గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 )

19 07లో ఉత్తరప్రదేశ్ ప్రతాపగ్హడ్ దగ్గర భాటిని గ్రామం లో హరినారాయణ ఓజా గా కరపత్రి స్వామి జన్మించాడు .హిమాలయ దశనామి ముని సంప్రదాయానికి చెందినవాడు .జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి బ్రహ్మానంద సరస్వతి కి ముఖ్య శిష్యుడు .వార ణాసి లో ‘’ధర్మ సంఘం ‘’స్థాపించాడు .జీవితం లో ఎక్కువకాలం కాశీ లో నే గడిపాడు .అద్వైత వేదాంతాన్ని బహుళ ప్రచారం చేసిన వారిలో కరపత్రి స్వామి ఒకడు 19 4 8 లో ‘’రామ రాజ్య పరిషత్ ‘’అనే రాజకీయ పార్టీ నెలకొల్పాడు .19 51లో లోక్ సభకు జరిగిన మొదటి ఎన్నికలలో ఈ పార్టీ 3 సీట్లు ఉత్తర ప్రదేశ్ లో గెలిచింది .దీనిద్వారా హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రచారం చేశాడు భారతీయులందరికీ ఒకే సివిల్ కోడ్ ఉండాలని,  అది ధర్మ శాస్త్రాలపై ఆధార పడి ఉండాలని కరపత్రి స్వామి వాదన . కాని ఆపలేక పోయాడు 19 5 8 లో తనపర్తీని జన సంఘ్ పార్టీలో స్వామి విలీనం చేశాడు .19 6 6 లో గో సంరక్షణ ఉద్యమం చేబట్టి ఆవులను చంపరాదని ,గో మాంసాన్ని నిషేధించాలని తీవ్రంగా దేశ వ్యాప్త ఉద్యమం చేశాడు .సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటానికి 19 48 ఏప్రిల్ 18 న’’సన్మార్గ్ ‘’అనే దిన పత్రిక పెట్టి నడిపాడు 19 8 2 లో 7 5 వయేట మరణించాడు .

 కరపత్ర స్వామి సంస్కృతం లో ‘’అద్వైత బోధ దీపిక ‘’అనే గ్రంధాన్ని 12 అద్యాయాలతో రాశాడు ఇది తమిళ ఇంగ్లీష్ భాషలలో అనువాదమైంది .’’టాక్స్ విత్ రమణ మహర్షి’’ నిరికార్డ్ చేసిన మునగాల వెంకట రామయ్య 8 అధ్యాయాలను ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు.అద్వైత బోధ దీపిక శంకరాచార్యులవారి అద్వైతాన్ని అతి సులభంగా తేలికగా అర్ధం చేసుకోవటానికి వీలు కలిగించింది .భగవాన్ రమణ మహర్షి ఎవరికైనా సందేహాలుంటే అద్వైత కర దీపికను చదివి హాయిగా అనుమాన నివృత్తి చేసుకోవచ్చునని దీనిని రికమెండ్ చేసేవారు .’’శ్రీ విద్య -వరివస్య ‘’అనే కరపత్రిస్వామి వ్యాసాలను సంకలనం చేసి స్వామి దత్తాత్రేయానంద అనే సీతారామ కవిరాజ ప్రచురించాడు

.ఇన్‌లైన్ చిత్రం 4ఇన్‌లైన్ చిత్రం 5ఇన్‌లైన్ చిత్రం 6

13 7-చైతన్య  చరితామృత కర్త -కృష్ణ దాస కవిరాజ గోస్వామి (15 20-16 17)

 భాగీరధ ,సునందల కుమారుడైన కృష్ణ దాస బీహార్ లో కత్వా లోని బర్ద్వాన్ జిల్లా  జమాత్ పూర్ దగ్గర సాలారాలో 15 20 లో బ్రాహ్మణ వంశం లో జన్మించాడు మరణం 16 17 . .కలలో చైతన్యుడు దర్శనమిచ్చి బృందావనం వెళ్ళమని బోధించాడు .బృందావనం చేరి తన గత జీవితాన్ని ఎవరికి చెప్పలేదు .హరికధలతో  హరి కీర్తనలతో కాలక్షేపం చేశాడు నిత్యానంద స్వామి ,మణికేతన రామ దాసు లు ఆహ్వానితులు గా వచ్చేవారు .విష్ణు దైవం వైష్ణవ భక్తుల సహకారం లేకుండా చైతన్య చరితామృతం రాయలేనని భావించి ప్రతి అధ్యాయం లో చైతన్య ప్రభుని అద్వైత ప్రచారకర్త నిత్యానంద ప్రభులను స్మరించాడు .వ్యాసమహర్షి భాగవతం లో క్రష్ణలీలను  వర్ణించినట్లే బృందావన గోస్వామి అయిన కృష్ణదాసు చైతన్య లీలా విలాసాలను వర్ణించాడు .దీనిని చైతన్య గౌడీయమతం ప్రచురించింది .మదన మోహనుడు చెబితే నేను ఒక చిలకలాగామళ్ళీ పలికాను అన్నాడు కృష్ణదాస .దీన్ని రాయటానికి స్వరూప దామోదరుని నోట్స్ ను ఆధారంగా చేసుకున్నాడు .కృష్ణదాస్ హృదయం లో చైతన్య నామం భావం మూర్తి బోధనా భక్తీ అన్నీ సంగమించాయి .చైతన్య చరితకు విశ్వనాధ చక్రవర్తి టీక రాశాడు .

 కృష్ణ దాస కవిరాజ స్వగ్రామం జమతాపుర లో ఒక చిన్న గుడిలో స్వామి నిత్యానంద పాద ముద్రలున్నాయి .క్రష్ణదాసుకు నిత్యానందుని అనుగ్రహం పుష్కలంగా ఉన్నదని శ్రీ కృష్ణ మంత్రం ఉపదేశించాడని ని స్థానికులు భావించారు .అందుకనే అదే ప్రదేశం లో నిత్యానంద పాదుకలను ఏర్పాటు చేసి స్మరిస్తారు .కాని కృష్ణదాస రఘునాధ గోస్వామివద్ద దీక్ష తీసుకున్నాడని  ప్రేమ విలాసలో ఉన్నట్లు చెబుతారు .ఇక్కడి దేవాలయం లో క్రష్ణదాసుని కొయ్య పాదుకలుఅంటే పాంకోళ్ళున్నాయి .కృష్ణదాస విగ్రహం, సమాధి రాదా కుండ్ లో ఉన్నాయి .రఘునాధ దాస స్వామి మరణం తరవాత కృష్ణదాస కవిరాజ గోస్వామి అశ్విని మాసం కృష్ణ ద్వాదశినాడు మరణించాడు .

ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

ఇన్‌లైన్ చిత్రం 1

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.