ఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -2

ఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -2
కాకినాడ కలెక్టర్ ఆషి ని తిరునల్వేలి జిల్లాకు మార్చారు .అక్కడ విప్లవాగ్ని జ్వాలలు విపరీతంగా వ్యాపించాయి .రైల్ లో ఉండగానే విప్లవకారులు అతడిని కాల్చి చంపారు .జగ్గన్న శాస్త్రి పై వారంట్ పుట్టించి అరెస్ట్ చేసే ప్రయత్నం లో ప్రభుత్వం ఉంది .ఈ విషయం తెలిసిన మిత్రులు గున్నేశ్వరరావు వగైరా డబ్బులు వసూలు చేసి అర్ధరాత్రి రహస్యంగా శాస్త్రిని బొంబాయి రైల్ ఎక్కించి పంపించే ఏర్పాటు చేశారు పడవలో గోదావరి దాటి ,నడిచి నిడదవోలు వెళ్లి ,అక్కడినుంచి రైల్ లో బెజవాడ చేరి ,స్వరాజ్య పత్రిక ఆఫీస్ కు వెళ్ళే సరికి అక్కడ పత్రికాధిపతిని అరెస్ట్ చేయటానికి వారంట్ తో సిద్ధం గా ఉండటం చూశాడు .ఆయనకు తన సంగతి చెప్పి ,రాత్రి రైల్ ఎక్కి బొంబాయి వెళ్లి,మహీం లో ఉన్న జే ఎం పోధార్ ఇంటికి వెళ్ళాడు శాస్త్రి .ఇతడు జపాన్ లో వంగల వెంకట నారాయణ కు సహాధ్యాయి.పోధార్ బాంబులు తయారు చేసి నూతిలో దాచినట్లు పోలీసుల అనుమానం .అతడిని ఎప్పుడైనా అరెస్ట్ చేయచ్చు .అందుకని శాస్త్రిని కాల్ పత్రికాధిపతి పరంజపేయి దగ్గరకు తీసుకు వెళ్ళాడు .ఇతడిపైనా బొంబాయిలో కేసు ఉంది .తానె కోర్టులో వాదించు కొంటున్నాడు .ఇద్దరు ఒకరి సంగతి ఒకరు చెప్పుకొన్నారు .రెండు నిమిషాలలో శాస్త్రికి కావాల్సిన బస భోజనం డబ్బు పుస్తకాలు సమకూర్చాడు .ఇలా అజ్ఞాతం లో రెండు నెలలు గడిపాడు శాస్త్రి .శాస్త్రికోసం వెదకి వెదకి నిరాశ చెంది వారంట్ రద్దు చేసుకొన్నారు పోలీసులు .మరో మూడు నెలలతర్వాత రాజమండ్రి చేరాడు .పోలీసువారు ఇతనిపై రహస్యంగా విచారిస్తున్నారేకానీ కేసు పెట్టలేదు .కనుక ఆంధ్రులలో మొట్టమొదటి విప్లవకారుడు యర్రమిల్లి జగ్గన్న శాస్త్రిగా రికార్డ్ కు ఎక్కాడు .మారు వేషాలతో తిరిగేవాడు .తురక వేషం లో బాగా రాణించే వాడని అతని మిత్రులు చెప్పారు .1910చివరివరకు ఆంధ్రలో ప్రచారం చేసి ,1911లో డాక్టరీ చదవటానికి జగ్గన్న శాస్త్రి కలకత్తా వెళ్ళాడు .
నాలుగేళ్ళు కలకత్తాలో మెడిసిన్ చదువుతూ శ్యామ సుందర చక్రవర్తి తో స్నేహం సంపాదించి ,1914లో డాక్టర్ డిగ్రీ పాసయ్యాడు జగ్గన్న శాస్త్రి .ఈయనతోపాటు కలకత్తాలో చదివి డాక్టరీ పాసయిన ఆంధ్రులు డాక్టర్ బ్రహ్మా జోశ్యుల సుబ్రహ్మణ్యం, వేదాంతం వెంకట కృష్ణయ్య మొదలైనవారున్నారు .కానీ కలకత్తా నుంచి ఇంటికి రాగానే శాస్త్రిని అరెస్ట్ చేసి మద్రాస్ పంపారు .దీనికి కారణం రోడ్డా కంపెని కేసు.
సశేషం
75వభారత స్వాతంత్ర్య దినోత్సవం శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవిత చరిత్ర.2,వ భాగం.14.8.22

శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-24(చివరిభాగం )

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-24(చివరిభాగం )

మోతీలాల్ ఘోష్ చివరి రోజులు

చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడే మోతీలాల్ మితభోజనం ,వేళప్రకారం భౌతికావసరాలు తీర్చుకోవటం వల్లనే బరువు బాధ్యతలు సక్రమంగా నేరవేర్చగలిగాడు .ప్రజాజీవితం లో అలుపెరుగని వ్యక్తీ ,దాపరికం లేని మనిషి .పోరాటశీలి అయిన జర్నలిస్ట్ .ఉమ్మడికుటుంబం లోందరికి ప్రీతిపాత్రమైనవాడు నిరాడంబరుడు పొగతాగటం మద్యం సేవించటం లేనే లేవు .చిన్న ధోవతీ ,చొక్కా మాత్రమె ధరించే వాడు .రాజునైనా ,పేదనైనా అదే దుస్తులతో కలిసేవాడు .ఆయనవి నిక్కచ్చి విమర్శలు .ప్రత్యర్ధులపై అభాండాలు ఎన్నడూ రాయని పెద్దమనిషి .అందరితో అవగాహనతో మెలిగేవాడు .ప్రత్యర్ధులను ఎందరినో మిత్రులుగా గెలుచుకొన్నాడు .బ్రిటిష్ అధికారులకూ ఆయన మిత్రుడే .ఇల్లే ఆఫీసు గా చేసుకొని ఎవరు ఏసమయం లో వచ్చినా ఆత్మీయంగా స్వాగతి౦ చేవాడు .అమృతబజార్ పత్రిక, జాతీయ రాజకీయాలే ఆయన వ్యాపకాలు .సంగీతం వైష్ణవ సాహిత్య అధ్యయనం ఆయన అభిరుచులు .జాతీయోద్యమ సిద్ధాంత కర్త కాకపోయినా ,,సామాన్య మానవులకోసం ముఖ్యంగా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పరితపించాడు .

 1917 ఆయనకు ఎన్నో బరువు బాధ్యతలు తెచ్చింది .30లక్షల డయరాన్ రియల్ ఎస్టేట్ సివిల్ కేసు లో కమీషన్ ముందు సాక్ష్యం ఇవ్వటానికి నోటీసులు వచ్చాయి .వీటితో అలసట చెందిన ఆయన శరీరం విశ్రాంతి కోరింది .బీహార్ లోని సోనే నది ఒడ్డున కోయిల్ వార్ అనే ప్రశాంత వాతావరణం లో గడపటానికి వెళ్ళాడు .ఆధ్యాత్మిక గ్రంథాలు తనవెంట తీసుకు వెళ్ళాడు .అక్కడా పత్రికా వ్యవహారాలూ చూస్తూ ఆదేశాలిస్తూ గడిపాడు .అక్కడి ప్రశాంతత నిస్తేజం కలిగించగా 1918ప్రారంభం లో కాశీ వెళ్ళాడు .అక్కడ పక్షవాతం వచ్చి ఎడమభాగం చచ్చు పడి పోయింది .ప్రాణం పోయేదాకా ఇది వదలలేదు .

  1918మధ్యలో మళ్ళీ కలకత్తా చేరాడు .మళ్ళీ జబ్బు చేసింది .గాంధీ ప్రతిపాదించిన ఆహి౦సాత్మక సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదం పొందిన సభకు వెళ్ళలేక పోయాడు .శరీరం కృశిస్తున్నా ,గుండె దిటవు తగ్గలేదు .1919లో అల్లుడు నృత్యగోపాల్ మరణం తట్టుకోగలిగాడు .కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఆయన బ్రహ్మానందం ప్రాప్తించే ఊర్ధ్వ లోకాలకు వెళ్ళినందుకు సంతోషించాలికానీ శోకం పనికి రాదు అని తాత్విక బోధ చేశాడు .

  1921మధ్యలో మోతీలాల్ ఆరోగ్యం పట్ల ప్రజలు ఆందోళన చెందటం ప్రారంభించారు .ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య విషయాలు పత్రికలో ప్రచురించేవారు .జులైలో స్టేట్స్ మాన్ పత్రిక –‘’చాలామంది యూరోపియన్ లతో పాటు ,అశేష అభిమానులున్న అమృతబజార్ పత్రిక పాఠకులకు సంతోష వార్త .మోతీలాల్ ఘోష్ క్రమంగా కోలుకొంటున్నారు .ఆయనకు వచ్చిన పక్షవాతం చాలా వరకు నయమైంది .ఆయనవయసు 75.’’అని రాసింది .

  ఆయన రాయటం మానలేదు ఉదయం తన ఇంటి దగ్గరున్న నదీ తీరానికి గుర్రం బండీలో వెళ్లి స్వచ్చమైన గాలి పీలుస్తూ ,వార్తాపత్రికలు చదివించి విషయాలు తెలుసుకోనేవాడు .కర్ర ఆధారంగా కాసేపు నడిచేవాడు .మధ్యాహ్నం రాసుకోనేవాడు .ఐర్లాండ్ పరిస్థితులు తెలుసుకోవటానికి బ్రిటన్ నుంచి వచ్చిన వార్తా పత్రికలూ చదివే వాడు .మృత్యువు మీద పడుతోంది అన్న వాస్తవం గ్రహించి ,దానితో రాజీకి వచ్చాడు .మృత్యువు రాకకోసం నిశ్చింతగా ఎదురు చూశాడు .మరణం మానవ జీవితం లో ఒక ఘట్టం మాత్రమె అని నమ్మాడు .మరణం తర్వాత మంచి లోక ప్రాప్తి కలుగుతుందని తెలుసుకొన్నాడు .అతీత శక్తిగల భగవంతుడు మనకు మంచి మిత్రుడు అనేవాడు .శ్రీ కృష్ణ ,గౌరాంగ ల లాగా మానవుడిలో ఉండేవాడే దేవుడు అని నమ్మాడు .భారత ప్రజానీకానికి తమ ఇల్లు తాము సరిదిద్దుకొనే సామర్ధ్యం ఉన్నవారని భావించాడు .మానవునిపై అచంచల విశ్వాసం ఆయనది .

  1922మధ్యలో మళ్ళీ కోలుకొన్నాడు మోతీలాల్ .తన ఆరోగ్యం గురించి పత్రికలో –‘’రాజైనా రైతైనా సన్యాసి అయినా ,పామరుడైనా మృత్యువును తప్పించుకోలేడు .వంటికి నీరుపట్టటం ,ఊపిరి ఆడని ఆయాసం ,వెన్ను నొప్పులు భరించరానివే .ఈ మధ్య వచ్చిన స్ట్రోక్ వంటిది మళ్ళీ నాకు వస్తే భరించే శక్తి నాకు లేదు .ఆరోజున ఎలాగో భరించగలిగాను .మృత్యువు సమీపిస్తుంటే ,శారీరకబాధలేవీ లేకుండా ,ఆనందం ఆవరిస్తుందని శాస్త్రీయంగా రుజువైంది .అంటే శరీరం నుంచి ఆత్మ వేరై ,ఊర్ధ్వ లోకాలలో తన శాశ్వత గమ్యస్థానానికి వెళ్ళే సమయం లో శరీరానికి బ్రహ్మానందం ప్రాప్తిస్తు౦దన్నమాట .ఆ ఆనందాన్ని అతి త్వరలో అనుభవి౦చ బోతున్నానని  ఆశిస్తున్నాను .మానవాళికి ఆ ఆనందం ఇదిగో ఇలాంటిది అని వ్యక్తం చేసే అవకాశం చిక్కదని మాత్రం విచారిస్తున్నాను ‘’అని రాశాడు మోతీలాల్ పక్వ హృదయం తో .

 మళ్ళీ వ్యాధి తిరగబెట్టి బాగా నీరసించాడు. గాస్ ట్రబుల్ ఎక్కువైంది జలోదరం తోపాటు న్యుమోనియా వచ్చింది .కొంతకాలానికి తగ్గి ,4-9-1922కి ఆరోగ్యం ప్రమాద స్థాయికి చేరి,ఆ మర్నాడే మోతీలాల్ ఈ బాధామయ ప్రపంచం నుంచి శాశ్వత ఆనందం కోసం వెళ్ళిపోయాడు .కుటుంబ సభ్యులు చుట్టూ చేరిహరినామ స్మరణ చేశారు .మరణానికి కొన్ని రోజులముందు తన్ను చూడటానికి వచ్చిన బంధువుతో మోతీలాల్ –‘’నాకు తీరనిది అంటూ ఎమీ లేదు .మృత్యువుకు కొన్ని అంగుళాల దూరం లో మాత్రమె ఉన్నాను .దేనినైనా తట్టుకొనే వయసు ఉంది .ప్రపంచం లో ఆనందాన్ని పూర్తిగా అనుభవించాను .తెలిసి ఏ పాపమూ చేయలేదు .ఇహాన్ని వదిలి వెళ్లి పోతున్న నాకు బ్రహ్మానందం లభిస్తుంది .ఎందుకు ఆనందంగా ఉండకూడదో చెప్పు ‘’అన్నాడు .

  వేలాదిమంది మోతీలాల్ మృతికి సంతాపాలు పంపారు .వచ్చి చూసి చివరి దర్శనం చేసుకొన్నారు .బిన్న రాజకీయ సిద్దా౦తా లున్న మూడు పత్రికలు  వ్రాసిన సందేశాలు ఇలా ఉన్నాయి –గాంధీజీ జైలులో ఉన్నప్పుడు రాజాజీ ,జైరాం దాస్ దౌలత్ రాయ్ ,జార్జ్ జోసెఫ్ ల సంపాదకత్వం లో ఉన్న యాంగ్ ఇండియా పత్రిక –‘’శిదిలపేటికను ఒక మహోన్నత ఆత్మ విడిచి పెట్టి వెళ్ళిపోయింది .మనరాజకీయచి౦తన లో సత్యం ధర్యం అనే గుణాలు ప్రవేశపెట్టి ,దాన్ని ప్రజాస్వామ్యానికి అనుగుణంగా తీర్చి దిద్దినవాడు మోతీలాల్ ఘోష్ .భారత స్వాతంత్ర్య చరిత్రలో ఆయనది గౌరవ స్థానం .ఆత్మ సౌన్దార్యం ,దానికి సామర్ధ్యం కలిగిన ప్రజల అభిమానాన్నే కాక ప్రేమను కూడా నోచుకొన్న అరుదైన వ్యక్తీ .గాంధీ ,మోతీలాల్ లను మహానీయులనుంచి వేరు చేసింది వారిలోని ‘’కృష్ణ చైతన్యమే ‘’అని శ్లాఘించింది .ఒకప్పటి స్టేట్స్ మన్ పత్రిక సంపాదకుడు ,తర్వాత లండన్ నుంచి వెలువడే ‘’ది న్యు స్టేట్స్ మన్’’సంపాదకుడు ఎస్.కే రాట్లిఫ్ –‘’తమ వ్యక్తిత్వం రచనలు ,విద్యావంతులకు ,విద్యా లేనివారికి కూడా పరిచయున్న వారు ఎంతమంది ఉన్నారు ?ఇంగ్లాండ్ లో అలాంటి వారు ఒక్కరు కూడా లేరని చెప్పవచ్చు .మొత్తం పాశ్చాత్య ప్రపంచం లో ప్రజలందరికీ తెలిసిన రచయితా లేనే లేడు .అది భారత దేశం లోనే సంభవం .భారత్ మొత్తం మీద ఒక విలక్షణ మేధావి ఉన్నాడు .ఆయనే కలకత్తాలో అమృత బజార్ పత్రిక నడిపే బాబూ మోతీలాల్ ఘోష్ .ఆయన 77వ ఏట కన్ను మూశాడు .ఆయన నిష్క్రమణలో భారతీయ జర్నలిజం లో ఒక శకం అంతరించింది .ఆయన తనకు తానె మహాశక్తిగా ఎదిగిన మహా వ్యక్తీ .భారతీయులకు ఆయన సుపరిచిత వ్యక్తీ .కలకత్తానగరం ఉత్తరభాగాన పెద్ద హిందూ కుటుంబం  తో ఉన్న ఇంట్లోనే ఆయన ఎడిటోరియల్ ఆఫీస్ ఉంది .ఆ ఆఫీసులోనే పుష్కరం క్రితం మెక్డోనాల్డ్ అనే ఇటాలియన్ రాజభవనాన్ని తలపించే చోట ఆయన్ను కలుసుకొన్నాం ..అక్కడి ప్రతి రాయి  శిధిల గాథ చెబుతుంది .ప్రక్కనే ముద్రణాలయం లో లినో టైప్ యంత్రాలు పని చేస్తున్నాయి .బెంగాల్ లో ఇంగ్లీష్ వారు పత్రికలకు లినో టైప్ యంత్రాలు వాడకముందే ఈయన తనపత్రికకు వాడారు ‘’అన్నది .మూడవ పత్రిక ‘’దిఇంగ్లీష్ మాన్ ‘’మోతీలాల్ దివ్య స్మృతికి నీరాజనాలిస్తూ –‘’భారత రాజకీయ రంగం నుంచి ఒక మహోన్నత వ్యక్తీ నిష్క్ర మించాడు .ఆయన బ్రిటిష్ వారికి ప్రమాదకర వ్యక్తిగా భారతీయులకు ఆరాధనీయుడుగా కనిపించాడు .ఆయన అద్భుతమైన వ్యక్తీ అని శత్రువులు కూడా అంగీకరిస్తారు .కేవలం ఒక చోట భైఠా యించి ప్రభుత్వం మీద ,వ్యవహారాలమీద నిప్పులు చెరిగాడు .అంతకీర్తి ఆయనకు రావటానికి  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శించిన సాహసం మాత్రమె కారణం కాదు .భారత రాజకీయ నాయకులు తప్పుదోవ పడితే వారికి వ్యతిరేకంగా ఆయన చూపిన సాహసమే ముఖ్య కారణం .వ్యంగ్యవైభవంతో కూడిన ఆయన శైలి కూడా కారణమే .ఆయన రచనలు చదివి స్వదేశీయులే భయపడే వారు .యూరోపియన్లు కూడా మోతీలాల్ చిత్త శుద్ధిని ,నిజాయితీని గౌరవించారు ‘’అని మెచ్చింది .ఇంగ్లీష్ కవి టెన్నిసన్ కవిత మోతీలాల్ ఘోష్ కు పూర్తిగా సరిపోతుంది –

‘’అతడొక సాహస హృదయుడు –శ్రమించి శోధించి అంతు కనుక్కోవటమేకానీ –తలవంచి లొంగి పోయి ఎరుగడు ‘’.

  ఇంతటి మహోన్నత వ్యక్తి మోతీలాల్ ఘోష్ ను ని  స్వాతంత్ర్య అమృతోత్సవసందర్భంగా పరిచయం చేసే అదృష్టం నాకు దక్కినందుకు గర్వంగా ఉంది .

  ఆధారం –ఎస్.ఎల్ ఘోష్ రాసినదానికి  శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ అనువాదం చేసనపుస్తకం  ‘’మోతీలాల్ ఘోష్ ‘’

  రేపు 75వ భారత స్వాతంత్రోత్సవ శుభా కాంక్షలతో

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంధ్రవిప్లవ వీరుడుడా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి

ఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి

ఉపన్యాసాలు ఇవ్వటం లోనే కాదు ఆచరణలో పెఅట్టటం లోనూ ఘనుడు డా యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి .ఒంటరివాడు .ప్రోత్సాహం లేకపోయింది .కాని ఆకర్యదీక్ష సాహసం ఇంకొరికి లేనే లేదు .’’యుద్ధ విరామ సైనికులే నేటి కాంగ్రెస్ నాయకులు ‘’అనే వాడు .రాజనీతి రాజకీయ పరిజ్ఞానం ఉంటేనే శత్రు సంహారం చేయగలం అనే వాడు .పట్టాభి లాగా ఈతడూ డాక్టరు,రాజకీయ పండితుడు .నెలకు సుమారు వెయ్యి రూపాయల జీతం .రాజకీయం దేశ స్వాతంత్ర్యం కోసం దాన్ని వదిలేశాడు .నాడీ పరీక్షలో మేటి .సిద్ధహస్తుడు అమృత హస్తుడు అని పేరు పొందాడు .హస్తవాసిమంచిదని కళ్ళకు అద్దుకోనేవారు .

  తూర్పు గోదావరిజిల్లా మండపేటలో వైదీక తెలగాణ్య కుటుంబం లో 16-2-1886న జన్మించాడు తండ్రి రామస్వామి .కౌశిక గోత్రీకుడు .విశ్వామిత్రుని లోని అన్ని లక్షణాలు ఉన్న వాడు .తండ్రి ఏక సంథాగ్రాహి, మంచికవి .కుటుంబభారం అంతా శాస్త్రి దే .విరక్తుడై కాడి పారేయలేదు .వివాహం అయ్యాక ,విద్య మానేసి కుటుంబ భారం మోశాడు .అప్పుడే బెంగాల్ విభజన జరిగి రాజకీయాందోళనలు మిన్ను ముట్టాయి .

  ప్రభుత్వం బెంగాల్ రహదారుల విషయం లో నిర్లక్ష్యం చేసింది .తరచూ నదులకు వరదలు వచ్చి ప్రజాజీవితం అస్త వ్యస్తమయ్యేది .జనపనార ముఖ్య పంట.రైతులకు రాబడి బాగా ఉండేది .నదీ పరివాహక  ప్రాంతాలు ఎక్కువ .అక్కడి ఇళ్ళు వెదురు బద్దలతో కట్టుకొనేవారు .వరదలలో గ్రామాలుదిబ్బలమీద ఇళ్ళు లాగా ఉండేవి .పడవలమీదే ప్రయాణం .బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ ఏకాభి ప్రాయం .ఇది రాజకీయంగా నష్టం అని ప్రజాభిప్రాయం .పత్రికలుకూడా ఎలుగెత్తి చాటాయి .బెంగాల్ పశ్చిమ భాగం ,బీహార్ ఒరిస్సా ఒకభాగం ,తూర్పు బెంగాల్ అస్సాం ఒక భాగంగా విభజించాడు కర్జన్ దుర్జన్ అని పించుకొన్నాడు .విప్లవ జ్వాలలు పశ్చిమ బెంగాల్ లో ఎక్కువ .అందుకే తూర్పు పశ్చిమ భాగాలను వేరుచేశాడని ప్రజల ఘోష .పశ్చిమ బెంగాల్ లో విద్యాధికులు రాజకీయ నాయకులు ఎక్కువ .తూర్పున విద్య లో వెనకబడింది .ముస్లిం లు ఎక్కువ .రెండు ప్రాంతాలవారు కలిస్తే ప్రభుత్వానికి ముప్పు అని చేసిన విభజన అని ప్రజాభిప్రాయం .విభజించి పాలించటం బెంగాల్ తోనే మొదలైంది .

  బంకిం చంద్ర చటర్జీ ఆనంద మఠం నవలలో ‘’వందే మాతరం’’గీతం రాయగా ఆది ప్రజల నోళ్ళలో నాని జాతీయ గీత గౌరవం పొందింది .తిలక్ కలకత్తా వచ్చి ప్రచారం చేస్తే ,అరవిందుని సోదరుడు బరీంద్రుడు బరోడానుంచి కలకత్తా వచ్చాడు .స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్ర నాథ దత్తు ,మిత్రుడు అవినేష్ భట్టాచార్జీ లతోకలిసి ‘’యుగంధర్ ‘’పత్రిక స్థాపించి ప్రచురించాడు.వీరి విప్లవోద్యమానికి 11రివాల్వర్లు ,4రైఫిల్స్ ,ఒక తుపాకీ రహస్యంగా సంపాదించారు .ఈ సంఘం లో ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా 15మంది యువకులున్నారు .వీరంతా పులిన్ బిహారీ దాస్ నాయకత్వం లోఢక్కాలో ‘’అను శీలన సమితి ‘ఏర్పరచి ,రెండవ శాఖ కలకత్తా లో ఏర్పరచారు .ఢక్కా సంఘానికి 500 శాఖలేర్పడ్డాయి .సంధ్య అనే వారపత్రికను కూడా పెట్టి’’ సంపూర్ణ స్వరాజ్యం కావాలి ‘’ అని ప్రకటించారు .వీరంతా భగవద్గీత ,వివేకానందుని ఉపన్యాసాలు మాజిని, గారిబాల్డీ ల జీవిత చరిత్రలు చదువుతూ చదివిస్తూ ప్రేరణ పొంది పొందించారు .వీరి ముఖ్య గ్రంథం ‘’ముక్తికాన్ పథే’’.వీరంతా బెంగాల్ లో ఉత్తమ కులీనులు అంటే భద్రజాతి వారు .డబ్బు కోసం దోపిడీలు చేసేవారు .కొన్ని విఫలమయ్యాయి .మిడ్నపూర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ వెళ్ళే రైలుకింద బాంబు పెట్టారు .ఢక్కాలోని నౌతాయి గంజి లో డబ్బు సంచులు మోసుకు వెడుతున్న వాడిని పొడిచి డబ్బు దోచుకు వెళ్ళారు .23-7-1907న జిల్లా కలెక్టర్ అలెన్ ను పిస్టల్ తో కాల్చారు .సిబిపూర్ లో ఒక ఇంట్లో నాలుగు వందలు దోచారు .30-4-1908న కేనడిభార్య కూతురుప్రయాణం చేసే రైలు పై బాంబులు విసిరితే  ,ఆడవాళ్ళు ఇద్దరూ చనిపోయారు .కలకత్తాలోని గార్డెన్ రీచ్ లో కింగ్స్ ఫోర్డ్ ను చంపే ప్రయత్నం చేశారు .చావకపోతే పార్సెల్ లో బాంబు పంపారు వాడు విప్పలేదు కనక చావలేదు .1908 ఏప్రిల్ 30న బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఇద్దరు స్త్రీలను ఒకపురుషుడిని చంపారు .

  24పరగణా జిల్లా అల్లీ పూర్ కుట్ర జరిగి యావజ్జీవ ,ద్వీపాంతర వాస శిక్షలు పడ్డాయి .దాకా బారాబజార్ లో 25వేలు నగదు అపహరించారు .కొన్ని చోట్ల కొబ్బరికాయలలో బాంబులు పెట్టి పేల్చారు .పడవలలో దొంగతనాలు హత్యలుచేశారు .కలకత్తాలో నందార్ లాల్ బెనర్జీ అనే సబ్ ఇన్స్పెక్టర్ ను చంపారు .ఇలా లెక్కలేనన్ని దోపిడీలు దొంగతనాలు హత్యలు బాంబు ప్రేలుళ్ళతో  బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాదించారు విప్లవ వీరులు .దేశం అట్టుడికి పోయింది .అప్పుడే బిపిన్ చంద్రపాల్ ఆంద్ర దేశ పర్యటనకు వచ్చి బెంగాల్ విభజనపై తీవ్ర ప్రచారం చేసి విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తు ప్రోత్సాహం కలిగించాడు .ఆరోజుల్లో పోలీసు అంటే హడల్ .జగ్గన్న శాస్త్రి బిపిన్ చంద్ర పాల్ తో పల్లెపల్లెకూ తిరిగి ప్రచారం చేశాడు ధైర్యంగా .పాల్ 24-4-1907న రాజమండ్రి వస్తే జగ్గన్న శాస్త్రి ,గాడిచర్ల హరి పురుషోత్తమ రావు,బోడి నారాయణ రావు  గార్లు ఆయన్ను కలిసి ప్రచారం చేశారు .

  రాజమండ్రి ట్రెయినింగ్  కాలేజి విద్యార్ధులను బయటికి రాకుండా మార్క్ హంటర్ ప్రయత్నిస్తే జగ్గన్న శాస్త్రి విద్యార్ధులతో సమ్మె చేయించి ఒక్క విద్యార్దికూడా కాలేజికి వెళ్ళకుండా చేయగలిగాడు .అప్పటినుంచే శాస్త్రి బహిరంగ రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నాడు .బిపిన్ పాల్ తో గ్రామగ్రామానా ప్రచారం చేసి ,ప్రజలలో స్వదేశీ అభిమానం కలిగించాడు  జగ్గన్న శాస్త్రి .వందే మాతరం న్యూస్ పేపర్ రి  పోర్ట్ ప్రకారం జగ్గన్న శాస్త్రి బిపిన్ పాల్ వెంట వుండి ప్రచారం చేస్తూ ,తాము  విదేశాలకు వెళ్లి బాంబులు తయారు చేయటం బాంబుల్ని నిర్వీర్యం చేయటం నేర్చుకొని తిరిగి వచ్చి ,ప్రతిఅమావాస్య రాత్రి తమకు శత్రువులైన 108 మంది తెల్ల దొరలను బాంబులతో చంపేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు ఉంది .

  26-3-1908 న చిదంబరం పిళ్ళై ను అరెస్ట్ చేసినప్పుడు స్వరాజ్య పత్రికలో ‘అరే.ఫరంగీ .క్రూర వ్యాఘ్రమా నిష్కారణంగా ముగ్గురు హిందువులను అరెస్ట్ చేసి నీతినీ చట్టాన్నీ పొట్టన పెట్టుకోన్నావు .మీ రోజులు దగ్గర పడ్డాయి అని తెలుసుకో ‘’అని రాశారు .ఎడిటర్ ను, ప్రింటర్ ను అరెస్ట్ చేసి శిక్ష వేయగా పత్రిక అంతటితో ఆగిపోయింది .జగ్గన్న శాస్త్రి తన మొదటి బహిరంగ ఉపన్యాసాన్ని 1907లో సామర్లకోటలో ఇచ్చాడు .అక్కడినుంచి చాలాగ్రామాలు తిరిగి ఉపన్యాసాలిచ్చాడు .ప్రజల్లో గొప్ప రాజకీయ చైతన్యం కలిగించాడు .బెంగాల్ లో వందలకొలది విప్లవ కారులు చేసిన ప్రచారం ఆంధ్రాలో ఒక్క జగ్గన్న శాస్త్రి మాత్రమె చేసి అబ్బుర పరచాడు.బందరు మొదలైన చోట్ల విప్లవ సంఘాలు పెట్టాడుకానీ అవేవీ సరిగా పని చేయలేదు .అయినా అధైర్యపడ లేదు శాస్త్రి .

  1908లో గోదావరి పుష్కరాల సమయం లో  జగ్గన్న శాస్త్రి ,మరొక దేశ ప్రేమికుడు వంగల వెంకట నారాయణ గారు కలిసి ఒక బోర్డు పెట్టి , పుష్కర యాత్రికులకు సకల సౌకర్యాలు కలిగించారు .ఇది పోలీస్ సూపరిం టే౦న్డెంట్  కు కంటి మంటగా ఉండి బోర్డు తీయమన్నాడు .ఇద్దరూ కలిసి తియ్యము పొమ్మన్నారు .కలెక్టర్ కు తెలిసి శాస్త్రిని వచ్చి కలవమనితాసీల్దార్ దావులూరి ఉమామహేశ్వర రావు తో కబురుపంపాడు .ఆయనమండపేటవచ్చి శాస్త్రిని కలిసి కలెక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు .కలెక్టర్ శాస్త్రి తో ఆయన్ను అరెస్ట్ చేయటానికి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందనీ ,శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని అరెస్ట్ చేయటం లేదని ,విప్లవసంఘాలతో సంబంధం పెట్టుకోవద్దని హితవు చెప్పి పంపించాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-22-ఉయ్యూరు 

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి .31వ భాగం.14.8.22

భారతీ నిరుక్తి .31వ భాగం.14.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గాడిచెర్ల సర్వోత్తమ జీవితం 1వ భాగం.13.8.22

గాడిచెర్ల సర్వోత్తమ జీవితం 1వ భాగం.13.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-23

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-23

మహాత్మా –మోతీలాల్ ఘోష్

గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ను విశ్వసించే జాతీయవాదులకు ,ప్రతిఘటన ఉద్యమంగా భావించే వారికి మధ్య అభిప్రాయ భేదాలు బయట పడ్డాయి .దేశబంధు దాస్ నాయకత్వం లో బెంగాల్ లోని వర్గం స్థానిక సంస్థలకు కూడా ప్రతిఘటన ఉద్యమం వ్యాపింప జేయాలని కోరింది .విదేశీ వస్త్రాలు మద్యం షాపులవద్ద పికెటింగ్ లు నిర్వహించారు .విదేశీ వస్త్ర దహన భోగి మంటలు నిత్య దృశ్యమైంది .మొదటి వాలంటీర్ దళానికి సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించాడు .చిత్తరంజన్ భార్య బసంతీదేవి నాయకత్వం లో స్త్రీలుకూడా శాంతియుత పోరాటం చేశారు .1921లో వేల్స్ యువరాజు పర్యటనకు ముందు ఇవి పతాకస్థాయికి చేరాయి .యువరాజు పర్యటనకు ప్రాముఖ్యం ఇవ్వరాదని హర్తాల్ పాటించాలని’ కాంగ్రెస్ ఖిలాఫత్ కమిటీ ‘’నిర్ణయించింది .యువరాజుకు ఆహ్వానం పలకటానికి అధికారులతో విదేయులతో ఒక కమిటీ ఏర్పాటైంది .’’పిడికెడు కాసులకోసం కోటులో దర్జాగా ఒక రిబ్బన్ తగిలించుకొనే గొప్పకోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన నాయకుడు ‘’గా అమృత బజార్ పత్రిక చేత వర్ణింపబడిన సురెంద్రనాద్ బెనర్జీ కూడా ఈ కమిటీ లో ఉన్నాడు .అప్పటికి ఆయనకు ‘’సర్’’బిరుదు ఉంది .మోతీలాల్ ఘోష్ అనుమతిని పొందకుండానే ఆయన పేరు ఆకమిటీలో చేర్చారు .ఆతర్వాత ఆయన తన వైఖరిని స్పష్టంగా పత్రికా ముఖంగా తెలియజేశాడు .దీనిపై ఆయన పత్రికలో రాస్తూ ‘’యువరాజు ఆహ్వాన సంఘం లో మీరుకూడా చేరారా ?అని ఎందఱో ఉత్తరాలురాశారు .ఆయనకు తెలియకుండా సంప్రదించకుండా పేరు చేర్చారు అని అందరికి జాబులు రాశాం .వివాదం సమసిపోయింది .కానీ మోతీలాల్ ను దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో సురెంద్రనాథ్ తనపేపర్ లో మోతీలాల్ వైఖరి మారినట్లు రాశాడు .దీన్ని తిప్పికొడుతూ పత్రికలో –భారత దేశ భవిష్యత్ రాజకుమారుడి ముందు మోకరిల్లాడు అంటే స్వార్ధం కోసమా దేశ ప్రయోజనాలకోసమా ,తెల్లదొరలనుంచి బిరుదులూ పొందటానికా ,ఏడాదికి 64వేల రూపాయలమంత్రిపదవి కోసమా ?ఇలాంటి కక్కుర్తి పడ్డ బడా నాయకుల్ని చూస్తూనే ఉన్నాం. మోతీలాల్ అలాంటి కక్కుర్తి పడే నాయకుడు కాదు ‘’అని ఘాటుగా నషాళం అన్టేట్లు చివాట్లు పెట్టాడు .

  యువరాజు బొంబాయిలో అడుగుపెట్టిన నవంబర్ 17న బెంగాల్ అంతటా హర్తాల్ పాటించారు .ప్రభుత్వం గంగ వెర్రు లెత్తింది .ఆయన కలకత్తా  వచ్చినపుడు ఇలాగే జరిగితే పరువు బంగాళాఖాతం లో పడి కొట్టుకు పోవటం ఖాయం అని ప్రభుత్వం భావించింది .స్త్రీ పురుష విచక్షణ లేకుండా వాలంటీర్ లందర్నీ అరెస్ట్ చేయమని ‘’రోనాల్డ్ షీ’’ఉత్తర్వులిచ్చాడు .ఎక్కడ చూసినా అరెస్ట్ లే అరెస్ట్ లు .దాసు గారు ఆయన సహచరులు కూడా జైలుపాలయ్యారు.ప్రజలు మరింత ఉత్సాహంగా ముందుకు వచ్చి జైలుపాలయ్యారు .జైలు అంటే భయం లేకుండా ఒక ప్రహసనంగా మారింది .మితవాదులూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు .రాజీకోసం వైస్రాయ్ పిలిస్తే గాంధీ వెళ్ళాడు .రాజీషరతులేవో చెప్పి అరెస్ట్ చేసిన వారందర్నీ విడుదల చేయాలని గాంధీ షరతు పెట్టాడు .ప్రభుత్వం తిరస్కరించి ఆయన్ను 1922మార్చిలో అరెస్ట్ చేసి ఆరేళ్ళు శిక్ష విధించింది .నేషనలిస్ట్ లు శాసనమండలి సభ్యత్వం పొంది ,ప్రభుత్వ సంస్కరణలకు సభనుంచే అడ్డంకులు కలిపిస్తే మంచిది అని ప్రజలు భావించారు .దాస్ జైలులో ఉన్నా ఉద్యమం బలంగానే జరుగుతోంది .శాసన సభలో మెజార్టీ వోటుద్వారా ప్రభుత్వ చర్యలను తిరస్కరించటం మంచిదని మోతీలాల్ నెహ్రు ,టంగుటూరి ప్రకాశం విఠల్ భాయ్ పటేల్ కూడా మద్దతు ప్రకటించారు .

  23-4-1922న విఠల్భాయ్ ,,ప్రకాశం గార్లు మోతీలాల్ ఘోష్ ను ఆయన ఇంట్లో కలిశారు .అప్పటికే ఆరునెలలనుంచి జబ్బుతో ఆయన మంచం మీద ఉన్నాడు .మోతీలాల్ తో జరిపిన సంభాషణ ను ప్రకాశంగారు స్వరాజ్య పత్రికలో రిపోర్ట్ ఇచ్చారు –‘కొత్తగా కౌన్సిల్ ఏర్పడినప్పుడల్లా దానిలో ప్రవేశానికి నేను వ్యతిరేకిస్తూనే ఉన్నాను .గాంధీజీ వచ్చి ఇక్కడ నన్ను కలిసినప్పుడు  ఆయనకు ఒక  మాట చెప్పాను. అప్పుడు విఠల్ భాయ్ కూడా ఉన్నారు.కౌన్సిల్ కు ఎవరు వెళ్ళినా అక్కడి దుష్టవాతావరణం లో చెడిపోవటం ఖాయం .మనవాళ్ళే కొందరు కౌన్సిల్ ప్రవేశం కోరటం దురదృష్టకరం .దీనివలన మన శిబిరం లో చీలిక రాకూడదు ‘’అన్నాడు. దీనికి విఠల్ భాయ్ పటేల్ ‘ స్త్రీలతోసహా 25వేలమంది దేశ భక్తులను మనం జైళ్లకుకు పంపి ఇప్పుడు ఇలా అనటం భావ్యం కాదు .చీలిక రాకుండా చూస్తాం .డిసెంబర్ కాంగ్రెస్ లో పరిష్కార౦  సాదిస్తాం ‘’అన్నాడు  .నాయకుల దేశ భక్తుల త్యాగంతో మొతీలాల్ కళ్ళు చెమర్చాయి ,’’ఇంతటి త్యాగం దేశభక్తి నేను బతికి ఉండగా చూస్తానని అనుకోలేదు .జీవించి ఉండిఇవన్నీ చూస్తున్నందుకు ఆనందంగా ఉంది ‘.అన్నాడు సంతృప్తిగా .ఆఇద్దరు మహా నాయకులు ఆవృద్ధ నాయకుని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు .వారితో మాట్లాడినంత సేపు మోతీలాల్ పడుకోలేదు .మంచం మీద ముడుచుకొని కూర్చుని , వణుకుతున్న కఠం తో మంత్రించినట్లు మాట్లాడి ఆనాయకులపట్ల పూర్తీ మర్యాద గౌరవాలను చూపాడు .అధికారం చేతికి వస్తే దిగజారుతారని ఆయన భయం .ఎన్నికలు నిష్పాక్ష పాతంగా జరగవని ఆందోళన .వస్తే సర్వ స్వేచ్చాయుతమైన పార్లమెంట్ రావాలి లేకపోతె ఏదీ వద్దు అని మోతీలాల్ భావించాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-8-22-ఉయ్యూరు  

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రజాకార్ల పాలిటి సింహస్వప్నం ,గిరిజనజాగృతి,సిపిఎం శాసనసభ్యురాలు,’’నా మాటే తుపాకి తూటా’’గా ఆత్మకధ రాసుకొన్న –శ్రీ మతి మల్లు స్వరాజ్యం

రజాకార్ల పాలిటి సింహస్వప్నం ,గిరిజనజాగృతి,సిపిఎం శాసనసభ్యురాలు,’’నా మాటే తుపాకి తూటా’’గా ఆత్మకధ రాసుకొన్న –శ్రీ మతి మల్లు స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం (1931 – 2022 మార్చి 19[1])[2] తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. మల్లు వెంకట నరసింహారెడ్డి సతీమణి. మల్లు స్వరాజ్యం ఆత్మకథ “నా మాటే తుపాకీ తూటా” అన్న పేరుతో 2019లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా పుస్తకంగా వచ్చింది.

కుటుంబం
స్వరాజ్యం 1954లో మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు గౌతమ్, నాగార్జున, కుమార్తె కరుణ ఉన్నారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యానికి సోదరుడు.

జివిత విశేషాలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించింది. ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. మల్లు స్వరాజ్యం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొల్పింది.

ఈమె జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేది. ఈమె ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1978-1983[3], 1983-1984[4] సంవత్సరాలలో రెండు పర్యాయాలు సి.పి.ఐ.(ఎం) పార్టీ తరఫున ఎన్నికైంది. నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఈమెకు సోదరుడు. వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ‘చైతన్య మానవి’ సంపాదకవర్గంలో ఈమె ఒకరు.

ఈమె పాటల్లో ఒక ఉయ్యాలపాటలో[5] కొంత భాగం:

వీరమరణం చెందిన ‘మట్టారెడ్డి’, ‘అనంతరెడ్డి’లను స్మరిస్తూ బతకమ్మ పాటశైలిలో ఇలా వివరించింది.

వీరిమట్టారెడ్డి ఉయ్యాలో
ధీర అనంతారెడ్డి ఉయ్యాలో
మీవంటి వీరులు ఉయ్యాలో
మా మధ్య నిలబడి ఉయ్యాలో
మాకు వెలుగులు చూపి ఉయ్యాలో
ఓర్వదీ ప్రభుత్వంబు ఉయ్యాలో
పాత సూర్యాపేట ఉయ్యాలో
పోరాటమును చూడు ఉయ్యాలో
ప్రజల బలమును జూసి ఉయ్యాలో
పారిపోయిరి వాళ్ళు ఉయ్యాలో
మన ప్రజల రాజ్యమును
పొంది తీరాలమ్మ ఉయ్యాలో

మరణం
మల్లు స్వరాజ్యం వయో భారంతోపాటు ఊపిరితిత్తుల సమస్యతో దీర్ఘకాలంగా బాధపడుతున్న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2022 మార్చి 19న -92వ ఏట మరణించింది.[6][7]

2-తెలంగాణా పోరాట సమితి తొలియోధుడు ,గెరిల్లా నాయకుడు ,,హరిజన సేవా సంఘం స్థాపించి 100పాఠశాలశాలలు నిర్మించిన సంఘ సంస్కర్త ,ఆంధ్రమహాసభ స్థాపకుడు ,నల్గొండ లోక్ సభాస్థానాన్ని నెహ్రూ కంటే భారీ మెజారిటీ తో గెలిచిన ‘వీర తెలంగాణ వాది’’-శ్రీ రావి నారాయణ రెడ్డి

రావి నారాయణరెడ్డి, (జూన్ 5, 1908 – సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు[1]. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొనవచ్చు.

జననం
యాదాద్రి – భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908, జూన్ 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు.

రాజకీయ రంగం
విద్యార్థి దశలో
రావి నారాయణరెడ్డి తొలిదశలో ఆంధ్రమహాసభ, ఆంధ్రజనసంఘం ఏర్పరిచిన సాంస్కృతిక చైతన్యం వల్ల ప్రభావితమైనాడు నిజాం పరిపాలనలో తెలంగాణాలో రాజకీయ చైతన్యం లేని స్థితిలోనే ఆయన పోరాటాన్ని ప్రారంభించాడు రెడ్డి హాస్టల్ విద్యార్థిగా ఉండగానే అప్పటి నిజాం కళాశాల విద్యార్థి అయిన బద్దం యెల్లారెడ్డితో కలసి 1930 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కాకినాడ వెళ్లి మరీ పాల్గొన్నాడు.[2] 1931లో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్యదర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించాడు రెండు వసతి గృహాలను నిర్వహించాడు. 1930లో బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్టు చేయగా, దానికి నిరసనగా హైదరాబాద్‌లోని హస్మద్ గంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించాడు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడాడు. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ అధికారిగా వ్యవహరించే బ్రిటిష్ రెసిడెంట్, తన గూఢచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని, కొత్వాల్ రాజబహదూర్ వెంకట రామారెడ్డిని ఇంటికి పిలిపించి రావి నారాయణరెడ్డిని హెచ్చరించవలసిందిగా సూచించాడు. పాతికేళ్ళ ప్రాయంలోపుగానే దేశభక్తి, రాజకీయ పోరాటం పట్ల దృఢచిత్తాన్ని ఏర్పరుచుకున్నాడు. 1931లో దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభలకు తన తోటి విద్యార్థులను పోగుచేసి పాదయాత్రగా ఆంధ్రోద్యమాన్ని ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుంచి దేవరకొండ చేరుకున్నాడు. మహాసభల్లో చురుకైన పాత్ర వహించాడు.

నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ విశిష్టమైనది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామికవాది ‘రావి’. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి, పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది[3].

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజాపోరాటానికి చూపునిచ్చిన జననేతగా ప్రసిద్ధుడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పనిచేశాడు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐ లో చాలాకాలం పనిచేశాడు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించాడు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకాన్ని, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలనూ అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసాడు.[4]

జాతీయోద్యమం బలంగా వేళ్లూనుకున్న ప్రాంతాల్లో మాత్రమే కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటుందని, అందుకు కారణం ఉద్యమంలో పాల్గొన్న అనుభవం వలన వాళ్లు కేవలం విడివిడి వృక్షాలను కాక, మొత్తం అరణ్యాన్ని చూడగలరన్నది ఆయన విశ్వాసం. ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాలుపంచుకొన్న అనుభవంతో రాటుదేలడం వల్లే తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు గణనీయమైన విజయాలను కైవసం చేసుకోవడం సాధ్యమైందని ఆయన తరచు అంటుండేవాడు. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షత వహించాడు. భువనగిరి సమావేశాల్లోనే ఆంధ్రమహాసభ అతివాద, మితవాద శిబిరాలుగా చీలిపోయింది.

దేశ స్వాతంత్య్రానికి ముందు సాగిన సాయుధ పోరాటాన్ని వ్యూహాత్మకంగా సమర్థించిన రావి నారాయణరెడ్డి 1947 తరువాతి కాలంలో పోరాటాన్ని కొనసాగించాలనే ‘మెజారిటీ’ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, సమ సమాజ ఆకాంక్షలతో కలగాపులగం చేయడం వల్లే పార్టీ, 1948 ఫిబ్రవరిలో పోరాటం కొనసాగించాలనే తప్పుడు నిర్ణయం తీసుకుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. చరిత్ర ఆయన మార్గమే సరైనదని తీర్పు చెప్పడం విశేషం. కాళోజీ నారాయణరావు ప్రవచించిన ‘వేరు తెలంగాణ’ను తాత్వికంగా వ్యతిరేకించడంతో ఆగక, తాను ఎన్నటికీ ‘వీరతెలంగాణ’ వాదిగానే ఉంటానని చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణరెడ్డి. తన స్వంత భూమిని 200 ఎకరాలు దానం చేశాడు

విశేష ఘట్టాలు

  1. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసాడు.
  2. 1941, 1943 సంవత్సరాల్లో భువనగిరిలో జరిగిన పదకొండవ, పన్నెండవ ఆంధ్ర మహాసభలకు వీరు అధ్యక్షత వహించి,ఆ సభను విజయవంతం చేశాడు.
  3. మహాత్మాగాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తన భార్య సీతాదేవితో వెళ్ళి కలిసి తన భార్య ఒంటిపై ఉన్న నగలన్నింటినీ తీసి గాంధీ చేతిలో పెట్టి, హరిజన సేవక సంఘానికి ఇవ్వమని గాంధీజీని అభ్యర్థించాడు.
  4. హైదరబాదు సాయుధ పోరాట సమయంలో తన స్వంత భూమి వందల ఎకరాల భూమిని రైతులకు పంచిన ఉదారవాది.
  5. నారాయణ రెడ్డి గారు తన 23 ఏళ్ల వయసులో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించాడు రెండు వసతి గృహాలను నిర్వహించాడు.
  6. 1952లో భారతదేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించాడు.
  7. 1932లో తక్కర్ బాబా అఖిల భారత హరిజన సేవక్ సంఘ్‌ను స్థాపించాడు. హైదరాబాద్ విభాగానికి సరోజినీనాయుడును అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా రావి నారాయణరెడ్డిని నియమించాడు.
  8. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించిన వారిలో రావి ముఖ్యులు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై విధించిన నిషేధం ఎత్తేయాలని అక్టోబరు 24న తొలిబ్యాచ్ సభ్యుడిగా సత్యాగ్రహం చేశాడు.
  9. 1928లో ఆంధ్రమహాసభ ఏర్పడింది. 1941-44-45ల్లో మూడుసార్లు రావి అధ్యక్షునిగా పనిచేశాడు. వితంతు వివాహాలు, అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఆంధ్రమహాసభను క్రియాశీల రాజకీయ సంస్థగా మలిచాడు. 20 ఎకరాల భూమిని మించి కలిగి ఉండరాదు అని కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానించింది. ఆ స్ఫూర్తిని గాంధేయవాది అయిన రావినారాయణరెడ్డి స్వీకరించాడు తనకు సంక్రమించిన భూమిలో 20 ఎకరాలను మాత్రమే ఉంచుకుని 500 ఎకరాలను రైతుకూలీలకు పంచిపెట్టాడు.
  10. రావి నారాయణరెడ్డి నాస్తికుడు . కుటుంబసభ్యులు మందిరానికి వెళ్తే కాదనని ప్రజాస్వామ్యవాది. రావి తన వివాహానంతరం ఒక విల్లు రాశాడు. తాను మరణిస్తే తన భార్య వైధవ్య ప్రతీకలను ఆమోదించరాదని, కట్టూబొట్టులతో సలక్షణంగా ఉండాలని కోరాడు. ఆమె తన అభీష్టానుసారం జీవించవచ్చనీ రాసాడు. భార్య మరణించిన అరవై ఏళ్లకు 1991 సెప్టెంబర్ 7న రావి 83వ ఏట మరణించాడు. తన అస్థికలను గంగానదిలో కలపవద్దని, పొలంలో చల్లితే చాలనీ అన్నాడు. ఆ మేరకు వారసులు పచ్చని పొలాల్లో రావి ‘విభూది’ని చల్లారు.

స్మారకాలు
హైదరాబాదు లోని బంజారా హిల్స్ నందలి ఒక ఆడిటోరియంకు “రావి నారాయణరెడ్డి స్మారక ఆడిటోరియం కాంప్లెక్స్” గా 2006 లో నామకరణం చేసారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి “రావినారాయణ రెడ్డి మెమోరియల్ నేషనల్ ఫౌండేషన్ పురస్కారం” ను కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ఎ.బి.బర్థన్ కు అందజేసాడు.[5]

మరణం
1991, సెప్టెంబర్ 7 న ఆయన తుదిశ్వాస విడిచాడు.

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

సహాయ నిరాకరణ ,ఉప్పు సత్యాగ్రహనాయకుడు ,గోదావరిజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ,,కేంద్ర అసెంబ్లీ , స్టేట్ కౌన్సిల్ కి ,కాకినాడ లోక్ సభ స్థానానికి ఎన్నికై న ,కేంద్ర ఆహారశాకః ఉపమంత్రి -మొసలికంటి తిరుమలరావు

సహాయ నిరాకరణ ,ఉప్పు సత్యాగ్రహనాయకుడు ,గోదావరిజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ,,కేంద్ర అసెంబ్లీ , స్టేట్ కౌన్సిల్ కి ,కాకినాడ లోక్ సభ స్థానానికి ఎన్నికై న ,కేంద్ర ఆహారశాకః ఉపమంత్రి -మొసలికంటి తిరుమలరావు

–మొసలికంటి తిరుమలరావు (జనవరి 29, 1901 – 1970) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు.
దస్త్రం:Mosalikanti tirumala rao.gif
మొసలికంటి తిరుమలరావు
జననం
వీరు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1901, జనవరి 29[1] న శాయన్న పంతులు దంపతులకు జన్మించారు.

వీరు 1921 లో మహాత్మా గాంధీ పిలుపు నందుకొని కాలేజీ చదువులకు వదలి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఏడాది కఠినశిక్ష విధించారు. రాజమండ్రి, చెన్నై, వెల్లూరు జైల్లలో ఆ శిక్ష అనుభవించారు. 1931లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని మరొక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1940 వ్యక్తి సత్యాగ్రహంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని కఠిన శిక్షలను అనుభవించారు.

వీరు తూర్పు గోదావరి కాంగ్రెసు అధ్యక్షలుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1937 నుండి 1940 వరకు కేంద్ర అసెంబ్లీ సభ్యులుగాను, 1945-1947 లో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగాను, 1948-1950 లలో రాజ్యాంగ సభ సభ్యులుగాను, 1950-1952లో తాత్కాలిక ప్రభుత్వం సభ్యులుగా ఉన్నారు.

వీరు 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలలో 2వ, 3వ, 4వ లోక్‌సభలకు కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం[2] నుండి ఎన్నికై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ ఉపమంత్రిగా పనిచేశారు.

మరణం
వీరు 1970 సంవత్సరంలో 70వ ఏట పరమపదించారు.

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-22-ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

భారతీ నిరుక్తి .30 వ భాగం.13.8.22

భారతీ నిరుక్తి .30 వ భాగం.13.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా ఆత్మ కథ.27వ చివరి భాగం.,12.8.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా ఆత్మ కథ.27వ చివరి భాగం.,12.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-22

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-22

    తుఫాన్

మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జర్మనీ వలస సామ్రాజ్యం ,యూరప్ లో ఆఫ్ట్రో  హంగేరియన్ సామ్రాజ్యం ,పశ్చిమాసియాలో టర్కిష్ సామ్రాజ్యం చీలిపోయి చిన్న చిన్న దేశాలుగా మారాయి .రష్యాలో బోల్షెవిక్ తిరుగు బాటు దార్లు గెలిచారు .జార్ ప్రభువును అతని కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు .ఆఫ్ఘనిస్తాన్ విదేశీ వ్యవహారాలలో స్వతంత్రంగా వ్యవహరించింది .ఇవన్నీ భారత దేశం పై ప్రభావంచూపాయి .రౌలట్ బిల్లు లో రెండు సిఫార్సులు చేర్చి బ్రిటిష్ ప్రభుత్వం అందుకే బిల్లు ప్రవేశపెట్టింది .ఏ వ్యక్తినైనా ప్రభుత్వం నిర్బందించవచ్చు దీన్ని వైస్రాయ్ కౌన్సిల్ లో ఎన్నికైన ప్రతినిదు లంతా తిరస్కరించారు .అయినా 1919మార్చిలో బిల్లు చట్టం అయింది .మహమ్మదాలీ బృందం శాసనమండలికి రాజీనామా చేసింది .దేశమంతా నిరసనలు పెరిగాయి .దీన్ని ప్రభుత్వ విద్రోహంగా అందరూ భావించారు .బిల్లు ఆమోదం పొందటానికి ముందు బెంగాలీ నేషనలిస్ట్ లు ఫిబ్రవరి3 న టౌన్ హాల్ లో సమావేశమయ్యారు .అసంఖ్యాక జనం రావటంతో బహిరంగ సభ జరిపారు .72ఏళ్ళ మోతీలాల్ ఆరోగ్యం క్షీణించినా హాజరయ్యాడు ఆయన్ను బుజాలమీద ఎక్కించుకొని వేదికపైకి తీసుకు వెళ్ళారు .మితవాదులు చాలామంది వచ్చారు .స్పష్టమైన నిరసన తీర్మానం మోతీలాల్ ప్రతిపాదించాడు –‘’ఈ బిల్లు ప్రభుత్వానికి నిరంకుశ అధికారాలు కట్టబెడుతుంది .చట్టబద్ధమైన న్యాయబద్ధమైన పాలన ఇక కనిపించవు .బాధ్యతాయుత ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి .శాసన సభ్యుల పునర్వ్యస్థీకరణ జరిగేదాకా బిల్లు ప్రవేశ పెట్టకూడదు ‘’అని ఎలుగెత్తి చెప్పాడు మోతీలాల్ . 

  ఈ బిల్లులను సవాలుగా తీసుకొని గాంధీ సత్యాగ్రహోద్యమం చేయాలను కొన్నాడు .సత్యాగ్రహ దళం ఏర్పాటు చేశాడు .దేశమంతా హర్తాల్ చేయమని పిలుపు నిచ్చాడు .అందరూ తనమాట మన్నిస్తారనే ఆశాభావం కనపరచాడు .బెంగాల్ మహారాష్ట్ర ,పంజాబ్ లలో విప్లవవాదులు ఉండటం వలన తనమాటకు విలువ ఇవ్వరు అనుకొన్నాడు .హర్తాల్ మార్చి 13 కు బదులు ఏప్రిల్ 16కు మార్చాడు .దేశం లోని ప్రతిపల్లె పట్టణం గాంధీ మాట మన్నించి సంపూర్ణ హర్తాల్ చేసి ఆయనపట్ల అపూర్వ విశ్వాసం కనపరిచింది ప్రజ .అది  ఆయన వ్యూహం ఫలించిన అద్భుతమైన రోజు.అపోహవలన ఢిల్లీలో మాత్రం మార్చి 13 హర్తాల్ జరిగింది .హిందూ ముస్లిం ఊరేగింపు దార్లపై పోలీసులు కాల్పులు జరిపారు .ప్రజలలో నిరసన ప్రబలి స్వామి శ్రద్దానంద్ నాయకత్వాన పెద్ద ఊరేగింపు జరిపి హిందూ ముస్లిం ఐక్యత చాటారు .గాంధీ వెంటనే శాసనోల్లంఘనం తాత్కాలికంగా నిలిపి  వేశాడు .అసంతృప్తితో ఉన్న పంజాబు ప్రజలు ఏప్రిల్ 10న ప్రదర్శన నిర్వహిస్తే ,హింసా దౌర్జన్యాలకు దారితీసి ,10మంది యూరోపియన్లను చంపేయటం తో సైనికపాలన విధించి అన్ని ప్రదర్శనలు నిషేధించారు .ఏప్రిల్ 13న అమృతసర్ లో పౌరులు నిషేధాన్ని ధిక్కరించి సమావేశం జరపగా ,జలియన్ వాలాబాగ్ లో ఒకేఒక దారి ఉండటం వలన జనరల్ డయ్యర్ 90సైనికులతో వచ్చి ప్రజలపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపించాడు .కొరడాలతో కొట్టించాడు .రోడ్లమీదదేకించారు .బ్రిటిష్ పతాకానికి సెల్యూట్ చేయటానికి ప్రజలను మైళ్ళ  కొద్దీ దూరం నడిపించారు .ఈ అమానుష కాండను  పంజాబ్ గవర్నర్ సమర్ధించాడు .ఆయన చెప్పినవన్నీ కట్టు కధలే అని తర్వాత బ్రిటిష్ గూఢ చారి విభాగం తేల్చేసింది .

  డయ్యర్ బుల్లెట్లు భారత ప్రజలని అపూర్వంగా సంఘటిత పరచాయి .పత్రికాసేన్సార్ షిప్ ను ధిక్కరించి పత్రికలు ఆవార్తలు ప్రముఖంగా ప్రచురించి ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్ళాయి .యావత్ భారత దేశం సభ్య ప్రపంచం జలియన్ వాలాబాగ్ ఉదంతానికి చలించి పోయింది . నిరసనగా రవీంద్రనాధ టాగూర్ ప్రభుత్వం తనకిచ్చిన ‘సేనాని ‘’విశిష్ట గౌరవాన్ని తిరస్కరించగా ,దేశ ప్రజలు కార్యోన్ముఖులయ్యారు .ఇద్దరు భారతీయులతో వైస్రాయి ఒక కమిటీ వేసినా అది కంటి తుడుపు చర్య అని  నిరసనలు కట్టలు తె౦చు కొన్నాయి .కలకత్తా టౌన్ హాల్ లో మళ్ళీ జరిగిన సభకు మోతీలాల్ ఘోష్ ను చైర్మన్ గా నామినేట్ చేశారు .ఆయన మాట్లాడ లేనంత నీరసంగా ఉండటం తో ఆయన ప్రసంగా పాఠం ఐ. బి .సేన్ చదివి వినిపించారు –‘’ఇటీవలి సంఘటనలో ఏమాత్రం తప్పులేని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు .గౌరవ ప్రద జీవితం గడుపుతున్నవారు అవమానాల,వేదనల  పాలయ్యారు .దీనిపై ఘనత వహించిన వైస్రాయి ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం భారత ప్రజలను అవమానించటమే .అధికారులకు భయ౦పట్టుకొన్నట్లుంది .పరిస్థితులు చేతులు దాటిపోయినట్లు భావిస్తున్నారు .పంజాబ్ దురంతం ప్రీవీ కౌన్సిల్ లో బట్టబయలు కాకతప్పదు అని వారు శంకిస్తున్నారు .నష్టం భర్తీ అంటూ హడావిడిగా ప్రత్యెక బిల్లు తెస్తున్నారు .దర్యాప్తు కమిటీరిపోర్ట్ వచ్చేదాకా ఆగలేక పోతున్నారు ‘’అని చెప్పాడు .

 ఈ దుర్ఘటన  దర్యాప్తుకుగా ఒక అనధికార కమిటీ కాంగ్రెస్ వేసింది .చిత్తరంజన్ దాస్ ,గాంధీలు మొదటిసారిగా కలుసుకొన్నారు .లోతుగా చర్చించారు ఆసమావేశం మంచి ఫలితాలకు దారి తీసింది .పంజాబ్ అనాగరక అణచి వెతచర్యలను అమృత బజార్ పత్రిక ప్రముఖంగా విమర్శించింది ‘’బ్రిటిష్ అధికారులు ము౦దుగాతమ స్వంత సేవ చేసుకొని తర్వాతే ఇండియా సేవ గురించి ఆలోచిస్తారు ‘’అని కడిగేసింది .’’చట్టబద్ధమైన పాలన ఇక లేదని ప్రజలు భావిస్తున్నారు .ప్రజల్ని పిట్టల్నికాల్చినట్లు కాలుస్తారని భయపడి పోతున్నారు .రౌలట్ చట్టం ప్రాధమిక హక్కులకు మరీ భంగం కలిగిస్తుంది అని గ్రహించి హిందూ ముస్లిం లు ఏకమయ్యారు .జీవితాలు బాగుపడటం దేవునికి ఎరుక ఇంతకన్నా అద్వాన్నం కాకుండా ఉండాలని ప్రజలు కోరుతున్నారు .రౌలట్ చట్టాన్ని ఆమోదించటం తప్పే అని బ్రిటిష్ యంత్రాంగానికి అర్ధమయింది ‘’అని రాశాడు మోతీలాల్ .

  1913నుంచి ప్రభుత్వ ఖజానాలో ఉన్న పత్రిక ధరావత్తు 5వేలరూపాయలు ప్రభుత్వం  నాకేసి ,మరో 10వేలు కట్టమని తాఖీదు పంపారు .మే 15న పంజాబ్ లో ఈ పత్రిక ను నిషేధించారు .కొద్దికాలం లోనే పత్రిక శ్రేయోభిలాషులు డబ్బు కట్టేశారు .పత్రికను ఆర్ధిక ఇబ్బందుల్లో పెట్టాలన్న ప్రభుత్వం ఎత్తుగడ ఫలించకుండా ప్రజలు సహకరించారు .పట్టువదలని విక్రమార్కుడు మోతీలాల్ ‘’బొందిలో ప్రాణం ఉన్నంతవరకు ,మా స్వేచ్చను గుంజుకోనంతకాలం మా విధి మేము నేరవేరుస్తూనే ఉంటాం .ఈ పత్రికా చట్టం నిబంధనలను బట్టి పత్రికను ఆదర్శవంతంగా నడపటం అంటే నిత్య రాజకీయాలు గాలికి వదిలేసి ,బంగాళా దు౦పల మీద అరటి పళ్ళ మీద రాయాలి ‘’అని ఘాటుగా చేరిగేశాడు .భారతీయుల క్రోధాగ్ని ఎంతగా ప్రబలి ఉందొ  డిసెంబర్ 19సంపాదకీయం లో మోతీలాల్ –‘’ఫౌంటెన్ మార్చకుండా నీటి గొట్టాలు మారిస్తే మురికి నీరు వస్తు౦ దేతప్పశుద్ధ  త్రాగు నీరు రాదు .’’అన్నాడు .

  23-12-1919న ఆమోదించిన చట్టం జాతీయవాదులకు అసంతృప్తే మిగిల్చింది .స్వయం పాలన మృగ్యం .దీనివలన ‘’బ్యార్టీ’’అనే పాలన వచ్చింది .విద్య ప్రజారోగ్యం పబ్లిక్ వర్క్స్ మంత్రుల అధీనం లో ఉంటాయి .మంత్రులు శాసనసభలకు బాధ్యులు .మంత్రిజీతం ఏడాదికి 64వేలు .పోలీస్ ,న్యాయశాఖ భూమి శిస్తు లు గవర్నర్ ,ఆయన కౌన్సిలర్ల పరిధిలో ఉంటాయి .కేంద్ర  ప్రభుత్వం  భారతీయ శాసన మండలితో సంబంధం కలిగి ఉండదు .ముస్లిం సిక్కులు ,క్రిస్టియన్లు వేరువేరుగా వోటర్లు .పదేళ్ళ పరిస్థితిని బట్టి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొంటే చేయచ్చు .ఈ చట్టాన్ని ఆమోదయోగ్యం చేయటానికి రాజకీయ ఖైదీలతో సహా డిటిన్యూ ల నందరికి పంచమ జార్జి క్షమాభిక్ష పెట్టి విడుదల చేయించాడు .

 బ్రిటిష్ అధికార వృక్షం వ్రేళ్ళు అవినీతి తో కుళ్లిపోవటాన్ని గాంధీ సహించలేకపోయాడు .సహాయ నిరాకరణే మంత్రం అని భావించి కలకత్తా కాంగ్రెస్ సభలో దాన్ని ఆమోదింప జేశాడు .చరఖాతో నూలువడకటం సర్వ రోగ నివారిణి కాదని బెంగాలీ తత్వ సూత్రధారులు చిత్తరంజన్ దాస్ ,బిపిన్ చంద్రపాల్ నిరసించారు .గ్రామీణ పరిశ్రమలద్వారా దేశ ఆర్ధిక పుష్టి కలిగించాలన్న గాంధీ వాదం తో రైతాంగం బలపరచింది 1920చివరలో బెంగాలీ విప్లవకారుల౦దర్నీ విడుదల చేశారు .భారీగా ప్రజలు సహాయనిరాకరణలో పాల్గొనాలని చిత్తరంజన్ పట్టుబట్టాడు .1920డిసెంబర్లో జరిగిన నాగపూర్ కాంగ్రెస్ అభలో అత్యధిక మెజారిటీతో సహాయనిరాకరణ ఉద్యమ ప్రతిపాదన ఆమోదించారు. దాస్ ,మోతీలాల్ నెహ్రు , కొడుకు జవహర్ లాల్ లు కొత్తగాధీతత్వాన్ని ఆమోదింఛి ప్రజల మనుషులయ్యారు .జాతీయ ఉద్యమం లో అసలు సిసలైన శక్తి ప్రజా బాహుళ్యం నుంచే వెల్లువై ప్రవహించింది .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి .29వ భాగం.12.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

డా ఆచంట లక్ష్మీ పతి,శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ దంపతులు

డా ఆచంట లక్ష్మీ పతి,శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ దంపతులు

ఆచంట లక్ష్మీపతి (మార్చి 31880 – ఆగస్టు 61962) ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. ఈయన నాటి మద్రాసు ( నేటి చెన్నయ్) లోని ఆయుర్వేద వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయులుగా (1920-1928) సేవలు అందించారు.

బాల్యం-విద్యాభ్యాసం

ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవవరంలో శ్రీ రామయ్య, శ్రీమతి జానకమ్మ లకు 1880మార్చి 3 న జన్మించారు. ఈయన తాతగారు సుబ్బారాయుడు గారు సంస్కృత పండితులు. ఈయన తండ్రి అతను వైద్య పాటు వ్యవసాయం నేర్చుకోవడం కలలు కన్నారు. అటు వైద్య శాస్త్రం, ఇటు వ్యవసాయం రెండింటిలోనూ మక్కువ గల లక్ష్మీపతి మెట్రిక్యులేషన్, ఎఫ్.ఏ. పూర్తి చేసి స్థానికంగా తహశీల్దారు కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసారు. ఆపైన బి.ఎ. చేసి స్కాలర్‌షిప్పుతో యం.బి.సి.యం (ఆయుర్వేదం) కోర్సు చేసారు. ప్రముఖ వైద్యనిపుణులు పండిత దీవి గోపాలాచార్యులు వద్ద శిష్యరికం చేసారు[1].

సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు వీరికి ఉన్నత పాఠశాల లోని గురువు. ఎఫ్.ఎ పూర్తి చేసిన పిదప ఆయన దవులూరి ఉమామహేశ్వరవావు వద్ద కొంతకాలం క్లార్క్ బాధ్యతలు నిర్వహించాడు. ఉమామహేశ్వరరావు మద్రాసుకు బదిలీఅయిన పిదప ఆయనతో పాటు వెళ్లాడు. ఆ సమయంలో మద్రాసు రాష్ట్రం బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. తరువాత ఆయన 1904 లో బి.ఎ పూర్తి చేసాడు[1]..

రచనలు

వులూరి ఉమామహేశ్వరరావు గారి సహాయము వలన ఈయనకు స్కాలర్‌షిప్ వచ్చుటచే ఈయన మెడిసన్, ఎం.బి.బి.యస్ డిగ్రీలను 1909 లో పూర్తి చేశారు. అల్లోపతీ వైద్యవిద్యను పూర్తి చేసిన తర్వాత ఆయుర్వేదం (పురాతన భారత వైద్య విధానం) ను పండిట్ గోపాలాచార్యులు దీవి వారి అధ్వర్యములో అభ్యసించారు. దీవి గోపాలాచార్యులు 1920 లో మద్రాసునందు ఆయుర్వేద మెడికల్ కాలేజీని నడిపేవారు. ఆ ఆయుర్వేద కళాశాలలో లక్ష్మీపతి ప్రిన్సిపాల్ గా ఎదిగారు.

రచనలు

ఆంగ్ల భాషతో పాటు తెలుగు లోనూ తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించిన డా. ఆచంట లక్ష్మీ పతి1922-27 కాలంలో తెలుగులో “ధన్వంతరి” పత్రికనూ ఆంగ్లంలో ‘ఆంధ్రా మెడికల్ జర్నల్ ‘ ను ప్రచురించారు. ఈయన 63 పుస్తకాలను భారతీయ వైద్యం పై అనగా దర్శనములు, ఆయుర్వేద విజ్ఞానం, ఆయుర్వేద శిక్ష, వనౌషథ విజ్ఞానము, భారతీయ విజ్ఞానము వంటివి వ్రాశారు.ఆయుర్వేదంపై అనేక ఆంగ్ల పుస్తకాలను వ్రాశారు. చలిజ్వరము రోగ లక్షణాలు, దానికి ఆయుర్వేద వైద్యము గురించి చలిజ్వరము[2] పుస్తకాన్ని రాశారు.

జీవిత విశేషాలు

అతని మొదటి భార్య సీతమ్మ యౌవనంలోనే మరణించడంతో ఆచంట లక్ష్మీపతి రుక్మిణమ్మను రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తర్వాతి కాలంలో అవిభక్త మద్రాసు రాష్ట్రానికి ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసింది. లక్ష్మీపతి ఆయుర్వేద వైద్య రంగానికి ఎంతో సేవ చేశాడు. అఖిల భారత ఆయుర్వేద వైద్య సమాజం, ఆంధ్రా ఆయుర్వేద బోర్డు వంటి సంస్థలకు అధ్యక్షునిగానూ వ్యవహరించాడు. మద్రాసులో ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేశాడు.

ఆయుర్వేద వైద్య రంగానికి అతను చేసిన సేవలకు గుర్తింపుగా ఆచంట లక్ష్మీపతి యూనిట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎట్ వాలంటరీ హెల్త్ సర్వీసెస్, చెన్నై, ఆచంట లక్ష్మీపతి న్యూరోసర్జికల్ సెంటర్, వీహెచ్ఎస్, చెన్నై వంటి సంస్థలకు లక్ష్మీపతి పేరును పెట్టారు.

అస్తమయం

వైద్యునిగానే కాక సంఘ సేవకునిగా, రచయితగా, జాతీయవాదిగా సేవలందించిన డా.ఆచంట లక్ష్మీ పతి 1962ఆగస్టు 6 న 88వ ఏట పరమప

జమీందారీ కుటుంబం నుంచి వచ్చి పట్టభద్రురాలై ,పారిస్ లో అంతర్జాతీయ మహిళా సభ జరిపి ,ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని ,ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ

ఆయుర్వేద ఘన వైద్యులు శ్రీ ఆచంట లక్ష్మీ పాటి గారి ధర్మపత్ని శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ .6-12-1892 జన్మించి 6-8-1951న 59వ ఏట మరణించారు

 జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన రుక్మిణమ్మ కు  ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహం లేదు. అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రురాలైంది. డిగ్రీ తీసుకుంది. తర్వాత మద్రాసులో ఖద్దరు ప్రచారము చేసింది.

1926 వ సంవత్సరం లో పారిస్ లో అంతర్జాతీయ మహిళా సభ జరిగింది. స్త్రీల హక్కుల గురించి చర్చించే ఆ సభకు మనదేశ ప్రతినిధిగా ఆమె వెళ్ళింది. తర్వాత జిల్లా బోర్డు సభ్యురాలిగా, కార్పొరేషన్ మెంబరుగా, విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా పనిచేసింది. 1930 వ సంవత్సరం మే నెలలో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొనింది. వేదారణ్యంలో మరో సత్యాగ్రహం సత్యాగ్రహం లో పాల్గొనింది. ఆనాడు జైలుకు వెళ్ళిన తొలి మహిళల జట్టులో నిలిచింది. ఆ తర్వాత 1940 వరకు ఇన్నో సార్లు జైలుకు వెళ్ళింది. తమిళనాడు ప్రాంతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసింది. 1946 లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేసింది. ఈ విధంగా అవకాశం యిస్తే ఆడవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు అని నిరూపించిన మహిళా రత్నం ఆచంట రుక్మిణమ్మ గారు.

సమాచార రంగ ప్రముఖులు ఆచంట జానకిరాం వీరి కుమారుడు.

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

Ranjan das

బెంగాల్ న్యాయవాది స్వాతంత్రోద్యమనేత ,స్వదేశీ ఉద్యమనేత కలకత్తా మొదటి మేయర్ దేశబంధు –చిత్త రంజన్ దాస్

చిత్తరంజన్ దాస్ ,జమ్నాలాల్ బజాజ్

దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ (C.R.Das) (బెంగాళీ:চিত্তরঞ্জন দাস) (నవంబరు 5, 1870 – జూన్ 16, 1925) బెంగాల్ కు చెందిన న్యాయవాది, స్వాతంత్ర్యోద్యమ నేత.

ఇంగ్లాండులో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని, 1909లో అంతకు ముందు సంవత్సరములో జరిగిన అలీపూరు బాంబు కేసులో, అభియోగము మోపబడిన అరబిందో ఘోష్ను విజయవంతముగా గెలిపించడముతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు. ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యములో బెంగాల్ ప్రాంతములో ప్రముఖపాత్ర వహించి బ్రిటీష్ దుస్తులను బహిస్కరించడానికి నాంది పలికి ఐరోపా దేశ వస్త్రాలను తగుల బెట్టి స్వదేశ ఖాదీని కట్టి అందరికి ఆదర్శప్రాయుడయ్యాడు. తన మితవాదేతర అభిప్రాయాలు వ్యక్తపరచడానికి మోతీలాల్ నెహ్రూతో కలసి స్వరాజ్ పార్టీ స్థాపించాడు.

బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన “ఫార్వర్డ్” అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరును “లిబర్టీ”గా మార్చారు. కలకత్తా కార్పోరేషన్ ఏర్పడ్డాకా దానికి ఆయన మొదటి మేయర్గా పనిచేసారు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, గయ సెషన్స్ కు అధ్యక్షత వహించారు. ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యంతో బాధ పడినప్పటిక్, మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటిష్ వారి పై పోరాడారు.

ఆయన అహింసా విధానాన్ని నమ్ముతారు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగ బద్ధమైన విధానాలను అనుసరించాలని భావించేవారు. సమాజ సామరస్యానికి పాటు పడిన, జాతీయ విద్యాప్రగతి వాది. ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు. వారిలో సుభాష్ చంద్ర బోస్ పేరెన్నికగన్నారు.

ఆయన ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్న ఢాకాలో బిక్రంపూర్ కి చెందిన తెలిర్బాగ్‌లోని దాస్ కుటుంబానికి చెందిన వారు. ఆయన భువన్ మోహన్ దాస్ యొక్క కుమారుడు, సంఘ సంస్కర్త అయిన దుర్గ మోహన్ దాస్‌కు మేనల్లుడు. ఈయన బంధు వర్గంలో ప్రసిద్ధులైన ఇతరులు ఎస్.ఆర్.దాస్, సరళా రాయ్, లేడీ ఆబాల బోస్. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు బసంతీ దేవి ఆయన భార్య.

కాంగ్రెస్ కోశాధికారి ,స్వాతంత్ర్య సమరయోధుడు -జమ్నాలాల్ బజాజ్

జమ్నాలాల్‌ బజాజ్‌ (నవంబర్ 4, 1889 – ఫిబ్రవరి 11, 1942) ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు.

జననం
నేటి రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో నవంబర్ 4, 1889 వ సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని జైలు కెళ్ళారు. ఒక సందర్భంలో మహాత్మాగాంధీ బజాజ్‌ను తన ఐదవ కుమారుడిగా ప్రకటించారు. వార్ధాలో లక్ష్మీనారా యణ ఆలయం నిర్మించి దళితులకు ప్రవేశం కల్పించారు. మరణించేవరకు కాంగ్రెస్‌ కోశాధికారిగా పనిచేశారు. 1921 నుండి జీవితాంతం అఖిల భారత చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పరిజ్ఞానాన్ని పెంపొందించేవారికి ఈయన పేరు మీద ప్రతి మూడేళ్ళకొకసారి జమ్నాలాల్‌ బజాజ్‌ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద లక్షరూపాయల నగదు ఇస్తారు.

మరణం
ఫిబ్రవరి 11, 1942లో మరణించాడు


మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

ప్రముఖ కవి రచయిత, అనువాదకుడు, రేడియో ప్రయోక్త ,’’కవితల్లజ ‘’ –కందుకూరి రామ చంద్రరావు

ప్రముఖ కవి రచయిత, అనువాదకుడు, రేడియో ప్రయోక్త ,’’కవితల్లజ ‘’ –కందుకూరి రామ చంద్రరావు
కందుకూరి రామభద్రరావు ( 1905 జనవరి 31, – 1976 అక్టోబరు 8, ) ప్రముఖ తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. వీరు గోదావరీ నది తీరంలో రాజవరం గ్రామంలో జన్మించారు.వారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని రాజవరం. వీరు పిఠాపురం మహారాజా కళాశాలలో పట్టభద్రులై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆత్రేయపురంలో మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో సంస్థాపక ప్రధానోపాధ్యాయులుగా ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పారు. వీరు రాజవరం పంచాయితీకి మొదటి అధ్యక్షులు. వీరు కవిగా తరంగిని, వేదన, జయపతాక, కవితాలహరి మొదలైన గేయాలను, గేయమంజరి అనే గేయ కావ్యాన్ని, ఎందరో మహానుభావులు అనే వచన గ్రంథాన్ని రచించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చిత్ర నాటికను తెలుగు భాషలోకి అనువదించారు. వీరి స్వీయ కవితలను “Searching Strains”గా ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు “Leaves from a diary” అనే ఆంగ్ల గ్రంథం రచించారు.
జీవితం
రామభద్రరావుగారి తండ్రి కందుకూరి సూర్యనారాయణ ఉత్తమ సంస్కారం గల సంపన్న గృహస్థు. ఆ గ్రామానికి కరణం కూడా. అతనే రాజవరంలో శివ, కేశవులకు ఆలయాలను కట్టించిన ధర్మకర్త. తల్లి నాంచారమ్మ. సౌజన్యం, సౌందర్యం, మూర్తీభవించిన పురంధ్రి. రామభద్రరావు ప్రాథమిక విద్య రాజవరంలోనే గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన గురువు వద్ద జరిగింది. ఆ రోజుల్లో అక్కడ ప్రాథమిక పాఠశాల కూడా లేదు.ఉన్నత పాఠశాల తరగతులు రాజమహేంద్రవరంలో సుప్రసిద్ధ వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాల.జయంతి గంగన్నపంతులు ప్రధానోపాధ్యాయుడుగా ఉండేవాడుు.ఆదర్శ ప్రధానోపాధ్యాయులుగా ప్రసిద్ధి పొందారు. రామభద్రరావు తగిన వయసులోనే వివాహం జరిగింది. భార్య పేరు రామలక్ష్మి. F.A., B.A.లు కాకినాడ పిఠాపురం మహారాజా కళాశాలలో చదివారు. ఆ రోజులలో వేమూరి రామకృష్ణారావు ప్రిన్సిపాల్ గా ఉండేవాడు. అతను ఆంగ్లంలో గొప్ప పండితుడు. క్రమ శిక్షణకు పెట్టింది పేరు. పెద్దాడ రామస్వామి. కాళ్ళకూరి సత్యనారాయణ ప్రభ్రుతులు అధ్యాపకులుగా ఉండేవారు. గాంధీ మహాత్ముని సారథ్యంలో స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజులు. సాంఘికంగా రఘుపతి వెంకటరత్నం నాయుడి బ్రహ్మసమాజ ప్రభావం కాకినాడలోను తత్రాపి కళాశాలలోను వ్యాపించిన రోజులు. కాలేజీ విద్యార్థిగా రామభద్రరావు ఆంగ్ల ఆంధ్రభాషలలో వక్తృత్వపు పోటీలలో బహుమతులు సంపాదించాడు. విద్యార్థులలో ప్రసిద్ధి పొందారు. ప్రిన్సిపాల్ రామకృష్ణారావు, పెద్దాడ రామస్వామి గార్లకు ప్రియతమ విద్యార్థి. F.A. పరీక్షలో తెలుగులో ప్రథమంగా నిలిచి ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకాన్ని పొందాడు. B.A. పరీక్ష ఉత్తీర్ణులవటానికి అంతరాయం కలగటం వలన కొన్నాళ్ళు స్వగ్రామం రాజవరంలో ఉన్నాడు. ఆ గ్రామానికి పంచాయతీ ఏర్పాటు చేసి సంస్థాపక అధ్యక్షులు అయ్యాడు. ప్రాథమిక పాఠశాల భవనం ఏర్పాటు చేశాడు. చిత్తరంజన్ దాసు పేరిట ఒక గ్రంథాలయాన్ని కూడా ప్రారంభించాడు.
B.A. పాసయిన తరువాత కాకినాడ కళాశాల తెలుగు డిపార్ట్ మెంటులో ట్యూటరుగా పనిచేశాడు. పెద్దాడ రామస్వామి ప్రిన్సిపల్ గా ఉండేవాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి పి.యల్.యన్. శర్మ, సి. సీతారామమూర్తి, బులుసు వెంకటేశ్వర్లు, జనమంచి కామేశ్వరరావు ప్రభృతులు లు కూడా రాజావారి కళాశాలలో పని చేసే వారు. కళాశాల యాజమాన్యం వాడుక భాషలో రచనలు చేసినందుకు కొంతమందికి ఉద్వానం చెప్పారట. అందులో రామభద్రరావు గారొకడు.
తరువాత రాజమండ్రి ప్రభుత్వ ట్రయినింగ్ కాలేజీలో బి.ఇ.డి. ట్రయినింగ్ పొందాడు. అంతర కళాశాల వక్తృత్వపు పోటీలలో ట్రయినింగు కాలేజీ జట్టులకు నాయకత్వం వహించి ఇంగ్లీష్ తెలుగులోను ప్రథమ బహుమతులు సాధించాడు. కాలేజీ సెక్రటరీగా, మేగజైన్ ఎడిటరుగా ప్రిన్సిపాల్ ప్రభ్రుతుల మన్ననలు పొందాడు. ట్రయినింగ్ అయిన తర్వాత వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. జయంతి గంగన్న పంతులు ప్రధానోపాధ్యాయులుగా ఉండేవాడు. ఉపాధ్యాయుడిగా చాలా మంది విద్యార్థులను ఉత్తేజపరిచాడు. మల్లెపుడి పళ్లంరాజు రామభద్రరావుపై ఉండే సదభిప్రాయం వల్ల అతనని సమ్మతపరిచి జిల్లా బోర్డు సర్వీసులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగానే గొల్లపాలెం అనే చిన్న గ్రామంలో హయ్యరు ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేశాడు. ఆ ఊరి ప్రజలలో కలిగించిన చైతన్యం కారణంగా, వారు ‘వేదన’ అనే ఖండకావ్య సంపుటిని ప్రచురించి, కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సన్నిధిలో సన్మానం పొంది,ఆ సన్మానంలో ‘కవితల్లజ’ అనే బిరుదు ఇచ్చారు.
తరువాత పేరూరు మిడిల్ పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించినపుడు అతనిని హెడ్మాస్టారుగా తీసుకున్నారు. పేరూరు ఉన్నత పాఠశాల హెడ్మాస్టారుగా నాలుగైదుళ్ళు పనిచేశారు. శ్రీ వేదుల వారిని కూడా పెద్దాపురం నుంచి పేరూరు పాఠశాలకు తెలుగు పండితులుగా తీసుకువచ్చాడు. ప్రఖ్యాత చిత్రకారుడు పిలకా నరసింహమూర్తి కూడా పేరూరు ఉన్నత పాఠశాలలో కొంత కాలం పనిచేశారు. పేరూరు ఉన్నత పాఠశాల జిల్లా బోర్డుకి అప్పగించటంతో రామభద్రరావు రాజోలు, అమలాపురం హైస్కూళ్ళలో ప్రధానోపాధ్యాయులుగా చేరారు. మధ్యలో స్వస్థలమైన ఆత్రేయపురం ఉన్నత పాఠశాల సంస్థాపక హెడ్మాస్టారుగా పనిచేశాడు. 1960 సం.లో అమలాపురం ఉన్నత పాఠశాల హెడ్మాస్టారుగా రిటైర్డు అయిన సందర్భంగా విద్యాశాఖామంత్రి పట్టాభిరామారావు అధ్యక్షతన సన్మానం పొందారు. పింగళి, వేదుల, కాటూరి, కోలవెన్ను రామకోటేశ్వరరావు, మధునాపంతుల ప్రభృతులు పాల్గొన్నారు.
పదవీ విరమణ అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రయోక్తగా ఒక దశాబ్ది కాలం పనిచేసి ఎన్నో గేయాలు, ప్రసంగాలు, కవితలు, సంగీత నాటికలు ప్రసారం చేశాడు.హెడ్మాస్టారుగా రిటైర్డు అయిన కొద్ది నెలలకే, విజయవాడ ఆకాశవాణికి విద్యావిషయిక ప్రయోక్తగా ఎంపికయ్యాడు. ఆకాశవాణిలో సుమారు పది సంవత్సరాలు విధులు నిర్వహించాడు. స్టాఫ్ ఆర్టిస్టులు అసోసియేషన్ కి అధ్యక్షులుగా పనిచేశాడు. అనేక గేయాలు, సంగీత రూపకాలు, విద్యావిషయనాటికలు రచించారు. కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఆంగ్లంలో ప్రసంగాలు చేశారు. 1970లో విజయవాడ కేంద్రం నుంచి రిటైరు అయ్యారు.రామభద్రరావు తన జీవితాన్ని గాంధీమహాత్ముడు, సాహితీ రచనలను రవీంద్ర కవీంద్రుడు ప్రభావితం చేశావని చెపుతూ ఉండేవారు.
తర్వాత అనారోగ్య కారణంగా కొన్నాళ్ళు స్వగ్రామం రాజవరంలో ఉన్నారు. ఇంతలో ఆత్మీయుడు, అల్లుడు శశాంక ఆకస్మిక మరణం వలన హైదరాబాదులో శేష జీవితాన్ని గడిపి 1976 అక్టోబరు 8న తేదిన కన్నుమూశారు.
రామభద్రరావు రచనలు
• పద్య కవితలు: లేమొగ్గ, తరంగిణి, వేదన, జయపతాక, నివేదనము, కవితాలహరి
• గేయ కవిత: గేయమంజరి, గేయ నాటికలు
• ఆంగ్ల రచనలు: Searching strains (Rendering of his poems into English), Leaves from a diary.
• అనువాదం: చిత్ర (రవీంద్రుని రచన)
• వచనం: ఎందరో మహానుభావులు
కందుకూరి రామభద్రరావు సమగ్ర సాహిత్యం
2005 సంవత్సరంలో ప్రచురించబడిన తెలుగు పుస్తకం రచయిత శతజయంతి సందర్భంగా ఉత్సవ కమిటీ వారి విశేష ప్రచురణ.[1]
• చిత్ర (1932) (విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చిత్ర నాటికకు తెలుగు అనువాదం)
• తరంగిణి (1935)
• వేదన (1942)
• జయపతాక (1953)
• గేయమంజరి (1955, 1986)
• నివేదనము (1958)
• ఎందరో మహానుభావులు (1964)
• దేశభక్తి గేయాలు (1986)
• కవితాలహరి (1989)
• ఆకాశవాణి సంగీత రూపకాలు (2005)
  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.25వ భాగం.10.8.22

Video link

Part -2

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

  గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-21

  గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-21

ఖైదీలను చిత్ర హింస పాలు చేస్తున్న ప్రభుత్వాన్ని కార్మిచెల్ తీవ్రంగా వ్యతిరేకించినందుకు 1917మార్చి లో ఇండియా వదిలి పెట్టి వెళ్ళాల్సి వచ్చింది .పోలీస్ రాజ్ ను నిరంతరం వ్యతిరేకించే మోతీలాల్ ఆయనతో కలిసి అరెస్ట్ అయిన యువకుల విడుదలకు మధ్యవర్తిత్వం నడిపాడు .అతడు వెళ్ళిపోయే సమయానికి 800మంది ఇంకా జైలులో మగ్గి ఉన్నారు .అతని స్థానం లో రోనాల్డ్ షీ వచ్చాడు .విప్లవోద్యమాన్ని అణచి వేయటం తప్ప గత్యంతరం లేదని భావించాడు .

  పరిణామాల సంవత్సరం

1917 మాంటేగ్ సంస్కరణలతో పాటు ఎన్నెన్నో పరిణామాలు తెచ్చిన సంవత్సరంగా గుర్తుండిపోయింది .ఇండియాలో కుట్రలు తిరుగుబాట్లు గురించి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వటానికి బ్రిటన్ నుంచి వచ్చిన జస్టిస్ వాలార్ట్ కమిటీ ఏర్పాటైంది .ఈ రెండు భారత స్వాతంత్ర్య పోరాటం నిర్దుష్టమైన రూపం దాల్చాటానికి తోడ్పడ్డాయి.మోతీలాల్ కు పత్రికకు ఇవి కొత్త కష్టాలను తెచ్చాయి .1917మే 22 న ఆయనపై కోర్టు ధిక్కరణ నేరం మోపారు .కోర్టే ప్రాసిక్యూటర్ అయిఅనప్పుడు ఆరోపణమీద విచారణ కు ఆకోర్టు కు అధికారం లేదని ప్రముఖ న్యాయవాదులు ఆరోపించారు .చివరికి సాక్షాధారాలు లేకపోవటం తో కేసు వెనక్కి తీసుకొన్నది ప్రభుత్వం .ఇది మోతీలాల్ కు డైరెక్టర్ లకు లభించిన ఘన విజయం . 1915మొదట్లో గాంధీ తనగురువు గోఖలే మరణానికి ముందు రెండేళ్ళు దక్షిణాఫ్రికాలో ఉండి, ఇండియా వచ్చాడు .దక్షిణాఫ్రికాలో తాను  విజయం సాధించిన అహింసా యుత పోరాటం ఇండియాలోనూ విజయాన్ని సాధిస్తుందని గాంధీ భావించాడు .1917ఏప్రిల్ లో బీహార్ లోని చంపరాన్ జిల్లా ముఖ్యపట్టణం మొతీహారి కి గాంధీ వచ్చాడు .నీలి రైతుల పక్షాన నిలిచి ధైర్యం చెప్పాడు ఆయన్ను అక్కడి నుండి వెళ్ళిపోవాలని పోలీసులు వత్తిడి చేసినా వెళ్ళలేదు .ఆయనపై కేసుపెట్టి విచారించగా ,తన తప్పు ఏమీలేదని ,కావాలంటే తనను శిక్షించవచ్చునని కోర్టు ను సవాల్ చేశాడు .అంతరాత్మ ప్రబోధం అనే అత్యున్నత న్యాయ సూత్రానికి అది విరుద్ధం అన్నాడు .మేజిష్ట్రేట్ కంగుతిని వాయిదా వేసి గవర్నర్ ను సలహా ఇవ్వమని కోరాడు .గాంధీ నిర్భీకతను ఆయన్ను హీరోగా ప్రజలముందు నిలబెట్టింది .గవర్నర్ ఎందుకైనా మంచిదని కేసు ఉపసంహరించాడు .గాంధీ మాత్రం రైతులతో బుజం కలిపి సమస్యలు అధ్యయనం చేసి ,ప్రభుత్వం తో దర్యాప్తు కమీషన్ వేయించి ,నీలిపె౦పకం దార్ల ఇష్టా రాజ్యానికి స్వస్తి పలికించాడు .

  సత్యాగ్రహ శక్తి జనసామాన్యానికి బాగా అర్ధమైంది .అహింసా మార్గం లోనే దేనినైనా సాధించాలని మోతీలాల్ మొదటి నుంచి నమ్మాడు .గాంధీ విజయం ఆయనకు మరింత హుషారిచ్చింది .బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి సారి గాంధీజీ ఇక్కడే చంపారాన్ లో కలిశారు .చంపారాన్ పొత్తిళ్ళలో స్వాతంత్ర్య పోరాట బిడ్డ ఎదుగుతూ ఉంటె ,మాంటేగు తర్వాతి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు .ప్రభుత్వం శాలాట్ కమిటీని వేసింది .ప్రపంచ మంతటా విప్లవ బీజాలు వ్యాప్తి చెందాయని గ్రహించారు .భారత సైన్యం లో సిక్కులు పంజాబ్ పేదరైతాంగం కూడా విప్లవం లో పాలుపంచుకొనే ధోరణి ప్రబలమైంది .

  ఎన్నో ఏళ్ళ క్రితం అమెరికా కెనడాలకు వలసపోయిన భారతీయులు ముఖ్యంగా సిక్కులు ‘’గదర్ పార్టీ ‘’స్థాపించారు .బెంగాల్ లోని ‘’యుగంతర్ పార్టీ’’ తో సంబంధాలు పెట్టుకొన్నారు .మొదటి ప్రపంచయుద్ధం మొదలవగానే ఈ సిక్కులు బ్రిటిష్ ప్రభుత్వం పై సాయుధ పోరాటం చేయటానికి ఇండియా వచ్చారు .కానీ ఈ భారీ పధకం నీరు కారిపోయింది .అయినా వారి ప్రయత్నాలు ఆగలేదు .1916చివరకు ఈశక్తులు పూర్తిగా క్షీణించి పోయాయి .యుద్ధం లో మిత్రరాజ్యకూటమి గెలుపు గ్యారంటీఅని తేలింది .సంస్కరణలు ప్రకటించే వరకు ప్రభుత్వానికి సహనం నశించింది .అణచి వేస్తె ప్రజలు కుక్కిన పేనులుగా ఉంటారన్న  గర్వం పెరిగింది .రౌలట్ నివేదిక ప్రభుత్వాన్ని సంతృప్తి పరచేట్లుగా తయారైంది .రీఅప్పీల్ కు అవకాశం ఇవ్వలేదు .మాంటేగు సంస్కరణలకు ము౦దేరౌలట్ సంస్కరణలు వచ్చి సంస్కరణలకు గండి కొట్టింది .తెల్ల ప్రభుత్వ కుత్సితఉ ద్దేశ్యాలు ప్రజలకు బాగా తెలిసిపోయాయి .1918ఆగస్ట్ బొంబాయి కాంగ్రెస్ ప్రత్యెక సభలో గాంధీతో సహా మితవాదులు విడిపోయి ‘’జాతీయ విమోచనా సమాఖ్య ‘స్థాపించారు .మరో 15ఏళ్ళలోపు పూర్తిస్వరాజ్యం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది .మా౦టేగు సంస్కరణలను మోతీలాల్ సమర్ధించి ,జాతీయవాదులను విశేషంగా ఆకర్షించాడు .అనిబి సెంట్ కూడా మద్దతు పలికింది .కొందరు అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులతో కలిసి మోతీలాల్ బొంబాయి నుంచి పూనా వెళ్లి తిలక్ ను కలిశారు హో౦ రూల్  విషయం పై  చర్చించటానికి .తీవ్ర ఆస్వస్థత వలన మోతీలాల్ మొదటి రోజు సమావేశానికి వెళ్ళలేదు .రెండవ రోజు నీరసం తోనే కొన్న మాటలు మాట్లాడాడు .ఏడేళ్ళు జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన చిదంబరం పిళ్ళై కనిపించగానే ఆయనకు ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకు వచ్చింది .’’మిత్రమా ‘’అంటూ ఆప్యాయంగా కౌగలించాడు .1918 తుఫాను ముందు ప్రశా౦త౦ గా  గడచి పోయింది .

  సశేషం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వెట్టి చాకిరివిముక్తికి  నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన,గెరిల్లా పోరాటం చేసిన శాసన సభ్యురాలు  ఆరుట్ల కమలాదేవి

వెట్టి చాకిరివిముక్తికి  నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన,గెరిల్లా పోరాటం చేసిన శాసన సభ్యురాలు  ఆరుట్ల కమలాదేవి

ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు, మాజీ ఎమ్మెల్యే.[1]

జీవిత విశేషాలు

ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో పూర్వపు నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది.[2] వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించడమే కాకుండా ఉద్యమాలలో కూడా భర్తతో పాటు పాల్గొంది. ఆంధ్రమహాసభలకు కూడా హాజరై ఉత్తేజాన్ని పొందింది. నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి జైలుకు వెళ్ళిది. 1946-48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటుచేసింది.[3] 1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆలేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికైనది. శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా, పుచ్చలపల్లి సుందరయ్య చికిత్సకోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది.

విరోచిత తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం జాతీయోద్యమ చరిత్రలో నూతనాధ్యాయాన్ని తెరచింది. ఈ పోరాటానికి నాయకత్వ పాత్ర వహించింది కమ్యూనిస్టుపార్టీ. అందులో మహిళల పాత్ర అపూర్వం, అనిర్వచనీయం. దానికి ప్రత్యక్ష నిదర్శనం వీరవనిత ఆరుట్ల కమలాదేవి. తన తరం మహిళలు గృహిణులుగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో పెళ్ళికి ముందు “రుక్మిణి”గా వుండి ఆ తరువాత కమలాదేవిగా మారి కమ్యూనిస్టు ఉద్యమ వీరనారీమణులలో ఒకరిగా 2001 జనవరి 1 న కన్నుమూశారు. ఎ.ఆర్ గా అంతా పిలుచుకునే సాయుధపోరాట సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్యగా, రాజకీయరంగంలో కూడా భర్తతోపాటు కొంగుబిగించి తుపాకీ చేబూని గెరిల్లాపోరాటం సాగించిన పోరాట వీరగాథలు నేటికీ యువతరానికి ఒక ఉత్తేజం.

పోరాట జీవితం

చలూరు గ్రామం గెరిల్లా దళాలకు ఆనాడు ఒక ముఖ్యకేంద్రం. చల్లూరు-వెంకటాపురం గుట్టలను చుట్టుముట్టి రిజర్వు పోలీసులు సాగించిన తుపాకీగుళ్ళ దెబ్బలకు ఎదురుకాల్పులు జరుపుతూ దళాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా విప్లవ దంపతులు కమలాదేవి, ఎ.ఆర్. శత్రు మూకలను అమెరికన్ రైఫిల్ తో తిప్పికొట్టిన తీరు నాటి పోరాట యోధుల స్మృతి పథంలో చెరగని ముద్రలు వేశాయి. పురిటిబిడ్డను వదిలి ఉద్యమకార్యకర్తగా ఆమె సాగించిన గెరిల్లా పోరాటం, కొనసాగించిన అజ్ఞాతవాసం, ఆ తరువాత వరంగల్ఔరంగాబాద్, హైదరాబాద్లలో మూడు సంవత్సరాలకుపైగా ఆరుట్ల కమలాదేవి అనుభవించిన జైలుజీవితం – పోరాట వటివులో ధైర్యసాహసాలలో ఆమెను మరో రూన్సీలక్ష్మిగా నిలబెట్టింది. జైలునుండి విడుదల కాగానే 1952లో ఆలేరు నియోజకవర్గం నుండి శాసనసభకు ఆమె ఘనవిజయం సాధించారు. ఆ తరువాత రెండు పర్యాయాలు అదే నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు ఆభ్యర్ధిగా ఎన్నికై పార్టీ శాసనసభాపక్షం ఉపనాయకులుగా (కామేడ్ పుచ్చలపల్లిసుందరయ్య నాయకులు) ఎన్నిక కావడం కమలాదేవి విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనం. కమ్యూనిసు పార్టీలో చీలిక అనంతరం సిపిఐ శాసన సభాపక్షం నాయకురాలిగా కొనసాగారు. శాసనసభాపక్ష నాయకత్వం ఒక మహిళకు దక్కడం అదే మొదటిసారి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అదే ఆఖరిసారి కూడా, తన జీవిత కాలంలోనే స్త్రీ శక్తికి, విప్లవస్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన వ్యక్తిత్వం కమలాదేవిది. కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ అందజేసినపుడు ప్రశంసాపత్రంలో ఆమెను అపరరుద్రమదేవిగా కీర్తించడంలో అతిశయోక్తి లేశమాత్రం కూడా లేదు. తెలంగాణా సాయుధ సమరం రోజులలో ఆమెచూపిన చొరవ, ధైర్యసాహసాలు ఆశ్చర్యం గొలిపేవి. విన్గవదీక్షలోను, కార్యాచరణలోనూ ఆమె కున్న-విశ్వాసం అనన్యసామాన్యమైనవి. పోరాట రంగంలో వీరవనితగాను, శాసనసభలో ప్రజాపాణిగా ప్రతిబింబించడంలోనూ, ఆ తరువాత మహిళా సమాఖ్య నాయకురాలిగా స్త్రీల సమస్యలపై కొనసాగించి పోరాటంలోనూ, ఆమె కనబరచిన దీక్షాదక్షతలు నేటితరానినే గాక భవిష్యత్ తరాలకు మార్గదర్శకం

 జనవరి 2001లో 81వ  ఏట విప్లవ మహిళాసింహం ఆరుట్ల కమలాదేవి మరణించింది .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

భారతీ నిరుక్తి .28వ భాగం.11.8.22

భారతీ నిరుక్తి .28వ భాగం.11.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా ఆర్ధిక నిపుణులు ,ప్రనుఖ గాంధేయవాది ,ఆంధ్రరాష్ట్రం కోసంమొట్టమొదట నిరాహార దీక్ష పూనిన ,స్వాతంత్ర్య సమర యోధులు వినయాశ్రమ స్వామిసీతారాం –శ్రీగొల్లపూడి సీతారామ శాస్త్రి గారు

మహా ఆర్ధిక నిపుణులు ,ప్రనుఖ గాంధేయవాది ,ఆంధ్రరాష్ట్రం కోసం మొట్టమొదట నిరాహార దీక్ష పూనిన ,స్వాతంత్ర్య సమర యోధులు వినయాశ్రమ స్వామిసీతారాం –శ్రీ గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు

గొల్లపూడి సీతారామశాస్త్రి లేదా స్వామి సీతారాం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది.

జీవిత విశేషాలు

గొల్లపూడి సీతారామశాస్త్రి గుంటూరుకు చెందినవారు.మొదట న్యాయవాద వృత్తిని చేపట్టి, మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. జమీందారీ లావాదేవీల మొదలుకొని పలు కేసుల్లో పనిచేసిన ఆయన, వృత్తిలో గట్టివాడిగా పేరు సంపాదించుకున్నారు.[1]

గొల్లపూడి సీతారామశాస్త్రి గాంధేయవాదిగా జీవితాన్ని సాగించారు. ఆయన మంచి ఉపన్యాసకులు. వేలమంది ముందు నిలబడి ఉపన్యసిస్తున్నా ఆర్థిక అవసరాలు, వరుమానాలూ, ఖర్చులు వంటి అంశాలపై ప్రసంగించాల్సివస్తే కాగితం, కలం అవసరం లేకుండా నోటిలెక్కలపై ఆర్థికవేత్తలను మించి మాట్లాడగల దిట్ట.

స్వాతంత్ర సమరం

1921లో మహాత్మాగాంధీ పూర్ణస్వరాజ్యం పిలుపునిచ్చి ప్రభుత్వ సేవలు, కోర్టులు, కళాశాలలు విడిచిరమ్మని పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకుని లాభదాయకంగా ఉన్న తన ప్లీడరు వృత్తిని విడిచిపెట్టి జాతీయ సమరంలోకి చేరారు.

మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం 1930 లో మొదలుపెట్టినపుడు, ఆంధ్రలో జాతీయోద్యమ స్ఫూర్తిని రగుల్కొలిపేందుకు శిబిరాలను నెలకొల్పదలచారు. దానిలో భాగంగా సీతారామశాస్త్రి గారు తుమ్మల బసవయ్య, దుర్గాంబ దంపతులు సహకారంతో గుంటూరు జిల్లాలో కావూరులో వినయాశ్రమం ఏర్పాటు చేసారు. తుమ్మల బసవయ్య దంపతులు తమ యావదాస్థినీ ఈ ఆశ్రమానికి అర్పించారు.సీతారామ శాస్త్రి గారు తనకున్న ఒక ఎకరం భూమిని, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు 26 ఎకరాల భూమిని ఈ ఆశ్రమానికి దానం ఇచ్చారు. 65 ఎకరాల స్థలంలో ఈ ఆశ్రమం నెలకొని ఉంది. ఈ ఆశ్రమవాసిగా మారి సీతారామ శాస్త్రి గారు స్వామి సీతారాం గా పిలవబడ్డారు, జాతీయోద్యమంలో వీరి నిర్వహణలో వినయాశ్రమం నిర్వహించిన పాత్ర ప్రశస్థమైనది.

ఈ ఆశ్రమాన్ని గాంధీజీ చేతులమీదుగా 1933 డిసెంబరు 23 తేదీన ప్రారంబించబడింది. గాంధీజీ వినయాశ్రమంలో రెండురోజులు ఉండి ప్రజలలో స్వాతంత్ర్య ఉద్యమం గురించి ప్రేరణ కలిగించారు.

వినయాశ్రమంలో 1934 ఆయుర్వేద వైద్యశాల స్థాపించారు. పిల్లలకోసం గురుకుల పాఠశాల స్థాపించారు.1935లో మీరా బెన్ చేత స్వరాజ్య స్థూపం ఆవిష్కరింపజేశారు.

హరిజన సేవాయాత్రలో భాగంగా గాంధీజీ 1937 జనవరి 23  రెండవసారి వినయాశ్రమం సందర్శించి తుపాను బాధితుల కోసం విరాళాలు సేకరించాడు. గ్రామ పారిశుద్ధ్యం, హరిజన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు సీతారాం గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. దీంతో ఆంధ్రాలో ఉద్రిక్త భరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తరువాత, 1951 సెప్టెంబరు 20న ఆచార్య వినోబా భావే అభ్యర్ధనపై ఆయన తన దీక్షను విరమించాడు.

మరణం

స్వామి సీతారాం గారు 1960 ఏప్రియల్ 9న వినయాశ్రమం లో పరమపదించారు[2].

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.25వ భాగం.10.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-20

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-20

1913లోబెంగాల్ విద్యా శాఖకు ఇంగ్లాండ్ నుంచి కొత్త డైరెక్టర్ ను దిగుమతి చేశారు .అబ్దుల్ రసూల్ ,అబ్దుల్లా అల్మామున్ ఘరావర్తి ,కేపి జమాస్వాల్ అనే ముగ్గురు మేధావుల్ని యూని వర్సిటి లెక్చరర్స్ గా ప్రభుత్వ సమ్మతి తో తిరస్కరించారు .దీనిపై అమృత బజార్ పత్రిక ‘’యూనివర్సిటి పై బ్రిటిష్ అధికారుల పెత్తనం పెంచుతున్నారు .దీనివలన మన పిల్లల విద్యకు విఘాతం కలుగుతుంది .’’అని ప్రజాభిప్రాయాన్ని మన్నించి రాశాడు మోతీలాల్ .టౌన్ హాల్ లో జరిగిన పెద్ద సభకు అన్ని వర్గాల మేధావులు ,ప్రజలు హాజరై ప్రభుత్వ విధానం పై దుమ్మెత్తి పోశారు .బెంగాల్ ను విభజించాలనే ఇంకా పట్టుదలతో ఉండటం సిగ్గు చేటు ‘అన్నారు .మోతీ లాల్ ఈ సభలో చాలా ఘాటుగా విమర్శించినా ,ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు .ఆయన తన ప్రసంగం లో ‘’బిడ్డ తల్లిపై కాకుండా బిడ్డపై ఎక్కువ ప్రేమ కనబరచే స్త్రీని మంత్రగత్తె అంటారు .మనపిల్లలకు మన జాతీయతే సంరక్షణ .విదేశీయులకు ప్రేమాదరాలు ఉండవు ‘’అన్నాడు. కార్ని చెల్ అన్నిటికీ అడ్డు పడి వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు .

  1913లో బెంగాల్ దుఖదాయిని దామోదర్ నదికి విపరీతంగా వరదలు వచ్చాయి .హుగ్లీ ,మిడ్నాపూర్ జిల్లాలు పూర్తిగా మునిగిపోయాయి .ప్రజలు సహాయార్ధం ముందుకు దూకారు .భారీగా నిధులు సేకరించి అందించారు .కార్మిచెల్,ప్రధాన న్యాయ మూర్తి అధ్యక్షతన ఒక సహాయ సంఘం ఏర్పడింది .దీనిలో మెంబర్ అయిన మోతీలాల్ హృదయాలు కరిగెట్లు ప్రజలకు విజ్ఞప్తి చేశాడు –‘’ప్రజలు లక్ష రూపాయన నిధి సేకరిస్తే ,ప్రభుత్వం మరో తొమ్మిది లక్షలు అందిస్తుందని ఆశించ వచ్చా?ప్రజాభిప్రాయం సేకరించి ముందుకు కదలండి .అందరూ ఒప్పుకొంటారు ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు’’అన్నాడు .దేశం నలుమూలల నుంచి భారీగా ఆర్ధిక ఆర్దికేతర సాయం లభించింది .రామకృష్ణా మిషన్ ,అజ్ఞాత ఉద్యమ నాయకులు ప్రజలకు విశిష్టమైన సేవలందించి అభినందనలు పొందారు .అజ్ఞాత వాలంటీర్లు గా చాలామంది యువకులు చేరారు .ఈ వరద బాధితులను ఒడ్డున పడేసిన ఘనత అంతా యువతదే .

  మోతీలాల్ ను అనేక సాంస్కృతిక రంగాలు కూడా ఆహ్వానించాయి .చిన్నప్పటి నుంచీ సంగీతం పై మక్కువ ఉండటం వలన సంగీత కచేరీలకు హాజరయ్యేవాడు .శాస్త్రీయ ద్రుపద ,ఖయాల్ ,వైష్ణవ పదావళి కీర్తనలంటే ఆయనకు మహా ఇష్టం .భారతీయ ఆట కబాడీ ఇష్టం .

 మొదటి ప్రపంచ యుద్ధం

మహా యుద్ధం అని పిలువబడిన మొదటి ప్రపంచ యుద్ధం 4-8-1914న ప్రారంభమవగా భారత్ బ్రిటిష్ పక్షాన నిలిచింది .ఈ కష్ట సమయంలో ప్రభుత్వానికి సాయం చేస్తే తర్వాత అది మనకు మేలు చేస్తుందని ‘’యోజేరేట్లు’’అంటే అతివాదులు ,మితవాదులు కాని వారు భావించారు .బెంగాల్ ఉన్నత వర్గ ముస్లిం లు పూర్తిగా ప్రభుత్వాన్ని సమర్ధించారు .మధ్యతరగతి ముస్లిం లు నమ్మలేదు .అబ్దుల్ కలాం ఆజాద్ ,మహమ్మదాలీ ,షిబ్లినో మొనీలు కాంగ్రెస్ వైపు వచ్చారు .1913లండన్ ఒడంబడికతో ముస్లిం లు ప్రభుత్వానికి దూరమయ్యారు .జాతీయోద్యమం పట్ల మరింత విధేయత కనపరచాలని మహామ్మాదాలీ జిన్నా ప్రకటించాడు .

  ఇరకాటం లో ఉన్న పరప్రభుత్వానికి మరింత ఇబ్బందులు కలిగించాలని విప్లవ వర్గం భావించింది .విదేశీ ప్రభుత్వాన్ని పడగొట్టి తిరుగుబాటుచేయటానికి ఆయుధాలు డబ్బూ సమకూర్చటానికి జర్మన్ ప్రభుత్వంతో ,యూరప్ ,అమెరికాలలోని ఆవర్గ ప్రతినిధులు ఒప్పందాలు కుదుర్చుకొన్నారు .ఈ తిరుగుబాటులో భారతీయ సైన్యానికి కూడా కొంత ప్రమేయం కల్పించాలని భావించారు .బెంగాలీలను ఎక్కువ సంఖ్యలో సైన్యం లో చేర్చాలని భారతీయ రాజకీయ తీవ్రవాద  వర్గం భావించింది .అజ్ఞాత నాయకులు సమర్ధించారు కూడా .దీనికి మోతీలాల్ కీలక పాత్ర పోషించాడు .గాంధీలాగానే మోతీలాల్ కూడా నమ్మాడని మోతీలాల్ జీవితచరిత్ర రాసిన ఆయనమనవడు పి.దత్తా చెప్పాడు .పరిస్థితి గ్రహించిన బిపిన్ చంద్రపాల్ ‘’బ్రిటిష్ ప్రభుత్వానికి ,ప్రజాహక్కుల కు మధ్య రాజీ కుదిరే అవకాశమే లేదు ‘అని తేల్చి చెప్పాడు .

  1915మార్చిలో కొత్త రక్షణ చట్టం తెచ్చింది ప్రభుత్వం .దీన్నిబట్టి ప్రభుత్వం ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు .దీనిపై దేశం లో నిరసనలు తీవ్రమయ్యాయి .అమెరికాలో పని చేస్తున్న జెక్ విప్లవకారులని అక్కడి భారతీయ విప్లవకారులు తరిమేశారు .ఆయుధాలతో వస్తున్న రెండు నౌకలను అటకాయించటం ,ప్రభుత్వం పంజాబు బెంగాల్ లలో భయాన్దోలనలుసృష్టించటం జరిగింది .విప్లవకారుల సానుభూతి పరులు అనే నెపం తో వేలాది మందిని అరెస్ట్ చేశారు .మహాయుద్ధం తీవ్రమైన కొద్దీ సైన్యం ఎక్కువ కావాల్సి వచ్చింది .మొదట బెంగాలీ అంబులెన్స్ దళం తర్వాత ,బెంగాలీ రెజిమెంట్ ఏర్పాటయ్యాయి .అధిక సంఖ్యలో బెంగాలీ యువకులు సైన్యం లో చేరటానికి మోతీలాల్ తీవ్ర కృషి చేశాడు . సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం 

శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం 

బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం 5-9-22సోమవారం  ఉపాధ్యాయ దినోత్సవం నాడు సరసభారతి 167వ కార్యక్రమ౦గా నిర్వహింపబడుతుంది .శ్రీ గురుపుత్రులు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి శ్రీ కోట సీతారామాంజనేయులు శ్రీ కోట రామ కృష్ణ ,శ్రీ కోట గాయత్రి ప్రసాద్  గార్లు తమ తలిదండ్రులు కీ శే .కోట సూర్యనారాయణ శాస్స్త్రి శ్రీమతి సీతమ్మ గారల పేరిట ఏర్పాటు చేయబడిన స్మారక నగదు పురస్కారం -ఉయ్యూరులో ని హై స్కూల్స్ లో చదివి 2022మార్చి s.s.c . పరీక్షలలో  అత్యధిక మార్కులు సాధించి కాలేజీ లో  చేరి ఇంటర్ చచదువుతున్న పేద బ్రాహ్మణ విద్యార్ధినికి ,,విద్యార్ధికి గురుపుత్రుల చేత అంద జేయబడును .

  అలాగే అత్యధిక మార్కులు సాధించిన ఒక బిసి విద్యార్ధికి లేక విద్యార్ధినికి ,ఒక sc విద్యార్ధిని లేక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన కోట గురు వరేణ్యుల స్మారక నగదు పురస్కారం సరసభారతి ద్వారా అందజేయబడును .

 మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇద్దరు ఉపాధ్యాయులకు సన్మానం చేయబడును .

  వేదిక ,సమయం ,విద్యార్ధినీ విద్యార్దులపెర్లు వగైరా తర్వాత తెలియ జేయబడుతాయి .అందరూ ఆహ్వానితులే .  -గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -10-8-22-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 

 శ్రావణ బహుళ అష్టమి -నవమి లలో రోహిణీనక్షత్ర యుక్త  శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సరసభారతి 166 వ కార్యక్రమ౦గా 20-8-22 శనివారం  శ్రీ సువర్చలాన్జనేయస్వామి ఆలయం లో జరుగుతాయి .ఉదయం ,సాయంత్రం ,శ్రీ కృష్ణ విష్ణు సహస్రనామ పూజ ,ముగ్గులతో బాల కృష్ణ పదాల కు ఆహ్వానం ,కట్టే పొంగలి నైవేద్యం ఉంటాయి .సాయంత్రం ,బాలబాలికలకు శ్రీ కృష్ణ గోపీకా  రాధా  వేషధారణ పోటీ లు నిర్వహి౦ప బడతాయి .,  బహుమతి ప్రదానం జరుగుతుంది . .తలిదండ్రులు తమ పిల్లలకు చక్కని తర్ఫీదు ఇచ్చి పాల్గోనేట్లు చేయమని మనవి -గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త ,మరియు భక్త బృందం -9-8-22-ఉయ్యూరు 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-19

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-19
కార్మి చెల్ కోరికపై మోతీలాల్ ఆయనకు 1-పోలీసులను అదుపు చేయటం 2-గ్రామీణ ప్రజలలో పారిశుధ్యం పెంచటం అనే  రెండు విజ్ఞప్తులు చేశాడు .మోతీలాల్ కు పోలీసులకు ఎప్పుడూ పడేదికాదు ..1902లో పోలీస్ కమీషన్ ఆయన మెమొరాండం చదివి ఆదరాబాదరాగా ఆయన్ను ముఖ్య సాక్షిగా పిలవాలన్న దాన్ని మానుకోవటం విషయమై మోతీ లాల్ ప్రచారం లో ఉన్న ఒకజోక్ తన పత్రికలో రాశాడు –‘’కలకత్తాలో ఒక రోజు పొద్దున్నే రోడ్డుపక్క తూము దగ్గర తాగుబోతు పోర్లుతున్నాడు .డ్యూటీలో ఉన్న పోలీసు అతడిని నిలవేసి ‘ఇక్కడ ఏం చేస్తున్నావు ?’’అని అడిగితె ‘అమృత బజార్ పత్రిక నడుపుతున్నాను ‘’అని జవాబిచ్చాడు తాగుబోతు. అంతేపోలీస్ అక్కడి నుంచి ఉడాయించాడు ‘’.
  1911లో బొంబాయిలో జరిగిన మొదటి అఖిలభారత పారిశుధ్య మహా సభకు అనధికార ప్రతినిధిగా మోతీలాల్ హాజరై పారిశుధ్యం పై ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ తీసుకోవటం లేదని విమర్శించాడు .ప్రభుత్వ సహాయం లేకపోతె పల్లె ప్రజలు కీటకాల్లా మారిపోయి నశిస్తారు ‘’అని చెప్పాడు ..శుభ్రమైన మంచి నీటి సరఫరా ,మలేరియా మొదలైన వ్యాదుల్ని అరికట్టటం ,,మురికి నీటి పారుదల అన్నిటికన్నా ముఖ్యం అని ఉద్హోషించాడు .ఆయన చేసిన సూచనలనుబట్టి మరుసటి సంవత్సరం బ్రిటీష్ ఇంపీరియల్ ,ప్రోవిన్షియల్ బడ్జెట్ లలో కొన్ని నిధులు కేటాయించి ,పన్నులద్వారా వచ్చే ఆదాయాన్ని జిల్లా బోర్డు లకు అందేట్లు చేశారు .రాజ్యాంగ సవరణలు దృష్టిలో పెట్టుకొని 1912లో మళ్ళీ రాయల్ కమీషన్ ను నియమించారు. మోతీలాల్ అనారోగ్యంగా ఉండటం వలన వెళ్ళలేకపోయాడు .తన లిఖిత పూర్వక విజ్ఞప్తిని కమీషన్ కు పంపి దాన్ని అమృత బజార్ పత్రికలో ప్రచురించాడు .’’1858 విక్టోరియా రాణి ప్రకటనకు భిన్నంగా దేశీయ రాష్ట్రీయ సర్వీసులలో ఇండియన్స్ ను దూరం గా పెడుతున్నారు ప్రభుత్వ సర్వీస్ పరిక్షలు ఏకకాలం లో జరగాలి  .జిల్లా మేజిష్ట్రేట్ పదవులలో యాభై శాతం ,,జిల్లా జడ్జిపదవులలో నాలుగింట మూడవవంతు భారతీయులకు ప్రత్యేకంగా కేటాయించాలి .ప్రొవిన్షియల్ప్రభుత్వ కార్యదర్శి పదవులు రెండూ ,అండర్ సెక్రెటరీ పదవులన్నీ భారతీయులకే ఇవ్వాలి .పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ లలో ఒకరు తప్పక భారతీయుడై ఉండాలి .జిల్లా పోలీస్ సూపరిం టే౦డెంట్ లలో సగం మంది ఇండియన్లు ఉండాలి .సాధారణ ప్రభుత్వ సిబ్బంది జీతాలు తగ్గించాలి. బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే ప్రజ్ఞావంతుల సంఖ్య బాగా తగ్గించాలి ‘’అని రాశాడు ఈలేఖ దానిపై వచ్చిన వ్యాఖ్యలు అన్నీ కలిసి ఒక పుస్తకంగా తర్వాత ప్రచురించాడు మోతీలాల్ .హాట్ కేకుల్లా పుస్తకాలు అమ్ముడయ్యాయి .అయితే ఈ సిఫార్సులు సుమారు ఎనిమిదేళ్ళు చీకటిలోనే మగ్గి పోయాయి .1920లో మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలలో ఇవి వెలుగు చూశాయి .
  కొండను తవ్వి ఎలుకను పట్టటం
  1912కు అజ్ఞాత విప్లవకారుల కార్యకలాపాలు ప్రభుత్వానికి జటిలంగా మారాయి .ఏమాత్రం ఆధారం దొరక్కుండా బాంబు దాడులు చేశారు .సీక్రెట్ పోలీసులకు వారి ఆచూకీ పట్టుకోవటానికి రెండేళ్ళు పట్టింది .రాజకీయ దోపిడీలు గుట్టు చప్పుడుకాకుండా జరిగిపోతున్నాయి .ప్రతి బెంగాలీనీ ప్రభుత్వం అనుమానించే పరిస్థితి ఏర్పడింది .సురెంద్రనాద్ బెనర్జీ కూడా  విప్లవకారులకు వత్తాసు పలుకుతున్నట్లు భ్రమపడింది ప్రభుత్వం .ఇవన్నీ నిరుద్యోగులపనులని కతఠినంగా వ్యవహరిస్తే అణగిపోతాయని కాడ్రాక్ భావించాడు .యువజన సంఘాలను నిషేధించారు .దానితో ఆసంస్థలు అజ్ఞాతం లోకి వెళ్లి విజ్రుమ్భించాయి .ఇదంతా సిద్ధాంతపరంగా జరుగుతోందని కార్నీ చెల్ వాదించినా ఆయనమాట వినిపించుకోలేదు .పోలీస్ గూఢచారి శాఖను రంగం లో దింపి,అపరిమితంగా అరెస్ట్ చేసే  విశేష అధికారాలిచ్చి౦ది ప్రభుత్వం .సరైన సాక్ష్యాలు  లేకపోయినా ,అనుమానితులను దీర్ఘకాలం విచారించి ఖైదీలుగా ఉంచటం అలవాటైంది .తన క్లయింట్ లు నిర్దోషులని న్యాయవాదులు తేలికగా రుజువు చేసి విడిపించటం సర్వ సాధారణం అయిపొయింది .1910 హీరాకుట్ర కేసు అలాంటిదే .ఉత్తర బెంగాల్ ,పశ్చిమ బెంగాల్ లోని అనుమానితులను అరెస్ట్ చేసి ఒక చోటే ఉంచటంతో జతిన్ ముఖర్జీ నాయకత్వాన విప్లవకార సంస్థ దృఢంగా  పాదుకొన్నది .ఈ జతిన్ ఆతర్వాత మొదటి ప్రపంచ యుద్ధకాలం లో జర్మనీ ఆయుదాలరూపంగా ,డబ్బురూపంగా ఇచ్చిన సాయంతో తిరుగుబాటుకు ప్రయత్నించాడు .
  1913మే లో బెంగాల్ సి ఐ డి గూఢచారి విభాగం  ఒక పెద్ద కుట్ర బయట పెట్టినట్లు గొప్పలు చెప్పుకొన్నది .బారిసాల్ లో బందిపోటు సంఘటనలు ,,తర్వాత చక్రవర్తిపై దాడికి కుట్ర చేస్తుంటే పట్టుకోన్నామని బీరాలు పలికింది .కేసుకూడా నమోదు చేసింది .ఈకేసుకింద సుమారు యాభై మందిని అరెస్ట్ చేశారు .మారుమూల పట్టణం లో కేసు విచారణ జరిగింది .ఆరోపణలను రుజువు చేయలేకపోయింది .అందులో యువ విద్యార్దులుకూడా ఉన్నారు .వారికి ఆరోపణ కాపీలివ్వలేదు వాళ్ళను తాళ్ళతో కట్టి చేతులకు బేడీలు వేసి వీధుల్లో ఊరేగించారు .న్యాయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరించిన ఈ విషయాన్ని అమృత బజార్ పత్రిక ఘాటుగా విమర్శిస్తూ ‘’దేశప్రజలన్దర్నీ ఇలానే కుట్రలొఇరికిస్తారా అనే అనుమానం కలుగు తోంది .వారిపై విచారణకు ప్రాధమిక సాక్ష్యాలున్నాయో లేదో ముందు విచారించి తర్వాత కేసులు పెట్టాలని కార్నీ చెల్ కు విజ్ఞప్తి చేసింది పత్రిక .బ్రిటిష్ న్యాయసూత్రాన్ని ఆధారం గా చేసుకొని మోతీలాల్ రాశాడు భారతీయులంతా ఆయన పక్షాన నిలిస్తే ,ఆంగ్లో ఇండియన్ పత్రికలూ ప్రభుత్వానికి వంతపాడాయి .మోతీలాల్ పై కోర్టు ధిక్కారణ నేరం మోపారు .జెంకేంస్ ,స్టేఫెంస్ ,అసుతోష్ ముఖర్జీ లతో కలకత్తా హైకోర్టు ప్రత్యెక ధర్మాసనంగా విచారించింది .ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కెన్సీ వాదించగా ,ని౦దితులపక్షాన ప్రముఖ న్యాయవాదులు వాదించారు .మోతీలాల్ పై సారిన ఆధారాలు చూపించమని చీఫ్ జస్టిస్ డిమాండ్ చేశాడు .ఆధారాలు సమర్పించలేక పోయింది ప్రభుత్వం. కేసు కొట్టేశాడు చీఫ్ జస్టిస్ .కోర్టు ధిక్కరణ నేరం జరగనే లేదని న్యాయమూర్తి ముఖర్జీ వాదించాడు .ఆతర్వాతే ప్రభుత్వం కోర్టు ధిక్కరణ బిల్లు ప్రవేశపెట్టింది .ఇది ఆమోదం పొందటానికి 12ఏళ్ళు పట్టింది .కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది అని ఈ కేసును ప్రజలు పత్రికలూ ఆక్షేపించారు .
   సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-18
  విషాద ఛాయలు
1911 ఘోష్ కుటుంబం లో అత్య౦త విషాదం రేపింది .రెండు దశాబ్దాలు మంచాన పడి తీసుకొన్న శిశిర్ కుమార్ ఘోష్ ఎక్కువ భాగం కలకత్తాకు దూరంగా గడిపి జనవరి 10 కన్ను మూశాడు .పత్రిక భారం మోతీలాల్ పై పూర్తిగా పడింది .పావు శతాబ్దం శిరశిరకుమార్ అమృత బజార్ పత్రికకు సంపాదకుడు .దాని రూపానికి అస్తిత్వానికి,ఆత్మకూ  రూపకర్త .సంపాదకీయ అభిప్రాయాలు ఆయనవే .అందరూ ఆయనను గౌరవంగా ‘’మహాత్మా ‘’అనే సంబోధించేవారు .ఔదార్యం ,నిరాడంబరత అంకిత భావం ఆయన సొమ్ములు .ఆయన రాసిన శ్రీచైతన్య జీవితగాధ 1870లో బెంగాలీ  కుటుంబాలలో కీర్తనలుగా వ్యాపించాయి .అన్నగారిని గురించి మోతీలాల్ రాస్తూ –‘’ఆయన మాకు అత్య౦త విలువైన సోదర ప్రేమ పంచారు. అది అన్ని ప్రేమలకు పునాది .సోదరుని కోల్పోవటం అంటే హృదయం ముక్కలు ముక్కలవటమే .దాదాపు 60ఏళ్ళు ఆయన సోదర ప్రేమను చవి చూశాం .మేము సాధించింది ఏమైనా ఉంటె అన్నగారి పాదాలకే సమర్పిస్తున్నాం .ఉన్నత జీవిత లక్ష్యాలను ,రాజకీయ పాఠాలను ఆయన మాకు నేర్పారు .సిద్ధాంతాలు చెప్పటమే కాదు జీవితం లొఅనుసరి౦చ టమూ నేర్పిన మా గురుమూర్తి ఆయన .మానవ సేవద్వారా మాధవ సేవ చేయాలన్న మహోన్నత ఆశయం నేర్పించారు .ఆయన లేని లోటు మాకు ఎన్నటికీ తీరేదికాదు.శిశిర్ అన్నయ్య మాకు చిరంజీవి ‘’అన్నాడు .
  ఉమ్మడి కుటుంబ వ్యాపార సంస్థ ప్రారంభించిన అమృత బజార్ పత్రిక ,40ఏళ్ళ తర్వాత లిమిటెడ్ సంస్థగా రిజిస్టర్ అయింది . .అందులో వాటాలు ఘోష్ కుటు౦బానివే .ఆర్ధిక వ్యవహారాలూ హేమంతకుమార్ ,ఆయనతర్వత గోలాప్ లాల్,హేమంత కొడుకు మృణాల్ కాంతి చూశారు .పత్రికపై వచ్చే ఆదాయం అతి స్వల్పం .కుటుంబ పోషణకేకాక పత్రిక గడవటానికీ ,స్వగ్రామం లోని భూములపై రాబడీ అవసరమయ్యేది .కలకత్తాలో మోతీలాల్ కు అగ్రశ్రేణి స్థానం లేదు .దానికి ఆయన అర్రులు చాచనూ లేదు .సామాన్యుల బాధలు పట్టించు కోవటమే ఆయన ,బలం ,గుర్తింపు .
  జాత్యహంకారంతో భారతీయులపై ,ముఖ్యంగా విద్యావంతులపై బ్రిటిష్ యాజమాన్యం లోని పత్రికలూ రెచ్చ గొట్టే ధోరణి అవలంబించటం చూసి గోపాలకృష్ణ గోఖలే ‘’ప్రతి ఆంగ్లో ఇండియన్ రచయితా తనకలాన్ని సర్కారు వారి ఇంకులో ముంచి రాస్తున్నారు .ఇది అసంబద్ధం హానికరం ‘’అని రాశాడు .1912 మే 18న లార్డ్ కార్మి చెల్  మోతీలాల్ కు ఒక లేఖ రాస్తూ ‘’ఏయే సమస్యలని నేను వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని పరిష్కరించాలో నాకు తెలియ జేస్తే నేను కృతజ్ఞుడుగా ఉంటాను .మీపత్రికలో వీటికోసం ఎదురు చూస్తూ ఉంటాను బెంగాలీలు సుఖ శాంతులతో ఆనందంగా వర్ధిల్లటానికి శాయశక్తులా పని చేస్తాను .ప్రజలు మా పట్ల అసంతృప్తిగా ఉన్నారని నాకు తెలుసు .నేను వారికి సేవ చేయలేక పోతున్నాననీ తెలుసు .తక్షణ సమస్యలలో నేను ఏం చేయాలో మీరే చెప్పాలి .నా బదులు మరో గవర్నర్ వచ్చినా ,భాష రాకపోతే అతడూ ఏమీ చేయలేడు.గవర్నర్ పదవిలో ఉన్నవాడు ఎన్నో చేయాలనుకొంతాడుకానీ ఏమీ చేయలేడు.తనకు తోచిన దృష్టితోకాక వేరే దృష్టితో చూడటమే అతడు చేయగల పని అనిపిస్తోంది ‘’‘అని రాశాడు .అన్ని తరగతులమధ్య సామరస్యం సాధించాటానికి ఆయన ప్రయత్నం చేశాడు .కానీ హో౦ శాఖ సభ్యుడు లాస్ రీనాల్డ్ క్రాడాక్ మాత్రం పత్రికలే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నాయనీ బెంగాల్ వెనుకబాటుతనమూ కారణం అనీ అసలు బెంగాలీలు ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపరు ‘’అని భావించాడు .కార్మిచేల్ ,క్రాడాక్ లమధ్య విభేదాలు పెరిగాయి .ప్రజలు కార్మిచేల్ ను నమ్మారు .ఆయన మోతీలాల్ తో స్నేహ హస్తం చాచాడు .కార్మిచేల్ తన అభిప్రాయాలమేరకు పని చేస్తూనే ఉన్నాడు .క్రాడాక్ పత్రికా స్వేచ్చపై కత్తి దూశాడు .అమృతబజార్ పత్రిక అంటే అతడికి సింహస్వప్నం .సిల్హెట్ జిల్లా అరుణాచల ఆశ్రమ వాసులపై పోలీసులు జరిపిన భీభత్సకాండ ను పత్రిక ప్రచురించగా ,అస్సాం ప్రభుత్వం సుప్రీం గవర్నమెంట్ కు ఫిర్యాదు చేయగా ప్రభుత్వానికి ఉక్కుపాదం మోపటానికి అవకాశం దొరికింది .
  ఆ ఆశ్రమం దయానంద అనే వైష్ణవ గురు పీఠం.ఇక్కడ గౌరవ ఉన్నత కుటుంబాల స్త్రీ పురుషులు సంకీర్తనలు చేస్తారు .తమకు నిద్రాభంగం కలిగిస్తున్నారని గిట్టనివారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ,గురువుకు ఆశ్రమవాసులకూ పదేసి రూపాయలు జుల్మానా విధించారు .అయినా రాత్రిళ్ళు భజనలు వారు మానలేదు .ఆశ్రమవాసులు ఒక బాలుడిని అపహరించారని మళ్ళీ ఫిర్యాదు చేస్తే,పోలీసులువస్తే వారిని లోపలి రానివ్వ లేదు .ఆశ్రమం ఉగ్రవాద సంస్థగా ఉందని ,మిలిటరీతో దాడి జరిపించగా ,స్త్రీలపై చేయి చేసుకొన్నందుకు ఆశ్రమవాసులు తిరగబడ్డారు .సన్యాసుల త్రిశూలాలను పోలీసులపై విసిరారు .కాల్పులు జరిపి పోలీసు బృందం ఒక ప్రముఖుడిని చంపి ,ఏడుగుర్ని గాయ పరచింది .దీనిపై ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తె అనైతిక అశ్లీల కార్యక్రమాలు ఆశ్రమం లో జరుగుతున్నాయని,బ్రిటిష్ పాలన నుంచి తాము విముక్తులం అయినట్లు ఆశ్రమవాసులు ముందే ప్రకటించారని  రిపోర్ట్ ఇస్తే ,మోతీలాల్ ఘోష్ ప్రభుత్వపు తప్పుడు రిపోర్ట్ ను తూర్పారబట్టితే ,కేంద్ర ప్రభుత్వం పత్రికపై 5వేల రూపాయల ధరావతు విధి౦చి చార్నేల్ కు పంపితే ఆయన తిరస్కరించినా ఫలితం లేకపోయింది ..ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ గార్డియన్ పత్రిక బ్రిటిష్ ప్రభుత్వం తప్పుడు చర్యలను బయటపెడుతూ –‘’ఇండియాలోకానీ ,మరెక్కడా కాని అమృత బజార్ వంటి పత్రిక లేనేలేదు .ప్రజాభిప్రాయానికి అద్దంపట్టే పత్రిక అది .మోతీలాల్ సంపాదకత్వాన వెలువడుతోంది .ఆయనే పత్రిక పత్రికే ఆయన .లార్డ్ విల్టాన్ వైస్రాయి గా వచ్చినప్పటి నుంచి అది బెంగాలీ ప్రజాభిప్రాయ సాధనంగా ఉంది .అందులో పతాక శీర్షికలు ముఖ్యవార్తలు అన్నీ మోతీలాల్ మాత్రమె రాస్తారు .నిర్దాక్షిణ్యంగా తనకలాన్ని ఝడిపిస్తాడు .ఆయన ధనవంతుడు కాదుకానీ  ఆ డబ్బు  చెల్లించ గలడు’’అని రాస్తే దిపాల్ మాల్ గెజిట్ ‘మోతీలాల్ జాతి వినాశకారికాడు .ముఖంపై చిరునవ్వు చిందించే మర్యాదా పురుషుడు .యూరోపియన్ ల వేష భాషలను అనుకరించని జ్ఞాన వయో వృద్దు .ఆయన కలం గంధకాన్ని చిమ్ముతుంది అంతమాత్రాన విప్లవవాది కాదు .ప్రభుత్వాధికారులతో మర్యాదగా ప్రవర్తిస్తాడు .బెంగాలీ కుటుంబ సంప్రదాయాలు పాటిస్తూఉమ్మడికుటుంబం లో ఉంటూ ఒకే ఒక తుండుగుడ్డ మొలకు చుట్టుకొని ,పాదాలపై పని వాళ్ళు పడిమొక్కుతూ ఉంటె ,ఆయన పాతకుర్చీలో కూర్చుని గంధకం లాంటి రచనలను ముఖం పై చెదరని చిరునవ్వుతో రాసుకు పోతూ ఉంటాడు .’’అని రాసింది .సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చేయమని కార్మినల్ రెండు సార్లు చెప్పినా క్రాడేక్ తిరస్కరించాడు .అది జుల్మానాగా మారకుండా రెండు సార్లు అడ్డుపడ్డాడు కార్మినల్ . 
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

భారతీ నిరుక్తి .25వ భాగం8.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.22వ భాగం.7.8.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.22వ భాగం.7.8.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-17

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-17

  పంజాబ్ లో రైతాంగం భూమిపట్టాల లోటుపాటు చట్టాలవలన లజపతిరాయ్ అజిత్ సింగ్ నాయకత్వాన తీవ్ర ఆందోళనకు దిగారు .వారపత్రిక పంజాబీ ప్రచురణకర్త  ముద్రాపకుడిని జైలు లో పెట్టి బర్మాకు తరలించింది ప్రభుత్వం .ప్రజాతిరుగుబాటును కఠినంగా అణచి వేయాలని ప్రభుత్వం భావించింది .విదేశీ వస్తు విక్రయశాలలవద్ద పోలీసు కాపలా పెట్టింది .తూర్పు బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్బాంఫీల్డీ ఫుల్లర్ కఠినాతి కఠినంగా వ్యవహరించాడు .బరిసాల్ జిల్లాలో అశ్వినీకుమార్ ,అశ్వినీకుమార్ దత్తు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రభుత్వానికి వణుకు పుట్టించారు .స్థానిక వివాద పరిష్కారానికి అశ్వినీకుమార్ దత్ పంచాయితీ కోర్టులను సమర్ధ వంతంగా నిర్వహించాడు .1906 ఏప్రిల్ 14,15తేదీలలో బెంగాల్ రాష్ట్రీయ రాజకీయ మహా సభ జరిగినప్పుడు అక్కడ రక్తం చిందింది.బందేమాతరం నినాదం చేయటానికి అనుమతించలేదు ప్రభుత్వం .అంతకుముందే బందేమాతరం పై నిషేద్ధం ప్రకటించినందువల్ల దాన్ని కొనసాగించలా  వద్దా అనేది సమస్య అయింది .అప్పుడు మోతీలాల్ అమృత బజార్ పత్రికలో ‘’నా శిరస్సు అంత విలువైనదేమీ కాదు వందేమాతరం అనకుండా ఉండలేను .అలానినాదంచేసే సమయంలో పోలీసులు అరెస్ట్ చేయటానికి వస్తే ప్రతిఘతించండి ‘’అని రాశాడు .చివరికి నిషేధపు ఉత్తర్వును శాంతియుతంగానే ధిక్కరించాలని నిర్ణయించారు .

  మహాసభ ప్రతినిధులు శిబిరాలనుంచి బయటికి వచ్చి సభకు హాజరవటానికి వందేమాతరం అంటూ వెడుతుంటే పోలీస్ సూపరిం టే౦డెంట్ అతనిబలగాలు లాఠీలతో ప్రజలపై విరుచుకు పడ్డారు .సురెంద్రనాద్ మోతీలాల్ అశ్వినీకుమార్ లు ముందుకు వచ్చి కావాలంటే తమల్ని అరెస్ట్ చేయమన్నారు .కానీ సురెంద్రనాథ నుమాత్రమే అరెస్ట్ చేసి ,మేజిష్ట్రేట్ ఇంటికి తీసుకుపొగా ఆయన నాలుగు వందల రూపాయలు జరిమానా విధించాడు .ఆ ఫైన్ చెల్లించి మళ్ళీ వందేమాతరం నినాదాలతో రెట్టింపు ఉత్సాహం తో ప్రజలు ఆయనను సభాస్థలికి ఊరేగింపుగా తీసుకు వెళ్ళారు .కలకత్తా ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రసూల్ అధ్యక్షోపన్యాసమిచ్చాడు .మోతీలాల్ ఆ సభలో ఒక కీలక తీర్మానం ప్రవేశ పెట్టాడు అందులో సారాంశం –‘’తూర్పు బెంగాల్ ,అస్సాం లలో దేశభక్తులైన కార్యకర్తలపై ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తోంది .న్యాయబద్ధమైన చట్టబద్ధమైన పరిపాలన ఏనాడో అంతరించింది .ఈబాధ్యతా రహిత ప్రభుత్వంతో ఎలాంటి చార్చాలు జరపము .ప్రజలస్వయం కృషివలన పరిష్కరించదగిన అంశాలే చర్చిస్తాము ‘’

  15ఏళ్ళ తర్వాత గాంధీ అహింసావిధానం లో సహాయనిరాకరణ శాసనోల్లంఘన చేయాలని పిలుపునిచ్చాడు .అప్పట్లో ఆంగ్లో ఇండియన్ ల అభిప్రాయాలను చాటే స్టేట్స్ మాన్ పత్రిక ‘’1906లోనే బెంగాల్ లోని బరిసాలాలో మొదటిసారి శాసనోల్లంఘన మోతీలాల్ ఘోష్ నాయకత్వాన జరిగింది .గాంధీ సహాయ నిరాకరణ మంత్రం కూడా మోతీలాల్ సూచిన్చిందే .చరఖాపై నూలు వడకటం కూడా మోతీలాల్ చెప్పిందే .ఆయన కృషి సత్ఫలితాన్నిచ్చి భాద్రాలోక్ కుటుంబాలలో వేలాది చరఖాలు వెలిశాయి .కానీ విభజన ఆందోళన కారులు దీని ప్రాముఖ్యాన్ని గుర్తించలేక పోయారు .’’అని రాసి మోతీలాల్ దూర దృష్టి మార్గ నిర్దేశనం ను శ్లాఘించింది .

  కర్జన్ తర్వాత వచ్చిన మింటో  ప్రజలపై మరింత కఠినంగా ప్రవర్తిస్తూ కలకత్తాలో వందే మాతరం అని అరచిన 15ఏళ్ళబాలుడికి 16కొరడా దెబ్బలు శిక్ష వేశాడు .ఈ కేసు విచారించి,తీర్పు చెప్పిన మేజిష్ట్రేట్ కింగ్ ఫోర్ట్ పై పగ తీర్చుకొంటామని విప్లవకారులు ప్రతిజ్ఞ చేయాగా ఆయన్ను ముజఫర్ పూర్  కు ట్రాన్సఫర్ చేశారు .అతన్ని చంపటానికి ఖుదీరాం బోస్ ,ఫ్రఫుల్ల చక్కీ లకు బా౦బులిచ్చి పంపారు .వీరు వేసిన బా౦బులలో మేజిష్ట్రేట్ కాక ఇద్దరు యూరోపియన్లు చనిపోయారు .బెంగాల్ లెఫ్టినెంట్ జనరల్ ఆండ్రూ ఫైజర్ పైకూడా రెండు సార్లు బాంబు దాడి జరిపారు .కానీ వెంట్రుకవాసిలో తప్పించుకోగలిగారు .ఒక బాంబుదాడిలో ఢాకాడిష్ట్రిక్ట్ మేజిష్ట్రేట్ ‘అలెన్ ‘’చనిపోయాడు .చివరికి చిక్కీ ఒక బెంగాల్ పోలీసాఫీసర్ కు చిక్కగా ఆత్మహత్య చేసుకొన్నాడు  . తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ను విప్లవకారులు చంపేశారు .కలకత్తా శివార్లలోని ‘’మానికాల్ గార్డెన్ ‘’లో ఉన్న చిన్న ఆయుధ శాలలపై పోలీసులు దాడి చేయగా అరవి౦దఘోష్ తమ్ముడు వీరేంద్ర ఘోష్ తో సహా అనేకమంది విప్లవకారులు అరెస్ట్ అయ్యారు .వారిలో చాలామందికి యావజ్జీవ కారాగార వాస శిక్ష విధించారు .అరవి౦దోను కూడా ఖైదు చేసి విచారించి ఏ ఆధారం దొరకక నెల తర్వాత విడుదల చేశారు .

  విప్లవకారులు ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ ,అమెరికాల లో కూడా విప్లవ కేంద్రాలు స్థాపించారు .అక్కడి నుంచే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు సాగించారు .వీరిలో శ్యాం జీ కృష్ణవర్మ ,మేడంఎస్ ఆర్ రాణా,వీరేంద్రనాధ చటోపాధ్యాయ ,తారాకాంత దాస్ ,బేడీ సావర్కార్ ,,లాల్ హరిదయాల్  లు ముఖ్యులు .వీరంతా పత్రికలద్వారా ప్రచారం చేశారు .అక్కడి భారతీయ విద్యార్ధులను సమీకరించి ప్రబోధం కలిగించారు .లండన్ లో జరుగుతున్న ఒక సమావేశం లో విదేశాంగమంత్రి కార్యదర్శి సర్ కర్జన్ వైల్  ను మదన్ లాల్ ధింగ్రా కాల్చి చంపాడు .అతన్ని ప్రభుత్వం ఉరి తీసింది .కలకత్తా ఆలీపూర్ జైలు లో ఒక రాజకీయ కేసులో అరెస్ట్ అయి విచారణలో ఉన్న సత్యన్ బోస్ మాణిక్ లాల్ కేసు లో అప్రూవర్ గా మారిన నిందితుడు నరేంద్ర గోస్వామిని కాల్చి చంపాడు .ఈ కేసు విచారిస్తున్న పోలీస్ అధికారినీ ప్రాసిక్యూషన్ న్యాయవాదినీ బూటారంగా కోర్ట్ లో కాల్చి చంపారు .టెర్రరిస్ట్ విజ్రు౦భణకు పత్రికా స్వేచ్చముఖ్యకారణం అన్నాడు మింటో .1910లో పత్రికా చట్టం తెచ్ఛి అంక్షలు విధించాడు .నిషేద్ధిత వార్త ప్రచురిస్తే పత్రిక ఐదువేలు ఫైన్ కట్టాలని రూల్ పెట్టాడు .

  మోతీలాల్ కు ,పత్రికకు ఎప్పుడూ ఏదో ఒక హెచ్చరిక  అందుతూనే ఉంది .ప్రజలను భయభ్రాంతులను చేసి లొంగ తీద్దాం అనుకొన్న మింటో ఆశలు అడియాశలే అయ్యాయి .’’ముందు అణచి వేత తర్వాతే చర్చలు ‘’అనే మింటో విధానాన్ని మేధావి వర్గం తిరస్కరించింది .తర్వాతవచ్చిన మోర్లె,లార్డ్ క్రేవీ లవలన కూడా ఏమీకాలేదు .మింటో మార్లే సంస్కరణలను ముస్లిం లు మాత్రమె సమర్ధించారు .1911లోబెంగాల్ విభజన రద్దు అవగానే ముస్లిం లకు అసంతృప్తి పెరిగింది .1902లో బోయర్లు స్వాతంత్ర్యం సాదించుకొన్నారు .1905లో చిన్న దేశం జపాన్ రష్యా జార్ ప్రభువుల అహంకారానికి దెబ్బకొట్టింది .1912 డిసెంబర్ లో వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ ను నడి రోడ్డుమీద హత్య చేయటానికి జరిగిన ప్రయత్నం లో అప్పటిదాకా నివురుకప్పిన నిప్పులాగా ఉన్న జ్వాల ఒక్కసారి ఎగసి పడింది .మోతీలాల్ అహింసను ,ప్రజోద్యమాన్నే బలపరచాడు .గాంధీ యుగం ఆరంభించటానికి ముందే మేధావులలో ముఖ్యులైన రవీంద్రుడు ,మోతీలాల్ ఘోష్ జాతికోసం ప్రాణాలు త్యజించి పోరాడిన వీరుల చిత్త శుద్ధినీ ,ఔన్నత్యాన్నీ కొనియాడారు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-22-ఉయ్యూరు   

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భారతీ నిరుక్తి 24వ భాగం.

భారతీ నిరుక్తి 24వ భాగం.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-16

గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-16

 స్వదేశీ ఉద్యమం

బెంగాల్ విభజన వలన కనీ వినీ ఎరుగని రీతిలో ఉద్యమం రూపు దాల్చింది .స్వదేశీ వస్తువులను ముఖ్యంగా వస్త్రాలనే వాడాలనే సంకల్పం బలీయమైంది .ఇదే ‘’వందేమాతరం ‘’ఉద్యమంగారూపు దాల్చి,ప్రజల నరనరానా జీర్ణించుకు పోయింది .1906లో కలకత్తా కాంగ్రెస్ లో తిలక్ ‘’శిస్తులు ,పన్ను వసూళ్లు చేయం ..మనడబ్బుతో ప్రభుత్వం ఎక్కడెక్కడో చేసే యుద్ధాలలో సహకరించం .న్యాయస్థానాలలోకూడా సహకరించం .మనల్ని విచారించటానానికి మనమే స్వతంత్ర న్యాయస్థానాలు నిర్వహిస్తాం .కాలం కలిసివస్తే మనం పన్నులే కట్టాల్సి న పని ఉండకపోవచ్చు .సమైక్యతతో దీన్ని సాధించగలిగితే మనం సర్వ స్వతంత్రులం ‘అని ఉద్బోధించాడు .ఇంతకుముందు ఏడాదిన్నర క్రితం మోతీలాల్ ఘోష్ ప్రవచించిన మాటలు గుర్తుకు తెచ్చుకొందాం –‘’ఆరుకోట్ల బెంగాలీలను కర్జన్ బంగాళాఖాతం లో మున్చేశాడుకర్కశపాలనలో .మన డబ్బూ దస్కం తో మేపబడుతున్న 72వేల మంది బ్రిటిష్ సైనికుల్ని అండగా చేసుకొని ఈ దారుణం చేశాడు .కోల్పోయిన శక్తియుక్తుల్ని కూడా తీసుకొని స్వజాతి రక్తాన్ని ధారపోయని జాతి ప్రపంచం లో లేదు .అమెరికన్లు ఇంగ్లాండ్ ప్రజలు ఇలా త్యాగాలు చేసిన జాతి అని మర్చిపోరాదు ‘’నీలి విత్తనాలను మళ్ళీ ఈ చేతులు ముట్టవు ‘’అని శపథం చేసి మన రైతాంగం మాట నిలబెట్టుకొన్నారు అలానే బెంగాల్ విభజన వద్దు అనే వారంతా ‘’ఈ చేతులతో విదేశీ వస్తువులు మళ్ళీ ముట్టుకోము ‘అని శపథం చేసి ,నెరవేర్చుకోవాలి .16-10-1905న విభాజిత రాష్ట్రాల ప్రారంభోత్సవం జరిగినప్పుడు మోతీలాల్ అమృత బజార్ పత్రికలో ఇలా రాశాడు –‘’భారతీయులు పశువులమందలేకానీ మానవ మాత్రులు కాదు అని పరాయిపాలకులు భావిస్తున్నారు .బెంగాలీలకు తగిలిన ఈ కొరడా దెబ్బ మంచిదే అయింది .లేకపోతె దీర్ఘనిద్ర నుంచి అంతత్వరగా మేలుకొనే వారుకాదేమో .కర్జన్ హేయమయిన చర్యలవలన తలెత్తిన స్వదేశీ ఉద్యమం సక్రమమార్గం లో నడిస్తే మృతప్రాయమైన దేశానికి మళ్ళీ జవసత్వాలు కలుగుతాయి .మనం ఈ ఉద్యమానికి ఎంతో రుణపడి ఉన్నాం ‘’అని ఎలుగెత్తి చాటాడు .

  1906తర్వాత అయిదవ జార్జి వేల్స్ ప్రభువు కలకత్తావస్తే అమృతబజార్ పత్రిక,దిబెంగాలీ,ఉగ్రవాది ఎస్ కే రాడ్క్లిఫ్ సంపాదకత్వంలో వెలువడే ది స్టేట్స్ మన్ అనే పత్రికలను రాజుకంటపడకుండా బ్రిటిష్ అధికారులు నానా తంటా పడ్డారు .కానీ రాజు ఆంతరంగిక కార్యదర్శి ,మోతీలాల్ స్నేహితుడు సర్ వాల్టర్ లారెన్స్ అమృతబజార్ పత్రికలూ కొన్నిటిని సేకరించి చూపించాడు యువరాజుకు .లారెన్స్ పిలవనంపితే మోతీలాల్ సంప్రదాయమైన ఖద్దరు పంచ చొక్కాధరించి గవర్నర్ హౌస్ కు వెళ్ళాడు .’’యువరాజు ను చూడాలని ఉందా ?’’అని వెళ్ళగానే లారెన్స్ అడిగితె ,చూడకపోతే మర్యాదగా ఉండదేమో అనుకోని సరే అంటే .లోపలి తీసుకు వెళ్ళాడు .వాళ్ళిద్దరూ ఏయే విషయాలు మాట్లాడుకోన్నారో అవన్నీ మోతీలాల్ చాలాకాలం తర్వాత పత్రికలో ఇలా రాశాడు –‘’యువరాజు షేక్ హాండ్ ఇవ్వటానికి చేయి చాచగా ,భవిష్యత్తులో రాజుకాబోతున్న ఆయన ను భారతేయులు గౌరవించే పధ్ధతి అదికాదని చెప్పి ముకుళితహస్తాలతో నమస్కరించాను . గద్గదస్వరంతో ఇలా విన్న వించాను –‘’  మీ పరిచయాన్నికలిగిన్చినందుకు ధన్యవాదాలు ,ఇది గౌరవంగా భావించి కలకాలం మనసులో  భద్రపరచుకొంటాను .నిరుపేద ఇండియాదయనీయ పరిస్థితి వివరించటానికి అనుమతించండి .మా భవిష్యత్ పాలకులు మీరేకనుక మీ చేతులతో మా దేశస్థితిని చక్క దిద్దండి .భారతీయులని మరవకండి .ఇంగ్లాండ్ లోని నాలుగుకోట్ల ఆంగ్లేయుల్లాగానే ,భారతీయుల్నికూడా మీ స్వజనం గా భావించండి .మాకు మా పాలకుల దయాదాక్షిణ్యాలు శ్రద్ధాసక్తులు చాలా అవసరం ‘’అన్నాడు మోతీలాల్ ఆ మాటలకు యువరాజు కరిగిపోయినట్లు కనిపించాడు .చాలా ఆప్యాయంగా మోతీలాల్ ను లేచి నిలబడమని కోరి ,ఆత్మీయత ధ్వనించే కంపిత స్వరంతో ‘’మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతృప్తినిచ్చింది .నిజంగానే నేను భారతీయులను మరువనే మరువను అని మీద్వారా మాట ఇస్తున్నాను .నా స్మృతిపధం లో భారతీయులు ఎప్పుడూ నిలిచే ఉంటారు .మీరు మాకు చూపిన స్వాగత సత్కారాలను మా తండ్రిగారికి నివేద్దిస్తాను .ఎంతో ఆత్మీయతా భావంతో మీ దేశం నుంచి తిరిగి వెడుతున్నాను ‘’అన్నాడు యువరాజు .ఇంగ్లాండ్ వెళ్ళిన వెంటనే తండ్రికి ఈ విషయాలన్నీ చెప్పాడు.భారతీయుల విధేయత మరింత పొందగలిగితే ,ఆదేశ పాలనాభారం మరింతసులువుగా ఉంటుందని అక్కడి ప్రభుత్వానికి నివేదించాడు .1911లో ఆయన బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించాక బెంగాల్ ను పునరేకీకరించాలని సూచన చేసినట్లు తెలిసింది .11-12-1911న ఢిల్లీ లోని రాజదర్బార్ లో ఈ పునరేకీకరణ సంకల్ప ప్రకటన జారీ అయింది .మోతీలాల్ ఘోష్ ,యువరాజు దీన్ని అత్య౦త రహస్యంగా ఉ౦చాలనుకొని రహస్యాన్ని కాపాడారు .1910లో మోతీలాల్ ఘోష్ ను అరెస్ట్ చేసే పధకాన్ని అత్యంత నాటకీయంగా చేబట్టకపోవటానికి ఇదే కారణం .

  బెంగాల్ లో స్వదేశీ ఉద్యమ సారదులలో మోతీలాల్ ఘోష్ ఒకరన్న సంగతి మర్చిపోలేము .అనేక బృందాలు సమితులు ఊరూరా ఉద్యమవ్యాప్తికోసం తీవ్ర కృషి జరిపారు .స్వతంత్ర ఉద్యమానకి వీరంతా వాలంటీర్లుగా సాయపడ్డారు .అరవిందులు మోతీలాల్ కు అత్య౦త  సన్నిహితులు  .స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత వారితో అందరికంటే మోతీలాల్ కు ఎక్కువ పరిచయం ఉందికూడా .

  స్వాతంత్ర సాధనకు తిరుగుబాటు పద్ధతులను ప్రోత్సహించే పత్రికలూ కూడా వచ్చాయి .బ్రహ్మబంధం ఉపాధ్యాయ సంపాదకత్వం లో సంధ్య దినపత్రిక ,భూపెంద్రనధ దత్తు సంపాదకత్వం లో జుగ౦తర్ వారపత్రిక ,మనోరంజన్ గుహ ఠాకూర్త గారి నవశక్తి దినపత్రిక ,అరవింద ఘోష్ ‘’బందేమాతరం ‘’పత్రిక గొప్ప ప్రచారం చేశాయి .ఉన్నదున్నట్లు రాసి పత్రికలూ స్వచ్చతను పాటించి గౌరవం పొందాయి .వీటిపై నిరంతరం నిఘా సాగేది .బ్రహ్మబందు తాను కోరుకోన్నట్లే విచారణ ఖైదీగా ఉండగానే చనిపోయాడు .

    సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

19వ శతాబ్ది ఇంగ్లాండ్ సాంఘిక సంస్కర్త ,రచయిత్రి –కరోలిన్ నార్టన్( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -ఆగస్ట్

ప్రఖ్యాత నవలాకారుడు ధామస్ షెరిడాన్,కరోలిన్ హెన్నెట్టా కాల్లేండర్ లకు లండన్ లో మార్చి 1808 న కరోలిన్ జన్మించింది .తండ్రి గొప్పనటుడు ,సైనికుడు ,కాలని అడ్మి స్ట్రెటర్.ఈయన ,ఐరిష్ రాజకీయవేత్త ,నాటకకర్త రిచార్డ్ బ్రిన్స్క్లి షెరిడాన్ .తల్లి ఎలిజబెత్ ఆన్ లిన్లి నవలారచయిత్రి .1817లో కరోనిన్ తండ్రి దక్షిణాఫ్రికలో కేప్ ఆఫ్ గుడ్ హాప్ లో కాలనీ సెక్రటరిగా ఉంటూ చనిపోయాడు .కుటుంబానికి పెన్నీ కూడా లేకుండా పోయింది .డ్యూక్ ఆఫ్ యార్క అండ్ అల్బని ప్రిన్స్ ఫ్రెడరిక్ కారుణ్యమ తో ఆయన సేవకు వీరికుటు౦బ పోషణకు హామ్టన్ కోర్ట్ పాలస్ లో ఉండేట్లు ఏర్పాటు చేశాడు ‘.షెరిడన్ సిస్టర్స్ లో పెద్దమ్మాయి హెలెన్ గీతరచయిత ,ప్రిన్స్ బ్లాక్ ఉడ్ ను పెళ్ళాడింది .దీనివలన నార్టన్ మొదటి మార్క్వేస్ ఆఫ్ డఫరిన్ అండ్ ఆవా ఫ్రెడరిక్ హామిల్టన్ టెంపుల్ బ్లాక్ వుడ్ కు పిన్ని అయింది .ఈమె తర్వాత కెనడా గవర్నర్ జనరల్ ,ఇండియాకు ఎనిమిదవ వైస్ రాయ్ అయింది .ఈమె చెల్లెలు జార్జియానా డ్యూక్ ఆఫ్ సోమర్సెట్ ను పెళ్లి చేసుకోన్నది ఈ సోదరీ మణి త్రయాన్నివారి అందచందాలకు ‘’త్రీ గ్రేసేస్ ‘’’’సౌందర్య త్రయం ‘అని పిలిచేవారు .

1827లో కరోలిన్ గిల్ఫాడ్ కు చెందిన బారిస్టర్ జార్జి చాపెల్ నార్టన్ ను పెళ్లి చేసుకొన్నది .ఇతడు అసూయాపరుడు, తాగుబోతు .ఆమెను శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవాడు .దీనికి తోడు అతడు బారిస్టర్ గా రాణించలేక డబ్బుకు ఇబ్బంది పడేవాడు .డబ్బు విషయంలో ఇద్దరికీ తరచుగా పోట్లాటలు జరిగి దాంపత్యం కలిసి రాలేదు .పెళ్ళైన కొత్తలో ఆమె తన అంద చందాలతో ,రాజకీయంతో విట్ అండ్ హ్యూమర్ తో సంఘంలో ప్రముఖ ‘’హోస్టెస్ ‘’అంటే ఆతిధేయురాలిగా ఉండేది .ఆమె అనాచార జీవితం ,దాపరికం లేని సంభాషణలు 19వ శతాబ్ది ఇంగ్లీష్ ఉన్నతకుటుంబాలకు నచ్చలేదు .ఆమెకు అభిమానులు ,వ్యతిరేకులు సరిసమానంగా ఉండేవారు .ఆమె స్నేహితులలో ప్రముఖ రాజకీయవేత్తలు రచయితలూ ఉండేవారు వారిలో శామ్యూల్ రోజేర్స్ ,ఎడ్వర్డ్ బుల్వేర్ లిట్టేన్, ఎడ్వర్డ్ ట్రేలాని,అబ్రహామ్ హావర్డ్ ,మేరీ షెల్లీ ,ఫాన్ని కెం బుల్ బె౦జమిన్ ,భవిషత్తులో బెల్జియం కింగ్ 1వ లియోపార్డ్ అయిన డిజ్రేలి,ఆరవ డ్యూక్ ఆఫ్ డెవాన్ షైర్ విలియం కేవండిష్ ముఖ్యులు .తర్వాత ఆమె టోల్ పుడిల్ మేరీస్ ప్రొటెస్ట్ మార్చ్ లో 1834లో పాల్గొన్నదికూడా .

అసూయాపరుడైనా, ఆమె భర్తను తన ప్రతిభా చాకచక్యాలతో 1831లో మెట్రోపాలిటన్ పోలీస్ మేజిష్ట్రేట్ అవటానికి సాయం చేసింది .ఆకాలంలో తనలోని భావోద్రేకాలను అదుపు చేసుకోవటానికి జీవితం గడవటానికి కవిత్వం రాసింది ,వచన రచనలు చేసింది .1829లో ‘’దిసారోస్ ఆఫ్ రోసాలే ‘’రాసి ప్రచురించి ప్రఖ్యాతి పొందింది .1830లో ‘’ది అన్ డయింగ్ వన్’’అనే రోమాన్స్ విషయంరాసింది .1832నుంచి 37 వరకు ‘’ది కోర్ట్ మేగజైన్ అండ్ బెల్లీ అసెంబ్లీ ‘’,కు సంపాదకురాలు గా ఉంది .రాబర్ట్ సూదీ తర్వాత ఆస్థానకవిగా సర్ రాబర్ట్ పీల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసింది, కాని ఫలించలేదు .

1836 లో భర్తనుండి వేరుపడి ,తన రచనలతో వచ్చినడబ్బుతో గడిపింది .ఆడబ్బుపైనా తనకే హక్కు ఉందని భర్త కోర్టులో వేసి గెలిచాడు .భర్తనుంచి భరణం రాకపోగా ,ఆమె సంపాదన అతని హక్కుభుక్తమైంది . చట్టాన్ని నార్టన్ బాగా ఉపయోగించి అప్పులవాళ్ళను వసూళ్ల కోసం భర్తపై కేసులు వేసేట్లు చేసింది .భర్తనుంచి విడిపోయిన కొద్దికాలానికే భర్త వాళ్ళ ముగ్గురు కొడుకుల్ని స్కాట్ లాండ్ లో తర్వాత యార్క్ షైర్ లో ఆమెకు తెలీకుండా చెప్పకుండా దాచేసి ఆమె పైనే కేసుపెట్టాడు .అంతేకాక ఆమెకు తన ముఖ్య స్నేహితుడు విగ్ ప్రైం మినిస్టర్ అయిన లార్డ్ మెల్ బోర్న్ తో అక్రమ సంబంధం ఉందని ,మొదట్లో అతడి నుంచి 10వేలపౌండ్లు ఇమ్మని బెదిరించాడు . .అతడు తిరస్కరించగా ప్రధానిఅయిన మెల్ బోర్న్ ను కోర్టు కీడ్చాడు .తొమ్మిది రోజుల విచారణ తర్వాత జడ్జి మెల్ బోర్న్ ను సమర్ధించి జార్జి పిటీషన్ తిరస్కరించి౦ది కాని,ప్రభుత్వం పరువు ధేమ్స్ నదిలో కలిసింది .ఆమెకు విడాకులివ్వనూలేదు ,పిల్లల్ని చూపించనూలేదు భర్త .1836చట్టం ప్రకారం సంతానంతండ్రికే చెందుతుంది .

1842లో ఆమె చిన్నకొడుకు గుర్రం స్వారీ చేస్తూ కిందపడి గాయాలై సరైన వైద్యం అందక చనిపోవటంతో గోరు చుట్టుపై రోకలి పోటు ఆయనది కరోలిన్ జీవితం .కుర్రాడిచావుకు కారణం తండ్రి అని ఆమె అతడిని నిలదీసింది .అప్పటినుంచి మిగిలిన ఇద్దరు పిల్లల్ని చూసి వెళ్ళటానికి అతడు అనుమతించాడు .కాని నిఘా పెట్టేవాడు .కుటుంబ జీవితం లో శాంతి సుఖాలు లేకపోవటంతో ఆమె ,తనలాగా స్త్రీ సమాజం మగాడిక్రూరత్వాలకు బలికారాదని స్త్రీ హక్కులకోసం దృష్టి సారించింది .ముఖ్యంగా వివాహమైన , విడాకులు పొందిన మహిళల హక్కులకోసం పోరాడింది .1836లో ఆమె రాసిన ‘’ఎ వాయిస్ ఫ్రం ది ఫాక్టరీస్’’ ,1845లో రాసిన ’దిచైల్డ్ ఆఫ్ ది ఐలాండ్స్ ‘’కవితా సంపుటులలో ఆమెకున్న రాజకీయ ప్రజ్ఞా,సాంఘిక సేవా తత్పరత మహిళలకు హక్కులకోసం తపన కనిపిస్తుంది .1855లో పార్లమెంట్ లో ‘’విడాకుల సంస్కరణ ‘’పై చర్చ జరుగుతున్నప్పుడు నార్టన్ సభ్యులకు తన జీవిత గాధను ,అనుభవించిన అవమానాలు కష్టాలను వారికి వ్రాతపూర్వకంగాతెలిపి ,మహిళలకు న్యాయం చేయమని కోరింది .ఆమె వారికి అందించిన సమాచారంలో ‘’ఇంగ్లీష్ భార్య భర్త ఇల్లు వదిలి పెట్టలేదు.ఆమెబందువుల దగ్గరకాని స్నేహితుల ఇంట్లో కానిఉంటే భర్తవచ్చిబలవంతంగా తీసుకుపోతాడు .భర్త విడాకులు కోరితే మొదటగా భార్య అభీష్టం తెలుసుకోవటం లేదు .ఆమెకు ప్లీడర్ ను పెట్టుకొని వాదించేహక్కు కాని ఆమెను పార్టీ గా చేర్చటం లేదు .భార్య తప్పు చేస్తే భర్త ఆమెకు విడాకులిచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొంటాడు ,కానీ భార్యకు అలాంటి హక్కులేదు. వాడు ఎంతటి క్రూరుడు దుర్మార్గుడు తాగుబోతు వ్యభిచారి అయినా .కని పెంచి తమ ఆశలన్నీ వాళ్ళపైనే పెట్టుకొని బతికే తల్లికి పిల్లలను చూసుకొనే హక్కు ఉండటం లేదు దీనికి నాజీవితమే ఒక పెద్ద ఉదాహరణ .ఆతల్లి మనోవేదన ఎవరికీ పట్టటం లేదు ‘’అని వివరంగా రాసి పార్లమెంట్ సభ్యుల దృష్టికి తెచ్చి మహిళలకు మహోపకారం చేసింది .‘’.

స్త్రీ హక్కులకోసం నార్టన్ ఉద్యమించింది .విక్టోరియామహారాణి కి ఈ పరిస్థితులు తెలియజేస్తూ ఉత్తరం రాసింది .ఆమె కృషి ఫలితంగా ‘’ దికస్టడిఆఫ్ ఇంఫన్ట్స్ యాక్ట్ ,మాట్రిమోనియల్ కాజెస్ యాక్ట్ ,మారీడ్ వుమెన్స్ ప్రాపర్టి యాక్ట్ లను పార్లమెంట్ ఆమోదించి పాస్ చేసి అమలు పరచింది . ఓటు హక్కు ఉద్యమకారిణి బార్బరా బ్రాడికాన్ తో కలిసి ఆమె పనిచేసింది.వీటివలన పెళ్లి అయిన స్త్రీలకూ పిల్లలపై హక్కు ,విడాకుల సరళీకరణ ,ఆస్తిహక్కు సమకూడాయి .

1849చిత్రకారుడు డేనియల్ మక్లైస్ ఆమె చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రించి ‘’జస్టిస్ ‘’అని పేరుపెట్టాడు హౌస్ ఆఫ్ లార్డ్స్ లో .ఆమెను అనేక హింసలకు ,అన్యాయాలకు గురైన బాధితురాలు అన్నాడు .లార్డ్ మెల్బోర్న్ మాత్రం ఆమె సాధించిన సంస్కరణలను వ్యతిరేకిస్తే క్వీన్ విక్టోరియా అతడిని దూషించింది .నార్టన్ 19వ శతాబ్దిలో స్త్రీవోటుహక్కు విషయమై పెద్దగ ఆసక్తి చూపలేదు .1838లో’’ దిటైమ్స్’’పత్రిక ఆమెను రాడికల్ అంది .దీనికి ఆమె ‘’ “The natural position of woman is inferiority to man. Amen! That is a thing of God’s appointing, not of man’s devising. I believe it sincerely, as part of my religion. I never pretended to the wild and ridiculous doctrine of equality. అని సమాధానం చెప్పింది .

1875లో నార్టన్ చనిపోయాక ఆమె కస్టాలు గట్టెక్కాయి .పాత స్నేహితుడు ,రాజకీయవేత్త చారిత్రకరచయిత సర్ స్టెర్లింగ్ మాక్స్ వెల్ ను పెళ్లిచేసుకొన్నది .ఆమె పెద్దకొడుకు టిబి తో చనిపోయాడు .రెండవవాడు తరచూ అనారోగ్యంతో ఆమె దగ్గరే ఉండేవాడు .అతనికొడుకు జాన్ ఎస్టేట్ కు వారసుడయ్యాడు .17-6-1877న కరోలిన్ నార్టన్ 69వ ఏట లండన్ లో చనిపోయింది .ఏప్రిల్ 2021లో ‘’ఇంగ్లీష్ హెరిటేజ్ ‘’ నార్టన్ ను’’ బ్లూ ప్లేక్ ‘’ గౌరవంతో ఆరుగురితోపాటు గౌరవించింది .30ఏళ్ళు సెంట్రల్ లండన్ లో ఆమె ఉన్న ఇంటిని స్మృతి చిహ్నం చేశారు .

కరోలిన్ నార్టన్-దిసారోస్ ఆఫ్ రోసేల్లా ,ఐ డునాట్ లవ్ దీ,దికోల్డ్ చేంజ్ ,దిఅన్డైయింగ్ వన్ అండ్ అదర్ పోయెమ్స్ ,దిఫైత్త్ లెస్ నైట్(knight ) ,దిడ్రీం అండ్ అదర్ పోయెమ్స్ ,దిచైల్డ్ ఆఫ్ దిఐలాండ్స్ ,మొదలైన 11కవితా సంపుటులు ,దిడాన్డిల్స్ రూట్ ,దివైఫ్ అండ్ వుమెన్స్ రివార్డ్ ,లాస్ట్ అండ్ సేవ్డ్ మొదలైన 5నవలలు ,’’దిజిప్సీ ఫాదర్ ,వాతేక్ అనే నాటకాలు,ఎవాయిస్ ఫ్రం దిఫాక్టరీస్ ,సేపరేషన్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ ,ఎ ప్లేన్ లెటర్ టు దిలార్డ్ చాన్సెలర్ ,లెటర్స్ టుదిమాబ్ ,ఇంగ్లిష్ లాస్ ఫర్ దినైన్ టీంత్ సెంచరి ,లెటర్ టు దిక్వీన్ ,ఎ రివ్యు ఆఫ్ దిడైవోర్స్ బిల్ ఆఫ్ 1856 అనే రాజకీయ కరపత్రాలు అంటే పా౦ఫ్లేట్స్’’రాసింది .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ 21వ భాగం.2.8.22 గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు

Video link

Video link

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -310

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -310

·         310-‘’‘నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి ‘’పాటతో జంధ్యాల సినిమాలో కనిపించి విశ్వనాద్ గారి శంకరాభరణం లో ‘హలో మై డియర్ శంకర శాస్త్రి ‘తోనూ సప్తపది లో’’గోవుల్లు తెల్లన గోపన్న నల్లన’’ పాటలతో తన ప్రత్యేకత చూపి,జీవనసాఫల్య పురస్కారం పొంది,ఇప్పటికీ స్వంత ఆర్కేష్ట్రా తో  ప్రదర్శనలిస్తున్న  80ఏళ్ళ రాజమండ్రి లాయర్,రాజమండ్రి ‘’కిషోర్ కుమార్ ‘’ –జిత్ మోహన మిత్ర 

·          ‘నా షోలాపూర్‌ చెప్పులు పెళ్లిలో పోయాయి..అవి కొత్తవి.. మెత్తవి.. కాలికి హత్తుకు పోయేవి’ అంటూ నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఈ పాట నేటికీ సజీవంగానే ఉంటుంది. ఉర్రూతలూగిస్తుంది.. 1981లో విడుదలైన ముద్దమందారం సినిమాలోని ఈ పాట నాడు కుర్రకారు నోట జోరుగా వినిపించేది. రాజమహేంద్రవరానికి చెందిన జిత్‌మోహన్‌ మిత్ర పాడిన ఈ పాట ఆయనకు ఓ బ్రాండ్‌ ఇమేజి తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఈ నటగాయకునిలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. 52 ఏళ్ల క్రితం ఈయన సారథ్యంలో ప్రారంభమైన ఆర్కెస్ట్రా నేటికీ పాటల పల్లకీలో అభిమానులను ఊరేగిస్తూనే ఉంది. వచ్చే నెల 30వ తేదీకి 80 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ పాటల మాంత్రికుడిని రాజమహేంద్రవరం కిషోర్‌కుమార్‌గా పిలిచేవారు..

  వారసత్వ నేపథ్యం..
జిత్‌మోహన్‌ తండ్రి శ్రీపాద కృష్ణమూర్తి ప్లీడర్‌ గుమాస్తాగా పని చేస్తూ నాటకాల్లో నటించేవారు. ఆయనకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు పట్టాభి ఆ రోజుల్లోనే సినిమా రంగమంటే చెవికోసుకునే వారు. ఆదుర్తి నిర్మించిన ‘మూగమనసులు’ నుంచి తెరపై గోదావరి కనిపించడం వెనుక పట్టాభి ముద్ర ఎంతో ఉండేది. ఆయన ప్రభావమే జిత్‌మోహన్‌లోనూ కనిపించేది. జిల్లాలో ఏ సినిమా నిర్మించినా తెర వెనుక కీలక పాత్ర పోషించేవారు. ముఖ్యంగా లొకేషన్ల ఎంపికలో దర్శకునికి సహకరించేవారు. దర్శకుడు కె.విశ్వనాథ్‌ మొదలుకొని అందరూ రాజమహేంహేంద్రవరం రాగానే ఈయన్ను సంప్రదించేవారంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే  నగరంలో సినిమాలకు కేరాఫ్‌గా గుర్తింపు పొందారు.
ఆయన నోట.. కిషోర్‌కుమార్‌ పాట
జిత్‌మోహన్‌ మిత్రకు పాటలంటే విపరీతమైన ఇష్టం. హిందీలో పాడే కిషోర్‌కుమార్‌ అంటే ప్రాణం. అందుకే చిన్నప్పటి నుంచీ ఆయన పాటలే ఎక్కువగా పాడేవారు. ఈ ఉత్సాహమే ఆయనను 1970లో ఓ ఆర్కెస్ట్రా పెట్టేలా చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన నేతృత్వంలోని ఆర్కెస్ట్రా రాష్ట్రంలోని అన్నిచోట్లా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆర్కెస్ట్రాలో ఈయన పాటల జోష్‌ చూసిన దర్శకుడు జంధ్యాల తన ముద్దమందారం సినిమాలో అవకాశమిచ్చారు. అందులో ఈయన పాడిన ‘షోలాపూర్‌ చెప్పులు పెళ్లిలో పోయాయి’ పాట సూపర్‌ హిట్‌ అయింది. ఎక్కడ పెళ్లిళ్లయినా ఆర్కెస్ట్రాలో  ఈ పాట తప్పనిసరిగా వినిపించేది.
తాను ప్రాణం కన్నా మిన్నగా భావించే కిషోర్‌కుమార్‌ను కలవా లని 1979లో ముంబయి వెళ్లారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్‌డీ బర్మన్‌ ఆధ్వర్యంలో సినిమా పాటల రికార్డింగ్‌ చేస్తున్న సమయంలో దీర్ఘ నిరీక్షణ తర్వాత కిషోర్‌ను కలిశారు. తాను రాజమహేంద్రవరం నుంచి వచ్చానని చెప్పారు. ఆ ఊరెక్కడుందని కిషోర్‌ అడిగారు. వహీదా రహమాన్,  జరీనా వహాబ్, జయప్రదల ఊరు అదేనని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. కిషోర్‌కుమార్‌ పాడిన పంటూస్‌ సినిమా లోని ఓ పాట పాడి వినిపించడంతో అచ్చం తనలాగే పాడుతున్నావంటూ ఆయన అభినందించడం నేటికీ తనకు సంతోషం కలిగిస్తుందంటారు జిత్‌.

అభిరుచి.. ఉత్సాహం
వయసు పెరిగినా ఆయనలో పాట ఉత్సాహం ఏమాత్రం సన్నగిల్లలేదు. ఆ గొంతులోనూ తేడా కనిపించదంటారు అభిమానులు. ఇప్పటికీ ఆర్కెస్ట్రా ద్వారా వేదికలపై గళం వినిపించడంలోనే ఆనందపడుతుంటారు. సంపాదన యావ ఏమాత్రం లేదు. కేవలం అభిరుచి మాత్రమే. అదే ముందుకు నడిపిస్తోంది. ‘2005లో జరిగిన మా ఆర్కెస్ట్రా స్వర్ణోత్స వాల వేడుకకు విశ్వనాథ్‌లాంటి రావడం ఎప్పటికీ మరువను. ఇప్పటి వరకూ 6 వేల ఆర్కెస్ట్రాలు ప్రదర్శించాం’ అని జిత్‌మోహన్‌మిత్ర చెప్పారు.

తెర మీద..
న్యాయవాదిగా ఉంటూ, ఓపక్క ఆర్కెస్ట్రా నడుపుతూ, మరోపక్క సినిమాల నిర్మాణానికి తెరవెనుక పాత్ర పోషించే జిత్‌మోహన్‌ తెరముందుకు కూడా వచ్చారు. చిన్న పాత్రలే అయినా తనకు గుర్తింపు తెచ్చాయంటారాయన. విశ్వనాథ్‌ దర్శకత్వంలోని సప్తపదిలో ‘గోవుల్లు తెల్లన.. గోప య్య నల్లన.. గోధూళి ఎర్రన’ పాటలో ఓ పాప ను (ఆయన కుమార్తె సుబ్బలక్ష్మి) భుజాన ఎత్తు కుని సాగే సన్నివేశంలో కనిపించింది ఈయనే.

మిత్ర తన కుమార్తెతో కలిసి ఆ పాటకు అభినయించారు. బాపు, కె.విశ్వనాథ్, బాలచందర్, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటించారు. శంకరాభరణం, సప్తపది, ఆనందబైరవి, చంటి, స్వాతికిరణం, సిరివెన్నెల, బొబ్బిలి బ్రహ్మన్న, మేఘసందేశం, సీతారత్నం గారి అబ్బాయి, సర్‌గమ్, సర్‌ సంగమ్‌ వంటి సుమారు 210  సినిమాల్లో నటించారు. రాజమహేంద్రవరం నేపథ్యంలోని 400 సినిమాలకు షూటింగ్‌ స్పాట్ల సహాయకుడిగా ఉన్నారు. ప్రముఖ సినీ నటుడు అలీ తెరంగేట్రం వెనుక కీలక భూమిక మిత్రాదే. జిత్‌ కుమార్తె సుబ్బలక్ష్మి తరువాత కూడా పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. 

·    జిత్‌కు జీవిత సాఫల్య పురస్కారం


రాజమహేంద్రవరం కల్చరల్‌ :


తన స్వరంతో ఆరు దశాబ్దాలుగా అలరిస్తున్న శ్రీపాద జిత్‌ మోహన్‌ మిత్రా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. గాయకుడిగానే కాక నటుడు, క్రీడాకారుడు, న్యాయవాదిగా సేవలందించిన ఆయనకు నవరస నటసమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో రొటేరియన్‌ పట్టపగలు వెంకటరావు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఇతర ప్రముఖులు పురస్కారాన్ని అందించారు. ఆరు దశాబ్దాలకు పైగా తన పాటలతో కళాభిమానులను అలరిస్తున్న జిత్‌.. భవిష్యత్‌లో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ముందుగా జిత్‌ మోహన్‌మిత్రా ఆర్కెస్ట్రా తరఫున గాయకులు సినీ గీతాలను ఆలపించారు. చిన్నారి షైలిక పాత్రో కూచిపూడి నృత్యం అలరించింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ ఎస్‌.శివరామసుబ్రహ్మణ్యం, శ్రీపాద కుమారశర్మ, రుంకాని వెంకటేశ్వరరావు, మధు ఫామ్రా, అశోక్‌ కుమార్‌ జైన్, ఎస్‌బీ చౌదరి, మహ్మద్‌ఖాదర్‌ ఖాన్, గుమ్మడి సమర్పణరావు, బొడ్డు బుల్లెబ్బాయి పాల్గొన్నారు. జిత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని పట్టపగలు కోరారు. ఆనం కళాకేంద్రం అద్దెలు తగ్గించాలని పలువురు కోరగా ఈ మేరకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామని గోరంట్ల చెప్పారు. 

  సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-22-ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -309

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -309

· 309-పోస్ట్ గ్రాడ్యుయేట్ ,టీచర్ ,గణపతి టివి సీరియల్ ఫేం ,అనంతాపురం సినిమాతో సినీఅరంగేట్ర౦ చేసిన –ఢిల్లీ రాజేశ్వరి

· ల్లీ రాజేశ్వరి తెలుగు సినిమా నటి. ఈమె దేశ రాజధాని ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల ఢిల్లీ రాజేశ్వరిగా సినిమా రంగంలో పిలువబడుతూ ఉంది. స్నాతకోత్తర విద్యను అభ్యసించిన రాజేశ్వరి నృత్యాన్ని అభ్యసించింది. ఈమె తండ్రి మల్లేశ్వరశర్మ, తల్లి హైమవతి. నటిగా మారక ముందు ఈమె అస్సాంలో ఉపాధ్యాయినిగా పనిచేసింది. ఈమె శేషసాయిప్రసాద్‌ను వివాహం చేసుకుని రాజమండ్రి సమీపంలోని కొత్తపేట గ్రామంలో స్థిరపడింది. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు .

నటిగా
ఈమె మొదట దూరదర్శన్‌లో గణపతి సీరియల్‌లో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వెలువడిన అంతఃపురం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.

ఈమె నటించిన చిత్రాల జాబితా:

  1. అంతఃపురం
  2. సముద్రం
  3. ఇంద్ర
  4. చిత్రం
  5. నువ్వే కావాలి
  6. ఢీ
  7. ఖుషీ ఖుషీగా
  8. చక్రం
  9. మా ఆయన సుందరయ్య
  10. మంత్ర 2
  11. కలెక్టర్ గారి భార్య
  12. కలవరమాయే మదిలో
  13. ఓనమాలు
  14. ఈ వర్షం సాక్షిగా
  15. ఒక్కడినే
  16. అవును
  17. దండు
  18. కాంట్రాక్ట్
  19. నమో వెంకటేశ
  20. గొడవ
  21. నందీశ్వరుడు
  22. సారొచ్చారు
  23. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
  24. డాన్ శీను
  25. తూనీగ తూనీగ
  26. మాయగాడు
  27. వాడే కావాలి
  28. పరుగు
  29. ధన 51
  30. వెంకీ
  31. ప్రేమాయనమః
  32. వసంతం
  33. నిన్నే ఇష్టపడ్డాను
  34. ఉత్సాహం
  35. నీతో
  36. మౌనమేలనోయి
  37. ఫ్రెండ్స్
  38. ప్రియనేస్తమా
  39. ప్రేమకు స్వాగతం
  40. ఇష్టం
  41. ఆనందం
  42. చెప్పాలని ఉంది
  43. డార్లింగ్ డార్లింగ్ (2001)
  44. రామ్మా! చిలకమ్మా
  45. యువరాజు
  46. పెళ్ళి సంబంధం
  47. అల్లుడుగారు వచ్చారు సరదా ముసలి వేషాలతో అలరిస్తోంది
    సశేషం
    మీ –గబ్బిట దుర్గాప్రసాద్-31-7-22-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -308 • 308-‘’ఏమైందీ వేళ’’లో సినీ అరంగేట్రం చేసి నండీ అవార్డ్ పొంది , తమిళమలయాలలో హీరోయిన్ అయి తల్లిపాత్రలతో రాణిస్తున్న –ప్రగతి

 మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -308

· 308-‘’ఏమైందీ వేళ’’లో సినీ అరంగేట్రం చేసి నండీ అవార్డ్ పొంది , తమిళమలయాలలో హీరోయిన్ అయి తల్లిపాత్రలతో రాణిస్తున్న –ప్రగతి ·

· తెలుగు సినీ నటి.[1] ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది.[2]

జీవితం
ఆమె హైదరాబాదులో పుట్టి పెరిగింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లికి సాయంగా ఉండటం కోసం కార్టూన్ పాత్రలకు గాత్రదానం చేసేది. చెన్నైలో స్థిరపడింది.[3]

కెరీర్
ప్రగతి కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉండగా చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనల్లో కనిపించింది. ఆ ప్రకటన చూసిన తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా వీట్ల విశేషంగాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు.[3] రెండు సంవత్సరాల పాటు ఏడు తమిళ సినిమాలు, ఒక మలాయళం సినిమాలో నటించింది. తరువాత వివాహం కావడంతో నటనకు కొద్దిరోజులు విరామం తీసుకుంది. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మూడు భాషల్లో టీవీ సీరియళ్ళలో నటించడం మొదలు పెట్టింది.

సినిమాలు
· బాబీ[4]

· నేనుసైతం (2004)

· చిరుత 2007

· నువ్వే నువ్వే

· నువ్వు లేక నేను లేను

· కందిరీగ

· దూకుడు

· డమరుకం

· నిప్పు (2012)

· నా ఇష్టం (2012)

· బాడీగార్డ్

· బద్రీనాథ్

· రేసుగుర్రం

· బృందావనం

· బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)

· బెంగాల్ టైగర్

· ఏమైంది ఈవేళ

· బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ (2013)

· దళం (2013)

· ప్రియతమా నీవచట కుశలమా (2013)[5]

రోమియో (2014)[6]
లక్ష్మీ రావే మా ఇంటికి (2014)[7]
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (2015)
సౌఖ్యం (2015)[8]
కేరింత9
కళ్యాణ వైభోగమే (2016)
శంకర (2016)[10]
ఇంట్లో దెయ్యం నాకేం భయం (2016)[11]
రాధ (2017)
ప్రేమతో మీ కార్తీక్ (2017)
ఓయ్ నిన్నే (2017)
అర్జున్ సురవరం (2019)
90ఎంల్ (2019)
మార్షల్ (2019)
మా వింత గాధ వినుమా (2020)
డిజె టిల్లు (2022)
సూపర్‌ మచ్చి (2022)
ఎఫ్ 3
· చక్కని నవ్వు ముఖం క్షణాలలో మార్చే ముఖకవళికల తో ,అపేక్ష పాత్రలకు జీవం పోస్తున్న ప్రగతి బాగా రాణిస్తోంది .

· సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-21-ఉయ్యూరు

–image.png

Posted in సినిమా | Tagged | Leave a comment

చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు -2(చివరి భాగం )

చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు -2(చివరి భాగం )
లక్ష్మీ నారాయణ రెడ్డి ధూర్జటి రచనలలో సమకాలీనతను పసిబిడ్డలస్నానం ,బాలింతతాంబూల సేవనం మొదలైన వాటిలో దర్శించి –‘’తలబంకించిన నూనె- పుక్కిట సదా తామ్బూలమున్ ,నేత్ర క –జ్జలమున్ గంధరకట్టుకొన్న వసపూవుల్ గబ్బి పాలుబ్బు –‘’అంటూ ధూర్జటి దృష్టి ‘’ఎప్పుడూ అక్కడే ఉండే’’ విషయం కూడా గుర్తు చేశారు .బిడ్డ పుట్టాక వాడికి దంతాలువచ్చేదాకా సంయోగం నిషేధం .అలాగే దిష్టి అనే దృష్టి దోషం అప్పటినుంచి వెంటబడుతూనే ఉంది .పంటలకు దిష్టి తగలకుండా ధూర్జటి దిష్టి కుండలు పెట్టించాడు . ఎలిజబెత్ ‘’రఘునాధ రాయలు ‘’పై సమగ్రంగా రాస్తూఆయన కున్న లక్ష్మీ విలాస ,రామ సౌద సభాభవనాలగురించి చెప్పి ,అతడు చాలా రచనలు చేసినట్లు తెలుస్తోందని ,కృష్ణాధ్వరి, వెంకట ముఖి ,దీక్షితుడు,క్షేత్రయ్య చౌడప్ప వంటి కవి రాజ పోషకుడని ,అతని సంగీత సుధ ఆయన సంగీత నిధి అని తెలుపుతోంది ,జయన్తసేన ,రామానంద రాగ సృష్టికర్త మాత్రమేకాక ‘రఘనాథమేళ ను కూడా సృష్టించిన సృజనశీలి .దక్షిణాంధ్ర స్వర్ణ యుగ సృష్టికర్త .అతనికొలువు లో’’ శారదా ధ్వజం ‘’నిరంతరం ఎగురు తు౦దనిచెప్పటం మర్చిపోయినట్లున్నారు .శ్రీ చంద్రావళి త్యాగయ్య కీర్తనల భక్తి తత్పరత లో ‘’నీ పద చి౦తనమే జీవనము ‘,నిష్కామ శ్రవణ స్మరణ విశిష్టత ,నవ విధ భక్తులు ఆయన కీర్తనల ద్వారా వివరించారు .’’దుడుకుగల నిన్నే ‘’లో తనలోని దుర్గుణాలగురించి చింతించి ,’జగదానంద కారక ‘’లో శ్రీరాముని అష్టోత్తర శతనామావళి ని అర్చన రూప కృతిగా రచించి ముక్తికి భక్తి అత్యన్తముఖ్యమని చాటి చెప్పాడు .సనత్కుమార్ విశ్వనాథ లఘు కావ్యాలను వివరిస్తూ ఆయనలోని కవి నిత్యజాగారితుడు,భ్రష్టయోగి అని కీర్తించారు.
కిట్టన్న సినారె గేయకావ్యాలపై సమాలోచనం చేసి ,ఆయన విశ్వ గీతి విశిష్టత చెప్పి కర్పూర వసంతరాయలులో నాటకోచిత సంభాషణలతో రక్తికట్టిన్చారని ,లకుమలోని సహృదయత సౌన్దర్యానికిసరి సాటి అన్నారు .రాజేశ్వరి కర్నాటక తెలుగు సాహిత్య కృషినితవ్వి తలకెత్తారు .కర్నాటక తెలుగు సాహిత్య విభజన చేసి ,చిన్నయసూరికి వీరేశలింగం గారికి మంచి స్నేహం ఉండేదని ,నంజన గూడు ,పాతవల్లి కవులు ప్రసిద్ధులని ,బళ్ళారి తెలుగు పంట ను వర్ణించి ,గుత్తి చంద్ర శేఖరరెడ్డి ముకుందరామారావు గారి ‘వలసపోయిన మందహాసం ‘ను కన్నడీకరించారని చెప్పారు ఆయనను ‘’గుత్తి జోలద రాసి చంద్ర శేఖర రెడ్డి ‘’అనే ఆయనకిష్టమైన పేరు చెప్పటం మరచినట్లున్నారు .నాకు మంచి మిత్రులుకూడా వారు .చిలకల సుబ్బారెడ్డి వేమన కాల నిర్ణయం చేశారని ,వేటూరి ఆనందమూర్తి ,తుమ్మపూడి కోటేశ్వరరావు లబ్దా ప్రతిష్టులు .ప్రాచార్య రాళ్ళపల్లి సుందరం తమ తల్లి పేర నెలకొల్పిన ‘సౌశీల్య’’పురస్కారం బెజవాడలో రజనీ కాంతారావు గారికి అందించారని మనం మర్చిపోయిన విషయం గుర్తు చేశారు .బెంగళూరు యూని వర్సిటి తెలుగు శాఖాధ్యక్షులు త౦గరా సుబ్బారావు గారు ‘’తెలుగు వీరగాథా కవిత్వం ‘బృహద్గంథ రచయిత .శ్రీరస స్థాపించి తెలుగు సాహిత్య రసాన్ని బహు సంపన్నంగా ప్రవహిమ్పజేశారు .కర్నాటక తెలుగింటి ఆడపడుచులు అత్తిమబ్బే బెలగరే జానకమ్మ తిరుమల రాజమ్మ ,దివాకర్ల రాజేశ్వరీ ,భార్గవీరావు సేవ నిరుపమానం .తెలుగు దినపత్రికల కార్యాలయాలు కర్నాటక లో ఉండి మంచి సేవ చేస్తున్నాయి .బెంగుళూరు ఆకాశవాణి ,స్నేహభారతి లలో తెలుగు సాహిత్యం అగ్రస్థాయిలో ఉందని తెలియజేశారు .2012లో మేము బెగులూరు మా అబ్బాయి శర్మ ఇన్తికివెల్లిఅనప్పుదు మైనేని గారు ఆయన ఫోన్ నంబర్ ఇస్తే మాట్లాడాను ఎంతో సహృదయత చూపారు .ఆతర్వాత వారిపుస్తాలు నాకు పంపితే మన పుస్తాకాలు వారికి పంపాను
ఉత్కళ దేశం లో ఉంటూ తెలుగు సాహిత్యాన్ని మూడు పూలు ఆరు కాయలుగా వికసి౦ప జేసిన తుర్లపాటి రాజేశ్వరి గారు ‘పలుకు తల్లికి పుట్టినిల్లు బరంపురం లో జయంతి కామేశ్వర రావు తెలుగు సాహితీ సౌరభాలు వ్యాపింపజేశారని ,దేశిరాజు వెంకటక్రిష్ణారావు తొలి తెలుగు అపరాధ పరిశోధక నవలా రచయిత అనీ .మామడమ్మ సుభద్ర ఆధ్యాత్మిక రామాయణం ద్విపద కావ్యంగా రాసిందనీ ,సాహిత్య సామ్రాట్ విక్రమ దేవ వర్మ ,మంత్రి ప్రగడ సూర్య ప్రకాశ కవి ఎనలేని సాహితీసేవ చేశారనీ ,గిడుగు సీతాపతి ,భట్టిప్రోలు కృష్ణమూర్తి సేవ ప్రస్తుతించారు ,తుర్లపాటి రాజ రాజేశ్వరి వివిధ ప్రక్రియలలో డజనున్నర పుస్తకాలు రాశారు. ‘’ఒరిస్సాలో తెలుగు వారి మూలాలు’’ గ్రంథం ఆమె బహుముఖీన ప్రతిభకు నిదర్శనం మాగ్నం ఓపస్ .ఉపద్రష్ట అనూరాధ ,విజయ చంద్ర ,సింగి శెట్టి అనంద రావు పట్నాయక్ అన్ని ప్రక్రియలలో రాస్తూ తెలుగును పోషిస్తున్నారు అని ‘’ఉత్కలాంధ్ర సాహిత్యం ‘’లో వివరించారు .
అమరేంద్ర ఢిల్లీ సాహిత్యాన్నిస్తాలీ పులాకంగా స్పృశించారు .ముఖ్యంగా అక్కడ జరిగిన తెలుగు సభలు సమావేశాలపైన బాగా రాశారు .ఉప్పలధడియం వెంకటేశ్వర ‘’చెన్నై లో పాతి కేళ్ళ తెలుగు ప్రస్థానం ‘’లో 19శతాబ్ది నుంచి ఇక్కడ తెలుగు పండితకవులకు నిలయం .ఆలూరి అప్పకవితంజావూర్ తులజెంద్రుని ఆస్థానం లో ఉంటూ ‘’పార్ధ సారధి విజయం ‘యక్షగానం రాసి మద్రాస్ లోని పార్ధ సారధి స్వామికి అంకితమిచ్చాడు .పానకాల రాయకవి పార్ధ సారధి శతకం ,మతుకుమిల్లి నరసింహ శాస్త్రి చెన్నపురీ విలాసం రాశారు.ఆతర్వాత చిన్నయసూరి ఆరుద్రశ్రీశ్రీ పఠాభి కృష్ణ శాస్త్రి ,పిలకా మొదలైన తెలుగు సత్కవులంతా అక్కడి నుంచే కవితా పరిమళాలు వ్యాపింపజేశారు .కొక్కొండ ,రావూరి దొరస్వామి ,అష్టభాషా ప్రవీణ పిబి శ్రీనివాస్ ,అవధాని పప్పు వారు సాహిత్యాన్ని డోలికలలో ఊపారు.పాతికేళ్లలో కావ్యాలు తక్కువే వచ్చాయి .చెన్నైలో సభలు బాగానే జరుగుతాయికాని ‘’సభలకేమి కొరత సభ్యులకేగాని ‘’అని బాధ పడ్డారు .పళని వేలు సూరి సారస్వత సేవ లో తరించారు అత్య౦త విస్తృతంగా రాసి .సిమ్మన్న గారు ‘’గిడుగు భాషా సేవ ‘కు నీరాజనాలెత్తారు .’చిలుకూరి నారాయణ రావు సాహితీ వరివస్య ‘’ జీస్ మోహన్ చక్కగా వివరించారు .రాళ్ళపల్లి వారి గురించి ‘’రాళ్ళపల్లి లోన రాళ్ళేన్ని పుట్టెనో-రాళ్ళ లోపల వజ్జరాలు పుట్టే –వజ్జరాలలోన వలపెట్లు పుట్టెరా –కీర్త నీయచరిత కృష్ణ శర్మ ‘’అని ఆచార్యులవారిబహుముఖీన ప్రతిభకు దర్పణం పట్టారు .అనంతపురం బుక్కరాయ సముద్రం చెరువుకు సంబంధించిన ..ముసలమ్మ’’పదం చిలుకూరి వారి అపూర్వ సృష్టి .గురజాడ పూర్ణమ్మను పోలి ఉన్న విషాద గీతం .’’ఓరిమి ,పరిశ్రమ పేరిమి-ప్తతిభా వ్యుత్పత్తుల నేరిమి కలిసి చిలుకూరి నారాయణ రావు ‘’అన్న మధునాపంతుల వారి మాటలు అక్షర సత్యాలు .
అనంత పద్మనాభరావు గారు కుందూరి ఈశ్వరదత్తు లోని చారిత్రిక పరిశోధకుడిని ఆవిష్కరించారు .ఆయన రాసిన ‘’శాసన శబ్ద కోసం ‘’అనర్ఘ మణిరత్నం .జీర్ణ విజయనగర చరిత్ర బహు ప్రామాణిక గ్రంథం . తిరుమలవారి పుత్రికలు నీరజ ,ఆముక్తమాల్యద తమ తండ్రి రామ చంద్రగారి వాజ్మయ తపస్సును ఆయన శైలిలోనే కమ్మగా ఆవిష్కరించారు .జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య గారిపై చలపాక వ్యాసం వివరణాత్మకంగా ఉంది ‘’నేను చనిపోతే జాతీయ పతాకాన్ని కప్పి స్మశానానికి తీసుకు వెళ్ళండి ‘అని ఆయన చెప్పిన మాట కలకాలం గుర్తు ఉంటుది .తెలుగు పత్రికార౦గ సమీక్షలో సునీత ‘’ఫోర్ట్ సెంట్ జార్జి గెజెట్ ప్రకటనల పత్రికే .తెలుగు పత్రికకాదు.1883లో వృత్తాంత్రి ,తో తెలుగు పత్రిక ఆవిర్భావం జరిగింది .పువ్వాడ వెంకటరావు వర్తమాన తరంగిణి వచ్చింది .చిల్లర భవానీదేవిగారు ‘’తెలుగు రచనలకు హిందీ అనువాదాలు ‘’అనే వ్యాసం లో పోతనగారి భాగవతం లోని నాలుగు అంశాలను ‘’భాగావత పరిమళ ‘’గా పి.ఆదెశ్వర రావు అనువదించారని ,త్యాగరాజకీర్తనలను ఇలపావులూరి వారు అన్నమయ్య పదాలను సి .హెచ్ రాములు ,సుమతీ శతకపద్యాలను సుంకర చెంగయ్య దోహాలుగా ,,మధునాపంతులవారి ఆంద్ర పురాణాన్ని చేబోలు శేషగిరిరావు ,కుందుర్తి కవితలను నిర్మలానంద వగైరా ,ఆరుద్ర సినీ వాలీని బాదరవాడ నరెంద్రవర్మ శ్రీ శ్రీ మహాప్రస్థానం ను గుర్రం సుబ్బారావు ,బాపిరాజు నారాయణరావు ని ఆరికపూడి రమేష్, భరద్వాజ కౌముదిని బాలశౌరి రెడ్డి మొదలైన వారుఏయే పేర్లతో అనువదిన్చారో విస్తృత పట్టిక లో తెలిపారు .జానపద సాహిత్యం ఎందుకు చావాలి అని దామోదర్ రా స్తూ వివిధ కోణాలలో పరిశోధించాలన్నారు .నీలిమ ‘’కూచిపూడి నాట్యకళ ‘’పై అరంగేట్రం చేసి సమసమాజ పోకడలను గమనించి ,ప్రోత్సాహిక అంశాలతో ముందుకు సాగితేనే కూచిపూడి కళ మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లు తుంది అని హితవు చెప్పారు .నాటక రంగం ‘’అజరామారం ‘’అన్నారు మునిరత్నం తనకున్న విశేష ప్రజ్ఞా పాటవాలతో .ఎవరినా అందుంకు నడుం బిగించి పోషిస్తే నాటక కళ చిగురిస్తుందని ఆశాభావం వ్యక్త పరచారు .ఆంద్ర సాహిత్య పరిషత్ లో మణిబాబు విద్వాన్ పీసపాటి విశ్వేశ్వర శాస్త్రి రజతోత్సవ సందర్భంగా చేసిన ‘’శ్రీ జయంతి కులాబ్ధి శీతభానుడు ‘’పద్యం గుర్తు చేసి సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణం ,శ్రీపాద ,కాశీ భట్ట బ్రహ్మయ్య బండారు తమ్మయ్య ,దంటు భాస్కరరావు గార్ల అశేష విశేష సాహితీ సేవలను మన కళ్ళముందుంచారు .దాని పునర్వైభవానికి ,సృజనకు ప్రచారం అవసరం అన్న సత్యం ఎరుకపరచారు .
ఇలా విస్తృత కేన్వాస్ పై తెలుగు సాహిత్యాన్ని దిగ్మాత్రంగా పరిచయం చేసి మన ముందుంచారు చెన్నై జనని లో .అందరినీ పేరుపేరునా అభినదిస్తూ ,ఇంతటి ఉత్కృష్ట గ్రంధాన్ని ప్రచురించే సాహసం చేసి కృతకృత్యులైన గుడిమెట్ల చెన్నయ్యగారిని మరీ మరీ ప్రశంసిస్తూ ,ఆశవత్దామ సంగీతంగా పరమ రామణీయకంగా ఆస్వాదనీయంగా ఉందని తెలియజేస్తున్నాను .ఇలాంటి రచన పై నన్ను అభిప్రాయం రాయమని కోరిన చెన్నయ్యగారి సహృదయత.నాకు దక్కిన విశిష్ట గౌరవం అంటూ నమోవాకాలర్పిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-22-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

భారతీ నిరుక్తి .22వ భాగం.27.7.22

భారతీ నిరుక్తి .22వ భాగం.27.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

వాగ్గేయ కారుడు టైగర్ వరదాచారి

టైగర్ వరదాచారి (1876–1950) తమిళనాడుకు చెందిన కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు.

ఆరంభ జీవితం
వరదాచారి మద్రాసు ప్రెసిడెన్సీ, చెంగల్పట్టు జిల్లా కొలత్తూర్ గ్రామంలో 1876, ఆగష్టు 1వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి కందాడై రామానుజాచారి తెలుగు,తమిళ, సంస్కృత పండితుడు. తల్లి కళ్యాణి అమ్మాళ్.

మసిలమణి, పెద్ద సింగరాచార్యుల ప్రోద్బలంతో ఇతడు సంగీతాన్ని అభ్యసించాడు. ఇతడు తన 14వ యేట పట్నం సుబ్రమణ్య అయ్యరు వద్ద చేరి మూడు సంవత్సరాలు సంగీతాభ్యాసం చేశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇతడు కాలికట్ లో సర్వే డిపార్టుమెంట్‌లో నెలకు 12 రూపాయల జీతంతో ఉద్యోగానికి చేరాడు. ఉద్యోగం చేస్తూనే ఇతడు తన సంగీతం పట్ల ఉన్న మక్కువను పెంచుకోసాగాడు. మైసూరులో ఉన్నప్పుడు మైసూర్ మహారాజు కృష్ణరాజ ఒడయార్ దృష్టిలో పడ్డాడు. మహారాజు ఇతనికి “టైగర్” బిరుదును, “తోడా”ను ప్రదానం చేశాడు.

ఇతడు చాలా కాలం సేలం జిల్లా (ప్రస్తుతం కృష్ణగిరి జిల్లా) కావేరీపట్నంలో నివసించాడు. ఇతడు కావేరీపట్నం పెరియార్ వీధిలో నివసించిన ఇల్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.

ఇతని కుటుంబ సభ్యులకు సంగీతంలో ప్రావీణ్యం ఉంది. ఇతని తండ్రి రామానుజాచారి సంగీతం గురించి ప్రసంగాలు చేశాడు. ఇతని సోదరుడు కె.వి.శ్రీనివాస అయ్యంగార్ సంగీతశాస్త్ర ప్రవీణుడు. మరొక సోదరుడు కె.వి.కృష్ణమాచారి వీణ విద్వాంసుడు. వరదాచారి తన సోదరి నుండి పాటలు పాడటం గురించి ఎక్కువగా నేర్చుకున్నాడు.[1][2] ఇతడు మద్రాసు సంగీత అకాడమీ నిర్వహిస్తున్న సంగీత అధ్యాపకుల కాలేజీకి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. ఆ పదవిలో 5 సంవత్సరాలు గడిపిన తరువాత ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం సంగీత శాఖకు అధిపతిగా, అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. చివరకు “కళాక్షేత్ర” సంగీత విభాగానికి ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.

సంగీతం
వేగవంతమైన సంగతులు పాడటం ఇతని ప్రత్యేకత. ఇతడు మంచి వాగ్గేయకారుడు కూడా. ఇతడు గీతాలు, వర్ణాలు, కృతులు ఎన్నో రచించి సంగీత ప్రపంచానికి అందించాడు. 1.1948లో చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ హోదాలో “కళాక్షేత్ర”ను సందర్శించినప్పుడు ఇతడు “ఈ దినమే సుదినము” అనే కృతిని స్వరపరిచి పాడాడు. 2.రుక్మిణీదేవి అరండల్ జన్మదినం సందర్భంగా “వందనము నొనరించి” అనే వర్ణాన్ని వాచస్పతి రాగంలో కూర్చాడు.
శిష్యులు
ఇతని శిష్యులలో పేర్కొన దగిన కొంత మంది:

జి.ఎన్.బాలసుబ్రమణియం
ఎం.డి.రామనాథన్
పురాణం పురుషోత్తమశాస్త్రి
సంధ్యావందనం శ్రీనివాసరావు
అశ్వత్థామ
బి.వి.రామన్ , బి.వి.లక్ష్మణన్
పురస్కారాలు
1932లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి సంగీత కళానిధి పురస్కారం ప్రదానం చేసింది.

మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-22-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.19వ భాగం.26.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ.19వ భాగం.26.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు

చెన్నై తెలుగు తల్లి (జనని )కి పాతికేళ్ళు

 నిండిన సందార్భంగా ఆ సాహితీ సంస్థ ‘జనని ‘’రజతోత్సవ సంచికను 43వ్యాసాలతో 452పేజీలతో బృహత్తరంగా సర్వాంగ సుందరంగా అర్ధవంతమైన తెలుగు రచయితల ముఖ చిత్రం 28-5-2022 న శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారి రూపకల్పన , డా ఉప్పలధడియం వెంకటేశ్వర గారి సంపాదకత్వం లో వెలువరించి  ,కార్యదర్శి శ్రీ చెన్నయ్య గారు నాకు పోస్ట్ లో 8-6-22న పంపగా , అందగా వెంటనే తెలియజేశాను   .సరసభారతి సాహితీ పుష్కరోత్సవం హడావిడిలో పుస్తకం చదవలేదు నాలుగు రోజుల క్రితం ఆయనే వాట్సాప్ లో గుర్తు చేసి హోసూరు బస్తీ యువక బృందం డా వసంత ఆధ్వర్యం లో శ్రీ ప్లవ ఉగాదికి తెచ్చిన కవితా సంకలనం లో వారి కవిత్వం పై నేను రాసినవిషయం గుర్తు చేసి ,జనని పైన కూడా నా అభి ప్రాయం రాయమని ఆశతో ఎదురు చూస్తు౦టాననితెలియజేయగా ,అప్పటికి ఇంకా చదవలేదని,నాలుగు రోజులలో చదివి వ్రాస్తాననీ తెలియ జేసి ,గడువుపూర్తికాకుండానే ఇవాళే చదివి రాస్తున్నాను .చెన్నయ్యగారిని ఉయ్యూరు సభలకు ఆహ్వానించమని  వరంగల్ నుంచి శ్రీ టి.రంగస్వామి గారు మెయిల్ లో తెలియ జేస్తే ,వారినే ఫోన్ నంబర్ రాయమని చెప్పి ఆయన పంపగా మాట్లాడి ఆహ్వానించాను .అప్పుడే హోసూరు విషయం జ్ఞాపకం చేశారు .చెన్నయ్యగారిని మా సరసభారతికి ఆహ్వానించి విశిష్ట సాహితీ  పురస్కారం  అందజేయటం మా సంస్థ పొందిన గొప్ప అదృష్టం .చాలాసాదాసీదాగా ఉండే వారు ఇంతటి బృహత్తర సాహితీకార్యక్రమాలను మద్రాస్ నడి బొడ్డున నిర్వహిస్తున్నారంటే వారి దీక్ష దక్షత తపన అర్ధమవుతోంది .చెన్న అంటే మంచి లేక సుందరమైన అని అర్ధం వారి మనసు బహు సుందరమైనది అని అందుకే సార్ధక నామధేయం అని అనిపిస్తుంది .వారింటి పేరు గుడిమెట్ల .ఈపేరు వినగానే సినీ సంగీత దర్శకుడు గుడి మెట్ల అశ్వత్ధామ గుర్తుకు వస్తాడు నాకు ఆయన దేవాంతకుడు సినిమాలో ఆరుద్ర గీతం ‘’ఎంత మధుర సీమా ,ప్రియతమా ‘’కు చేసిన స్వర రచన ముగ్ధులను చేస్తుంది ఆ సినిమా ఆపాట ఎన్నో సార్లు చూశాను విన్నాను .నేను ఆయన సంగీతాభిమానిని .అలాగే  నా దృష్టిలో ఆయన’’ మాగ్నం ఓపస్ ‘ ’సినిమా  ‘’చివరకు  మిగిలేది ‘’ అన్నా మహా ఇష్టం ఆసినిమా కూడా నా దృష్టిలో ఆల్ టైం క్లాసిక్ పిక్చర్ .ఇదంతా గుడిమెట్ల పేరు తెచ్చిన అనుభూతి .చెన్నయ్యగారి గురించి పెద్దగా నాకు ఇప్పటిదాకా తెలియక పోవటం నా అజ్ఞానం .ఉప్పలధడియంగారితో మంచి పరిచయమే ఉంది .నాలుగేళ్ళక్రితం ఆయన్ను ఆహ్వానించి సత్కరించాం. ఆయన పుస్తకాలన్నిటికీ సమీక్ష రాశాను కూడా .ఇక ప్రస్తుతానికి వస్తాను .

    ఈ సంచికలో వ్రాసిన రచయితలంత బాగా సాహితీ సుప్రసిద్దులే .దాదాపు అందరూ  డాక్ట రేట్  లే .ఇలాంటి రచనలు వారందరికీ నల్లేరు పై నడకే . దాడాపుంని రచనలు అన్నీ పూర్వసాహిత్యం గురించి ఆకవులగురించే ఉన్నాయి .అందుకని ఇది ‘’పూర్వాంధ్ర సాహిత్య లఘు సర్వస్వం ‘’అని పించింది .రచయితలందరూ తమరచనలతో సంచికను సుసంపన్నం చేశారు .రిఫెరెన్స్ పుస్తకంగా సంచిక తయారైంది .తరతరాలు దగ్గర ఉంచుకొని మళ్ళీ మళ్ళీ చదవాల్సిన రచనలే   ఆస్వాది౦చ తగిన దగిన అంశాలే .వారందరి కృషికి ,వారందరినీ ప్రోత్సహించి రాయించిన చెన్నయ్యగారి దీక్ష కు అభినందన మందారాలు .ఇంతటి విజ్ఞాన పయః పారావారం లో ఎన్నని రత్నాలు వెతకగలం ?త్రవ్వినకొద్దీ లభిస్తాయి.దిగినకొద్దీ ఆనంద మధురాను భూతియే పొందగలం . ఇంత భారీ పుస్తకం పై అభిప్రాయం రాయాలంటే ఇంతకు  మించిన పుస్తకం అవుతుంది .కనుక నా చూపులో  పడిన, నాకు దొరికిన రత్నమాణిక్యాలవంటి విషయాలు మాటలు అభిప్రాయాలు సేకరించి మీకు అందించే పని చేస్తున్నాను .

  తెలుగు భాషా సాహిత్య సంస్కృతీ త్రివేణీ సంగమం లా సంచిక తెచ్చినట్లు ఉప్పలధడియం చెప్పిన మాట సంపూర్ణ సత్యం 1993గురు పూర్ణమినాడు పురుడుపోసుకున్న  జనని –సాంఘిక సాంస్కృతిక సమితి ‘కి మంగళారతులు అద్దారు భువన చంద్ర .నేటి యువతరానికి విషయ వివేకం అధికం గురువు మంచి చెడ్డలు తెలుసుకోనేహక్కు వారికిఉంది కనుక వారి బుద్ధిగరిమకు దాన్ని వదిలి పెట్టాలి ఉపాధ్యాయులు అని అందరికీ హిత బోధ చేశారు పుల్లూరి ఉమా .అద్దంకి శ్రీనివాస్ తెలుగు లక్షణ గ్రంథాలపై విపరీత శ్రమ చేసి గొప్ప వ్యాసం రాసి ,సమగ్ర తెలుగు నిఘంటువు నిర్మించాలని కోరారు .కప్పి చెప్పేదికవిత్వం అయితే విప్పి చెప్పేది విమర్శ .దీన్ని సంపన్నం చేసినవారు డా జివి సుబ్రహ్మణ్యం గారు ,ఇప్పుడొస్తున్న కొత్త భావ వ్యక్తీఅరణ సాధనాలైన ఫేస్ బుక్ వాట్సాప్ లో వచ్చేసాహిత్యాన్నీ అధ్యయనం చేయాలన్నారు మండవ సుబ్బారావు .రంగస్వామి ఉదాహరణ వాజ్మయాన్ని చాలా సోదాహరణంగా వివరించారు .తంజావూర్ నాయకరాజులలో సాహిత్య ప్రముఖుడు విజయరాఘవ నాయకుడు .ఆకాలం గీత నృత్య అభినయాత్మకమైన యక్షగానాలకు స్వర్ణయుగం .తెలుగు సాహిత్య పరిణామ దశ ,జాతీయ వాజ్మయ చరిత్ర ,తెలుగు ఛందో రూపం ,దేశి దృశ్య కళారీతులు పరిశీలించాలంటే యక్షగాన అధ్యయనం తప్పని సరి అని చెప్పారు .హరి కథా వాజ్మయ మధనం చక్కగా చేసి నిసుగులను అందించారు యోగ ప్రభావతీ దేవి .ప్రముఖ హరికథకులలో ములుకుట్ల సదా శివ శాస్త్రి ,కోట సచ్చిదానంద శాస్త్రి ,పిల్లలమఱ్ఱి రామదాసు ,కడలి వీరయ్య  గార్ల వంటి  వారి పేర్లను వదిలేశారు. సైన్స్ ఫిక్షన్ రచయిత దేవరాజు మహారాజు తెలుగులో సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు అరుదు అన్న వాస్తవం తెలియజేసి ,పరిశోధన పత్రిక నడిపిన ఏం ఎం శాస్త్రి గార్ని ,వసంతరావు వెంకటరావు గార్నీ గుర్తు చేసి ,జనసామాన్యానికి విజ్ఞానం అందించాలన్న రావూరి భరద్వాజ ‘’ప్లాస్టిక్ ప్రపంచం ‘’వంటి పుస్తకాల ను  వివరించి ,గణిత శాస్త్రావిషయాలు రాసిన విశ్వనాథ అరుణాచలం ,కందుల నాగభూషణం ,ఆధునికంగా రాస్తున్న వారిని ప్రస్తుతించారు .చారిత్రిక నవలలపై శరత్ చంద్ర  బాపిరాజు చారిత్రకావలలో ఎన్నెన్నో చారిత్రాత్మక విషయాలు వివరించారానీ నోరి నరసింహశాస్త్రి గారు ,దేశాభిమానంతో రాశారని ,తెన్నేటి సూరి చంఘీజ్ ఖాన్ ‘’ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిందని ,పాటిబండ్ల మాధవ శర్మగారి రాజశిల్పి కుమారగిరి రెడ్డి నాటి చరిత్రను కళ్ళ ముందు ఉంచుతుందనీ  ,ముదిగొండ శివప్రసాద్ శతాధిక చారిత్రిక నవలలు రాశారని ,ధూళిపాల శ్రీరామమూర్తిగారి గృహరాజు మేడ భువనవిజయం ఆనాటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చెప్పారు. తంగిరాల సుబ్బారావు గారు ‘’పలనాటి వీరకథా చక్రం -,గురిజాల రాయబారం లేక అలరాజు రాయబారం ‘’వ్యాసం లో నవల పల్నాటి పౌరుషానికి ప్రతీక అలరాజు ఒరలో ‘’సూర్య భేతాళం ‘’అనే కత్తిని బయటికి తీస్తే దాన్ని ప్రయోగించి శత్రువును చంపకుండా లోపల పెట్టడు అనే గొప్ప సత్యాన్ని ఎరుకపరచారు .

  సుమారు ఆరునెలలక్రితం పరిచయమై నన్ను ‘’బాబాయిగారూ ‘’అని పిలిచే మా మద్రాస్’’ అమ్మాయి ‘’లేళ్ళపల్లి శ్రీదేవి  పాల్కురికిసోమన  రచనాలక్షణాలు తెలియజేసింది .తనరచనలద్వారాఆయన వీర శైవాన్ని దశ దిశలా వ్యాపి౦ప జే శాడని ,శివకవులకాలం వాడైన నాచన సోమన ప్రభావం పోతన తిక్కన శ్రీనాథ ధూర్జటి,రామలింగకవులపై ఉందన్నది .చోడుడి కుమార సంభవం విశేషాలు వివరిస్తూ బసవ శంకరరావు అతడు రాజసం ఉట్టిపడే కవి ,కవిరాజు ..కవిత్వం లో స్వాతిశయం నిలువెల్లా ప్రవహిస్తుంది .శ్రీకారం తో పద్యం ప్రారంభిస్తే అశుభం అని భావి౦చే కాలం లో శ్రీ తో మొదలుపెట్టి శ్రీతో అంతం ఆయె పద్యం రాశాడు .శ్లేషరచనకు మార్గదర్శి .నూతన కవితా సంప్రదాయాలకు ఆలవాలం కుమార సంభవం .ప్రబంథకవులకు మార్గదర్శి,ఒక్క తెలుగు పదం కూడా లేకుండా సంస్కృత సమాస రచనతో పద్యం అల్లాడు .ఎర్రన కావ్య శిల్పాన్ని సరిత వివరిస్తూ అరణ్యపర్వం లో రామకథ ఉందనీ, కానీ ఆయన రాసిన రామాయణం అలభ్యం అనీ ,అలతిఅలతిపదాలతొ శబ్దసార నిదర్శకంగా ఉండటం ఎర్రన శైలి అన్నారు .అంగాంగ వర్ణనకు ఆయన నృసింహ పురాణ ప్రబంధమే మార్గదర్శి .గుణవాది.పురాణ రచనకు ఓజస్సు తేజస్సు కూర్చాడు .ఎర్రన యుగంలో ఆయనతో దీటైనకవి నాచన సోమన అని శంకర్ రాస్తూ సోమనకు సోమనయే సాటి అని ,హరిహరనాథుని కావ్య వస్తువు చేసిన ఎకైకకవి అన్నారు .భక్తిజనవాటిక ,పేటిక అయిన భాగవతం రాసిన పోతన కవిత్వం లో వీరరసాన్ని బల దాన దయా ,యుద్ధ ధర్మ భక్తి లను అన్ని కోణాలలో హరినాథ్ వివరించారు .భగవంతుని వీరత్వం శిశుపాల దంతవక్త్ర ,బాణాసుర వధ మొదలైన వాటిలో చక్కగా పోషించాడు భక్తీ రసాన్ని పొంగి పొరలించిన పోతనామాత్యుడు .జాతికి అన్నమయ్య చేసిన సేవలు లో రెంటాల ‘’పదకవిత్వం ద్వారా తెలుగు వాడిలో సంగీత  కళా౦శ ను  అన్నమయ్య కాపాడాడు ,ఆయన కవిత్వం ఆరుద్ర అన్నట్లు ‘’అష్టమ సముద్రం ‘’అన్నారు .అన్నమయ్య అభ్యుదయ భావాలను వివరిస్తూ మన్నవ ‘’సుమారు అయిదున్నర శతాబ్దాల ముందే అన్నమయ్య అభ్యుదయ భావ వ్యాప్తి చేశాడు .డబ్బున్నవాడికీ నిరుపేదకు అహోరాత్రులు ఒకటే అన్న సత్యం చెప్పాడు .

  మల్లెపూలవంటి పదాలతో మొల్ల సున్నిత శృంగారాన్ని రాసింది .కమనీయ రమణీయ మనోహర మహనీయ సుందర పద్యాలురాసింది .వేదకాల గార్గి మైత్రేయి లాగా తెలుగు సాహిత్యం లో మొల్ల మహిళలకు మార్గదర్శనం చేసింది ‘’అన్నారు మద్దూరి .మనుచరిత్ర వర్ణనా వైభవాన్ని నాగరాజ లక్ష్మి తన అనుభవ సారంతో వివరించారు .వస్తువు ను వ్యక్తీకరించటానికి పెద్దన సీసాలే వాడాడు అన్నారు .లోకోత్తర ప్రయోగ చాతుర్యం ,పాత్రౌచిత్యం పింగళి సూరన నేర్పు .అప్పటికీ ఎప్పటికీ ‘’కళా పూర్ణోదయం ‘’వంటిది అద్భుత ప్రబంధం అదొక్కటే .ఆయనకు సమకాలీన ధోరణి కూడా ఉన్నవాడు .సూరనకవిత్వం ‘’సమస్త ఔచితీ మండన మందనాయనం ‘’ అనటానికి కళాపూర్ణోదయం గొప్ప ఉదాహరణం అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి ..గుమ్మా సాంబశివ రావు తెనాలి వాడి సంస్కృత పద గు౦ఫనం ‘’పై విస్తృత వివరణాత్మక రచన చేసి తన పాండితీ, బోధనా వైభవాన్ని చాటి చెప్పారు .పాండు రంగ మాహాత్మ్యం లో ఎన్నో పద్యాలు సంస్కృత పద బాహుళ్యాలె  .సంస్కృత సూక్తులను తెలుగుపద్యాల్లో నిబంధించాడు .యమ దూతలలో శ్రేష్టమైనది చిరకాలం బతికేదీ ,దూరపు చుట్టాలరాకను మధురస్వనం తో సూచి౦చేది,ఒంటికంటి చూపు కలది ,చలికాలం లో బలం కలదీ బలి భుక్కులలో శ్రేష్టమై నది కాకి అని రామలింగడు ‘’యమ రాడ్దూత శిఖా వతంసము ‘అనే పద్యంలో బాగా వివరించాడని చెప్పారు .శివుడు కన్ను ఆయుధంగా కలవాడు అని చెప్పటానికి ‘’అక్షి కౌక్షేయుడు ‘’అనే పద బంధం సృష్టించాడు గచ్చకాయల ఆట ను ‘’కుబేరాక్ష కేళి ‘’అన్నాడని చెప్పారు .   

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-7-22-ఉయ్యూరు  

Posted in సమీక్ష | Leave a comment

భారతీ నిరుక్తి .21వ. భాగం.26.7.22

భారతీ నిరుక్తి .21వ. భాగం.26.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ. 18వ భాగం.25.7.22

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారి నా జీవిత కథ. 18వ భాగం.25.7.22

Video link

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహాకవి జాషువా విశిష్ట పురస్కార స్వీకారం

మహాకవి జాషువా విశిష్ట పురస్కార స్వీకారం

27-6-22 ఉయ్యూరులో జరిగిన సరసభారతి సాహితీ పుష్కరోత్సవ సభకు  పద్మభూష ణ్ జాషువా స్మారక కళాపరిషత్ –దుగ్గిరాల  అధ్యక్షులు డా పి.యోహాన్ గారు వచ్చి పాల్గొని ,సన్మానితులై,అప్పటికప్పుడు జులై 24న జరిగే జాషువా గారి 51వ వర్ధంతి ,జాషువాస్మారక కళాపరిషత్ నాడు నాకు ‘’జాషువా పురస్కారం,’’ అందజేయ బోతున్నట్లు తెలియజేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశారు . మధ్యలో ఒకసారి ఫోన్ చేసి మా శ్రీమతిని కూడా తీసుకు రమ్మని చెప్పారు .నిన్న తెనాలిలో జరిగిన ఆసభకు వెళ్లి స్వీకరించాను .ఆ వివరాలు .

  నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు నేనూ మా శ్రీమతీ శ్రీమతి ప్రభావతి ,మామూడవకోడలు రాణి మనవడు చరణ్ ,నల్గవకోడలు మహేశ్వరి ,జాగృతి సంస్థ అధికారిణి రాజీవి కుమారుడు షణ్ముఖ్ ,కారులో దావూద్ డ్రైవింగ్ లో బయల్దేరి ,ముందుగా దుగ్గిరాల గాంధీనగర్ లో ఉంటున్న అంధులైన  ,అడవి బాపి రాజు గారిపై పరిశోధనచేసి పి.హెచ్. డి.అందుకొన్న నాగార్జున యూని వర్సిటి విశ్రాంత తెలుగు ఆచార్యులు ,నాపై విశేష ఆదరాభిమానాలున్న వారు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ  గారిని వారింటిలో దర్శించి, వారికి నేను రాసి, సరస భారతి ప్రచురించిన మల్లినాథ సూరి ,ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు పుస్తకాలు ,నూతన వస్త్రాలు ,శాలువా ,సాహితీ పుష్కరోత్సవ జ్ఞాపిక అంద జేసి అందరం ఆశీస్సులు పొందాము. వారి తల్లిగారు ఆరునెలల క్రితం మరణించారని తెలిసింది .ఒంటరిగా ఉంటున్నారు .ప్రస్తుతం ఏం చేస్తున్నారు రాస్తున్నారు అని అడిగితె ఎక్కువగా లైవ్ ప్రోగ్రాములు చేస్తున్నానని చెప్పి వారితో ‘’బాపిరాజుగారి పై మీ పరిశోధన పుస్తకం ఉంటె నాకు ఇస్తే  ప్రత్యక్ష ప్రసారం గా చేస్తాను ‘’అని చెప్పాను . తనవద్ద కూడా లేదనీ ,ఎవరిదగ్గరైనా ఉంటె పంపిస్తాను అన్నారు. లైవ్ చేశాక మళ్ళీ తిరిగి పంపిస్తాను అన్నాను సరే అన్నారు .

 దుగ్గిరాలనుంచి సరాసరి తెనాలి లో రామలింగేశ్వర నగర్ లో ఉంటున్న  ,70ఏళ్ళ క్రితం ఉయ్యూరు హైస్కూల్ లో నా క్లాస్ మేట్,కనకవల్లి వాస్తవ్యుడు తెనాలి మున్సిపల్ హై స్కూల్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ చేసి,రిటైరై , రెండస్తుల స్వంత బిల్డింగ్ నిర్మించుకొని ఉంటున్న ,నాటక ,రేడియో  నటుడు శిష్ట్లా సాక్షి కామేశ్వర సోమయాజులు ఇంటికి వెళ్లాం .పై అంతస్తులో ఉంటున్నారు. అతని భార్య నాలుగు నెలలక్రితం అకస్మాత్తుగా మరణించింది .మార్గదర్శిలో పని చేస్తున్న మూడవ కొడుకు కుటుంబం తో ఉన్నాడు .మొన్ననే వాళ్లకు మేము వస్తున్నట్లు ఫోన్ చేసి చెబితే చాలా సంతోషించారు .సోమయాజులు నాకంటే మూడు నెలలు పెద్ద వాడు .ఆత్మీయం గా అందరూ పలకరించిమాట్లాడారు అతడు, కొడుకు, కోడలు మనవరాళ్ళు . అతను ఉయ్యూరు వైపు ఎప్పుడొచ్చిన మా ఇంటికి వచ్చి కనిపించకుండా వెళ్ళే వాడు కాదు .భార్యతో కూడా మూడేళ్లక్రితం వచ్చాడు .ఏడాది క్రితం ఉయ్యూరులో ఒక పెళ్ళిలో కలిశాం కూడా .’’ఏరా అంటే ఏరా ‘’అనుకొనే స్నేహం మాది .అతనికి మేము నూతనవస్త్రాలు సమర్పించి శాలువాకప్పి సాహితీ పుష్కరోత్సవ జ్ఞాపిక అందించాము .వాడు వెంటనే నాకు వస్త్రాలు సమర్పించి ఆశ్చర్యం కలిగించాడు .మా కోడళ్ళకు మా ఆవిడకు బొట్టు పెట్టి ,బ్లౌజు పీసెస్ ఇచ్చారు .మంచి వాతావరణం ,మొక్కలు ,ఆహ్లాదకరమైన లోగిలి .మా ఆవిడ మేడ ఎక్క లేక కిందనే కూర్చుంది .పై నుంచి అందరం కిందికి దిగి ఫోటోలు దిగి అందరికీ వీడ్కోలు పలికి బయల్దేరాం .అందరి మనసులనిండా సంతోషం నిండింది .ఇక్కడొక విషయం జ్ఞాపకం వచ్చింది .మేము ఉయ్యూరు హైస్కూల్ లో చదువుతున్నప్పుడే నాకూ సోమయాజులు  మిగతా మిత్రులకు స్నేహితుడైన సూరి నరసింహం అన్న ,ఉయ్యూరు పాలిటెక్నిక్ లో చదువుతున్న ,మాంచి స్పోర్ట్స్ మన్ ,జావెలిన్ త్రో హీరో అనంతరాం పెళ్లి తెనాలిలో జరిగితే పెళ్లి కొడుకు బృందంతో పాటు నన్నూ ,ఆదినారాయణ ,లను నరసింహ తీసుకు వెళ్ళాడు .ఆ రాత్రి సెకండ్ షో  ‘’ఇలవేలుపు ‘’చూశాం .’’చల్లని రాజా ఓ చందమామ’’పాట రఘునాథ పాణి గ్రాహిపాడాడు .సుసర్ల దక్షిణా మూర్తి సంగీతం .ఆర్ నాగేశ్వర రావు ఒక ఆశ్రమ నిర్వాహకుడు. ‘అందరూ ‘’నాన్నగారూ ‘’అని పిలిచే సాఫ్ట్ కార్నర్  పాత్ర వేయటం గొప్ప ఆశ్చర్యం .

  సోమయాజులు ఇంటి నుంచి వైకుంఠ పురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ,అక్కడి నుంచి కవిరాజు పార్కు లోని  సీనియర్ సిటిజెన్స్ హాల్ కు సాయంత్రం 6-30కు చేరాం .పద్యాలు పాడుతున్నారు .రాత్రి 7కు సన్మాన సభ ప్రారంభమైంది .మాజీ మంత్రి ,ప్రస్తుత ఎం ఎల్ సి .శ్రీ డొక్కా మాణిక్యవర  ప్రసాద్  గారిని శ్రీ యోహాన్ వేదికపైకి ఆహ్వానించారు .జాషువా చిత్రపటానికి  పూల మాల వేశారాయన . యోహాన్ గారు రాసిన ‘’కవికోకిల ,విశ్వకవి సమ్రాట్ గుర్రం జాషువా –సాంఘిక పద్యనాటకం ‘’పుస్తకాన్ని ఆయన ఆవిష్కరింఛి  జాషువా గురించి ,యోహాన్ గారి గురించి మాట్లాడారు .తర్వాత  యోహాన్ గారికి కుచ్చు టోపీ పెట్టి శాలువా కప్పి ఎం ఎల్ సి గారు సన్మానించారు .తర్వాత నన్నూ ,మా శ్రీమతిని వేదికపై కి ఆహ్వానించి సన్మానపత్రం అందించి శాలువాలుకప్పి దండలు వేశారు .నాకు ‘’సాహితీ కళా రత్న ‘’బిరుదు ప్రదానం చేశారు .మా శిష్యుడు కీ శే .వంగవీటి కాళీ వరప్రసాద్ కుమారుడు’’దైవజ్ఞ రత్న’’  సుబ్రహ్మణ్య శాస్త్రి నిన్న సాయంత్రమే ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లి వచ్చి వెంటనే ,  అతని చెల్లెలు శ్రీమతి వల్లీ రమా పరమేశ్వరిని కూడా   తాడేపల్లి నుంచి బైక్ పై తీసుకు వచ్చి మా ఇద్దరికీ శాలువాలు కప్పారు .జాగృతి సంస్థ తరఫున మా కోడలు మహేశ్వరి ,మనవడు చరణ్ ,మాతోవచ్చిన శ్రావణ్ రోజా పుష్పమాలలు మాకు వేయించి రోజా పూలతో పాద పూజ చేసి నెత్తిన చల్లి గొప్ప అనుభూతిని అందరికి కలిగించారు .ఒక రకంగా గొప్ప కిక్ తెప్పించారు నీరసంగా ఉన్న సభకు .నేను నాలుగు మాటలు జాషువా గురించి చెప్పాను .మాణిక్యవర ప్రసాద్ గారు చాలా బాగుందన్నారు .చాలామంది మెచ్చుకొన్నారు .శ్రీ నాగేల్లి ప్రభాకర్ (అక్షరం )-మహబూబాబాద్ గారికి సాహితీ విద్యా రత్న ,శ్రీ సాపాటి ప్రభాకర్ –బ్రాహ్మణ కోడూరు కు సాహితీ రత్న,శ్రీ గొట్టిముక్కల నాసరయ్య-త్రిపురాంతకం గారికి సాహితీ భూషణ్ ,శ్రీ దార్వేముల అనిల్ కుమార్ –గుంటూరు గారికి సాహితీ భూషణ్ ,శ్రీ రంగి శెట్టి రమేష్ –చిలువూరు గారికి సాహితీ భూషణ్ ,శ్రీ ఈపూరి ప్రేమ కుమార్ –పెదరావూరు గారికి నాటకరత్న ,శ్రీ పంతుల వెంకటేశ్వరరావు-విజయవాడ  గారికి సాహితీ రత్న బిరుదులూ జాషువా పురస్కారాలు అందించారు . అక్షరం ఆయన నన్ను గురువు గారూ అంటూ సంబోధిస్తూ ,సరసభారతి విషయాలు వాట్సాప్ గ్రూప్ విషయాలూ తెలుసుకోవటమే కాకుండా సన్మానితులలో నా పేరు తర్వాత తన పేరు ఉండటం గొప్ప అదృష్టం అని ఫీలయ్యారు. ఇది అవగానే మేము బయల్దేరాం .దారిలో మా అమ్మాయి ,విజ్జి, అల్లుడు అవధాని అమెరికా లోని  షార్లెట్ నుంచి అట్లాంటా లో ఒక వారం  ప్రాజెక్ట్ వర్క్ చేయటానికి   మా మనవడు ఆశుతోష్  ను అట్లాంటా తీసుకు  వెళ్లి దింపటానికి వెడుతూ ఫోన్ చేసింది మా అమ్మాయి .మమ్మల్ని అందర్నీ చూసి మాట్లాడింది వాట్సాప్ కాల్ లో .

అక్కడినుంచి ఎక్కడైనా మంచి హోటల్ ఉందేమో వెతికితే దావూద్ మమ్మల్ని ‘’సజ్జాస్ ఫుడ్ కోర్ట్ ‘’కు తీసుకు వెళ్ళాడు. పెద్ద హోటల్ ఆదివారం కనుక మిగతా హోటళ్లకు సెలవ్ .నీట్ గా ఉంది .తలొక రెండు ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చిఆబగా తింటూ పింగ్ పాంగ్ ఆడుతున్నట్లు  ఫుడ్ కోర్ట్ లో దున్నేశాం .అన్నీచాలాబాగున్నాయి కాఫీ తో సహా .మామనవడు చరణ్ స్పాన్సర్ చేశాడు.మాతోపాటు రమ్మని కోరగా ,వొప్పుకొని ,కాళీప్రసాద్ కొడుకు, కూతురు వచ్చి ఇష్టమైనవి తింటూ మంచి కంపెనీ ఇచ్చారు .హాయైన అనుభవం . హోటల్ లో ఏది బాగా లేకపోయినా  నేను రుచి చూసిపెదవి విరవటం అలవాటు .కానీ నిన్న మాత్రం చట్నీలతో సహా అన్నీ బాగా ఉన్నందుకు మహా సంతృప్తిగా తినటం నాకే ఆశ్చర్యం కలిగించింది  .ఇది చూస్తుంటే మరో అనుభూతి గుర్తుకొచ్చింది .2019లో నోరి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గురు పౌర్ణమినాడు హైదరాబాద్ త్యాగరాజ గాన సభ లో ‘’కళా సుబ్బారావు గారి ‘’పురస్కారం అందజేయటం ఉయ్యూరునుంచి మేము వెళ్ళటం హైదరాబాద్ లో ఉన్న మా అబ్బాయిలు శాస్త్రి, శర్మ,మా బావమరది ఆనంద్ కుటుంబాలతో వచ్చి శాలువాలు కప్పటం పూలహారాలు వేయటం ,పుష్పాభిషేకం చేయటం ,గాన సభ అంతా మా ముఠా ‘’హల్ చల్ ‘’చేయటం, ఆతర్వాత అందరం ఒక హోటల్ లో టిఫిన్లు చేయటం ,ఆఖర్చు మా శర్మ’’ ఎయిత్ వండర్’’ గా స్పాన్సర్ చేయటం మర్చిపోలేని మరో అనుభవం .

   టిఫిన్లు అయ్యాక కాళీ ప్రసాద్ పిల్లల్ని ఇంటికి బయల్దేరి వెళ్ళమని చెప్పి ,మేము కారెక్కి ,ఉయ్యూరుకు రాత్రి 10-15కు చేరాం .కార్ పెట్రోల్ ఖర్చు కూడా నా చేతికి అంటనివ్వలేదు .ఇలా ఆదివారం యాత్ర పూర్తయింది .వెంటనే వాట్సాప్ లో ఫోటోలు పెట్టేసి పడుకొన్నాను .ఇప్పుడు  తెనాలి సభలో నేను మాట్లాడిందీ మాట్లాడాలను కొన్నదీ వివరంగా తెలియ జేస్తాను .

                 విశ్వ నరుడుజాషువా

 సాహిత్యం లో పీడితులపక్షాన కలం పట్టిన యోధుడైన సాహితీ మూర్తి జాషువా .దళిత హృదయార్తి కి బీజమే ఆయన కవిత్వం .గాంధేయ విధానం ఆయన కవిత్వానికి మూలం .అనుభూతి,ఆవేశం వలన కవిత్వావిర్భావం జరుగుతుందని చెప్పాడు .సర్వ కవిత్వ సమన్వయ లక్షణం ఆయనది .కరుణ  రసావిష్కర్త .’విశ్వ నరుడను ‘’అని చెప్పుకున్న ధీరకవి .గాయపడిన మనసు ఆక్రోశమే జాషువా కవిత్వానికి ‘’షడ్జమం ‘.అన్నిటికీ అతీతమైన సమసమాజస్థాపన  ఆయన లక్ష్యం .మనిషిని మనిషిగా గుర్తించమని ప్రాధేయపడిన మానవతా మూర్తి జాషువా.తెలుగు పద్యం ఇంత హృద్యంగా ఉంటుందని రుచి చూపించిన కవి ..భాషపై పట్టు,భావం పై అధికారం ,నడకపై తూగూ ఊపూ ,కమ్మని శైలి ఆయనకే స్వంతం .ద్రాక్షాపాకమే ఆయన కవిత్వం .వృత్త పద్యానికి మహోన్నత శిల్పి జాషువా .మానవ ప్రవృత్తికీ ,జడ ప్రవృత్తికీ ఉన్న అంతరాన్ని ,కొత్తదృక్పధం తో తగ్గించిన సంస్కారి .

  జాషువా కు తల్లి అంటే పంచ ప్రాణాలు .ఆమె చనిపోయినప్పుడు ‘’నీ ఋణము తీరదు రక్తము ధార పోసినన్ ‘’అని వెక్కి వెక్కి ఏడ్చాడు .పెంపుడు కుక్క మరణిస్తే ‘’విశ్వాసము నీ కులానికి నిసర్గ భూషణమ్ము-ఇట్టి సావాసము చచ్చి పోయినది ‘అని దుఖించిన కరుణా మూర్తి .’’పేదరికం పెద్ద విద్యాశాల .దానిలో లజ్జ లేదు .ఉదరమే ఒజ్జ .ఓర్మిని నేర్పిస్తుంది ‘’అని తన అనుభవాన్ని జోడించి చెప్పాడు తాత్వికంగా .ముంతాజ్ మహల్ కోసం షాజహాన్ కట్టిన తాజ మహల్ యొక్క శిలలను గురించి ‘’కలము నందుకొన్న కవి వరేణ్యుని మ్రోల తలలు వంచు శబ్దాల విధాన –నాటి శిల్పి చెంత నవనీతమును బోలి –మెత్తదనము దాల్చె మేటి శిలలు ‘’అనగల సత్తా జాషువాది .

  కోతిని గురించి రాస్తూ –‘’నిన్నీక్షించి హసి౦చనట్టి నరుడున్ నీపై దయాభావముత్పన్నంబందని వాడు –గానమునకున్ వైముఖ్యమును చూపు వా-డున్నాడా సకల ప్రపంచమున ,నాయుర్భూతి నిండార తిమ్మన్నా !హాస్య కళాసముద్రమున మమ్మెలార్పు నశ్రా౦త మున్ ‘’అని బొమ్మ కట్టించిన శిల్పి .తేనే పట్టు అంతా పిండుకొని తాగే వాళ్ళమే కాని అందులోని మధుపం మనో భావాలను అర్ధం చేసుకోలేని దౌర్భాగ్యం మనది .ఎంత రసవంతంగా రాశాడో ఈ పద్యాలు చూడండి –‘’కుత్తుకలు గొని రణమున –కాయత్తంబై న వీర యోధులట్లు మధుపముల్ –మొత్తమయి లేచి పొడిచెన్  -గత్తులతో నన్ను నొక్క క్షణ కాలమునన్ ‘’అని మీద దాడి చేశాయి తేనెటీగలు కవిమీద .అందులోనుంచి ఒక అళి కుమారుని మనో వేదన, ఆర్తనాదం విని చలించిపోయాడుకవి .అందులోని ఒక శిశు మధుకరం –‘’ఓరి దురాత్మ !బిడ్డలు లేరా ?యొక్కింత కరుణ లేదా?మమ్మున్ నోరెరుంగనట్టి నిసుగుల –గారించుట నీకు వేడుకా ?దౌష్టంబా ‘’?అని నిలదీసింది .బిక్క చచ్చిపోయాడు గురుడు .’నరుడు అ౦టుకొంటేకొడుకులు చనిపోతారని మా మిళింద మాతలు  మళ్ళీ దయతో పెంచుతారు .ఇది మాకులం కట్టు బాటు .’’అని బుద్ధి చెప్పింది .చివరగా ‘’మా తీయని నగరంబును –ఘాతుకమతి వౌచు మంట గలిపితివి –మా తలల్లు లండ్రు –నరులకు నీతి హుళక్కి యనుచు ,నేడు నిజ మయ్యెన్ ‘’.కరుణ శ్రీ గారి ‘’పుష్పవిలాపం ‘’గుర్తుకొస్తుంది .

  వంచిత అనే పద్యం లో –ఆబల యను బిరుద మంటించి కాంతల –స్వీయ శక్తులదిమి చిదిమి నారు –సబల యన్న బిరుదు నావరించి హక్కులు –గడవ జేసి కొమ్ముకష్ట చరిత ‘’అని ఓదారుస్తూ ధైర్యం నూరి పోశాడు కవి .బడిపంతులు పద్యం లో –‘’ఎంతెంత వారు నాదగు –‘’చింత బరికె ‘’ సోకకుండ,సిరి గలిగి యశో –వంతులు కాగలరా యని –సంతృప్తి వహించు తాతని సహజ గుణంబున్ ‘’అని ఫోటో తీసి చూపించాడు జాషువా .అమ్మవారు పద్యం లో –‘’మొగమున కక్కుకొట్టి మసిబాసి ,వికార మొనర్చ నీచపుం –దెగులునకు ‘’అమ్మవారనుచు ‘’తీయని పేరిడిమేకపోతులన్ దగరుల జంపి ,రక్తమున దండవ కేళియొనర్చు వెర్రికిన్ దగిన చికిత్స చేయగలదా నవ భారత మెన్నడేనియున్’’అని సమాజానికి సవాల్ విసిరాడుకవి .

  ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని కీర్తిస్తూ –‘’నీవు ఫిడేలు దాల్చి కమనీయ నినాదఝరీ మరంద –మాలా వివిధ స్వరూప రస లక్ష్ముల సృష్టి యొనర్చు లాఘవం –బీ వర కెవ్వ డందు గడియించి ఎరు౦గరు నీదు వ్రేళ్ళలో –నే వరమున్నదోయెరుగ రెవ్వరు ‘’ద్వారము వంశ భూషణా ‘’.-చెవులు పిండి ,శిక్షించి జడమైన –కట్టె కెట్లు విద్య గరపినావో _అంగుళీయకంబులంటియంతక ముందే-నీ ఫిడేలు మధుర నిధులు గురియు ‘’అంటూ ద్వారంవారి సర్వోత్తమ వైదుష్యాన్ని కళ్ళకు కట్టించాడు .వీరేశ లింగం గారిని ప్రస్తుతిస్తూ –‘’ఒకవంకన్ బదివేల కంఠములతో హు౦కారముల్ సల్పిసాం-ఘిక శార్దూలము చప్పరించుటకు లంఘి౦పన్ –రవంతేని జంకక ,దీక్షా రథమున్ మరల్పక –కళా క్షాత్రంబు జూపించు ను –వేద౦డుని యుక్కు గుండెలు మహా౦ధ్రా మీకు నా దర్శముల్ ‘’  .భట్టుమూర్తి రామరాజ భూషణుడికి పద్య భూషణాలు తొడుగుతూ జాషువా –‘’శ్లేష కవిత్వ చండ భాస్వంతుడవహో –సరస భట్ట కవీ ,కవితా కళానిధీ-నాటికి నేటికి ఒక నాటికి నీ కెదురేరి సత్కవీ –చక్కదనాల కబ్బపుం గాపులు గాచి పోయితివిగా కవితా దివిజ ద్రుమబునకున్ ‘’అని అత్యద్భుతంగా వర్ణించాడు .గోవుకు నమస్కరిస్తూ జాషువా –‘’వెలగలయట్టి నీ రుధిర  బిందువు లెన్ని వ్యయించి పాలుగా జిలికెద వోగదా’’మొదవు చేడియ’’!నీ బలమెల్ల ఇమ్మనుష్యుల కిడి  వృద్ధురాలవయి సుక్కిన నీకు గటారి పోటులాఫలితము ?-భారతీయుని గృపా పరతంత్ర త గొడ్డు వవోయెనో ‘’అంటూ సహవేదన చెందాడు మనసు మెత్తని కవి జాషువా .సర్దార్ పటేల్ ను –‘’కొండవంటి తనువు-కొండంత భుజ శక్తి –కలిగి యుండ భరత ఖండ లక్ష్మి –వల్లభాయి మంత్రి పరమ పది౦పగా –గుండె లేని దయ్యె- గుండెగలిగి ‘’అంటూ స్మృత్యంజలి ఘటించాడు దేశభక్త కవి జాషువా .

  చివరగా తన గురుదేవుడు శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు తన కాళ్ళకు బంగారపు కడియం తొడుగుతుంటే ఆనందం ,భక్తీ ,వినయం త్రివేణీ సంగమంగా –

‘’చెళ్ళపిళ్ళ సత్కవీశుడు ప్రసిద్ధుండు –వీర శతావధాని ,యాంధ్రుల శుభ రక్తనాళములరూపము  నెత్తిన బ్రాహ్మణుండు-‘’నా పలుకుల రాణి పాదము’’ ను బంగరు గగ్గెర తో నలంకృతుల్ సలిపె-నికేమి కావలె ప్రశస్తి కవిత్వ కళా వధూటికిన్ ‘’అని కృతజ్ఞతాంజలి ఘటించాడు శిష్యుడు జాషువా .తనకు తొడిగారు అనకుండా తన కవితా సరస్వతి పాదాలకు తొడిగారు అనటం జాషువా మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం .అలాంటి అరుదైన వ్యక్తిత్వం ,సర్వసమానత్వం, విశాల భావ సంపద తో విరాజిల్లిన మహాకవి జాషువా గారి పురస్కారాన్ని అంతే వినయ విధేయతలతో అందుకొంటున్నాను ‘’అని ముగించాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-22-ఉయ్యూరు  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment