ఆధునిక భారత దేశ ప్రధమ ముస్లిం టీచర్ –ఫాతిమా షేక్(వ్యాసం) – గబ్బిట దుర్గా ప్రసాద్

ఆధునిక భారత దేశ ప్రధమ ముస్లిం టీచర్ –ఫాతిమా షేక్(వ్యాసం) – గబ్బిట దుర్గా ప్రసాద్

01/09/2021గబ్బిట దుర్గాప్రసాద్

ఫాతిమా షేక్ జనన ,మరణాల తేదీలు తెలియదు కానీ ,బారత దేశం లో మొదటి ముస్లిం టీచర్ గా ఫాతిమా షేక్ గుర్తింపు పొందింది . ఆ కాలం లో సా౦ఘిక సంస్కర్తలైన జ్యోతిబాయ్ ఫూలే ,సావిత్రీ బాయ్ ఫూలే లకు ఫాతిమా సహోద్యోగి .ఈమె మియాన్ హుస్మాన్ షేక్ కు సోదరి . ఈయన ఇంట్లోనే జ్యోతిబా ,సావిత్రీ బాయ్ లు అద్దెకు ఉండేవారు .

ఫూలే స్థాపించిన పాఠశాలలో ఫాతిమా షేక్ దళిత విద్యార్ధులకు విద్య బోధించి ఆధునిక భారత దేశం లో మొట్టమొదటి ముస్లిం టీచర్ గా రికార్డ్ నెలకొల్పింది .జ్యోతి ,సావిత్రి లతో కలిసి ఫాతిమా అణగారిన సమాజం లోని వారి విద్యా వ్యాప్తికి తీవ్రంగా కృషి చేసింది .

అమెరికన్ మిషనరీ సింధియా ఫరార్ అహ్మద్ నగర్ లో నెలకొల్పిన టీచర్ ట్రెయినింగ్ సంస్థలో జ్యోతిబాయ్ ,ఫాతిమాలు తమ పేర్లను నమోదు చేసుకోవటం తో వారిద్దరి మధ్య పరిచయమేర్పడింది .ఫూలెలు స్థాపించిన అయిదు స్కూళ్ళలో ఫాతిమా అన్నిమతాల ,కులాల వారికి విద్య గరపింది .అంతేకాదు బొంబాయిలో 1851లో ఫూలెలు నెలకొల్పిన రెండు విద్యాలయాల నిర్మాణం లోఫాతిమా షేక్ గొప్పగా సహకరించింది .ఫూలేలతో కలిసిఉన్న కాలం లోని విశేషాలుతప్ప ఫాతిమా షేక్ గురించి అదనంగా సమాచారంఇప్పటికీ అంటే స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయినా లభించక పోవటం దురదృష్టం .ఉన్నత తరగతి వారికి ఫూలేలు ఇలాంటి పాఠశాలలు నెలకొల్పటం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు .కావాలనే వారు అడ్డుపడేవారు బెదిరించేవారు అవసరమైతే క్రూరంగా హింసించే వారుకూడా . ఆడపిల్లల్ని బడికి పంపటానికి ఇష్టపడని తలిదండ్రులకు తరచుగా గంటలతరబడి ఫాతిమా కౌన్సెలింగ్ నిర్వహిస్తూ,వారిని ఒప్పించి , వారి ఆడపిల్లలను ఆ స్కూళ్ళలో చేర్పించేట్లు చేసేది .దళిత బాలికలను విద్యాలయాలలో చేర్పించటం లో ఫాతిమా షేక్ నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం .

జ్యోతిబాయ్ ఫూలే జన్మించిన జనవరి 31 అయితే ఫాతిమా షేక్ జన్మించింది జనవరి 9 అని చరిత్రకారులు చెబుతున్నారు .ఇద్దరూ బ్రాహ్మణ భావ వ్యతిరేకులే ,అయినా దేశప్రధాని మొదలు ఆర్ ఎస్ ఎస్ నాయకులవరకు జ్యోతీబాయ్ ని అందలం ఎక్కించి పొగుడుతూ జయంతులు ఘనంగా జరుపుతున్నారే కానీ ,ఫాతిమా ను గురించి ఎవ్వరూ పట్టించు కోవటం లేదు .ఎందుకో ఈ వివక్ష అర్ధం కావటం లేదు .జ్యోతిరావు ను సావిత్రీ బాయ్ నీ వారు చేసే కార్యక్రమాలు నచ్చక తండ్రి తమ పూర్వీకుల ఇంట్లో నుంచి బలవంతంగా బయటికి నెట్టేస్తే ,అప్పుడు వారిని సోదరిలుగా ఆహ్వానించి అక్కున చేర్చుకొని ,తమ ఇంట్లో ఆశ్రయం కలిపించింది ఫాతిమా షేక్ ,ఆమె సోదరుడు ఉస్మాన్ షేక్ లే .

అణగారిన అట్టడుగు పేద ప్రజల వికాసం కోసం సావిత్రీ బాయ్ తన మొదటి స్కూల్ ను ఫాతిమా సహాయంతోనే ప్రారంభించింది .ఈ ఇద్దరూ కలిసి ఆనాటి సంప్రదాయ చాందస హిందూ ,ముస్లిక్ సమాజాలను ధైర్యంగా ఎదిరించి నిలబడ్డారు .తమ కర్తవ్య౦ నెరవేర్చుకొన్నారు .దళితులలో విద్యా వికాసం కలిపించారు,వారి జీవితాలలో వెలుగు నింపారు .

19వ శతాబ్ది ముస్లిం మహిళ ఫాతిమా షేక్ ఆనాటి పితృస్వామ్య ,సంప్రదాయ ముస్లిం పెద్దల ,సమాజాలను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని ,తన ధ్యేయాన్ని చాటి తన అంకిత భావంతో దీన జనోద్దరణ చేసి ఆదర్శంగా నిలిచింది .అంతటి సాహసం ఆ కమ్యూనిటి లో అంతవరకూ ఎవ్వరూ చెయ్యలేదు .భేష్ ఫాతిమా భేష్ .జీవితాలలో వెలుగులు నింపిన జ్యోతిబాయ్ లాంటి వారిని గుర్తుంచుకొని .చీకటిలో మగ్గిపోయే వారి జీవితాలలో వెలుగులు చిమ్మిన ఫాతిమా ను గుర్తించకపోవటం. గుర్తుంచుకోకపోవటం చారిత్రిక తప్పిదం కాదా అని ప్రశ్నిస్తోంది నేటి యువతరం ‘.ఫాతిమా షేక్ జీవితం పై మంచి అవగాహన ఉన్న విద్యావేత్త నస్రీన్ సయ్యద్ చెప్పిన విషయం – “Fatima Sheikh knew how to read and write already, her brother Usman who was a friend of Jyotiba, had encouraged Fatima to take up the teacher training course. She went along with Savitribai to the Normal School and they both graduated together. She was the first Muslim woman teacher of India”. Fatima and Savitribai opened a school in Sheikh’s home in 1849.

భారత దేశం లో మహిళా విద్యా వ్యాప్తికీ ,సంఘ సంస్కరణలకు ముందుగా నిలబడిన ఫూలేల సరసన నిలబడి, అంతే అంకిత భావంతో కృషి చేసిన ఫాతిమా షేక్ పై చిన్నచూపు చూడటం క్షంతవ్యం కాదు .భారత జాతీయ పునరుజ్జీవనం గురించి మన చరిత్రకారులు ,రాజారామ మోహన రాయ్ ,ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ,స్వామి దయానంద ,స్వామి వివేకానంద ,మహాదేవ గోవింద రానడే లను చరిత్ర పుస్తకాలలో ఆకాశానికి ఎత్తేశారు .అప్పటికి సావిత్రీ బాయ్ గురించి స్మరణే లేదు .ఆతర్వాత దళితులూ ,బహుజన కార్యకర్తలూ ఆమెను గురించి రాశాక మాత్రమె ఆమె గురించిన ఫోటోలు క్లిప్పింగ్ లు బయటికి తెచ్చారు .బహుజన నాయకుడు కాన్షీరాం బహుజన సమాజ పార్టీ స్థాపించిన తర్వాతనే సావిత్రీబాయ్ జీవిత విశేషాలు కోట్లాది జనాలకు తెలిసింది .అయితే ఆమె తో పాటే అంతే విశిష్ట కృషి చేసిన ఫాతిమా షేక్ ను మర్చేపోయారు మళ్ళీ మన చరిత్రకారులు . ఇంతటి వివక్ష చరిత్రకారులకు ఉండటం క్షంతవ్యం కాదు .పోనీ ముస్లిం చరిత్రకారులకు కూడా ఆమె త్యాగం ధైర్య సాహసాలు ముందుచూపు కనిపించకపోవటం ఆమె జీవితం పై గొప్పఅధ్యయనం చేసి ఆమె జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించకపోవటమూ గొప్ప తప్పిదమే కదా .

-గబ్బిట దుర్గా ప్రసాద్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.