గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
12 6 -శ్రాద్ధ -హాస్యనాటక రచయిత -ఎస్.జగన్నాధ (19 5 6 )
ఎస్ .జగన్నాధ 19 5 6 అక్టోబర్ 12 కర్ణాటకలో జన్మించి ,సంస్కృతం లో ఏం ఏ ఫ్లూట్ లో విద్వాన్ అయ్యాడు .సంస్కృతం లో ‘’అంధకాసుర సంహారం కౌటి ల్యాభరణం ‘’నృత్య నాటికలు రాశాడు .శ్రాద అనే హాస్య హాస్యనాటకమూ రాశాడు .కాదంబరి ని ‘’పుండరీకం ‘’పేరుతొ పిల్లలకోసం రాశాడు .మందా క్రాంత వృత్తం లో ‘’తీరం ‘’ఖండకావ్యం ,కాళిదాస మేఘ దూతం కు పేరడీగా ‘’మేఘదూతం శంకరాచార్యుల ప్రస్థాన త్రయ భాష్యం పై ‘’బ్రహ్మ కావ్య ‘’అనే పురాణకావ్యం ,అర్దాలంకారాలపై 111 అలంకారాలను ఉదాహరిస్తూ వ్యాఖ్యానం తో ‘’లోకాలంకార పాణి కీయం ‘’,’’ఆభానక జగన్నాధ ‘’పేరిట 500 కొత్త సంస్కృత సామెతలను రాస్శాడు .
బాల సాహిత్యం గా ‘’రుజు రోహిత ‘’అనే 21 కధలు ప్రబంధ సౌద అనే వ్యాస సంపుటి ,వందనామాలిక అనే సంగీత కృతులు ,ఉత్తరాలు ఎలా రాయాలో తెలియ జేస్తూ ‘’పత్ర సౌదః ‘’బసవేశ్వరుని 200 వచనాలను ‘’వీచి మాలికా ‘’గా సంస్కృతం లో రాశాడు .భాష శిల్పాలపై గొప్ప పట్టు ఉన్నవాడు జగన్నాధ .
12 7 -భోజ విలాస ఏకాంకిక రచయిత -వాసుదేవ భాల్లాల (19 5 2
కర్నాటక ఉడిపి లోని అమ్బలపడి లో వాసుదేవ భాల్లాల పుట్టాడు .బెంగుళూరు సరస్వతి విద్యామందిర్ హై స్కూల్ లో బోధించాడు 19 7 6 లో ‘’భోజ విలాసం ‘’అనే ఏకాంకిక రాసి ప్రచురించాడు .భోజమహారాజు జీవితం సాహిత్యం పాలన వివరిచాడు .ఇందులో 6 దృశ్యాలున్నాయి .
12 8- స్వామి శివానంద విలాస మహాకావ్య కవి -రామ కృష్ణ భట్టు (19 50
వెంకమ్మ కృష్ణ భట్టులకు మంగుళూరు వద్ద కు౦బ్లాలో రామ క్రిష్ణభట్టు జన్మించాడు .ఢిల్లీ హిందూకాలేజీ లో సంస్కృత ప్రొఫెసర్ గా ఉన్నాడు .విద్యాభాస్కర విద్యా సాగర కవితా చతుర బిరుదులను స్వామి శివానంద ,ద్వారకా శ౦కరాచార్యుల నుండి పొందాడు .సంస్కృతం లో 11 కాండల ‘’శివానంద విలాసం ‘’పురాణకావ్యం ,గీతికావ్యంగా ‘’శ్రీరామ దాస గీత ‘’శ్రీ రామ కృష్ణ సహస్ర నామ స్తోత్రం ,గురు చరితం గురు సపర్య భక్తీ గీతాలు ,అర్జున అనే వచన పుస్తకం ,కావ్యోద్యానం ,కావ్య మంజరి అనే స్వీయ సంస్కృత శ్లోక కదంబం రాశాడు .వరాహ మిహిరుని ‘’బ్రహ్మ సంహిత ‘’కు సంపాదకత్వం వహించాడు .
కావ్యమంజరిలోని రెండు స్తబకాలలో 2 వేల శ్లోకాలు రాశాడు .మొదటి స్తబకం లో ఆరు భాగాలకు బాహ్య పుష్ప ,పాంచజన్య పుష్ప ,ఆతపత్ర పుష్ప ,సుమానుష పుష్ప ,సూనృత పుష్ప అని పేరుపెట్టాడు .రెండవ స్తబకాన్ని శతక స్తబకం అన్నాడు .ఇందులో వియోగినీ శతకం ,మందా క్రా౦త శతకం , ,ఉపజాతిశతకం ,మృత్యు పాశీయం అనే 4 శతకాలున్నాయి .
శివానంద విలాసం స్వామి శివానంద జీవిత చరిత్ర .మహాకావ్య లక్షణాలన్నీ పుష్కలంగా ఉండి,మంచి శైలీ విన్యాసంతో భక్తీ భావ బంధురంగా రచించాడు .అర్జున వచనరచన హృద్యంగా ఉంటుంది . కావ్యోద్యానం లో భాగవతం సారస్వతం పత్ర పుష్పం ,సాప్తపదీనం ,మౌక్తికం భాగాలున్నాయి .వైవిధ్యభరిత రచన ఇది .అతని వైదుష్యానికి ప్రతీకగా నిలుస్తుంది
12 9-సిద్ధ లింగ మహా కావ్య కవి -బసవ రాజ శాస్త్రి (19 50)
బసవ రాజ శాస్త్రి సంగమాంబ ,రుద్ర మూర్తి దంపతులకు 19 50 లో కర్ణాటకలో జన్మించి వ్యాకరణ తీర్ధ ,వ్యాకరణ శాస్త్రి సాహిత్య శిరోమణి డిగ్రీలనుపొందాడు .19 7 1 లో 26 కాండల 4 వేల శ్లోకాల ‘’సిద్హ లింగ మహా కావ్యం ‘’సిద్ధ లింగేశ్వరుని జీవితం పై రాశాడు .శక్తి విశిష్టాద్వైతాన్ని ,శక్తి స్థల మహాత్మ్యాన్ని చాలా గొప్పగా వర్ణించిన కావ్యం .ఇంద్ర వజ్ర ,ఉపేంద్ర వజ్ర ,ద్రుత విలంబిత ,మందా క్రాంత వృత్త శ్లోకాలతో రామణీయకత కల్పించాడు .కవి పొందిన డిగ్రీలకు గొప్ప సార్ధకత కల్పించిన మహా కావ్యమిది .
130- గాంధి సంస్మరణ సంభ్రమ ఏకాంకిక రాసిన -ఎస్.ఆర్ .లీల (19 5 2 )
ఇంగ్లీష్ లో ప్రసిధ ఏకా౦కి కలైన ‘’ది వాలియేంట్’’,’’రిమెంబర్ సీజర్ ‘’లను ఎస్ ఆర్ లీల ‘’అమరానాయకం ‘’గాంధీ స్మరణ సంభ్రమం ‘’గా సంస్కృతం లోకి అనువర్తనం చేసింది . దానిని బెంగుళూర్ కే వి ఆర్ మహిళా కాలేజి 19 91లో ‘’సంప్రయోగం ‘’పేరుతో ప్రచురించింది .
13 1-యమ గోపాల రాసిన -సి జి .పురుషోత్తం (19 50
మైసూర్ కు చెందిన పూర్వపు సంస్కృత ప్రొఫెసర్ కు వెంపు అనబడే కే వి పుట్టప్ప అనే కన్నడ రచయితరాసిన ‘’నంద గోపాల ‘’ను సంస్కృతం లో ‘’యమగోపాల ‘’గా అనువదించాడు .దీనిని బెంగుళూర్ జయ మూర్తి ప్రకాశాన్ 19 92లో అచ్చు వేసింది .
13 2-సోక్రటీస్ నాటకం రచయిత -ఆత్మా రామ శాస్త్రి (19 6 2
గ్రీకు తత్వ వేత్త సోక్రటీసు జీవితం పై సంస్కృతం లో ‘’సోక్రటీస్ ‘’నాటకం రాశాడు సంస్కృత ప్రొఫెసర్ ఆత్మా రామ శాస్త్రి .బొంబాయ్ భారతీయ విద్యాభవన్ మేగజైన్ ‘సంవిత ‘’ఆగస్ట్ సంచికలో ప్రచురితం .
13 3-సాక్షి శీల నాటక కర్త -హెచ్ వి సత్యనారాయణ శాస్త్రి(19 54)
గో.రు .చన్నబసప్ప కన్నడ నాటకం ‘’సాక్షికల్లు ‘’ను హెచ్ వి నారాయణ శాస్త్రి ‘’సాక్షి శీల’’గా సంస్క్రుతీకరించ గా బెంగుళూరు పల్లవ ప్రకాశన్ 19 8 9 లో ముద్రించింది ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా –
