52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ -3(చివరిభాగం )
ప్రౌస్ట్ రాసిన రిమెంబ రెన్స్ నవలలో ఎన్నో పాత్రలున్నాయి .చెప్పలేనన్నిసంఘర్షణలు రెండు పెద్ద నేపధ్యాల లో జరుగుతాయి .మొదటిది సమాజం ఉత్తాన పతనాలు . ఆ శతాబ్దం అంతం లో అననుకూల౦గా ఉన్న నిబంధనల సడలింపు ,సామాజిక పొరలు కరిగిపోవటం .ఈ నేపధ్యం లో జర్మంటిస్అంటే అరిస్టోక్రాట్ ల సమ్మేళనం ‘’స్వాన్స్ ‘’అంటే మధ్యతరగతి మేధావుల సుఖ జీవనం ,’’వర్డూరిన్స్’’అంటే నయా రిచ్ వర్గాల నిలకడ ప్రభావం అన్నీ కలగా పులగం గా ఉన్నాయి .రెండవది ,మరింత జటిలమై సింబాలిక్ గా ఉన్నదీ –కాలం తో మనిషి నిరంతర పోరాటం .అందుకే నవల శీర్షిక ‘’ఇన్ సెర్చ్ ఆఫ్ టైం లాస్ట్ ‘’చాలా చక్కగా నప్పింది .””Poetry is emotion remembered in tranquility ‘’అని వర్డ్స్ వర్త్ కవి అంటే ,ప్రౌస్ట్ ‘’Not only poetry but reality is an experience relived in the memory ,reality is not so much the event as the re animating flow between the past and the present ‘’అన్నాడు .’’ది పాస్ట్ రి కాప్చర్డ్ ‘’లేక టైం రీ గైండ్ ‘’లో చివరి పేజీలు అసలు రహస్యాన్ని,కీలక విషయాన్ని తెలియ జేస్తాయి .గతం తన ను తనవారినీ వేరు చేయలేదని అన్నాడు .’’మనుషులు స్పేస్ లో కంటే కాలం లో ఎక్కువగా విహరిస్తారు .వారి వర్తమానం భూతకాలం పైనే ఆధార పడి ఉంటుంది..అతని పాత్రలు మామూలు దృష్టిలో పెరగవు .వాళ్ళు వృద్ధి చెంది,వికసిస్తారు .’’The most vivid insights in Proust;s work do not rise from wisdom or applied intelligence ,but from chance sensations and their buried associations –a’’madeleine ‘’,a little cake dipped in a cup of tea .’’
భవిష్యత్ అదృష్టాన్ని గురించిన చింతే లేనివాడు ప్రౌస్ట్ .ప్రౌస్ట్ ను ఫేబర్ తో పోల్చవచ్చు . ఫెబెర్ కీటకాల సంఘ జీవనాన్ని అధ్యయనం చేస్తే ప్రౌస్ట్ మానవ సంఘాల జీవనాన్ని అధ్యయనం చేసి రాశాడు .బెర్గ్ సన్ కాలాన్ని అధ్యయనం చేశాడుకనుక ఆయనతో పోలికా సరైనదే .జేమ్స్ జాయిస్ తో పోల్చటమూ బాగుంటుంది కారణం అతను అంతశ్చేతనను శోధించాడు .ఫెబర్ లాగా ప్రౌస్ట్ పరిశీలకుడు మాత్రమె కాదు వ్యాఖ్యాత కూడా .బెర్గ్ సన్ లాగా కాకుండా ప్రౌస్ట్ కాలాన్ని నిర్మాణ అంశంగా కాక విచ్చిన్న అంశంగా భావించాడు .జాయిస్ సబ్జెక్టివ్ అయితే ,ప్రౌస్ట్ ఆబ్జెక్టివ్ .ప్రౌస్ట్ అనుబంధాలు స్వేచ్చా పూరితమైనవికావు .అవి సుదీర్ఘ జ్ఞాపకాల గొలుసులతో గట్టిగా అనుసందానమైనాయి .Remembrance of things past ‘’is the first and last ,a uniquely expanding autobiography which is a masterpiece of sensibility ‘’.
ఈ బృహత్తర నవలా రచన లో ఉన్నప్పుడు ప్రౌస్ట్ నరాలబలహీనత ,ఒంటరితనం తో మునిగిపోయాడు బజారు అరుపులు శబ్దాలు కాలుష్యం దుమ్ము ధూళి ,పరాగ రేణువులు ,పగటి కాంతి అతని నరాలపై ప్రభావితం చేశాయి .అందుకనే గది వదిలి బయటికి వచ్చేవాడు కాదు .గదిలోకి శబ్దం దూరకుండా కార్కు షీట్లు,సూర్య రశ్మి ప్రవేశించకుండా షట్టర్లు ఏర్పాటు చేసుకొన్నాడు .కిటికీ తలుపులు అసలెప్పుడూ తెరవనే లేదు .స్టీం హీట్ ను ఉపయోగించేనే లేదు .మహిళా సందర్శకులు వస్తే అతని సేవకులు ముందుగా వారి వద్ద పూలుకాని సువాసన ద్రవ్యాలు కాని ఉన్నాయేమో చెక్ చేసి లోపలి పంపేవారు .వేసవి కాలం లోనూ శీతాకాలం లోనూ మఫ్లర్లు స్వెట్టర్లు ,నైట్ కాప్ గ్లోవ్స్ తప్పనిసరి గా వేసు కొనే పడుకోనేవాడు .గది అంతా దట్టమైన ధూపం తో నిండి ఉండేది .ఫామిలీ హౌస్ నుండి మారి ఒక పాత అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తుగదిలో చేరాడు .అంతా చీకటి. అదే అతనికి వరం .ప్రౌస్ట్ జీవిత చరిత్రాకారుడు లియర్ పియరీ క్వింట్ ఆ గదిని ‘’ఒక సర్వెంట్ రూమ్ ‘’లాగా ఉందన్నాడు .దీన్నీ ఖాళీ చేసి వేరొక చోటికి వెళ్లాలని ఉండేది కాని వెళ్ళలేదు .కుర్చీలకు కవర్లు తొడిగే ఉండేవి .పడుకొనే రోజులో చాలా ఎక్కువ భాగం గడిపేవాడు .గది అంతా మందు సీసాలు ,ఖాళీ జార్లు చిందర వందరగా పడి ఉండేవి .మధ్యలో రాసి పారేసిన కాగితాల దొంతరలు .పాత న్యూస్ పేపర్ కట్టలు ,20 పెద్దనోట్ పుస్తకాలు టేబుల్ పైన ఉండేవి .ఇవే అతని తాజా రచనకు తార్కాణాలు .
ఒక్కోసారి రాత్రి బయటికి కాసేపు వెళ్ళేవాడు .రాత్రి అంత ప్రమాదకరం కాదని అనుకొనేవాడు .బాధకు ఉపశా౦తి గా తప్పుడు ఉత్ప్రేరకాలు వాడేవాడు .పరిస్థితి రోజు రోజుకూ క్షీణించింది .విశ్రాంతికోసం మాదక ద్రవ్యాలు వాడాడు .వీటితో మూడు రోజులు నిద్ర పోయేవాడు .లేపటానికి మళ్ళీ ఎఫీన్ అడ్రోలీన్ వేసేవారు .51వ ఏట న్యుమోనియా సోకింది .కాని డాక్టర్ ను పిలవలేదు తమ్ముడు రాబర్ట్ అన్నకు సేవ చేద్దామని వచ్చాడు .అతనితో మాట్లాడనేలేదు .అతని సపర్యలు వద్దుపోమ్మని తిరస్కరించాడు .తాను పని చేసుకోవాలి కనుక డిస్టర్బ్ చేయ్యద్దన్నాడు .చావు ముందు ఒక గంట సేపు ప్రూఫ్ రీడింగ్ చేశాడు .అందులో చనిపోయే బెర్గాట్టే పాత్ర వర్ణనలో కొంత మార్పు చేయాలనుకొన్నాడు కారణంగా ‘’I have several retouchings to make ,now that I find myself in the same predicament ‘’చెప్పాడు .అనుకొన్నట్లు ఆ మార్పులు చేయగానే చేతిలోని పెన్సిల్ జారి కింద పడిపోయింది .మార్సెల్ ప్రౌస్ట్ 18-11-1922న 57ఏళ్ళ వయసులో మరణించాడు .
ప్రౌస్ట్ హోమో సెక్సువల్ .మగవాళ్ళతో అతని సంబంధాలు ఆ నాడు బాగా చర్చనీయా౦శ మైంది .కాని ఇది అబద్ధం అని అతనికి సేవ చేసిన సేలేస్టే అల్బరేట్ చెప్పింది .కాని అతని సమకాలిక రచయిత ఆండ్రీ గైడ్ మొదలైన వారు రాసినదానికి ఆమె చెప్పింది విరుద్ధం గా ఉంది .ప్రౌస్ట్ ఎప్పుడూ దీనిపై స్పందించలేదు .ప్రౌస్ట్ రచనలో సేక్సువాలిటి ఒక పెద్ద చర్చనే రేపింది .’’హోమో’’ అనేది తర్వాత జీన్ పాల్ సాత్రే రచనల్లోనూ చోటు చేసుకొంది .మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో ప్రౌస్ట్ తన నవలను యదార్ధ సంఘటనలతో నిర్మాణం లో పెద్ద మార్పులతో మూడు రెట్లు పెంచి రాశాడు .’’Proust ;s novel has a circular constitution and must be considered in the light of the revelation with which it ends ‘’.అతని సబ్జెక్ట్ ముక్తి .తాత్కాలిక ప్రలోభాలనుండి విముక్తి .నవలాపదార్ధం తన గతమే నని స్పష్టంగా చెప్పాడు
ఆధునిక కాల్పనిక సాహిత్యం లో ఇరవై వ శతాబ్ది నడకను ఒడిసిపట్టుకొని ప్రతిబింబింప జేసిన గోప్పనవల రేమేబ్రన్స్ .తన గత జీవితాన్ని ఒక ముడిపదార్ధంగా తీసుకొని,గతించిన కాలం తిరిగిరాదని ,అమాయకత్వం ను అనుభవం తో అధిగమించాలని ప్రేమ స్నేహం మనిషి అహంకారం గర్వం పాపం నిరాశల విజయాలు గురించే రాశాడు .చివరగా ప్రౌస్ట్ చెప్పిన దాని సారాంశం ‘’దిన జీవితం చాలా ప్రాముఖ్యమైనది .అందులో నీతి సంతోషం ,అందం ,ఆనందం ఉన్నాయి .వీటిని వదులు కోరాదు . మానవసహజ తప్పిదాల వలన వాటిని కోల్పోయినా,అవి నాశనం చెందనివి ,తిరిగి పొందగలిగినవి .ప్రపంచ సాహిత్యం లో ప్రౌస్ట్ శైలి అద్వితీయమైనది .వేగం దీర్ఘత ,నిర్డుస్టత ,శక్తి, మురిపెం,క్లాసిజం ,సింబాలిజం యొక్క సమాహారం ప్రౌస్ట్ రచనా విధానం .అసాధారణ వ్యక్తిత్వం ఉన్న మహా రచయిత ప్రౌస్ట్ .తనది జ్యూయిష్ రక్తం అని ఎక్కడా ప్రౌస్ట్ చెప్పుకోలేదు .తల్లి కులగోత్రాలజోలికీ పోలేదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-4-16-ఉయ్యూరు

