భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -5
ప్రజా క్షేమ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టటం పై స్పీకర్ విఠల్భాయ్ ఇచ్చిన రూలింగ్ లో జోక్యం చేసుకోవటానికి వైస్రాయ్ వచ్చి ‘’దీనిపై తీర్పుచేప్పే హక్కు స్పీకర్ కు మాత్రమేకాదు నాకూ ఉన్నది .స్పీకర్ చర్యవలన విప్లవాలు ఎక్కువౌతాయి .ప్రభుత్వం కొన్ని ప్రత్యేకాదికారాలు పొ౦దాలనుఒన్నదానికిది విరుద్ధం .యాక్ట్ లోని 72 సెక్షన్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం వైస్రాయి కి ఉంది ఆపనిచేస్తాను ‘’అన్నాడు .దీనితో అసెంబ్లీ సమావేశం ముగిసింది .1929సెప్టెంబర్ లో మళ్ళీ సమావేశమయ్యే నాటికి పటేల్ –ఇర్విన్ లమధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి .వాటిని అధ్యక్షుడు తెలియ జేస్తాడేమోనని సభ్యులు ఎదురు చూస్తున్నారు .వైస్రాయి జోక్యాన్ని ఆయన నిరసించాడు .రూలింగ్ ను విమర్శించే అధికారం సభ్యులకు తప్ప ఎవరికీ లేదన్నాడు .ఇద్దరి మధ్య జరిగిన కరేస్పా౦ డేన్స్ సభలో చదివి వినిపించాడు .చివరికి అసెంబ్లీ అధ్యక్షుడికే సర్వాధికారాలు ఉన్నాయని వైస్రాయ్ ఇర్విన్ చెప్పి తెల్లజెండా ఎత్తేశాడు .అసెంబ్లీకి ఉన్న ఆత్మగౌరవాన్ని విఠల్ భాయ్ కాపాడాడు .ఆతర్వాత వైస్రాయ్ ‘’పాటలు రూలింగ్ ను విమర్శించటం ,అసెంబ్లీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించటం తన ఉద్దేశ్యం కాదని చివరి సారిగా జాబు రాయటం తో ప్రతిష్టంభన తొలగింది .ఇది అధ్యక్షుడు విఠల్ భాయ్ సాధించిన గొప్ప విజయం .
అసెంబ్లీ భవనాలు
మీరట్ సంఘబన వలన అసెంబ్లీ భవనాల రక్షణ విషయం పై ఆందోళన పడ్డారు .దీనికోసం పటేల్ ప్రభుత్వానికి సలహా ఇవ్వటానికి ఒక కమిటీ నియమించాలనుకొనగా అసెంబ్లీలో భిన్నాభి ప్రాయాలు రాగా,1930జనవరి30న పోలీసులు వచ్చి గాలరీలలో కూర్చున్నారు .సభలోకి ప్రవేశించగానే వాళ్ళను చూసిన పటేల్ తక్షణమే సభనుంచి బయటకు వెళ్లి పొమ్మన్నాడు .ముందు కాసేపు తటపటాయించినా ఖాళీ చేసి వెళ్ళిపోగా ,గాలరీలకు తాళాలు వేయించాడు .సర్ జేమ్స్ కేదార్ ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తేరూలింగ్ కు దిక్కారమౌతుందని అవకాశం ఇవ్వలేదు పటేల్ .తర్వాత అధ్యక్షుడు పటేల్ –‘’అసెంబ్లీలోకి ప్రేక్షకులనుకాని ఇతరులను కానీ ప్రవేశ పెట్టటం లో ప్రభుత్వానికి అసెంబ్లీ అధ్యక్షుడికి భేదాభిప్రాయాలు వచ్చాయి .అసెంబ్లీని అధ్యక్షుని రక్షించేబాధ్యత తమకు ఉందని ఇండియా ప్రభుత్వం తరఫున ఢిల్లీ పోలీస్ కమీషనర్ అభి ప్రాయ పడ్డాడు .అవసరమైన పోలీసు సిబ్బందిని అక్కడక్కాడా పెట్టి కాపాడాలని ఆయన ఉద్దేశ్యం . అసెంబ్లీ ఆవరణలో సర్వాధికారాలు అధ్యక్షుడివే.అసెంబ్లీ రక్షణ లో ఆయన నిర్ణయమే ఫైనల్ .నిన్న రాత్రి 9తర్వాత పోలీస్ కమిషనర్ నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది.అందులో ఆయన జారీ చేసిన ఉత్తర్వు జత చేశాడు .దాన్ని రహస్యంగా ఉంచమనికోరాడు కనుక దాన్ని బహిర్గతం చేయను .అప్పుడే హోం మెంబర్ నుంచీ ఒక జాబు వచ్చింది .అసెంబ్లీ ప్రేక్షకులను తనిఖీ చేయటం ,గాలరీలలో పోలీసులను ఉంచటానికి వైస్రాయ్ అనుమతి ఉన్నట్లు పేర్కొన్నాడు .ఢిల్లీ కమీషనర్ వాటిని అమలు చేసి అసెంబ్లీ రక్షణ చేస్తాడని హోం మెంబర్ రాశాడు .కానీ అసెంబ్లీ రక్షణకోసం మనం ఒకకమిటీని వేశాము .అది రిపోర్ట్ ఇచ్చేదాకా అధ్యక్షుడే సర్వాధికారి అనవసరంగా ఢిల్లీ కమీషనర్ జోక్యం కలిగించుకొన్నాడు .ఇంగ్లాండ్ కామన్స్ సభలో ఒకే ఒక్క పోలీసు’’ బే దుస్తుల్లో’’ ఉండవచ్చునని అధ్యక్షుడి ఆజ్ఞ.ఇక్కడ నలుగురు పోలీసులకు పోలీసు దుస్తులతో ప్రవేశం కల్పించటం విడ్డూరం .అసెంబ్లీ అధ్యక్షుని అధికారం కించపరచటమే కమీషనర్ ఉద్దేశ్యంగా ఉంది .విలేకరుల గాలరీ తప్ప అన్ని గాలరీలు మూసేయ్యాల్సిందే ‘’అని చెప్పాడు .ఈ ప్రతిష్టంభన నెల రోజులు సాగింది చివరికి వైస్రాయ్ జోక్యం చేసుకొని పటేల్ దృక్పధాన్ని సమర్ధించి ఒక సముచిత విధానం చెప్పాడు .అధ్యక్షుని సంప్రది౦చి మాత్రమే పోలీస్ కమీషనర్ అసెంబ్లీ రక్షణ విషయం లో నిర్ణయాలు తీసుకోవాలని హితవు చెప్పాడు .
రిజర్వ్ బాంక్ బిల్
మొదట్లో ఒక రిజర్వ్ బాంక్ బిల్ ను ఒక ఆర్ధిక సభ్యుడు సభలో ప్రవేశ పెట్టాడు .దీన్ని 30మంది సభ్యులున్న జాయంట్ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపారు .రిజర్వ్ బాంక్ స్టేట్ బాంక్ గా ఉండాలా ,స్టాక్ హోల్డర్ల బాంక్ గా ఉండాలా ,డైరెక్టర్లు ఎవరు ఉండాలి అనే విషయాలపై సభలో అధికార అనధికార సభ్యులమధ్య వాదోపవాదాలు జరిగి అనధికార సభ్యులదే పై చేయి అయింది . ఆర్ధిక సభ్యుడు వీరిమాటే వినాల్సి వచ్చింది .ఎవరెవరు డైరెక్టర్లుగా ఉండాలనీ చర్చ జరిగిసభ ముగిసింది .మూడో రోజు సమావేశం జరిగి ,చర్చకు మరింత సమయంకావాలని ఆర్ధిక సభ్యుడుకోరగా అంగీకరించారు .మళ్ళీ అసెంబ్లీ సమావేశమైనప్పుడు ప్రభుత్వానికి ఈ బిల్లును చర్చించట ఇష్టం లేదని ప్రకటించాడు .అనధికార సభ్యులకు బాధకలిగి స్వరాజ్యపార్టీ వారు వాకౌట్ చేశారు .ఆర్ధిక సభ్యుని నిరసిస్తూ తీర్మానం పెట్టగా నెగ్గింది .మళ్ళీ కొన్నాళ్ళకు అతడే మరో రిజర్వ్ బాంక్ బిల్లు ప్రవేశ పెట్టె ప్రయత్నం చేస్తే ,మొదటిబిల్లును ఉపసంహరించుకొనేదాకా రెండవదానిపై చర్చ జరగరాదని పటేల్ రూలింగ్ ఇచ్చాడు .ఉపసంహరణ ప్రభుత్వం ఇజ్జత్ నుదెబ్బతీస్తుందని భావించి ‘’మూసివాయన ముత్తైదువ’’లాగ గమ్మున మూసుకుని కూర్చుంది .
ప్రత్యెక అసెంబ్లీ డిపార్ట్ మెంట్
ప్రత్యెక అసెంబ్లీ డిపార్ట్ మెంట్ నెలకొల్పాలనే విషయంపై 5-9-1929న శాసన సభాధ్యక్షుడు విఠల్ భాయ్ ‘’సభకు ఎన్నుకోబడిన నేను అధ్యక్షుడుగా ఉన్నాను .
ఈ శాసన సభకు బాద్యుడిని .సభ్యులకోరికలను అధ్యక్షుడు తోసిపుచ్చకూడదు .అతడి రూలింగ్ నాయబద్ధంగా ఉండాలి .అన్ని పార్టీలయందు నిష్పక్షపాతంగా ఉండాలి .అసెంబ్లీ రూల్స్ కు న్యాయబద్ధంగా వ్యాఖ్యానించాలి ,నిర్వహించాలి .ఇవి సభ్యులు నిర్ణయించినవి కావు .వీటిని సంస్కరించే అధికారం సభ్యులకు లేదు .అవసరమైతే ఇండియా కార్యదర్శి అనుమతితో వైస్రాయ్ సంస్కరిస్తాడు .అలా సంస్కరించే సందర్భాలలో సభ్యుల్నికాని అధ్యక్షుడినికాని సంప్రదించే ఆచారం లేదు .అధ్యక్షుడు కేవలం అసెంబ్లీ కార్యదర్శి సలహాపైనే ఆధారపడాలి .సభ్యులు కూడా తమ విధి నిర్వహణకు కార్యదర్శిమీదే ఆధారాపడతారు .తప్పు జరిగితే అధ్యక్షుడి పైకి నెట్టేస్తారు .కనుక అసెంబ్లీ నిర్దుష్టంగా,తృప్తిగా జరగాలంటే కార్యదర్శి అతని సహాయకులు అసెంబ్లీకి అధ్యక్షుడికి బాధ్యత వహించే వారుగా ఉండాలి .ఇంకో అధికారానికి బానిసలుగా ఉండరాదు .వీరివలన అధ్యక్షుడికి తగిన సలహాలు లభించాలి. అసెంబ్లీ సేవమాత్రమే ప్రధాన బాధ్యతగా ఉండాలి .
కానీ వీరంతా వైస్రాయి సేవకులైపోయారు ,ఆయనకు బాధ్యత వహిస్తారు తప్ప అసెంబ్లీకి కాదు .సభలో భేదాభిప్రాయం వస్తే కార్యదర్శి ప్రభుత్వం కొమ్ము కాస్తున్నాడు ,ప్రభుత్వ సభ్యులతోకలిసి వోటు వేసి వారిలో ఒకడైపోతున్నాడు .ఒకరకంగా ప్రభుత్వం నిర్ణయించిన సభ్యుడే అవుతున్నాడు ప్రవర్తనలో .సభ్యులకు అధ్యక్షుడికి కార్యదర్శిపై అధికారం లేకుండా పోయింది .కనుక అతడి సూచనలు నిష్పక్షపాతంగా ఉండవు .కనుక అసెంబ్లీ ఉద్యోగ శాఖలో తీవ్ర సంస్కరణలు రావాలి .ఇటీవలే నా కోరికపై వైస్రాయి కార్యదర్శిని అసెంబ్లీ సభ్యుడిగా నియమించటానికి స్వస్తి చెప్పాడు .అసెంబ్లీ ఉద్యోగులు అధ్యక్షుడిని సంప్రదించి పని చేయటానికి సంకోచిస్తున్నారు .ప్రభుత్వం అంటే భయమే దీనికి కారణం .అసెంబ్లీ రూల్స్ ను సంస్కరించే అధికారం అధ్యక్షుడికి ఉంటె ,ఆయన సభ్యులకు సహాయకారిగా మార్గ దర్శిగా ఉంటాడు .ప్రస్తుత పరిస్థితులలో అది అసాధ్యం .కనీసం అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా ,ఒక స్వతంత్ర వ్యక్తిగా ఉంటె కొంత నయం .ఈవిషయాలన్నీ నేను 1925ఆగస్ట్ లో అధ్యక్ష పీఠం పై కూర్చున్నప్పుడే తెలుసుకొన్నాను .జనవరిలో సభాధ్యక్షుల సమావేశం జరిగింది .శాసన సభకు అధికార వర్గం తో సంబంధం లేని ఒక ప్రత్యెక ఆఫీసు ఉండాలని తీర్మానించాం .దాన్ని ఇండియా ప్రభుత్వానికి వెంటనే పంపాను .సెప్టెంబర్ లో ఇలాంటి దాన్ని గురించి ఒక విధానాన్ని ప్రభుత్వానికి సూచన గా పంపాను కూడా .
ఆవిధానం – అసెంబ్లీ ఆఫీసు గవర్నమెంట్ తో సంబంధంలేని ప్రత్యేకశాఖ గా ఉండాలి.ఉద్యోగులు అసెంబ్లీ కే బాధ్యత వహించాలి .ఈ డిపార్ట్మెంట్ ఖర్చు ప్రభుత్వమే భరించాలి .కానీ ఇలాంటి ప్రత్యేకశాఖను ప్రభుత్వం ఒప్పుకోలేదు .కార్యదర్శిపై అతని అనుచరులపై అధ్యక్షుడికి అధికారం ఉండకూడదు అంటోంది . దండనాదికారం , సస్పెన్షన్ ,బర్త్ రఫ్ అధికారాలు అసెంబ్లీకి లేకపోతె ప్రత్యెక డిపార్ట్మెంట్ అనవసరమే కదా .నేను కొన్ని మార్పులు సూచించాను –ప్రత్యెక డిపార్ట్ మెంట్ పెట్టె అధికారం ప్రభుత్వానికి లేకపోతె ,దీన్ని వైస్రాయ్ పోర్ట్ ఫోలియోలలో ఒకటిగా చేయాలి .అసెంబ్లీ అధ్యక్షుడి సలహాతో ఉద్యోగుల్ని వైస్రాయి నియమించవచ్చు ,ఉద్యోగుల్ని దండిన్చాల్సి వస్తే అసెంబ్లీ ముందుగా వైస్రాయికి తెలియజేస్తుంది .సభ్యులను కార్యదర్శి సలహామేరకు అధ్యక్షుడు నియమిస్తాడు .వీరిని దండిన్చాల్సి వస్తేఅధ్యక్షుడు కార్యదర్శిని సంప్రదిస్తాడు .ఈ డిపార్ట్మెంట్ బడ్జెట్ ను అధ్యక్ష కార్యదర్శులు కలిసిరూపొందిస్తారు .ఇదికూడా అసెంబ్లీ బడ్జెట్ లో ఒక భాగంగానే ఉంటుంది .మార్పులు చేసే అధికారం అసెంబ్లీ సభ్యులకు ఉంటుంది .ఈ నా సూచనలను వచ్చే అసెంబ్లీ సమావేశం లో చర్చిద్దాము ‘’అని దీర్ఘోపన్యాసం చేశాడు,అన్నికోనాలలోనుంచీ ఆలోచించి నిర్దుష్టంగా చెప్పాడు విఠల్భాయ్ పటేల్ .
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -31-10-21-ఉయ్యూరు
వీక్షకులు
- 1,119,851 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
