గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన
సంస్కృత ప్రాకృత కవయిత్రులకు ప్రేమ అతిముఖ్యమైన అంశం .ఇద్దరికీ అగమ్య గోచరమైన విధి ,దేవుడు విషయాలపై ఉదాసీనంగా ఉన్నారు .వీటికోసం కవితా మేధస్సును వృధా చేసుకోరాదని భావించారు .అజ్ఞాతం అజ్ఞాతంగానే ఎప్పుడూ ఉండిపోతుందని , .దీనికోసం ఆరాటం వృధా అనుకొన్నారు .
ప్రాకృత కవయిత్రులు రెండు నూతనమైన ప్రేమమార్గాలను తెలిపారు .ఈపని సంస్కృత కవయిత్రులు చేయలేకపోయారు .అంటే ప్రియుడి పై ఆధిపత్యం సాధించలేకపోయారు .దీనికి బదులు వారు అణగిమణగి ఒదిగి ఉండిపోయారు ప్రియులకు .అందులోనే ఆనందాన్ని సంతృప్తి ని అనుభవించారు .భర్త లేక ప్రియుడి భావాలకు అభిప్రాయాలకు విలువనిచ్చి తమమనోభావాలను లోలోనే అణచి వేసుకొన్నారు .ప్రియుడి నిర్వచనం విషయం లో సంస్కృతకవయిత్రులకంటే ప్రాకృత కవయిత్రులకే అగ్రతాంబూలం .
మొత్త౦మీద ప్రాకృత కవయిత్రులుతమ సోదరీమణులైన సంస్కృత కవయిత్రులకంటే స్వీయ నియంత్రణ కలవారు .ప్రేమ విషయంలో జాగ్రత్తలో ఉండేవారు .ప్రాకృత కవయిత్రులు లాగానే ఆ స్త్రీలు ప్రియుని దూషించటం చేయలేదు .మగవాళ్ళు లేక ప్రియులు పరిపూర్ణమైన లేక సమగ్రమైనవారు కాకపోయినా వారు క్షమించారు .వారిని వేధించలేదు ,కతఠినంగా విమర్శించనూలేదు .పైపెచ్చు తమపైనే నింద మోపు కొన్నారు .తమప్రియుల కోసం తమను తాము త్యాగమూ చేసుకొన్నారు .
సంస్కృత ,ప్రాకృతకవయిత్రులు సెక్స్ విషయం లో అత్యున్నతమైన స్త్రీత్వ స్పర్శ కనపరచారు .ఆడంబరమైన పదాలు ,సంక్లిష్ట సమాసాల జోలికి వెళ్ళలేదు .స్పష్టత ,లావణ్యాలకు ప్రాధాన్యమిచ్చారు .లోతైన పరిశీలన ,అంతర్ దృష్టి ఈ కవయిత్రులకు అద్భుతంగా ఉండటం సహజం సుందరం సత్యం .
సంస్కృత –వేద కవయిత్రులు-1
సంస్క్రుతకవయిత్రులను అనేకఋగ్వేద మంత్రాల ద్రస్టలైన వేద రుషి కవయిత్రులతో పోల్చటం తమాషాగా ఉంటుంది .అనూచానంగా వచ్చిన మంచి సంప్రదాయం ,సంపూర్ణ పాండిత్య౦, సంపూర్ణ వికాసం లకు వారసులైన మహిళా వేదకవయిత్రులు ,స్త్రీత్వ సహజమైన కోరికలు భావాలు ఆన౦దానుభవం ,సౌందర్యం ,వినోదం ,సురుచికరమైన హాస్యం సంపూర్ణంగా అనుభవించారు .ఈ లోకం అందించినవాటిని అందిపుచ్చుకోవాలనే భావించారు .వీరందరికీ ప్రేమ అతిముఖ్యమైన విషయమే .దాంపత్య సౌఖ్యం గొప్పవరంగా భావించారు .మతం భొతిక ఆన౦ద సుఖాలకు,సంక్షేమానికి చేతి పనికత్తె గా అనుకొన్నారు .కనుక వేద రుషీమణులైన ఈ కవయిత్రులు చేసిన ప్రార్ధనలు స్తోత్రాలు అన్నీతగినభర్త లభించాలని ,భర్తప్రేమ అందుకోవాలని , భౌతిక సుఖానందం పొందాలనే భౌతిక వాంచలు తీరటం కోసమేనని అర్ధమౌతుంది .ముక్తి ,మతోద్ధారణ అలౌకిక ఆన౦దాలకోసం మాత్రం కాదు .’’
‘’ విశ్వవార ‘’అనే వివాహిత స్త్రీ అగ్నిని భౌతికసుఖం ,రక్షణ జీవితం కోసం ప్రార్ధించింది (ఋగ్వేదం 5-28). ఘోష అనే రాజకన్య తనకు సోకిన కుష్టు వ్యాధినుంచి విముక్తికల్గించి మంచి వరునితో వివాహం జరిగేట్లు చేయమని ,తాను వంటరిగా ఇంట్లోనేముసలితనం ఆక్రమిస్తూ ఉండిపోయానని ,తనకు వ్యాధి నయం చేసి, కురూపం పోయి సురూపం వచ్చేట్లు చేసి ,ధనవంతుడైన ప్రముఖునితో వివాహం జరిపించమని అనేకమంది దేవతలకు ,మనుషులకుఈవ్యాధిని నివారించిన అశ్వినీ దేవతలను ప్రార్ధించింది (10-39). .అంతేకాదు అశ్వినులు తనకు సంతృప్తిగా కాముకతను రసికతతో కూడిన ప్రేమపై మంచి అవగాహన కలగ జేయమని ,పరిస్థితులప్రాబల్యం వలన అవన్నీ తనకు దూరమైనాయని దీనంగా వేడుకొన్నది .కన్య మనసులోని కోరికలు పురి విప్పి నాట్యం చేసినట్లుగా ఘోష తన ఘోషను మంత్రాలలో దివిజ భిషగ్వరులైన అశ్వినీ దేవతలకు విన్నవి౦చు కొన్నది .
అలాగే ‘’ఆపాల ‘’కూడా ఘోషలాగానే తన దీనగాధను వెళ్ళబోసింది .శారీరకవ్యాది బహుశా బొల్లి తో బాధపడుతూ ,భర్తతో సహా అందరికి దూరమై, భర్త ప్రేమ గగన కుసుమమై చివరికి ఇంద్రుని తన జబ్బు నయం చేసి తనను భర్తతో కలిపి ,భర్తతో దాంపత్య సుఖం ప్రసాదింపజేయమని ప్రార్ధించింది .ఆమె ప్రార్ధనమన్నించి ఇంద్రుడు ఆమె చర్మవ్యాధిని నయం చేసి శరీరానికి స్వచ్చమైన సూర్యకాంతి వంటి కాంతిని ప్రసాదించి భర్తకు దగ్గర చేసి ఆమె కోరికతీర్చి ఉపశాంతిని కలిగించాడు .ఆపాలా ప్రార్ధించిన మంత్రం లో భర్తకు దూరమైన భార్య వేదన ,మళ్ళీ అతనితో సమాగమవ్వాలనే గాఢవాంఛ కనిపిస్తాయి .
ఇలాగే మరికొందరున్నారు .’’రోమాసా ‘’తన అపరిపక్వతవల భర్త కోపానికి బలై,తర్వాత తనతప్పు తెలుసుకొని పరిపక్వత సాధించి యవ్వనోద్రేకాన్ని కురిపించి భర్త మెప్పు పొందింది .సుఖసంతోష స౦తృప్తి పొందింది .అగస్త్యమహర్షి పత్ని లోపాముద్ర ముసలివాడైనతనభర్తవలన రతి సౌఖ్యం పొందలేక నిర్లక్ష్యానికి గురై ఒకమంత్రం లో ఆయననను తన దగ్గరకు వచ్చి శృంగారకేళి జరిపి సౌఖ్యం ప్రసాదించమని కోరింది .ఆ మంత్రభావ౦ ‘’మనం చాలాయేళ్ళుకృషి చేశాం చాలా శ్రమించాం.ముసలితనం మీదపడింది .ఇప్పుడైనా జీవితం లోని ఆనందం , సుఖం అనుభవిద్దాం .’’అని ఆహ్వానించింది .’’ఇంద్రాణి ‘’అరుదైన తన అందాన్ని, సౌందర్యాన్ని విశేషమైన మధురానుభవాలను జ్ఞాపకం చేసి భర్తను మళ్ళీ ఆకర్షించే ప్రయత్నం చేసింది .ఈ తపస్విని రెండుమంత్రాలలో అసూయాపరురాలైన భార్య ప్రవర్తన చూపించింది .మొదటి దానిలో తనభర్తకు అత్యంత ప్రియురాలైన తన సవతిని దూరం చేయటం కోసం ఒక మూలికను మంత్రించి సవతిని దూరంగా తరిమేసి భర్తప్రేమకు తానే సర్వాదికారిణి కావటం .ఇందులోని ప్రతిపదం లో ఆశాభ౦గం పొందిన అసలుభార్య మనసు లోతుల్లో సవతిపై ఉన్న ద్వేషం, పగా, ప్రతీకారం కన్పిస్తాయి .రెండ మంత్రం లోనూ మానవ సహజ గుణాలు కనిపిస్తాయి .అసూయాపరురాలైనభార్య ,సవతిని తట్టుకోలేక ,ఓర్చుకోలేక పోటమేకాదు, తనభర్త తనకన్నాస్నేహితుడిని ఆదరించటతమూ సహించ లేకపోతుంది .అతని దృష్టి మరల్చటానికి చేయని ప్రయత్నం ఉండదు .నెమ్మదినెమ్మదిగా భర్త మనసులోఅనేక విధాలుగా విషం ప్రవేశపెడుతుంది.ముందుగా తన వ్యక్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని గుర్తుకు తెచ్చి ,అతని స్నేహితుడు భర్త అధికారాలనుఅన్యాయంగా లాగేస్తున్నాడని చెప్పి అతని స్నేహితునిపై సానుభూతి చూపటం మానేయమని ,ప్రతీకారం తీర్చుకోమని హితవు చెబుతుంది .అతనిలో కోపాగ్ని బాగా రగిల్చటానికి భర్త శౌర్య ప్రతాపాలను కీర్తిస్తుంది .పరాకాష్టగా భర్త స్నేహితుడు తన అంద చందాలపై కన్ను వేశాడని ,ఇకతాను భర్తకు దక్కకుండా పోతానేమోనని ,తనభర్తకు దక్కాల్సినతన సౌందర్యం ,సుఖం వేరొకరికి దక్కటం తనకు ఇష్టం లేదని రెచ్చగొడుతుంది .అసూయ నిండిన భార్య సైకాలజీ ఇక్కడ స్పష్టంగా ప్రత్యక్షమౌతుంది .భర్తమనసు మార్చటానికి, సవతిని దూరం చేయటానికి అసూయ కలభార్య యెంత దూరమైనా వెడుతుందని , ఎంతటి మాయోపాయాలైనా చేస్తుందని ఈ మంత్రాలు మనకు తెలియజేస్తాయి .ఇవన్నీ భౌతికానందం కోసమే నని మరువరాదు .మిగిలినవారి మనస్తత్వమేమిటో తరువాత తెలుసుకొందాం
ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-19-ఉయ్యూరు

