భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -2

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -2
విఠల్ భాయ్ పటేల్ శాసన సభ ను వదిలేసి ఇంపీరియల్ కౌన్సిల్ లో ప్రవేశించి ,అసలైన రాజకీయ జీవితం ప్రారంభించాడు .ఆతడి నేతృత్వం వికాసానికి పునాది కూడా ఏర్పడింది .రాష్ట్రీయ స్వపరిపాలనం ఇంకా రూపు దాల్చకముందే ,రాష్ట్ర ఆదాయం పై ఆధారపడకుండా ఉండే కేంద్ర ప్రభుత్వం గురించి ఆలోచించాడు .23-2-1920న ఇంపీరియల్ కౌన్సిల్ లో ఆయన ఒక తీర్మానం ప్రవేశపెట్టి ,కేంద్ర ప్రభుత్వం స్వయం పోషకత్వానికి సూచనలతో తీర్మానం చేశాడు కానీ అది వీగిపోయింది .కానీ శ్రీనివాస శాస్త్రి ,బిఎన్ శర్మ ,సర్ దిన్ షా వాచా ,సచ్చిదానంద సిన్హా .సర్ గంగాధర చిట్నవిస్ ,సురెంద్రనాద్ బెనర్జీ ,జిఎస్ కపర్దీ మొదలైన ప్రముఖులు ఆతీర్మానాన్ని బలపరచారు .
బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని ప్రవేశ పెట్టె సమయం లో వల్లభాయి పటేల్ ఢిల్లీ లో కెవి అయ్యంగారి ఇంట్లో బస చేశాడు .ఆ చట్టం అమలుకాకుండా చూడటానికి విశ్వ ప్రయత్నం చేశాడు .అత్యంత రహస్యంగా ముగ్గురు సభ్యుల మెడలు వ౦చి చట్టాన్ని తెచ్చింది ప్రభుత్వం ఒక విలేకరి ఈ రహస్యాన్ని బయటపెట్టి,పటేల్ ,కపర్దీలతో సంప్రదించి ,అమృతబజార్ పత్రికలో వ్యాసం రాశాడు .అతి రహస్యం బట్టబయలై ఆముగ్గురు తలలు వంచుకొని ,తమ అంగీకారం ఉపసంహరించుకొని అపోజిషన్ పార్టీలో చేరారు .అప్పటి పరిస్థితులలో ప్రజాభిప్రాయం విజయం పొందే అవకాశం ఉండదని ,కొద్దిరోజుల్లో వచ్చే మాంటేగు –చేమ్స్ ఫర్డ్ సంస్కరణలలో ఏవైనా మార్పులు వస్తాయేమో నని ఎదురు చూశారు .ఈ నేపధ్యం లో రౌలట్ చట్టం 6 నెలలు అమలుకాకుండా ఉండటానికి విఠల్భాయ్ ఒక ఎమెండ్ మెంట్ ను ప్రతిపాదించినా ,వైస్రాయి పవర్ ముందు ఆగలేదు .
రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించటం లో వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం .కానీ చివరకు 1919మార్చి 13చేమ్సఫర్డ్ కౌన్సిల్ లో ఒంటిగంటదాకా చర్చ జరిగి విడుదలైంది .రౌలట్ చట్టమే పంజాబు దురంతాలకు నాంది పలికింది .పంజాబ్ లో మార్షల్ లా పెట్టారు .ప్రభుత్వం దురన్యాయంగా దురంతాలుఅమానుష హింస ప్రోత్సహించింది .ప్రజలను క్రూరాతిక్రూరంగా శిక్షించింది .ఈ చర్యలను సభ్యప్రపంచమంతా ఏవగించుకోన్నది.రౌలట్ యాక్ట్ కారణంగా కాంగ్రెస్ శాసనసభా బహిష్కారం చేసింది .కాంగ్రెస్ నియమాలనను సారించి విఠల్ భాయ్ తర్వాత ఎన్నికలకు నిలబడలేదు .
కాంగ్రెస్ రాజకీయాలు
విఠల్ భాయ్ రాజకీయం లో ప్రవేశించే నాటికే కాంగ్రెస్ లో అతివాద ,మితవాదులున్నారు .అమృతబజార్ పత్రిక సంపాదకులు అతివాదులు .బొంబాయి లో లోకమాన్య బాల గంగాధర తిలక్ అతివాది .దేశ గౌరవమే ఆయన లక్ష్యం. మిగిలినవారికి అధికారమే లక్ష్యం .తిలక్ కార్య దీక్ష ఆలోచన ప్రభుత్వానికి వణుకు పుట్టింది .1891లో ఏదో నేరం మోపి ఆయన్ను అరెస్ట్ చేసింది .సారీ చెబితే వదిలేస్తామని చెప్పింది. అమృత బజార్ పత్రిక తిలక్ కు రాసిన ఒక లేఖకు ఆయన సమాధానం –‘’నేను తప్పు చేశానని ఒప్పుకోను .ప్రజలలో నా స్థానం నా నడవడి బట్టి ఉంటుంది .ప్రభుత్వం నన్ను శిక్షిస్తే అంతకంటే అన్యాయ మైన తీర్పు ఉండదు .సంకెళ్ళతో మహారాష్ట్రలో ఉన్నా,అ౦డమాన్ లో ఉన్నా నాకు ఒకటే .దేశ సేవలో కస్టాలు తప్పవు .నా వ్యాసాలు రాజద్రోహం చేసేవి కావు .ప్రభుత్వం పొరబాటు పడింది .పూనా నాయకులను అవమానించటమే వాళ్ళ పని .గోఖలె లాగా నేను ప్రవర్తించను .మనమందరం ప్రజా సేవకులమే .ఈ స్థితో మనోనిబ్బరం లేకుండా జారిపోతే ప్రజల్ని మోసగించి నట్లే ‘’.ఇలాంటి ఆత్మ విశ్వాసం ధైర్యం వితల్ భాయ్ లోనూ ఉన్నాయి .
మొదట్లో కాంగ్రెస్ అర్జీలు అభ్యర్ధనలద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని ప్రయత్నించగా ,అరవింద ఘోష్ ,తిలక్, కపర్దీ ,లజపతిరాయ్, బిపిన్ చంద్ర పాల్ లు 1907 సూరత్ కాంగ్రెస్ లో నిరసించారు .మొదటి ప్రపంచ యుద్ధం అయిన రెండేళ్లకు 1916లో లక్నో కాంగ్రెస్ లో అనిబిసెంట్ హోం రూల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది .తిలక్ తోపాటు విఠల్ భాయ్ కూడా అందులో చేరాడు .సుబ్రహ్మణ్య అయ్యర్ ,రంగస్వామి అయ్య౦గార్ ,సిపి రామస్వామి అయ్యర్ ఉత్సాహంగా పాల్గొన్నారు .బిసెంట్ సతీమణిపై కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహించింది .దీనితో ఉద్యమమ మరింత బలీయమైంది .1918 బొంబాయి ప్రత్యెక కాంగ్రెస్ సమావేశం లో విఠల్ భాయ్ పటేల్ ఆహ్వాన సంఘాధ్యక్షుడు .మాంటేగ్ –చేమ్స్ ఫర్డ్ సంస్కరణలపై చర్చ దీని ముఖ్యోద్దేశ్యం .ఇందులో పటేల్ ప్రసంగం ఆయన దూర దృష్టినీ ,ప్రజ్ఞా విశేషాలను ప్రదర్శించి ,ఆయనపలుకుబడి పెరిగి కాంగ్రెస్ కార్య దర్శి అయ్యాడు .ఈకాలం లోనే జాయింట్ పార్లమెంటరి కమిటీముందు సంస్కరణలపై కాంగ్రెస్ ఆలోచనలను తెలియ జేయటానికి లండన్ వెళ్ళాడు ‘’స్వపరిపాలన కావాలి ‘’అన్న కాంగ్రెస్ కోరికను లండన్ లో సమర్ధించాడు .పాలనా బాధ్యతలు తీసుకొనే సామర్ధ్యం భారతీయులకు ఉంది అని గట్టిగా చెప్పాడు .సంస్కరణలు భారతీయులకు అనుగుణంగా లేవు అని నిర్మొహమాటంగా చెప్పాడు .రెండవ సారి కాంగ్రెస్ సభ్యులతో లండన్ వెళ్లి కామన్స్ సభలో సంస్కరణల విషయం లో కాంగ్రెస్ అభిప్రాయాలను వివరించాడు .ఆకమిటిలోస్పూర్ అనే ఆయన ఒక్కడే భారతీయులకోరికలు న్యాయమైనవి అని చెప్పాడు .రివైజ్ బిల్ కామన్స్ సభకు వస్తే తాను మద్దతు ప్రకటిస్తానని హామీ కూడా ఇచ్చాడు పటేల్ కు .లేబర్ పార్టీ సభ్యులకు కూడా తెలియజేస్తే ,ఎమెండ్ మెంట్ లను చర్చించటానికి సిద్ధపడ్డారు .కానీ అనిబిసెంట్ రివైజ్ చేసిన బిల్లునే ఎలాంటి ఎమెండ్ మెంట్ లు లేకుండా కామన్స్ సభ ఆమోదించాలని ప్రచారం చేసింది .లేబర్ పార్టీ కార్యవర్గం పటేల్ ఆలోచనలను అంగీకరించి తన ఎమెండ్ మెంట్ లను పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని హామీ ఇచ్చింది .మిగతా వారి సహకారం తోపాటు మాక్ ఆలం స్కాట్ మద్దతు కూడా సంపాదించాడు .బొంబాయిలో లా ,పోలీసు శాఖలు శాఖలు తప్పమిగిలిన వాటిని ప్రజాయత్తం చేసే ఎమెండ్ మెంట్ బిల్ ను ప్రవేశపెట్టటానికి స్కాట్ అంగీకరించాడు .కామన్స్ సభలో మూడు రోజులచర్చజరిగింది పటేల్ కు గ్యాలరీలో సీటు ఏర్పాటు చేయటం వలన ఆమూలాగ్రం చూసి ,అవసరమైన చోట సలహాలు ఇచ్చే అవకాశం దొరికింది .ఎమెండ్ మెంట్ లేవీ నెగ్గలేదు .కానీ భారతీయుల న్యాయమైన కోర్కెలకు గొప్ప ప్రచారం లభించింది .ఇండియాకు తిరిగి వస్తూ లేబర్ పార్టీ సభ్యులకు మళ్ళీ కలిసి ఇండియాకు స్వపరిపాలన విషయం లో అధికార ప్రకటనకు చేయమని కోరాడు .దీనిఫలితంగా 18-12-1919న కామన్స్ సభలో పటేల్ బృందానికి ఏర్పాటైన వీడ్కోలు విందు సభలో హెండర్సన్ ఒక ప్రకటన చేయగా బ్రిటిష్ లేబర్ పార్టీ ఆమోదించింది .ఇది విఠల్ భాయ్ పటేల్ సాధించిన అద్భుత విజయం ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-25-10-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.