విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మల్లం పల్లి శరభయ్య గారు -2
విశ్వనాధ సాక్షాత్కారం
మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు అంటే అందరు ఆప్యాయం గా పిల్చే శరభయ్య గారు విశ్వ నాద వారిని దర్శించ టానికి విజయ వాడ బయల్దేరారు .అప్పటి ఆయన అవతారం ఎలా వుందంటే -మాసిన లాగు ,పొట్టి చేతుల చొక్కా ,మెడలో రుద్రాక్షలు ,యెర్రని కళ్ళు ,నల్లని రూపం దానికి తోడూ నత్తి -తనను విశ్వ నాద ఆడరిస్తాడా అని లోపల అనుమానం .అయితే అప్పుడు తనకున్న దంతా ,తన హృదయమొక్కటే నంటారు శరభయ్య గారు .అప్పుడు ఎస్.ఆర్.ఆర్ .కాలేజి గవర్నర్పేట లో వుండేది .కాలేజి వదిలి పెట్టే సమయమైంది .ఇంతలో ఒక మహత్తర వ్యక్తి ప్రత్యక్ష మైనాడు .ఎలా ఉన్నాడాయన ?”ఎత్తైన పడగ తో తోక పై నిలిచి ,ముందుకు తూగి వచ్చే ,మహా నాగం లాగా వున్నాడు .ఆయన లోలోపల ఏదేదో పాడు కొంటు వస్తున్నాడు .” ఈయన ,ఆయన్ను చూసి నిశ్చేస్తుడైనాడు . .”విశ్వనాధ వీరేనా ?అని గేటుకాపరిని అడి గారు .అవునన్నాడు అతడు .ఇక ఆ ఆనందాన్ని ఎలా వర్ణించారో ఆయన మాటల లోనే విందాం .
”భూమి అంతా నా కైవశం అయినది .కైలాస శిఖరదర్శనం అయినట్లైంది .. .రాశీభూత మైన పూర్వాంధ్ర ప్రతిభ అంతా సాకారమై నడుస్తున్నట్లుంది .కాలిదాస భవభూతి ,దిగ్నాగుల లోని ,భావుకత లోని పరమ సుకుమార మైన ముద్ర వేసి నట్లుంది .త్రిలింగ దేశాల ను ,భూమిని ,వాయువు ను ,అరణ్య పర్వతాలను ,మహా నదులను ,యుగ యుగాలుగా ఆవరించుకొన్న ఆత్మా ఏదో ,ఆకృతి దాల్చి ప్రసన్నమై, దర్శన మిచ్చినట్లుంది .నేను దానిలో లీనమై పోయినట్లు తోచింది .అలా తెలీని ఒచేతనా చేతనా స్తితి లో పడి పోయి ,ఆయన వెంట ఆయన ఇంటికి అనుసరించి వెళ్లాను .విశ్వ నాద నాకు అలా ప్రత్యక్ష మై ,సాక్షాత్కరించారు ”అని ఉప్పొంగి పోయి చెప్పారు శరభయ్య శర్మ గారు ఇంటికి చేర గానే ,విశ్వనాధ వారి పాదాల మీద పడి పోయారు .ఎవరో కుర్రాడు భిక్ష కై వచ్చాడను కొని ,”ఛీ.ఛీ.నన్ను ముట్టు కుంటావెం ?కావాల్సిన్దేదో దూరం గా వుండి ,అడగచ్చు కదా ”?అని చీద రించుకొన్నారు .
శరభయ్య గారి నవ నాడులు కుంగి పోయాయి .కంఠం రుద్ధ మైంది కొన్ని ఛందోమయ ,అక్షరాలూ ,స్పస్తా స్పష్టం గా ,నోటి నుండి ,బయట పడ్డాయి .ఇంక వశం కాక ,ఏడుపు తన్ను కొచ్చింది .అందులో ఆనందం ,దుఖం ,మిళిత మై నాయి .ఆశ్చర్య పోయాడు విశ్వ నాద .ఆ కుర్రాణ్ణి దగ్గరకు తీసుకొని ,ఆలింగనం చేసి వివరాలు అడిగారు .మల్లంపల్లి వారు చెప్పిన సమాధానం విని ,నిలువునా నీరై పోయాడు విశ్వ నాద .”ఇంకెప్పుడు గోత్ర నామాలు చెప్ప కుండా ,ఎవరి కాళ్ళ మీద పడ వద్దు ”అని సలహా నిచ్చారు .విశ్వనాధ కళ్ళ నిండా నీరు నిండి పోయింది .కంఠం వణికింది .దగ్గుత్తికతో ”ఏవ మవిజ్ఞాతాని దైవతాన్య ప్యవదూయన్తే ”అని తనలో తాను గొణు క్కున్నారు ..
విశ్వ నాద వ్రాసిన గ్రంధాలపై ఇద్దరు చక్క గా మాట్లాడు కొన్నారు .వానలో తడిసిన అడవి లాగా ,కన్నీరు ఓడ్చి ,ఆయన హృదయం తేలిక పడింది అంటారు మహామహో పాద్యాయులు మల్లం పల్లి వారు .ఒక ప్రహ్లాద భావం తనలో కల్గిందట .ఆతర్వాత ,వీరిద్దరూ ఎప్పుడు కలిసినా ,ఈ మొదటి అనుభూతినే నెమరు వేసుకొనే వారట .విశ్వనాధ కంటికి శరభయ్య గారేప్పుడు ,12 ఏళ్ళ పిల్లాడు గానే కన్పించే వారట .ఆ ప్రేమ బలం తన వయోజ్ఞానాన్ని కూడా , స్తంభింపజేసింది అంటారుమల్లం పల్లి వారు .ఆ నాడు వృష నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పాడ్యమి .సుమారు 70 ఏళ్ళ కిందటి ముచ్చట ఇది .విశ్వ నాద తన ఇంట్లో నే ఆకుర్రాడికి భోజనం పెట్టి ,తెల్ల వార్లూ కవితా చర్చ చేశారు .విశ్వ నాద కు తాను రాసిన దేవీస్తుతులను మల్లం పల్లి వారు చదివి విని పించారు అమ్మ వారి పై . తనకూ భక్తీ ఉందనీ చెప్పి తను రాసిన పద్యాన్ని విశ్వ నాద చదివి విని పించారు .
”నిగమ మహార్ధముల్ జగము నిండెను -తన్నిగామాంత వైఖరుల్
నిగము చయమ్ము కన్న హవాలించెను -తన్నిగమాంత చూడమై
తగిలెను బ్రహ్మ నా బడు పదార్ధము -బ్రహ్మము మౌళి ,తల్లి ,క్రొం
జిగురు పదమ్ము ,గోటి రుచి చే ,రుచిమంత మిదేంత చిత్రమో !
విశ్వ నాద కంత (KANTHA ) సీమ లో తేనెలు ప్రవహించినా యట . .మేఘ గర్జనలున్నా యట . .కోయిల పంచమ స్వరం విని పించిందని మురిసి పోయారు .ఆయన చూపిన కారుణ్యం వల్ల ,విశ్వ మంతా ,దేదీప్యమానం గా వెలిగిందట .విశ్వనాధ సూర్యుని వైపు నిరంతరాభి సరణం చేసిన కవి ,పండిత ,విమర్శకులైన పొద్దు తిరుగుడు పువ్వు శ్రీ శరబెశ్వ ర శర్మ గారు .
విశ్వ నాద రామాయణ కల్ప వృక్ష రహస్యాలను ,ఆంద్ర దేశం నలు మూలలా ,తన ఉపన్యాసాలతో త్రవ్వి తలకెత్తారు మల్లంపల్లి వారు .మల్లం పల్లి వారు కృష్ణా జిల్లా లోని బందరు దగ్గర ఉన్న ,చిట్టి గూడూరు ఓరియంటల్ కాలేజి లో చదివారు .తెలుగు పండితులు గా ,బందరు ,రాజమండ్రి ,మద్రాస్ లలో పని చేశారు .చివ రికి రాజ మండ్రి శారదా కాలేజి ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు శరభయ్యాచార్య వర్యులు .ఎన్నో కావ్యాలకు అత్యద్భుత విమర్శలు రాశారు .ఆయన విమర్శ కత్తి లాంటిది .దానికి రెండు వైపులా పదును వుంటుంది .ఒక వైపు పాఠకుడి అనుభవానికి దోహదం చేస్తూనే ,రెండో వైపు గుణ దోషాలను పరామర్శిస్తుంది .ఈ రెంటినీ సమం గా నిర్వ హించటం కష్టమే .దాన్ని సుసాధ్యం చేసిన విమర్శక శిఖామణి అని పించుకొన్నారు .విశ్వ నాద ఏది రాసినా ,మల్లం పల్లి వారు మెచ్చితేనే అది శంఖం లో పోసిన తీర్ధం అవుతుంది .అంతటి నిశిత పరిశీలన మల్లం పల్లి శరభయ్య గారిది .మల్లంపల్లి వారిపై మరిన్ని వివరాలు మరో మారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -02 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
