప్రేమ అనేక రెట్లయింది. భర్త అనే ఒక్క కారణం చేత రాముడికి తనపై వున్న ప్రేమ కంటే- సీతకు రామునిపై రెట్టింపు ప్రేమ వుంది. ఆ ప్రేమ ఎంతటిదంటే వారిరువురూ హృదయంతో మాట్లాడుకునేవారు. దేవతా స్ర్తిలా, రూపుదాల్చిన లక్ష్మీదేవిలా వున్న సీతని రాముడు మరింత ప్రేమతో హృదయంలో నిలుపుకున్నాడని అంటాడు ‘రామాయణం’లో వాల్మీకి. అంటే వారి పరస్పర ప్రేమాభిమానాలు భాషకందనివి. కన్యాదాన సమయంలో ‘ ఛాయ వలే సీత నీ వెన్నంటి వుంటుంద’ని రాముడితో జనకుడు చెప్పిన మాట- వనవాసం సందర్భంగా నిరూపించబడింది. సీత ఎంతటి సుకుమారో అంతటి ధీర. వనవాసానికి వెళ్లేందుకు భర్త,అత్తలను తన వాక్చాతుర్యంతో మెప్పించి తన కార్యాన్ని సానుకూలపరచుకున్న నేర్పరి.
రాముడు ఎంతటి పరాక్రమశాలియో సీతపట్ల అంతటి హృదయ మార్దవం కలిగినవాడు. బంగరుజింకను కోరుకున్న సీత మాటను కాదనలేక ‘అలాంటి మాయలేడి వుంటుందా? వుండదా?’ అని సందేహించకుండా ఆమె కోరికను నెరవేర్చేందుకు సిద్ధపడిన ఆర్ద్రహృదయుడు. సీత తన పాతివ్రత్యంతో అనసూయ మెప్పును కూడా పొందింది. అనసూయ సీతకు పతివ్రతా ధర్మాలను బోధించి కానుకలను సమర్పించిన సందర్భంగా శ్రద్ధగా ఆమె మాటలను విని, తన తల్లి,అత్త కౌసల్య కూడా పతివ్రతా ధర్మాలను బోధించారని చెబుతుంది. వారికి విలువనిస్తుంది. అత్తమామల పట్ల, భర్తపట్ల భక్తిప్రపత్తులు కలిగిన వినయశీల సీత. శ్రీరాముడు కూడా సీతను ‘జానకి, వైదేహి, మైథిలి’ వంటి పేర్లతో సంబోధిస్తూ ఆమె పట్ల, ఆమె పక్షం వారిపట్లకూడా అభిమానాన్ని చూపేవాడు. రాముని ఆజ్ఞకు లోబడి అగ్నిప్రవేశం చేసిన సీతాదేవి సాధువర్తన దేవ,ముని గణాలను కూడా సంభ్రమానికి గురిచేసింది. సీత ‘నిష్కళంక’ అని లోకానికి చాటదలచి అగ్నిప్రవేశానికి ఆజ్ఞాపించిన ధర్మతత్పరత శ్రీరామునిది. సీతారాముల చరితం, ధార్మిక వర్తన ప్రజలకు శిరోధార్యమై నిలిచింది. వారి సౌశీల్యం శ్లాఘనీయమైనది. ఉదాత్తమైనది.
‘శ్రీరామచంద్రః శ్రీతపారిజాతాః సమస్త కల్యాణ గుణాభిరామ
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు’
శ్రీరాముడు సర్వ జనులకూ సకల శుభాలనూ ప్రసాదిస్తాడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమరావతి స్ఫూర్తి

అమరావతి స్ఫూర్తి

  • 26/03/2015
TAGS:

అవశేష ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరానికి ‘అమరావతి’ అని నామకరణం జరపుతుండడం అద్భుతమైన చారిత్రక పరిణామం…అమరావతికి ఆంధ్రుల చరిత్రలో మాత్రమే కాదు, అఖిల భారతీయ సహస్రాబ్దుల చరిత్రలో అజరామర ప్రాధాన్యం ఉంది. ద్వాపరయుగం వస్తుండిన సమయంలో జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఆంధ్రుల రాజధాని ధాన్యకటకం…్ధన్యకటకం, ధరణికోట, అమరావతి తరతరాల చరిత్రలో పర్యాయ పదాలు. మహాభారత యుద్ధం జరిగిన తరువాత 5,142 సంవత్సరాలు గతించాయి. మన్మథ ఉగాది నుండి 5142వ సంవత్సరం నడుస్తోంది. కలియుగంలో ఇది 5117వ సంవత్సరం. ఈ సుదీర్ఘ గతానికి సజీవ జీవనస్మృతి అమరావతి. ‘కృష్ణాతరంగ పంక్తిన్ తొక్కి తుళ్లింత ఆంధ్రనౌకలు నాట్యమాడునాడు..’’ అని ఈ సజీవ స్మృతికి అక్షర రూపమిచ్చిన మహాకవులకు నిరంతర స్ఫూర్తి అమరావతి. ‘‘అమరావతీ నగర అపురూప శిల్పాలు’’ తెలుగుతల్లికి మహాకవి సమర్మించిన మల్లెపూదండకు పరిమళాలను అద్దిన మణిదీపాలు. ఈ దీపాల వెలుగులో బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతున్న దృశ్యం అమరావతి కథకు అద్వితీయ దర్పణం.. కృష్ణా నది ఆనాది జీవనది. ఆనాదిగా ఉన్న ఈ పునాదిపై వెలసిన అమరావతి ఆంధ్ర విభావానికి చెరగని సాంస్కృతిక పతాకం. అమర లింగేశ్వరుని నిలయం అమరావతి గరిమకు నూతన చిహ్నం. విభవం ‘వెలిసి’పోయింది. పతాకం పదేపదే పడిపోయింది. రాజధాని తరలిపోయింది. శిల్పాలు సాంస్కృతిక చిహ్నాలు విదేశీయుల అపహరణకు గురి అయ్యాయి. ఈ ఉత్థాన పతనాలకు ప్రభావితం కాని జీవనధుని కృష్ణవేణి. కృష్ణవేణి ఒడ్డున అవశేషమై ఉన్న అమరావతికి ఇది గత వైభవ పునరావృత్తి. అమరావతి మళ్లీ ఆంధ్రుల రాజధానిగా విలసిల్లబోతున్నది. అమరావతి వైదిక జీవన స్రోతస్విని, బౌద్ధ వాఙ్మయ హ్రాదిని…పక్కనే కృష్ణవేణి. త్రివేణీ సంగమ రూపానికి ఆంధ్రసీమపై ప్రతిరూపం అమరావతి ఇతిహాసం. కొత్తగా నిర్మించనున్న రాజధాని కేంద్ర బిందువు అవశేష అమరావతి 32 కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చుగాక. ప్రాచీన అమరావతి ప్రభావం ఈ ఆధునిక కేంద్ర బిందువు వరకు విస్తరించడం చరిత్ర. రాజధానికి వచ్చివెళ్లేవారితోను, వర్తకుల రవాణా శకటాలతోను, పాలు పెరుగు కూరగాయలు మోసుకొని వెళ్లేవారితోను, పల్లెపడుచుల రాకపోకలతోను, చతురంగ బలాల ప్రతాప విన్యాసాలతోను, వేదనాద హర్షామోదాలతోను ఈ 32 కిలోమీటర్ల ప్రాంతం గతంలో ఆంధ్ర రాజధాని ప్రభావ పరిధిలోనిది. అందువల్ల రాజధాని ప్రాంగణం ప్రాచీన అమరావతికి వినూతన విస్తృతి…సింగపూర్, మోడల్‌ను పట్టుకొని ఎండమావులలోని మెరుగుల నీటి ప్రవాహం వెంట పరుగులు తీస్తున్న నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిక పక్కనే ఉన్న తరగని నీటి ప్రవాహం స్ఫురించడం చారిత్రక పునరావృత్తికి మరో నిదర్శనం. సింగపూర్ చిహ్నం, న్యూ యార్క్ నమూనా, మలేసియా ముద్ర, టింబక్టూ తరహా..అన్న అనేక చిత్ర విచిత్ర పదజాలం ఆంధ్రుల నెత్తికెత్తి ఆడుతున్న సమయంలో అమరావతి మళ్లీ అవతరించడం శిశిరం ముగిసి వసంత శోభకు సంకేతం. అమరావతి మోడల్‌కు మళ్లీ ఆకృతిని కల్పించ వలసిని సమయమిది. అమరావతి నమూనా కాలుష్యం కొలువు తీరని స్వచ్ఛమైన ప్రగతికిబాట! అమరావతి ‘నమూనా’ ప్రాచీన భారత రాజధానుల నిర్మాణపు తీరునకు మచ్చుతునక! ధాన్యకటకం రాజధాని ఆంధ్ర రాజ్యాన్ని పాలించిన ఆంధ్రులు దాదాపు ఐదు వందల ఏళ్లపాటు యావత్ భారతదేశాన్ని పాలించడం చరిత్ర! ‘మగధ’ కేంద్ర బిందువుగా గిరివ్రజం రాజధానిగా క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్ది వరకు మొత్తం భారత దేశాన్ని పాలించిన ఎనిమిది రాజవంశాలలో ఆంధ్ర శాతవాహన వంశం చివరిది! ధాన్యకటకం రాజధానిగా మగధకు సామంతులుగా ఉండిన ఆంధ్ర శాతవాహనులు క్రీస్తునకు పూర్వం తొమ్మిదవ శతాబ్దిలో సామ్రాజ్య పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటినుండి క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో గ్రీకు దురాక్రమణకారుడు అలెగ్జాండర్ మన దేశంపై దండెత్తి వచ్చే వరకు ఆంధ్రులే యావత్ భారత్ సమ్రాట్టులు. ఈ ఐదు వందల ఏళ్ల పొడుగునా అమరావతి-్ధన్యకటకం-్భరత రాజ్యాంగ వ్యవస్థలో మరో ప్రధాన కేంద్రమైంది! అందువల్ల అవశేషాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు విదేశీయ రాజధాని నిర్మాణపు నమూనాను విడనాడి, భారతీయ ప్రాచీన రాజధాని నగరాల నిర్మాణ రీతిని అధ్యయనం చేయడం మేలు! ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సింగపూర్ మోడల్ పనికి రాదేమోనన్న అనుమానాలు గత జనవరిలోనే వ్యక్తమయ్యాయి!
ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం అన్నది పురాణ ప్రసిద్ధమైన విషయం…శ్రీకాకుళం కృష్ణాజిల్లాలో మచిలీపట్టణానికి సమీపంలో ఉంది! శ్రీకాకుళ వల్లభుడైన ఆంధ్ర మహా విష్ణువు బహుశా పూర్వ యుగాల వాడు కావచ్చు! ఆయనను దేవతగా ఆరాధించడం కూడ సంప్రదాయమైంది! ‘చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావహత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ’ అన్న స్తుతి జనం నాలుకలలో జీవిస్తోంది! ‘ఇమ్ముగ కాకుళమ్ము మొదల్ వరకున్ గల ఆంధ్ర పూర్వ రాజన్యుల పేరు తల్చిన హృదంతరమేలో చలించిపోవు…’ అన్న మహాకవి మాటల వల్ల కూడ శ్రీకాకుళం తొలి రాజధాని అన్నది ధ్రువపడుతోంది! కానీ ఈ యుగంలో మాత్రం గోదావరి తీరంలోని కోటి లింగాల కృష్ణా తీరంలోని అమరావతి తెలుగువారి అతి ప్రాచీన రాజధానులు. రాజమహేంద్రవరము, హంపీ విజయనగరం, ఏకశిలా నగరమైన ఓరుగల్లు వంటివి కూడ వివిధ సమయాలలో ఆంధ్రుల రాజధానులయ్యాయి, తెలుగు వెలుగులను ప్రసరించాయి! ఈ ప్రాచీన రాజధానుల నిర్మాణ రీతులను వాస్తు శిల్ప విన్యాసాలను విదేశీయ యాత్రికులు చరిత్రకారులు సైతం ప్రశంసించిపోయారు! రాబర్ట్ సీవెల్ అన్న చరిత్రకారుడు వ్రాసిన ‘ది ఫర్‌గాటెన్ ఎంపైర్’ అన్న గ్రంథంలో హంపీ విజయనగర నిర్మాణ రీతిని వివరించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజధానిని దర్శించిన క్రీస్తుశకం పదహారవ శతాబ్ది పాశ్చాత్య మేధావులు భారతీయుల నగర నిర్మాణాలను ప్రశంసించారు. విశ్వనాధ సత్యనారాయణ, అడివి బాపిరాజువంటి ఆధునిక సాహిత్యకారులు అమరావతి నమూనాను తమ రచనలలో వివరించి ఉన్నారు. వాటిని అధ్యయనం చేసి సమకాలీన అవసరాలకు అనువైన రీతిలో వాస్తు మార్పు చేసి స్వదేశీయ నమూనాను తయారుచేసుకోవచ్చు! ఆ నమూనా ప్రకారం స్వదేశీయ శాస్తవ్రేత్తలు, స్థపతులు, రూపకర్తలు,వాణిజ్యవేత్తలు కలిసి కొత్త రాజధానిని నిర్మించవచ్చు! ‘అమరావతి’ అన్న పేరునకు అప్పుడే సార్ధకత!
‘‘్ధన్యకటక నగరము కృష్ణానదీ తీరమున నాలుగు ‘గోరుతముల’పొడవున ఉన్నది. నదీ తీరము నుండి నగర గర్భమునకు ఒక గోరుతమున్నర యున్నది…వనములు, ఫలపుష్పోద్యాన వాటికలు…’’ అడివి బాపిరాజు ‘అమరావతి’ గురించి చెప్పిన మాటలివి! ‘గోరుతము’ అని అంటే దాదాపు రెండు కిలోమీటర్లు! ఎనిమిది కిలోమీటర్ల పొడవున మూడు కిలోమీటర్ల వెడల్పున ప్రాచీన అమరావతి విస్తరించి ఉండేది. ఇలాంటి ‘నాజూకు నగరం’-స్మార్ట్‌సిటీ-చిన్నది కాదు, మరీ పెద్దది కాదు!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్యాంధ్ర భద్రాద్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస్వతి పుత్రుడు పుట్టపర్తి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రజాహిత పర్యావరణ శిల్పి -రమేష్ అగర్వాల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ పొన్నాడ చెప్పిన సినిమా కబుర్లు

శ్రీ పొన్నాడ చెప్పిన సినిమా కబుర్లుcinema 001 dr chakri1 001 dr.chakri2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒంటిమిట్ట విశేషం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత రత్న బాజ్ పాయ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్మార్ట్‌ సాగరమాల

స్మార్ట్‌ సాగరమాల
నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్ళీ నెత్తికెత్తుకున్న ‘సాగరమాల’ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం అమలు జరిగితే దేశాభివృద్ధి జోరందుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ అత్యంత భారీ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదించి, పథక రచనకు పచ్చజెండా ఊపడం కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినట్టు విప్లవాత్మకమూ, చారిత్రాత్మకమే. ఈ ఒక్క ప్రాజెక్టువల్లే స్థూలదేశీయోత్పత్తి రెండు శాతం పెరుగుతుందని ఆయన హామీ ఇస్తున్నారు. ఈ ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక మండళ్ళనూ, స్మార్ట్‌సిటీలనూ, పర్యాటక దీవులనూ చేర్చి ఆయన ఉజ్వలమైన భవిష్యత్తును ఆవిష్కరించారు.
అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న దశాబ్దం నాటి ఆలోచన కనుక, అప్పట్లో స్మార్ట్‌సిటీలూ, సీఈజడ్‌లు ఈ సాగరమాలలో లేవు. తీరప్రాంతంలో ఓడరేవులను అభివృద్ధి చేసి, రైలు మార్గాలతో వాటిని అనుసంధానించి వాటి సామర్థ్యాన్ని బాగా పెంచడం మాత్రమే అప్పటి ఆలోచన. ఇంకాస్త వెనక్కు వెడితే, అసలు సాగరమాల పుట్టినదే సామాన్యుడి ప్రయాణం గురించి. సముద్ర మార్గాలను సంధానించి, ఓడ ప్రయాణాలను పెంచి, మిగతా ప్రజారవాణా వ్యవస్థల మాదిరిగానే దీనిని కూడా సగటుమనిషికి అందుబాటులోకి తీసుకురావడం. సరుకు రవాణాతో పాటు ప్రజారవాణాకూ పెద్దపీట వేయాలన్న ఈ ఆలోచన కార్యదర్శుల స్థాయివే కనుక దాని గురించి ఇప్పుడు అనవసరం. ఆధునిక సాగరమాల అసలు స్వరూప స్వభావాలు ఆరునెలల తరువాత కానీ స్పష్టంగా తెలియవు. పాలకులు చెబుతున్న ప్రకారం సాగరమాల ప్రాజెక్టు కేవలం ఓడరేవుల అభివృద్ధికి మాత్రమే పరిమితం కావడం లేదు. అది ఈ దేశ తీరప్రాంత ముఖచిత్రాన్ని సమూలంగా విప్లవాత్మకంగా మార్చివేయబోతున్నది. ఒట్టి ఓడరేవుల అభివృద్ధి కాదు, ఓడరేవులు కేంద్రంగా జరిగే గట్టి అభివృద్ధి తన లక్ష్యమని ప్రధానమంత్రి గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగానే పథకరచన సాగుతుంది. ఒక్క గుజరాత్‌లోని కాండ్లా పోర్టు ఆధీనంలోనే రెండు లక్షల ఎకరాలుందని అంటున్నారు కనుక, తీరప్రాంత సెజ్‌లకు ఇక భూమి బాధ ఉండదు. పన్నెండు స్మార్ట్‌సిటీలకు ఆరులక్షల కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. కేబినెట్‌ సెక్రటరీ సారఽథ్యంలో అరడజనుకుపైగా మంత్రిత్వశాఖల కార్యదర్శులు, రైల్వేబోర్డు, నీతిఆయోగ్‌ ఇత్యాది సంస్థల అధిపతులు సభ్యులుగా ఉండబోతున్న సాగరమాల సమన్వయ కమిటీ ఈ భారీ ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సాధించిపెట్టే పనిలో పడుతుంది. పెట్టుబడులు, నిర్మాణాలు, నిర్వహణలు పీపీపీలో ఎలా సాధ్యం చేయాలో చూసుకుంటుంది. మొత్తంమీద ఈ ఏడాది ఓ ఆరువందల కోట్ల ఆరంభపు కేటాయింపుతో సాగరమాల సాధన దిశగా అడుగులు పడ్డాయి.
అనుసంధానాన్ని అభివృద్ధికి ఊతంగా, సమగ్రత మూలాధారంగా భారతీయ జనతాపార్టీ భావిస్తున్నది. జాతీయ రహదారులు, నదులు, ఓడరేవుల అనుసంధానం ఒక విధానంగా ముందుకు తెస్తున్నది. స్వర్ణచతుర్భుజి సాధ్యపడినా, నదుల అనుసంధానానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సాగరమాల ప్రాజెక్టు ఓడరేవుల అనుసంధానికీ, అభివృద్ధికి సంబంధించి దేశచరిత్రలో ఎన్నడూ లేనంత సమన్వయం సాధించబోతున్న మాట వాస్తవం. భారీ ఓడరేవులు కేంద్రం చేతుల్లోనూ, మిగతావి రాష్ట్రాల చేతుల్లోనూ ఉంటూ, వేరువేరు అభివృద్ధి విధానాలు ఇప్పటిదాకా అమలు జరుగుతున్నాయి. వాటి అభివృద్ధిలోనూ, మౌలిక సదుపాయాల కల్పనలోనూ, ఎగుమతి దిగుమతుల్లోనూ, సరుకును ఒడ్డుకు చేర్చే విషయంలోనూ భాగస్వాములైన సంస్థలు కూడా వేర్వేరుగానే ఉన్నాయి. రెండు విభిన్న నిర్వహణ విధానాల వల్ల ఓడరేవుల గరిష్ఠ వినియోగం జరగడం లేదని భావించిన కేంద్రం గతంలో రాష్ట్రాల గుప్పిట్లో ఉన్న చిన్న, మధ్యతరహా ఓడరేవుల్లో వేలుపెట్టబోయి చేతులు కాల్చుకుంది. అత్యంత ప్రధానమైన ఈ రంగంమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్రానికి పెత్తనం ఇవ్వడానికి రాష్ట్రాలు అంగీకరించలేదు. తమకు నచ్చిన విధానంలో, తాము మెచ్చిన పెట్టుబడులతో ఆ అభివృద్ధి ఏదో తామే చూసుకోవాలని, చేసుకోవాలన్నది రాష్ట్రాల అభిప్రాయం. ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా, రాష్ట్రాలకు నొప్పి తెలియకుండా ఒక సమగ్ర విధానం సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర పాలకుల మాటకు విలువనిస్తూనే సమగ్రత సాధించడానికి వీలుగా ముఖ్యమంత్రుల సారథ్యంలో రాష్ట్రకమిటీలు కూడా ఏర్పడి కేంద్ర కమిటీకి ఇతోధికంగా సహకరిస్తాయి. అమలులో ఉన్న విభిన్న నియంత్రణలు, సుంకాలు ఇత్యాది విషయాల్లో ఏకరూపత సాధించడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయి కమిటీలు కృషిచేయవచ్చు.
మనదేశ ఎగుమతి దిగుమతులు 90శాతం ఓడరేవుల నుంచే జరుగుతున్నప్పటికీ, స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 42 శాతం మాత్రమే ఉంది. రైలు, రోడ్డు మార్గాల్లో సాగే సరుకురవాణాతో పోల్చినప్పుడు బాగా తక్కువగా ఉంది. యూరోపియన్‌ యూనియన్‌, జర్మనీ వంటి చోట ఓడరవాణా వాటా 70శాతం పైబడే ఉన్నది. ఇప్పుడు దేశం మొత్తానికి ఉన్న ఏడువేల కిలోమీటర్ల తీరాన్ని పది ప్రాంతాలుగా విభజించి, ప్రతి ప్రాంతంలోని పెద్దాచిన్నా ఓడరేవుల అభివృద్ధికి సమగ్ర పథకరచన జరగాలన్నది ఆలోచన. రేవులను తీర్చిదిద్దడంతోపాటు, వాటి కేంద్రంగా ఆ ప్రాంతం మొత్తాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా కళకళలాడించేందుకు విధానాలు ఆవిష్కరించాలన్నది ఉద్దేశం. ఓడరేవుల సమర్థతను పెంచాలన్న దశాబ్దం క్రితం నాటి ఆలోచనకు కొన్ని అదనపు హంగులను కూడా చేర్చాలనుకుంటున్న ప్రభుత్వం దానిని ఆచరణ సాధ్యం చేయడానికి చాలా అవరోధాలు అధిగమించవలసి ఉంది. ఇక, అసలు లక్ష్యానికి ప్రాధాన్యం తగ్గి అదనపు అంశాలకు ప్రాధాన్యం పెరిగే ప్రమాదం లేకుండా కూడా చూడటం ముఖ్యం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వీర్రాజీయ శీలం -1

వీర్రాజీయ శీలం

ప్రముఖ చిత్రకారులు ,కవి నవలా  రచయితా శ్రీ శీలా వీర్రాజుగారికి గత ఏడాది సెప్టెంబర్ లో శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ‘’బాపు –రమణ ల స్మారక పురస్కారం ‘’సరసభారతిద్వారా మచిలీపట్నం లో అందజేసినప్పుడు వారు అభిమానం గా ఇచ్చిన ‘’ఎర్ర డబ్బా రైలు ‘’,’’ఒక అసంబద్ధ నిజం ‘’రెండుకవితా సంపుటులను ఈ రోజు మాత్రమె చదివీ వీలు దొరికి చదివాను .మొదటిది 1981-93 కాలం లో రాసినకవితలైతే ,రెండవది  ఆ తర్వాత రాసినవి .రెండిటిలోనూ వీర్రాజుగారి కవితాత్మ దర్శనమిస్తుంది .సమాజం పై వారికున్న అభిప్రాయాలు ,తనకున్న భావాలు ,తానూ నమ్మిన  సిద్దాంతా లు ,సమాజం పట్ల బాధ్యతా ,తోటి వారిపై ఉన్న మానవ సంబంధాలు అన్నీ రాశీభూతమై వీర్రాజు గారి \నడవడిని ,ప్రవృత్తిని ,అంతరంగాన్ని వ్యతిత్వాన్ని కేరక్టర్ ను  ఆవిష్కరిస్తాయి ఈ కవితలు .అందుకే ఈ వ్యాసాన్ని ‘’వీర్రాజీయ శీలం ‘’అన్నాను . ముందు ఎర్రడబ్బా రైలు లోని కవితా బోగీల సంగతి చూద్దాం .asambaddha nijam 001 yerradabba 001

ఎర్ర డబ్బా రైలు –కవితా సంపుటి

దూరమైపోయిన కొడుకు నుండి ఏదో ఒక రోజు ఉత్తరం వస్తుందని యెర్ర డబ్బా రైల్ కోసం ఎదురు చూస్తుంది ముసలితల్లి .ఆమెకళ్ళ ముందు అంతా చీకటే .చీకటికి ఎరుపూ ,వెలుగూ ఉండవు .కొడుకుతండ్రికి రాసే ఉత్తరం లో  ‘’నాన్నా నేను క్షేమం ‘’అనే’’ ఆరక్షరాల’’ ఒక చిన్న మాటకోసం ఆతల్లి ఆరాటం .అదే ఆమెకు ఒక పెద్ద ఓదార్పు .ఆ ముసలి దంపతుల బతుకు మీది ఆశకు ‘’రేపటి ఉషస్సు ‘’.ఆ ఉత్తరం వస్తే  ‘’కుతకుత లాడే కొడుకు గుండెల వేడి నెత్తుటిలో ఏ సర్కారు తుపాకి గుండూ తలస్నానం చేయలేదని ,కొడుకు గుండె లాకప్ చీకటిగదిలో కొట్టుకోవటం ఆగి పోలేదని ‘’ఉపశమనం .అందుకే ఆమెకు ‘’యెర్ర డబ్బా రైలంటే అంత ఇష్టం ‘’గుండెల్లోకి సూటిగా దూసుకు పోయే మాటల బాధా తప్త పల్లవి ఈకవిత .

మిత్రుడు ‘’బాధల కొలిమిలో కాలికాలి రాటు దేలిన ‘’వాడు .అతనికి ఓ సందేశమిస్తూ ‘’ఈ వ్యవస్థ మీద కోపం –నీ కుటుంబ శ్రేయస్సుకే పరిమతం చేయకు –నువ్వు చేసే త్యాగం –నీ ఇంటి ఆవరణ దగ్గరే ఆగిపోనివ్వకు ‘’అన్నారు. ఇది అందరికీ వర్తించే సూత్రమే .ప్రకృతి నేర్పే పాఠం గురించి చెబుతూ ‘’నాలుగు వైపులా నిర్బంధం చేసినంతమాత్రాన –ఎవరూ ఎవరిప్రాణాలు  తీయరు –తన ప్రాణానికి నీచేతిలో ప్రమాదం పొ౦చి ఉన్నప్పుదు –మనిషేకాదు పిల్లికూన కూడా నిన్ను నమ్మదు .-తనను తానూ రక్షించుకోవటం –ప్రక్రుతి నేర్పే తొలిపాఠం’’అని మనప్రభుత్వాల ‘’అరణ్య కాండ ‘’పై చేన్నాకోల్ దెబ్బ .’’పగల ముగ్గిన నేరేడు పళ్ళు –ఊదా వడగళ్ళుగా ‘’ పడుతున్నాయన్నారు వీర్రాజుగారు .శిశిరం లో బాదం చెట్టు ఆయనకు ‘’పచ్చని ఆకుల్ని ఎర్రగా మార్చుకొని –సాయంత్రపు ఎండకు మరీ ఎర్రబడి –నిప్పులపోగై మెరుస్తున్నాయి ‘’ట .అద్భుతమైన భావ చిత్రం .అన్నిట్లోనూ బలిసిన వారి ‘’జీవితం నిండా ఎరుపు పరచుకుంటు౦ది –ఎరుపు వాళ్ళ అభిరుచుల నిండా అల్లు కుంటు౦ది .ఎరుపు వాళ్ళ ఒంటి నిండా ప్రవహిస్తుంది ‘’.కాని, వాళ్లకు ‘’జానెడు యెర్రని గుడ్డ ముక్క –మూరెడు కర్ర మీద జెండాగా మారి –గాలిలో రెపరెప లాడుతూ కళ్ళ ముందు కనిపిస్తే –ఒకటే భయం –పిచ్చిభయం ‘’అని తన ‘’ఎర్రజెండా ‘’అభిమానాన్ని దాచుకోకుండా చెప్పుకొన్నారు వీర్రాజుగారు .రక్తం మరిగే వారికి ‘’రక్తపు రంగు జెండా అంటే ‘’కాళ్ళకింది— కారిపోతుంది అని భావం .

తనఖా పత్రాన్ని గూర్చి ఏంతో కవితాత్మకం గా గుండె తడి తో ఇలా చెప్పారు ‘’మట్టిని పెకలించి పరిచి –ప్రక్రుతి కన్నేర్రే జేస్తే కండబలం నమ్ముకుని –కావిళ్ళు మోసి నీరు పోసి -గింజ గింజనీ ఆశలో తడిపి విత్తి –తమ సర్వస్వంగా కాపాడు కొంటున్న –ఒక్కగానొక్క మడిచెక్క తాలూకు –తనఖా పత్రం ‘’అదే కాగితమై షావుకారు గారి ఇనపబీరువాలో భద్రంగా ఉండి వాళ్ళ ఆశల్ని చిద్రం చేస్తోంది .పిడికిలి బలాన్ని గూర్చి ‘’అయిదు వేళ్ళూ ఒక చోట కలిసి –ఎముకలు సైతం పిండి  అయి పోయెంతగా –దగ్గరగా బిగుసుకొని –ఆలోచనలోనిద్రుఢత్వానికీ  నిర్భయత్వానికీ అద్దం పడతాయట – ‘’గుప్పెట్లో నీమనసు ఉంది –పిడికిలో మనసులోని నీ నిర్ణయం ఉంది ‘’అన్నారు .వేళ్ళు విడివిడిగా ఉంటె ఏమీ ఉండదు కలిస్తే కసి బిగి పెరిగి అనుకొన్నది సాధిస్తాయి .పిడికిలి పౌరుషానికి  .మనస్సంకల్పానికి గుప్పెట ప్రతీకలు .

వీర్రాజు గారికి హంస బతుకు కంటే కాకి బతుకే ఇష్టం .కాకి సమిష్టి జీవితానికి ఉదాహరణ .హంస ఒంటరితనానికి గుర్తు .అందుకే ‘’పది మందితో కలిసి పంచుకొనే –సమిష్టి జీవితం నాది ‘’అన్నారు . .’’రెక్కలు రాని ఏ గూటి పిల్లో –రెక్కలొచ్చిన ఏ గూటి తండ్రో –కరెంటు తీగకు బలి నేలకూలితే –పది మందినీ పిలిచి కన్నీరు కార్చే –సంఘ జీవితం నాది ‘’అని తానూ సంఘజీవినని స్పష్టం గా చెప్పారు ‘’పది మంది తో జీవితాన్ని పంచుకోవటం –నా బతుక్కి ఆదర్శం ‘’అంటూ ఆదర్శాన్ని వివరించారు .అమెరికా నౌకాదళం ఇరాన్ పౌర విమానాన్ని కూల్చినప్పుడు చలించిపోయిన రాజుగారు మానవత్వం నశించిన పాశవత్వానికి కినిసి ‘ఆ పని చేసిన వారు మనుషులైతే క్షమాపణ కోరేవారని రాక్షసులైతే పొరబాటును ఒప్పుకొనే వారని కాని ‘’వీళ్ళెవరూ ‘’?అని వీళ్ళను ఏ జాతికింద కట్టాలో తెలియక నరరూప రాక్షసులని  తేల్చారు .మానవత్వం లోపించిన ఈ జాతినేమని పిలవాలో ? మిలియన్ డాలర్ల ప్రశ్న .వీర్రాజుగారికి మానవత్వం అంటే ఉన్న అభిమానికి ఈ కవిత నిదర్శనం .మానవత్వానికి ఎత్తిన పతాక అనిపిస్తుంది .

బడాబడా వాళ్ళు ‘’సింహాల క్లబ్బుల్లోచేరి చెక్కు బుక్కుల్ని చించుతారు  -దానాలతో పేపర్లు ఆక్రమిస్తారు .వాళ్ళు పదికాలాల పాటు పచ్చగా  ,డబ్బాకలితో ఆవురావురుమనాలి –అప్పుడే ‘’పెళ్ళాం ,పిల్లల జబ్బులకో ,చదువు సంధ్యలకో –పుస్తేలతాడో చేతిగాజులో తాకట్టు పెట్టచ్చు .నూటికి పది రూపాయలకైనా డబ్బు తేవచ్చు –వాళ్ళ ఆకలి తీరకు౦డాలి –వాళ్ళ సంఘ సేవ –అలా అలా సాగాలి ‘’అని వ్యంగ్యాస్త్రాన్ని  సంధించి’’ చెడేల్ ‘’మని వాయిస్తారు .ఏ ఇజం వారైనా ‘’స్వార్ధిజం ‘’ప్రాణాంతకం .వీరినీ వదలకుండా వాయిస్తూ ‘’మనకు కావలసింది ప్రజలు కాదు –మనమే –మన కీర్తి ప్రతిష్టలు ,మన సుఖ సంతోషాలు మన హోదాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని సుతిమెత్తగా మెత్తని చెప్పుతో బాదేశారు .’’నీళ్ళల్లో నిప్పు ‘’కవితలో ‘’అలజడి రేగిన గుండేల్లోంచే   అకస్మాత్తుగా –బడబాగ్ని లాగ నిప్పులు కురుస్తాయి .నువ్వింకా తేరుకోక ముందే –నిలువునా నిన్ను మసి చేస్తాయి ‘’అని ఘాటైన హెచ్చరిక చేశారు .అలజడే కదా అని ఉపేక్షిస్తే ఉపద్రవం గా మారుతుందని సూచన .

‘’వారం రోజులక్రితం వరకు ఆ గదిలో –అర్ధ రూపాయి మల్లెపూలు –అర్ధ రాత్రి వరకు మత్తేక్కించాయి-రూపాయి పకోడీ పొట్లం –రోజంతా లాలాజలాన్ని పారించిది.-యవ్వనం  ఆ గదిగోడ మీద జీవితమై వేలాడింది ‘’అలాంటి జంట జీవితం లో భాగ్యనగరం అభాగ్యాన్ని కురిపించింది ‘’మతవిద్వేషం పూసిన ఏ పిడి బాకో  ‘’భర్తను శవం గా మార్చింది .ఇప్పుడామె అదే గదిలో ‘’చిరిగిన జీవితాన్నే –చింకి చాపలా పరచు కొన్నది –గుండెల్ని పిండుకొని ఘోషిస్తూ –కల్లెలు కల్లెలుగా  దుఖాన్ని కక్కు కొంటోంది ‘’.ఒక్క రాత్రిలో ఆమె జీవితాశ చితికిపోయింది దీనత తాండ వించింది.’’ఆమెపేరు ఏదయితేనేం ?అనాగరక ఆటవిక మత దురహంకారానికి గురైన –ఒక భాగ్య నగర అభాగిని ఆమె ‘’అని మతకల్లోలం ఎందరి జీవితాలను బలి తీసుకోన్నాయో తెలిపే ఒక ఉదాహరణ మాత్రమె ఇది .మనుష్యులుగా  మనం ఆలోచించాల్సిన సమయం అని గుర్తు చేశారు కవి .’’అర్ధాంగి కూడా అమ్మలాగే ఓ స్త్రీమూర్తి కదూ ‘’అని మరోకవితలో చెప్పారు .

గుండె లక్షణం వివరిస్తూ ‘’కొండంత విశ్వాసం దానికి ఉండాలి –ఆకాశ మ౦త స్వేచ్చ –చిటికెడు ఊపిరిలో నిండాలి –దోసెడు ఒంటి రక్తం లో కరగాలి .అప్పుడే అది –ఊపిరి తాగుతున్న రూపం అనుకోగలం ‘’అన్నారు కాకపొతే అది మట్టిదో రాతిదో కర్రదో కంచుదో-శిల్పం లాగా అదికూడా రక్తమాంసాల బొమ్మే ‘’అన్నారు .రక్తం ,మాంసం చెమట ఓడుస్తూ రోళ్ళు తయారు చేసి ఇంటింటికీ తిరిగి అమ్ముకొనే వారు బాగ్యనగరం వచ్చి భయ పడ్డారట .ఎందుకు అంటే ‘’ఈ ఊరొచ్చాక మాకు జబ్బు భయం కన్నా కొత్తభయం పట్టుకొంది-ఎప్పుడొస్తుందో అకస్మాత్తుగా కర్ఫ్యూ –మా నోట్లో దుమ్ము కొట్టటానికి మా కడుపుల్లో చిచ్చు పెట్ట టానికి ‘’అని వాపోయారు ఆ బడుగు జీవులు .ఇంత చిన్న విషయాన్ని వీర్రాజు గారు గుర్తించి వారికి తనకవిత్వం లో చోటు కల్పించి వారి ఆవేదనను వినిపించటం ,కర్ఫ్యూ యెంత భయంకరం గా బడుగు జీవుల జీవితాలతో ఆటలాడుతుందో తెలియ జేసే మంచికవిత ‘’మా భయం ఒక్కటే ‘’.

ఓటు కోసం అభిమానం గా ఇంటికొచ్చే ‘’బిచ్చగాళ్ళు ‘’గురించి రాస్తూ ‘’నీ అభిమానం నామీదకాదు నా చేతిలోమి వోటు మీద –ఓటు వెనక గద్దె మీద –గద్దెపై కూచునే నీరూపం మీద ‘’ –అని నిర్మొహమాటం గా చెప్పారు .అందుకే ‘’నీ ఆతిధ్యం నాకొద్దు –మా ఇంటికి నువ్వు రానే రావద్దు ‘’అని ఖచ్చితంగా వోటు బిచ్చగాడిని తరిమేశారు వీర్రాజుగారు .రాగాల చెట్టును  కలవరిస్తూ ‘’చెట్టే నా ఇల్లు –ఆకుల గుబుర్లె దిళ్ళు –కొమ్మలే ఊయలలు ‘’అన్నారు .కాని ఇప్పుడు తానూ ముని అయినా నిశ్శబ్దాన్ని ఆశ్రయించినా ‘’మౌనం లో కూడా సంగీతం వినడం నేర్చిన వాడిని –నీ రాగానికే కాదు నీ మౌనానికీ –ఇప్పుడు నేను శ్రోతను ‘’అని ప్రకృతిలో తానూ మమైక్యమయ్యే భావనకు అద్దం పట్టారు .ఎదురు ప్రవాహం లో బరువు పడవను లాగుతున్న కూలీలను  కూడా వీర్రాజు గారు మర్చిపోలేదు ఇది రాజ మండ్రి అనుభవమే .’’ఎగుడు దిగుడు ల రాళ్లబాటలో –పిచ్చి డొంకల ముళ్ళ దారిలో –అలా ప్రవాహానికి ఎదురుగా –మెల్లగా –మెల్లగా –బరువుగా –లాగు కొంటూ –లాగు కొంటూ –లాగుకొంటూ ‘’అని దృశ్యమానం చేశారు .లాగుకొంటూ అనటం లో వాళ్ళ శ్రమా బడలికా అలుపు ,ఊపిరి అందని స్తితి అన్నీ చూపారు .ఆరుద్ర కూడా ‘’మోయ్యోయ్ మోయ్యోయ్ మోయ్యోయ్ తోయ్యోయ్  తొయ్ ’కవితలో ఇదే సీను ‘’త్వమేవాహం ‘’లో చూపించాడన్న సంగతి మనకు తెలుసు .హుసేన్ సాగర్ ‘’ఆత్మ హత్యాసాగరం ‘’కాక ముందు నీరు మలినం కాక ముందు నిర్మల తరంగాలు  సేద తీర్చేవని  ఇప్పుడు అదొక మృత్యు సాగారమయిందని ఆవేదన చెందారు .’’రేపటి మాతృమూర్తి ‘’దృశ్యమే ఆయన్ను వెంటాడింది .ఆ పసిపాప ముఖమే నీళ్ళలో ప్రతిఫలిస్తోంది .మాత్రుమూర్తికాకుండానే యా పసిపాప జీవితం భళ్ళున పగిలిపోలేదుకదా-హుసేన్ సాగర్ నీటిలో  ఆమె భవిష్యత్ జలసమాధి కాలేదుకదా ‘’అని ఆ పాప జీవితం  ఏమై పోయిన్దోనని ఆందోళన చెందారు .రోజూ ఇలాంటి దృశ్యాలు అక్కడ మామూలే కదా .

బాల్యాన్ని ఆదర్శం గా తీసుకోవాలన్న సూచన చేశారు .కాని ఎవరు వింటున్నారు దీన్ని? .అందుకే ‘’మనం బాల్యాన్ని ఆదర్శం గా తీసుకొన్న దెప్పుడు ‘’? అని ఒక దెప్పు దెప్పారు .’’తీసుకొని ఉంటె –మనం ఇలా ఎప్పటికీ ఉండం-ఇంత అసంబద్ధం గా ఇంత క్రుత్త్రిమంగా ఇంత రాక్షసంగా –జీవించం గాక జీవించం ‘’అని బల్ల గుద్ది మరీ చెప్పారు .బాల్యానికున్న ప్రాధాన్యతను కవితలో పాఠం గా చెప్పారు మన డొల్లతనాన్ని ఎండ గట్టారు ..కృత్రిమత విజ్రు౦భిస్తోందని అది నాగరక లక్షణం కాదని హితవు చెప్పారు .దీనిపై సెటైర్ గా ‘’మనం కాంక్రీటు చెట్లను అలంకరించుకొని –రస హృదయాల్ని ఆవిష్కరించు కొందాం –రకరకాల సెంట్లు స్ప్రే చేసుకొని –రోజుకొక విధం గా ఘుమ ఘుమ లాడి పోదాం ‘’అని చమత్కరించారు వీర్రాజుకవి .ఇంతవరకు వారి ‘’యెర్ర డబ్బా రైలు ‘’కవితా సంపుటి లోని కవితా సౌరభాన్ని ,వీర్రాజుగారి వ్యక్తిత్వాన్నకవితా గాఢతను తెలుసుకొన్నాం . తర్వాత వారి ‘’ఒక అసంబద్ధ నిజం ‘’సంపుటి లోని కవితా  సౌందర్యాన్ని దర్శిద్దాం .

సశేషం

శ్రీరామనవమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీర్రాజీయ శీలం -2

వీర్రాజీయ శీలం -2

”ఒక అసంబద్ధ నిజం ”-కవితా సంపుటి

 

‘’ఈ నాడు ఏమనిషిని దులిపినా –బొటబొటా రాలేవికన్నీళ్ళే-ప్రతికన్నూ ఒక కొలనే మరి –ఏడాదిపోడవునా రాల్చే కన్నీటి చుక్కలు –వేల కొట్లలో ఉన్నాయి ‘’వీటిని అక్కున చేర్చుకోనేవి మేఘాలే .కన్నీళ్ళే కాదు  చెమట చుక్కలూ అంతే –ఎక్కడెక్కడో పని చేసే శ్రమ జీవుల చెమట బిందువులు ఆవిరై మేఘాల్లో కే చేరతాయంటారు వీర్రాజు గారు .అవి ఒక్కొక బి౦దువులాగానే కనపడతాయి కాని  అవికాలువలు కట్టి పారి –వాగులూ వంకలై ఏరులై పొర్లి –నదీనదాలై ప్రవహించి –చివరికి సముద్రం లోనే సంగమిస్తాయి .అందుకే సముద్రం ఏడాదికేడాది బలుపెక్కి పోతోంది .ఉన్న చోటు చాలక కొత్త జాగాల వైపు –కెరటాల్ని చాచుకొని విస్తరిస్తోంది ‘’అని వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపి సునామీ సృష్టికి కారణం మానవ  అత్యాసేనని ,మానవ పీడనమూ సహేతుకం కాదని కార్మిక  పక్ష పాతిగా  పర్యావరణ వేత్తగా హెచ్చరించారు ‘’ఒక అసంబద్ధ నిజం ‘’కవితలో .ఇదే సంపుటికీ శీర్షిక అయింది .సార్ధకతా తెచ్చింది .

‘’అక్ష రానికి ఆమడ దూరం లో ఉన్నవారికి –ముఖమే కవిత్వ వేదిక ‘’అన్నారు .’’చూపుల్లో తన్మయత్వమే కవిత్వాభి వ్యక్తీ –మాటల్లో పరవశత్వమే –కవిత్వ వాహిక ‘’అని ఏంతో అద్భుతం గా కవితాత్మకం గా చెప్పారు .ప్రతిదానికీ  యంత్రాలపై ఆధారపడ్డ నేటి మనిషి సున్నిత హృదయ స్పందనలకు దూరమవుతున్నాడని గుర్తు చేశారు .బలమైన సంఘటనలు పెద్ద శబ్దాలను  మాత్రమె మనిషి స్పందిస్తున్నాడు .దీనితో రాతి కట్టు హ్రుదయామేర్పడి చెవుల్లో సీసం తో మూసుకుపోయి కుంచించుకు పోతున్నాడు .సున్నితత్వం లోపించి జీవన మాధుర్యం కరువైపోతోంది .అందుకే ఇప్పుడు ‘’ఎటు చూసినా కనిపించేవి –ఏ అభి వ్యక్తీ లేని –ఏ స్పందనా లేని –వట్టి రక్త మాంసాల రోబోలె ‘’అని నేటి ఆధునిక మానవుని కృత్రిమత్వాన్ని వదిలి౦చు కోమని  యదార్ధ జీవిత మాధుర్యాన్ని అనుభవించ మని ఒక రకం గా ఆదేశిస్తున్నారు .కవి ‘’అన్ ఎక్నాలేడ్జేడ్ లెజిస్లేటర్ ‘’అన్న సత్యాన్ని రుజువు చేశారనిపిస్తుంది .

వీర్రాజీయం గా కొన్ని జీవిత సత్యాలు చెప్పారు .’కష్ట సుఖాల  కల నేత ఉన్నప్పుడే –జీవన మాధుర్యం తెలిసి వస్తుంది ‘’అన్నది ఆయన అనుభవ సారం నిజ జీవిత విధానం కూడా .శ్రీ శ్రీ ‘’కవితా ఓకవితా ‘’లోను తిలక్ ‘’నా అక్షరాలు ‘’లోను తమకవితా లక్షణాలను వివరిస్తే వీర్రాజుగారు ‘’అక్షరాయుదుల కత్తి సాము ‘’రాసి తన మనోభావాలు వెలిబుచ్చారు .’’కష్ట జీవుల కన్నీటి లో తడిసి –బరువెక్కిన అక్షరాలూ నావి –ఎక్కడ తడిమినా తడి తగుల్తుంది ‘’అన్నారు పాఠ కుల గుండె బరువేక్కిస్తాయి .’’ఈ సత్యమే తన అక్షర మాలికలో దారం ‘’అన్నారు .తమ ఇంటికి ఆహ్వానించారు ‘’మీ లాంటి అభిమానుల రాకల్తోనే మా పేరు ప్రతిష్టలను కొలుచుకోనేది ‘’అని వ్యంగ్యం గుప్పించారు .అయితే తనను ఎలా గుర్తు పట్టాలి ఎక్కడ కనిస్తారు ?.రాజకీయ నాయకుడిలాగా చీపిరి చేత్తోపట్టుకొని ఫోటో దిగాటానికో ముస్ష్టివాడికి  కుంటివాడికీ సాయం చేస్తున్నట్లు ఫోటోలు దిగే చోట ,బారు  బీరులలో తను కనిపించనని చెప్పి ‘’నేను బహువచనానికి ఏక వచన సంకేతాన్ని –ఈ తెలుగు  గడ్డమీద అక్షర ధారుల కులానికి ప్రతినిధిని –అత్యాధునిక శాఖీయుడిని.కలం నా ఆయుధం –కవిత్వం నా యుద్ధ భూమి –నా కీర్తినామం ‘’కవి ‘’అని చిరునామా ఇచ్చారు .తాను  అందరి ప్రతినిధినని గుర్తు చేశారు మళ్ళీ .

బాల్య జ్ఞాపకాల్ని అపురూపంగా దాచుకొన్న అమ్మ వెంట పుట్టిన ఊరికి వెళ్ళారు .అక్కడ పొడి పలకరింపులే దక్కాయి .ఆత్మీయ స్పర్శ లేనే లేదు .ఇప్పుడు ఆ ఊళ్ళో ‘’ప్రతి ఇల్లూ ఓ టంక శాల –ప్రతి హృదయమూ ఓ డబ్బుల మూట’’అంత బలిసిపోయింది ఆ ఊరు .’’పక్క నున్న అర్ధాంగి బాహువులే –ఇల్లు చేరే వరకు వెచ్చని దుప్పటి నాకు ‘’అంటారు ఇల్లాలిచ్చే సౌఖ్యాన్ని గుర్తు చేసుకొంటూ .’’ఏడుపైనా నాకు నవ్వులు పరచిన పూల తివాచీయే ‘’అన్నారు .బిడ్డ పుట్టినప్పుడు ఏడుపుతోనే పలకిస్తు౦ది  అని సామెత చెప్పారు .ఆ ఏడుపే మధుర సంగీతం అని ‘’ తొలినాదం మరీ అద్భుతం ‘’అని మురిసిపోయారు .

ఒక రైతు రంగయ్య పొలం చెక్క తడపతానికి బావి తవ్వుతూ మూడులోతుల నేలని తవ్వినా చెమ్మతగలక –మరో నిలువు లోతుకు దిగినా నీరుకాక బండరాయి తగిలినప్పుడు –కారడానికి కన్నీళ్లు లేక పొతే కవి మనస్సు చివుక్కుమన్నది .అయిదేళ్ళ తర్వాత వచ్చి చూస్తె పొర్లుతున్న బావినీళ్ళు చూసి పొంగిపోవాలో అతని పెళ్ళాం మెళ్ళో కనిపిస్తున్న పసుపు కొమ్ము చూసి బాధ పడాలో తెలియ లేదు .ప్రకృతిని అంచనా వేయటం లో తానూ రంగయ్యా పొరబాటు పడ్డామని ఒప్పుకొన్నాడు .తప్పంతా తనదే అన్నాడు .రంగయ్యలో ఆశలు రేకెత్తించి తప్పుడు సలహా ఇచ్చి అప్పుల ఊబిలో రంగయ్యను తోసేసినందుకు సిగ్గుతో కుమిలిపోయాడు .ఇది ఒక పోయిట్రీ కద.గొప్పగా చెప్పారు .

జీవితాన్ని చెట్టుతో పోల్చుకొని తనకు అన్వయంచుకొని చెప్పిన సత్యాలు అసంబద్దాలుకావు నిజమైన నిజాలే .’’చెట్టు పచ్చగా ఉన్నప్పుడు –ముఖ పరిచయస్తులు కూడా –ప్రాణ మిత్రులై పలవరించారు .-ఎగి రొచ్చిమరీ పలకరించారు ‘’కాని తానూ అన్నీ కోల్పోయి మోడిన చెట్టులా అగుపిస్తే ‘’ఆకుల్ని రాల్చుకుని అస్తిపంజరంయ్యాక –ఆత్మీయులైన వారు సైతం –కనిపించనంత దూరానికి  వలస పోయారు .’’నిజంగా ఇది పారడాక్స్ ఇన్ లైఫ్ .తాను  ఇంకా ఆశా జీవి కనుక ఏ కాస్త చిగురైనా కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు .మరో జీవిత సత్యం చెప్పారు ‘’చేసిన సాయానికి –ప్రతిఫలాన్ని ఆశించటం తప్పే౦  కాదు –అప్పుడు నువ్వుమానవుడివి –ఆశించక పొతే –పరిపూర్ణ మానవుడివి ‘’ఇదే వేద వేదాంగాల సారం .బాగా ఒంట పట్టింది కవిగారికి ..ఎన్ని తప్పులు చేసినా మనిషికి ‘’ప్రకృతి ఒక్కటే సరైన చికిత్స శాల ‘’అన్న సత్యమూ తెలిపారు .’’నెటిజన్ల’’ ను దృష్టిలో పెట్టుకొని ఒకమ్మాయి ఆంతర్యాన్ని చక్కగా ఆవిష్కరించారు –‘’నెట్ లో నా ఫోటో పంపటానికి –అభ్యంతరం లేదుకాని –ఎదురు పడి కలుసుకోవటం – ఇష్టమేకాదు ముఖ్యం నాకు ‘’అని నిష్కర్షగా తెలిపిందిందా అమ్మాయి .చివరికి’’ నెట్ నిజం ‘’తెలియ జేస్తూ ‘’అక్షరాల్లో జారని ఆంతర్యాన్ని –ఒకరికొకరు తెలుసుకోన్నాకే –ఫోటోల్లోపడని మనసుల్ని –పరస్పరం చదువుకున్నాకే –ఏదైనా ఒక నిర్ణయం తీసుకొందాం- ఫోటోల నైనా మరింక దేనినైనా –అప్పుడే ఇచ్చి పుచ్చుకుందాం ‘’అని కరాఖండీగా చెప్పిందా అమ్మడు .ఇది వీర్రాజు గారి’’ నెట్ వేదం ‘’.వేదం అందరికీ శిరో దార్యమే కదా. అందరూ పాటించాల్సిందే .

మరోసత్యం ‘’దృశ్యమైనా శబ్దమైనా –అందంగా కనిపించేది –ఆకలి తీరాకే ‘’అని ఆకలి ఉపనిషత్ ఆవిష్కరించారు .’’కళకి జీవితాన్నిఅద్దడం కాదు –జీవితానికి కళను   అద్దాలి ‘’అంటారు అప్పుడే అస్తవ్యస్త జీవితమైనా గజిబిజి చిత్రమైనా ప్రజా మోదం పొందుతాయని భరోసా ఇచ్చారు .గ్లిజరిన్ కన్నీళ్లను రంగస్థలానికి పరిమితం చేసి నిజమైన కన్నీళ్లను నిజ జీవితం లోకి మిగుల్చుకోమని ‘’హితవు .రచయిత కాని కవికాని రంగుల కలల్లో మిగిలి పోవద్దన్నారు.’’నిజాన్ని నిజం గా చూపు –అది నేరం కాదు –నిన్ను నిన్నుగా ఆవిష్కరించుకో –అది వంచన కాదు –భ్రమల్లో బతకటం –ఖరీదైన కళల కోసం వెతకటం –ఆరోగ్యం కాదు –నీకూ –నీ చుట్టూ ఉన్న మాకూ ‘’అని గొప్ప హితోపదేశం చేశారు .

దానగుణం గల దాన శీలురను ‘’దానం చేయండి –ఒక బుక్కు అచ్చేసుకొంటాను ‘-మీ పేరు చెప్పుకొని ఓ పుస్తకం  వెలుగు లోకి తెచ్చుకొంటాను ‘’అని తమాషాగా అన్నారనిపిస్తుంది .అంటే డబ్బును సార్ధకం చేసుకొని కవిని కవిత్వాన్ని రచయితను రచనలను బతికించమని కోరారని భావించాలి .వాతావరణ పాఠం చెబుతూ ‘’కళ్ళ జోడు అతని ఆత్మరక్షణ కవచం –దాని వెనక దాక్కున్న అతని మనసులో –బాధా ,కోపం ఏదైనా ఉండచ్చు ‘’అన్నారు .మిత్ర లేఖ లో ‘’అక్షరాల్లో  దట్టిం చాల్సింది  –ఆగ్రహమే కాని ద్వేషం కాదు –కవికి ఉండాల్సింది –సంయమనమే కాని ఆవేశం కాదు ‘’అని అక్షరోపదేశం గా అక్షర సందేశం ఇచ్చారు .బిరుదులూ ఫ్లేక్సీలు  బేనర్లూ కీర్తికి కొల బద్దలు కావని ‘’కీర్తికి పెద్ద పీటవేసినంత కాలం –నీ ప్రతిభకు జేజేలు పలకరు –నువ్వు నిరాడంబరుడ వైతేనే –నీకూ నీ వ్యక్తిత్వానికి గౌరవం –నీ మాటకూ నీ రాతకూ అప్పుడే విలువ ‘’నిరాడంబరతకు పెద్ద పీట వేశారు వీర్రాజుగారు. తాను  అనుసరించిన బాట ఇదే .ఆచరించి చెప్పిన మాట కనుక గొప్ప విలువ ఉంది .

‘’మరణ భయం చుట్టుముట్టి –నత్తలా మనసు ముడుచుకు పోయినా –‘’అది తనకు తాత్కాలికమే కాని శాశ్వతం కాదని చెప్పారు .అలాంటి సమయాల్లో భజనల వైపు ,బాబాల వైపు,పూజా పునస్కారాల్లోకి  జారిపోకుండా నిలబడతానన్నారు .’’నా రంగుల ప్రపంచం –నన్ను కాపాడుతూనే ఉంటుంది –నా అక్షర ప్రాంగణం –నన్ను ఆదు కొంటూనే ఉంటుంది –నా జీవన చరమాంకం చివరిక్షణం వరకు –నా రంగుల ప్రపంచమే నావిహార స్థలి –నా అక్షర ప్రాంగణమే’’నా చిర్నామా ‘’అని వీర్రాజుగారు అటు అక్షరం ఇటు రంగులే తన నేస్తాలని మార్గ దర్శకాలని ఘంటా పధం గా చెప్పారు .ముదిమి మీదపడ్డా చెదరని ధైర్యం ఆయనది .ఆ అక్షర ,చిత్రజీవి  మరింత అక్షర రాశిని  మరిన్ని రంగుల చెలువములను   వర్షించాలని ఆశిద్దాం  .

శ్రీరామనవమి శుభాకాంక్షలతో

మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-15- ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment