’శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం’’ ఆవిష్కరణ మహోత్సవం
ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారిపై 1-శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు(విజయవాడ ) గారు రచించిన ‘’శ్రీ సువర్చలా సుందర వాయునందన శతకము ‘’2- మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ గారు(విజయవాడ) రరచించిన ‘’శ్రీ సువర్చలా వల్లభ శతకము ‘’3-శ్రీ మంకు శ్రీను గారు(కొప్పర్రు –ప.గో. జి .) రచించిన ‘’శ్రీ సువర్చలేశ్వర శతకము ‘’ అనే శతక త్రయాన్ని ‘’సరసభారతి’’ ప్రచురించి, మాఘ శుద్ధ నవమి 5-2-2017 ఆదివారం నాడు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గం .లకు జరిగే’’సామూహిక పాల పొంగింపు’’కార్యక్రమం ,ఉదయం 9 గం .లకు జరిగే ‘’సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం’’ అనంతరం ఉదయం 11-30 గం లకు స్వామి వారల సమక్షం లో ఆవిష్కరింప జేస్తున్నామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాము .
ఆవిష్కరణ అనతరం శతక కర్త త్రయానికి సత్కార ,సన్మానాలు నిర్వహింపబడును .భక్తులు ,ప్రచురణ పూర్వక విరాళాలు అందజేసిన దాతలు ,వదాన్యులు సాహిత్యాభిమానులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
1-శ్రీ సువర్చలా సుందర వాయు నందన శతకము –ఆవిష్కరణ –వై .వి .బి..శ్రీరాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు
2-శ్రీ సువర్చలా వల్లభ శతకము- –ఆవిష్కరణ –శ్రీ ఏ .యు.వి..సుబ్రహ్మణ్యం –ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ –ఉయ్యూరు
3-శ్రీ సువర్చలేశ్వర శతకము –ఆవిష్కరణ –శ్రీ పరుచూరి శ్రీనివాసరావు –శ్రీనివాస విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ –ఉయ్యూరు
గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు
శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయ ధర్మకర్త

