గౌతమీ మాహాత్మ్యం -16
26-శుక్ర తీర్ధం
ఆంగీరస ,భ్రుగు మహర్షులు పరమపావనులు .వీరికుమారులు జీవుడు ,కవి బుద్ధి రూప గుణాలలో గొప్పవారు .అంగిరసుడు ఆ ఇద్దరుపిల్లలకు సమబుద్ధి తో విద్యనేర్పిస్తాన౦టే,సరే అన్నాడు భ్రుగువు.కాని అన్నమాట నిలబెట్టుకోకుండా ఇద్దరికీ వేరేవేరే గా నేర్పాడు. కవి అనే శుక్రుడు అలా చేయటం తగదన్నాడు .ఇకచాలు వేరే గురువువద్ద నేర్చుకొంటా అని అనుమతిపొంది సహాధ్యాయి బృహస్పతికి కూడా చెప్పి ,తగిన గురువు గౌతముడు అని నిశ్చయించి చేరి తనకు తగ్గ గురువెవరో సెలవిమ్మనగా ‘’జగద్గురువు శంకరుడే ‘’అనగా ,ఎక్కడ ఉంటాడో అడిగి తెలుసుకొని గౌతమీ తీరం చేరి శుచిగా శివ ధ్యానం చేయగా పరమేశ్వరుడు ప్రసన్నుడై వరం కోరమనగా ‘’బ్రహ్మాది దేవతలకు ఋషులకు గోచరంకాని విద్య ప్రసాదించు నాకు ‘’అనగా మృత సంజీవనీ విద్య నేర్పాడు ..ఈ విద్యనేర్చి తండ్రిని చేరి దైత్యగురువయ్యాడు
ఆ తర్వాత ఎప్పుడో బృహస్పతి కొడుకు కచుడు కవి కి శిష్యుడై సంజీవనీ విద్య నేర్చుకున్నాడు .ఇతనినుండి దేవతలు నేర్చారు .అదే మృత జీవనీ విద్య గా ప్రసిద్ధమైనది .శివుని పూజించి శుక్రుడు ఎక్కడ ఆ విద్య నేర్చాడో అదే శుక్రతీర్ధం .ఆయురారోగ్యాభి వృద్ధి కలిగిస్తుంది ‘’అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-11-18-ఉయ్యూరు
