చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం”

నేపధ్య సంగీతం  :

శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం.  నది  తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి  తులసీరాం  హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది.  బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రసస్ఫోరక కలభిజ్నత   óá ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .

 

శంకర శాస్త్రి   ని పరిచయం చేస్తూ ఆయన పద  సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలాభి  లజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే అన్న   నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో శంకరాభరణ  రాగాన్ని,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం,అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో”మానస సంచరరే ”పాట ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని ద్రుష్టి ”శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం  శ౦కర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది ఇది మహ దేవన్ విశ్వనాద్ ల అపూర్వ భావ సంయోగ ముక్తాఫలం.

సోమయాజుల నటన:

ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి  ,గంభీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం శంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయే టట్లు జీవిన్చేట్లు నటించాడు కలెక్టర్ సోమయాజులు అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం నేపధ్యం గా సాయ పడింది అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుందా తనం అనితర సాధ్య మనిపించాడు అదో తపస్సు గా యోగ సమాధి గా నిర్వహించాడు

అసలు ఆ పాత్ర ఏమి చెప్పడు .అంతా మనం వూహించు కోవలసిందే . ఉహా  సామ్రాజ్యమే అంత. వ్యంగ్య వైభవమే .”లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడను.  నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేశ్వరుడికి తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ  పాత్రనును విశ్లేషిస్తుంది.  తులసి రైలు ఎక్కేటప్పుడు మైసూర్ లో  పరాభవం జరిగినప్పుడు ఎక్కడ తొణకడు బెణకడు. ఎవర్ని ఏమి ఆనాడు ,తులసి తాను హత్య చేసి వచ్చి  ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు తొట్రుపడడు .

తన కూతురి పెళ్లి కూడా ”అపస్వర౦’తో ఆగిపోయినా  విచారించడు. అంతా పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితె ఆ గంభీరమ్  వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర్వాహిని గా ప్రవహిస్తుంటుంది .అది సంస్కార చేతన.  అది కట్టుబాట్లకు ఆచార వ్యవహారాలకు అ౦దనిది, అంతు బట్టనిది. హృదయ గత మైనది. .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర అందించే సారా౦శం .శిష్టాచార  పరాయణుడైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత హాహిత్య మూర్తి .సంగీతానికి భాషాభేదం లేదని ఆ నాద బ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు. మాట్లాడిన నాలుగు మాటలు majestic  గా ఒక కలెక్టర్ హుందాతనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ఒక నిర్లిప్తత ,ద్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి

కూతురు వెన్న రాస్తుంటే సజల  నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయిన హృదయం ,తేలిక పడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన శిఖరారోహణ చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేశ౦ .అక్కడ ఆర్ద్రత వర్షించింది. అనురాగం జల్లుగా కురిసింది మానవత మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన అదే నటన అనిపించింది సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యుడయాడు

చివరి సీను లో ”దొరకునా  ఇటువంటి సేవ ”పాటకు ముందు”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆ అజ్ఞాత దాతకు ,నా నమోవాకాలు ఆ కళాభిజ్ఞాతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లావితమై బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది. మనసు లో ఆనంద జ్యోతి వెలుగుతుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవద ధరించరా ,విని తరించరా ”అని అనిపించిన ఆ పాత్ర. తెలుగు  చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు విశ్వనాద్  కళా విశ్వనాద్ అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా  విశ్వనాద్ సృష్టికర్తగా కళా నీరా జనాలందుకున్నారు.  ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందింది

మంజు భార్గవి :

నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృష్టింప బడుతు౦దొ తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించిన మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలాసం చేసే కళా మూర్తి వుందని ఎవరు ఊహించలేదు .ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో కాసేపే నాట్యం చేసినా  బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి విశ్వనాద్ చేతిలో మనోజ్ఞ మనోహర శిల్పమూర్తి గా మలచబడింది .అసలు ఆ పాత్రకు డైలాగులు లేవు .వున్నా చాల పొడుపు .అంత సాత్వికాభినయమే . వూహాలోక సంచారమే .ఏదో తెలీని పిచ్చి ఆరాధనా తత్త్వం .ఒక devotion  dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చి రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చ్హత అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించింది

జమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకాలకు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు శ౦కర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంటగట్టి నపుడు ,తిట్టినపుడు ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ నివారించు కోవటం చాల కష్టం .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .శ౦కర శాస్త్రి రాగానికి తాను భావించిన ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ చిత్రాలు గా  దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చత సాక్షాత్కరించింది .ఆ హావ భావాలు పరమ మనోహరాలు. శ౦కర శాస్త్రికి సన్మానం జరిగే టప్పుడు ఆమె కళ్ళు కృతజ్ఞతా భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మవుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది

”బ్రోచే వారెవరురా ”పాట పాడేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు సంతృప్తి, సాధించాలనుకున్న గమ్యం చేరువవుతున్న  తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆన౦దమ్  తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న సంతృప్తి వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే శ౦కర శాస్త్రిని చూపిస్తూ చిరిగిన పంచె లోంచి flashback  లాగినపుడు అతని గత జీవిత వైభవం యెంత గొప్పదో ఆమె చూపిన చూపుతో  అర్ధమవుతుంది అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చు కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె ఆత్మానందానికి ప్రతీక .

జమీందారును హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆరాధనాకృతిగా నిలబడాలన్న తపన అది. .తనమూలం గా శ౦కరశాస్త్రికి  మరింకే కళంకం రాకూడదనే ఆరాటం ఒక మూగ  వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగాexplore expose  చేసిన కళా తపస్వి విశ్వనాద్ పరిశీలనా  దృష్టికి హట్స్ ఆఫ్

అల్లు రామ లింగయ్య :

శివునిహృదయం మాధవునికి మాధవుని మనసు శ౦కరుడికి తెలుసు సృష్టి లో తీయనిది స్నేహం అది యెంత విషమ పరిస్థితులలో అయిన

పరీక్షలకు తట్టు కొని నిలబడుతుంది. ఆ స్నేహబంధం పవిత్ర మయినపుడు వీడదు. వాడదు.  శ౦కర మాధవులు దేవతాస్వరూపులు  స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా శ౦కర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవంను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్రదారికి కూడా గర్వ కారణం .అల్లు  రామలింగయ్య లోని కళాజీవి ధన్యుదయాడు ”వాడెంత నేను  గట్టిగా  కన్నెర్ర జేస్తే గడగడ లాడ్తాడు ”అని శాస్త్రి లేనప్పుడు డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు  చెప్పి కళ్ళు నేలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్కాపోతాడు .

ఇలా యెంత చెప్పిన తరగనిగని  గని  శంకరాభరణం . చూసి  పులకి౦న్చాల్సి౦దే.  చెప్పి మెప్పించలేము.

 

మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24-03-99  న స్వర్గీయ వేటూరి సుందర రామమూర్తి  కృష్ణా  జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకల్లెపల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజున చూపించాను. చదివి బాగుంది అని నా పుస్తకం లో కళాతపస్వి సంతకం చేయటం నా అదృష్టం.

Posted in సమయం - సందర్భం | 2 Comments

బాపు గీత ఉపదేశం

బాపు
గీత ఉపదేశం

రాత రమణీయం
రేఖ లావణ్య రసరేఖ
కుంచె రాయంచ నడక వయారం
బొమ్మ బ్రహ్మ శ్రీ చెలువు సింగారం
చిత్రం విచిత్ర విశ్వ సందర్శనం
భావమ్  m ఉపనిషత్ సుధారసం
జోకు పిడిబాకు అయినా తీయని హాయి
ఆంతర్యం నిర్మల స్ఫటిక సదృశం
ఆలోచనా సదా వున్నతోన్నతం
మూర్తి ముర్తిమత్వ కళా సంపద
నవీన శిష్ట చతుష్టయం
బాపు,రమణ ,మామా ఆరుద్రల్లో అగ్రేసరుడు
ఆరుపదుల  బుడుగే ఎప్పుడు
శ్రీ జ్ఞాన ప్రసూనా పరిమలాఘ్రాత నిత్య పరవశుడు
బామ్మ కు జన్మ నిచ్చి తెలుగు కొమ్మకు అందాలూ నేర్పిన వాడు
కొంటె తనం ,వెక్కిరింపు ,గడుసుదనం తో పాటు
అంతకు మించిన తెలుగు దనం ధనం అతని సొమ్ము
ఆ ”బాపు ”జాతిపిత అయితె
ఈ బాపు సకల కళా జాతి పిత
కళా సరస్వతికి నిత్యం లక్ష పత్ర కుసుమార్చకుడు .
గబ్బిట దుర్గా ప్రసాద్
19 -12 – 93  న రాసిన కవిత
Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

సౌందర నందం

సౌందర నందం

సుందరి నందుల కధను సౌందర నందం కావ్యం గా మలిచి సుందర సురుచిర పరిమళాలను ఆంధ్ర లోకానికి అందించిన ఘనత శ్రీ పింగళి లక్ష్మి కాంతం శ్రీ కాటూరి వెంకటేశ్వర రావు ద్వయానికి దక్కింది .ఇద్దరు కృష్ణా జిల్లా వాసులే కావటం చారిత్రాత్మక సంఘటనే .

రామాయణం లోని సుందర కాండ అంతా సుందరమయం అయినట్లే సౌందరనందం కూడా సర్వాంగ సర్వ మోహన సుందర బంధురం గా వెలసింది .అదొక రసవత్కావ్యం గా వాసికెక్కింది .మందార మకరందం లాంటి పదాలకు కర్పూరపు సౌరభం అబ్బినట్లు న్న కావ్యం .ఆధునిక కాలం లో ఇంతటి రసమయ కావ్యం రాలేదని అభిజ్నుల భావన. ఆ కావ్య పథనం మనసుకు వసంతోదయమే .
బుద్ధ భగవానుని దివ్య బోధల ప్రభావం యెంత గాదం గా హృదయాలకు హత్తుకొని ప్రేమైక జీవులు గా మెలగిన వారి జీవితం లో వున్నత భావ సిఖరారోహనం యెంత గొప్పగా జరిగిందో తెలియ జెప్పిన మృదు మధుర కావ్యం .
లేత తమల పాకు లాంటి పింగళి ఘాటు పొగాకు వంటి కాటూరి కలిస్తే ఏదో కిక్కు ఇచ్చే కారా కిల్లి కాకుండా మానసిక పరిపక్వతను ముగ్ధ మనోహర శైలీ విన్యాసాన్ని రంగరించి ఫస్ట్  నైట్ కిల్లి ల తయారు చేసి ఆహా ఏమి మధురం అద్భుతం అనిపించారు .పరవశత్వం కలిగించే విన్నాణపు సొగసు ,సోయగం తో మెత్తని పూల సెజ్జ పై పరున్న అనుభూతి కల్గించారు .లక్ష్మి kantude వేంకటేశ్వరుడు అవటం వారి జంటకు ఒక పవిత్రత కలిగి ఆకర్షణీయ మైంది .జాతీయోద్యమ స్ఫూర్తి ,అస్పృస్యత విముక్తి గాధం గా మనస్సులో నింపుకున్న ఆ జంట అధునాతన భావాలకు ఆలవాలం .చమత్కారం ,ధిషణ ,భావ దీప్తి ప్రాచీన అర్వాచీన కవిత్వాల పై పట్టు ప్రపంచ సాహిత్య మధనం వారి చిత్తాలను రసార్ద్రం గా మార్చి rasapushkarini లాంటి కావ్యాన్ని అందించారు
”ఆత్మాశ్రయమైన కవిత్వం కంటే విలక్షణ మైన శైలిని కవితలో వ్యక్తీకరించటం భావాన్ని ఉద్వేగాన్ని కవిత్వం లో చొప్పించటం కంటే వర్ణించే అంశం మీద భావ సబలత తో కూడినపా ఆపారవస్యాన్ని ప్రదర్శించటం అంతగా వస్తువు లేని దాన్ని ఎన్నుకొని అందులోని విషాద ,గంభీర భావాలకు ప్రాధాన్యత కల్గించటం దాని వల్ల పాఠకుల సానుభూతితో కూడిన సమ స్పందన కల్గిన్చేట్లు రచించటం ,సాహిత్య భావ పోషణకు ప్రధాన్యాన్నివ్వటం ,పద్య రూపానికి ప్రజా దరణ పొందే రీతి కల్పించటం ,అన్ని మానసిక స్థితులకు అవకాశాలు కల్పించటం ,స్వేచ్చగా స్వీయ అభిమానం కల రంగాలలో కవిత్వం రాయటం ,లఘు కావ్యం గా తీర్చి దిద్దటం sani ని వేసాన్ని బట్టి చెప్పదలచు కున్న దాన్ని వ్యంగ్యం గా చెప్పటం ,చదివిన పాఠకుడికి వర్ణించిన అంశానికి సంబంధించిన వాస్తవ అంశాలు భావన రామణీయకం గా స్ఫురించి ఒక కళాత్మక అనుభ సిద్ధి ఏర్పడటం సౌందర నందం ప్రత్యేకత ”అన్నారు డాక్టర్ జి.వి సుబ్రహ్మణ్యం గారు  .

విషాద ,గంభీర భావాలూ స్వల్పంగా కన్పించి ఆలోచనలో ముంచటం సానుభూతితో కూడిన ఉద్వేగాన్ని కలిగించి aristotle చెప్పిన catharsis సృష్టించిన కావ్యం గా దీన్ని దేని విమర్శకులు పేర్కొన్నారు .నవ్య సాంప్రదాయ కవులైన పింగళి ,కాటూరి జంట అభినవ కావ్యను భూతిని తమ ఖండ కావ్యం ద్వారా సాధించారు .అందుకే సాహిత్య చరిత్ర లో ”సౌందరనందం ”ను విషాద గంభీర కవిత గా గుర్తిస్తారని ఈ జంటను విషాద గంభీర కవులు అని జి/వి .అంటారు .మహాకావ్యాన్ని మినీ కావ్యం లో దర్శింప జేసిన ఘనత వీరిద్దరిది .ప్రయోగం లో parinatilo పద్య సరళిలో పరి పూర్ణ కావ్య దర్సనం చేయించిన ఘనత వీరిది అన్న సుబ్రహ్మణ్యం గారి మాట అక్షర సత్యం .ధర్మ వీరాన్ని రసం గా ప్రతిష్టించారు రాసోవై సహా అని స్పూర్తిని పొందిన కవులు వీరు .
ఆ జంటకు పూసిన పూవే సౌన్డరానంద నందివర్ధనం నిండుగా వొత్తుగా మెత్తగా తెల్లగా స్వచ్చంగా స్ఫటిక సదృశం గా రామణీయకం గా మానసిక ఒత్తిడులకు మందుగా వెలసిన సాహితీ చింతామణి సౌందరనందం పంచదార కన్నా కలకండ పానకంరుచికరం ఆరోగ్య కరం ద్రాక్షా పానకం సరేసరి ఈ రెంటికి తేనే కలిపితే మధురం అతి మధురం ,మధురాతిమధురం మరి దానికి సుగంధం కలిస్తే మరువ లేని మహదానందం ,బ్రహ్మానందం అదే సౌందరనందం .
గబ్బిట దుర్గా ప్రసాద్
30 – 07 –  98  నా వుయ్యూరు సాహితీ మండలి లో నేను చేసిన ప్రసంగం
Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఉగాది విశేషాలు

ఉగాది విశేషాలు

రాబోయే సంవత్షరం పేరు ఖర నామ సంవత్షరం .ప్రభావ నుంచి ఇరవై ఒకటో సంవత్షరం .రాజు చంద్రుడు మంత్రి ,సైన్యాధిపతి గురుడు .సస్యాధిపతి,నీరసాధిపతిరవి .  ధాన్యాధిపతి శుక్రుడు .అర్ఘ్యాధిపతి ,మేఘాధిపతి  బుధుడు .రసాధిపతి కుజుడు. తొమ్మిది గ్రహాలలో ఆరుగురు సుభులు ముగ్గురు పాపులు కనుక మంచి ఎక్కువ జరుగుతుంది .రాజకీయం గా మార్పులు ఎక్కువ .కేంద్రం మంచి నిర్ణయాలు తీసుకొనే అవకాసం వుంది .ఆర్ధిక చిక్కులు ఎక్కువ .పలక పక్షం లో వర్గ పోరు వుంటుంది .నిధులు విడుదల ఆలస్యం .వర్షాలు బాగా పడతాయి .వరదలు ముంపులు మాములే.పంటలు బాగా పండుతాయి .ధరలు ఎక్కువే .అంతుబట్టని రోగాలు జనాన్ని పీడిస్తాయి తుఫానులూ ఎక్కువే .ప్రమాదాలు జాస్తి .బంగారం వెండి ధరలు మండుతాయి .08 -o5 -11vaisakha  సుద్ధ షష్టి ఆదివారం గురుడు మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు మేష రాసి లో ప్రవేసిస్తాడు అప్పుడు గంగానది పుష్కరాలు ప్రారంభం ఇరవయ్యో తేదీతో పూర్తీ .జూలై పది నుంచి శుక్ర మౌధ్యామి సెప్టెంబర్ ఇరవై తో పూర్తీ 20012  జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి .జూన్ పదిహేనవ తేది డిసెంబర్ పడవ తేదీలలో చంద్ర గ్రహణం

ఈ సంవత్షరం మిధున ,సింహ ,ధను ,మకర రాసుల వారికి బాగా వుంటుంది .మేష వృషభ ,కర్కాటక ,వృశ్చిక రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కన్య, ల వారికి అంతగా బాగుండదు .కుంభ రాసి వారికి సామాన్యం గా వుంటుంది వచ్చే జనవరి లోసిమ్హరసిలో కుజ స్తంభాన దేశానికీ కీడు భూకంపాలు వస్తాయి
ఇప్పుడు ఉగాది అంతే ఏమిటో తెలుసుకుందాము .వుగా అంతే నక్షత్ర గమనం ప్రారంభమయిన రోజు అంతే సృష్టి ప్రారంభమైన రోజు .సూర్యుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు భూమధ్య రేఖ మీద వుంటాడు .చంద్ర గమనం కూడా అదే రోజు అశ్విని నక్షత్రం తో ప్రారంభం అవుతుంది .ఈ రెండు కలిసిన రోజే యుగ దినం ప్రారంభం అవుతుంది .యుగం అంతే జంట కాలం భగవంతుని చేతనం కదా .సంవత్షరం వల్లనే సప్త తంతు యజ్ఞం జరుగు తుంది .సూర్య మండలం అనే వినేల్క ఆకాశం నుంచి ఉచ్చారణ లాగా వ్యక్తం చేసే పరా ప్రకృతి ఆవు .సూర్యుడు దాని పొదుగు .సంవత్షరం లోని నాలుగు భాగాలూ దాని స్థానాలు .ఘర్మం అంతే ఎండ వేడి దాని క్షీరం .సంవత్షరం దాని దూడ మేఘాలే వర్షించే ధేనువులు ఆంటే ఆవులు 368  అంగిరసులు అనే dhenuvulu గుంపులై సంవత్షరం అనే దూడ కోసం పాలు ఇస్తాయి ఆంటే ఎండ రూపం లో వెచ్చదనాన్ని పాలుగా ఇస్తున్నాయి అని మహా భారతం లో వుంది .సంవత్షరం వయసు గల దూడను బష్కం అంటారుఆంటే సత్యాన్ని సూర్య రశ్మి రూపం లో సృష్టి గా పిండేది . .ఈరలర్య రశ్మి రూపం లో సృష్టి గా పిండేది అని భావం .అందుకే ఉగాది మహత్తర మయిన రోజు .
ఉగాది నాడు ఏమి చెయ్యాలి ?తలంటి కొత్త బట్టలు మామూలే .ఉగాది పచ్చడి తినాలి వేపపూత మామిడి ముక్కలు కొత్త చింతపండు చెరుకు ముక్కలు మిరియం పొడి పటికబెల్లం సైంధవ లవణం ఆంటే రాక్ సాల్ట్ వెండి గిన్నెలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి తినాలి ఇందులోని ఆరు రుచులు తీపి కారం ఉప్పు పులుపు వగరు తీపి ఆరోగ్యానికే కాక జీవితంలోని కష్టాలు ,సుఖాలు మొదలయినవి ఉంటాయి జాగ్రత్తగా నడచు కోవాలని అర్ధం .వసంత ఋతువు ప్రరంభామయే రోజు కోయిల పాటలతో మత్తెక్కించి కొసరు రోజు సాయంత్రం దేవాలయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు అది వింటే శత్రు సంహారం  జరుగుతుందని ,చెడ్డ కలలు రావని,గంగా స్నానం చేసినంత ఫలితం  అని గోదానం తో సమాన మని ఆయుర్వృద్ధి కలుగుతుందని సుభకరమని మంచి సంతానము లభిస్తుందని మంచి పనులు చేయటానికి సాధనం అనిపెద్దలు చెప్పారు ఆదాయం యెంత వ్యయం యెంత పూజ్యం యెంత అవమానం  యెంత తెలుస్తుంది ప్రమాదాలను హెచ్చరిస్తుంది తప్పుడు మార్గం లోకి జార కుండా కాపాడ్తుంది భవిష్యత్తు పై ఆస కల్గిస్తుంది నిరాశ తాత్కాలికమే నని సూచిస్తుంది కష్టాలను ఎదుర్కోవటానికి ఏమి చెయ్యాలో పంచాంగం చెబుతుంది .
ఈవిదం గా శుభాశుభాలకు చిహ్నమే మన ఉగాది పర్వదినం తెలుగు సంవత్చరాది .ఆంధ్రులకు గొప్ప పండగ .శ్రీ ఖర నామ సంవత్షరం శుభకరం శ్రీకరం   సంతోషకరం సౌభాగ్యకరం కావాలనిఆశిస్తూ శుభాకాంక్షలతో సెలవు
మీ దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామీజీ

శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామీజీ

”వేదాంత విద్యేషు సదా రమంతో -భిక్షాన్న మాత్రేన చతుస్తిమంతః -అశోక మంతః కరనే చరంతః -కౌపీన వంతః ఖాలు భాగ్య వంతః ” భక్తీ జనన వైరాగ్యాలనే త్రివేణి సంగమ స్థానమై నిత్య పరితప్త జనులను తమ అనుగ్రహ భాషణం తో వోదర్చుతూ మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తూ దేశిక వరెంయులై తపోనిస్తులై యోగిపున్గావులై నడిచే దైవం గా భాసించే శ్రీపడులు పూజ్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జియ్యరు స్వామీజీ.

శ్రీ పూజ్య పాదులు 1956  లో దీపావళి అమావాస్య నాడు లోకానికి జ్ఞాన జ్యోతిని ప్రసాదించి అజ్ఞాన తిమిరాన్ని నశింప జేయటానికి ఉద్భవించారు .వేదాంత విద్యను శ్రీ పెద జియ్యరు స్వామి వద్ద నేర్చారు .వేద వేదాంగ శాస్త్ర విజ్ఞానాన సాగరాన్ని అతి పిన్న వయసులో చులికీకృతం చేసిన వేద వేద్యులు వారు .1981   లో జీయరు పీఠాన్ని అధిస్టించి దానికి ఔన్నత్యాన్ని వన్నెను తెచ్చారు .వేద ధర్మ వ్యాప్తి చేయటానికి 1984 లో విజయవాడ వద్ద వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.దానిద్వారా నిరంతరం వేద ధర్మ వ్యాప్తి చేస్తున్నారు .భూత భవిష్యత్ వర్తమానాలన్నీ వేదాన్ని అనుసరించే జర్గు తుందని భారతీయుల ప్రగాఢ విశ్వాసం .”క్రిన్వంతు విశ్వం ఆర్యం ”అనేది మన సిద్ధాంతం .ఈ విస్వాన్నంత విజ్ఞాన మయం చేయటమే భారతీయ దార్సనికుల మహా సంకల్పం .1990  లో జగ్గయ్యపేట వద్ద బాలురకు వేద విద్య నేర్పటానికి వేద పాఠశాలా స్థాపించారు .వేదోద్ధారణ  వారి జీవిత పరమావధి
\                     1985  నుండి 88 వరకు మన రాష్ట్రము వర్షాభావం తో అతలాకుతల మయింది ప్రజల బాధలను అర్ధం చేసుకున్నా స్వామీజీ హైదరాబాద్ లోతొమ్మిది రోజులు వారున యజ్ఞాన్ని అత్యంత నిస్త గరిస్తాలతో నిర్వహించారు .పుర్నహుతి నాడు భుమ్యకసలు ఎకమయినట్లుగా బ్రహ్మాండ మైన కుంభ వృష్టి కురిసింది భూమాత పులకించింది సద్యో ఫలితం లభించింది అంతటి అకున్తిత దీక్ష శ్రీ వారిది భారత దేశ ప్రగతికి ,ప్రజా సౌఖ్యానికి ,విస్వసంటికి సౌభ్రాతృత్వానికి వసుధైవ కుటుంబానికి గాను శ్రీ పాదులు 1994  లో 1008 కలసలతో స్నపన జరిపి మూడు లక్షల మందికి అన్నదానం నిర్వహించారు ఇదంతా గుంటూరు జిల్లా పిట్లవని పాలెం లో జరిగింది .వీరు ఆళ్వారుల పరంపరకు చెందిన వారు .these  saints are  truely citizens of  theworld  they belongtothe entire  mankind  మహాత్ములు విశ్వ పౌరులు వారు సకల మానవ కోటికి చెందుతారు అని అర్ధం .అందుకనే హాంకాంగ్ సింగపూర్ అమెరికా లలో విశ్వ శ్రేయస్సు కోసం వివిధ యజ్ఞాలు చేసారు .అనేక దేవాలయాలు నిర్మించారు .జీర్ణ దేవాలయాలను వుద్ధరించారు .భారతీయ సంప్రదాయాన్ని ,ఆర్ష ధర్మాన్ని ,వేద ,ఆగమ విజ్ఞానాన్ని  విశ్వ వ్యాప్తం చేసారు .

రామాయణం భాగవతం గోదాచారితం  ఉపనిషత్తులు సర్వ సామాన్య జనులకు సులభం గా అర్ధ మయ్యే రీతిలో వారు ప్రసంగించే తీరు నిరుపమానం .అదొక భక్తీ గంగా లహరి .అంతా అందులో మునిగి పునీతు లు అవవలసిందే .అదొక అలౌకికానందం .నిత్యం నరుకుల వేట లో హింస దౌర్జన్యాలతో terrarism ఉక్కి పిడికిలి లో asantito నలి గిపోతున్న పంజాబు ప్రజల మానసిక శాంతికి ,మనో నిబ్బరానికి గాను తమ శిష్యులచే ఆ ప్రాంతం లో అఖండ వేద pathanam చేయించి శాంతి స్థాపనకు మార్గ దర్సనం చేసారు .ఈ విషయం లో తమ పరంపరకు ఆ ఆద్యులయిన శ్రీ భగవద్రామానుజుల అపర అవతారమే శ్రీ చిన జీయర్ అని పించారు .సంసార లంపటం లో మునిగి తేలుతున్న జనులకు ఉప సమనం గా భక్తీ తోనే rఅన్నీ సాధించ a వచ్చ్చుననే భావంతో లక్షలాది భక్తుల చేత శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ చేయిస్తూ అదొక అద్భుత ప్రక్రియ గా మలుస్తున్నారు .పెడ దారి పడుతున్న నేటి యువతను సన్మార్గం లో నడిపించటానికి ,వారి బంగారు భవిష్యత్తుకు ”వికాస తరంగిణి ”కార్యక్రమం చే బట్టారు .సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అణగారిన అణచబడ్డ బడుగు వర్గాల శ్రేయస్సుకు అనాధ ,వికలాంగులకు యేన లేని సేవా లందిస్తున్నారు పీతాదిపాటు లు అందరు సమాజం లో భాగస్వంయులే నని నిరుపిస్తున్న సాధు వరెంయులు స్వామీజీ .
సమస్త మానవాళిని సన్మార్గం లో నడిపించటానికి ఉపయుక్తమయిన అనేక గ్రంధాలను స్వయంగా రాసి ముద్రించారు .అతి తక్కువ ధరకు వాటిని అందిస్తున్నారు అదొక విద్య యజ్ఞం .సస్త్రభాశ్యం లో వారు మరల అవతరించిన రామనుజులే అని పిస్తారు .పుమ్భావసరస్వటీ స్వరూపులు శ్రీ వారు .”education isthe   థ్ tranmission  of  civilization  ”అన్న భావాన్ని చక్కగా వ్యాప్తి చేస్తున్న పరివ్రాజక వరెంయులి వారు .వారొక వ్యక్తీ కాదు శక్తి సమస్తి రూపం .ఒక వ్యవస్థ .శ్రీపడులు ”శ్రీ గోడ దివ్య వచస్సుధ రాశా ధుని ”.గోపంగానా పంగ ,విద్యదర్పద్భుట నీలమోహనా దయ దాక్షిణ్య భావావధి .వేదాంతద్వాయ సంప్రవర్తన కల వేడి .ప్రేమ స్వరూపి .దయముర్తి దాక్షిణ్య స్వరూపి ముముక్షు వరెంయులు వేద విజ్ఞాన భండారం .వేద విజ్ఞాన సర్వస్వం .
”గృహేషు పంచేంద్రియ నిగ్రహస్తాపః ”నివ్రుత్త రాగస్య గృహం తపోవనం ”గృహస్త ధర్మాన్ని నిర్వహిస్తూ రాగద్వేషాలను అదుపు లో ఉంచుకుంటూ వున్న వారికి ఇల్లే తపోవనం అని ఆ శ్లోక తాత్పర్యం .మనసు చంచలమయింది కనుక వీలున్నప్పుడల్లా మహాత్ముల హితవచనాలు వింటుండాలి battery ని re  charge చేసుకోవాలి అయితె వీటిని బోధించే అర్హత ఎవరికి వుంది ?”వుద్యంతు సతమాదిత్యః వుద్యంతు సతమైన్దవ్హ నా విన విదుశం -వాక్యైర్నస్యత్యభ్యంతరం ”అంతే సూర్య చంద్రులు ఇవ్వలేని ప్రకాశం జ్ఞానుల హితవక్యం వల్ల కలుగుతుంది అజ్ననంధకరం నశిస్తుంది ఇంతటి మహనీయ వ్యక్తిత్వం గల పుర్నపురుషులు శ్రీ స్వామీజీ .వారి అభి భాషణం ఇప్పుడు విని అనుభూతి పొంది ఆచరించి ధన్యులం అవుదాం ”ది object of  spiritual  seeking   isto  find out what  is
eternally  ట్రూ ,not what   istrueintime . స్వామి వారి దివ్యసీస్సులు అందరికి లభించాలని కోరుతూ సెలవ్                 మీ దుర్గా ప్రసాద్
ఇది 21 07 — 96 తేదీన విజయవాడ మాంటిస్సొరి ti స్కూల్ లో కృష్ణా జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుల పునశ్చరణ తరగతుల ప్రా ప్రరంభోత్షవానికి విచ్చేసిన శ్రీ చినజీయర్  jeeyar స్వామికి నేను పలికిన స్వాగతం
Posted in సభలు సమావేశాలు | 1 Comment

ఆలోచనా లోచనం దేవుడి సొత్తు తింటే విపత్తే

—                                                         ఆలోచనా లోచనం
దేవుడి సొత్తు తింటే విపత్తే

దేవుని ఇల్లునే దేవాలయం అంటాం దేవాలయాలు సమాజం అనే ఆత్మకు స్థానం .జన జీవన విధానానికి కేంద్ర బిందువు .సంస్కృతీ వైభవానికి ప్రతీక .కళలకు పుట్టినిల్లు .దేవాలయం విశ్వ విద్యాలయ భావనతో పవిత్రం గా చూడాలి .న్యాయానికి ధర్మానికి ఆలయాలు ఆటపట్టు .అందుకే రాజులూ ,దాతలు తమ ధనాన్ని ఆలయ నిర్మాణానికి అధికం గా వెచ్చించారు .వాటి నిర్వహణకు భూములు దానం చేసారు వాటిని నిర్వహించే వారు కూడా అంతా పవిత్రం గా భావించి పని చేయాలి .దేవుడు చూడదు కదా అని ఆలయ ధనాన్నిస్వార్ధం  స్వ్ర్ధం కోసం వాడుకున్నవారు పాప ఫలం అనుభ విన్చాల్సిందే .దైవ ద్రోహం చాల పెద్ద నేరం .అలాంటి ఒక దేవాలయం లో కాపలా వుద్యోగం చేస్తూ ఆలయం సొమ్మునే అపహరించిన వాడు కుక్కగా పుట్టిన కధ ఉత్తర రామాయణం లో వుంది ఆ కుక్క పేరు భిక్షు తాడిత .ఇక కధలోకి వెళ్దాం
అవి శ్రీరాముడు రావణ వధ తర్వాత అయోధ్యలో పట్టాభి షిక్తుడై జనరంజకం గా పాలిస్తున్న రోజులు .ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారు .రామరాజ్యం అని ప్రజలంతా ఆనందాన్ని అనుభ విస్తున్న రోజులవి .రాముడు కొలువై వున్నప్పుడు ప్రజలేవరైనా ఏవైనా ఇబ్బందులు పడుతుంటే వచ్చి చెప్పు కోవటానికి వీలు కల్పించాడు .బయట ద్వారం వద్ద తమ్ముడు లక్ష్మణున్ని కాపలా గా ఉంచాడు .ఫిర్యాది వస్తే ముందుగ వివరం తెలుసు కొని రాముని వద్దకు పంపటం అతని కర్తవ్యమ్ .ఒక రోజున ఒక బిచ్చగాడు తనకు దారిలోఆ  డ్డం గా వచ్చిందని ఒక కుక్కను విపరీతం గా కొట్టాడు .దాని తల పగిలి రక్తం కారి పోతోంది తనకు న్యాయం చేయ గల వాడు రాజైన రామచంద్రుడోక్కడే నని భావించి కొలువు వాకిట చేరి నిలబడింది .దాని దీనావస్థ చూసినా లక్ష్మణుడు రాముని దగ్గరకు వెళ్లి ”గాయంతో రక్తం కారుతూ న్న శునకం మీ దర్సనానికి వచ్చింది దాని బాధ ఏమిటో తెలుసుకని న్యాయం చేయ మని దాని ఉద్దేశ్యం ల వుంది ”అని విన్న వించాడు .రాముడు క్షణం కూడా ఆలస్యం చేయ కుండా కుక్కను రాజాస్థానం లోకి ప్రవేశ పెట్టించ మన్నాడు .రక్తం కారుతూ వున్న కుక్కకు మర్యాద ,మన్నన తెలుసు అందు వల్ల ”నాయనా లక్ష్మణా రాజులూ ,మునులు ,సజ్జనులు వుండే సభా ప్రాంగణానికి నా బోటి క్షుద్ర జంతువులూ ప్రవేశించటం తగని పని .భూత దయ గల రాజా రాముడు నన్ను రమ్మన్నా నేనూ రావటం అభిలషణీయం కాదు ”అంది మర్యాదగా .లక్ష్మణుడు వెంటనే ఈ విషయం రాముడికి చెప్పాడు .ప్రజా రంజకుడు ,ధర్మ పక్ష పాతి అయిన రాముడు వెంటనే తనే బయటకు వచ్చాడు ”ఎవరు నువ్వు ?:ఎందుకు వచ్చావు ?వంటినిండా రక్తం ఏమిటి ఎవరైనా నిన్ను కొట్టార?కొట్టిన వాడెవడో చెప్పు ”అని అడిగాడు దానికి ఆ శునకం అక్కడే వున్న భిక్ష గాన్ని చూపి అతడే తనను అనవసరం గా కొట్టాడని విన్నవించింది భిక్ష గాన్ని పిలిపించి ”ఎందుకు కుక్కను కొట్టావు ?”అని అడిగాడు /దానికి వాడు ”మహా రాజ నేనూ భిక్షాటన చేసి పోట్టపోసుకున్తున్నాను నేనూ తెచ్చుకున్న దాన్ని ఈ పాడు కుక్క దారి కి అడ్డం
గా నిలబడి నన్ను భయ పెట్టి నా ద్రవ్యాన్ని అపహరిస్తోంది నాకు కోపం వచ్చి కొట్టాను నేనూ తప్పు చేస్తే నన్ను దండించండి ”అని మనవి చేసాడు
శ్రీరామునికి గొప్పచిక్కే  e వచ్చింది ఎవరిని ఎలా దండిఇంచాలోతేలి  యటం లేదు దీర్ఘం గా ఆలోచిస్తున్నాడున్యాయబద్ధం గా తీర్పు ఇవ్వటానికి .ఇంతలో ఆ sunakame కల్పించు కొని ”ధర్మ ప్రభువులు మీకు తెలియని న్యాయం లేదు .ఇలాంటి వాడికి తగిన శిక్ష ఒకటి వుంది చెప్తాను వినండి .కాలన్జనం అనే కొండ వుంది దానిమీద ఒక దేవాలయం వుంది దాన్ని పాలించటానికి నన్ను కొట్టిన ఈ భిక్షువును పంపండి .అంతకు మించిన శిక్ష లేదు ”అని అతి వినయం గా ధర్మసూక్ష్మం గా చెప్పింది .రాముడికి ఆశ్చర్యం కల్గింది .తప్పు చేసిన వాడికి దేవాలయాన్ని పాలించే అధికారిగా చేయటమా అని వితర్కిస్తున్నాడు .”ఇది తగిన శిక్షే అని నువ్వు నమ్ముతున్నావా ?”అని సందేహ నివృత్తి కోసం ఆ కుక్కనే అడిగాడు .అప్పుడా కుక్క ”రాజా నేను పూర్వ జన్మలో ఆ దేవాలయం కు కాపలా కాస్తూ దేవ బ్రాహ్మణులధనాన్నిన్ని అపహరించాను .అందుకే నాకు ఈ కుక్క జన్మ వచ్చింది ఇంతకంటే భిక్ష గాడికి గొప్ప శిక్ష ఏమి లేదు ప్రభూ ”అంది .రాజారాముడు నవ్వి అది చెప్పినట్లే భిక్ష గాడికి శిక్ష విధించాడు .కనుక దైవ ధనం అపహరిస్తే ,వాడుకుంటే ,మింగేస్తే ఎలాంటి జన్మ వస్తుందో భిక్షుతాడిత అనే కుక్క కధ వింటే తెలుస్తోంది కదా /కనుక ఆలయ పాలకులు ఈ ధర్మాన్ని గ్రహించి ఆలయ నిర్వహణలో జాగ్రత్తగా వుంటూ దైవధనాని పవిత్రం గా కాపాడాలి అప్పుడే ఆలయాలు నిజమయిన కోవెలలు అవుతాయి
ఆలోచనా లోచనం శీర్షికలో 29 -౩  -11 నా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయింది
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రేడియో లో | Tagged | 1 Comment

ఉగాది 2011 వేడుకలు “సరసభారతి ఉయ్యూరు ” వేడుకలు

 

https://picasaweb.google.com/sarasabharathi.vuyyuru/Sarasabharathi22110327?authkey=Gv1sRgCOjw4LOU4t7vag&feat=email#

Posted in సరసభారతి ఉయ్యూరు | 2 Comments

సరసభారతి జరిపిన ఉగాది 2011 ఉయ్యూరు విశేషాలు వార్త పత్రికలలో

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఆరుద్ర సినీ ముద్ర

ఆరుద్ర సినీ ముద్ర

ఆరుద్ర అని పిలవబడే భాగవతుల శంకర శాస్త్రి దాదాపు 500 సినిమా లకు 5000 పైగా పాటలు రాసాడు ఇంకెవరు అధిగమించ లేని  లక్ష్యం గా చేసాడు .డబ్బింగ్ సినిమా లకు శ్రీశ్రీ praanapratista చేస్తే ఆరుద్ర జవం ,జీవం  కల్పించ్చి పుస్టినిచ్చాడు ఆన్ అనే హిందీ చిత్రాన్ని ప్రేమలేఖలు గా డబ్ చేసి అందులో ”పందిట్లో పెల్లవుతున్నది కను విందౌ తున్నది”అనేపాట రాసి ఆ రోజుల్లో ప్రతి పెళ్లి పందిట్లో ఆ పాట ను పెట్టు కొనే టట్లు  popularise చేసాడు .ట్యూన్ బట్టి అద్భుతం గా పాట రాసే వాడు బావ మరదళ్ళు లో”నీలిమేఘాలలో గాలి కెరటాలలో”పాట mla  సినిమా లో ”నీ ఆస అది యాస లంబాడోళ్ళ రామ దాసా ”గుండెల్లో గునపాలు గుచ్చ్చారే నీ వాళ్ళు ”అని రాసి అందర్నీ ఏడ్పించాడు గుండెల్లో గునపం అప్పటికి కొత్త మాట .అత్తా ఒక ఇంటి కోడలే లో ”జోడు గుళ్ల పిస్తోలు ఠానేనూ ఆడి తప్పని వాణ్ణి జీహ ”బావామరదళ్ళు లోనే ”ఇండియాకు రాజధాని దిల్లి నా గుండెల్లో ప్రేమరాణి లిల్లి”ఆంధ్ర కేసరి లో ”వేదం ల ప్రవహించే గోదావరి అమర ధామం ల భాసించే రాజ మహేన్ద్రి ”అనగల సంస్కారం వున్న వాడు .చెంచులక్ష్మి ,బాలభారతం ,సంపూర్ణ రామాయణం లాంటి పౌరనికాలలోను అద్భుత మయిన పాటలు రాసి ఏ పాట అయిన హిట్ చేసాడు పెంకి పెళ్ళాం లో ”పడుచు దనం రైలు బండి పోతున్నది వయసు వారి కందులో చోటున్నది ”అని కుర్ర కారుకు హుషా రెక్కించాడు .అందాల రాముడు లో ”ఎదగ danikenduku ర తొందర ఎదర బతుకంతా చిందర వందర ”అన్న జీవిత సత్యాన్ని ఆవిష్కరించాడు ఈ పాటలన్నీ ”కొండ గాలి తిరిగింది”అనే పేరుతొ సంకలనం గా వచ్చ్చాయి .పూర్వం పౌరాణికాలలో సంస్కృతం లో పాటలు పాడించే వాళ్ళు చెంచు లక్ష్మి లో ”కరుణాల వాల ఇది నీదు లీల ”అని కొత్త తరహ పాట రాసి కధ విధానక్న్ని అందులో పోదిగాడు ఈ రక మయిన పాటలకు బోణీ చేసాడు .ఇంద్రుణ్ణి ”పర స్త్రీ లను లోబరచుకొనే పశువు ”అన గల చేవ గలవాడు ఆరుద్ర .విష్ణువుకు లక్ష్మి దేవికి అతి సుందర మయిన పాట ను యుగళ గీతం గా రాసి ఔచిత్యాన్ని సంస్కారాన్ని చాటాడు ఇల్లరికం సినిమా లో హాస్యపు జల్లు అంతా ఆరుద్ర చిలక రించిందే .వీరకంకణం సినిమా లో దేసాడ్రోహి అయిన జగ్గయ్యను అతని భార్య జమున చేత చంపించి దేశ భక్తిని పెంపొందించాడు ఇందులో ప్రతి మాట పాట అణిముత్యమే ”.ఖుషి ఖుషీ” నవ్వించే మంత్రగాడు ఈ గడ్డాల బాబాయి .”ధనమేర అనితికి మూలం”,జోరుగా హుషారుగా అ’ న్న ”టాటా వీడికోలు ””హైలెస హైలెస అన్న ””రాయి నయినా కాక పోతిని ఆ”అన్నా ఆరుద్రే అనగలాడు న్న
ప్రాసకు ,అంత్యప్రాసకు అన్న ప్రాసన చేయటమే కాదు శాద్రసోపేతమయిన సహితీ భోజనం అందించిన పాటల వంట మేస్త్రి ఆరుద్ర .అనుపమ త్రయం లో ఆరుద్ర ,పెండ్యాల కే .బి తిలక్ అందించినవి ఆణిముత్యాలు .నిజంగానే ఉపమానం లేని అనుపమానమయినవి  .ఆరుద్ర రమణ బాపు మామ మహదేవన్ లు సుప్రసిద్ధ సినీ ఇష్ట చతుష్టయం .చాల గొప్ప చిత్రాలు తీసి ప్రేక్షకులకు ఆరాధ్యు లాయరు .”ఆ ర బా మా ”అంతే బాగుంటుందని పించింది ఈ టి వి వారు తీసిన భాగవతం సీరియల్ లో సుందరకాండ పై చివరి పాట రాసారట
పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ,కళా ప్రపూర్ణ బిరుదు పొందారు ఆరుద్ర రాజ మండ్రి సంస్కృతీ సంప్రదాయాలకు పులకించి పోయేవాడు అందుకే ఆయన 70  వ జన్మ దినాన్ని రాజమండ్రి లోని సాహితీ సంఘాలన్నీ కలిసి 15  రోజుల పాటు ఘనం గా నిర్వహంచి ఆ సాహితీ విరాన్ముర్తికి ఋణం తీర్చుకుంది ఆంధ్ర దేశం అయిన ఆరుద్రకు ఇవ్వాల్సినంత గౌరవం ,స్థాయి ఇవ్వలేదన్నది కా danarani సత్యం
ఆరుద్ర భావాలు
”ఎప్పటికయినా మానవ పదికుడు చేరుకునే విశ్రాంత మందిరం కవిత ”.కల నిజ పరచటం కాదు kavitvam నిజాన్ని కలగనటమే దాని తత్త్వం ””మంచిరచన  చదివాకా బా ga భోంచేసి నట్లుండాలి కొంచెం బాధ పడాలి మనసుకు జ్వరం రావాలి ఒళ్ళు తిరగాలి ఈ బాధ లోంచి తేరుకొని బాగు a పడాలి ””నీవు యెక్క దలచుకున్న రైలు ఆ జీవిత కాలం latu ”కవి ta iకోసంపుట్టాను కాంతి కోసం కలం పట్టాను ””జీవితం radio  సెట్టుకు భర్త ఏరియల్  భార్య ఎర్తు.”మన స్వతంత్రం మేడి పండు మన చరిత్ర రాచ పుండు ”రాసిందేమో రాసాము తీసికొనుము తోచినంత తీపో చేదో ””తరానికో వంద కవులు తయారవుతరెప్పుడు వంద లోను మంద లోను మిగిలేది ఒక్కడే ”ఆఖరికి నరుడు వాక్యమై నిండును ఆమెన్ ”అని మనిషి చిరంజీవి అంటాడుమృత్యువు చిరంజీవి మానవుడు ఒక్కరే అదే త్వమేవాహం    ”
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in మహానుభావులు | 1 Comment

అనురాగ కవి సమ్మేళనంలో నా కవిత

మా పెద్దక్కయ్య

నిత్యం కష్టాల కడలి దాటుతూ  బాధల  మున్నీటిలో మునుగుతూ
వేదనల సుది గుండాలను మొక్కవోని ధైర్యం తో ఎదురీది
”అనాఘ్రాత పుష్పం వంటి కధలు ,కవితలు అల్లి
బాగుందని ‘బాల పత్రిక ‘మెచ్చ్చిన సాహితీ మూర్తి
హిందీని ఆపోసన బట్టిన వేద్యురాలు
నాన్నకు ఆప్యాయపు ”చెల్లాయ్”
మా అందరికి మామంచి అక్కాయ్
అస్తిమితత్వపు అంచు పై అను నిత్యం వుంటున్నా
మద్రాస్ లో కుటుంబానికి కొండంత అండగా నిలిచి
దేశం కానీ దేశం లో భాష కానీ భాషనూ జీర్ణించుకొని
అపసవ్యాలను తెలివి వివేకం సమర్ధత తో సవ్యం గా మార్చి
ఒంటరి పోరాటం తోఅలు  కుపెరుగని శ్రమ చేస్తూ నడి సంద్రపు కుటుంబ నావను
ధైర్యం తో ఒడ్డుకు చేర్చిన స్థిర చిత్తురాలు నిత్య చైతన్య శీలి స్వయం సిద్ధమా  అక్క
బావ గారి ఇంటికి దీపం ఆ మహా ఇల్లాలు
ఎవ్వరికీ ఏ లోపం రాకుండా మమతాను రాగల తో పాటు
ఆర్దికాన్నీ హార్దికాన్నీ పంచిన ఆర్ధిక వేత్త
మమతాను రాగాలకు సత్య ధర్మాలకు నిలయం
కించిత్  కోపం వున్నా భూదేవి అంతా సహనం వుండేది
అన్ని అందరికి అమర్చి తాను అనుభవించింది కొద్ది కాలమే
రెండేళ్ళ క్రితం మమ్మల్ని వీడి వెళ్లి పోయింది
ఆనాటి అగస్త్య సతి లోపాముద్రకు సాటి
మా కుటుంబం పై వేసిన అనురాగ ముద్ర
మా పెద్దక్కయ్య లోపాముద్ర
చిన్నక్కయ్య
వయసులో మాకు పెద్ద తేడా లేదు
హితురాలిగా స్నేహితు రాలుగా వుంటుంది
జీవితం కాచి వాడ పోసిన అనుభవం
నవ్వు ముఖం ఆమెకు సహజ ఆభరణం
బంధుత్వం లో అందర్నీ ఆదరించి పెంచి పెద్ద చేసిన పెద్దరికం ఆమెది
నాన్న అమ్మ ల పై అతి ప్రేమ తమ్ముడి పై అతి పరమ  వాత్చాల్యం
కొడుకుల్ని కూతుర్ని తీర్చి దిద్దిన దొడ్డ ఇల్లాలు
ఎన్నో సార్లు అమెరికా చుట్టి వచ్చ్చిన జంట మా బావ అక్క
బావ తో నిత్యం పజిల్ చిక్కు ముడులు విప్పే నేర్పు అక్కయ్యది
మా ఇంటిల్లి పాదికి బజ్జక్క మా బుజ్జక్క
మా చిన్నక్కయ్య దుర్గమ్మ
నిజం గా నిత్యం మా ముందుండే ఆ బెజవాడ కనక దుర్గమ్మ

https://sarasabharati.wordpress.com

Posted in సమయం - సందర్భం | 1 Comment

తెలివైన వోటరు

తెలివైన వోటరు

నేడు దేశం లో వోటరు మహా తెలివి గలాడు
ఎవరేమి చెప్పిన ఓపికగా వింటాడు
ఎవరి సభల కైనా లారీల్లో వెళ్తాడు
ఎవరేమిచ్చ్చిన గుట్టుగా పుచ్చుకుంటాడు
ఎవరికి వోతేసేది మాత్రం బ్రహ్మ రహస్యం గా వుంచుతాడు
బరిలో ఎన్ని వందల మందున్నా
కంగారు పడని ధీరోదాత్తుడు
నిశ్చయంగా మనసు లోనిది గుద్ది
మరీ బుద్ధి చెబుతాడు
హవాలకు దివాలకు సెజ్ లకు పలకదు వులకడు
కరెంటు లేకున్నా ఎరువు కరువైన మాట్లాడాడు
పవర్ కట్ చేయటం లో
మహా మాంత్రికుడు మాయగాడు వోటరు
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | 1 Comment

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం”

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో
అముల్యాభరణం
శంకరాభరణం
నేపధ్య సంగీతం  :

శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం.  నది  తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి  తులసీరాం  హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది.  బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ నేత్రానంద రస స్ఫోరక కలభిజ్నత ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .

శంకర శాస్త్రి   ని పరిచయం చేస్తూ ఆయన పడాల సవ్వడిలో మంద్రగానం ధ్వనిమ్పజేయటం అతని లోని కలభిజ్ఞాతకు నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు ”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే  కంటన్న నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో సంకరభారణ రాగాన్ని ,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం, అనితర సాధ్యం .ఆ వుహకు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో ”మానస సంచరరే ”పాత ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని ద్రుష్టి ”శ్రీ రమణీ కుఛ దుర్గా విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం సంకర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది ఇది మహ దేవన్ విస్వనాద్ ల అపూర్వ భావ సంయోగ ముక్త ఫలాం
సోమయాజుల నటన:
ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి తీ వి ,గంభీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం సంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయే టట్లు జీవిన్చేట్లు నటించాడు కలెక్టర్ సోమయాజులు అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం నేపధ్యం గా సాయ పడింది అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుండా డ తనం అనితర సాధ్య మనిపించాడు అదో తపస్సు గా యోగ సమాధి గా నిర్వహించాడు
అసలు ఆ పాత్ర ఏమి చెప్పాడు .అంత మనం వుహించు కోవలసిందే .వుహ సామ్రాజ్యమే అంత. వ్యంగ్య వైభవమే .”లోకేస్వరుడికి తప్ప లోకానికి భయపాద ను నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేస్వరుడికి తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ  charector  ను విశ్లేషిస్తుంది తులసి రైల్ ఎక్కేటప్పుడు మైసూర్ లోపర  ప్రభావం జరిగినప్పుడు ఎక్కడ తొణకదు బెనకడు ఎవర్ని ఏమి ఆనాడు ,తులసి తాను హత్య చేసి వచ్చ్చి ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు తోత్రుపడదు .
తనాకుతురి పెళ్లి కూడా ”అపస్వర’తో ఆగిపోయిన విచారించాడు .అంత పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితె ఆ గంభీయం వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర వహిని గా ప్రవహిస్తుంటుంది .అది సంస్కర చేతనా అది కట్టు బాట్లకు ఆచార వ్యవహారాలకు అన్దనిది అంటూ  న్తుబత్తనిది .హృదయ గత మైనది .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర అందించే సారంశం .సిష్టాచార  పరాయనుడైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత హాహిత్య మూర్తి .సంగీతానికి భాష భేదం లేదని ఆ ననాద దబ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు .మాట్లాడిన నాలుగు మాటలు majestic  గా ఒక కలెక్టర్ హుండా డ తనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ఒక నిర్లిప్తత ,జ్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి కుఉతురువెన్న రాస్తుంటే ట్రుసజల  నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయినా హృదయం ,తేలిక పాడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన సిఖరరోహణ చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేసం .అక్కడ ఆర్ద్రత వర్షించింది అనురాగం జల్లుగా కురిసింది మానవతా మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన అదే నటన అనిపించింది సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యుదయాడు
చివరి సీన్ లో ”దొరకున ఇటువంటి సేవా ”పాటకు ముందు ”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చ్చిన ఆ అజ్ఞాత దాత టకు ,నా నమోవాకాలు ఆ కలభిజ్ఞాతతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లా ప్లవితమై బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది మనసు .ఆనంద జ్యోతి వెలుగు తుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవద ధారించర,విని తరించార ”అని అనిపించినా పాత్ర అది .తెలూ చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు విస్వనాద్ కళా విస్వనాద్ అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా  విస్వనాద్ సృష్టికర్తగా కళా నీరజనలన్డుకున్నారు ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందింది
మంజు భార్గవి :
నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృసింప బడుతునో తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించి నా మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలసంచేసే కళా మూర్తి వుండనిఎవారు ఊహించలేదు .ప్రెసిడెంట్ పెపేరమ్మ రంమలో కాసేపే నాట్యం చేసిన బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి విస్వనాద్ చేతిలో మనోజ్ఞా మనోహర సిల్పముర్తి గా మలచ బడింది .అసలు ఆ పాత్రకు డైలోగులు లేవు .వున్న చాల పొడుపు .అంత సా సత్వికభినయమే .వుహలోక సంచారం .ఏదో తెలీని పిచ్చి ఆరాధన తత్త్వం .ఒక devotion  dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చ్చి రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చ్హత అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించింది
జమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకలకు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు సంకర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంట త గట్టి నపుడు ,తిట్టినపుడు ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ వ వార్నిన్చుకోవటం చాల కష్టం .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .సంకర శాస్త్రి రాగానికి తాను భావించిన ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ చిత్ర్లుగా దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చ్హత సాక్షాత్కరించింది .ఆ హావ భావలుపరమ మనోహరాలు సంకర శాస్త్రికి సన్మానం జరిగే తప్పుడు ఆమె కాళ్ళు కృతజ్ఞత భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మావుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది
”బ్రోచే వారెవరురా ”పాత పడేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పాదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు సంతృప్తి సాధించాలనుకున్న గమ్యం చేరననుకున్న తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆననం తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న సంత్రుస్తి వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే సంకర శాస్త్రిని చూపిస్తూ చిరిగినా పంచె లోంచి flashback  లగినపుడు అతని గత జీవిత వైభవం యెంత ఒప్పదో ఆమె చూపిన చ్పుతో అర్ధమవుతుంది అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చ్చు కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె అత్మనండానికి ప్రతీక .
జమీన్దరును హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆరధనాకృతి నక్రుతి గా నిలబడాలన్న తపన అది .తనములం గా సంకరశాస్త్రికి  సశ్రికి మరింకే కళంకం రాకూడదనే ఆరాటం ఒక ముఉగగా ముగా వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగా explore expose  చేసిన కళా తపస్వి విస్వనాద్ పరిశీలన దృష్టికిహట్స్ ఆఫ్
అల్లు రామ లింగయ్య :
సి వునిహృదయం మాధవునికి మాధవుని మనసు సంకరుడికి తెలుసు సృష్టి లో తీయనిది స్నేహం అది యెంత విషమ పరిస్థితులలో అయిన పరిక్షలకు తట్టు కొని nilabadu తుంది .ఆ స్నేహ బంధం పవ్త్ర మయినపుడు వీడడు.వాడాడు సంకర మాధవులు దేవత స్వ్రుపులుగా స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా సంకర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవం .ను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్ర దరికి కూడా గర్వ కారణం .అల్లు  రామలింగయ్య లోని కళా జీవి ధన్యుదయాడు ”వాడెంత ?నేనూ గట్టిగ కన్నీర్ర జేస్తే గడగడ లాడ్తాడు ”ఐ శాస్త్రి లేనప్పుడు డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు కాళ్ళు నెలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్క పోతాడు .
ఇలా యెంత చెప్పిన తరగనిగని  ఘని  శంకరాభరణం . చూసి  పులకిన్చాల్సిదే చెప్పి మెప్పించలేము.
మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24 -03 99  న స్వర్గీయ వేటూరి కృష్ణ జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకల్లె పల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజు నా చూపించాను చదివి బాగుంది అని నా పుస్తకం లో కళాతపస్వి సంతకం . చేయటం నా అదృష్టం
Posted in మహానుభావులు | 2 Comments

శ్రీ అరవిందులు

శ్రీ అరవిందులు
అరవిందం ఆంటే పద్మం .భారతీయ సాహిత్యం లో అర్విన్దానికి ఒక ప్రత్యేకత వుంది .అది వికసనానికి చిహ్నం .మనసు పరిపక్వ మైతే హృదయపద్మం వికసించింది అంటాం .వికసించటం వల్ల దానిలోని  తేజస్సు ప్రపంచానికి తెలుస్తుంది .వికసిత పద్మం చూడటానికి ఎంతో ఆకర్షనీయం గా వుంటుంది .అందులోనుండి కమ్మని వాసనలు వెలువడతాయి అవి ఘ్రాణ ఇంద్రియాలక్ను మత్తెక్కిస్తాయి .మకరందం వుంటుంది పద్మం లో దానికోసం తుమ్మెదలు చేరతాయి ఆంటే ఒకరకమయిన ఆకర్షణ  శక్తి అందులో ఉందన్న మాట.ఆ ఆకర్షణకు సంమొహితులమవుతం   మకరంద సదృశ ఆనందమే సచ్చ్చిదానందం .దాని ప్రభావం మానవ మానసాన్ని తన వైపు కు లాగేస్తుంది .అంతటి ప్రభావం పద్మానికి వుంది .మనసనే పద్మం మొగ్గగా వుంటే క్రిందికి తిరిగి వుంటుంది ఆ.అది వికసించితే వూర్ధ్వ ముఖం అవుతుంది .మనసు చీకటి నుంచి వెలుగు లోకి ప్రస్థానం చేస్తోంది ఇదే ఏ జీవి అయినా కోరుకునేది
కళ్ళను పద్మానికున్న. రేకులతో పోలుస్తారు .అందులోని రేకులు అనేకం విజ్ఞానం కూడా సహస్రదల పద్మం ల వికసించాలి .అప్పుడే దాని ఉనికి ,వ్యాప్తి తెలుస్తుంది .శ్రీ లక్ష్మి ,సరస్వతులు పద్మాసనం లో వుంటారు .జేవితం లో ప్రేయసులు పద్మపరాగం లాగా వ్యాపిస్తాయి ప్రేయస్సు నుంచి శ్రేయస్సుకు మానవ ప్రయాణం .సృష్టి చేసే బ్రహ్మ కూడా పద్మ సంభావుడే .నారాయణ స్వరూపుడైన పరమాత్మా నభిలో పద్మం వుంది అందుకే పద్మానికి అంత పవ్త్రత ,ప్రాధాన్యం .ఆంటే కాదు పద్మాన్ని ఆవరించి వుండే ఆకులు ఇవేవి తనకు పట్టనట్లు ,ఈ విషయ వాంఛ లేవి తనకు సోకనట్లు దేనినీ అంటూ కోడు .తామరాకుపై నీటిబొట్టు అందుకే అంత స్వచ్చ్చం గా ముత్యం ల ప్రకాశిస్తుంది .తామరతూడు లోని రంధ్రాలు నవనడుల్ల అనిపిస్తాయి .అందుకే ఈ జీవితం మనం జీవిస్తున్న ,మనకు ఏ వాసన లేకుండా లేకుండా జీవించాలని పద్మం మనకిస్తున్న సందేఅసం .తాను బురదలో వున్న పైకి పెరిగి దానితో సంబంధం లేకుండా వూర్ధ్వ ముఖం గా ప్రయాణిస్తుంది పద్మం మనం కూడా అలా వుండాలని అలా స్పందించాలని పద్మ సందేశం అదే అరవింద సందేశం .
—                 తెలిసి పెట్టారో ,తెలియక పెట్టారో కానీ శ్రీ అరవిన్డులకు తలిదండ్రులు అరవింద నామం చక్కగా కుదిరింది .అంతకు పూర్వం చరిత్రలో ఎవరికి అరవింద నామం వున్నట్లు కనిపించదు .అరవిన్డానికి ఇప్పటి దాక మనం చెప్పు కున్న లక్షణాలు వున్న మనీషి అరవిందులు మాటలో విందులు భావనలో విందులు నడకలో నడతలో అన్నీ విన్దులే ఆనందపు చిందులే .అందుకే మహర్షి ,యోగి అయారు .తాను వికసించి తన వికసనాన్ని ప్రకృతికి పులకింత గా చేసారు .ప్రకృతి లోని జీవ చైతన్యాన్ని తన వైపుకు ఆకర్షించారు .తన భావ వ్యాప్తికి చిహ్నం గా నీటి పై తేలే పద్మాన్నే ఎంచుకున్నారు .అంతటి అవినాభావ సంబంధం ఏర్పడింది అరవిన్దునికి ,అరవిన్దానికి .తత్వ బోధ చేసారు తాను తరించి లోకాన్ని తరింప జేస్తున్నారు
ఇప్పుడు శ్రీ అరవిందుల భావనా మకరందాన్నిగ్రోలుదం సచ్చ్చిదానంద మైన ఒక తత్త్వం విజ్ఞానం గా మనస్సు గా ప్రాణం గా జడం గా అవతరించింది మళ్లి ఆ జడం నుంచి ప్రాణానికి ప్రాణం నంచి మనస్సుకు ఆరోహించి అక్కడే ఆగిపోయింది .అదే ఇప్పుడు మనకు కనిపించే ప్రపంచం ఆ  మనోమయ లోకం నుంచి విజ్ఞానం గా వికసించ టానికి ఆ తత్త్వం నిరంతరం గా పని చేస్తోంది .ఈ విజ్ఞానన్నే అరవిందులు supermind  అన్నారు అరవిందుల ఈ దర్సనం వల్ల బ్రహ్మకు ,బ్రహ్మాండానికి ప్రయోజనం కలుగుతుంది .
అరవిన్డ్ని భావనలో జడం కూడా సత్యమే.అది ఏక కాలం లో నానాత్వాన్ని ,నానాత్వం లో ఏకత్వాన్ని ఏక కాలం లో చూస్తుంది .ఆంటే ఈ ప్రపంచం లో ఈసవరున్ని ఏకకాల అవిచ్చ్చేదం గా చూస్తుందని అర్ధం .దీనికి యోగ ఉత్పత్తి క్రమం లో వివరణ వుంది చిత్ ,జీవులు వేరు కానట్లే జీవ ,చిత్ లు వేరు కావు .జీవుడు ,చిత్తం వేరు కానట్లే దేహ కర్మలకు వేరు అవటం వుండదు .జీవుడే ఈశ్వరుడు .చిట్ అనేది ఆత్మయే .ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే శివుడే .
భగవద్గీత జ్ఞానాన్ని అలవారుచుకోమని చెప్తుంది .జ్ఞానం ద్వారా బ్రహ్మత్వం పొందచ్చ్చు .అయితె అది అందరికి సాధ్యమా ?ఆ స్థితి వచ్చ్చే దాక కర్మలు చేస్తుండు అనిచేప్పేవారు ,భక్తీ యోగమే గొప్పదని చెప్పే వారు వున్నారు .ఈ విషయం లో శ్రీ అరవిందుల భావన ఇలా వుంది .జగత్తు అపర ప్రకృతి చేసింది కాదు అది ఒక జడ యంత్రం.దేనికి పునాది పర ప్రకృతి అదే సచ్చ్చిదనందమయిన చిచ్చ్చక్తి ..కానుక జగత్తు జడం కాదు ఆనంద మయమే .ఆనందం చేతనే సృష్టి జరుగు తుంది ఆనందం నుంచి ఆనందం లోకి దీని నడక .అపర ప్రకృతి మనలోని భగవంతున్ని ఆవరించి వుంటుంది .ఈ అపర ప్రకృతి పొరను తొలగించు కొని పర ప్రకృతిలో ఆనంద మయ జీవితాన్ని పొందటమే మానవుని లక్ష్యం .ఆంటే జీవ ,పరప్రక్రుతులు ఒక్కటే .గీత ప్రకారం పర ప్రకృతి జీవాభుతమే జీవాత్మ కాదు .అరవిందుని ఆలోచనా ప్రకారం పర ప్రకృతియే జీవులందరి స్వభావం .ఇది అనంత మైంది ,అదే ఈ జగతికి మూలం .అదే జగన్మాత .లేక ఆద్యాసక్తి .అంతే కాదు పర ప్రకృతి పురుషుడు ఒక్కటే .అతని అంశ కూడా .””మమైవంసః”  .జగత్తంత అతని లోని అంశమే జీవులంతా భగవంతుని బహు రూపాలే .జీవుడు తన లోని మూల సత్ చత దేవుడు ప్రకృతి చేత భగవంతుని పర ప్రకృతిలో అంశం .
ఇలా ఉన్నప్పటికీ మానవుడు ఇంక తనకంటే తక్కువ అయినా ప్రకృతి స్థితి లోనే వున్నాడు .కనుక ప్రతి మానవుడు తనస్వరుపాన్ని వికసింప జేసుకుని తన భగవత్ ధర్మాన్ని divinelife
ను ఆంటే భాగవత ప్రకృతిని పొందాలి ఈ ప్రపంచం లోనే దివ్య జన్మను పొంది దివ్యమైన పనులు చేసి అపరిపుర్ణతను దాటి ఈ విస్వలీలలో అనంతమైన ఆనందాన్ని పొందాలని అరవింద హర్దయం .సుఖ దుఖలనే ద్వంద్వాలను దాటి అన్న ,ప్రాణ ,మన,కొసలకు వికాసం కలిగించుకొని పరప్రక్రుతి నుంచి జీవ లాభం పొందాలి .ఈసా వాస్య వుపనిసట్ లో ”అవిద్యాయ మృత్యుం తీర్త్వా విద్యాయ అమృత మస్నుటే ”అని చెప్పా బడింది .
చివరగా ఈ ప్రపంచం ఏర్పడటానికి theory   అఫ్ ఛాన్స్ రెండు theory అఫ్  mechanical  necessity  కారణాలు అని చెప్తారు .కానీ వీటికి మించి ఈ విశ్వం వెనుక అనంతమయిన అచేతనం nescience  వుంది .శాస్తవేత్తలు కూడా జడం ఇక జడం కాదు అదీ చేతనా స్వరూపమే అంటున్నారు ”all phenomina  behaves  under  similarly under similar circumstances అనేది జడత్వానికి పునాది ఇవాళ అది మారి పోయింది జడం సుప్తమయిన చైతన్యమే ”అని ఒప్పుకున్నారు దీనినే ”conceiled  ”consciousness ” అన్నారు .ఆంటే పదార్ధం జడం గా కనిపించినా అందులో చైతన్యం సుప్తం గా వుంటుంది .ఆంటే ఇప్పుడు జడం చేతనా ఒక్కటే అన్నది నిర్ధారిత మయింది .ఈ విషయాన్నీ మన మహర్షులు ఏ నాదో మనసుతో కను గోన్నారు కానుక శాస్త్రీయ దృక్పధాన్ని ఆలోచనా పరిధి దాటి వేరొక మార్గం లో ఆంటే ఆత్మ శక్తి తో ఈ విషయాలు నిరూపించా టానికి ఎక్కువగా వీలుందని తెలుస్తోంది .సాస్తాజ్ఞుల హద్దులు ,గీతలు ఇంక పనికి రావు

మీ దుర్గాప్రసాద్

 

 

Posted in మహానుభావులు | Leave a comment

అద్భుత శాంతి ( amazing peace)

కవి పరిచయం

 

మాయ ఏంజెలో అమెరికా లోని అర్కంసన్ లోని స్టంప్స్ లో జన్మించింది ఆమె కవయిత్రి ,రచయిత్రి , టీచర్, డైరెక్టర్, performer.  ఇప్పుడు సాన ఫ్రాన్సిస్కో లో వుంది.  తన జీవిత చరిత్ర రాసుకుంది.  “I .know why the caged bird sings” వంటి అయిదు కవితా సంపుటాలు వెలువరించింది. .బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా పదవి ప్రమాణం చేసినపుడు ఆమెను ఆహ్వానించి కవితా సందేసం నిప్పించాడు.  అప్పుడామె  on the pulse of the morning కవిత రాసి జాతికి సందేసమిచ్చ్చింది ఆమె ప్రపంచ శాంతి కోసం రాస్తుంది అన్ని మతాల వాళ్ళు ఆమె కవిత్వాన్ని చదివి ఆనందిస్తారు సకల మానవాళికి ఆమె కవిత్వం ఆదర్శం.  అద్భుత శాంతి అనే ఆమె కవిత మీ కోసం  :

 

 

మనం ఆనందంగా  వున్నా వేళ  –ఒక చిన్న గుస గుస విని పిస్తుంది

మొదట్లో అది చాల మెల్లగా నేమ్మదిగావుంది –తర్వాత సగం వినిపిస్తుంది.

దాని బలం పెరిగిన కొలడి ఇంకా జాగ్రత్తగా వినాలని పిస్తుంది

అందులో  అద్భుతం మాధుర్యం విన్పిస్తుంది –శాంతి అనే మాట చేరితే

ఇప్పుడది బిగ్గరగా విన్పిస్తుంది –బాంబుల విస్ఫోటనం కంటే పెద్దది గ అనిపిస్తుంది

 

 

ఆ శబ్దానికి కంపించి పోతం –దాని సాక్షాత్కారానికి నిస్చేస్తుల మవుతం

అదే మనం ఇన్నాళ్ళుగా ఆశగా ఎదురు చూసేది –దానికే అర్రులు చాస్తున్నాం

యుద్ధం కనుమరుగావటం మాత్రమె  చాలదు –సంపూర్ణ శాంతి కావాలి

ఆధ్యాత్మిక సమభావం రావాలి –మన్నన మర్యాద కలిసిన సౌఖ్యం కావాలి

మన భవిష్యత్తరాలకు –వారి ఆత్మీయులకు సంపూర్ణ రక్షణ కావాలి

 

ఇది క్రిస్మస్ వేళ –పగ ప్రతీకారం స్వస్తి పలికే సమయం

ఈ శాంతి వేదిక పైన –మనం కొట్టగా ఒక భాషనే సృష్టించాలి

మనం మనకోసమే కాకా –ఒకరికొకరి కోసం మార్పు చెందాలి

ఈ పవిత్ర సమయం లో –పావన  జీసెస్ జన్మ దిన వేడుకల్లో

శాంతి వాగ్దానోత్శావవేడుకలను –అప్యాయం గ ఆనందం గ జరుపు కొనే వేళ

భూమి పైన వున్నా సకల జాతులు –వాటి సహజ భాషలను గొంతులను వదులు కోవాలి.

 

ఆంగ్లమూలము :  Maya angelo

తెలుగు అనువాదం : గబ్బిట దుర్గా ప్రసాద్

అనువదించిన తేది : 11-04-2008

Posted in అనువాదాలు | Leave a comment

‘ఆలోచనా లోచనం ‘

ఈ రోజు విజయవాడ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసార మయిన ”ఆలోచనా లోచనం ”’మీకు అంద. జేస్తున్నాను  మీ దుర్గా ప్రసాద్

Posted in రేడియో లో | Tagged | Leave a comment

విపరీత వింత ప్రతిజ్న అనే పారడి

— ఆంధ్ర దేశం నా మాతృ భూమి కాదు .ఆంధ్రులంతా నా సోదరులు అసలే కాదు గాక కాదు
నేను నన్నే ప్రేమిస్తాను .సుసంపన్న మయిన ,బహు విధ మయిన నా వార సత్వ సంపద నాకు చిరాకు ,కంపరం అగౌరవం
దీని నుంచి దూరం కావటానికే నేను సర్వదాసర్వదా  నా సర్వ శక్తులు ధార పోస్తాను ప్రతి దానికి అనర్హత పొందటానికి నేను సర్వదా కృషి చేస్తాను
నా తాత ముత్తాతల్ని, తలి దండ్రుల్ని పెద్దల్ని వారి వారసత్వ సంపదాన్ని సర్వనాసనం చేస్తాను ,వారి ఆనవాళ్ళు మిగలకుండా జాగ్రత్తపడతాను

నా దేశం పట్ల నా ప్రజలపట్ల అనుక్షణం అవమానం కనపరుస్తూ ,అసహ్యించుకుంటూ కాకి బతుకు బతుకు తాను
వారి నాశనం ,సర్వ సంహారమే నా ఆనందానికి మూలము, మూల శంక కూడా
దెయ్యమా, రక్షించు నన్ను నా వింత ఆలోచలని ,నావిపరీత వైఖరిని
Posted in సమయం - సందర్భం | Leave a comment

””-పేరడీ కాదు గారడి కాదు అసలయిన నా మనో భావం’

””-పేరడీ కాదు గారడి కాదు అసలయిన నా మనో భావం’

నేను నా దేశాన్ని మాత్ర మే ప్రేమించటం లేదు ప్రపంచం అంత నా కు కావాలి నా ప్రేమ పంచాలి
నా దేశ వార సత్వ సంపద నాకు గర్వ కారణం అలాగే ప్రపంచ దేశీయుల వారసత్వాన్ని నేను గౌరవిస్తాను ఎవరి వారసత్వం వారికి గొప్ప అని భావిస్తాను
వారసత్వ సంపదకు అర్హులవటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ నా దృఢ విశ్వాసం
నా తలిదండ్రుల్ని ,ఉపాధ్యాయుల్ని పెద్దలందర్ని,మంచి చెప్పే వారెవరయిన వారినందర్నీ గౌరవించి పూజిస్తాను
ప్రతి వారితోనూ మర్యాదగా ప్రవర్తించి నా సంస్కారాన్ని చాటు కుంటాను
నా దేశం పట్ల విశ్వ ప్రజల పట్ల సేవా నిరతికలిగి  l కివారికి సేవ చేయటం నా అదృష్టం గా భావించి మర్యాద పద్ధతిని పాటించి అందరికి దగ్గర అవుతాను
నేను ప్రపంచ పౌరుడనని గర్విస్తాను సంకుచితత్వాన్ని వదలి విశాల దృక్పధంతో సంచరిస్తాను
విశ్వ జనుల శ్రేయోభి వృద్ధులే నా ఆనందానికి మూలం నా సర్వస్వం .ఇంత కంటే నేనేమి కోరు కొను ””
తాతయ్య నన్ను క్షమించు    నీ మనవడు బుడ్డి
నేనూ ఇంటికి వచ్చ్చేసరికి నా మనవడు పదేళ్ళ బుడ్డి గాడు రాసిన కవిత్వం అది చదివి నేనే నోరు వెల్ల బెట్టాను నా పేరడీ కవిత్వాన్ని చదివి మంచి కవిత్వం రాస్తానని శపధం చేసి రాసినకవిత ట    అది సందేశం వుండాలి తిట్టుతూ రాస్తే మనుష్యులు మారారు అని నాకే నీతులు చెప్పి ఈ తాతకు దగ్గులు నేర్పిన మనవడు మా బుడ్డి గాడు కవిత్వం చదివి చెడి పోకూడదు బాగు పదాలని నాకే నీతులు నేర్పాడు అందుకే వాడు రాసినట్లుగా నే చెప్పిన ఈ కవితా మీ కోసం
మీ .దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

భారతీయ విజ్ఞాన సర్వస్వమే మహా భారతం

–ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని ,నాగరాకతను తెలియ జేసే గొప్ప గ్రంధమే వ్యాస మహా భారతం .మానవుని భౌతిక ,మానసిక ,ఆధ్యాత్మిక జీవిత మంతా అందులో ప్రతిబింబించింది .నాగరకత ,సాంఘిక వ్యవస్థ ,సంస్కృతిలను వ్యక్తం చేసేది సాహిత్యం కధ లో ఉదాత్తత ,అద్ఫ్హ్యత్మిక విషయ ప్రాధాన్యం వల్ల భారతం విశిష్ట మయింది .అంతరార్ధం గా ఆలోచిస్తే ,సత్య సత్యాలకు ,ధర్మ ధర్మాలకు దైవ రాక్షస భావాలకు జరిగే సంఘర్షానే దీని లోని ఇతివృత్తం. అన్ని వేద శాఖలకు చెందిన వైదిక వాజ్మయ సర్వస్వం భారతం లో ప్రతి పాదించ బడింది .అందుకే ,వేదతుల్య మయింది .పంచమ వేద మయింది .వేదం లో శబ్దానికి ప్రాధాన్యం .భారతం అర్ధ  ప్రాధాన్యం కలది .అసలు భారత కధను ఆధారం  గా చేసుకొని పరబ్రహ్మ స్వరూపాన్ని విధి ప్రభావాన్ని లోకులకు తెలియ జేయటమే సత్యాన్ని ధర్మాన్ని లోకం లో ప్రతిస్తిన్చా తమే భారతం ఆశయం .
వేదసారం వుండటం, ధర్మం ,నీతి సులభం గా వివరించటంవల్ల bhqaratam స్మ్రుతి గ్రంధం అయింది .పురాణ లక్షణాలన్ని పూర్తిగా వుండటం చేత పురాణం అయింది .ఉపనిషత్తుల సారం వుండటం తో వేదాంత గ్రంధం అని పించుకుంది .రాసిం వాడు ”వ్యాసో నారాయణో హరిహి ”అని పిలువబడే విష్ణు అంశానికి చెందినా భగవాన్ వ్యాసుడు .ఆయన మహర్షి విజ్ఞాన వేత్త్స అవటం తో ఉదాత్తత కల్గింది .మహాభారత కాలం నాటికీ ఆర్య అనార్య సమ్మేళనం జరిగింది .అనేక వ్యవహారాలు కట్టుబాట్లు ఏర్పడ్డాయి .ప్రాపంచిక విషయలపాయి అక్సక్తి పెరిగి ఆముష్మిక భావం తగ్గింది .దానితో సంఘం లో న్యాయం ,ధర్మం తగ్గాయి అధర్మ పరిణామమే భారత యుద్ధం .సంఘాన్ని వేదమాత సూత్రాలకు అనుసంధించి ,ఆర్య విజ్ఞాన సర్వస్వాన్ని ప్రజలముందు న్చాలని వ్యాసుని సంకల్పం .భారత కధ 24000 శ్లోకాలే తన ఆశయం నెరవేర్చా టానికి లక్ష శ్లోకాలతో విస్తుతం చేయాల్సి వచ్చ్చింది .ఇందులో కొందరు మధ్యలో కొంత చేర్చి వుండ వచ్చ్చు కూడా .అందుకే సంహిత అయింది .

భారత ఆంధ్రీకరణం కూడా లోక హితం కోసమే.రాజరాజు కాలం నాటికీ మతకల్లోలం ఎక్కువ గా వుండేది .చార్వాక మతం పెరిగింది .నిరీస్వారవడం పెరిగి .ఐకమత్యం దెబ్బ తిన్నది .అప్పుడు కుమరిల భట్టు పూర్వ మీమాంస రాసి ప్రచారం తెచ్చ్చాడు .మళ్లి యజ్న యాగాలకు మళ్లి ప్రభావం కలిగింది .అర్యమతనికి ఆదరణ కల్గింది అప్పుడే రాజ రాజు నన్నయను భర తన్ద్రీకరణకు ప్రేరే పించాడు కనుక ఇక్కడ కూడా లోక సంగ్ర్హనేచచ్చ కారణ మయింది
తిక్కన కాలం లో జైనం పెర్గివుంది .సోమనాధుని వల్ల వీర శైవం విజ్రుమ్భించింది మతకలహాలు పెరిగాయి .శైవ వైష్ణవాల వల్ల కొత్త సమస్యలు ఏర్పడ్డాయి కవుల మధ్య పోట్లాటలు పెరిగాయి ఈ క్లిష్ట పరిస్థితిలో తిక్కన మహా కవి రంగ ప్రవేశం చేసాడు .మార్గదర్శి అయాడు .సంఘ సంస్కరణకు పూనుకున్నాడు .బ్రహ్మ ,విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ అంశాలుగా వారు చేసే సృష్టి స్థితి ,లయలు పరబ్రహ్మ లీలలు గా తెలియ జెప్పాడు .హరిహర మూర్తిని ఇష్ట దైవం గా భావించి శివ కేశవులు అభిన్నులు అని వివరించాడు .తిక్కన తర్వాత నాచన సోముడు ,కేతన ఇదే మార్గం అనుసరించారు .తరువాత వచ్చ్చిన్ asaiva వైష్ణవ కవులు పరదుషణ తగ్గించి సహనం చూపారు .అద్వైతాన్ని బోధించి జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని చాటారు .ఏకమాత సూత్రాన్ని అల్లారు అద్వైతానికి పట్టాభిషేకం చేసారు /.ప్రజల తెలుగు అయిన జానూ తెనుగుకు పట్టాభిషేకం చేసారు .ఎర్రన కూడా ఇదే మార్గం లో నడిచాడు పంచమవేదం అక్నబడే ధర్మ శాస్త్రం అని పిలువబడే భారతాన్ని రుషివంటి నన్నయ .తిక్కన ఎర్రన అనే కవిత్రయం లభించటం ఆంధ్రుల అదృష్టం .
”ఘోర సంసార విజ్రుమ్భాణము బాపి ”అని నన్నయ అంటె ”జన్మాంతర ద్కాముల్ తొలగు నట్లు జేసి సుఖాత్ము జేయవే అని ”తిక్కన వ్యాసున్ని ప్రార్ధించారు .”భారతామృతాన్ని కర్ణపుటంబుల నారా గ్రోలి ఆంధ్రావళి మొదమున్బోరయునట్లుగా జేటు ”అని తిక్కన వ్రాసాడు ఇక్కడ అమృత సదం పర బ్రహ్మాన్ని సూచించేదే .భారతమ్రుతం అంతే పరబ్రహ్మకు భారతానికి భేదం లేదని చెప్పటమే .భారతం వింటే ఆనందం లభిస్తుంది ఆనందం ఇచ్చ్చే వాడు కూడా పరబ్రహ్మమే కదా .విద్య వల్లనే నీతి శ్రేయస్సు ,పరబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుందని కవి బ్రహ్మ తెలియ జేశాడు .యజ్ఞం చేసి సోమయాజి అయాడు భారతం చదివి యోగి అయాడు అందుకే గొప్ప సంయమనం కల్గింది ఆయనకు మనకు కల్గించాడు .ఇంతగా లోక హితం కోరిన కవి తర్వాతి కాలం లో లేడు అందుకే తిక్కన భారతంవ్యాస భారతం కంటే గొప్పది అని పేరు వచ్చ్చింది సంస్కృతం లో వాల్మీకి రామాయణాన్ని మించింది లెదూ తెలుగు భారతాన్ని మించింది కనిపించదు .లోక కళ్యాణం కోసం చేసిన రచన కానుక అది ఆంధ్రుల విజ్ఞాన సర్వస్వం అయింది .ఆంధ్రుల జాతీయ సర్వస్వం తెలుగు భారతం .డాంటే రాసిన divine కామెడీ italiyanlaku హోమేర్ రాసిన iliad grrkulaku మిల్టన్ రాసిన paradise లాస్ట్ ఆంగ్లేయులకు వారి వారి జాతీయ జీవిత సర్వస్వాలు అందరు భావిస్తారు .వుత్క్రుస్తమయిన సారస్వతాన్ని నిర్మించి స్వార్ధ రహితులయి విజ్ఞాన వ్యాప్తి చేసి లోక హితం చేసిన మహా మహులే నిజమయిన జాతీయ నాయకులని అందరి విశ్వాసం
అలాంటి సారస్వత మూర్తులకు వందనం అభివందనం                                                                          బుధజన విధేయుడు     మీ   దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

కీచకవధ ;తిక్కన నేర్పు

— విరాట పర్వం లోని కీచక వధ వ్రుత్తంతంలో తిక్కన అద్భుత కవితా శిల్పాన్ని చూపాడు అతని కామా వృత్తికి అనుగుణంగా వనం లోని పక్షుల విహారాన్ని అతి సుకుమారం గా పోషించాడు .అతను కాముకుడు కానుక ప్రకృతి అంత కాముక వ్రుత్తి లో వున్నట్లు కన్పించింది .అతని లోని భావాలూ ఉద్రేక పరచటానికి ప్రకృతి బాగా తోడ్పడింది. అందుకే ”తనువు లింద్రియములు .మనము ద్రుతియు దన వశంబు గాక తల్లడ పడి సింహ బలుడు విషమ బణు బారి బారే ”అన్నాడు తిక్కన .ఇట్లా రోజంతా కామా ఉద్రేకం తో దహింప బడ్డాడు .సైరంధ్రి చేసిన సంకేతం కూడా గ్రహించ లేక పోయాడు .ముధత్వం ఆవహించి బుర్ర పనిచెయ్య లేదు .అనుమానం అనేది మనసులో రాలేదు అహంకారం ఒళ్ళంతా ఆవహించింది వివేకం కోల్పోయాడు .కాముకునికి లజ్జ ,భయలుండవు కదా .ఇలా ఒక కామంధుని మనో ప్రవృత్తిని మనముందు నిలబెట్టాడు తిక్కన మహా కవి .వివసుడాయి నృత్య మందిరం చేరాడు

దీనికి పూర్తిగా విరుద్ధం గా భీముడు రంగ ప్రవేశం చేసాడు .”గమకము వీక వేరొక వికారము పుట్టక సంగారోత్శావో —ద్యమ రాభసతి రేకముల్ బయల్పడుటిన్చుక లేక రోష సం –భ్రమ మొక యింత యైన బర భావ నిరుప్యమూ గాక ద్రౌపదీ —రమణుడు వోయి విక్రమ దురంధరతం దగ నాట్య శాలకున్ ”దీని భావం  తెలుసుకుందాం .జాగ్రత్తగా అన్ని వైపులు పరికిస్తూ తన తన బహు బల దర్పాన్ని ప్రదర్శిస్తూ ,మదించిన భద్ర గజం ఆంటే ఏనుగు లాగా ప్రవేశించాడు భీముడు .ఇక్కడ కీచక ,భీముల ప్రవర్తన లో వైరుధ్యం స్పష్టం గా చూపిస్తాడు మహా కవి మదందుడై అనుమానం  లేకుండా

అహంకారమే ఆయుధం గా కీచకుడు ప్రవేశించాడు నిర్వికారం గా గంభీర్యం తో ఆత్మ నిగ్రహం కోల్పోకుండా తన బహ బాల దర్పమే ఆయుధం గా భీముడు ప్రవేశించాడు అనుమానం లేకుండా కీచకుడు ప్రవేశిస్తే ,పరిసరాల్ని పరికిస్తూ భీముడు ప్రవేశించాడు ఇదే కవి ప్రతిభ .పాండవ రహస్యం బట్ట బయ లావు తుందేమో నని భీముడి భయం ,అనుమానం .ఇలా పాత్ర పోషణలో తిక్కన అసామాన్య శిల్పం ప్రదర్శించాడు .
రతి అనేది ఒక శృంగార భావం రెండు వైపులా ఉంటేనే శృంగారం గా మార్పు చెందుతుంది ఇప్పుడిక్కడ ఇది one వే traffic అందుకే భీభాచ్చ్చమయింది .వీరరసనికి ఉత్షాహం కావాలి అందుకే కీచక వధ తర్వాత్ భీముడిని ”మన వారిలోన నొక్కని నైన బిల్వక వుత్శాహంబు తో చేసిన సాహసాన్ని ”ప్రసంసించింది వుత్శాహాన్ని వీరం గా మార్చింది ఆమె .కీచకుణ్ణి అతిభీకరం గా చంపాడు భీముడు పేరు సార్ధకం చేసుకున్నాడు ద్రౌపది పరాభవాన్ని స్వయం గా చూసాడు కానుక రౌద్రం విజ్రుమ్భించింది .తన భార్య పట్ల కామంతో ప్రవర్తించి నందుకు వాడి కళ్ళను ,అతిగా వాగినందుకు ముఖాన్ని పతివ్రతను వెంటాడి జుట్టు పట్టుకున్నందుకు కాళ్ళు .చేతుల్ని యింక ఎందుకు పనికి రాని స్థితిలో,ఇతరులు చూడటానికి భయం గొలిపే టట్లు రూపం చెడె టట్లు శరీరం లోకి తోసి కుక్కి కీచక దేహాన్ని ఒక మాంసపు ముద్దగా చేసాడు గండర గండడు అయిన భీమ సేనుడు .ఇది ఆధునిక కాలం లో కీచకులు గా ప్రవర్తించె వారందరికి రాక్షస సందేసమే  మే ఇది .” తి క్కనా నీకు మొక్కనా నా ఋణం తీర్చుకోనా”
దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Leave a comment

భ .రా. గో ..గారి హాస్యం

భ కా రా ఆంటే భమిడి పాటి కామేశ్వర రావు గారు హాస్య బ్రహ్మ బిరుదాంకితులు .వారి హాస్యం కోనసీమ కొబ్బరి కాయంత రుచి ఆ నీటికి జవం ,జీవం స్వచ్చ్హత ఉన్నట్లే వారి హాస్యానికి అవే లక్షణాలు అబ్బాయి మాటల చర్నకోలుతో ఒళ్ళు ఝల్లని పిస్తారు .హెచ్చ్చారిస్తారు .ఏడిపిస్తారు .అస్తిత్వాన్ని తెలియ జేస్తారు .moliar నాటకాలను తెలుగు లో మంచి దినుసుతో వండి వడ్డించారు .తిన్న కొద్దీ రుచి .శబ్దం లో హాస్యం సృష్టించిన ఘనాపాటి .మేస్టారి చేస్తూ వర్షికోత్చావా సభల్లో మాట్లడుతూ వాటి కోసం హాస్య నాటికలు రాసి ప్రదర్శింప జేస్తూ రావు గారు సృష్టించిన హాస్యం బస్తీ మే సవాల్
పరీక్షలు ఎలా ప్రారంభ మయినాయో ఒక చోట చెప్పుతున్నారు చూడండి ”కృష్ణుడి చేత క్షేమమం గా చూడబడ్డ pareekhittu మహారాజు పరీక్షల్ని సృష్టించాడు .అంతకు పూర్వమే చండ మార్కుల వారు ”మార్కుల ”విషయం కనిపెట్టారు .ఇదో వ్యంగ్య వైభవం .ముసి ముసి గా నవ్వు కున్నం కదా ?ఆయనే ఇంకో చోట ”అసలు దేశం లో బలం వుంటే కానీ ఉపదేశం లో బలం ఉండదని చమత్కరిస్తారు .తెలుగు లో ఎన్నో పదాలు వచ్చ్చి చేరాయని చెబుతూ ”తెలుగు యొక్క మెత్త  దనం వల్లే ఇన్ని న్ని భాషల పదాలు బానాళ్ళ ,హృదయం నాటేలా తెలుగులో గుచ్చ్చుకు పోయాయి .తెలుగు శరీరం వాటిని నిల్చి ఉండనిస్తే అవి సేలలు వేసి ప్రాణం తీస్తాయి కొందరు బయటికి లాగి పారేస్తే వెంటనే ప్రనంపోకడ అనికొందరు అంటారని తెలుగు తనం తగ్గి పోతోందని హాస్యం మిళాయించి వాయించారు ప్రస్తుతం గొప్ప తెలుగు వాళ్ళ పట్ల పనికి మాలినది ల వున్న భాష తెలుగు అని ఆవేదన చెందారు
భమిడి పాటి వారి hasyam ””” దసరుపకం ”అనే చిత్ర మయిన రచనలో అనేక వంపులు సొంపులు పోయింది .పుస్తక విమర్శ ఎలా చేస్తారో ,వ్యక్తిగత ద్వేషం ఎలా చొచ్చ్చుకు పోతుందో అసలు చదవకున్దంర్ విమర్శలు ఎలా రాస్తారో ఇందులో చాల అద్భుతం గా చూపారు అందరు చదివి తీరాల్సిన రచన .అందులో మహా అద్భుతమయిన కొస మెరుపు ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది చూద్దాం రండి
గోపి నాధం రసరాట్టు గారికి ఒక వుత్తరం రాస్తాడు ఆయన గోపీనాధం రచనను సమీక్షిస్తూ ”పాండిత్యం లో లోతుకి కధ లోని నీటుకి వూర్జే సరిపోయింది .మొదలు ఎలా వుందో చివర అంతె .”అని రాసి పడేస్తాడు .గోపి నాదం మళ్లి రాస్తూ అది తన రచన కాదని ,తనది తన జేబులోనే వుందని ,చాకలికి వెళ్లిందని ,వచ్చ్చేసిందని దాన్నే పంపిస్తున్నానని మళ్లి తీరిగ్గా సమీక్షించ మని కోరాడు .రసరాట్టు తెలివిగా ”మరొకరికి పంపాల్సింది నీకు పంపాను అని ప్రారంభించి ”ఈ కవి సుప్రసిద్ధ పండిత పుత్రుడు .వున్న తప్పులు కుర్ర తప్పులు కనుక క్షమించ వచ్చ్చు .పాండిత్యం లో వుండే లోటు కూడా క్రమం గా అదే సర్దుకుంటుంది ”అని పూర్వపు సమీక్షంకు దిద్దు బాటు చేస్తాడు గోపి నాదం దీనికి సమాధానం గా ”ఆ రచన నాది కాదు సలాం .మా నాన్న గారిది ”అనిరాసి పంపాడు రసరాట్టు తెలివిగా ”రచన మిక్కిలి వుత్క్రుస్టం ఫక్తు చేవ గుంజు .మారుమూల పదాల కాణాచి నవీన విగ్జ్ఞానం కూడా వుంది .పూచి నాది ”అని భక్తీ నటిస్తూ రాసి పంపించాడు
మళ్లి గోపీనాధం ”అయ్యా /ఆ రచన ఒక బియ్యే గారిదిట ”అని చల్లగా బయట పెట్టాడు .వెంటనే ఈయన సమాధానం గా ”ఇంగ్లీషులో చదూకున్నదన్త పొట్టి గ్రాఫు దింపాడు సరుకు దిగుమతి ఎక్కడ్నించో చెప్ప లేదు రచనంత యింగ్లీషు కంపే .భాష మాత్రం ఆంధ్రన్గ్లద్రవిడవంగా దప్పళం ”అని తేల్చేసి lite తీస్కోమని రాసి పారేసాడు గోపీనాధ సమాధానంగా ”ఆ రచన ఘంట రావు దిట ఆయన మొన్న మీ ఎన్నికల్లో మీకు పని చెసాట్ట కదా/ అని రాసాడు రసరాట్టు నాలిక కరచుకొని ”ఈ రచనలో రసం ఆవకాయ వుఉట లాగా వూరి పోవటమే కాదు ,సముద్రపు పోటు లాగా ఉబ్బి మీద పడుతుంది మాట మధురం శైలి మనోహరం ”అని ములగ కొమ్మ ఎక్కించాడు .అవకాశా వాదాని కి పరా kasta .ఈ సారి గోపి నాదం ”యిది కేతయ్య గారి రచనట మీ యిద్దరికీ పడదట kaqda ? ”అని ముక్తాయింపు ఇస్తాడు .దీనికి దీటుగా రసరాట్టు ”యిదంతా daridragottu రచన ఇంత దారిద్ర రచన భూమి పయి కానీ అంగారక గ్రహం పయి కానీ లేదు .బుద్ధి గల వదేవడుచదవాడు ఇందులో అర్ధంవ్యర్ధం భావం అభావం .రసం నీరసం .స్య స్య కొయ్య ధార నార .నుడికారం సుడిలో పడింది కారకం మారకం  అయింది ఇది ఎవరయినా చదివితే పెద్ద వొట్టు ”అని కేతయ్య పై తన పగ తీర్చుకున్నాడు ఎవరు రాసారో వారి గురించి పొగడ్తో ,తెగడ్తో తప్ప అసలు రచన చదివి సమీక్ష చేసే సహృదయత లేని విమర్శక రంధ్రన్వేషకుడు రస రాట్టు .
మళ్లి గోపీనాధం ”ఇది శ్రీనాధుడి రచనట నాన్న గారు చెప్పారు ”అని చావు కబురు చల్లగా చెప్పాడు రాతలో రసరాట్టు తక్కువ తినలేదు ”ఈ రచనలో రస స్ఫూర్తి పద సౌష్టవం ,భావ విశేషం గుర్రపు నడక భాష మేళనం వుంది ”అని నెత్తి కెత్తు కున్నాడు .ఇదంతా వూసర వెల్లి రంగులు మార్చి నట్లు వుంది కదూ ?పట్టు వదలని గోపి నధఆ మఖరి అస్త్రం గా ”మీ పేర నేనూ రచన పుష్కరం కిందట మీరు రాసిందే నట అది మీ రచనల్లో చాల గోప్పదట నాన్న గారు స్వహస్తాలతో రాసి దాచి ఉంచు కున్నారట .నేనూ మీకు పంపింది అదేనేమో ”అని దిమ్మ తిరిగేట్లు రాసాడు పట్టు వదలని రస రట్టు ”నేనూ అసలు వూల్లొ లేను నీకు రాసిన జాబులన్నీ మా అమ్మాయి రాసినవే ఆ విమర్శా లన్ని మీ నాన్న గారివే విమర్శా నమునా ఎలవుండలో రాసి అట్టే పెట్టు కున్న మీ నాన్న గారి కాగితాలే అవి ,.పొరపాటన నీ మొదటి వుత్తరం లోనే ఇక్కడికి వచ్చ్చాయి నా రచన నిరుడే కుమ్భాయ్య గికి మీ నాన్న ఇచ్చ్చారు .అయిందేదో అయింది ఇంతకీ నీకు పెళ్లి అయిందా ?”అని ముగిస్తాడు .తగిన వరుడు తన కూతురికి దొరికడన్నా సంబరం తో అతని కంటే ఘనుడు ఆ చంట మల్లన్న సామెత రుజువు చేసే భ కా రా మేస్టారి రచన యెంత సృజనాత్మకం గా వుందో చూసారా /?

ఉత్తరాలతో ఆడుకున్నారు మాటలతో బాదారు వినోదాన్ని ఉల్లాసాన్ని పంచారు ఇద్దరి హృదయాల్లోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుత హాస్య సృష్టి చేసిన హాస్య బ్రహ్మ స్వర్గీయ భమిడి పాటి కమేస్వారారో మేస్టారు .సిద్ధాన్నం గా హాస్యం వండి వడ్డించారు గడుసు దనం చమత్కారం ఈ ”దసరుపకం ”లో దశ రుపాలయి మనిషి లోని dasavataralni ఆవిష్కరించారు hatsoff   మేస్టారు   మీ హాస్యపు జడి వానలో తడిసి ముప్పందమయిన మీ శిష్యుడు

 

Posted in సమయం - సందర్భం | Leave a comment

విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

“హృదయాహ్లాది చతుర్ధ మూర్జిత   ఖదోపెతంబు ,నానా రాసాభ్యుదయోల్లస్సి విరాటపర్వము”  అని తిక్కన విరాట పర్వ ప్రబంధ రచనకు అనుకూలం అనే విషయాన్నీ ముందే చెప్పాడు.  ఇందులోని కధ మన జీవితానికి చాల దగ్గర. వీర, శృంగార రస పోషణకు వీలు .అందుకే హృదయాహ్లాది అయింది .అనేక సన్నీ వేసాల్లో ,వ్యక్తుల ప్రవర్తన ,నిజ స్వరూపం ,శీలం ,స్వభావం ఇందులో బాగా వ్యక్తమవుతాయి .లౌకిక జీవితం సంపూర్ణంగా ప్రతిబింబించింది .కీచక వధ ,ఉత్తర గోగ్రహణం అభిమన్యు వివాహం దీనిలో ముఖ్య ఘట్టాలు .మొదటి దానిలో వీర, రౌద్రాలు ,రెండవ దానిలో వీర,హాస్యాలు చివరిలో లలిత   శృంగారం  వర్ణించాడు .   .
కీచక వధను ప్రబంధం గా తిక్కన రాసాడు .అసహాయ స్థితిలోని స్త్రీకి జరిగే అవమానం ,శీల రక్షణ కై ఆమె చేసే ప్రయత్నం దాని ద్వార వివిధ పరిణామాలు లోక సామాన్యమయినవి కనుక ఇతివృత్తం సహజ ఆకర్షణ పొందింది .పరులను ఆశ్రయించటం ,రాజాశ్రయం లోని కష్టాలు పాండవుల విరాట్ నగర జీవితానికి నిలువు అద్దం పట్టాయి .విరాటుని వినోదం కోసం భీముడు మల్లుల తోనే కాక ,సింహలతోను పోరాడ వలసి రావటం దాసి కనుక రాణి సుధేష్ణ చెప్పినట్లు చేయ వలసిన  దీన స్థితి లో  ద్రౌపది వుండటం ,తన అభిప్రాయాన్ని కాదన్నాడని ధర్మ రాజుని విరాటరాజు పాచికలతో కొట్టి అవమానించటం ,పాండవుల మీద మనకు సానుభూతి కలుగుతుంది ,.దీనికి అంతటికి కారణం ధర్మరాజు  జ్యుతం దాని ఫలితంగా పొందిన దాస్యం .అందుకే బలవంతులయిన పాండవులకు నిస్సహాయ స్థితి కల్గింది .సామాన్య మానవా జీవితం లో కనిపించే స్త్రీ లోలత కీచాకునిలో ప్రతిబింబించాయి .యుక్తాయుక్త విజ్ఞత లోపిస్తే కలిగే పరిణామం ఇదే నని మనందరికీ హెచ్చ్చారిక
కామా,క్రోధాలు కీచక వృత్తంత విషయం కానుక తిక్కన దీన్ని ప్రబంధ విధానం గా నడిపి మనస్సులను ఆకర్షించాడు .ఉద్యానవన ,సూర్యోదయ అస్తమయ వర్ణనలు తరు వాత వచ్చ్చే ప్రబంధ యుగానికి తోలి మెట్లు .,మార్గదర్శకం కూడా .వీటిని ఎర్రన ,నాచనా సోమన గ్రహించారు.   శ్రీనాధుడు స్వీకరించి పోషించారు .కృష్ణ దేవరాయల కాలం లో పరిపక్వ స్థితి పొందింది.


”నిరజాకరములు నిష్టమై   జేసిన భవ్య తపంబు ఫలమనంగా –  దివస ముఖాభినండిత చక్ర యుగ్మకంబుల యను రాగంపు బ్రోవనంగా – హరిహరబ్రహ్మ మహానుభావంబు లోక్కటిగాగా గరగిన గుటికా యనగ – నటుల వేదత్రయ లతికాచయము పెను పొంద బుట్టెడు ములకందమనగా  – నఖిల జగముల  కన్దేర యగుచు జనస – మాజా  కరపుట హృదయ సరోజ ములకు – ముకులనంబును ,జ్రుభనం మునునోనర్చి   భాను బింభము పుర్వాద్రిపై  వెలింగె”  అన్న  ఈ పద్యంలో  తిక్కన ప్రతిభ  అసామాన్యము.  భవ్య తపస్సు, పరంజ్యోతి స్వరూపం, విశుద్ధ  ప్రేమ ఒక క్రమ పరిణామం.  హరి హర బ్రహ్మైక్య జ్ఞాన మూర్తి మూడు వేదాలకు కారణమైన పరబ్రహ్మ స్వరూపం.   లోకాతీతమైన అలౌకిక ఉపమానాలతో వర్ణన చేయటం వలన ఉదాత్తట కలిగింది. మనోహరంగా ఉంది. సూర్యుణ్ణి పరబ్రహ్మగా చెప్పటంలో  వేద ధర్మాన్ని నిరూపించాడు తిక్కన.  సూర్య భగవానుడు చైతన్య ధాత అని, జ్ఞాన ప్రదాత అని “కందేర” అనే మాటలో నిక్షిమ్ప్తం చేసాడు. అలాంటి పరబ్రహ్మ స్వరూపమైన సూర్య దర్శనం హృదయ వికాసం కలిగిస్తుంది. ఉపమానాలు పవిత్రమైనవి అవటంతో ఉదాత కవితా తత్త్వం ఆవిష్కార  మైంది. ఇలాగె సూర్యాస్తమయాన్ని కుడా భావనా చమత్కారంతో రాసాడు.  సూర్యుడు పచ్చిమ దిశకు చేరగా అది సంధ్య అరుణ రంజితం అయినాడట.   భర్త వస్తే భార్యకు రాగ రంజితమే కదా.  ఆ పద్య వైభవం చూడండి.
” ఇనుడు తన కడకు నేతెంచిన రాగము బొండు తడి యుచిత మనగా – గెంపున మెరసి పచిమసాం – గన జన సంభావనముల గారవ మండెన్”
ఇనుడు అంతే సూర్యుడు & భర్త అని అర్ధం.  రాగం అంతే ఎరుపు & అనురాగం అని భావము.   అర్థ శ్లేషతో గొప్ప చమత్కార వైభవం గల పద్యం ఇది.  భర్త విరహంలో ఉన్న పశ్చిమ దిశా అనే స్త్రీ కి భర్త అనే సూర్యుని సమాగమం కలిగింది అందువల్ల ఆమె లోక సంభావ నియురాలు అయింది.   కులకాంత గౌరవం దక్కింది.   ఈవిధంగా ప్రకృతి వర్ణనతో సహజ అలంకారం చమత్కారం చూపి హృదయానికి వికాసం కలిపిస్తాడు కవి బ్రహ్మ తిక్కన.

ఈ భావాలూ మీకు నచ్చితే  వరసగా తరువాత మరి కొన్ని తిక్కన మహా కవిస్వరుని భావాలను ఆవిష్కరిస్తాను.

మీ…………..
దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

సుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి ప్రారంభ ఉపన్యాసం

మా కుటుంబ ఆయుర్వేద డాక్టర్ చిన్మయ గారు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఒక బ్రాంచ్ నీ ప్రారంభిస్తూ ఆ సభకు నన్ను అధ్యక్షులుగా చేసారు అందులో మాట్లాడిన విశేషాలు అందరి కోసం   మీ .దు

Posted in సభలు సమావేశాలు | Leave a comment

”డింగరి కి అప్పుడే అరవయి ఎ’ళ్ళా” ?

పాతాళ భైరవి సినిమా కు అరవయి ఏళ్ళు వచ్చిన సందర్భం గా నా అనుభూతిని మీతో పంచు కుంటున్నాను ”డింగరి కి  అప్పుడే అరవయి ఎ’ళ్ళా”  అన్నా వ్యాసం తో

మీ దు .

Posted in సమయం - సందర్భం | 3 Comments

శాస్వతానందం -ఆలోచనాలోచితం

ఇవ్వాళ (15.03.2011) ఆకాశవాణి  విజయవాడ లో ప్రసారమైన వ్యాసం మీ కోసం

Posted in రేడియో లో | 1 Comment

అన్నపరెడ్డి గారి సన్మాన సభ వార్తా పత్రికలలో

13.03.2011 జరిగిన సన్మాన సభ వివరాలు వార్తా పత్రికలలో ప్రచురితమైనవి మీ కోసం

Posted in సభలు సమావేశాలు | Leave a comment

అన్నప రెడ్డి గారి సన్మాన సభ – 13.03.2011 సరసభారతి ఉయ్యూరు

This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.

 

Posted in సరసభారతి ఉయ్యూరు | 1 Comment

“మా అక్కయ్య” అనురాగ కవి సమ్మేళనం- మార్చ్ 27 న- ఆహ్వానం

అందరికి ముందుగ కసరి ఖర నమ సంవత్శర ఉగాది శుభా కాంక్షలు సరస భారతి మార్చ్ నెల 27  వ తేది ఆదివారం మా అక్కయ్య శీర్షిక తో అనురాగ కవి సమ్మేళనం నిర్వహిస్తోంది 80  మంది కవులు పాల్గొనే ఈ మెగా కవి సమ్మేళనానికి మీరు అందరు ఆహ్వానితులే        మీ దుర్గా ప్రసాద్

 

Posted in సరసభారతి ఉయ్యూరు | 1 Comment

కాముని పున్నమి – “హొలీ”

గూటిలోని గువ్వలకు   హోలీ గురించిన విషయాలు. అందరికి హొలీ శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | 5 Comments

బండ్ మీద బొంద పెట్టారు- రామారావు కీ ఏమి చెప్పాలి

బండ్ మీద బొంద పెట్టారు
— ట్యాంక్ బండ్ బొంద పెట్టారు
మహామహుల విగ్రహాల్ని
ఆగ్రహం నిగ్రహం లో లేకుంటే అంత మహా స్మసానమే
కూల్చింది విగ్రహాల్ని కాదు జాతి పరువు ప్రతిస్టల్ని
మన సంస్కారాన్ని ,సంస్కృతిని
జాతి గౌరవం సాగర్ లో కలిసిన వేళ
ఆ నీళ్ళఅంత  అయింది మన జాతి ,,నీతి
మహాను భావులు వాళ్ళకేమి లోపం కాదు
మనకే చుట్టుకుంటుంది ఆ పాపం అదే అవుతుంది శాపం
విచక్షణ లేని జాతికి వినాసనమే మిగుల్తుంది
దుర్యోధన రాజ్యం లో నోరు మెదపని కురు పెద్దల లాగా వుంటే
మిగిలేది ఆత్మ వినాసనమే ,రోదనమే ,సంక్షోభమే
ఎవరు కుల్చారన్నది కాదు ఎందుకు ఎందుకిల ప్రవర్తించారని
వారంతా మన జాతి జీవన సర్వస్వం ,మన తండ్రి,తాత ,అమ్మా అక్క చెల్లి సోదరులు కదా
మన వాళ్ళను మనమే తగల పెట్టు కునే వార సత్వమామనది .
సంయమనం పాటిద్దాం గోరి కట్టిన పరువును బయటకు తీసి తలెత్తుకు తిరుగుదాం
ప్రపంచం మనకేసిచూసి  సిగ్గుతో తలవంచు కుంది
కూల్చటం లో  చేసిన తప్పును నిర్మించి ఒప్పిద్దాం
హుస్సేన్ సాగర్ మురికి లోకి  జారిన పరువుని పైకి తెద్దాం

వాటిని కాపాడుకోలేదని ఫై నున్న రామారావు కీ ఏమి చెప్పాలి ?
కళా ప్రాంగణం భవిష్యత్ రాష్ట్ర వికాస వైభవాలకు ఐక్యతకు అవగాహనకు ప్రగతికి దివ్య సజీవ సంకేత క్షేత్రం కావలి!
యన్. టి. రామారావు.  1-11 -1986

తెలుగు వెలుగుల  మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం ప్రారంభోత్సవ సందర్భంగా

ఆవిష్కరణ మీకోసం

Posted in సమయం - సందర్భం | Leave a comment

ఇం’కోతి’ “రవణ”

అందరికి నమస్తే మైనేని గోపాల కృష్ణ గారు ఆదరం తో పంపిన ముళ్ళపూడి రమణ గారి ”ఇంకోతి కోమ్మచ్చి’చదివి వెంటనే ఆయన మాటలతోనే ఆయనకు ఆంటే రమణ గారికి అర్పించిన అక్షర అశ్రు నివాళి ,ప్రశంస, పొగడ్త,గట్ర         ఈ కోతి గాడి కోమ్మచ్చి ఆట చూడండి   నచ్చితే ఆడుకోండి ,లేకుంటే కొమ్మ మీద విసిరేయండి     ఇంకో ఇంకోతి  దుర్గా ప్రసాద్

Posted in ముళ్ళపూడి & బాపు | 1 Comment

సత్యమేవ జయతే

వూసుల గూటి(బ్లాగ్) లోని తోటి వారికి  ఇంకో గువ్వను(పోస్ట్) చేరుస్తున్నా. పదిలంగా వుంచండి    ఇది ప్రతి మంగళవారం ఆకసవని విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్న ఆలోచనా లోచనం లో ఈ ఉదయమే ప్రసారమయిన లో చూపును వెలిగించే చిరు దివ్వె ”సత్యమేవ జయతే”   మీ అందరి కోసం    మీ దుర్గా ప్రసాద్

Posted in రేడియో లో | Leave a comment

ముదితల్ నేర్వర గా రాని విద్య గలదే ? జయహో మహిళా !!! అంతర్జాతీయ మహిళా దినోత్శావానికి వందేళ్ళు

అంతర్జాతీయ మహిళా దినోత్శావానికి వందేళ్ళు .

అయినా మహిళా లఫై అనాదరం పెరిగిందే కానీ తగ్గలేదు .వారికి రావల్సిన
భాగ స్వామ్యం ఇవ్వటానికి పురుష పుంగవులు తాత్స్చారం చేస్తూనే వున్నారు .వారికీ పదవులు వచ్చినా బ్యాక్ డ్రైవింగ్
చేస్తుండటం సిగ్గు చేటు వారు సమర్దులే ఏ పనినయిన నిర్వ హించ గల సామర్ధ్యం మహిళలకు వుంది. మన సంకుచిత
భావాలూ వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నాయి

శ్రీ చిలకమర్తి వారు ప్రసన్న యాదవ నాటకం లో చెప్పిన పద్యం హృద్యం
శిరో ధార్యం అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడు కూడా ”

చాడువన్నేర్తురు పుఉరుషుల్ఆంటళ్ళూ  బలే నే సాస్రంబుల్ పతిని మెమ్పించుచో………   ;
నదమన్నేర్తురు సత్రుసేనల ధనుర్ వ్యపారముల్ నేర్పుచో   నుదితో త్చాహ ము
తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిస్టించుచో . ముదితల్ నేర్వర గా రాణి విద్య గలదే ముద్దార నేర్పించినన్ ,”

ఆంటే ఆడ వాళ్ళు పురుషుల లాగా చక్కగా చదవగలరు ,శత్రువుల్ని చేల్చి చెందాడ గలరు ,ప్రపంచాన్ని పరి పాలించ
తగిన సామర్ధ్య వున్న వాళ్ళు ప్రోత్చ హిస్తే మహిళలు చేయ లేని పని ఏది లేదు అని చిలక మర్తి చెప్పారు

స్త్రీ పురుష సమానత్వం గురించి ఇంకా మాట్లాడు కున్తున్నామంటే మనం ఇంకా ఏ దశ లో ఉన్నామో ఆలోచించాలి
జీవన సమరం ఆటు పోటు ఇంకా ఎదుర్కొంటోంది బతుకు బండి యీడ్వటం కష్టం గానే వుంది .సమాజము ఇంకా
చిన్న చూపే చూస్తోంది అన్నిటికి ఆడది కావాలి కానీ ఆమెకు గౌరవం ఇవ్వటం లో వెనక బడి వున్నాం

చదువుల్లో ముందున్నారు ,అన్ని పోటీల్లో నెగ్గు కోస్తున్నారు క్రీడల్లో కీర్తి తెస్తున్నారు అత్యున్నత పదవి కూడా పొందుతున్నారు
కానీ ఇంకా అభద్రతా భావంలో నే వుండటం శోచనీయం. వేధింపు లెక్కు వాయినాయి ,వేదనలు పెరిగాయి ,చట్టాల వలన
భయం లేదు చట్ట సభల్లో వాణి వినిపించుకోరు.గ్రామీణ స్త్రీantలు వున్నత విద్య లో దూసుకు పోవాలి వారికి ఇచ్చిన
సౌకర్యాలను వినియోగించు కోవాలి ఉపాధి విద్యలలో రానించాలి స్వయం ఉపాధి పధకాలను సార్ధక చేసుకోవాలి

వికృతమయిన పోకడలున్న సమాజం మనది దారి తప్పటానికి అవకాశాలెక్కువ సంయమనం వహిస్తూ వివేకం తో
ప్రతి అడుగు జాగ్రత్త వేయాలి పాకుడు రాళ్ళ మీద నడవ రాదు .

ఈనాటి సమాజంలో మహిళా ఉనికి కాపాడు కోవాలంటే ఆత్మ స్థైర్యంమ్ ,ధైర్యం తప్పని సరి .సాహసం లేక పొతే అడుగు
ముందుకు వెయ లేరు .సేవా భావం వారికి పుట్టుక తోనే వుంటుంది దాన్ని మరింత సార్ధకం చేసుకోవాలి సమస్యలను
చూసి బెదిరి పోకుండా పోరాటం తో విజయం సాధించాలి వంట ఇంటికి మాత్రమే పరిమితం కారాదు

.దేశ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలి తెలుగు లో మాట్లాడి ,పిల్లలకు తెలుగు నేర్పించాలి
తల్లి మొదటి గురువు అన్నది మర్చిపోరాదు .సంఘటిత మహిళా శక్తి దేనినయిన సాధిస్తుంది అని తెలుసు కోవాలి
.తానూ విద్యనేర్చి తన కుటుంబానికి విద్య నందించాలి విద్య లేని తల్లి ఇవాల్టి సమాజం లో నిలదొక్కుకోవటం కష్టం

.మహిళా ఆంటే శ్రమైక జీవన సౌందర్యం ఆత్మా విశ్వాసమే మహిళకు పెట్టని ఆభరణం.

అందుకే  వో మహిళా మేలుకో ,ఏలుకో ,తల ఎత్తుకొని జీవించు తలపోగరు వాళ్ళ తలలు వంచు రుద్రమ దేవి ఝాన్సీరాణి
,శారద మాత ,మదర్ తెరెసా దుర్గాబాయి నీకు స్ఫూర్తి

వందనం అభివందనం అభినందన చందనం                  దుర్గా ప్రసాద్  ,

Posted in సమయం - సందర్భం | 1 Comment

పాలపిట్ట ఫెబ్రవరి – 2011 — అన్నపరెడ్డి గారి సన్మాన ఆహ్వానం

శ్రీ అన్నపరెడ్డి గారికి సన్మానం

అందరూ ఆహ్వానితులే

అన్నపరెడ్డి గారి గురించి పాలపిట్ట ఫెబ్రవరి సంచిక నుండి

Posted in సభలు సమావేశాలు, సమయం - సందర్భం | Leave a comment

తెలుగు బ్లాగు కి పర్యాయ పదం

ఉసుల గూదు

http://groups.google.com/group/telugublog/browse_thread/thread/17676e4eef786d33

నా పదం : ఉసుల గూదు

Posted in సమయం - సందర్భం | 2 Comments

బౌద్ధం లో వ్యక్తికీ ఇచ్చిన ప్రాధాన్యత

ఉసూల గూడు  లోని తోటి వారికి   బౌద్ధం లో వ్యక్తికీ ఇచ్చిన ప్రాధాన్యత అనే అంశం మీద చేసిన radio ప్రసంగాన్ని మీ ముందుంచుతున్నాను .

Posted in రేడియో లో | Leave a comment

ఆలోచనాలోచనం సమయాన్ని సార్దకం చేసుకోవటం ఎలా

 

Posted in రేడియో లో | Tagged | 1 Comment

ఆలోచనాలోచనం పశ్చాత్తాపం పాపశమనం

అల్ ఇండియా రేడియో విజయవాడ లో ప్రసారం అయిన నా వ్యాసం మీకోసం

Posted in రేడియో లో | Tagged | Leave a comment

కీర్తి శేషులు వాకాటి పాండురంగ రావు గారి భావ ధార

అల్ ఇండియా రేడియో విజయవాడ లో ప్రసారం అయిన నా వ్యాసం మీకోసం

Posted in రేడియో లో | Leave a comment

ఓంకార నిజ దర్శనం

మిత్రులకు నమస్తే .ఓంకారం నిజడర్సనాన్ని మీ ముందు ఉంచుతున్నాను చదివి ఆనందించండి

అది దేశలకతీతం అని అని గుర్తించండి శివరాత్రి శుభాకాంక్షలతో    మీ    దుర్గాప్రసాద్

ఓంకార నిజ దర్శనం

ఓంకార నిజ దర్శనం -౨

Posted in సమయం - సందర్భం | 2 Comments

అనుమాన శిష్యుడు అనే శంక లెంక

అనుమాన శిష్యుడు అనే శంక లెంక

మొన్న బాపు రమణలకు డబ్బా బాగా కొట్టారు అని మిమ్మల్ని అంటున్నారు గురువు గారు అన్నాడు నా శిష్యుడు .

ఆ మాట అన్న వాడు తెలుగు చదివి వుండదు .పాపం కాన్వెంట్ చదువుల వాడు అయి వుంటాడు  తెలుగు పుస్తకం
అసలు చూసాడో లేదో అన్నాను

.ఢంకా బాగానే బజాయిస్తున్నారు  అంత గోప్పెమిటో చెప్పచ్చుగా అన్నాడు మళ్లి

సరే విను అన్నాను .

బాపు తీసిన సీత కళ్యాణం సినిమా లండన్ స్కూల్ అఫ్  ఆర్ట్స్   లో   అధ్యయనం కోసం ఉంచారని నీకు తెలియదు దానికి
రమణే మాటకారి అని నీకు అస్సలు తెలియదు .తెలుసుకో నాయన  అన్నాను

.రమణ గారి ముందు హాస్యం లేదా అంత కు ముందు  అంతా శూన్యమేనా సన్నాయి నొక్కులు నొక్కాడు మళ్ళి నా శిష్యుడు

.ప్రతి దానికి కాలం సమయం,సమాజం, ఆధారం రా  బాబు అన్నాను .మనకు హాస్య రచయితలూ తక్కువే .ఆధునిక కాలంలో మరీని అన్నా.

వీరేశలింగం గారు ,చిలకమర్తి పానుగంటి హాస్య రచనలు చేసారు. మొదటి ఇద్దరు ప్రహసనాలు రాసారు
చిలకమర్తి  రాసిన గణపతి నవల హాస్యమే,.అయితె అందులో కొంత మొరటు హాస్యంవుండి మరీ చెవులు పిండి నవ్వించి నట్లుంటుంది

పానుగంటిసాక్షి  వ్యాసాలు సమాజం మీద గొప్ప చురకలే,మరకలే .హాస్యం దేప్పిపోడుపులతో సూటి పోటి మాటలతో కర్కశంగా వుంటుంది .

తర్వాత గురజాడ కన్యాశుల్కం చెప్పు కోవాలి సమాజం లోని దురాచారాన్ని హాస్యం ,వ్యంగ్యం పూత పూసి మందుగా ఇచ్చారాయన
సంఘ సంస్కరణం అందులో అంతర్భుతం

.నాటి సమాజంలోని మనుష్యుల బలహీనతల్ని ఆవిష్కరించిన నాటకం అది అంతా గొప్ప నాటకం మళ్లి రాలేదని చెప్పుకుంటాం.

ఆ తర్వాత వేదం వెంకట రాయ శాస్త్రి గారి ప్రతాపరుద్రీయం నాటకం ఇందులో రాజకీయానికి హాస్యం అనుపానం తురక భాషలో
అస్తవ్యస్తం గా మాట్లాడటం ,చాకలి వాని .కులసంబంధమయిన భాషా నవ్వును తెప్పిస్తాయి

తర్వాత మొక్కపాటి వారి బారిష్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం లో వున్న చిక్కులు ,ఈ దేశం లోని అలవాట్లు ,అక్కడ
ఇమడలేక పోయిన పరిస్తితులు హాస్యానికి మూలాలు తప్పుల తడక తో చిప్పిల్లిన హాస్యం అది .అతని ప్రవర్తనమీద కలిగే ige
సాను భూతి లోంచి వచ్చిన  నవ్వు అది.

ఆ తర్వాత ఎవరు లే రా అన్నాడు లెంక శంకతో

భమిడి పాటి కామేశ్వరరావు గారు ,మునిమాణిక్యం నరసింహారావు గారిని వదిలితే చరిత్ర క్షమించ దు రా   అన్నాను

భమిడి పాటి కామేశ్వరరావు గారు మేస్టారు గారు కనుక లోక పరిశీలన పరిశోధనతో అన్ని కోణాల్లో హాస్యం పండించారు .ఆయనలో ఆలోచన పాలు ఎక్కువ
.ఒడిదుడుకులను,సుక్ష్మంగా పరిశీలించి,హాస్యం వండి వడ్డించారు .హాస్యబ్రహ్మ బిరుదు వారికీ వచ్చింది. నౌకరు పాత్రను ఆయన నడిపినంత
పకడ్బందిగా ఎవరు నడపలేదు. ఆయన పాత్ర లన్ని జీవితం లోనుంచి వచ్చినవే .ఆయనకు భాషా ఒక ప్రవాహం పదాలు అచ్చంగా అలాగా
ఉంటేనే బాగుంతయన్నంత గొప్పగా రాసారు .సమాజం మీద చెణుకులు.,మోలిఅర్ ప్రభావం ఆయన నాటికల్లో బాగా కన్పీస్తున్ది .ముద్ర రాక్షసం
నాటకాన్ని అచ్చ తెనుగు నాటకం గా మలిచి ,అంతా seriousness లోను సరదాగా నవ్వించారు .

మునిమాణిక్యం భార్యభార్తలలోని అనుబంధాన్ని భర్త అమాయకత్వాన్ని ,భార్య గడుసుదనాన్ని తెలివి తేటల్నిచూపిస్తూ నవ్విస్తారు నవ్వు మీద ఒక పుస్తకం కూడా రాసారు

అసలు విషయం వదిలి చాల దూరం వచ్చారు గురువుగారు  అన్నాడు

ఇదంతా తెలిస్తే అసలు విహాయం తెలుస్తుంది అన్నా .

.చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారో,ఎలా మాట్లాడుతారో ఇంతవరకు ఎవరు రాయలేదు ఆపన్నీ రమణగారు చేసారు .మాట్లాడే భాషకు రూపం కట్టారు
.సుత్తితో కొట్టి నట్లు కాకా ,గిలిగింతలు పెట్టె మాటలతో చురకలంటించారు .అలాంటి తెలుగు మాటల్ని ఇంతవరకు ఎవరు అంతకు ముందు రాయలేదు
.కొత్త పాత్రలూ వచ్చాయి మనిషిలోని మనిషిని ఆవిష్కరించాడు .డొల్లతనాన్ని ,డాబు దర్పాన్ని అతి సున్నితమయిన భాషలో వెటకారంగా చెప్పి
ఎవడి గురించి చెప్పారో వాడె చదివితే వాడయిన నవ్వుకొని చావాల్సిందే .పరకాయ ప్రవేశం చేస్తాడు అది అందమయిన తెలుగు జీవం వున్న తెలుగు .నభూతో
గా వున్న తెలుగు కండగల తెలుగు .భక్తిని ,హాస్యాన్ని మాధుర్యాన్ని తెలుగుకు” కానుక ”గా ఇచ్చాడు .ఆ పదబంధాలు ఇదివరకు విననివి .ఆ వర్ణనలు ఎవరు చేయనివి
.ఆ పోకడే వేరు సమీక్ష రాసిన కధ రాసిన ,పొగిడిన తెగడిన అది అపూర్వం అనుత్తరం గా వుంటుంది .ఆ impactveru .తెలుగు జనజీవితాన్ని,భారతీయ సంస్కృతిని
ఆవిష్కరించిన జంట బాపు రమణ ఆ జంట పంట రత్నాల రాసి అన్నాను

చాలు గురువుగారు సత్యం తెలిసింది అరచేతితో సూర్యుణ్ణి ఆపలేం ఆపాలనుకుంటే అవివేకం అని శంక తీరి లెంక వెళ్ళాడు

మీ దుర్గాప్రసాద్.

Posted in ముళ్ళపూడి & బాపు | 1 Comment

శివరాత్రి విందు భోజనాలు

రచన : గబ్బిట కృష్ణ మోహన్
ప్రచురణ : సరసభారతి

ఉయ్యూరు ఉసులలో

Posted in సరసభారతి ఉయ్యూరు | 1 Comment

శివరాత్రి మహత్యం

బ్లాగు మిత్రులకు శివరాత్రి శుభాకాంక్షలు

 

Posted in సమయం - సందర్భం | Leave a comment

ముళ్ళపూడి వెంకట రమణకు సరసభారతి ఉయ్యూరు నివాళి

సరసభారతి ఉయ్యూరు

ఈమెయిలు మరియౌ బ్లాగ్ మిత్రులకు

తేది : 26-02-2011

సమయం : 5 గంటల కు సాయంత్రం

ప్రదేశం : ఉయ్యూరు గ్రంధాలయం

మాకు ఈమెయిలు మరియు బ్లాగ్ జవాబులు రాసిన వారి అందరి పేర్లు కూడా నివాళి లో చేర్చబడినది

సరసభారతి ఉయ్యూరు గ్రంధాలయం

సరసభారతి ఉయ్యూరు గ్రంధాలయం

పుస్తకాలే నేస్తాలు ఫోటో పెట్టడం ఎవారికి ఎస్తం లేక

ఫోటో పెట్టడం మా సభికులు ఇషం లేదు అందుకు అయన పుస్తకాలకే దండలు

దుర్గా ప్రసాద్ గారి అధ్యక్షులు

అనర్గళంగా మాట్లాడిన

విద్యార్ధి లోక ప్రతినిధి

Posted in ముళ్ళపూడి & బాపు | Leave a comment

బాపు రమణలకు పద్మ పురస్కారాలు ఈ ఏడు కూడా రాలేదేందుకు

“బాపు రమణలకు పద్మ పురస్కారాలు ఈ ఏడు కూడా రాలేదేందుకు గురువు గారు?” అడిగాడు నా శిష్యుడు .

తెలిసి అడుగుతున్నావా తెలియాక అడుగుతున్నావా?  ఎరా :-  ముక్కుమూసుకుని  కళాసేవ చేస్తే ఎవరు గుర్తిస్తార్ర్ర ? అన్నాను. సభలు సమావేశాలకి రారు. ,
పదవిలో వున్నా వాళ్ళకి  కనబడరు .వాళ్ళ జేబులో బొమ్మగా వుండరు .చెప్పిన ప్రతి దాన్నికి తలూపరు.వ్యంగి బాణాలు,
కార్టూన్లతో బాదుతారు

ఫైగా. ప్రతిభ ను గుర్తించే అంతటి ఓపిక తీరిక ఎవరికున్నాయి .కంట్లో నానుతూ కళ్ళకు కనిపిస్తూ ,వుంటేనే దిక్కు లేదు. వీళ్ళ నెవరు పట్టించు కుంటరా ?అన్నాను.
మీరు ఏదీ సూటిగా చెప్పారు. డొంక  కదిలిస్తారు. మీతో గొప్ప చిక్కు అన్నాడు వాడు .

అది కాదు గురువు గారు ఈమధ్య గొల్లపూడి మరుతి రావు గారు కూడా వీళ్ళను గుర్తిచాలేదని బాధ పడ్డారు అందుకని అడిగా  అన్నాడు. మళ్ల్లి
ఏరా వాళ్ళకు పద్మాలు ఇవ్వక పోయినందుకు రేకంమేండ్ చేయ లేక పోయ్నందుకు రాష్ట్ర కేంద్రాలు సిగ్గు పడాలి .కానీ మన కేందుకురా బాధ?అన్నాను.

మనసులో కెలుకుతూ వున్నాకూడా,వాణ్ణి సమాధాన పరచటానికి .ఇంతేనా గురుజీ మనం చేతులు ముడుచుకు కుర్చోవల్సిన్దేనా? పట్టు వదలని విక్ర మర్కుడిలా
.ఒర్ని నీకో విషయం చెప్తాను విను జాగ్రత్తగా అన్నాను .

చెప్పండి స్వామి అన్నాడు.

ఒరి  నాయన ,సహస్రదళ పద్మం ల బాపు రమణల బుద్ధి వికసించి ,పరిణతి చెంది మార్గదర్సులుగా,మనల్ని ప్రభావితం చేస్తున్నారు వారి రచనలే గీతలే సిరి అంటే శ్రీ .కనుక వారె పద్మ శ్రీలు తెలిసిందా.

భలే చెప్పారు గురువు గారు అన్నాడు వాడు.అయ్యా అదేదో భోషానాలున్నయిగా వాటి సంగతేమిటి అన్నాడు నసుగుతూ. ఒర్ని నిదుంపతెగా అవి భోషణలు కాదు భూషణ్లు అన్నాను

.ఏదో నండి నాలిక జారింది అన్నాడు

సరే అదీ విను వారిద్దరు  రచనతో సౌందర్య చిత్ర రచనలో,నిర్మాణ,దర్సకత్వాలతో భూషణలయారు .కనుక వారిఇంటినిండా కళా భోషణాలు చాల వున్నాయి.
వారిద్దరూ  గీత రాతల పద్మభుషనులె. మరి ,మరి అని నసిగాడు మళ్ల్లి

నీ సందేహం అర్ధమయింది. విభుషనం సంగతేగా దానికే వస్తున్నా. విశిష్ట పురస్కారాలతో ,జన హృదయ అభినందన చందనంతో ,సత్కారాలతో ఎప్పుడో విభుషనులయారు .,
విశిష్ట భుషనులూ అయ్యరు .ఒరేయ్ పద్మమ్ వికసనా,నికి విస్ఫుర్తికి చిహ్నం తెలుసా?అన్నాను .

ఇక చివరి దానికి వస్తున్నా .వారు గీసినది తీసినది రాసినది అంతా భారతీయ సంస్కృతీ విభావమే .,అచ్చ తెనుగు తనమే తెలుగు వైభవమే .
ఆ రత్నాలను పండించి దోసిళ్ళ కొద్ది పంచి పెట్టిన జాతి వైభవ రత్నాలు వారు .అందుకని వారె భారత రత్నాలు  అన్నాను.

నోరు వెల్ల బెట్టాడు ఇప్పుడుతెలిసింది అన్నాడు .ఇన్ని గొప్ప గణాలుంటే వరికేందుకిస్తారండి అవి అన్నాడు జ్ఞానోదయం అయిన వాడిలాగా. .

ముక్తాయింపుగా,పాలకులు గుర్తించక పోయిన,గౌరవించక పోయిన ఎం పర్లేదు  .అది వారి నైజం .ప్రజలు వారి హృదయ లలో గుడి కట్టుకు పూజిస్తున్నారు.

చివరిగా ఒక మాట కబోది పెబువులు  మచ్చరంతో ఇచ్చే బిరుదులూ,పురస్కారాలు వారికీ అక్కర్లేదు .వారు వెంపర్లడరు  .వారి నీతి నిజాయతి కళా సేవ కళామతల్లి గుర్తిన్చింది  వారె వల్లే కొత్త అందాలూ సంతరించాయని ,కొత్త వెలుగు తనకు వచ్చిందని ఆ తల్లి గుర్తించింది అది చాలు.

ఆంధ్ర జనులు జయ గీతాలు పాడు కుంటున్నారు  అన్నాను .

నా బుర్ర ప్రక్షాళన చేసారు పాత బూజు అంతా వదిలించారు చాల సంతోషం గురువుగారు  .ఇప్పుడు రవన లేడుకనుక ప్రభువులు కళ్ళుతెరుస్తారెమో అంటూ వస్తా   అని ఆనందంతో పులకించి వెళ్లి పోయాడు

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in ముళ్ళపూడి & బాపు | 11 Comments

మరికొన్ని ముళ్ళపూడి విశేషాలు ముళ్ళపూడి , బాపు దర్శనం గోపాల కృష్ణ గారి సౌజన్యం -2


నమస్తే  గోపాల కృష్ణ  గారు

ముళ్ళపూడి జ్ఞాపకాలు ఇంకా తొలుస్తూనే వున్నాయి .
2008 డిసెంబర్ లో బాపు రమణలను మద్రాస్ లో వారింట్లో చూసినపుడు వారిద్దరూ మా ఇంటి పేరు తెలుసుకొని గబ్బిట వెంకట రావు గారు మీకు బంధువు లేనా  అని అడిగారు మాకు వున్న,తెలిసిన ఒకే ఒక్క జ్ఞాతి ఆయన అని చెప్పాను .ఆయనభార్య చెల్లెల్ని వుయ్యూరు లో వుండే మా మేనమామ గుండు గంగయ్య గారి పెద్దబ్బాయి పద్మనాభానికి ఇచ్చి పెళ్లి చేసారని వుయ్యూరు వచ్చినపుడల్లా మాయింటికి వచ్చేవారని ,ఆ పెళ్ళికి అగిరిపల్లి లో మేము మొదటిసారిగా చూసామని చెప్పాను.
వెంకట రావు గారు తమ రామాంజనేయ యుద్ధం సినిమా కు రాసారని గొప్ప కవి అని పద్యం ఆయనంత బాగా ఎవరు రాయలేరని మెచ్చారు .ఆయనతో మళ్లి ఒక సినిమాకు రాయిన్చాలను కుంటున్నామని చెప్పారు రావు గారు చని పోయి రెండేళ్ళయిందని చెప్పా తమకు తెలియదని,ఆశ్చర్య పోయరిద్దరూ .అవతలి వాడి ప్రతిభను గుర్తించే సహృదయం వారిద్దరిది ఆ మర్నాడు మద్రాస్ లో వున్న రావు గారి అబ్బాయిని చూడటానికి వెళ్తున్నామని చెబితే ఆ కుటుంబానికి తమ సంతాపం, సానుభూతి తెలియజేయమని చెప్పిన సంస్కారం వారిది
.బాపు గారు ,వారి భార్య అతి నిరాడంబరం గా వుండటం ఆశ్చర్యం కల్గించింది .నేత చీరెతో ఆమె,గళ్ళ లుంగి పొట్టి చొక్కాతో ఆయన .అంతా పేరు ప్రతిష్ట వున్న అంతటి సామాన్య జీవనం .ఆదర్శం మాటల్లో కాదు చేతల్లో ,నడవడికలో చూపుతున్న మార్గదర్శి గా అనిపించారు .
ఇక రమణ గారు తెల్లని బట్టలు ,తెల్ల జుట్టు ,భార్య సాదా  సీదా ఆకూ పచ్చ నేత చీర తో పార్వతి పరమేశ్వరులు అనిపించారు ఆమె నండూరి రామ మోహన రావు గారి చెల్లెలే.అరుగొలను వారిది . కారణ  జనములు అనిపించారు ఆ జంట జంటలు.
మా ఆవిడా మురిసి పోయింది వాళ్ళను చూసి ,వాళ్ళ ఆప్యాయతలు , పలకరింపులు ,మర్యాదలకు  ముగ్ధులం అయ్యాం.
మైనేనీ  గారి గురించి మాట   వచ్చినపుడల్లా ఇద్దరు  ఎంతో పొంగిపోయారు. ఎన్నో  పుస్తకాలూ  అరుదయినవి  సేకరించి  అమెరికా నుండి  ఆయన  పంపుతారని, ఆయన  స్నేహం మరువలేనిదని  అన్నారు  .గోపాలకృష్ణగారు  కూడా  బాపు గారు ఎన్నో  విలువయిన  పైంతింగ్స్  తనకు  పంపించారని  అమెరికాలో   మే ము వున్నప్పుడు  నాకు   ఫోన్
లో చెప్పేవారు.  అంతటి జిగినిదోస్తి వారిముగ్గురిది.
నాలుగు   ఏళ్ళ  క్రితం  ఆంధ్రజ్యోతి  దిన   పత్రిక లో  బాపు రమణల   ”sirinomu’ లోని   భాగాలను ధనుర్మాసం  సందర్భంగా  రోజు     వేస్తుంటే  చదివి  అద్భుతం   అనిపించి ఒక కార్డు  రాసాను.  అందులో వుయ్యుర్లో  మాకు  సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం   వుందని , ధనుర్మాసంలో  రోజు  నేను  ఆలయంలో తెల్ల వారు  ఝామున  అయిదు  గంటలకే  వెళ్లి  తిరుప్పావై  రోజు  చదువుతానని ,నేను వంస పారంపర్య ధర్మ కర్తనని    భోగినాడు  కళ్యాణం   కుడా  చేస్తామని,   హనుమ్మజ్జయంతి  కి కుడా శ్రీ  సువర్చలాన్జనేయ స్వామి కళ్యాణం    చేస్తమని, హనుమద్  వ్రతం  కూడా  చేస్తామని  కోతపోకదాలతో   సిరినోము  వుందని, రసభరితంగా ఉందని రాసాను.   ఆ  విషయం మర్చిపోయాను.
వారం తర్వాత  200 రూపాయల విలువకలిగిన  ఆ పుస్తకాన్ని  registerd post లో నాకు  అందేటట్లు పంపారు.  ఆశ్చర్యపోయాను.  వెంటనే ఫోన్ చేసి థాంక్స్ చెప్పాను.  మరునాడు ఉదయం ఆ పుస్తకాన్ని స్వామి పాదాల దగ్గర ఉంచి రోజు అందులోని విశేషాలను తెలియ చేసే వాడిని.  కళ్యాణం  అయింతర్వాత  వారిద్దరికీ  స్వామి  వారి ఫోటోలు  ,ప్రసాదం, కళ్యాణ   అక్షింతల్  పోస్ట్లో  లో పంపాను .
ఇది అనుకోని సంఘటన.   అంతటి భక్తీ ప్రపత్తులు వారికి ఉన్నాయని తెలియ్స చేయటానికి ఇది రాసాను.   ఇది మద్రాస్లో వారిని కలిసినపుడు గుర్తు చేస్తే ముసి ముసి నవ్వులు నవ్వి ఊరుకున్నారు అది వారి మనస్తత్వం.
— క్రౌంచ  మిధునం  విడిపోయినపుడు  వాల్మీకి   శోకం   శ్లోకంగా,   అది ఆది  కావ్యం   ఆరంభం అయింది .  అలాగే  ఉంది ఇప్పటి  స్థితి.
చిన్నపిల్లలను  శ్రీరామ రక్ష అని  తెలుగు వారు దీవిస్తారు.  తెలుగు తరం కొత్త హాస్యానికి ‘శ్రీ రమణ రక్ష’ అని అనిపిస్తుంది.
ఇందులో  రెండు   విశేషాలు ఉండటం  గమనించి    వుంటారు.  ఒకటి ముళ్ళపూడి  వెంకట రమణ  రక్ష  అని,  ముళ్ళపూడి తర్వాత  ఆ రకo హాస్యాన్ని వండి  పండించిన ఆ  వారసత్వాన్ని   తీసుకుని  ముందుకు సాగుతున్న శ్రీ రమణ అని అర్ధం.
అప్పు (నీరు), ఆకాశం ఉన్నతవరకు ముళ్ళపూడి వెంకట రమణ చిరంజీవే.

— నమస్సులతో …………….       మీ ………….

Posted in ముళ్ళపూడి & బాపు | 1 Comment