21-కుందావఝల గోపాలసూరి
కరీం నగర్ జిల్లా ములకనూరుకి చెందిన కుందావఝల గోపాలసూరి ‘’సంవరణ చరిత్రము ‘’రాశాడు .సుమారు 1850కాలం .బ్రహ్మ వైవర్తపురాణ౦ లోని ‘’శ్రీక్రష్ణజన్మఖండం ‘’కావ్యం కూడారాశాడు కాని అముద్రితం .ములకనూరు హనుమకొండకు దగ్గర .అక్కడ మోతుకూరివారి౦టశ్రీక్రష్ణజన్మఖండం కావ్యాన్ని తానూ చూశానని బిరుదురాజువారువాచ .గోపాలసూరి పండరినాధుడు అనేకవికి సమకాలికుడు .
సంవరణ చరిత్ర అంటే తపతీ –సంవరుణుల ‘’కథ .అద్దంకి గంగాధరకవి ‘’తపతీ సంవరణఉపాఖ్యానం ‘’ప్రబంధవిధానం లో రాశాడు .రాజుగారివద్ద 233పద్యాల ప్రధమ ఆశ్వాసం మాత్రమె ఉందట .కవి కౌండిన్య గోత్రీకుడు .తాత నాగశాస్త్రి .తండ్రి వెంకటశాస్త్రి .పెద్ద ప్రబంధంగా రచించే ప్రణాళిక తో ఉన్నట్లు కనిపిస్తుంది .ఇష్టదేవతాస్తుతి ,పూర్వకవి స్తుతి కుకవినింద ,శ్రీ వెంకటేశ్వరునికి అంకితముగా షష్ట్యంతాలు ,సూతర్షి మహర్షులకు ఈ కథ వివరించటం ,హస్తినాపురం అక్కడి విశేషాలు హస్తినరాజైన సంవరుణుడి కీర్తిప్రాభవాలు, తపతీ సౌందర్యమ .ఇద్దరిమధ్యప్రేమ ,నారద రాయబారం ,తల్లి చాయాదేవి దగ్గర తపతి భజన. వేటకై వచ్చిన సంవరుణుడు చూడటం ,ఆమె సఖి కీరవాణి భూలోకపు వింతలు తల్లికి చెప్పటం ,విరహం ,సంవరుణుడిని తెచ్చి తపతికి అప్పగిస్తానని కీరవాణి చెప్పటం మొదటి ఆశ్వాసం కథ.
విష్ణుస్తుతి –
‘’శ్రీ రంజిల్లమనోజ్ఞ సౌధమున లక్ష్మీ భూవదూటుల్ ప్రియో-దార స్వానురతానురాగగరిమల్ తర్కి౦పగా గూఢసం
చారు౦డై చని ,భూమి దేవి నాయనాబ్జాతంబులన్ మూసి శ్రీ –నారిన్ చుంబన కేళి దేల్చు విభునిన్ భావింతు భావంబునన్ ‘’
శివపార్వతుల వర్ణన –
‘’యెక్క కోడెలమిన్న మెక్కగా విసమెన్న జడముడిపై పాలకడలి వెన్న –యొడలునిండ విభూతి ,ఎడమ దిక్కున నాతి,కడకంట నమృతంబు వెడలు రీతి
మెడను పాములజోడు ,మేటి గుబ్బలవీడు మొనసి కరంబున ముద్దు లేడు-ఎదను పున్కల చెన్ను ,నుదుట చిచ్చులకన్ను ,సరిలేని కేశపు౦జములు మిన్ను
సకల దేశస్దు ,డఖిల యోగీంద్ర హృదయ –జలజమదధుపాయ మానుండు శ౦కరు౦డు
భూరికారుణ్య రస ఝరీ పూర్ణ దృష్టి-మించి మత్కావ్య మరసి పోషించుగాత’’
‘’తొడలపై నిషణ్ణు డయితోరపు వేడ్క మనంబు నిండ చ –న్గుడుచుచు కుమారు నాస్యమున కోమలనీల నిజేక్షణ౦బులన్
బొడగని కప్పు కాటుకను ,బుద్ధి కరంబున మాటిమాటికిన్ –దుడుచు గిరీ౦ద్ర కన్య దయతోడుత మత్క్కృతి పెంపు జేయుతన్’’
ఇతర కవుల సానుభూతికోసం –‘’కడుపుని౦డా కాన్పు కన్నవారికి ఇతరులకాన్పు పై కరుణ కలిగినట్లు ,తానూ కావ్యకర్త ఐనవాడు ఇతరకవులకావ్యాలపై సానుభూతి చూపిస్తాడు ‘’అన్నాడు .
తపతిపై మనసుపారేసుకొన్న సంవరుణుడు –
‘’ ప్రణుతింప లోకేశ్వరత్వ మాత్రమెకాదు ,కమలాసనత్వము కలిగి యుండు –శ్రీ మోహనత్వ సంసిద్ధి మాత్రమె కాదు,ఘనసంభవ దశత్వ మెనయు చుండు
సరవి రాజావతంసత్వ మాత్రమెకాదు,ధవళ దేహత్వంబు దనరు చుండు –కనుగొన జైవాతృత్వమెకాదు ,రామాతను ప్రీతి ప్రబలియుండు
నహహ రాజన్యవరుడు దుస్సహవియోగ –భారపరిభూతుడై ,బ్రహ్మ శౌరి శర్వ
కైరవాప్తుల కెనయయ్యె చారులీల –ధూర్జటికిని క౦ఠ నైర్మల్యంబు తొడవుగాదె’’
సరస్సు వర్ణన –
‘’నిఖిల యువజన జనకలా నిరత సరసి –జాశుగా దీర్ణసింహనాదానుకారి
బర్హి నినదంబు తత్సరః పరిసరంబు –జగధదీశుండు సూచి యుత్సవము బొందె’’
మంఛి కావ్య రచన చేసిన కుందా వఝల గోపాలసూరి కావ్యమంతా లభించి ఉంటె బాగుండేది .మొదటి ఆశ్వాసపు మెతుకును బట్టి మిగిలినకావ్యాన్నపచనం గురించి చెప్పాల్సి వచ్చింది .
ఆధారం –ఆచార్య బిరుదురాజు రామరాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు

