వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -20- సంగీత నాట్య శాస్త్రాలపై మల్లినాధుని ప్రజ్న

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -20-

సంగీత నాట్య శాస్త్రాలపై మల్లినాధుని ప్రజ్న

సంగీత శాస్త్రం పై మల్లినాదునికి లోతైన అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది .కుమార సంభవం లోని -1-4  శ్లోక వ్యాఖ్యానం లో ‘’తానం ‘’ను చక్కగా నిర్వచించాడు .తానం అనేది ముఖ్య స్వరం(మాస్టర్ టోన్) అని అందులోనుంచే విభిన్న స్వరాలు జనిస్తాయని నిర్వచించాడు .’’తాన ప్రదాయిత్వా నివోపమ౦తుం ‘’అనేదాన్ని వివరిస్తూ మల్లినాధుడు ‘’తానో నామ స్వగంతర ప్రవర్తకో రాజస్యితి ప్రవ్రుత్త యాది హేతురం శాపరణామ వంశ వవాద్య సాధ్యః –ప్రధాన భూతః స్వర విశేషః ‘’అని నిర్వచించి అభినవ గుప్త ,భరతుల వాక్యాల తో సమర్ధించాడు .మరొక సాంకేతిక పదం ‘’మూర్చన ‘’ను కూడా’’’’స్వరానా మారోహక్రమః మూర్చనా ‘’అంటూ గొప్పగా నిర్వచించాడు .- నాటకాలపై నిర్దుష్టంగా చెప్పిన దశ రూపకం లోని కొన్ని పంక్తులను ఉదహరించాడు .అదే శ్లోకం లో ‘’విభ్రమ ‘’కు ఉన్న అర్ధాన్ని దశ రూపకం నుంచి తెలియ జేశాడు .ఇది అదనపు అర్ధం  మాత్రమే-‘’-‘’అప్సరసాం విభ్రమ మండనాని విలాసాలంకరణా ని ‘’-అదవా విభ్రామో విపరీత న్యాసః –‘’విభ్రామత్వ రయా కాలే భూషాస్థానం విపర్యయః ‘’ఇతి దశ రూపకాత్ ‘’.మల్లినాధుడు రాగు వంశం లోని ‘’కరణ ‘’అనే ప్రత్యేక పదానికి అదొక ప్రత్యేక రకమైన ‘’తాడితం ‘’(బీట్ )లేక కాల స్థితి (టైమింగ్ )అని అర్ధం చెప్పాడు .దీన్ని సమర్ధించటానికి పెద్దగాప్రచారం లో లేని ‘’రాజ కందర్ప ‘’లోని –‘’కరణోస్థాలం  వ్యవస్తాపకే స్తానా  విశేషేః –తదుక్తం రాజ కదరా పేణ నృత్య వాదిత్వ గీతానాం ప్రయోగ వశ భేదినాం –సంస్యానం తాడనం రోధేః కారణాని ప్రచక్షతే ‘’శ్లోకాన్ని ఉదాహరించాడు .

శకున , సాముద్రిక  శాస్త్రాలపైనా  మల్లినాధుని అవగాహన

తన వ్యాఖ్యలలో శకున శాస్త్రాన్ని విస్తృతంగా ఉదహరించాడు .దీనినే సాముద్రిక శాస్త్రంగా కూడా పేర్కొన్నాడు .కాళిదాస కావ్యాలలో అనేక నమ్మకాలున్నాయి ఇవే తరువాత కాలం లో బాగా కొనసాగాయి .కొన్ని ఉదాహరణలు చూద్దాం -1- ఆమ్రకూట పర్వతం పై మేఘ౦  ఎందుకు విశ్రాంతి తీసుకొంటుంది ?అంతకు ముందు మేఘానికి మిత్రుడు ఎవరు?దీనికి ‘’నిమిత్తానందన ‘’సమాధానం ఏమిటి అంటే –యాత్రికుడు ప్రయాణకాలం లో సంతోషంగా ఉండాలి కనుక .మొదటి విశ్రాంతి సమయం లో ఆనందంగా ఉంటె ప్రయాణం అంతా సుఖ ప్రదం –దీనికి  సమర్ధన నిమిత్త నిదానం లోని ‘’-ప్రధమావసయే యస్య సౌఖ్యం తస్యాఖిలే హిని –శివం భవతి యాత్రాయాన మన్యదాత్వ శుభం ధృవం ‘’శ్లోకమే చాలు .

మేఘ దూతం లో శరీర భాగాలలో వచ్చే బాధలకు కారణాలను కూడా ‘’నిమిత్త నిదానం’’ ఆధారంగా చెప్పాడు-‘’స్పందానూన్మూర్ధ  . చత్రలాభం లలాటే పట్ట మంశుకం –ఇష్ట ప్రాప్తిం ద్రుశో రూర్ధ్వ మపా౦గే హాని మాది శేత్ ‘’.జ్యోతిషం లో ఉన్న సాముద్రికం నుంచి కొన్ని శ్లోకాలను చెప్పాడు .ఎర్రని కాలి  వేళ్ళున్న స్త్రీ చాలా అందంగా ఉంటుందని ,పాదం ము౦దు భాగాలు ఎత్తుగా ఉండి మడమలు కనపడకుండా ఉన్న స్త్రీలను రాజులు బాగా ఇష్టపడతారని సాముద్రిక శాస్త్రం ఆధారంగా మల్లినాధుడు –‘’అత్ర సాముద్రికా –యస్య రక్త తలో పాదావున్నతాగ్రే తల స్ప్రుశౌ –నిగూఢ గుల్ప్తౌ నిహతౌ సా స్యానృపతి  సమతా’’అనే శ్లోకం ద్వారా  కుమారసంభవ వ్యాఖ్యలో చెప్పాడు –అందమైన పలువరస ఉన్నఅమ్మాయి మరింత అందంగా ఉంటుందని సాముద్రికం ఆధారంగా తెలియ జేశాడు .అందమైన సౌస్టవమైన  ప్రక్కప్రక్కనే వరుసలో ఉండి మధ్యలో ఖాళీలు లేకుండా  చివరలు కోణాలుగా ఉన్నపలువరుస కలిగిన స్త్రీముందు  ప్రపంచం అంతా మోకరిల్లుతుందని సూరి చెప్పాడు—‘’యదుక్తం సాముద్రికే –‘’స్నిగ్ధాః సమాన రూపాః సుపంగత్వం శిఖరిణా శిలస్టాః-దంతా భవంతి యస్యాం తస్మాం పాదే జగత్  సర్వం ‘’.అంతే కాదు తాంబూల సేవనం తో దంతాలకు విపరీతమైన కాంతి లభిస్తుందని మేఘ దూత వ్యాఖ్యలో –‘’తాంబూల రస రక్తోపి స్పుట భాసః సమోదయః-దంతాః శిఖరిణౌ యస్యా దీర్ఘం జీవతి తత్ప్రయః ‘’అనేశ్లోకం ద్వారా  తెలియ జేశాడు మల్లినాద సూరి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.