ఆ ఒక్కటి తప్పా అంతా బాగానే జరిగింది
సరసభారతి 138 వ కార్యక్రమంగా శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక రోటరీ క్లబ్ ఆడిటోరియం లో 31-3-19 ఆదివారం సాయంత్రం 4-30 గంటలకు దివ్యంగా జరిగింది .
మొదటగా ”స్త్రీ శక్తి ”పై కవి సమ్మేళనం శ్రీమతి గుడిపూడి రాధికారాణి ఆధ్వర్యం లో వైభవంగా ప్రారంభమైంది . కృష్ణా జిల్లా నుంచేకాక ఇతర జిల్లాలనుంచి బెంగుళూరు నుంచికూడా కవులు మహా ఆసక్తిగా పాల్గొని తమ కవితా స్వరం వినిపించారు .ఇందులో లబ్ధ ప్రతిష్టులు వర్ధమానవులూ ,పురుషులతో సమానంగా మహిళా కవులు సుమారు 36మంది పాల్గొని జయప్రదం చేశారు అయితే కవి సమ్మేళనం లో కవిత చమక్కులతో ,హృదయాన్ని యిట్టె ఆకర్షించాలి అన్న ప్రాధమిక సూత్రం దాదాపు చాలామంది మర్చి పోయారు .కనుక రావలసినంత వాసిగలకవిత్వం రాలేధనిపించింది .ముగింపువాక్యాలు మనసులో నిల్చిపోవాలి చెరగని ముద్రవేయాలి . ఎన్నికల హడావిడి, ఎన్నికల విధి నిర్వహణలో తలమునకలు అయినా కవి మిత్రులు ఇంత విశేష సంఖ్యలో రావటం అరుదైన రికార్డ్ . అందరికి అభినందనలు
కవి సమ్మేళనం తర్వాత పుల్వామా దాడిలో మరణించిన వీర అవాన్లకు ,ఇటీవల కాలం లో మరణించిన ద్వా.నా శాస్త్రి ,వింజమూరి అనసూయ ,కోడి రామకిష్ణ ,ఉప్పులూరి మల్లికార్జున శర్మగార్లకు సంతాపం ప్రకటించటం జరిగింది
ఏప్రిల్ 4 న ఢిల్లీ లో రాష్ట్రపతి నుంచి సంస్కృత భాషా సేవకు పురస్కారాలు అందుకో బోతున్న ,శృంగేరీ శారదాపీఠ ఆస్థాన విద్వా0శులు మహాభారతం లో ”ధ్వని దర్శనం ”పరిశోధకులు ,బహు గ్రంధకర్త ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారికి ,ఉస్మానియా రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ ”పూర్వ మీమాంస భాష్య వార్తిక టీకా భేదాల ”పరిశోధకులు డా బూరగడ్డ నరసింహా చార్యులు గారికి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియ జేశాము
మూడు పుస్తకాల ఆవిష్కరణ ముచ్చటగా జరిగింది .డా రామయ్య గారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ భీమవరం మచిలీపట్నం విజయవాడ లనుండి అత్యంత ఆసక్తిగా విచ్చేసి సభకు వేదికకు నిండుదనం చేకూర్చారు .”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకట రామయ్య ”పుస్తకం అంటే బుక్ లెట్ కరదీపిక అమెరికాలో టేనస్సీ రాష్ట్రం లోని రామయ్య స్వగృహం లోనూ అలబామా రాష్ట్రం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి హంట్స్ విల్ దగ్గరున్న మాడిసన్ కౌంటీ లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ 2018అక్టోబర్ 16 17 తేదీలలో ఆవిష్కరించటం ,ఈ రోజు ఆయనే మూడవసారి ఈ వేడుకలలో రామయ్యగారి బంధు వర్గం సమక్షం లో సకల సాహితీ బంధుగణం సమక్షం లోనూ ఆవిష్కరించి ”హాట్రిక్ ”సాధించారు .
”ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత -డా పుచ్చా వెంకటేశ్వర్లు ”పుస్తకాన్ని డా ఉప్పల దడియం వెంకటేశ్వర ఆవిష్కరించగా ,”దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవ భాగం ”పుస్తకాన్ని ఆధ్యాత్మిక వేత్తశ్రీనోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ గీతా సుబ్బారావు గార్లు ఆవిష్కరించారు
స్వర్గీయ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీ మతి భవానమ్మ స్మారక శ్రీ వికారి ఉగాది పురస్కారాలు ”ను శ్రీ నోరి ,శ్రీ గీతా , శ్రీ ఉప్పలదడియం గార్లు అందుకున్నారు స్వయం సిద్ధ అవార్డు లను శ్రీ మతి కమలాకర్ భారతి ,శ్రీ మతి కోనేరు లక్ష్మీ ప్రమీల ,కుమారి చలమల శెట్టి నిఖిల ,శ్రీ కొల్లూరి వెంకటరమణ ,శ్రీ కడలి వెంకటరమణా రావు శ్రీ ప్రకాష్ ,ప్రొఫెసర్ పి .ఆర్ కె.ప్రకాష్ గార్లు స్వీ క కరించారు. .
సన్మానితులందరిని సరసభారతి అధ్యక్షలు దుర్గాప్రసాద్ దంపతులు ,గబ్బిట శాస్త్రి సమత దంపతులు గబ్బిట శర్మ గబ్బిట రామనాధబాబు గబ్బిట వెంకట రమణ శ్రీమతి మహేశ్వరి దంపతులు ,గబ్బివారి కోడలు శ్రీమతి రాణి ,మనవలు గబ్బిట హర్ష ,చరణ్ ,మనవరాలు గబ్బిట రమ్య చందన తాంబూలాలు నూతనవస్త్రాలు ,పన్నీరు జల్లులతో ,శాలువా ,జ్ఞాపిక నగదుతో ఘనంగా సన్మానించారు
రామయ్య గారి కుటుంబ సభ్యులనూ నూతన వస్త్రాలు జ్ఞాపికలతో ఉచిత రీతిగా పై విధం గానే ఆత్మీయంగా సత్కరించారు .
ఊహించని సన్ని వేశం ఒకటి చోటు చేసుకొన్నది . శ్రీ గీతా సుబ్బారావు గారు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామికి సరసభారతి కార్యక్రమాలకు 10వేల రూపాయల చెక్ ను దుర్గాప్రసాద్ కు అందజేసి అందరినీ ఆశ్చర్య పరచటమేకాకుండా తనకు కవర్ లో పెట్టి అందజేసిన నగదు నుకూడా సరసభారతి కార్యక్రమాలకు వినియోగించమని వెనక్కి తిప్పిఇచ్చేసి మరింత ఆశ్చర్యానికి గురి చేశారు .శ్రీ నోరి శాస్త్రి గారు తమకు అందజేసిన నగదును సరసభారతికే తిరిగి ఇచ్చేశారు .అలాగే శ్రీ పిఆర్కే ప్రసాద్ గారుశ్రీమతి కోనేరు లక్ష్మీ ప్రమీల ,శ్రీమతి కమలాకర్ భారతి ,శ్రీ కడలి వెంకటరమణారావు శ్రీ ప్రకాష్ గార్లు కూడా తమ కు అందేసిన నగదును సరసభారతి కార్యక్రమాలకే విని యోగించమని ఇచ్చేసి తమకు సరసభారతిపై ఉన్న గౌరవాన్నీ ఆత్మీయతను తెలియ బరచుకొన్నారు . ఇలా జరగటం ఇదే మొదటి సారి అవటం తో మేమూ ”అవాక్కు ”అయ్యాము . వారి సౌజన్యానికి చలించాం . ఇది కొంత ”అంబరాసింగ్ ”విషయమే .
కవులంరినీ శాలువాలతో జ్ఞాపికలతో సత్కరించి సరసభారతి , సాహితీబంధువులైన కవి మిత్రులపై ఉన్న గౌరవాన్ని చాటుకొన్నది .ఇంతమందికి ఇలా చేయటము మాకు ఒక అరుదైన రికార్డే .
సభ ప్రారంభం ముందు అందరికి బలమైన అల్పాహారం ఏర్పాటు చేయటం సభ అనంతరం అందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి సరసభారతి తన ఆత్మీయతను ఆచరణలో కనబరిచింది
సాయంత్రం 4-30కు ప్రారంభమైన కార్యక్రమం రాత్రి 8-30 వరకు నాన్ స్టాప్ గా జరగటం కూడా ఒక విశేషం .
అయితే సన్మాన గ్రహీతలకు తమ స్పందన తెలియ జేసే అవకాశం కల్పించలేకపోవటం మా పెద్దలోపం గా భావిస్తూ అందరికి సవినయంగా క్షమాపణలు తెలియ జేస్తున్నాను . ఈవిషయం శ్రీ నోరి,శ్రీ చలపాక ,శ్రీ ఉప్పలదడియం నా దృష్టికి తెచ్చినందుకు నేను బాధపడటం లేదు వారిని అభినందిస్తున్నాను . ఇకనుంచి ఇలాంటివి జరగకుండా చూస్తానని హామీ ఇస్తున్నాను .
కడలి రమణారావు నా శిష్యుడు ఆ దంపతులు .మా సువర్చలాన్జనేయ స్వామి పదభక్తులు .గురువుగారి పై ఉన్న గౌరవంతో మా దంపతులకు నూతన పట్టు వస్త్రాలు అందజేసి సత్కరించి గౌరవించటం ఈ సందర్భంగా మరువ లేని విషయం .
కెమెరా మెన్ లు అక్కడి హోమ్ గార్డ్ ,కేటరింగ్ సిబ్బంది అందరికీ జ్ఞాపికలు అందజేసి అభినందించాం .
వయసు మీద పడుతోంది ఇక కార్యక్రమాలకు కొంచెం దూరంగా ఉందామని నిర్ణయం ఈ సభలోనే ప్రకటిద్దామని అనుకొన్నాను. .కానీ శ్రీ గీతా, శీ నోరి మొదలైన వారు నా నోరు కుట్టేసి మేము అందజేసిన నగదు బహుమతులను తిరిగి మాకే ఇచ్చేసి అదనంగా కూడా డబ్బు సరసభారతి అందజేసినందుకు కిక్కురు మనకుండా నోరు మూసుకోవాల్సి వచ్చింది .ఏ నాటి సాహితీ బంధమో ఇది అందర్నీ మాసువర్చలాన్జనేయ స్వామి ఇలా కలిపి ”నువ్వు ఎవడివిరా విరమించుకోవటానికి .ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ”అని హనుమ ఆజ్ఞాపించినట్లని పించింది .శిరో ధార్యంగా భావిస్తున్నాను .
సభలో సుమారు 120మందిప్రేక్షకులు ఉగాది వేడుకలను కనులార్పకుండా వీక్షించారు .ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుమారు రెండు వేలమంది వీక్షించినట్లు మా అబ్బాయి రమణ చెప్పాడు .మరచిపోలేని ఆనందానుభూతి .
మధ్యాహ్నం మా ఇంట్లోను రామయ్యగారి బావమరిది శ్రీ కృష్ణ ప్రసాద్ దంపతులు ఉయ్యూరు ప్రభుత్వ పాలిటెక్నీక్ లో 1953 లో చదివి పాసై ,బి యి ,ఏం యి కూడా పాసైన ఇంజనీర్ ,ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నోరి వారు మళ్లీఇన్నాళ్ళకు ఇన్నేళ్లతర్వాత ఉయ్యూరువచ్చిమా ఇంట్లో అతిధిగా ఉండి తమ బిటెక్ శిష్యుడైన శ్రీ విద్యోపాసకుని తో పాటు ,శ్రీమతి కమలాకర్ భారతి శివ లక్ష్మి కుటుంబం మల్లికాంబగారు మా అబ్బాయిలు కోడళ్ళు మనవాళ్ళు మనవరాలు మొదలైనవారు మా శ్రీమతి, కోడళ్ళు హాయిగా వండి వడ్డించిన మామిడికాయపప్పు వంకాయ కూర ,మెంతికాయ,బొబ్బట్లు పులిహోర ,రసం మజ్జిగపులుసు గడ్డపెరుగు బాసుందీ తో కమ్మని విందు ఆరగించిన0దుకు మా మనసుకు ఎంతో తృప్తిగా ,సంతృప్తిగా ఉంది ,నోరి వారి లాంటి ఆధ్యాత్మిక వేత్త మా ఇంటి అతిధి అయినందుకు ,మా ఇంట భోజనం చేసినందుకు మాకు గర్వంగా ఉంది ,.వచ్చినవారంతా మా ఆత్మీయ ఆతిధ్యాన్ని పొందటం మా అదృష్టం .
సరసభారతి కి ఇంతటి ఆత్మీయత ఆదరణ కలుగజేసి వెన్ను దన్నుగా నిలిచిన సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు ఉగాది శుభాకాంక్షలు . నిజంగానే ఉయ్యూరు కు వసంతం ఆరు రోజులముందేవచ్చి కవితాకాలకూజితాలను వినిపించి పులకరింప జేసింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-19 -ఉయ్యూరు

