సరసభారతి 101 వ సమావేశంగా సరసభారతి ,,ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం ,మరియు ,అపరత్యాగ బ్రహ్మ మహా వాగ్గేయకారులు ,గాన గంధర్వ స్వర్గీయ శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారి దేవాలయం లో పుష్యబహుళ పంచమి మంగళవారం 17-1-17 సాయంత్రం 6-30 గం .లకుశ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన నిర్వ హింపబడుతోంది . రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో అయిదుగురు గాయనీమణులు త్యాగ రాజపంచరత్న కీర్తనలు ,,బాలమురళీ కృష్ణ కృతులు గానం చేసి స్వర నివాళి సమర్పిస్తారు .
శ్రీ బాల మురళి మరణించిన నెల రోజుల లోపుననే , దాదాపు ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ”స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ స్మారక పురస్కారం ”ను సరసభారతి ఏర్పాటు చేసి,, మా అమ్మాయి శ్రీమతి కోమలి ,విజయ లక్ష్మి ,శ్రీ సాంబావదాని(అమెరికా ) దంపతుల సౌజన్యం తో ఈ కార్యక్రమం లో గానం చేసిన గాయనీమణులు ఒక్కొక్కరికి 1,11 6 రూపాయలు నగదు పారితోషికాన్ని అంద జేస్తోంది .ఈ తొలి నగదు పురస్కారాన్ని స్పాన్సర్ చేసిన వారికి , తొలిపురస్కారాన్ని అందుకో బోతున్న ,గాయనీమణులకు హార్దిక శుభాభినందనలు .
సంగీత ,సాహిత్యాభిమానులందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
జోశ్యుల శ్యామలాదేవి -రోటరీ క్లబ్ అధ్యక్షులు

