నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4

  నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు –4

                                                                    గోన బుద్దా రెడ్డి

           తెలుగు లో  ద్విపద రామాయణాన్ని గోన బుద్దా రెడ్డి రాశాడు ..తండ్రి పేరు విథల రాజు .అది పాండు రంగని పేరు .ఆ పేరు లోని ”రంగ”పదం తో ”రంగ నాద రామాయణం ”గా ప్రసిద్ధి .చెందింది అని అందరు అంటున్న విషయం .పాటలుగా పాడు కోవ టానికి వీలుండటం తో ,సామాన్య జనానికి అందు బాటైంది .వాల్మీకి రామాయణం లో లేని కధలను ఇందు లో చొప్పించాడు .ఆధ్యాత్మ రామాయణం కధలను చేర్చాడు .అహల్య శిల అవటం , ,లక్ష్మణుడి నిద్ర ను భార్య ఊర్మిళ తీసు కోవటం ,,మంధర కాలును శ్రీ రాముడు చిన్న తనం లో విరగ గొట్టి నందుకే ఆమెకు రాముని పై పగ కలగటం ,సీతాపహరణ సమయం లో లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయటం ,వంటి సన్ని వేశాలన్నీ అవాల్మీకాలే .అలాగే రావణుడి పాతాళ హోమం ,,సేతు బంధనం లో ఉడత సాయం ,ఆయన సృష్టించినవే .అయితే అవన్నీ జనామోదాన్ని పొందటం విశేషం .వాల్మీకం లో శ్రీ రాముడు అవతార పురుషుడు అయితే ,రంగనాధం లో సాక్షాతూ శ్రీ మహా విష్ణువు గా నే భావించి రచించాడు .రావణాసురున్ని కూడా ఉదాత్తం గా చిత్రించి ,ప్రతి నాయకుని సామర్ధ్యాన్ని బాగా పెంచాడు .అప్పుడే నాయకుని సామర్ధ్యం కు విలువ హెచ్చు తుంది అని అని చూపెకొత్త చూపు ఇందులో కన్పిస్తుంది .పునరుక్తి గా కొన్ని పదాలు వాడి ,విషయ ప్రాధాన్యాన్ని పెంచటం మరో విశేషం .పాత పడి పోయిన మాటల మూట లన్నీ వది లించేశాడు .కొత్త మాటలకు అభిషేకం చేశాడు .నవ్యత కు ప్రాదాన్యమిచ్చాడు .ప్రసన్న దారాళ శైలి లో ఉండటం తో ద్విపద కావ్యాల్లో శిఖరాయ మానం అయింది ”రంగనాధం ”.జాను తెనుగు వైభవం తో పండిత ,పామర రంజక మైంది .
                                                                                 
                                                                                                    గౌరన
                   గౌరన నవనాధ చరిత్ర ను ,హరిశ్చంద్ర చరిత్రను ద్విపద కావ్యాలుగా రాశాడు .తెలుగు దేశం లో హరిశ్చంద్ర కధ గౌరన రాసిన కధ ను బట్టే ప్రచారం లోకి వచ్చింది ..కరుణ రస ప్రధానం గా సాగింది .
                                                                          తాళ్ళ పాక కవులు 
                   అన్నమయ్య అని పిలువ బడే అన్నమాచార్యులు ”శృంగార మంజరి ”అనే ద్విపద కావ్యం రాశాడు .ఈయన కుమారుడు చిన్నన్న మాత్రం ద్విపద కవుల్లో అందులోను శ్రీ వైష్ణవ సంప్రదాయ కవుల్లో పేరు పొందాడు .పరమ యోగి విలాసం ,అష్ట మహిషీ కల్యాణం ,ఉషా కల్యాణం చిన్నన్న గారి పెద్ద రచనలు .అన్నమయ్య చరిత్ర ను ద్విపద కావ్యం గా రాశాడు .అందుకే” చిన్నన్న ద్విపద కేరుగును ”అనే పేరు వచ్చింది .అన్నమయ్య పడ కవితలు రాసి పడ కవితా పితామహు డైనాడు .తెలుగు లో పడ కవితలకు ఆద్యుడు అన్నమయ్య .
                                                                          ద్విపద కవిత్రయం 
            ఆది పర్వం నుండి ద్రోణ పర్వం దాకా ,(సభా పర్వం లేకుండా )ఆరు పర్వాల భారతాన్ని బట్టే పాటి తిమ్మన ,సభా పర్వాన్ని బాల సరస్వతి ,కర్ణ పర్వం నుంచి స్వర్గా రోహణ పర్వం వరకు ఆత్కూరి సోమన అనే కవిత్రయం రచించటం కొత్త మార్గమే అయినా ,అది” ఆది కవిత్రయాన్ని ”ఆదర్శం గా గ్రహించటమే అవుతుంది .ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది .తిమ్మన అరణ్య పర్వాన్ని సంగ్రహం గారాస్తే ,సోమన ఆ పర్వాన్ని సంపూర్ణం గా రాయటం విశేషం .భారత అరణ్య పర్వాన్ని నన్నయ్య గారు కొంత రాసి వదిలేస్తే ఎర్రా ప్రగడ పూర్తి చేసి నట్లు ఇక్కడ సోమన ఆపని చేయటం తమాషా .అక్కడా ఇద్దరే ,ఇక్కడా ఇద్దరే ..అదీ అరణ్య పర్వ విషయం లోనే అలా జరగటం తమాషా గా వింతగా ఉంది .ఎర్రన చేసింది పూరణం .ఇది సర్వ సమగ్రత్వం ..ఒకే పర్వాన్ని ఇద్దరు రాయటం మనకు కన్పించే నవ్యత్వం .తరిగొండ వెంగమాంబ ”రాజ యోగ సారం ”అనే ద్విపద కావ్యం రాసి ,మహిళా కవులకు ప్రోత్సాహాన్నిచ్చింది ..బసవ పురాణం నుంచి ఇప్పటి దాకా ద్విపద ధార అవిచ్చిన్నం గా కొన సాగింది ..
                                                                             శ్రీ నాద కవి సార్వ భౌముడు 
        కనకాభి షేకం తో పాటు పడ రాని కష్టాలలు పడ్డ కవి శ్రీ నాధుడు .”చాటువు ”కు ప్రాణం పోశాడు .ప్రియమైన అందమైన మాటే చాటువు ..ఎన్నో చాటువులు ఆయన పేరు మీద చలామణి లో ఉన్నాయి .”పద ప్రసిద్ధ ధారా ధుని ”అని పించు కొన్నాడు .ఆయనది ప్రవాహ లక్షణ కవిత్వం .చాలా కావ్యాలను ,చాలా రకాలుగా రాసి వైవిధ్యం లో కొత్త దారి తొక్కాడు శ్రీ నాధుడు .మంజరీ ద్విపద లో ”పల్నాటి వీర చరిత్ర ”రాశాడు .చాలా క్షేత్రాలను స్వయం గా దర్శించి ,ఆయా క్షేత్రమహాత్మ్యాలను కావ్యాలుగా రాశాడు .”క్షేత్ర మాహాత్మ్యం ”అనే కొత్త కావ్య శాఖను ఆరంభించాడు ..ప్రఖ్యాత ఆలన్కారికుడు కుంతకుడు చెప్పిన ”వక్రోక్తి ”ని తెలుగు లో అద్భుతం గా పండించిన వాడు శ్రీ నాధుడు .ఇంతకీ వక్రత అంటే వక్ర మార్గం కాదు .విషయాన్ని చెప్పటం లో ,పద ప్రయోగం లో ,సమాస కూర్పు లో ,అలంకారాలను కూర్చటం లో ,భావ చిత్రణ లో ,,చమత్కారం గా ఎవరూ చెప్పని కొత్త విధానం లో అందం గా చెప్పటమే వక్రతఅననిర్వచించారు పెద్దలు .శివుని శిరస్సు పైనున్న చంద్ర వంక ,చండికా దేవి బిగువైన స్తన ద్వయం ,సరసత్వం గల కావ్యాలే చిరకాలం జీవిస్తాయని శ్రీనాధుని నమ్మకం .తనది ”కర్నాట భాష ”అన్నాడు .అంటే చెవికి ఇంపైన భాష అని అర్ధం .ఈ మాటను కూడా కొత్తగా ,మొదటి సారిగా వాడిన కవి శ్రీనాదుడే .ఉక్తి చమత్కారం ఉంటేనే కావ్యానందం లభిస్తుంది .శివుని పై కాశీ ఖండం , ,,భీమ ఖండం ,హర విలాసం ,వంటివి రాసిన పరమ మాహేశ్వర భక్తుడు .పేరు లో శ్రీ మహా విష్ణువు ఉన్నా .ఆ విధం గా హరిహరాద్వైతి అనవచ్చు .ఆయన శివుని తో తిరగాడే చేలికానిగా ,కన్పిస్తాడు .దైవం గా శివున్ని దూరం గా ఉంచలేదు .అనేక క్షేత్రాలు తిరగటం వల్ల అఖండత్వానికి ,సమైక్యత కు స్పూర్తి గా నిలిచాడు .ఇదీ అప్పటికి కొత్త సంగతే .రామ రాజా భూషణుడి మాటల్లో చెప్పా లంటే ”వాగను శాసనుడు అనే బ్రహ్మ యే నన్నయ -ఆది శేషుడు తిక్కన -సిరికి హరి అయిన విష్ణు మూర్తే శ్రీ నాధుడు .-సోముడు చంద్రుడు ,భాస్కరుడు ఆదిత్యుడైన కవి భాస్కరుడు ,”తెలుగు లో కావ్యాన్ని నన్నయ సృష్టిస్తే ,తిక్కన నిల బెడితే ,శ్రీనాధుడు కాచి రక్షించాడని భట్టు మూర్తి గారి భావన .వీరితో పాటు సోమన ,భాస్కరుడు చంద్ర సూర్యుల్లా ప్రకాశింప జేశారట .”శ్రీనాదుడిని -యుగ కర్త ”అన్నారు .ఏ యుగం ?అని ప్రశ్నిస్తే ”కావ్య యుగం ”అని సమాధానం .ఇదే ప్రబంధ పూర్వ యుగం కూడా .ఇక్కడి నుంచే కవిత్వం అనువాద బాట వదిలి ప్రబంధ రచనకు మార్గం చూపించింది ..ఎంతో మంది కవులకు శ్రీ నాధుడు ఆదర్శం .హర్షుడు రాసిన నైషద కావ్యాన్ని తెలుగు లో ”హర్ష నైషధం  ”గా తన ప్రతిభా పాటవాలతో రాశాడు .దీని లో శ్రీనాధుడు కవితా విశ్వ రూపం దర్శనమవుతుంది .గౌడ డిండిమ భట్టు కంచు దక్క ను కూడా పగుల కొట్టి రికార్డు సృష్టించాడు .కనకాభి షేకం చేయించుకొన్న తొలి తెలుగు కవి .స్వీయ వ్యక్తిత్వాన్ని కవిత్వం లో సీస పద్య నిర్మాణం లో చూపించాడు .సీసం అంటే శ్రీనాదుడే అనే ముద్ర పడింది .దానిపై సాధికారికత తో పాటు ”సరి లేరు నా కెవ్వరూ”అని పించు కొన్నాడు కవి సార్వ భౌ ముడైన శ్రీ నాధుడు .

సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -05 -12 .—కాంప్-అమెరికా 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.