గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4
422-అజ్ఞాత కవయిత్రి –(17వ శతాబ్దికి పూర్వం )
పేరు ఊరు తెలియని 17వ శతాబ్దికి ముందున్నట్లుగా భావింపబడే ఒక అజ్ఞాత కవయిత్రి ఒకే ఒక్క శ్లోకం ఒకటి ‘’శుభాషిత హారావళి ‘’లో బయటపడింది .ఇది ప్రేమ సందేశం .కాని చాలకవితాపరంగా అల్లింది .క్షోభించిన హృదయం పడే వేదనకు ఈ శ్లోకం ప్రతిబింబం .-
‘’పురుష వదోషి తోషి కవీ భవేయుః -సంస్కారో హృగత్మని సమవైతి న స్త్రైరపం పౌరుషం వా విభాగ మపేక్షతే –శ్రూయంతే హృశ్యంతే చ రాజ పుణ్యో మహామాత్య దుహితరో గణికాః కైతుకి భార్యంచ శస్త్ర ప్రహత బుద్ధయః కవయంచ ‘’
423-భావదేవి (10వ శతాబ్దం )
భావదేవి లేక భావకాదేవి కి చెందిన మూడు శ్లోకాలు మాత్రమే దొరికాయి.అందులో ఒకటి హారావళి లో మరోటి ‘’కవీంద్ర వచన సముచ్చయం ‘’లో మిగిలినది ‘’సదుక్తి కర్ణామృతం ‘’లో ఉన్నాయి.వీటికాలాన్నిబట్టి భావదేవి 10వ శతాబ్దికి చెంది ఉండవచ్చు.కవీన్ద్రవచన సముచ్చయం లోని శ్లోకం స్త్రీ వక్షోజం పై శ్లేషగా చెప్పబడింది .రెండవది ప్రియునితో జరిగిన ఎడబాటు ,మళ్ళీ కలయిక వర్ణించబడింది .ఒకరకంగా జీవేశ్వరుల ఎడబాటు కలయిక గా అన్వయించుకోవచ్చు .మూడవది భార్యదగ్గరకు భర్తవచ్చి కాళ్ళపై పడటం ,కానీ ఆమెలో మార్పురాకపోవటం ,చివరకు భర్తమంచితనాన్ని అర్ధం చేసుకొని తనను క్షమించమని భార్యకోరటం.
కవయిత్రి స్త్రీ సహజమైన మనోభావాలను అద్భుతంగా ఆవిష్కరించింది .మంచి శైలి ,మధుర అర్ధవంతమైన సందర్భోచిత శబ్దాలతో కవిత్వం పరిమళించింది .శృంగార రసాన్ని అద్భుతంగా పోషించగలనేర్పు కనిపిస్తుంది .మొదటిశ్లోకం లో శ్లిస్ట సమాసోక్తి, రెండవదానిలో అతిశయోక్తి మూడవశ్లోకం లో అర్ధాంతరన్యాసం ,ఆక్షేపం రంగరించింది ‘
1-రాజన్మానౌ తుల్యా విభజన భువా జన్మ చ సహ – ప్రవృద్ధౌనామ్నా చ స్తన్ఇతిసమానా వుదాయినౌ
మిధః సీమామాత్రే యదిదమనయో ర్మండల వతౌ-రపి స్పర్దాయుద్ధం తదిహహి నమస్యః కఠినిం.
424-చండాల విద్యా (4వ శతాబ్దం )
మహాకవి కాళిదాసుకు సమకాలికురాలైన చండాలవిద్యా విక్రమార్క మహారాజు కు అత్యంత ఇష్టమైన ఆస్థానకవయిత్రి .విక్రమాదిత్య చండాలవిద్యా కాళిదాసు కవిత్రయ శ్లోకం ‘’సదుక్తి కర్ణామృతం ‘’లో ఉంది.పున్నమి నాటిరాత్రి చంద్ర కాంతి పాలలాగా భూమిపై చేరి జనులకు అలసట తీరుస్తున్నట్లువర్ణించబడిన శ్లోకం అది
‘’శ్రీ రంభోసి మిజ్జతీవ దివాసవ్యాపార ఖిన్నం జగ-తత్ క్షోభా జ జల బుద్ధబుద్ధా ఇవ భావన్యాలో హితాస్తారకాః
చంద్రం క్షీరమివ క్షరత్యవిరతం ధారా సహస్రోతు కరై-రుద్వగ్నీ వై స్త్రుతిశితై రివాద్య కుముదై ర్జోతుస్మాపాయః పీయతే
చండాల విద్యా-విక్రమాదిత్య –కాళిదాసానాం ‘’(శార్దూల విక్రీడితం )
425-చంద్రకాంత భిక్షూని(–)
బౌద్ధభిక్షుకి చంద్రకాంత భిక్షూని నేపాల్ కు చెంది ఉంటుంది .ఆమె రాసిన 8 శ్లోకాల అవలోకితేశ్వర స్తోత్రం మాత్రమె దొరికింది .దీనిలో అవలోకితెశ్వరుని శారీరక బౌద్ధికమానసిక పరిణతి వర్ణించింది .ఆయన పూర్ణ చంద్ర నిభాననుడు .తామరరేకులలాంటి కనులు .చేతులు కాళ్ళు తామర తూడులు .రాయ౦చనడక .విజ్ఞాన పయోనిధి .బాధితుల ఆర్తి తీర్చే కరుణామయుడు .గురువు మార్గదర్శి .
చంద్రకాంత కవిత్వం హృదయపు లోతుల్లోంచి భక్తిభావంతో మహాయాన బోధిసత్వ అవలోకితేశ్వరునిపై పెల్లుబికి ప్రవహించింది .స్తోత్రం తోటక వృత్తం లో రాయబడింది –
‘’భువనత్రయ వందితలోక గురుం –అమరాధిపతి స్తుతి బ్రహ్మవరం –మునిరాజవరం యుతిసిద్ధకరం –ప్రణమాణ్యవలోకిత నామ ధరం ‘’
‘’సుగతాత్మజరూప సురూపధరం –బహులక్షణ భూషిత దేహధరం –అమితాత్మ తథాగత మౌలిదరం-కనకాబ్జ విభూషిత వామకరం ‘’
‘’కుటిలామల పింగల ధూమ్రజటం-శశి బింబ సముజ్జ్వల పూర్ణముఖం –కమలాయత లోచన చారుకరం –హిమఖండ విమండల పుండ పుటం ‘’
చివరి శ్లోకం –
‘’పరిపూర్ణ మహామృత లబ్ధ ధృతిం –క్షీరోద జలార్ణవ నిత్యగతిం –శ్రీ పోతలకాభి నివాస రతిం –కరుణా కరుణామయ నిర్మల చారు భ్రుశం ‘’
‘’ఇతి శ్రీ మదార్యావలోకితేశ్వర భట్టారకస్య చంద్రకాంతా –భిక్షుణీ స్తవ స్తోత్రం సమాప్తం ‘’
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-19-ఉయ్యూరు

