నాదారి తీరు -4 పై చదువు –ఉద్యోగ ప్రయత్నాలు

నాదారి తీరు -4

 

             పై చదువు –ఉద్యోగ ప్రయత్నాలు

 1956-60 మధ్య నాలుగేళ్ళలోఇంటర్ ,డిగ్రీ లు పూర్తీ అయాయి .ఈ నాలుగేళ్ళలో రెండు మూడు సార్లు కృష్ణా నదికి తీవ్రం గా వరదలు వచ్చాయి .గడ్డి వాములు చెట్లు పెద్ద పెద్ద కొయ్య దుంగలు పెద్ద పాములు కొట్టుకోచ్చేవి వీటిని బారేజి దగ్గరకు వెళ్లి చూసే వాళ్ళం .ప్రకాశం బారేజి కట్టక ముందు దాని ముందు ఆనకట్ట ఉండేది దాని మీంచే నడిచి కాని బోట్లలో కాని కృష్ణ అవతలి ఒడ్డుకు వెళ్ళే వాళ్ళం కార్లు లారీలు కూడా పెద్ద పెద్ద పడవల మీదే అవతలి ఒడ్డుకు చేరేవి అవతలి తీరం గుంటూరు జిల్లా సీతా నగరం అంటారు .ఇప్పుడక్కడ శ్రీ జియ్యర్ గారి ఆశ్రమం వేద పాఠశాల ఉన్నాయి ..నాతోపాటు డిగ్రీ చదివిన పురుషోత్తం ఫిజిక్స్ లెక్చరర్ అయ్యాడు .తర్వాత మొవ్వ కాలేజి ప్రిన్సిపాల్ కూడా అయ్యాడు గంగాధర శాస్త్రి సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉద్యగం లో చేరాడు .రాదా కృష్ణ కృష్ణా జిల్లా పరిషత్ లో నాతో పాటు సైన్సు మేస్టర్ర్ గా చేరి చివరికి గండేపల్లి హెడ్ మాస్టర్ గా రిటైర్ అయాడు .హెడ్ మాస్టర్ కాన్ఫరెన్సు జరిగి నప్పుడు ఒక సారి మా ఆతిధ్యం తీసుకొని వెళ్ళాడు .విశ్వేశ్వర రావు జగ్గయ్య పేట లో లెక్కల మేష్టారు అయి తర్వాతా హెడ్ మాస్టర్ అయాడు .మిగిలిన వారి సంగతి పెద్ద గా తెలీదు .ఒక శాస్త్రి ఎల్ ఐ.సి.లో పెద్ద ఆఫీసర్ అయి ఒకటి రెండు సార్లు కనిపించాడు .చిరంజీవులు సినిమా నాతో పాటు క్లాస్ లోపాడిన జి.బి.శాస్త్రి సంగతి పెద్ద గా తెలీదు .

        ఇంటర్ అవగనే ఆ కాలం లో బాపట్ల అగ్రికల్చర్ కాలేజి మీద అందరి దృష్టి ఉండేది నేనూ అప్ప్లై చేశా.దానికి ఇంటర్వ్యు కి పిలిచారు .నన్ను అడిగిన ప్రశ్నలు ‘’వరి ఏయే దేశాల్లో పండుతుంది ?’’నేను తడుము కోకుండా ‘’రష్యా ఇంగ్లాండ్ జెర్మని జపాన్ ‘’అని చెప్పాను వాళ్ళు నవ్వు కొన్నారు .ఇంటికి వచ్చిన తర్వాతా మా నాన్న అడిగాడు .నేను చెప్పాను వరి ఎక్కడ పండుతుందో తెలీని నీకు ఆ చదువెందుకు చలి దేశాల్లో వారి పండదని తెలీదా నీకు ?జెనరల్ నాలెడ్జి ఉండాలి ‘’అని చీవాట్లు పెట్టాడు .నేనేదో పొడి చేశానని కాలర్ ఎగరేసిన వాడిని తప్పు తెలిసి నోరు మూసుకోన్నాను .ఇదీ మన జ్ఞాన సంపద .డిగ్రీ అయిన తర్వాత గంగాధర శాస్త్రి నన్ను కాగజ్ నగర్ కు ఉద్యోగానికి రమ్మని ఉత్తరం రాశాడు అప్పుడు ఉత్తరాలే ఇంకా ఏమీ కమ్మ్యునికేషణ్ లేదు రాను పోను ఖర్చులు కంపెనీ ఏ ఇచ్చింది టిఫిన్ భోజనం కూడా ఏర్పాటయింది .అక్కడి వాతా వరణం ఆ వేడి ఆ నైట్ డ్యూటీలు షిప్టు డ్యూటీలు  విని నాకు నచ్చని ఉద్యోగం అని ఫిక్స్ అయి పోయాను ఉద్యోగం రాలేదు అక్కడ సిల్క్ పాంట్ షర్టు కోసం సిల్కు బట్ట కోని  ఇంటికొచ్చి కుట్టించుకోని చాలా కాలం తొడిగాను .ఇలా ఉద్యోగ ప్రయత్నం కలిసి రాలేదు .

           మా మేన మామ వరుస అయిన అప్పన్న కొండ మామయయ్య జేమ్షేద్పూర్ తాతా స్టీల్స్ లో చీఫ్ కెమిస్ట్ .ఉయ్యూరు వచ్చినప్పుడు నా చదువు గురించి తెలుసుకొని విశాఖ పట్నం ఆంధ్రా యూని వర్సిటి లో రిజిస్త్రార్ మహదేవన్  ఒక  తన స్నేహితుడని నాకు కావాల్సిన బ్రాంచ్ లో ఏం .ఎస్.సి .చదవమని రికమండేషన్ లెటర్ రాసి ఇచ్చి వెళ్ళమన్నాడు .మా నాన్న నన్ను పంపారు వెళ్లి కలిశాను .ఆయన ‘’ఈ ఉత్తరం చూసి నీకు సీటు ఇవ్వాల్సిందే.కాని ఫిజిక్స్ సీట్లు అయి పోయాయి .కావాలంటే జియో ఫిజిక్స్ లో ఖాళీలున్నాయి చేరతా నంటే సీట్ ఇస్తాను ‘’అన్నాడు నేను ఏమీ ఇష్టం చూప లేదు తిరిగి వచ్చేశాను ఈ విధం గా పై చదువు ప్రయత్నమూ బెడిసి కొట్టింది అయితే నాలో ఉపాధ్యాయుడు అవాలనే కోరిక బలం గా వేల్లూను కొన్నది .అది అయితే అమ్మా నాన్న ల దగ్గర ఉండ టానికి వీలు అని నా ఉద్దేశ్యం ఈ విషయం నాలో నేఉంచాను .ఎవరికి చెప్పలేదు .

            ఇంతలో మోహన్ బందరులో బి.ఎస్.సి ఫైనల్ యియర్ చదువు కోసం విజయ వాడ నుండి బందరు హిందూ కాలేజి లో చేరాడు .చకేమిస్త్రి మెయిన్ బాటని జువాలజీ లు ఇతర సబ్జెక్టులు .అక్కడ కాంతా రావు గారనే ఆయన దగ్గర ట్యూషన్ లో చేరాడు .ఒక సారి నేను బందరు వెళ్లాను అక్కడ బుద్ధి రాజు విఠల్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ గారు కనీ పించారు .అలాగే ‘’పొట్టి ‘’అని నేను పిలిచే వల్లూరు రామకృష్ణ కూడా మొహన్ క్లాస్ మేట్ గా ఉన్నాడు .కలగా కృష్ణ మోహన్ అనే తోటల వల్లూర్ అయన కూడా ఏదో ఉద్యోగం లో అక్కడ ఉండి పరిచయం అయాడు ఆయన బాగా పాడే వాడు .ఈయనే ఇప్పుడు టి.వి.లో కనిపించే కృష్ణ మోహన్ ఈయనే నని నా అనుమానం .నన్ను హిందూ కాలేజి లో ఫిజిక్స్ దిమాన్స్త్రేటర్ పోస్ట్ కు అప్ప్లై చేయమని చెప్పారు .ఒక పావుఠాఉ   పేపర్ మీద అప్లికేషన్ రాసి హిందూ కాలేజి ప్రిన్సిపాల్ జంధ్యాల గౌరీ నాద శాస్త్రి గారిని సాయంత్రం నాలుగింటికి కలిశాను .ఆయన నా అప్లికేషన్ చూసి ‘’ఎప్పుడు జాయిన్ అవుతారు /అని అడిగితే ఆశ్చర్య పోయాను ఆయనే మంచి రోజు చూసి జాయినవమని చెప్పారు .రాత్రికి ఇంటికి వచ్చి మా అమ్మా వాళ్లకు చెప్పి మర్నాడో ఆ మర్నాడో వెళ్లి చేరిపోయాను .నాజీతం 108 రూపాయలు నెలకు అని జ్ఞాపకం .

            ఫిజిక్స్ హెడ్ ‘పెద్దసోడా బుడ్డి కళ్ళద్దాలతో చారల పాంటు కోటు వేసుకొనే ఆయన .ఆయన్ను అందర్నీ ‘’డెవిల్‘’గారు అనే వారు .కుటుంబ శాస్త్రి గారు నాకు సీనియర్ అయన ఏం ఎస్ సి చదివి పాస్ అయినా విపరీత మైన ఉబ్బసం ఆయాసం తో బాధ పదుతూఉండేవారు మాట రావటం కష్టం గా ఉండేది కర్మిష్టి .చాలా మంచి వారు నాకు ధైర్యం చెప్పి నిల దోక్కుకోనేట్లు చేశారు .శివ రామ కృష్ణ శాస్త్రి అనే ఫిజిక్స్ లెక్చరర్ చాలా సరదాగా ఉండేవారు చనువుగానూ ఉండేవారు మంచి బోధకులు .కేమిస్త్రి లో ఎర్రటి ఆయన రామ కృష్ణ శాస్త్రి  ఉండేవారు జయ దేవుని అష్టపదులు బాగా పాడే వారు సాయంత్ర వేళల్లో వారింటికి వెళ్లి కూర్చుని కాలక్షేపం చేసే వాడిని మంచి పాటలు జయదేవునివి పాడే వారుఆయన ఇంటి దగ్గరే వి.వి.టోన్ పే అనే లెక్చరర్ వుండే వారు .ఆయన గొప్ప పైంటర్ .చాలా బాగా స్నేహం గా మాట్లాడే వారు .అప్పటికే లబ్ధ ప్రతిష్టులు ..అలాగే గోఖలే అని మా గోఖలే అన్నగారు ఇంగ్లీష్ హెడ్డు .పంచా లాల్చీ తో ఉండే వారు గొప్ప ఉపన్యాసకులని పేరు .ఒకటి రెండు సార్లు ఇంటికి వెళ్లి మాట్లాడాను .వేదాంతం రామ చంద్ర రావు షేక్స్ పియర్ నాటకాల పై అధారిటీ .చాలా ఉన్నత ప్రమాణం గా బోధించే వారు .ఎన్నో చోట్ల కు ఉపన్యాసాలకు వెళ్ళే వారు అలాగే జోగా రావు కూడా ఆంగ్లం లో మంచి బోధకులు గా గుర్తింపు పొందారు .డి/అర/ఎస్/అనే లెక్కల హెడ్ దైతా శ్రీరాములు గారిఅబ్బాయి ఆయనదే కాలేజి ఈయన తమ్ముడు డి.ఎస్.ఎస్.ఆంగ్ల ఉపన్యాసకులు .

             రామణారావు అనే కుర్రాడు తెలుగు హెడ్ మంచి పేరుంది అద్దె పల్లి రామ మోహన రావు గారు ఈ కాలేజిలో లెక్చరర్ గా పని చేశారు ఆయన తండ్రి జానకి రామయ్య గారు కాలేజి లో హెడ్ గుమాస్తా మంచి వారు నాకు బాగా పరిచయం .దుర్గా టాకీస్ దగ్గర పెంకు టింట్లో ఉండే వారు .హిందీ హెడ్ చలసాని సుబ్బారావు గారు మల్లు పంచా మల్లు షర్ట్ తో మల్లె ప్పూవు గా యెర్రని రంగులో ఉండే వారు .అయన గొప్ప వక్త .ఎన్నో పుస్తకాలు రాశారు .బాగా పేరు ప్రసిద్ధి ఉన్న వారు వెంపటి రామయ్య గారు తెలుగు లెక్చరర్ ఆయన తల పాగా చుట్టి ఉండే వారు /.ఆయన్ను ‘’టర్బన్ ‘’గారు అనే వారు .హాస్టల్ ను బాగా నిర్వహించారు

        నేను క్లాసులను బాగా నిర్వహించి మంచి పేరు పొందాను .నాతో పాటు ఇంకో కుర్రాడు శాస్త్రి కూడా చేరాడు అతను బాగా ప్రాక్టికల్స్ చేయించే వాడు ఆ తర్వాతా తను జాతక చక్ర వర్తి అయాడు లెక్చరర్ అయాడు .చిల్లరిగె శ్రీనివాస రావు అనే అతను మాతో పని చేశాడు అతను మంచి కార్టూనిస్టు .భలే సరదాగా ఉండేవాడు .ఎప్పుడు నవ్వించే వాడు కవిత్వమూ రాసే వాడు .మా తమ్ముడు ఉపనయనానికి ఉయ్యూరు వచ్చాడు .అప్పటి నుంచి అతనితో దోస్తీ పెరిగింది అతను తర్వాతా ఆర్.టి.సి.లో చేరి క్రమంగా ఎదిగి డిపో మేనేజర్ గా తిరుపతి ఉయ్యూరు విజయ వాడ లలో చేశాడు .మా పెద్దబ్బాయి పెళ్ళికి బస్ ను ఏర్పాటు చేశాడు బెజవాడకు .

         సెలవల్లో బీచ్ కు వెళ్ళే వాళ్ళం అక్కడ సరదాగా గడిపే వాళ్ళం శ్రీ పాండు రంగ స్వామిని వీలైనప్పుడల్లా దర్శించే వాళ్ళం .రామానాయుడు పెట్ సెంటర్ లో డాబా మీద పైన అందరం కలిసి కొంతకాలం అద్దె కున్నాం .అప్పుడే ‘’చివరికి మిగిలేది ‘’సినిమా వచ్చింది అది వెళ్లి పోయే లోగా చాలా సార్లు చూశాను అందులో మల్లాది పాటలు అణి ముత్యాలు సావిత్రి నటన సుపర్బ్ .రామి నీడుడైరెక్షన్,అశ్వత్థామ సంగీతం  మహా బాగు నాకు ఈ సినిమా తర్వాతే ,ఏ సినిమా అయినా అని పిస్తుంది .పొట్టి మాకు స్దినిమా లకు గైడు .ఇప్పుడే ‘’భార్యా భర్తలు ‘’సినిమా చూశాం .ఎన్నో సార్లు చూశాం .బృందావన్ దియేటర్ లో మంచి సినిమాలు వచ్చేవి .హోటల్ భోజనం మహంకాళి వెంకయ్య మేస్ లో భోజనం చాలా బాగా ఉండేది .హోమిలీ అంటారు అలా ఉండేది బ్రాహ్మణులంతా అక్కడే భోజనం .కొసరి కొసరి వెంకయ్య అక్కగారు వడ్డించి తిని పించే వారు .అక్కడే వెంకయ్యని ఒక సారి చూశాం సువర్ణ సుందరి లో రాక్షసుడు వంటి చాలా వేషాలు వేశాడాయన .బచ్చు పేట పోస్టాఫీస్ దగ్గర ఒక వర్తకుడుందే వాడు .ఆయనకు బాస్కెట్ బాలాంత బుడ్డ ఉండేది దాని మీద పాడ్ పెట్టి రాసుకొనే వాడని అందరు చెప్పుకొనే వారు .

               బచ్చు పేట రామానుజం కూటం దగ్గర వేలూరి వారి ఇంట్లో అద్దేకున్నాం .వాళ్లకి ఒక ఎలిమెంటరి స్కూల్ ఉంది కుటుంబం అంతా అందులో మేస్టార్లు .రాము అని ఆయన కొడుకు మంచి పైంటర్ .గాయకుడు అతని భార్య అప్పటికే ఎస్ ఎస్.ఎల్.సి పాసై టీచర్ గా పని చేస్తోంది మా ఇంటి అవతలే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా కాస్త్లి గా ఉండేది మంచి కార్య క్రమాలు జరిగేవి .పూజారి గారు మందు కోడతారనే పుకారు ఉండేది .ఎప్పుడు తాంబూలం తో ఉండే వారు .నేను మోహన్ వంట చేసుకొనే వాళ్ళం తాళం వేసి గుమ్మం పైన గూడు లో ఉంచి వెళ్ళే వాళ్ళం ఒక సారి అలా వెళ్తే ఇంట్లో దొంగలు పడి నా ఎస్.ఎసి.సి సర్టిఫికేట్ కొంత డబ్బు దోచుకు పోయారు డూప్లికేట్ సర్తి  ఫికేట్ తెప్పించటానికి గురువు గారు ప్రసాద శర్మ గారుసాయం చేశారు .రెండో ఏడాది కూడా ఉద్యోగం ఇస్తామన్నారు వేసవి లో జీతం లేదని జ్ఞాపకం .మొత్తం మీద ఒక ఏడాది భలే జాలీగా గడిచింది లెక్చరర్ల తో కలిసి మొదటి సారి క్రికెట్ ఆడాను మొదటి సరిగా టెన్నిస్ కూడా ఆడాను ఈ రెండిటిలో ప్రిన్సిపాల్ గారు మంచి ప్రావీణ్యం ఉన్న వారు .సభలు చేసే వారు  రాదా కృష్ణన్ గారిని జాతీయ కళా శాలలో చూశాను . దైతా శ్రీ రాములు గారు నేను పని చేస్తున్నప్పుడే చని పోయారు అందరం వెళ్లి చూసి వచ్చాం .భట్టు గారు కేమిస్త్రి లెక్చరర్ .ఆయనకు విజయ వాడ రోడ్డు లో ఒక హోటల్ ఉండేది ఉదయం తొమ్మిదిన్నర దాకా హోటల్ సాయంత్రం అయిదున్నర నుండి హోటల్ లో ఉండేవారు భట్టు గారి హోటల్ అని బాగా ప్రసిద్ది అన్ని బాగా ఉండేవి .అయన ప్రత్యెక శ్రద్ధ తీసుకొనే వారు .

              రామ కృష్ణ నన్ను ,మొహన్ని ‘’బాబాయ్ ‘’అని పిలిచే వాడు .అతన్ని మేము ‘’పొట్టి ‘అనే పిలిచే వాళ్ళం .అతని తండ్రి ఉయ్యూరు కే.సి.పి.లో టైపిస్ట్ .అతని చెల్లెలు ఉయ్యూరు లో నాదగ్గర ట్యూషన్ చదివింది అతని అక్క ఒక సెకండరి మేస్తర్ భార్య .మంచి కుటుంబ సంబంధాలు మెయింటైన్ చేశాము .బుద్ధి రాజు విఠఠల్ ఇల్లు మా ఇంటిదగ్గరే బందర్లో తరచు వాళ్ళింటికి వెళ్ళే వాళ్ళం వాళ్ళమ్మ గారు చాలా మంచిది .అతని అన్న రాజ హంస విద్యా శాఖ లో ఉద్యోగి అతని భార్య ఉయ్యురులో ఆదిరాజు శ్రీ రాములు గారి అమ్మాయి మా క్లాస్ మేట్. విఠ ల్ మంచిమాట కారి  ఒక పన్ను  మీద ఇంకో పన్ను ఎక్కి తమాషా గా ఉండేది అన్నీ తెలిసి నట్లే మాట్లాడే వాడు డిగ్రీ ఏదో రకం గా పాసై ఎన్నో ఉద్యోగాలు చేసి ఏదీ కలిసి రాక సబ్బులు తయారు చేసి అమ్మేవాడు .మా ఇంటికి ఉయ్యురు కు తరచుగా వచ్చే వాడు .రామ కృష్ణ కూడా అన్నీ చేసి చివరికి హైదరాబాద్ లో హేచ్ ఏం,.టి.లో పని చేశాడు .కనీ పించి దాదాపు ముప్పయి  ఏళ్ళు అయి ఉంటుంది .ఇలా ఒక ఏడాది బందర్లో ఆడుతూ పాడుతూ దిమాన్స్త్రేతర్ ఉద్యోగం చేశాను ఇంశార్ట్ వేయటం అప్పుడే అల వాటైనది .

                    విశాఖ లో ఉద్యోగం

              డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇంస్ట్రక్షన్-హైదరా బాద్ కు  ఒక పావు పేజి మీద నా అర్హతలను తెలియ జేస్తూ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వమని అప్లికేషన్ పెట్టాను . పిచ్చి రోజులు వెంటనే విశాఖ పట్నం మెడికల్ కాలేజి లో ఫిజిక్స్ శాఖ కొత్తగా ఏర్పాటు చేసి వెంకటేశ్వర్లు అనే గుంటూరు ఆయన్ను ఫిజిక్స్ లెక్చరర్ గా నన్ను దిమాన్స్త్రేటర్ గా అప్పాయింట్ చేస్తూ ఆర్డర్ పంపారు మంచో చెడో వెళ్లి చేరాను మిసెస్ ఏ.వి.యెన్.కాలేజిఎడురుగా డాబామీద రూమ్ తీసుకొని నలుగురం ఉండే వాళ్ళం అందులో రెడ్డి గారొకరు నేను ఒక ఆక్సిలరి హెల్త్ వర్కర్ బ్రాహ్మణుడు .భలే సరదా గా గడిపాం .భోజనం హోటలో లో ఏదీ రుచించేది కాదు ఉదయం టిఫిన్ బన్ను టీ .కాలేజి లో క్లాసులు బానే ఎంగేజ్ చేసి పేరు పొందాను వెంకటేశ్వర్లు గారు కమ్మ వారు చాలా ఆప్యాయం గా ఉండే వారు కొత్తగా వచ్చిన పరికారాలన్ని సర్దుకోవటం ప్రాక్టికల్స్ చేయించటం  అవసర మైతే క్లాస్ లకు వెళ్లి ఫిజిక్స్ బోధించటం .నా బోధనా ఇంగ్లీష్ లోనే సాగేది జాగ్రత్త గా ఉండే వాడిని .స్టూడెంట్స్ కు నేనంటే అభిమానం .చాలా గౌరవం చూపించే వారు సాయంత్రాలు ఆడ మగా కలిసి ఎంజాయ్ చేయటం తమాషా గా ఉండేది .చూస్తూ నవ్వుకొంటూ సాగే వాళ్ళం రెడ్డి గారు కేమిస్త్రి లెక్చరర్ .కందరికీ ఒకటే విశ్రాంతి రూమ్ ఉండేది .పద్మావతి గారు అనే లెక్చరర్ చాలా ఆప్యాయం గా పలకరించే వారు నాకు పెద్దరికం ఇచ్చే వారు నాకు అప్పుడు చేవులకు పోగులున్దేవి .ఎవరు ఏమీ ఏది పించటం కాని ,చులకన గా చూడటం కనిఉండేది కాదు ఆమె ఎన్నో విషయాలు చెప్పే వారు నా సినిమా డైలాగులు పడే పడే చెప్పించుకొనే వారు మాకు అక్క లాగా ఉండే వారు రమణ మూర్తి అనే కేమిస్త్రి లెక్చరర్ చాలా మంచి వాడు మంచి జోస్తీ గా ఉండే వాడు మంచి పేరు తెచ్చుకొన్నాడు .వీళ్ళందరితో బాగా గడిచి పోయేది ఆదివారాల్లో డాబా గార్డెన్ దగ్గర హోటల్ కు వెళ్లి మంచి భోజనం చేసే వాడిని ఇక్కడ గోంగూర తో మజ్జిగ పులుసు భలే రుచిగా ఉండేది .

             ఆది వారాల్లో నూకల సత్య వతి గారింటికి వెళ్ళే వాడిని సిటీ బస్ లో ఆమె అమ్మకు గురువు లాంటిది మా నరసింహ మూర్తి డాక్టర్ గారి చెల్లెలు ఆమె కొడుకే ప్రసన్న డాక్ యార్డ్ లో ఉద్యోగం నన్ను ఎంతో ఆప్యాయం గా చూసుకొనే వారు .ప్రసన్న భార్య మా డాక్టర్ నరసింహ మూర్తి గారమ్మాయే . .అక్కడికి వెళ్తే మా స్వంత ఇంట్లో ఉన్నట్లుండేది .ఒక వారం విశాఖ అప్ లాండ్ లో ఉన్న గుండు సుబ్రహ్మణ్య దీక్షితుల గారింటికి వెళ్ళే వాడిని ఈయనే తర్వాత సూరి నరసింహం చెల్లెలు అన్నపూర్ణ భర్త యాడు .ఆ అమ్మాయి నా శిష్యురాలు కూడా మన్యం గారు తమ్ముడు వల్లీశ్వర్ ఇసుక పల్లి బ్రహ్మం మొదలైన వారు రెండు గదుల ఇంట్లో వర్సిటి కి దగ్గర గా ఉండే వారు వాళ్ళ నాయనమ్మ వీరికి వంట చేసి పెట్టేది .బాగా వా అఆవిడ ఒక సారి రిక్షాలో ఆశు పత్రికి వెళ్తూ బోల్తా పది అక్కడి కక్కడే చని పోయింది . .అక్కడే భోజనం చేసి రాత్రికి రూమ్ కు చేరే వాడిని .ఒక సారి ప్రసన్న నౌకాశ్రయం నుండి ఒక నౌక ను సముద్ర ప్రవేశం చేయటం దగ్గరుండి చూపించాడు ఒక స్టీమర్ లో సముద్రం మీద పది కిలో మీటర్లు తిప్పాడు అది గొప్ప అనుభూతి .నెలకోసారి ఇంటికి వచ్చే వాడిని .జీతం బానే ఉండేది .

             నవంబర్ లో నాన్న కు ఒంట్లో బాగా లేదని టెలిగ్రాం వస్తే ఉయ్యూరు వెళ్లాను .చాలా ప్రమాదం లో ఉన్నారు .మళ్ళీ వెళ్లాను ఒక పది హీను రోజుల తర్వాతా సీరియస్ అంటే తిరిగి వచ్చాను సెలవు పెట్టి .నాన్న దక్కలేదు కార్హీక శుద ఏకాదశి నాడు 1961నవంబర్  21 న మరణించారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కలేదు .నాకు అమ్మను విడిచి వెళ్ళాలని పించలేదు .లీవ్ ను పోడిగించాను అంగీకరించారు .మళ్ళీ పోడిగించాను ఈ సారి నన్ను నిజామా బాద్పాలిటెక్నిక్ కాలేజికి బదిలీ చేశారు చేరమని అంతా చెప్పారు .వెళ్లాను కాని ఆ వాతావరణం నచ్చ లేదు మళ్ళీ సెలవు పెట్టి వచ్చేశాను .మళ్ళీ లీవ్ గ్రాంట్ చేశారు .కాని మళ్ళీ సెలవు పెంచాను చివరికి హోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు .హమ్మయ్య అను కొన్నానునా అంతకు నేను రిజైన్ చేయకుండా ఇలా జరిగింది అనుకొన్నాను .

           ఇంటికి వచ్చి ఏదీ చేయకుండా కొంత కాలం గడిపాను అయితే నా దృష్టి టీచర్ మీద్స బి .యి.డి ట్రైనింగ్ మీద ఉంది .దత్తు గారింట్లో బాల భారతి ,నన్నయ కల సమితి కార్య క్రమాలు పుస్తకాలు చదవటం తో కలం గడిపాను .అమ్మ ఊరట చెందుతోంది ఎక్కడికి పోవటం లేదామే చెట్టంత కొడుకు పోవటం ,నాన్న అనుకో కుండా మరణించటం తో అమ్మ చాలా దిగులు గా ఉండేది .ఊళ్ళో పురాణాలకు కూడా వెళ్ళేది కాదు .చివరికి మామయ్య నచ్చ చెబితే ఆయన నిర్వహించే శ్రీ రామ చంద్ర వైదిక మహాసభ కార్య క్రమాలకు విశ్వాలయం లో పురాణానికి వెళ్ళటం ఏడాదిన్నర తర్వాత ప్రారంభించింది .

               సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-13-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.