గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి

హర్యానాలో జగద్రిఅంటే నేటి హర్యానాలో  1943 –లో జన్మించి 1915 లో 82 వ ఏట మరణించిన ‘’చులికీకృత పాణిని వ్యాకరణ పారావారాన్నిధి’’హరనామ దత్త శాస్త్రి .తండ్రి మురారి దత్తు .వారణాసిలో సంస్కృతం చదివి’’ భాష్యాచార్య ‘’అంటే సంస్కృత భాషా శాస్త్రం వ్యాకరణ శాస్త్రనియమాలను క్షుణ్ణంగా బోధించ గలిగే సామర్ధ్యం ఉన్న మహా పండితుడు అయ్యాడు .తరువాత రాజస్థాన్ లోని’’ చురు ‘’  లో పాణిని వ్యాకరణ బోధనలో మహా నిష్ణాతుడనే పేరు పొందాడు .చూరులో తానే తనతాత గారి పేరుమీద ‘’పండిట్ హరనామ దత్త శాస్త్రి సంస్కృత పాఠశాల’’  నిర్మించి పాణిని వ్యాకరణ బోధనకు ప్రాశస్త్యం తెచ్చాడు .ఆయన శిష్యులలో ప్రసిద్ధమైనవారు శ్రీ గిరిధర్ శర్మ చతుర్వేది ,విద్యావాచాస్పతి బాలచంద్ర జి ,పండిట్ రామానంద జీ మహా రాజ్ ,పండిట్ జైదేవ్ జి మిశ్ర ,పండిట్ విలాస రాయ్ జీ ఉన్నారు .

తాత  హరనాధ దత్త జీవిత విశేషాలపై  పై శిష్యుడు విద్యా వాచస్పతి విద్యాధర శాస్త్రి ‘’హరనామామృతం ‘’అనే సంస్కృత మహాకావ్యం రచించాడు . .ఆధునిక సంస్కృత కావ్యం ఎలా ఉండాలో కవి తన రచన ద్వారా తెలియజేశాడు .ఇందులో 16 కా౦డలున్నాయి . ఆయన జీవిత విశేషాలు,యాత్రలు ,పాఠశాల స్థాపన, విద్యా వ్యాప్తి ,సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణం వగైరాలు చాలా కవితాత్మకంగా వర్ణించాడు కవి  .

Inline image 1

సశేషం

కనుమ పండుగ శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-17 –ఉయ్యూరు

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.