ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్ 02/12/2016 గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జనవరి

ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్

                                                          ఐర్లాండ్ దేశ క్వేకర్ స్త్రీవాద ఉద్యమాలలో అగ్రగామి అన్నాహస్లాం ఐర్లాండ్ లోని కౌంటి పార్క్ లోని యౌఘల్ లో 1829 లో జెన్ ,అబ్రహాం ఫిషర్ దంపతుల 17 గురు సంతానం లో 16 వది గా జన్మించి ,మహిళా ఓటు ఉద్యమ నాయకురాలైంది .తండ్రి ఫిషర్ క్వేకర్ కుటుంబానికి చెందిన వ్యాపారి .ఐర్లాండ్ మహా కరువు సమయం లో ఈ కుటుంబం ప్రజలను ఆదుకొన్న తీరు చిరస్మరణీయమైనది .ఎన్నో సేవా కార్యక్రమాలు ,దాన ధర్మాలు చేసిన కుటుంబం .పొటాటో ఉద్యమం లో సూప్ కిచెన్ లలో అన్నా ఎంతో సహాయపడింది .స్థానిక బాలికలకు స్వంత కాళ్ళ పై నిలబడి రాబడి పొందటానికి కుటీర పరిశ్రమలు స్థాపించారు .లేసుల తయారీ క్రోచేటింగ్ ,అల్లిక పనులలో శిక్షణ నిచ్చింది
.                                                                అరవై ఏళ్ళకు పైగా స్త్రీ విద్యా వ్యాప్తికి ,విముక్తికి కేథలిక్ మిషన్ తోకలిసి తీవ్ర పోరాటం చేసింది . .అమెరికాలోని ఆమె స్నేహితురాలు క్వేకర్ ఉద్యమ నాయకురాలైన సుసాన్ బి .ఆంధోని లా పురుషులతోపాటు స్త్రీకి సమాన హక్కు ,బానిసత్వ నిర్మూలన నియంతృత్వానికి వ్యతిరేక భావ వ్యాప్తితో పెరిగింది . క్వేకర్ బోర్డింగ్ స్కూల్ లలో చదివింది .యార్క్ షైర్లోని ఆక్వర్త్ స్కూల్ లో విద్యాబోధన చేసింది .అక్కడే ధామస్ అస్లాంతో పరిచయమైంది .ఇద్దరు ప్రేమించుకొని సంతానం కనకూడదు అనే ఒప్పందం పై వివాహం చేసుకొన్నారు .
భర్త కు కూడా స్త్రీ విద్యా వ్యాప్తి ,పురుషులతో సమానం గా స్త్రీ హక్కులు ఉండాలన్న భావాలు బలంగా ఉన్నాయి .హస్లాం కూడా క్వేకర్ కుటుంబం లోనే జన్మించటం వలన 1868 నుండి మహిళా సమస్యలపై ,స్త్రీ ఓటు  హక్కుపై ఎన్నో వ్యాసాలూ రాశాడు .1868 లో ‘’వివాహ సమస్య ‘’అనే కరపత్రం రాసి ముద్రించాడు .అందులో పరిమిత సంతానం అవసరాన్ని ,గర్భనిరోధానికి సూచనలను అపకారం చేయని మందుల గురించి రాశాడు .19 వ శతాబ్దపు ఐర్లాండ్ స్త్రీ ఉద్యమనాయకురాలిగా అగ్రస్థానం పొందింది అన్నా .1876 లో’’ డబ్లిన్ వుమెన్స్ సఫ్రేజ్అసోసియేషన్’’ ను ఈ దంపతులు స్థాపించారు ,దీనితో ఐర్లాండ్ లో స్త్రీ ఓటు హక్కు ఉద్యమం మంచి ఊపునందుకొన్నది .

                                                               1989 లో ఇస బెల్లా టాడ్ ను సెక్రెటరి చేసింది .ఐరిష్ హోం రూల్ ను సమర్ది౦చలేదుకాని ‘’వుమెన్స్ లిబరల్ యూనియనిస్ట్ అసోసియేషన్ ‘’కు డబ్లిన్ లో శాఖ ఏర్పాటు చేయటానికి సహకరించింది .ఈ పోరాటఫలితంగా 1896 లో ఐర్లాండ్ మహిళలు ‘’పూర్ లా గార్డియన్ ‘’గా పేదల న్యాయ అధికార సంస్థలలో మెంబర్లుగా ’ ఎన్నిక అవటానికి అధికారం లభించింది .1900 నాటికి ఈ లా సంస్థలు 100 అయ్యాయి .1898 లోనే అన్నాహస్లాం అర్హత గల మహిళలను వీటికై పోటీ చేయమని తీవ్రంగా ప్రచారం చేసింది .స్త్రీలకూ స్థానిక ప్రభుత్వ సంస్థలలో ,అర్బన్ రూరల్ జిల్లా కౌన్సిలర్ల ఓటింగ్ లో పాల్గొనే హక్కు లభించింది .1913 లో అన్నాసేక్రేటరిగా స్వచ్చందంగా పదవీ విరమణ చేసి గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకో బడింది .
1864 ‘’ అంటు వ్యాధుల చట్టం ‘’ను ఉపసంహరి౦చమని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చింది అన్నా హస్లానా . ఈచట్టం సైన్యం విడిది చేసిన చోట వ్యభిచారులపై ప్రభుత్వ నియంత్రణకు అవకాశం కల్పించింది . ఈ నియంత్రణ మొదట మూడునెలలే ఉంటుందని చెప్పిన ప్రభుత్వం సంవత్సర కాలానికి పొడిగించింది .దీనివలన మిలిటరీ వలన సెక్స్ వ్యాధులు సమాజం లో విజ్రుంభించకుండా చేయాలన్నది ప్రభుత్వ సంకల్ప౦ . ఆడవారిపై మందులతో చికిత్స కూడా భాగమైంది .ఇది వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయటంలో భాగమేనని,ఫ్యామిలీ లైఫ్ కు స్వస్తి చెప్పి వ్యభిచారాన్ని వ్యాపారంగా మార్చటమేనని అన్నా దీన్ని వ్యతిరేకించింది .చివరికి ప్రభుత్వంలొంగి 18 ఏళ్ళ ఆమె పోరాటం ఫలించి చట్టాన్ని ఉపసంహరించింది .
18 74 లో ‘’వుమెన్స్ ఆడ్వోకేట్ ‘’అనే మహిళా పత్రికను స్థాపించి నిర్వహించింది .డబ్లిన్ వుమెన్స్ సఫ్రేజ్ అసోసియేషన్ ఏర్పరచి చివరికి ఐరిష్ వుమెన్స్ సఫ్రేజ్ గా మార్చింది .కొందరు మిలిటెంట్ ఉద్యమంగా మార్చినా , ఆమె మాత్రం ఐరిష్ వుమెన్స్ ఫ్రాన్చేజ్ సెక్రటరిగానే ఉండి పోయింది .

                                                                             పురుషులతో సమానంగా స్త్రీలకు ఓటు హక్కు కోసం అన్నా 1866 లో 1499 మంది చేత సంతకాలు చేయించి సేకరించి ప్రభుత్వానికి అందజేసింది .1867 లో పురుషుల ఓటు అన్నివర్గాలకూ విస్తరించినా స్త్రీలకు హక్కు రాలేదు .1892 లో ఆమె పోరాటం ఫలించి స్త్రీలకూ ఓటు హక్కు కల్పించటమేకాక స్థానిక సంస్థలలో మహిళలు పోటీ చేయటానికి అవకాశం లభించింది .1916 లో భర్త ధామస్ అస్లాం తన ‘’ హంస గీతి’’ని ‘’సంలాస్ట్ వర్డ్స్ ఆన్ వుమెన్స్ ఫ్రాంచైజ్ ‘’ను చనిపోవటానికి ఒక ఏడాది ముందు ప్రదర్శించాడు . భర్త ఉద్యమాన్ని అన్నా కొనసాగించింది

                                                                                  1918డిసెంబర్ నాటికి అన్నా 90 ఏళ్ళ వయసులో తోటి స్త్రీలతో కలిసి మొదటి జనరల్ ఎన్నికలలో డబ్లిన్ లోని సెయింట్ స్టీఫెన్స్ గ్రీన్ పోలింగ్ కేంద్రం లో ఓటు వేయటానికి వెడితే ఆమె పై ఆనందం తో పుష్పవృష్టి కురిపించి తమ ఆత్మ గౌరవాన్ని ఉద్దీపనం చేసి ఐక్యతను సాధించిన ఆ మాతృ మూర్తికి హార్దిక స్వాగతం పలికారు .సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అన్నా హస్లాం చేసిన స్త్రీ విముక్తి పోరాటాన్ని అభినందించి ఆదరించారు .1922 లో మొదటి ఐరిష్ స్వతంత్ర దేశం ఏర్పడగానే 21 ఏళ్ళు దాటిన స్త్రీ పురుషులందరికీ ఓటు హక్కు కల్పించింది .అదే ఏడాది ఈ విజయాన్ని కన్నులారా చూసి సంతోషించి సంతృప్తి చెందిన అన్నా హస్లాం మరణించింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

————————————————————————————————————————————

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.