ట్వెల్వ్ యాంగ్రీ మెన్
రేజినాల్ద్ రోస్ అనే ఆయన రాసిన తమాషా నాటకం ‘’ట్వెల్వ్ యాంగ్రీ మెన్ ‘’.ఇది సినిమా గా టి.వి.సీరియల్ గా కూడా గొప్ప ప్రాచుర్యం పొందింది . అమెరికా లో ‘’మేకార్దీ ముఠా’’-రచయితలను కమ్యూనిస్టులు అని ముద్ర వేసి విచారణ జరిపించచేవారు . నానా అగచాట్ల పాలు చేసేవి ఆ నాటి అమెరికా న్యాయాలయాలు . ఆ విచారణ అంతా టి.వి.లలో ప్రత్యక్ష ప్రసారం చేసే వారు . దీని ని స్పూర్తిగా తీసుకొని ఒక కుర్రాడు తన తండ్రిని చంపాడని ఒక ముసిలాడు చంపుతుండగా చూశాడనిఅభియోగం మోపి దానిపై జరిగిన కోర్టు విచారణ ను కళ్ళ ముందు చూపిన నాటకమే ఇది .
ఇందులో పన్నెండు మంది ‘’జూరర్స్ ‘’ఉంటారు . వాళ్ళ మనోభావాలు ,వారి వ్యక్తిగత జీవితాలు ,వాళ్ళు కోర్టులో మాట్లాడిన పద్ధతులు అద్భుతం గా చిత్రించాడు నాటక కర్త రెజినాల్డ్ రాస్ . రచయిత కూడా మేకార్దీ కాలం లో జరిగిన ఒకానొక విచారణ లో ఒక ‘’జూరర్ ‘’గా ఉన్నాడు .కనుక ఆ కాలం లో ఎలా కోర్టులు స్పందిన్చేవో జూరర్లు అసలు విషయం వదిలి తమ పర్సనల్ విషయాలకు ఎలా ప్రాధాన్యత నిచ్చేవారో తప్పుడు అభియోగాలేలా ఉంటాయో చివరికి కొండను తవ్వి ఎలుకను ఎలా పట్టుకోలేక పోతారో భలే ముచ్చటగా రాసి కడుపుబ్బా నవ్విస్తాడు ఆయన అనుభవం ఈ నాటకం పండ టానికి భలే తోడ్పడింది ఆద్యంతం హుషారు గొల్పుతూ పరిగేత్తిస్తుంది .
దీనిలో ‘’fair and impartial juries are important ,the rights of the individual need to be respected and defended –regardless of his or her ethnicity or political belief s and beware of the dangers of big government and of a powerful few who lose their perspective ‘’అనే కఠోర సత్యాన్ని ఆవిష్కరిస్తాడు రాస్. అమెరికా న్యాయస్తానాలలో కేసును విచారించే పన్నెండు మంది జూరర్స్ ఏక గ్రీవ నిర్ణయం ప్రకటించాలి దోషి అనో కాదు అనో .కాని వీళ్ళు నిర్ధారణ కు రాలేక పోతారు . జడ్జి వీరిని ఒక గదిలోకి వెళ్లి మాట్లాడుకొని ఏకాభిప్రాయానికి రమ్మంటాడు .వీళ్ళు గదిలో చేరినా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేరు ఎవరెవరో వారికే తెలియదు జాతి మతం వగైరాలు అడ్డు వచ్చి అసలు విషయం చర్చించనే చర్చించా లేని వింత పరిస్తితి లో ఉంటారు .ఇదీ ఇందులో కద .
మేకార్దీ పై గూడా ఆరోపణ వచ్చి ప్రెసిడెంట్ ‘’ఐసన్ హోవర్ ‘’కాలం లో ‘’censure ‘’ ‘’చేశారు 1954 లో జరిగిన సెనేట్ లో జరిగిన వోటింగ్ లో అభిశంన తీర్మానానికి అనుకూలం గా 67,వ్యతిరేకం గా 22వోట్లు వచ్చి తీర్మానం నెగ్గింది . మేకార్దే ను‘’contemptuous ,contumacious ,and denunciatory ‘’గా నిర్ణయించారు . వెయ్యి రాబందులను తిన్న గద్ద ఒక గాలి వానకు రాలి పోయి నట్లు అయింది మేకార్దే పని . 1957 లో మేకార్దే చని పోయాడు అందుకే తప్పుడు అభియోగాలను మెకార్ధేఇజమ్ ‘’అనే పేరుతొ పిలవటం అప్పటి నుండి అలవాటయింది
ట్వెల్వ్ ఆంగ్రి మెన్ నాటకం రాసిన రెజి నాల్డ్ రాస్ కూడా టి.వి. రచయితగా ప్రఖ్యాతుడే . సినిమాలు తీసిన వాడే . జనం లో మంచి క్రేజ్ ఉన్న రచయితా కూడా . ఈ నాటకానికి నిజం గా రోనాల్డ్ ఒక రోజ్ అని పిస్తాడు .
.28-9-2002 శని వారం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-13–ఉయ్యూరు

