ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -127
52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ -2
21వయసులో ప్రౌస్ట్ చీకూ చి౦తా లేని యువకుడుగా ఆ నగర యువతలో వెలిగి పోయాడు .తల్లిలాగా ఆలివ్ రంగు శరీరం ,మెరిసే నల్ల కళ్ళతో కనిపించేవాడు .నిరంతరం చిరునవ్వుతో అందరినీ ఆహ్వానిస్తూ ఉండే ముఖం తో ఉండేవాడు .అయితే ఉన్నవయసుకంటే పెద్ద వయసువాడుగా అనిపించేవాడు .అతని స్నేహ బృందం ఆర్ట్ పై నిరంతర చర్చ చేసేది .మేడం జేనివీవ్ స్త్రాటస్ సలూన్ లో ఎక్కువగా గడిపేవాడు .స్త్రాటస్ భర్త చనిపోయాక మిగిలిన బృందాల పరిచయమేర్పడింది .అతనిని బాగా ఆకర్షించింది అనటోల్ ఫ్రాంక్ ను ప్రభావితం చేసిన మేడం అర్మాన్ డీ కైలావేట్ .అర్మాన్ తోనే ప్రయాణం స్నేహం ఆధారం .ఆమె కోడలు జియాన్నే మారిస్ పాకెట్ .ఈమె మొదటి భర్త గాస్టాన్ డీ కైలావేట్ . ఆమె తన ‘’అనటోల్ ఫ్రాంక్ అండ్ హిస్ మ్యూజ్ ‘’లో ప్రౌస్ట్ ను బాగా అధ్యయనం చేసి రాసింది. మార్సెల్ ఎక్కువ సార్లు ముఖ్యం గా ఆదివారాలలో అర్మాన్ సెలూన్ లో కనిపించేవాడని ,తల వెనక్కి వాల్చి ,బుజం మీద ఉంచి కూర్చున్నట్లు అంటే దాదాపు పడుకోన్నట్లు ఉండేవాడని .అతడు దాదాపు ఒక కుప్ప లాగా ఉండేవాడని ,సీరియస్ ముఖం తో కళ్ళలో గూడు కట్టిన విషాదం తో ఉండేవాడని ,తెల్లని పళ్ళు మెరుస్తూ ఉండేవని ,చిన్న వాటికే పెద్దగా నవ్వేవాడని రాసింది .అందం గా ఆకర్ష వంతంగా మంచిగా ఉండేవాడు .తన నవల చివరిభాగం లో తానూ ఎంతటి సెన్సిటివ్ మనిషో ,తన మర్యాద ఎలా ఉండేదో ,యెంత కృతజ్ఞతతో ఉండేవాడో ఏ మాత్రం మనసుకు గాయమైనా యెంత విషాదం తో కుమిలి పోయేవాడో అన్నీ రాశాడు .ఆడ ,మగ పిల్లలతో కలిసి ఆడుకోవాలని పించేది .వాళ్ళతో సరదాగా పిక్నిక్ లు చేయాలను కొనేవాడు. కాని పాపం ఏ అమ్మాయీ అతని దగ్గరకు చేరలేదు .అబ్బాయిలు మాత్రం పొగడ్తలతో ఉబ్బేసి ఉబ్బు లింగాన్ని చేసి పబ్బం గడుపుకొని పోయే వాళ్ళు . ‘ తల్లితో సాన్నిహిత్యం అప్పుడప్పుడు సందిగ్ధం లో పదేసేది .రాయటం మొదలు పెట్టక ముందు నుంచే తానొక రచయిత కావాలను కొన్నాడు అతని మేధస్సుమీద అంత నమ్మకం ఉండేది 20ఏళ్ళ వయసులో మేడం స్త్రాస్ సెలూన్ లో మిత్ర బృందం తో ఉండగా .’’లీ బాన్ క్వెట్’’అనే మేగజైన్ నడిపాడు .అది ఇంగ్లాండ్ వారి ‘’ఎల్లో బుక్ ‘’ధోరణిలో ఉండేది .తన శైలిలో కొన్ని ఆర్టికల్స్ దీనిలో రాసాడు. జర్నలిస్టిక్ విషయాలు సాంఘిక విషయాలు ,పుకార్లు అన్నే ‘’లీ ఫిగరా ‘’లో వండి వడ్డించాడు.ఇవేవీ గొప్పవి కాకపోయినా తన భావాలకు అవుట్ లెట్ గా ఉపయోగ పడ్డాయి . 25వ ఏట ‘’లేస్పాసివ్స్ ఎట్ లేస్ జోర్స్ ‘’లో కొన్ని కవితలు ,వ్యాసాలూ ,రేవేరీస్ స్కెచ్ లు కలిపి మొదటిభాగం ప్రచురించినప్పుడు ముందుమాటలో ప్రౌస్ట్ ను ‘’ఏ గిల్ లెస్ పెట్రోనియాస్ ‘’అని రాసింది మేడం కైలావేర్ట్ .ప్రౌస్ట్ 22వ ఏట తమ్ముడు స్కాట్ చనిపోయాడు .అతని మధుర స్మృతుల్ని రికార్డ్ చేశాడు రచనలో .తనను నోవా ఇన్ దిఆర్క్ తో పోల్చుకొన్నాడు .
30ఏడు మీద పడేలోగానే ప్రౌస్ట్ స్వయం వినాశక పద్ధతులలో పడ్డాడు .వ్యక్తిత్వం ,అవసరాల మధ్య నలిగిపోయాడు .రాసినా మాట్లాడినా చాలా నిష్కపటంగా ఉండాలనుకొన్నాడు .కానిలోపల మాత్రం ఏదో తెలీని దాపరికం ఉండేది .తన గురించి తల్లి దండ్రుల గురించి స్వేచ్చగా చెప్పాలనుకొన్నా కొన్ని చెప్పలేక పోయాడు .శ్వాస పీల్చే సమయం కూడా దొరికేదికాదు .ముందు తండ్రి తర్వాత రెండేళ్లకు తల్లి చనిపోగానే ప్రౌస్ట్ మరింత మనోవ్యాకులానికి ,విచారానికి గురైనాడు .తల్లిమరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు .దీనిపై ‘’34వ ఏట ప్రౌస్ట్ తల్లి లేని అనాధ అయ్యాడు .చిన్నప్పుడూ ,ఇప్పుడూ కూడా ‘’లిటిల్ బాయ్ లాస్ట్ ‘’గానే ప్రవర్తించాడు .తల్లిని ఎన్నడూ మార్చీ పోలేదు ,క్షమించానూ లేక పోయాడు .తల్లిని ‘’Mother was a dove ,,the consoling hopeful messenger ,who had left him ,who had left him hopelessly alone ‘’అనుకొన్నాడు .ఆమె మరణం అతనికి విముక్తి అనిపించింది .
ఇప్పుడు ప్రౌస్ట్ తన బృహత్తర రచనకు శ్రీకారం చుట్టాడు .కౌంట్ డీ మాంటిస్కో ను నెపోలియన్ మూడవ సోదరి ప్రిన్సెస్ మాతటిల్డా మొదలైన వారిని చాలా తీవ్రంగా అధ్యయనం చేశాడు .దేనినీ మర్చే పోలేదు .ఈ సంఘటనలన్నీ ఒక ధారావాహిక గాధలలా అనిపించాయి .కుళ్ళి పోయిన సమాజం ,బాగు పడని సమాజం ,ప్రజల తీర్చలేని ఇక్కట్లు దారుణ జీవన పరిస్తితులు అన్నిటినీ తన దీర్ఘ నవల ‘’రిమే౦బరెంస్ ఆఫ్ థింగ్స్ పాస్ట్ ‘’లో నిక్షిప్తం చేశాడు .తన మైక్రోస్కోపిక్ ,టేలిస్కోపిక్ వివరాలను చదివి జనం మెచ్చారన్నాడు .ఒక్క పాత్ర ఆల్బర్టైన్ మాత్రమె అతనికి నచ్చలేదు .ఆ పాత్రంటే మహా ప్రేమ ,ఆరాధన .కధలో అసలైన ఆల్బర్టైన్ లెస్బియన్ కు బదులు సెక్సువల్ .ఈ నవల వ్యక్తిగత ఒప్పుకోలు ,సాంఘిక విమర్శ .దీన్ని ఏ పబ్లిషర్ కూడా గుర్తించలేదు ప్రింట్ చేయానికి ముందుకు రాలేదు .కొంత డబ్బు తానే ఖర్చు చేసి అజ్ఞాత ప్రింటర్ ద్వారా అచ్చువేయించి మొదటిభాగం ‘’స్వాన్స్ వే’’బయటికి 1913 లో తెచ్చాడు .దీన్ని ఎవరూ పట్టించుకోలేదు .అయిదేళ్ళు ఆగాల్సి వచ్చింది రెండో భాగం’’విదిన్ ఏ బడ్డింగ్ గ్రువ్ ‘’ తేవటానికి .ఇది జనం లోకి బాగా చొచ్చుకెళ్లి,వీర అభిమానం తెచ్చి పెట్టి ‘’కన్కార్ట్ ప్రైజ్ ‘’పొందింది .మిగిలిన నాలుగేళ్ళలో ‘’ది గుర్మాన్తెస్ వే’’,సిటీ సాఫ్ ది ప్లైన్ ,ది కాప్టివ్’’,’’ది స్వీట్ చీట్ గాన్’’,ది పాస్ట్ రి కాప్చర్డ్ ‘’ప్రౌస్ట్ జీవితకాలం లోనే రాస్తే మరణానంతరం ప్రచురింప బడ్డాయి ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4 -16-ఉయ్యూరు

