జన వేమన –2 బతుకు లో ఈదిన పద్యాలు

  జన వేమన –2 బతుకు లో ఈదిన పద్యాలు 

వేమన పద్యం లో మకుటాన్ని వది లేస్తే ,మిగిలిన మూడు పాదాల్లోనే చెప్పాల్సిన భావాన్ని మొత్తం చెప్పాడు .ఆయనది ప్రజల భాష .వాడుక లో ఉన్న మాటలనే ఉపయోగించాడు .మాన్దలీకాలకు పెద్ద పీట వేశాడు .సూటిగా ,సంక్షిప్తం గా ,చెప్పాడు .జీవితం లోంచే ఉపమానాలు ఎన్ను కొన్నాడు .మంచి గుణం ఉన్న భార్య ఉంటె ఇల్లే స్వర్గ సీమ అన్నాడు .భౌతిక సుఖం స్వర్గం కంటే ఎక్కువ అన్నాడు .”సుగుణ వంతు రాలు సుదతి యై యుండిన -స్వర్గ మేటి కయ్య సంసారి కింకను అని వ్యంగ్య వైభవాన్ని వవింగ డిం చాడు .ఇంటికి దీపం ఇల్లాలే నంటూ ”దేవి యున్న ఇల్లు ,దేవార్చన గృహంబు ”అని కీర్తించాడు .స్త్రీ కి విద్య చాలా అవసరం అన్నాడు .”స్త్రీ లకెల విద్య ,బాలురకే గాని -యనెడి మాట లోక మరసి కాదు –ఆలు ,మగని కెన్న ,నర్ధాంగి యౌ గాదే ”అని ఖచ్చితం గా చెప్పాడు .ఇలా మహిలాభ్య్దయాన్ని ఆ నాదే కోరిన మహనీయ మూర్తి వేమన .
డబ్బున్న వాడికి పిల్ల నిచ్చి ,పెళ్లి చేస్తే ,అమ్ము కొన్నట్లే అవు తుందని ,సమాన మైన వాళ్ళ తో నే వియ్యం మంచి దని హితవు చెప్పాడు .పేదలకు పిల్లనిస్తే బంధం పెరుగు తుందని ,వాళ్లకు కష్ట  సుఖాలు తెలుసు కనుక కాపురం స్వర్ణ గోపురం అవుతుందని భావించాడు .”కలిమి జూచి ,ఇవ్వ ,ఆశ్రయ మిచ్చి నట్లుండు ,–సమున కివ్వ ,మంచి ,సరస గుణము –పేద కివ్వ ,మనువు ,పెన వేసి నట్లుండు ”అని అన్నీ గమనించి చెప్పాడు .కానీ ,ఈ నాటికీ ఆయన మాటను వినే వాడే లేదు .హోదా ,డబ్బు ,ఉద్యోగం ఉన్న వారికే పిల్లను ఇస్తున్నాం .కుటుంబ వ్యవస్థ భద్రత కు చిహ్నం అన్నాడు వేమన .అబద్ధాలతో కొంపలు కూల్చే వాది కంటే ,కళ్ళు తాగే వాడే నయం అన్నాడు .పొదుపు గా మాట్లాడాలి .మాట వల్ల ఆయె గాయాన్ని మాంచటం చాలా కష్టం .”ఇనుము విరిగే నేని ఇనుమారు ,ముమ్మారు –కాచి ,యతుక వచ్చు కమ్మరీడు –మనసు విరిగే నేని మరి ,యంట  నేర్చునా ?”అని ప్రశ్నిస్తాడు .రంగు ,కులం ,బట్టి కాకుండా ,మనసు ను బట్టి విలువ నివ్వాలి అని చెప్పాడు .”మిరప గింజ చూడ మీద నల్లగ నుండు –కొరికి చూడ లోన చురుకు మనును –సజ్జను లను వారి ,సార మిట్టుల నుండు ”అని బాగా పోల్చాడు .తెలివి తేటలు ఎవరి దగ్గర ఉన్నా ,గౌరవించాలి .”పిన్న చేతి దివ్వె పెద్ద గా వెలగదా ?”అని పోలిక చెప్పాడు .శ్రమ లో నుంచే అన్నీ రావాలి .”శ్రమయేవ జయతే ”అన్న భావాన్ని ”భూమి లోన పుట్టు ,భూసార మెల్లను –తనువు లోన పుట్టు తత్వ మెల్ల -శ్రమము లోన పుట్టు సర్వము తానేను ”అని పద్యం లో వివరించాడు .
సులభం గా రాత్రికి రాత్రే ధన వంతు లవా లన్న దురాశ పనికి రాదు .అన్నీ ఉన్నా కరువు వస్తూనే ఉంటుంది .దీనికి పేరాశేముఖ్య కారణం .”ఉప్పు ,చింత పండు ,ఊరిలో నుండగా –కరువదేల వచ్చే కాపులార ?తారకంబెరుగరో ,తగరంబు నేరుగరో ”అని సుద్ది చెప్పాడు .తారకం అంటే ”ఆర్సెనిక్ సల్ఫైడ్”,తగరం అంటే ”టిన్”(తుత్తు నాగం ).ఈ రెండిటిని కలిపితే బంగారం వస్తుందని ”రస వాదులు ”భావించారు .వేమన గారూ ,ఈ మత్తులో పడి చెయ్యి కాల్చుకొన్నాడు పాపం .అదే ”ఆల్కెమీ ”.జ్ఞానోదయం అయిన తర్వాతే గా ఎవరైనా ఇతరులకు చెప్ప గలిగేది .మన వేమనా అంతే .తేనె టీగ మనకు ఆదర్శం కావాలి .తాను ఎంతో కష్ట పడి కూడా బెట్టినమధుర మైన  తేనె నుఇతరులకు పంచి ఇచ్చే ఔదార్యం దానికి ఉంది .ధనానికి మనం trusty గా ఉండాలి . గాంధి గారు కూడా తాతా ,బిర్లా లకు ఇదే సూచన చేశారు .”ధనం కూడా బెట్టి ధర్మంబు సేయక –తాను దినక ,లెస్స దాచు గాక –తేనె టీగ గూర్చి ,తెరువరి కియ్యదా ?”అని బోధించాడు .అప్పు చేసి ,పప్పు కూడు వద్దన్నాడు .తిండి లేక పోతే చదువు రాదు అని చెప్పాడు .”గ్రాస మింత లేక కడు కష్ట పడుచున్న –విద్య ఎలా నిలుచు ,వెడలు గాని ,–పచ్చి నీళ్ళ కుండనీళ్ళు పట్టిన నిల్చునా ?”అని సార్ధకం గా చెప్పాడు .మన ప్రభుత్వాలు మధ్యాహ్న భోజ నాలు, సంక్షేమ హాస్టల్లు అందుకే ప్రారంభించాయి .చిత్త శుద్ధి లేకుండా శివ పూజ వద్దని ,ఎదుటి వారి సొమ్ము ఎల్లరికి తీపి అని ,కూడూ ,గుడ్డా తాను కోరునా దేవుడు ?అని ఎన్నో చేదు నిజాలను వెలి బుచ్చాడు .ఇవన్నీ సుద్దులు ,బుద్ధులు .అనుభవ సారాన్ని కరతలా మలకం  చేసి అందించాడు వేమన్న .ఆయన భౌతికం గా 1725 లో మరణించినా ,జన హృదయాలలో నిలిచే ఉన్నాడు .
 చిరంజీవి వేమన 
వేమన శ్రీ రామ కృష్ణ పరమ హంస అవతారం అని కొందరు అంటే ,కారల్ మార్క్స్ ప్రతి రూపం అని కొందరు భావించారు .నాలుగు వందల ఏళ్ళు దాటినా వేమన ప్రభావం మన మీద ఉంది .ఆయన నిత్య కవి ,సత్య కవి ,చిరంజీవి అయాడు .ప్రజా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించాడు .చెరగని ముద్ర వేశాడు .ఆ మహా మహుని నిత్యం స్మరిస్తూనే ఉన్నారు .ఆంద్ర మహా జనం వేమన ”త్రిశత జయంతి ”వైభవం గా జరుపు కొన్నారు .1929నుంచి శ్రీ మొవ్వ శ్రీనివాస రెడ్డి వేమన జయంతిని ప్రతి ఏడాది జరుపు తున్నారు .తమిళ నాడు లోని ”హోసూరు ”పట్టణం లోని ”తెలుగు సాంస్కృతిక సమితి ”వేమన జయంతి ని భక్తీ శ్రద్ధలతో నిర్వహిస్తోంది .వేమన ఆశ్రమాన్ని స్థాపించింది .వేమన దేవాలయాలు వెలిశాయి .రాయల సీమ లో ”కటారు పల్లె ”లో వేమన సమాధి ,ఆలయం ఉన్నాయి .రెడ్డి ప్రభువే అయినా వేమా రెడ్డి అనే నిజ నామం ఉన్నా అఆత్మీయం గా అందరు ”వేమన్నా ”అనే ఒక అన్న గా పిల్చుకోవటం సంస్కారం .ఆయన కుల ,మతా లకు అతీతుడు .ఆత్మ దర్శనం పొందిన వాడు .జ్ఞానాగ్ని దగ్ధుడు .అహం బ్రహ్మాస్మి కి అసలైన రూపు ..అందుకే ఆయన ప్రతిభా విశేషాలను వివ రించే ఒక పద్యాన్ని ఒక కవి కై మోడ్పు గా సమర్పించాడు -”ఓ కవీ !నీదు పద్దియ మొక్క మారు –మనసు దీర ,జక్కగా వినిన నరుడు –మరల జన్మము లో ,దాని మరచి పోక –సమయ మొచ్చిన జదువును ”సామెత ”గ ను ”.
     చిట్టి కవులు 
ప్రజా కవి వేమన తర్వాత సుమారు 80సంవత్స రాల వరకు రెడ్డి కవులెవరూ  చరిత్ర పుటలకు ఎక్కి నట్లు కనీ పించదు .ఒక వేళ ఒకరిద్దరున్నా ,వారి గ్రంధాలు అముద్రితాలో అలభ్యాలో అయినాయి .వెతకగా ,వెతక గా శ్రీ బేడిరాఘవ రెడ్డి ఒంటరి గా కనీ పిస్తున్నాడ్రు .ఈయన కుంఫిణీయుగం నాటి వాడు .1800ప్రాంతం వాడని ఆరుద్ర తేల్చాడు .తెలంగాణాలో  ”దమ్మాల పేట ”కు చెందిన వాడు .ద్విపద కావ్యం గా ”పూర్వ రామాయణం ”రాశాడు . ఆ రచన దాదాపు శిధిలా వస్త లో ఉందట .
ఈ కాలం లోనే ”దేశ ముఖ ”గా ఉన్న తూము రామ చంద్రా రెడ్డి ”అల మేలు మంగా పరిణయం ”అనే నాలుగు ఆశ్వాసాల కావ్యం రాశాడు .ఈ కవి గారి గురువు ఉత్పల రంగా చార్లు గారు .ఇది పుక్కిటి పురాణం .వై కుమ్తంలో శ్రీ దేవికి ,శ్రీ మహా విష్ణువు కు వాగ్వాదం జరిగిందట .ఆయన అలిగి, తూము వారి సీమ లో ఒక కొండ గుహ లో దాక్కున్నాడట .కవి గారు ఆయన్ను చూడ టానికి వెళ్లాడు .స్వామి తన గోడు అంతా భక్త కవికి వెల్ల బోసుకొన్నాడు .ఇదంతా తన కావ్యం లో గర్వం గా రాసుకొన్నాడు కవి .ఈ కవే స్వామి వార్కి ఒక ఆలయాన్ని కట్టిస్తే ,దివాన్ గారు దానికి ధూప దీప నైవేద్యాలకోసం ఒక గ్రామాన్ని రాసి ఇచ్చాడట .కవి గారి కుమారుడు పరశు రామ రెడ్డి కూడా తండ్రికి తగ్గ కొడుకే .అలమేలు మంగా పరిణయం ‘కావ్యం రాశాడని ఆరుద్ర ఉవాచ .
పాక నాటి గణ పతి రెడ్డి దేశీ రచన లో ”కృష్ణ విలాసం ”అనే యక్ష గానాన్ని రాశాడు .దీనిలో శ్రీ కృష్ణ లీలల్ని మధురం గా వర్ణించాడుఅని డాక్టర్ ఎస్ వీ .జోగారావు తన ”యక్ష గాన ప్రక్రియా రూపాలు ”లో వివరం గా రాశారు .అరవీటి రాజుల కాలం లో ఉన్న కామినేని ఎల్లా రెడ్డి ”లింగ పురాణం ”రాశాడు .గుంటూరు జిల్లా ఫ్రెంచి వారి అధీనం లోకి వచ్చిన తరువాత రాయప్ప రెడ్డి వంశం లో ఓబుల రెడ్డి ,అనంత రెడ్డి అనే అన్న దమ్ములు భక్తా వాడ లో ఉండే వారట .విద్యా ప్రసంగాలు చేయించే వారు .కవులకు ఆశ్రయం కలిగించారు .పింగళి ఎల్లన్న అనే కవి తో ”జీవ నాద స్వామి ”కధ ను కృతిగా రచింప జేసి ,రాయప్ప రెడ్డి అంకితం పుచ్చు కొన్నాడు .రాయప్ప రెడ్డి, కవికి ”వాక్య గ్రంధి ”ఇచ్చాడట .దానితో కవి  ”తోభ్య చరిత్ర ”రాశాడు .ఇది క్రైస్తవ కావ్యం .’సర్వేశ్వర చరిత్ర ”గా ప్రసిద్ధ మైంది .అంటే రెడ్డి వారు తమ కవుల చే క్రైస్తవ గ్రంధ రచనకూ శ్రీ కారం చుట్టిన్చారని తెలుస్తోంది .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-8-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.