గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
344-న్యాయ సార కర్త –భా సర్వజ్ఞ(9-10 శతాబ్దం )
క్రీశ 9లేక 10వ శతాబ్దికి చెందిన భా సర్వజ్ఞ’’న్యాయ సారం ‘’రచించాడు .16 విభాగాలుగా ఉన్న న్యాయ శాస్త్రాన్ని ఏకీకృతం చేసిన’’న్యాయ సార శాస్త్రం రాసినవాడు భా సర్వజ్ఞ.ఆయన జనన విషయాలు పెద్దగా తెలియదు .కాశ్మీరానికి చెందినవాడై ఉంటాడని ఊహ .క్రీ.శ .775కు చెందిన సర్వజ్ఞ మిత్ర ,క్రీ.శ. 1025 కు చెందిన సర్వజ్ఞదేవ అనే వారు బాగా ప్రచారం లో ఉన్న కాశ్మీర కవులు .జైనకవులు గుణతంత్ర ,మాలదారి రాజశేఖరులు భా సర్వజ్ఞ ను పేర్కొన్నారు .యితడు సాంఖ్య సిద్ధాంతానికి దగ్గరవాడు . జైనులు మూడు ప్రమాణాలను అంగీకరించారు .కాని యితడు బౌద్దులవలె అవగాహన ,అనుమానం అనే రెండు ప్రమాణాలనే అంగీకరించాడని చెబుతారు న్యాయ సూత్రాలను నిరాకరించకుండా మోక్షాన్ని ఆత్మ గమ్యంగా చెప్పాడు .
14వ శతాబ్దం లో గంగోపాధ్యాయుడు రచించిన తత్వ చింతామణి తో న్యాయ శాస్త్రం నవీనమార్గం పట్టి,’’నవీన న్యాయ శాస్త్రం ‘’ ఏర్పడింది .గౌతమన్యాయ సూత్రాలతోగ్రంథరూపంగా ప్రారంభమై ,18శతాబ్దం లో ఉదయనాచార్య శివ విద్యా చార్యులవరకు ఈ శాస్త్రం ప్రసిద్ధ ఆచార్యుల హస్తాలలో ఉన్నది .తర్వాత నవీన న్యాయం పేరుతొ పండితుల పరమైంది .’’The race of grants was to be succeeded by a remarkably versatile and disputatious troop of dwas philosophy lost its freshness as well as its charm ,and gradually degenerated into a bundle of endless contro versies ‘’అన్న మహా దేవా రాజా రామ దాస్ మాటలు సత్య దూరం కాదు అన్నారు నోరి నరసింహ శాస్త్రిగారు .న్యాయ సారం అలాంటి ఆచార్య నైయాయకుని గ్రంథం అవటం వలన సంభావ్యమై౦దన్నారు .ఇందులో సూత్ర వ్యాఖ్యాతలను విమర్శించటమే కాక ,అక్కడక్కడ గౌతమ సూత్రాల ప్రత్యక్షార్దానికి మరొక సమన్వయము కూడా చేశాడు .
దీని వ్యాఖ్యానాలలో వాసుదేవ విరచిత ‘’న్యాయ సార పద పంజిక ‘’ను ఇంతకు పూర్వమే పూనావారు ప్రచురించారని ,ఇప్పుడు దీనితోపాటు ప్రచురితైన’’ న్యాయముక్తావళి’’ శ్రేష్టమైనదని శాస్త్రిగారి భావన .దీన్ని 12వ శతాబ్దం లో కొంకణ రాజ్యమేలిన ‘’అపరార్క దేవుడు ‘’అనే రాజు రాశాడు .ఇది స్వతంత్ర సమర్ధ రచన అంటారు .దీనిలో న్యాయమతాన్ని ఖండించిన బౌద్ధ జైన మీమాంసక మతాచార్యుల నేకాక ,తాను స్వయంగా అద్వైతి అయినా,మొహమాటం లేకుండా వాచస్పతిమిశ్రా రాసిన ‘’భామతి ‘’ని కూడా కొన్ని చోట్ల ఖండించాడు .న్యాయ కళానిధి అసంపూర్ణ వ్యాఖ్యానం .అయినా న్యాయ శాస్త్రం నవీన మార్గం పట్టకముందే 13వ శతాబ్దం లో రాయబడింది కనుక దాని విలువ తెలిసి చివరలో ముద్రించారు .ఇది న్యాయ శాస్త్రాభిమానులకు సంతోషించదగిన విషయం అన్నారు .
గ్రంథ సంపాదకులలో శ్రీ ఎస్ సుబ్రహ్మణ్య శాస్స్త్రి గారు ఇంగ్లిష్ లో ,శ్రీ వి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంస్కృతం లో ఉపోద్ఘాతాలు రాశారు .ఈ రెండూ భేషుగా ఉన్నాయి .భా సర్వజ్ఞుడు కాశ్మీరీ అనటానికి చెప్పిన కారణాలు సంతృప్తిగా లేవు .’’ప్రణమ్య శంభుం జగతః పతిం పరం ‘’మొదలైన ప్రారంభ శ్లోకాలవలన అప్పటికే కాశ్మీర్ లో శైవం బాగా వ్యాపించి ఉంది .సర్వజ్ఞ శబ్దం – సర్వజ్ఞ మిత్రుడు సర్వజజ్ఞ దేవుడు అనే వారి పేర్లలో ముందు ఉంటె ఈకవి పేరులో తర్వాత ఉండటం గమనార్హం. ఆంధ్ర దేశం లోనే సర్వజ్ఞ ,సర్వజ్ఞ చక్రవర్తిబిరుదులున్నవారు చాలామంది ఉన్నారు .శివభక్తి భారత దేశమంతా వ్యాపించే ఉంది కనుక కవి శైవుడు అనలేము అంటారు నోరివారు .’’యత్త ద్బ్రహ్మ జగద్బీజ మాను నంత్యా గామోక్తయః –శ్రీమచ్ఛివకర గ్రామ వాస్తవ్యం వస్తుతః (తత్ )స్తుమః ‘’అనే పాఠా౦తరాన్ని గ్రహిస్తే శైవుడు అనేది నిరాదారమవుతుంది .శివ గ్రామం ఎక్కడిదో తెలిస్తే కవి ఎక్కడి వాడో తెలుస్తుంది అంటారు శాస్త్రీజీ .
ఆధారం –‘’నోరి సమీక్షలు ‘’పుస్తకం లో శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు 1962 భారతి సెప్టెంబర్ లో చేసిన సమీక్ష
345-శ్రీ వేదాంత పంచ దశ సార సంగ్రహ కర్త –శ్రీ ముదిగొండ వెంకట రామ శాస్త్రి (20 వ శతాబ్దం )
శ్రీముదిగొండ వెంకట రామ శాస్త్రిగారు రచించిన ఈ గ్రంథం ఓం కార మందిరం చేటపాపాయపాలెం ,బెల్లంకొండ పోస్ట్ ,గుంటూరు జిల్లా లో ముద్రితం .శాస్త్రిగారు ‘’సంగ్రాహకః బ్రహ్మ విద్యాలంకారులు .294శ్లోకాల వివేక పంచకం ,848శ్లోకాల దీపపంచకం ,429శ్లోకాల ఆనంద పంచకం లనుండి వరుసగా 123,270,166శ్లోకాలను మాత్రమె ఏరి మూల గ్రంథస్వరూపం స్పురించేట్లు కూర్చిన సంగ్రహ గ్రంథం .గ్రంథం చివరలో సంస్కృతం లో భూమిక ,సంస్కృతం లోనూ తెలుగులోనూ వేరువేరుగా తాత్పర్యాలు రాసి చేర్చారు .భూమికలో ఆధునికులను విమర్శించారు .మూల గ్రంథకర్త శ్రీ విద్యారణ్య స్వామి .కాని ఆయనతోపాటు భారతీ తీర్ధ కూడా రాసినట్లున్న శ్లోకాలున్నాయని నోరి నరసింహ శాస్త్రి గారి అభిప్రాయం .ఆంద్ర వ్యాఖ్యానం శ్రీ రాయప్రోలు లింగన సోమయాజులు రాశారు .
సంగ్రహ కర్త శ్రీ ముదిగొండ వారు ‘’నమః శ్రీ శంకరానంద గురు పాదాంబు జన్మనే ‘’అనే ప్రారంభ శ్లోకాలలో శంకరాచార్యులను స్మరించారో లేక అదే పేరున్న తమ గురువు ను స్మరించారో అంటారు నోరివారు .శ్రుతికి అపౌరుషేయత్వం సాధించిన మీమా౦సకులను అందర్నీ సంగ్రహకర్త ‘’క్షుద్ర కోటి ‘’లో చేర్చటం ,ఆంద్ర దేశం లో ఆనాటి పండితులలో అగ్ర కోటికి చెందిన శ్రీ ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారి ‘’ అక్షుద్ర ప్రతిభ’’కు నిదర్శనం కాదన్నారు నోరివారు .
మనవి –గీర్వాణకవుల గురించి రాయటం మొదలు పెట్టినదగ్గర్నుంచి శ్రీ ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారి గురించి రాయాలనుకొని ఎందరెందరినో అడిగితె ఎవరూ నాకు ‘’ఉప్పు’’ అందించిన వారు లేకపోయారు .ఇప్పుడు వారి గురించి కొద్దో గొప్పో రాసే అవకాశం శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు 1963 మే లో భారతి లో రాసిన సమీక్ష వలన సిద్ధించింది .
ఆధారం -‘’ శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి వారికుమారులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (హైదరాబాద్ )నాకు అందజేసిన విలువైన పుస్తకం -’నోరి ‘’సమీక్షలు’’.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-12-18-ఉయ్యూరు
,
—

