తిక్కన భారతం – 26 శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -4

                తిక్కన భారతం -26
                     శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -4
వేదాలు కర్మ చేయమని ఒక సారి ,కర్మను పరిత్య జించమని ఇంకో సారి చెబుతాయి .దీన్ని ఎలా అర్ధం చేసు కోవాలి అన్న ధర్మ రాజు ప్రశ్నకు భీష్మునిసమాధానం –”కొందరు కర్మాచరణ మభి -నందిం తురు  ,వారలకు జనన మరణములం –బొందక ,పోరాదు ,మహా –నందము  బొందుదురు నిత్య నైష్కర్మ్య పరుల్ ”–”చిత్త శుద్ధి మాత్ర జేసే నేనియు, నవి –ద్యాత్మకం చూవె , యరయ,గర్మ -మది ,దోరంగు తమ్చితాత్మ విద్యాత్మక –ధర్మ మది య మోక్షదంబు సుమ్ము ”అని కర్మాలను చేయటం లో ఉన్న ధర్మ సూక్ష్మాలను చెప్పాడు .”ఫలములు గోరక ,కర్మం-బులు నడపుచు ,వాని విమల బోధాగ్ని హతిం –బొలియించుచు ,నిర్ద్వందత –నెల కొనునే కాంతి జనులు నిను గండ్రు హరీ ” అని ఆచరణ సాధ్య మైన కర్మ సిద్ధాంతాన్నే చెప్పాడు .ఫలా పేక్ష లేకుండా చేసే సత్కర్మ లన్ని మోక్ష కారకాలే అవుతాయి .ఎవ రైనా ఎలా ప్రవర్తించాలో ,చాలా స్పష్టం గా వివ రించి చెప్పాడు .సూక్ష్మ ధర్మా లనన్నిటిని రాశి గా పోశాడు .ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ఈ పర్వాలు చక్కని సోపాన మార్గాలు .జీవ బ్రహ్మ ల ఐకమత్య తకు విశుద్ధ మార్గాలు .కర్మ చేసే వారికి జనన మరనాలుంటాయి .అయితే నిష్కామ కర్మ చేసే వారు మహానందాన్ని పొందుతారు .
” జనులకు గీడు రోయక, యజస్రము ధర్మ రతిం జరించి ,స -జ్జన ,గురు పూజనంబులు సత్య హితోక్తులు దీన పోషణం –బున ,నాటిది ప్రియత్వమును ,భూరిత దయార్ద్ర తయుం గలట్టి వా–రనిమిష లోకములని యాత్మ నేరుగుము మేనకాత్మజా ”ఎంత సూక్ష్మం గా స్వర్గానికి చేర గలమో చెప్పాడు -ఏమీ లేదు -ప్రజలకు కీడు చేయ కుండా ఉండటం ,ఎప్పుడు నీ కు విధించిన మార్గం లో నడవటం ,మంచి వాళ్ళను గురువులను పూజించటం ,సత్యాలు మంచి మాటలు వారి నుండి గ్రహించటం ,ఆపదలో దీన స్తితి లో ఉన్న వారిని ఆదరించటం ,అందరి తో ప్రియం గా ప్రవర్తించటం ,సర్వ భూతాల మీద దయ కలిగి ఉండటం స్వర్గానికి మార్గాలు .
”పరుసని పల్కు ,బొంకులగు పలుకులు ,నన్య ధనాభి లాష ముం –బర వనితావిలోలతయు ,బాంధవ సజ్జన విప్రియమ్బు  ,దు –శ్చరితులతో డి మైత్రి యును ,సంతత ధర్మ రతాభ్యసూయయుం –గలి,ని భయాన ఘోర నరకంబున కేగేడి వారి చిహ్నంల్ ”అంటే –పరుష మైన మాటలు ,అబద్ధాలు ఇతరుల ధనం పై ఆశ ,ఇతర స్త్రీ ల మీద వ్యామోహం ,బంధువులకు మంచి వారికి కీడు చేయాలనే తలంపు ,చెడ్డ వారితో స్నేహం ,ఎప్పుడూ ధర్మానికి విరుద్ధం గా ఆలోచించటం ధర్మ వ్యతి రేక పనులు చేయటం కలి కాలం లో ఘోర నరకం పొందటానికి కారణాలు అవుతాయి .ఇంత క్రిస్టల్ క్లియర్   గా మంచి చెడు ల జ్ఞానాన్ని విడమర్చి చెప్పాడు .ముక్కు మూసుకొని తపస్సు చేయ్యనక్కర లేదు .అరణ్యాలకు వెళ్లి గడ్డాలు మీసాలు పెంచి జపతపాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టక్కర లేదు .సంసార జీవితం లో ఉంటూనే సర్కార్మా చరణ  ,నిష్కామ జీవితం లోనే స్వర్గ ప్రాప్తి కలుగు తుంది . .జప తాపాలు చేసి కష్టపడ క్కర లేదు .మంచి పనులు చేస్తే మోక్షం, చెడ్డ పనులు చేస్తే నరకం వస్తాయి .ఈ విధం గా వివిధ ధర్మ శాస్త్రాలలో చర్చించ బడిన విశిష్టార్దాలన్నిటిని సర్వజనులకు అర్ధమయ్యే టట్లు ,సిద్దాంత రూపం గా ,ఆంద్ర మహా భారతం లో ప్రతి పాదించ బడ్డాయి .దీని విశిష్టత ను బట్టే ఆంద్ర భారతం విజ్ఞాన వ్యాప్తికి ఉత్కృష్ట సాధనం గా నిలిచింది .
దీని తో ధర్మ సూక్ష్మ విచారణ పూర్తీ అయింది .దీని తర్వాత చివరి పర్వాలలోని ఆంతర్యాన్ని ,పరమ ప్రయోజనాన్ని తెలుసు కొందాం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –4-8-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to తిక్కన భారతం – 26 శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -4

  1. శ్రీకాంత్ గుమ్మ's avatar శ్రీకాంత్ గుమ్మ says:

    నాకు కవిత్రయం రచించిన ఆంధ్ర మహా భారతం పుస్తకం కావాలి. వేల ఇచ్చి పుచ్చుకోమన్న సంతోసమే.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.