శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.10వ భాగం.30.8.22
Video link
శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.10వ భాగం.30.8.22
Video link
మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -3
5-శ్రీ రాపాక తిరుపతి రాజు
1904లో రాజోలు తాలూకా పోతవరం లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన శ్రీ రాపాక తిరుపతి రాజుగారు 1921నుంచి కాంగ్రెస్ సేవలో ఉన్నారు .ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లి 1921 రాజమండ్రి జైలునుంచి విడుదలయ్యారు .1929లో అఖిలభారత చరఖా సంఘం లో ఉద్యోగం లో చేరారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో అయిదారు సార్లు పాల్గొని ,లాఠీచార్జి కి గురయ్యారు .మంచి ఆరోగ్యవంతులు కనుక తట్టుకోగలిగారు .ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ,గాంధీ గారి పిలుపు అందుకొని అనేక సత్యాగ్రహాలలో అకు౦ఠీత దీక్ష తో పాల్గొన్నారు .
డాక్టర్ కొరళ్ళ రాజారావు గారితో కలిసి స్వదేశీ ఉద్యమం ప్రచారం చేస్తూ రామచంద్రాపురం వెళ్ళారు .ఆ రాత్రి ఆయనతోపాటే ఒక సత్రంలో బసచేసి నిద్రించారు .అర్ధ రాత్రి వేళ పోలీస్ ఆఫీసర్ ముస్తఫా పోలీసు బృందంతో వచ్చి ,ముందుగా రాజారావు గారిపై దమనకాండ సాగించి, తర్వాత రాజుగారిపై లాఠీలతో విరుచుకు పడ్డాడు .విపరీతమైన ఆదె బ్బలకు తిరుపతి రాజు గారు నేలపై పడి పోయారు .కనికరం లేని ముస్తఫా తుపాకి బాయి నెట్ తో అయన మోకాలిపై తీవ్రంగా పొడిచాడు .రాజుగారి శరీరంనుంచి రక్తం కాలువ కట్టింది .ఇద్దరు పోలీసులు ఆయన్నులేపి నిలబెట్టారు .కోపం ,ఉద్రేకం తగ్గని ముస్తఫా ఆయన కుడిజబ్బ పై లాఠీతో బలం గా కొట్టాడు .వాడికున్న అక్కసు అంతాచూపించాడు ఆదెబ్బలో రాజుగారి జబ్బ ఎముక విరిగి పోయింది .ఇంకా కసి తీరక, అరెస్ట్ చేసి రాజుగారిని జైలుకు పంపాడు .ఆరునెలలు బళ్ళారి జైలులో శిక్ష అనుభవించారు .తిరిగి వచ్చి మళ్ళీ దేశసేవ లోనే మునిగిపోయారు శ్రీ రాపాక తిరుపతి రాజు.
6-శ్రీ పోడూరి పేర్రాజు
తారణ నామ సంవత్సరం లో షష్టి పూర్తి చేసుకొన్న శ్రీ పోడూరి పేర్రాజు బ్రాహ్మణులు .కృష్ణా జిల్లా బందరు తాలూకా చిన గొల్లపాలెం లో జన్మించారు .1906వరకు రాజమండ్రి ట్రెయినింగ్ కాలేజి లో చదివి ,వందేమాతరం ఉద్యమం లో చదువు మానేసి ,స్వగ్రామం పోడూరు చేరారు .
1907లో బొంబాయి వెళ్లి శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారి అమృతాంజన్ కంపని లో ఉద్యోగం లో చేరారు .1908 లో రంగం అంటే రంగూన్ వెళ్లి,ఒక ఏడాదిగడిపి తిరిగి స్వగ్రామం చేరారు ,కొన్ని రోజులతర్వాత మళ్ళీ రంగూన్ వెళ్లి ,అక్కడ డబ్బు సంపాదించి అక్కడి రాజకీయాలలో పాల్గొనేవారు .
మళ్ళీ స్వగ్రామంచేరి ,పెళ్లి చేసుకొని రాజమండ్రిలో కాపురం పెట్టివ్యాపారం చేశారు .యుద్ధ సమయం లో విపరీతంగా డబ్బు సంపాదించారు .హోం రూల్ లీగ్ లో చేరి ,1919లో వ్యాపారం మానేసి ,గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమం లో పూర్తిగా పని చేశారు .నాలుగైదు సార్లు జైలుకు వెళ్ళారు .1930లో రాజమండ్రి నుంచి రాయ వెల్లూరుకు మార్చబడిన ఖైదీలలో శ్రీ వెలిదేండ్ల హనుమంతరావు గారి తో పాటువీరూ ఉన్నారు .
పొట్టిగా ఉండే పేర్రాజుగారికి పొడవైన దట్టమైన గుబురు మీసాలు ఉండేవి .రాజమండ్రిలో లాఠీఛార్జి చేసే సార్జంట్ రాజుగారి మీసాలు పట్టుకొని ,’’యు ఆర్ ఎ లిల్లీ పుట్.ఐయాం ఎ లిల్లీపుట్ ‘’అంటూ మీసాలు అటూ ఇటూ లాగి నరకాన్ని చూపించాడు .లాఠీతో వెన్నుమీద ,పిర్రలమీద చావు దెబ్బలు కొట్టాడు .రెండు కాళ్ళూ పట్టుకొని లారీలోకి గిరాటేశాడు .చావుతప్పి కన్ను లొట్ట పోయినట్లు ఆ లారీలో రాయ వెల్లూరు చేరారు .విడుదలైనతర్వాత రాజమండ్రి వచ్చి, మళ్ళీ దేశ సేవకు అంకితమయ్యారు శ్రీ పోడూరి పేర్రాజు.
సశేషం
రేపు వినాయక చవితి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-22-ఉయ్యూరు
భారతీ నిరుక్తి .45వ చివరి భాగం.30.8.22
Video link
Video link
ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కడియాల రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటూరు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పిల్లలకు పద్య,పాఠన పోటీలను నిర్వహించి తెలుగు భాష ఔన్నత్యాన్ని ,ప్రాముఖ్యాన్ని తెలిపే పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ సాహితీ వేత్త,సాహితీ పోషకులు,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గబ్బిట దుర్గా ప్రసాద్ గారు తెలుగు భాష ప్రాముఖ్యాన్ని తెలియజేసి తన సరస భారతి ద్వారా చేసే సాహితీ సేవలను తెలియజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులను మరియు వారి సాహిత్యాన్ని పాఠశాల గ్రంథాలయానికి అందించడం జరిగింది. కార్యక్రమాలలో ప్రధానోపాధ్యాయిని టి.రమాదేవి తెలుగు ఉపాధ్యాయులు రోజం రాజా,మోకా మాధవరావు లు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది
భారతీ నిరుక్తి .44వ భాగం.29.8.22
Video link
Video link
శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.9వ భాగం.28.8.22
Video link
మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -2
3- పోలీసు లాఠీ చార్జి లో గాంధీ దర్శనం పొందిన మరో వినోబా డా .కొరళ్ళ రాజారావు
కాకినాడలో వైశ్య కుటుంబానికి చెందిన డా .కొరళ్ళ రాజారావు,మెట్రిక్ పాసై ,గురువులవద్ద సంప్రదాయ బద్ధంగా ఆయుర్వేద విద్య నేర్చారు .బాల్యం నుంచి దేశ సేవ పై అభిలాష ఎక్కువ .1921-22లో కాంగ్రెస్ లో చేరి సేవ చేశారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్న 200 మందిలో మొదటివారు శ్రీ బులుసు సాంబమూర్తి గారు కాగ ,రెండవ వారు డా .కొరళ్ళ రాజారావు గారు .గాంధీజీకి వినోబా ఎలాగో బులుసువారికి కొరళ్ళ అలాటి శిష్యుడు ..
సత్యాగ్రహం తర్వాత కొందరు వాలంటీర్లతో కలిసి రామ చంద్రాపురానికి ప్రచారం కోసం వెళ్లి అక్కడి ఒక ఇంట్లో లో రాత్రి పడుకొని ఉండగా ,విషయం పసిగట్టిన ముస్తఫా అర్ధరాత్రి ,పోలీసులతో ప్రవేశించి తుపాకి మడమతో రాజారావు గార్ని పొడిచి నిద్ర లేపి నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జి చేశాడు .రాజారావు గారు ఏమాత్రం భయపడక చలించక అలాగే నిలబడ్డారు .ఆయన్ను కొట్టటానికి నలుగురు రిజర్వ్ పోలీసులను నియమించి వాళ్ళతో రక్తం ధారగా కారెట్లు చితక బాదించాడు .అయినా నిబ్బరంగా తక్కుకున్నాడు ఆ వైశ్య ధీర ధైర్య దేశ భక్తుడు .ముస్తాఫాను కొట్టాలంటే రాజారావు గారి కి చాలా తేలికే .అంతటి బలిష్టులాయన .కానీ గాంధీజీ చెప్పిన దౌర్జన్య రాహిత్య తత్వానికి అంకిత భావం తో లోబడి ,ముస్తఫా పై చేయి చేసుకోలేదు .మిగిలిన సత్యాగ్రహులను అందర్నీ ఒక వాయింపు వాయించి మళ్ళీ ముస్తఫా ఈయన దగ్గరకు వచ్చాడు .మళ్ళీ రెండో సారి లాఠీ చార్జి చేశాడు పరమ కిరాతకం గా .అప్పుడు ‘’తనకు గాంధీ మహాత్ముని దివ్య దర్శనం’’ కలిగిందని దేశభక్త డా .కొరళ్ళ రాజారావు గారు చెప్పారట .అప్పటికీ డాక్టరు గారు చలించక పోవటం తో ముస్తఫా మిలిటరీ బూటుతో రాజారావు గారి ఆయువు పట్టుపై అత్యంత బలంగా తన్నాడు .డాక్టర్ గారికి స్పృహ తప్పికింద పడిపోయారు .గిలగిల తన్నుకొన్నారు .అయినా వదలక ఆ నరరూప రాక్షసుడు మళ్ళీ తన్నగా నెత్తురు కక్కుకొన్నారు .రాక్షసానందం తో నవ్వుకొంటూ బలగంతో వెళ్ళిపోయాడు ముస్తఫా . గ్రామస్తులెవ్వరూఅక్కడికి వచ్చి ఆయన ముఖమైనా చూడలేదు. రాజారావు గారిని లెవ తీయనూ లేదు.మంచినీళ్లివ్వ లేదు భోజనం పెట్టలేదు .అందరూ ముస్తాఫాకు భయపడి ఏరకమైనా సానుభూతి కాని సహాయంకాని ప్రజల ప్రాణాలు కాపాడే అ డాక్టర్ గారికి చూప లేకపోయారు .ఆ రోజు రాత్రి ఎలాగో కాకినాడ చేరారు .అప్పటినుంచి ఆరోగ్యం దెబ్బతిని క్షయవ్యాధి వచ్చింది .కానీ తాను సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు అవటంతో తగిన మందులు తానె చక్కగా వాడుకొని ఆరోగ్యం పొందగలిగారు .1941లో మళ్ళీ వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొన్నారు రెట్టింపు ఉత్సాహం తో .పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయలేదు .కొద్ది శిక్ష వేసి వదిలేశారు .
4-అభినవ ప్రహ్లాద శ్రీ కాశీ భట్ట జగన్నాథం
తూగోజి అమలాపురం తాలూకా కడలి గ్రామ కాపురస్తులు శ్రీ కాశీ భట్ట జగన్నాథం గారు .వైదీక శోత్రియ బ్రాహ్మణులు.సదాచార సంపన్నులు .మొదట్నించి గాంధీజీ ఉద్యమం లో పని చేశారు .ప్రతిగ్రామాన్ని కాలినడకతో తిరిగి గాంధీ సూత్రాలు ప్రచారం చేసిన మహాను భావులు .నిరంతరం రాట్నం పై నూలు వడికే కర్మిష్టి .గాంధీ మహాత్ముడికంటే ఎక్కువ నూలు వడికిన వారుగా జగన్నాథంగారు అని చెప్పుకొంటారు . .కాంగ్రెస్ సేవ తప్ప వేరే జీవితం లేనివారు .పరాదీనతలో బ్రతకరాదనే సిద్ధాంతాన్ని అమలు చేశారు .గ్రామాలలో వారానికి ఒకసారి జరిగే సంతలకు వెళ్లి అక్కడ ప్రజల్ని సమీకరించి మహాత్ముని సందేశాలు వినిపించేవారు. .
1932లో అలాగే ఒక ఊరు వెళ్లి ,అక్కడ త్రివర్ణ పతాకం ఎగరేసి ,అక్కడికి అందర్నీ పిలిచి ,గాంధీగారి ఖద్దరు ఉద్యమం గురించి బోధ చేశారు .ఇంతలో ముస్తఫా వచ్చి ఆ జండాను ముక్కలు ముక్కలుగా చి౦పేసి జగన్నాథం గారిని లాఠీ చార్జి చేయించాడు .ఆయన్ను వస్త్ర విహీనుడిని చేసి ,విదేశీ వస్త్రాన్ని ఆయనపైకి విసిరేసి దాన్ని కట్టుకోమని ఆజ్ఞా పించాడు .ససేమిరా కట్టుకోనన్నారు .కోపం నషాళానికి అంటిన ముస్తఫా ఆయన నుంచి ఊడదీసిన ఖద్దరు వస్త్రాలను ఆయన ఎదుటే తగలబెట్టించాడు .మళ్ళీ లాఠీ చార్జి చేయించాడు .తగిలే ప్రతి దెబ్బకు ‘గాంధీ గాంధీ గాంధీ ‘’అంటూ ఆక్రోశించటం తప్ప జగన్నాధం గారు ఏమీ చేయలేక పోయారు పాపం .కిందపడిన ఆయన్నుమట్టిలో పొర్లించాడు . బూటుకాలుతో కసితీరేదాకా తన్నాడు ఆ కంస రూప రాక్షస పోలీసు ఆఫీసర్ముస్తాఫా .ఆయన గాంధీనామం తప్ప వేరేదీ స్మరించలేదు .ఆయనకున్న జంధ్యం చూసి బ్రాహ్మణుడు అని గుర్తించి కల్లు కుండ తెప్పించి ,నోట్లో కల్లుపోయించే ప్రయత్నం చేయించాడు .ఆయన నోరు తెరవలేదు .ఆ నరాధముడు బాయినెట్ తో నోరు పెకలించి ,కల్లు పోశాడు నోట్లో .వెంటనే జగన్నాధంగారు ప్రక్కకు తిరిగి ఉమ్మేశారు .వాడు ఆయన గుండేపైకి ఎక్కి కూర్చుని ,బాయి నెట్ తో నోరు తెరిచి మళ్ళీ కల్లు నోట్లో పోశాడు .ఆయన మింగక పోవటంతో ఆకు౦డలోని కల్లు అంతా ఆయనపై కుమ్మరించి అక్కసుతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు .
జగన్నాథం గారు నెమ్మదిగా లేచి కూర్చుని నోటిలోఒక్క కల్లు చుక్క కూడా లేకుండా ఉమ్మేసి ,అక్కడి వారు ఇచ్చిన ఖద్దరు తువ్వాలు కట్టుకొని, ఇంటికి వెళ్ళారు ఆ ‘’అభినవ ప్రహ్లాదుడు ‘’జగన్నాధం గారు .కాంగ్రెస్ వారికి ఎన్నికలు వచ్చినప్పుడే ఆయన గుర్తుకు వస్తారు .నిశ్చల దేశభక్తులు అచంచల సత్యాగ్రహి .గాంధీజీ ని మాత్రమె నమ్ముకొన్నఆధునిక భక్త ప్రహ్లాదుడు ఆయన..డబ్బు కు ,పదవులకు ,పలుకు బడికి ప్రాకులాడని విశుద్ధ దేశ భక్తులు శ్రీ కాశీ భట్ట జగన్నాధం గారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-8-22-ఉయ్యూరు
భారతీ నిరుక్తి .43వ భాగం.28.8.22
Video link
Video link
శ్రీ గాడి చర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.8వ భాగం.27.8.22
Video link
భారతీ నిరుక్తి .42వ భాగం.27.8.22గ
Video link
మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు
1=శ్రీ వెన్నెటి సత్యనారాయణ
గోదావరిజిల్లా కాతేరు గ్రామవాసి బ్రాహ్మణులు శ్రీ వెన్నెటి సత్యనారాయణ .బియే పాసై రాజమండ్రి వీరేశలింగం హై స్కూల్ ఉపాధ్యాయులుగా పని చేసి ,మానేసి ప్లీడరీ చదివి పాసై ,రామ చంద్రాపురం లో న్యాయవాదిగా పని చేశారు .గాంధీజీ పిలుపు విని వృత్తివదిలేసి ,ఉద్యమాలలో పాల్గొని 1921-22లో అరెస్ట్ కాబడి జైలు శిక్ష అనుభవించి విడుదలై ,కాంగ్రెస్ లో చేరి ఉప్పు సత్యాగ్రహం లో1930 పాల్గొని రెండవసారి జైలుకు వెళ్ళారు .1932లో ముస్తఫా క్రూరానికి బలై,చెరసాలపాలై , ,విడుదలై గాంధీ గ్రామ పునర్నిర్మాణం లో చురుకుగా పాల్గొని ,గృహ పరిశ్రమలకు ,ఖద్దరు ఉత్పత్తికి పాటు పడ్డారు .డా జోశ్యుల సుబ్రహ్మణ్యం గారి తర్వాత ఈయన్నే ఎక్కువగా టార్గెట్ చేసి ముస్తఫా లాఠీలతో బాధించాడని రాజమండ్రి పురవాసులు చెప్పుకొంటారు .
2-శ్రీ నాళ౦ భీమరాజు
రాజమండ్రిలో ప్రసిద్ధ వైశ్య కులం లో జన్మించిన శ్రీ నాళం భీమరాజు గారు మహాసాహసి ,పిరికితనం అంటే ఏమిటో తెలియని ధీరుడు .1930ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చారు .1930 డిసెంబర్ లో జరిగిన పెద్దాపురం తోట విందుఏర్పరచిన వారిలో ఒకరు .
ఆ రోజు తోట విందు పూర్తయ్యాక మధ్యాహ్నం 2-30కి పోలీ సులు లాఠీ లతో వస్తున్నారన్నవార్త తెలిసి ,అందరూ చెదిరి పారిపోదామని భావించగా భీమరాజు ఒక్కరే పారిపోవటం పిరికి తనం పారిపోకూడదని పట్టు బట్టగా ,అరగంటలోపే పోలీసులు వచ్చి చితక బాదేశారు అందర్నీ .కోదేటి రంగా చార్యుల చెయ్యి విరగ గొట్టారు .అది మళ్ళీ అతుక్కోలేదు .1937లో చనిపోయాడు .1932లో డా సుబ్రహ్మణ్యం గారితోపాటు భీమరాజుగారినీ పోలీసులు బాదిపారేశారు .భీమరాజును అరెస్ట్ చేశారు విడుదలై ,హార్ట్ అటాక్ తో చనిపోయారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-22-ఉయ్యూరు —
భారతీ నిరుక్తి .41వ భాగం.27.8.22
Video link
భారతీ నిరుక్తి తర్వాత ?
శ్రీ హరి సోదరులు రచించిన భారతీ నిరుక్తి ,ఈ రోజు ఉదయం 10గంటలకు ,,సాయంత్రం 4గంటలకు కూడా ప్రసారం చేసి 30వ తేదీ మంగళవారం ఉదయం తో పూర్తీ చేస్తున్నాము .
31-8-22 బుధ వారం శ్రీ వినాయక చవితినాడు సాయంత్రం 4 గంటలకు ”బ్రహ్మ వైవర్త మహా పురాణం -గణపతి ఖండం ”ప్రారంభి౦చి ,మర్నాడు 1-9-22గురువారం నుంచి ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తాము .వినాయక చవితి శుభా కాంక్షలతో -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-22
శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.7వ భాగం.26.8.22
Video link
స్వాతంత్ర్య విప్లవ కారులకు సహాయ,సహకారాలు అందించిన వంగల వెంకట నారాయణ దంపతులు .
వైదీక తెలగాణ్య శాఖకు చెందిన వంగల వెంకట నారాయణ అత్తిలి వాస్తవ్యులు రసాయన శాస్త్రం లో బి ఏ పాసై ,పాండిత్యం సంపాదించారు .వీరికున్న అభినివేశం ,ఉత్సాహం ఎవరికీ లేదు ., వెంకట నారాయణ ,తమ్ముడు శివరాం కూడా ఇలాంటి వారే ..లక్నో యూని వర్సిటిలో గొప్ప పదవులలో ఉన్నారు .కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారి కుమార్తె ను శివరాం గారు వివాహం చేసుకొని ,యూరప్ అమెరికాలకు వెళ్లి విజ్ఞాన ఖనులుగా గుర్తింపు పొందారు .
వెంకట నారాయణ గారు బియేపాసై ఉపాధ్యాయ వృత్తి లో చేరి ,రెండేళ్ళు పని చేసి జపాన్ వెళ్ళారు .అక్కడ రసాయన శాస్త్రం లో నిష్ణాతులయ్యారు .ఆదేశాలు స్వేచ్చా స్వాతంత్రాలతో వర్దిల్లటం కనులారా చూసి ,తన మాతృభూమి భారత దేశం పరదేశ దాస్య శ్రుంఖలాలలో బంధింప బడటం తట్టుకోలేక పోయారు .
1905-06లో ఇండియాకు తిరిగి వచ్చిన వెంకట నారాయణ గారు వివాహం చేసుకొని రాజమండ్రి లో స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు .అప్పటినుంచి ఆంద్ర తొలిలి విప్లవవీరుడు ఎర్రమిల్లి జగ్గన్న శాస్త్రి గారితో గొప్ప పరిచయం ఏర్పడింది .శాస్త్రిగారు రాజకీయం లో ప్రవేశించగానే వంగల వారు ఆయనకు కుడిభుజంగా నిలిచారు .అత్యంత రహస్య విషయాలు సేకరిస్తూ శాస్త్రి గారికి అందిస్తూ ,కావలసిన అన్ని విధాల సాయం అందించారు .
ఆరోజుల్లో వెంకట నారాయణ గారి ఇల్లు రాజమండ్రి లో తీవ్ర రాజకీయ ఆందోళనలకు నిలయంగా ఉండేది .ఎవరు ఏ విషయం మాట్లాడాలన్నా వెంకట నారాయణ గారింటికే వచ్చి మాట్లాడే వారు .ఎవరెవరు పోలీసు వారంట్ తప్పించుకోవాలన్నా వంగల వారింటికే చేరేవారు .వెంకట నారాయణ దంపతులు అందరికి చక్కని వసతి భోజనాలు సమకూర్చేవారు .వెంకట నారాయణ గారు వారికి గొప్ప సలహాదారు గా మాత్రమె ఉన్నారు .కానీ సాహసించి ముందు అడుగు వేయలేదు .
కానీ ఆయన భార్య అలాకాదు .ఆకాలం లో విప్లవకారులతో దీటుగా పని చేసేవారు .పోలీసుల ఎర్ర టోపీ చూసి భయపడే ఆకాలం లో ఆమె ధైర్య సాహసాలతో ,ఉత్సాహం గా ముందుకు వచ్చి భారత స్వాతంత్ర్య విప్లవానికి సాటిలేని సహాయం చేసేవారు .ఎవరికీ ఏ వార్త చేరాలన్నా, ఆమె ద్వారానే చేరేది అలాంటి’’ కీ రోల్ ‘’పోషించారామే .రకరకాలుగా దుస్తులు మార్చుకొని ,వేషాలు వేసుకొని పోలేసుల కళ్ళు కప్పి ,విప్లవ కారులకు గొప్ప సాయం చేసేవారు .ఆకాలం లో రాజమండ్రి లో అంతటి సాహసం చేసి౦ది వెంకట నారాయణ గారి భార్య ఒక్కరే .
ఒక రోజు దొరసాని వేషం తో గోదావరి స్టేషన్ లో దిగిన ఆమె ను పోలీసులు వెన్నంటారు .రెండు మూడు సందులు దాటి మాయమయ్యారామె .పోలీసులకు ఆమె దొరకలేదు ఎంత ప్రయత్నం చేసినా ..అప్పుడామే సరాసరి’’జాతీయ నాయకులు ‘’పుస్తక రచయిత ,జగ్గన్న శాస్త్రికి కుడిభుజం కోటమర్తిచినరఘు పతి గారింటికి వెళ్లారు .ఆయన తల్లి సోదరి ఆమెను ఆశ్చర్యంగా చూసి ‘’అమ్మా ఇదేమిటి ?’’అని అడిగితె మాట్లాడ వద్దని సౌజ్ఞ చేసి ,లోపలి వెళ్లి దొరసాని వేషం తీసేసి .ముఖానికి పసుపురాసుకొని స్నానం చేసి ,పట్టు చీర పట్టు జాకెట్ ధరించి,నుదుటిపై కాణీ అంత కుంకుమ బొట్టు తలలో పూలు ధరించి ,పళ్ళెం లో పూలు ,పళ్ళు పెట్టుకొని ,చేతిలో చెంబు నీళ్ళు పట్టుకొని ,అతి శాస్త్రోక్తంగా రఘుపతి గారిచ్చిన రహస్యమైన జాబులు మొలలో దాచుకొని ,సరాసరి గుడికి వెళ్లి ,అక్కడినుంచి బండి కట్టించుకుకొని ఇంటికి చేరారు .భర్త వెంకట నారాయణ గారు ‘’ఎప్పుడు వచ్చావు ?ఈ వేషం ఏమిటి ?’’అని అడిగితె ,ఆమె దొరసానివేషం తో తన పుట్టిల్లు అయిన రఘుపతి గారింటికి వెళ్లి ,అక్కడినుంచి తాను తెచ్చిన రహస్య ఉత్తరాలను భర్తకు అందజేశారు .ఇంతటి ధైర్య సాహసాలతో స్వాతంత్ర్య సమరానికి రహస్యంగా తోడుపడిన ఏకైక ఆంద్ర మహిళ వెంకట నారాయణ గారి భార్య ,రఘుపతి గారి సోదరి 1914లో బొంబాయిలో మరణించారు .ఆమె పేరు కూడా మనకు తెలీదు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-22-ఉయ్యూరు
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంవత్సరంలో శ్రీ వంగల వెంకట నారాయణ దంపతులను పరిచయం చేయటం మహదానందంగా ఉంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-8-22-ఉయ్యూరు–
మా నాన్న గారి నవ్యజ్యోతి మాసపత్రిక
మా నాన్న గారు విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్ (ఇ.సి.ఎంహైస్కూల్ )లో సేనియర్ తెలుగు పండిట్ గా 1931 నుంచి 1953వరకు పని చేసినపుడు ‘’నవ్య జ్యోతి ‘’మాస పత్రిక కు సంపాదకులుగా ఉంటూ వెలువరించారని నాకు ఇంతవరకు తెలియదు .దీని విషయం శ్రీ ఆశావాది ప్రకాశరావు గారు రాయల సీమ లో వెలువడిన పత్రికల గురించి సేకరించివిషయాలను తెలుగు అకాదేమికి అందించినట్లు ,ఇవాళ మా అబ్బాయి శర్మ సేకరించి పంపగా తెలిసి మహా సంతోషం పొందాను .వాడికి అభినందనలు -దుర్గాప్రసాద్ -26-8-22-ఉయ్యూరు
Page Number 445 : https://ia801604.us.archive.org/8/items/in.ernet.dli.2015.489107/2015.489107.Telugulo-Parishodhana.pdf
హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి -2(చివరిభాగం
ఇందులో మొదటి భాగం చదివిన శ్రీమతి క్రష్ణమయిగారు వెంటనే స్పందించి అమెరికా నుంచి మెయిల్ లో తాను పాలకొడేటి గురుమూర్తిగారికి మనవరాలు అంటేకుమారుని కుమార్తెఅని తెలియ జేశారు .ఈమె నాకు ఎలా పరిచయం అంటారా ?ఆమె భర్త ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ,117వ మూలకం టేన్నిస్సిన్(Tn)ను ఆవిష్కరించిన మహా శాస్త్రవేత్త శ్రీ ఆకునూరి వెంకట రామయ్య గారిపై నాతొ మా మైనేని గోపాల కృష్ణగారు ‘’అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరి వెంకట రామయ్య ‘’పుస్తకం రాయించి సరసభారతి తరఫున ప్రచురించారు .ఆసమయం లో రామయ్యగారితో, ఈమె గారితో ఎన్నో సార్లు ఫోన్ లో మాట్లాడి విషయ సేకరణ చేశాను .ఇప్పటికే తరచుగా ఫోన్ చేసి ఆదంపతులు మాట్లాడే సౌజన్యమూర్తులు ఆ దంపతులు .మన సరసభారతి ని ఆమె రోజూ చదువుతారు .శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం కార్యక్రమాలు చూస్తారు ,స్పందిస్తారు .ఇంకో విషయం నేను రామయ్య గారిపై రాసిన పుస్తకం అమెరికాలో టెన్నిసీ రాష్ట్రం లో రామయ్య గారింట్లోనూ ,స్పాన్సర్ శ్రీ మైనేని గారుండే అలబామా రాష్ట్రం లోని హ౦ట్స్ విల్ దగ్గరున్న మాడిసన్ కౌంటి లోను ,మూడవసారి ఉయ్యూరులో సరసభారతి ఉగాది వేడుకలలో రామయ్య దంపతుల బంధుగణం సమక్షం లో శాసన మాండలి సభ్యులు శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించి హాట్రిక్ సాధించారు .అంతేనా ?ఈ సంవత్సరం సరసభారతి సాహితీ పుష్కరోత్సవం మా సహస్ర చంద్ర మాసోత్సవం నాడు 27-6-22 సోమవారం శ్రీ మైనేని దంపతులు ఆపుస్తకానికి ఇంగ్లీష్ అనువాదం చేయించి Nuclear Scinntist ’’Dr.Akunuri Venkataramayya ప్రచురించగా నాలుగో సారి రాజేంద్ర ఆవిష్కరించి అరుదైన రికార్డ్ సృష్టించారు .
శ్రీమతి కృష్ణ మయి గారు మెయిల్ లో తెలియ జేసిన విషయాలు –తనమూడవ ఏట తాతగారు గురు మూర్తిగారు మరణి౦చారని ,కనుక తనకు వారితో ప్రత్యక్ష పరిచయం లేదని ,ఆయనకు స్వంత ఇల్లు కూడా లేదని ,కస్టపడి సంపాదించి రాజమండ్రిలో స్వగృహం నిర్మించుకోన్నారని ,కో ఆపరేటివ్ బాంక్ ను రాజమండ్రిలో స్థాపించిన ఘనత వారిదే అని చెప్పారు .ఆ బ్యాంక్ వజ్రోత్సవ అంటే 75 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ఫాదర్ డా.రాం బాబు గారిచే సన్మాన౦చినపుడు తానుకూడా హాజరయ్యానని తెలియజేశారు .పేపర్ వార్తలనుబట్టి గురుమూర్తిగారి 1884లో జన్మించారనీ ,ఆంధ్ర దేశం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి దిట్ట గా గుర్తి౦పు పొందారని ,మునిసిపల్ చైర్మన్ గా ఆదర్శ వంతగా పరిపాలించారని ,స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని జైలుకు వెళ్ళారని ,హరిజన సీవ లో తరించారనీ ,రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఆయుర్వేద మునిసిపల్ ఆస్పత్రి నిర్మించినఘనత తాతగారిదే అని చెప్పారు .తాతగారి ఫోటో కూడా పంపి వ్యాసానికి నిండుదనం చేకూర్చారు
భారతీ నిరుక్తి 40 వ భాగం.26.8.22
Video link
శ్రీ హరి సర్వోత్తమ రావు గారి జీవితం.6వ భాగం.26.8.22
Video link
ఆదర్శ వైద్యుడు ,ఉప్పు సత్యాగ్రహి డా వెలిదండ్ల హనుమంతరావు
బెజవాడకు చెందినా వెలిదండ్ల హనుమంతరావు సంపన్న బ్రాహ్మణులు .B.A.,L.M. అండ్ Sపాసైన డాక్టర్ .నెలకు కనీసం వెయ్యి రూపాయల ఆర్జన .1930లో గాన్దీజే ఉప్పు సత్యాగ్రహ పిలుపు విని రాజకీయ వాలంటీర్ గా పశ్చిమ కృష్ణా లో ఉప్పు సత్యాగ్రహం రెండవ బాచ్ కు నాయకత్వం వహింఛి జైలుకు వెళ్ళాడు .బెజవాడలో అరెస్ట్ అయి ఏప్రిల్ లో రాజమండ్రిజైలులో శిక్ష అనుభవించాడు .ఖైదీలకిచ్చే బియ్యం లో పురుగులు ఉండటం తో భోజనం పై అసహ్యం కలిగి పస్తులే ఉన్నాడు .ఖైదీలలో ఐక్యత సాధించి వారితో ఉదయమిచ్చే గంజి త్రాగటం మాన్పించాడు .జైలు సూపరిన్ టే౦డెంట్ రికర్వ్ పోలీసులను పిలిపించి ,ఖైదీలు ఎందుకు గంజి తాగటం లేదో ఆరా తీయించాడు .హనుమంతరావు గంజిపై తేలిన పురుగులన్నిటిని చూపించాడు .జైలర్ బియ్యం బాగు చేయిస్తామని చెప్పి ,కొందరు ఖైదీల నంబర్లు నోట్ చేసుకొని ఆ రాత్రికి రాత్రే 50మంది సిక్లాస్ ,9మంది బి.క్లాస్ ఖైదీలను రాయవెల్లూరు జైలుకు పంపించాడు .ఇందులో 49మంది తూర్పు గోదావరి జిల్లావారే .మరుసటి వారం మరో బాచ్ బిక్లాస్ ఖైదీలను పంపాడు వీరికి నాయకుడు వెలిదండ్ల హనుమంతరావు .
వీరని అర్ధరాత్రి 12గంటలరైల్ లో తీసుకొని వెళ్ళారు .ముస్తాఫాలీ తో సహా పోలీసు లారీలు సిద్ధం చేశారు .ఒక్కొక్కరినే పిలిచి కిందకు దిగగానే పోలీసులు ,సార్జేంట్లు ఖైదీలపై హత్యాకాండ సాగించారు .ఒకపోలీస్ హనుమంతరావు వీపుపై బలంగా గుద్దగా,ఆయన కింద పడి పోయాడు .ఒక సార్జంట్ ఆయన్ను లాతీ తో విపరీతంగా బాదేశాడు .ఒకపోలీసు ఆయన సామాన్లు పగలకొడితే ఇంకోడు ఆయన పుస్తకాలు చిన్చిపారేసి పైశాచికానందాన్ని పొందారు .రావు గారు స్పృహ కోల్పోయారు .,ఆయన కాళ్ళు చేతులు పట్టుకొని బస్సు వైపుకు ఈడ్చారు .అందరికి ఇదే శాస్తి .ఒక్కొక్కర్నీ బస్సులోకి గిరాటు వేసి వెన్నుపై లాఠీ తో పొడిచి ,లోపలి తోసి ఆతర్వాత రైలు లోనూ ఇలానే ప్రవర్తించారు .రాయ వెల్లూరు లో దిగగానే కొంత చికిత్స చేయించారు .
ఆ దెబ్బల వలన హనుమంతరావు గారి ఊపిరి తిత్తులు బాగా దెబ్బ తిన్నాయి .క్షయ వ్యాధి కలిగింది .ఆయన మళ్ళీ లేచి తిరగలేదు .రాయవెల్లూరు వెళ్ళిన రెండు మూడు రోజులకే ఆయన బంధువులు ,ఆయన చనిపోయారనే గాలి వార్తా విని కంగారుగా బెజవాడ నుంచి చూడటానికి వచ్చి,ఆయన్ను హాస్పిటల్ లో చూసి వెళ్లి పోయారు .జైలు నుంచి విడుదలై బేజా వాడ చేరినా ఆయన ఆరోగ్యం కుదుట బడలేదు .ఇంతటి అనారోగ్యంగా ఉన్న తన తో పాటు విడుదల అయిన ఖైదీల ఇళ్ళకు వెళ్లి ,ఉచితంగా పరీక్షించి మందులిచ్చి వచ్చేవారు .అంతటి నిరాడంబరుడు త్యాగి డా వెలిదండ్ల హనుమంతరావు గారు 1934లో చనిపోయారు .
డాక్టర్ వెలిదండ్ల హనుమంతరావు గారు డా వెలిదండ్ల హనుమంతరావుగారిని గూర్చిఇంటరనెట్లో ఎక్కడా కనపడలేదు. వారిని గూర్చి విజయవాడలో ఇప్పటికీ చాల గొప్ప వైద్యులని చెప్పుకుంటారు. వారి పేరున కట్టిన లైబ్రరీ విజయవాడలో ఇంకా ఉంది. 1930 లో వీరుస్వతంత్ర పోరాటములో జైలుకి వెళ్లి పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారనీ దాంతో వారి ఆరోగ్యంచెడి అకాల మరణం పొందారని శివరావు గారి నోట్సును బట్టీ, 1980 లో విజయవాడలో జరిగిన సభ కరపత్రంరం ఒకటి కనబడటం వలన తెలియ వచ్చింది.
అక్టోబరు ఇరవై తారీఖు 1980 విజయవాడలో వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయ ప్రాంగణంలో కాట్రగడ్డ నారాయణరావు అధ్యక్షతన వెలిదండ్లహనుమంతరావుగారి 49 వ వర్ధంతి సభ జరిగింది. ఆరోజు సభ ప్రారంభకులు తుర్లపాటి కుటుంబ రావుగారు. వక్తలు కాట్రగడ్డ మధుసూదన రావు, దిగవల్లి వేంకట శివరావు, కోగంటి గోపాల కృష్ణయ్య, వెనిగళ్ళ వెంకటేశ్వరావు, పెనమకూరు కేశవరావు గార్లు. వెలిదండ్ల హనుమంతరావుగారిని గూర్చిశివరావుగారి నోట్సులో ఇలా వ్రాశారు “యశః కాయులైన శ్రీ డాక్టరు వెలిదండ్ల హనుమంతరావుగారును నేనూ చిన్నప్పటి స్నేహితులము. ఆయన చాల తెలివైన వాడు. తన 13 వ ఏట నే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై బి.ఎ పట్టాను పొందిన తరువాత చెన్నపట్ణంలోని వైద్య కళాశాలలో చేరినారు. నేను ప్రసిడెన్సీ కాలేజీలో చదువుతున్నాను. మేముభయులము 1918 నుండి 1920 వరకు చెన్నపట్ణం లోని విక్టోరియా హాస్టల్ అనే విద్యార్థి వసతి గృహములో నుండేవారము. ఆయన స్పురద్రూపి సుకుమారి మితభాషి. స్నేహితులెవ్వరైననూ పలకరిస్తే చిరునవ్వు నవ్వే వాడు. ఎక్కువమందితో స్నేహం చేసేవారు కాదు. నీతినియమాలు కలవారు. ఆకాలంలో మద్రాసుమెడికల్ కాలేజీ ప్రిన్సిపాలు, ప్రొఫెస్సర్లు మిలిటరీ హోదాలు గల I.M.S శాఖకు చెందిన బ్రిటిష్ ఉద్యోగులు. వారు నిరంకుశులు. కొంతమంది అవినీతపరులు. దేశీయ విద్యార్థి ఎంత తెలివైనవాడైనా వారినాశ్రయించకపోతే పరీక్షలలో తప్పించేవారు. చివరి పరీక్ష అనంతరం ఎం బీ బి యస్ డిగ్రీ నివ్వక L.M &S అను తక్కువ హోదా గల పట్టానిచ్చేవారు. హనుమంతరావుగారు మొదటినుండీ ఆత్మగౌరవం గలవారు ఒకరినాశ్రయించే స్వభావము లేదు అందువల్ల ఆయనకు L.M &S పట్టామాత్రమే లభించింది.
ఆయన ప్రభుత్వోద్యోగము నపేక్షించక బెజవాడలో స్వతంత్రజీవనం చేయదలచి 1922 సంవత్సరంలో ప్రాక్టీసు ప్రారంభించారు. త్వరలోనే గొప్ప వైద్యుడని నీతి పరుడని పేరు పొందినారు. సాధారణంగా ఒక డాక్టరు ఇంకకొకరిని ప్రోత్సహించరు. హనుమంతరావుగారిది విశాల హృదయం. మా మిత్రుడు డాక్టరు చాగంటి సూర్యనారాయణ మూర్తిగారు 1924 సంవత్సరంలో ఎంబి బియస్ పరీక్ష ఉత్తీర్ణులై ఎక్కడ ప్రాక్టీసు పెడదామా అని ఆలోచిస్తూ వుంటే హనుమంతరావుగారాయనకు బెజవాడలో ప్రాక్టీసు పెట్టమని ప్రోత్సహించారు. నేను 1922 సంవత్సరంనుండీ బెజవాడలో న్యాయవాదిగా నున్నాను మేము చాల స్నేహంగా నుండేవారము. 1930 సంవత్సరం వరకూ హనుమంతరావుగారికి రాజకీయాలతో సంబంధంలేదు. గాంధీమహాత్ముడు ఉప్పుసత్యాగ్రహ ఉద్యమంప్రారంభించగనే ఒకరోజు సాయింత్రం నాథగ్గరకు వచ్చి తాము సత్యాగ్రహ ప్రమాణపత్రిక పైన సంతకం చేశానని చెప్పి రాజకీయ చరిత్ర గ్రంథాలను తీసుకుని వెళ్ళారు. ఆయన తన వైద్య వృత్తిని విసర్జించి సత్యాగ్రహదళమునకు నాయకత్వం వహించి 18 నెలలు కఠిన శిక్ష పొందారు. ఆయనకు శక్షవిధించిన సబు కలెక్టరు హెజమాడీగారికే ఆయన డాక్టరుగానుండిరి. హనుమంతరావుగారికి బి క్లాసు ఖైదీనిచ్చినా ఆయన సి క్లాసు ఖైదీగానే కఠిన నియమాలు పాటించి జైలులోని అక్రమాలు ప్రతిఘటించి లాఠీ దెబ్బలకు గురియైనారు. ఆ దెబ్బల ఫలితంగా ఆరోగ్యం పాడైనది. ఆయనకు జ్వరం వస్తూ వుండేది అయినా లెక్క చేయక జైలులోని కఠిన నియమాలను తు ఛ తప్పక పాటించేవారు. గాంధీ ఇర్విన్ రాజీలో 1931 మార్చిలో విడుదలైవచ్చిన తరువాత ఎండలో విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగ్ చేశేవారు. ఆయన ఆరోగ్యం చెడి క్షయవ్యాధికి గురియై 1931 అక్టోబరు 20 తేదీ అకాల మరణం పొంది యశః కాయులైనారు.
1933 నేను నా మిత్రుడు చెరుకుపల్లి వెంకటప్పయ్య కలిసి రచించిన అధినివేశ స్వరాజ్యము అను రాజ్యాంగ శాస్త్ర గ్రంథమును హనుమంతరావుగారికి బహిరంగ సభలో అంకితం చెశాము. ఆసభకు దేశ భక్త కొండా వెంకటప్పయ్య గారు అధ్యక్షత వహించారు. ఆ అంకితంలో హనుమంతరావుగారిని స్మరించాము” అని శివరావు గారు నోట్సులో వున్నది. ఇంతే కాక శివరావు గారి”Family History and Diary of chronological events” అను పెద్ద డైరీలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం రోజులలో బెజవాడలో జరిగిన ఆందోళన గురించి వ్రాశారు మహాత్మా గాంధీజీ ఇచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో బెజవాడ నుండి 11/04/1930 నాడు మొదటి విడతగా గంపలగూడెం కుమారరాజా గారి ఆధర్యాన బందరు దగ్గర చిన్నపురం బయలు దేరి వెళ్లారు. డా ఘంటసాల సీతారామ శర్మ గారు కూడా మొదటి విడతలో వెళ్లారు. 14/04/1930 తారీఖునాడు డాక్టరు వెలిదండ్ల హనుమంతరావు గారు డాక్టరు ఘంటసాల సీతారామశర్మ గారు కలసి రెండో విడతలో బెజవాడలో కాలి నడకన రైలు స్టేషన్ కు వెళ్లి రైలులో బందరుకు వెళ్లారు. ఆ రాత్రి బందరులో డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారింటి వద్ద బస చేసి మర్నాడు ఉదయం కాఫీ లైన తరువాత బయలు దేరి ముగ్గురు డాక్టర్లు కలసి చిన్నపురం సముద్రతీరంకి వెళ్లి అక్కడ ఉప్పు తయారు చేశారు. అట్లా చేసిన ఉప్పును తీసుకుచ్చి బందరు టౌనులో అమ్మకం చేసి బ్రిటిష్ వారి ఉప్పు చట్టమునుల్లఘించినందున పోలీసు వారిచే అరెస్టు చేయ బడి మెజస్ట్రేటు కోర్టులో హాజరు పరచటం వారికి జైలు శిక్షపటం జరిగింది. 19/04/1930 నాడు నందిగామ బ్యాచ్ అయ్యదేవర కాళేశ్వర రావుగారి ఆధ్వర్యంలో చిన్న పురంలో ఉప్పు తయారు చేయటానికి మచిలీ పట్టణం వెళ్లారు. తత్ఫలితముగా 28/04/1930 నాడు కాళేశ్వరావారుగారికి కారాగార శక్ష విధిచారు. మెదటి బ్యాచ్ లో ఉప్పుచేసిన వారికి అప్పటికే జైలులో నిర్భందిచ బడిన వారైన కుమారాజా గారిని జైలునించి తీసుకుచ్చి కోర్టులో హాజరు పరచారు. ముద్దాయిగా వచ్చిన కుమార రాజాగారికి గౌరవచిహ్నంగా ఆసమయంలో కోర్టు హాలులోనున్న వకీళ్ళందరూ ( ప్లీడర్లందరూ) లేచి నిలబడటంతో ఆకోర్టులోనున్న మాజిస్ట్రేటు నిశ్చేస్టుడై వెలవెల పోయాడు. ఆసమయంలో శివరావుగారు కూడా కోర్టులోనే ఉన్నారు. కుమార రాజాగారికి శివరావు గారే అమికసే క్యూరీగా పనిచేశారు. శివరావు గారి మీద 1930 లో వచ్చిన మొదటి రాజద్రోహం కేసు నంబరు 46, 1930 కేసులో 1930 సెప్టెంబరు 12 వ తారీఖునాడు సర్కిల్ ఇన్ స్పెక్టరు స్వామి గారిచ్చివ వాగ్మూలాన్ని బట్టి స్వతంత్ర ఉద్యమాల్లో పోలీసు వారిచే అరెస్టు కాబడిన చాల మంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులను కోర్టులో హాజరు పరచిన ప్పుడు శివరావు గారే కోర్టు వారి అనుమతితో అమికస్ క్యూరి [ అంటే ప్రత్యర్థి తరఫు వకీలు, defendant lawyer ]గా వుండేవారని తెలుస్తున్నది. వెలిదండ్ల హనుమంతరావుగారికి కూడా శివరావుగారే అమికస్ క్యూరీగా నుండియుండవచ్చు. 08/05/1930 నాడు బెజవాడలో డా వెలిదండ్ల హనుమంతరావు గారి ఆధ్వర్యాన్న ఉప్పుసత్యాగ్రహ ఉరేగింపు జరిగింది. అందులో చాలమంది పురప్రముఖలు కూడా వున్నారు 1923 డిసెంబరు 28 తారీఖనాడు కాకినాడ కాంగ్రెస్ మహా సభ జరిగినప్పుడు డాక్టరు వెలిదండ్ల హనుమంతరావుగారు డాక్టరు ఘంటసాల సీతారామ శర్మగారు వైద్య సిబిరం నెలకొలిపి కాంగ్రెస్సు కార్యకర్తలకు సభకు వచ్చిన ఇతర ప్రజానీకానికానికి కావలసిన వైద్య సహాయమునిచ్చారు. ఆ కాకినాడ కాంగ్రెస్సు మహా ఘనంగా జరిగింది. చెరుకుపల్లి వెంకటప్పయ్య గారు దిగవల్లి శివరావు గారు స్వరాజ్య పత్రికాప్రతినిధులుగా ఆరోజు సభలో పాల్గొన్నట్లు శివరావుగారి డైరీలో వ్రశారు. 15/06/1930 తారీఖునాడు డా శర్మ, వేలూరి యజ్ఞన్నారాయణ, డా వెలిదండ్ల హనుమంతరావు, బ్రహ్మాండం నరసిహాం, గోనుగుట్ల సుబ్రహమణ్యగుప్త, నూకల వీర రాఘవయ్య, వీర మల్లయ్య మొదలగు వారలు మొత్తం 40 మందిని రాజమండ్రీ సెంట్రల్ జైలులోని బ్రిటిష పోలీసు సార్జంటు దౌర్జన్యంగాలాఠీతో కొట్టారు, వారి మంచనీళ్ల మగ్గు, కళ్లజోడును కారణం లేకుండా విరక్కొటి వారందరును (మొత్తం 40 మందిని) ఆరోజువెల్లూరు తరలించటానికి సి ఆర్ పి సిబ్బందికప్పచెప్పారు 16/06/1930 నాడు పొద్దున్నే వారిని రాజమండ్రీ జైలునుండి వెల్లూరికి పాసింజరు రైలులో ప్రయాణాంచేయించి వెల్లూరు జైలుకు తరలించారు. దారిలో బెజవాడ రైలు స్టేషన్ లో పౌరులూ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు శివరావుగారు కూడా రైలు స్టేషన్ కు వారలను చూడ్డానికి వెళ్లారు. పోలీసు వారి బందోబస్తీ నిఘాలో రైలు బండిలో ఖైదీలు గానున్న చాల మంది శివరావుగారితో పోలీసు వారు చూడకుండా చిన్న చిన్న సందేశాలిచ్చారు. అందులో డా శర్మగారు పెన్సిలోతో వ్రాసిన చిన్న లేఖలో శివరావుగారికి పోలీసువారు రాజమండ్రీ జైలు గేటుదగ్గర ఆ క్రితం రోజు రాత్రి ఎలా కొట్టిందీ వ్రాసి దానిని ప్రచురించవద్దని కోరారు. బాగా దెబ్బలు తిన్న వారిలో బ్రహ్మాండం నరసింహాం వెలిదండ్ల హనుమంతరావు గారు . ఆ జైలు సంఘటన కృష్ణా పత్రికలో డిసెంబరు 12 వ తారీఖ 1930 నాడు బొబ్బిలి పాట వరుసలో గురజాడ రాఘవ శర్మ రచించిన పాట ప్రచురించారు ( దాని ప్రతి చివరిలో జత పరిచాము) 31/01/1962 తేదీన ప్రచురితమైన వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయ రజతోత్సవ సంచికలో డాక్టరు శ్రీ వెలిదండ్ల హనుమంతరావు గారిపై దిగవల్లి వేంకట శివరావు గారు వ్రాసిన వ్యాసంలో ఇంకా కొన్ని వివరాలు: వెలిదండ్ల హనుమంతరావు గారు గుడివాడ కాపురస్తులు. వారు బహుశా 1895 లో జన్నించియుండచ్చని శివరావు గారి అంచనా. వెలిదండ్ల దాసయ్య గారి పెద్దకుమారుడు.
హనుమంత రావు గారి విద్యాభ్యాసం
వెలిదండ్ల హనుమంతరావు గారు గుడివాడ కాపురస్తులు. వారు బహుశా 1895 లో జన్నించియుండచ్చని శివరావు గారి అంచనా. మూడవ ఫారం వరకూ గుడివాడలో తరువాత బందరు హైస్కూలులో స్కూలు ఫైనల్ దాక చదివారు. వారు 13 వ ఏటనే స్కూలు ఫైనల్ క్లాసుకు వచ్చెను. కానీ ఆ సంవత్సరం వారి ఆరోగ్య దృష్ట్యా వారి లెఖ్ళ ల మాస్టారు వారిని పరీక్షకు కూచ్చోవద్దన్న కారణంగా మరుసటిసంవత్సరం స్కూలుఫైనల్ కు వెళ్లి ప్యాసై బందరు నోబుల్ కళాశాలలో ఇంటరులో చేరి తరువాత మద్రాసులో క్రిస్టియన్ కాలేజీకు వెళ్ళి భౌతిక శాస్త్రములో బి.ఎ డిగ్రీలో చేరి 1916 లో పట్టభద్రులైరి. వారిని ఇంజనీరింగు కళాశాలలో చేరమని చాలమంది ప్రోత్సహించిరి కానీ ఆయన వైద్యకళాశాలలో చేరారు. ఆదే కాలం విక్టోర్యా హాస్టలులో వీరికి సమకాలీకులగా 1918-1920 లో దిగవల్లి వేంకట శివరావు గారు కూడా యున్నారు ( చూడు దిగవల్లి వేంకట శివరావు Wikipidea Telugu ). అటువంటి అమూల్య విశేషాలు “Reminiscences of Victoria Hostel” అని శివరావుగారి డైరీలో వ్రాసుకున్నారు.
వైద్య వృత్తిలో హనుమంతరావు గారి ప్రఖ్యాతి
ఆయన ప్రభుత్వోద్యోగము నపేక్షించక బెజవాడలో స్వతంత్రజీవనం చేయదలచి 1922 సంవత్సరంలో ప్రాక్టీసు ప్రారంభించారు. త్వరలోనే గొప్ప వైద్యుడని నీతి పరుడని పేరు పొందినారు. హనుమంతరావుగారి సౌమ్యస్వభావము, వైద్య ప్రావీణ్యత, సర్వజన సమానత్వము వలన త్వరలోనే వారు ప్రముఖ వైద్యులుగా రాణించారు. బెజవాడలోనున్న వారే గాక చుట్టు పట్ల గ్రామాలు పట్టణములనుండి గూడా అనేక మంది వైద్యానికి వచ్చేవారు. ధనవంతులైనా హోదా కలవారైనా వారిదగ్గరకు వైద్యానికి వరుసలో నున్న రోగులతో పాటు రావలసినదే. బీదవారిని చాల దయగా చూచేవారు. పధ్య పానవిషయములు పాఠించని రోగులతో చాల కఠినముగా మందలించేవారు ఒకక్క సారి చాల కోపంగా రోగులపైనా రోగుల బంధువులపైనా పరుషముగా మాట్లాడినా అపాయస్థితిలో నున్న రోగులను చంటి పిల్లలవలే చూసుకునే వారు. వారి హృదయము కోమలమని రోగులు గ్రహించగలిగారు.
వైద్యమహాసభలలో హనుమంతరావుగారి పాత్ర
1927 లో హనుమంత రావు గారు, వారి సమకాలీక వైద్య మిత్రులు డా పాలకోడేటి గురుమూర్తిగారు కలిసి రాజమండ్రిలో రాష్ట్రీయ వైద్య మహా సభ జరిపారు. తరువాత 1928 లో బెజవాడ మెడికల్ యసోసియేషన్ అను వైద్యసంఘమును స్థాపించి దానికి కార్యదర్శిగా చేశారు. ఆ సంస్ధ నానాటికి అభివృధ్ధి చెంది బెజవాడలో నున్న డాక్టర్లందరి క్షేమలాభములకొరకు పనిచేసి ప్రఖ్యాతి గాంచింది.
స్వతంత్ర పోరాటము
1930 సంవత్సరం వరకూ హనుమంతరావుగారికి రాజకీయాలతో సంబంధంలేదు. ఆయన తన వైద్య వృత్తిని విసర్జించి సత్యాగ్రహదళమునకు నాయకత్వం వహించి 18 నెలలు కఠిన శిక్ష పొందారు. క్లాసు ఖైదీగానే కఠిన నియమాలు పాటించి జైలులోని అక్రమాలు ప్రతిఘటించి లాఠీ దెబ్బలకు గురియైనారు. ఆ దెబ్బల ఫలితంగా ఆరోగ్యం పాడైనది. ఆయనకు జ్వరం వస్తూ వుండేది అయినా లెక్క చేయక జైలులోని కఠిన నియమాలను తు ఛ తప్పక పాటించేవారు. గాంధీ ఇర్విన్ రాజీలో 1931 మార్చిలో విడుదలైవచ్చిన తరువాత ఎండలో విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగ్ చేశేవారు.
మరణం
ఆయన ఆరోగ్యం చెడి క్షయవ్యాధికి గురియై 1931 అక్టోబరు 20 తేదీ అకాల మరణం పొందినారు.1930 లో వీరుస్వతంత్ర పోరాటములో జైలుకి వెళ్లి పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారనీ దాంతో వారి ఆరోగ్యంచెడి అకాల మరణం పొందారని శివరావు గారి నోట్సును బట్టీ, 1980 లో విజయవాడలో జరిగిన సభ కరపత్రంరం ఒకటి కనబడటం వలన తెలియ వచ్చింది.
నేను 1956నుంచి 1960వరకు బెజవాడ ఎస్ఆర్ఆర్ కాలేజిలో ఇంటర్ బీస్ సి చదివాను .సాయంకాలలో హనుమంతరాయ గ్రంధాలయానికి వెళ్ళే వాడిని అక్కడే అనేక విలువైన గ్రందాలున్దేవి చాలారకాల దినపత్రికలు వీక్లీ మాస పత్రికలూ అక్కడే చదివాను .చాలా నిశ్శబ్దంగా ఉండేది .నిర్వహణ బాగా ఉండేది .దానికి అనుబంధంగా నాటక శాల ఉండేది అక్కడ ఎప్పుడూ నాటక ప్రదర్శనలో సంగీత కచేరీలో ,సాహితీ ప్రసంగాలో జరిగేవి .
కానీ అప్పుడు నాకు హనుమంతరావు గారి గురించి ఏమీ తెలీదు .ఆయన బస్ట్ సైజ్ విగ్రహం మాత్రం రోజూ చూసేవాడిని .అంతటి మహానుభావుని గురించి రాసే అదృష్టం ఇవాళ కలిగింది .
ఆధారం –స్వాతంత్ర్య సత్యాగ్రహి శ్రీ కోటమర్తి చిన రఘుపతి రాసిన –జాతీయ నాయకులు –రెండవ సంపుటం ,మరియు వీకీ పీడియా
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-22-ఉయ్యూరు
హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి
పశ్చిమ గోదావరిజిల్లా గరగ పర్రు గ్రామం లో 1884లో శ్రీ పాలకోడేటి గురుమూర్తి సద్వంశ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించారు .మెట్రిక్ పాసై L.M.P.చదివి రాజమండ్రిలో వైద్య వృత్తి చేశారు .1910లో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి ,అయిదేళ్ళు పని చేసి ,తర్వాతఏజెన్సీప్రాంతంలో మూడేళ్ళు డాక్టరీ చేశారు .1918లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీ నామా చేసి ,రాజమండ్రి లో స్వంతంగా విద్యాలయం నెలకొల్పి ప్రజా సేవ చేయటం ప్రారంభించారు .
హరిజన ఉద్ధరణ పై అభిమానం కలిగి సేవ చేశారు. రాజమండ్రి పురపాలక సంఘానికి 1925నుంచి 1927 వరకు రెండేళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు .ఆంధ్రా మెడికల్ అసోసియేషన్ కు మూడు సార్లు అధ్యక్షులుగా పని చేశారు .మద్రాస్ మెడికల్ కౌన్సిల్ ఎక్సిక్యూటివ్ మెంబర్ కూడా .ఉత్తర విశాఖ జిల్లాలో క్షామం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవటానికి గొప్ప సేవ చేశారు .
ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఉంటూ కాంగ్రెస్ సేవ చేశారు .ఇంతటి మహాను భావుడిని రాజమండ్రి’’ పందిరి వారి వీధి’’లో ముస్తఫా స్వయంగా క్రూరంగా లాఠీ చార్జి చేశాడు .గురుమూర్తిగారి తలను పట్టుకొని గోడ కేసి కొట్టాడు ఆ రాక్షసుడు .ముస్తఫా నరరూప రాక్షసుడైన పోలీస్ ఆఫీసర్ .వాడి నరనరానా అక్కసు ద్వేషం ,ప్రతీకారం జీర్ణించుకు పోయాయి .ఆ ఆవేశంతో ఉచితాఉచితాలు లేకుండా కాంగ్రెస్ వాదులను కొట్టేవాడు. ఇలాగే వీడి చేతులలో దెబ్బలు తిన్నవారిలో బ్రహ్మా జోస్యుల సుబ్రహ్మణ్యం వెలిదండ్ల హనుమంతరావు గార్లు కూడా ఉన్నారని ముందే చెప్పుకొన్నాం .డాక్టర్ గురుమూర్తిగారు ముస్తఫా చేతిలో ఎన్ని దెబ్బలు ,ఎన్ని పోట్లు తిన్నారో లెక్కే లేదు .
గురుమూర్తిగారు ప్రఖ్యాత అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరి వెంకట రామయ్య గారి అర్ధాంగి శ్రీమతి కృష్ణ మయి గారికి మాతా మహులు అని ఆమె చెప్పినట్లు జ్ఞాపకం .ఇంతకంటే గురుమూర్తి గారిపై సమాచారం దొరకలేదు .వారి కుటుంబ సభ్యులెవరైనా వారి గురించి మిగిలిన విషయాలు తెలియ జేయచ్చు.వారి ఫోటో కూడా దొరకలేదు .
(శీ, పాలకోడేటి గురుమూర్తి
1884 జననం. సర్దార్ వల్లభాయిపకేల్ లాంటి దిట్ట. నిర్మోహమాటి.
నీతి, నిజాయితీలకి మరోపేరు. వెద్యవృత్తిలో పేదసాదలకి ఎంతో సేవచేశారు.
జాతీయోద్యమాలలో జెలుశిక్షలను అనుభవించి, సత్యా(గహాలలో లారీ
దెబ్బలుతిన్నారు. మునిసిపల్ చైర్మన్ గా ఆదర్శవంతంగా కృషిచేశారు. హరిజన,
సహకారోద్యమాలకి వూపిరిగా సేవలు చేశారు. ఆజన్మాంతం ఆదర్శవంతంగా
జీవించారు. 1984లో కీర్తి శేషులెనారు. రాజమండ్రికి వలస వెళ్ళిన పాలకోడేటివారి కుటుంబం శ్రీయుతులు గురుమూర్తిగారు, సూర్యప్రకాశరావు గారు, రామ్మూర్తిగారు, వంటి ప్రముఖులతో విశ్వఖ్యాతం పొందుతోంది. అయితే వీరు రాజమండ్రికి దగ్గర్లోనే వున్న రాజానగరం సమీపంలోని గండేపల్లి నుంచి రాజమండ్రికి వలస వచ్చారనే ఊహ కూడా వుంది. రాజమండ్రిలోని ఇన్నీస్పేటలో నాల్గవవీధి ‘పాలకోడేటివారి వీధి’. మాజీ ఛైర్మన్ స్వాతంత్య్ర సమరవీరుడు, సుప్రసిద్ధ సహకారవేత్త, డాక్టర్ పాలకోడేటి గురుమూర్తిగారు ఈ వీధిలో నివసించేవారు. ఎందరో ఉద్యమవీరులకు ఇక్కడ అతిథ్యం లభించేది. దాదాపు నగరంలోని సహకార సంస్థలన్నింటిని వీరే స్థాపించారు. పురపాలక సంఘం పక్షాన ప్రప్రధమంగా ఆయుర్వేద ఆసుపత్రిని ప్రస్తుత కోటిపల్లి బస్టాండ్లో నెలకొల్పారు. అది ఈనాటికీ పనిచేస్తోంది. విచిత్రమేమంటే ఇప్పుడు పాలకోడేటి వారి వీధిలో పాలకోడేటి వారికి స్వగృహం లేదు.
డా॥ పాలకోడేటి గురుమూర్తి చేతి మహిమ
1933 వ సం॥లో హరిజవాశమంలో వుంటుండగనే నుబహ్మణ్యం గార్కి క్షయవ్యాధి అంకురించి_ది, తాత్తాలికమైన చికిత్సవలన కొంత ఉపశ మించింది. కాని వ్యాధి నిర్మూలనం కాలేదు. 1934 సం। వెసవిలో ఆయ నకు చాల (ప్రమాదకరమైన జబ్బు చెపింది. కఫం గొంతుపచ్తైపింది. దాదాపు ఆయన వృత్యువుతో పోరాటాన్నే సాగించాడు. వైద్య సహాయం కోసం రాజమండ్రి నుండి ఎందరో డాక్టర్లు వచ్చారు డా॥ పాలకోడేటి గురుమూర్తి గారు అందరి సలహాలతో వైద్యం చెళారు. ఆయన తుది (ప్రయత్నంగా ఒక యింజక్షన్ యిచ్చి చెతులె త్తి భగవంతుని (ప్రాంచాడు ఆ స్థితిలో మేమంతా యెంతటి నిస్సహాయ నిస్పృహలతో వున్నామో చెప్పనక్కర్లదు,
సు[బహ్మాణ్య ంగారు మృత్యువుతో అలా పోరాడుతూ ‘ ‘My soul shall live as a maonumsnt cf ~esistence to British Imperialism’ (నా ఆత్మ క్ మా9జ్య (పతిఘటనకు శాశ్వత చిహ్నంగావుండుగాక! ‘ | అని గబ్లీగా “కేక లేయటం మొదలె నెట్టారు. మమంతా దేవుడ్ని ప్రొర్సిస్తూ నిశ్చేష్షులె వుండిపోయాము. ఈశ్వరానుగహం వలన అప్పటి కాయన కౌ గండం తప్పింది. కొంచెం బలం చేకూరడంకోనే ఆయన బళ్ళారి సాం దూర్లో కొన్ని నెలలపాబు విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశంతి ఆయన జబ్బును తాత్యా లిక గా పోగొట్టింది. ఏీత్రాకాలంనాటికి ఆయన తిరిగ సీతా నగరం చరుకున్నారు. అప్పటికి ఆ గ్రామంలోని సభ్యులందరూ బైళ్ళనుండి విడుదలై వచ్చిళశారు. కానీ చేతినిండా మనస్సుకు నచ్చిన పని లేక విరుత్సా హంగా కాలం గడపవళలపి వచ్చింది.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-22-ఉయ్యూరు
భారతీ నిరుక్తి .39 వ భాగం.25.8.22
Video link
సంప్రదాయం ,ఆధునికత కలిపి చేసిన షష్టి పూర్తి-2(చివరి భాగం )
19వ తేదీ శుక్రవారం నాడు ఉదయం మేమిద్దరం పద్మ వాళ్ళ మామగారికి నూతన వస్త్రాలు సమర్పించి ,పండిత శాలువా కప్పి నమస్కరించి ఆశీర్వాదం పొందాం.రామకృష్ణ కు పద్మకు నూతన వస్త్రాలు అందించి శాలువా కప్పి జ్ఞాపిక అందించి ఆశీర్వదించాం .మా అమ్మాయి విజయలక్ష్మి దంపతులు వారిద్దరికీ ఇవ్వమని చెప్పిన 5వేలరూపాయలు అందజేసి ,పద్మకు మా సహస్ర చాంద్రమాసోత్సవం సందర్భంగా మంగళహారతి కి గాను వెయ్యిన్నూట పదహారు రూపాయలు అందజేశాం .అలాగే రవి తేజ అమ్మగారికి నాన్న గారికి ,రవళి అత్తగారికి మామగారికి సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక ఇచ్చాం .వీరు సరసభారతి బ్లాగ్ అభిమానులం అని చెప్పారు .అలాగే మా మేనల్లుడు శాస్త్రి ,భార్య విజయలక్ష్మి కొడుకు కృష్ణ కు కూడా శాలువా కప్పి జ్ఞాపిక అందించాం .శుక్రవారం రాత్రి బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఫోన్ చేసి ,మర్నాడు శనివారం సాయంత్రం ఉయ్యూరులో కృష్ణాష్టమి ప్రసంగానికి ఒక చోటుకు వస్తున్నానని ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామిని దర్శించాలని ఉందని తెలియజేస్తే ,మేము హైదరాబాద్ లో ఉన్నామని ,పూజారికి ,సరసభారతి కార్యదర్శి శివ లక్ష్మికి ఫోన్ చేసి ,వారిని గౌరవంగా గుడికి తీసుకు వెడతారని చెప్పాను .అలాగే వాళ్ళిద్దరూ దేవాలయానికి తీసుకు వెళ్లి పూజారి మురళితో ఆలయ మర్యాద ననుసరించి సత్కారం జరిపించి సరసభారతి తరఫున శివ లక్ష్మి దంపతులు వారికి శాలువా కప్పి పిల్లలకు పెట్టిన కృష్ణ గోపికల వేష ధారణ లో పాల్గొన్న బాలబాలికలకుబహుమతులు అంది౦ప జేశారు .శాస్త్రిగారు ప్రేరణాత్మక ప్రసంగం చేశారు అని శివ లక్ష్మి మెయిల్ పెట్టి ఫోటోలు పంపింది .
మూడవ రోజు 20-8-22 శనివారం ఉదయమే లేచి స్నానసంధ్య పూజాదికాలు పూర్తీ చేసి ,ఒక గంట ‘’భారతీ నిరుక్తి ‘’లైవ్ చేశాను గెస్ట్ రూమ్ నుంచే .ఆతర్వాత కిందికి దిగి ,టిఫిన్ ,కాఫీలు హాట్ హాట్ గా స్వీకరించగా ఉయ్యూరునుంచి వచ్చిన మా అన్నయ్యగారి అబ్బాయి రాం బాబు మద్రాస్ నుంచి వచ్చిన మేనల్లుడు శ్రీనివాస్ లను పలకరించి ,ఆరోజు కార్యక్రమం పెళ్లి చూపులు వేడుక ,ఉంగరాలు తొడగటం లో పాల్గొన్నాం .పద్మ తరఫున మేమందరం ,అశోక్ దంపతులు శాస్త్రి కుటుంబం ,రవి తేజ ,రవళి ,మొదలైన వారు ,రామ కృష్ణ తరఫున అల్లుడు కోడలు ,రామకృష్ణ బంధు గణం పాల్గొన్నారు యాంకరింగ్ బావ బావమరది సరదాగా చేసి రక్తి కట్టించారు .పెళ్లి కూతురు తరఫున మేమిద్దరం పెళ్లి పెద్దలుగా ,పెళ్లి కొడుకు తరఫున రామకృష్ణ పెదనాన్న గారి అబ్బాయిలు ఆడపడుచులు వ్యవహరించాం .కాసేపు సూటీ పోటీ మాటలు కవ్వింపులు ,ఇద్దరి అభీష్టాలు తెలుసుకోవటం వారిద్దరికీ వివాహం చేయటానికి నిశ్చయించటం జరిగి ,ఉంగరాలు అంద జేసుకొన్నారు ఉభయులు .ఇంతవరకే మేము ఉన్నాం .
మేము ఇక్కడికి వచ్చి ప్రతిపూట పెడుతున్న ఫోటోలు చూస్తున్నడా. శ్రీమతి కోనేరు లక్ష్మీ ప్రమీల గారు ‘’గురువుగారూ !మీదర్శన భాగ్యం నాకు కలుగ జేయండి ‘అని వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్నారు .వీలుంటే వస్తాను అని రిప్లై ఇచ్చాను .ఆమె 30ఏళ్ళు సంసార జీవితం లో మునిగి తర్వాత భర్త ను ఒప్పించి నెమ్మదిగా ఆపేసిన చదువు ఆయన ప్రోత్సాహంతో కొనసాగించి తెలుగులో ఎం ఏ.పాసై ,ఆంధ్రదేశం లోని ‘’పేరంటాళ్ళు దేవతలు ‘’పై రిసెర్చ్ చేసి పిహెచ్ డి చేశారు .అకస్మాత్తుగా భర్త చనిపోయారు అయినా కృత నిశ్చయంతో దాన్ని ప్రచురించి భర్తకు అంకితం చేశారు .ఆపుస్తకం నాకు ఆమె బెజవాడ సభలో ఇస్తే వెంటనే చదివి ‘’స్వయం సిద్ధ లక్ష్మీ ప్రమీల ‘’అని సమీక్షగా రాసి పంపాను .ఆమెను 2019సరసభారతి ఉగాది వేడుకలకు ఆహ్వానించి మేము ఇస్తున్న ‘’స్వయం సిద్ధ ఉగాది పురస్కారం ‘’అందించాం .ఆమె ఆనందానికి అంతులేదు .ఆమెగుంటూరు జిల్లా వేమూరు గ్రామం లో జన్మించారు .అక్కడే శ్రీ రోశయ్య వేమూరి గగ్గయ్య గార్లు జన్మించిన సంగతి మనకు తెలుసు .ఇప్పుడు రెండవ పుస్తకం గా ‘’వేమూరు గ్రామ చరిత్ర ‘’రాశారు .దీన్ని రాస్తుండగా ఆమెకు హార్ట్ సమస్య వచ్చి రెండు స్టె౦ట్లు’’వేశారు .ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు .ఆమెను చూడటం ధర్మం అనుకొన్నాం .అలాగే బోయిన్ పల్లిలో ఉన్న మా బావగారిని ,బాచుపల్లిలో ఉన్న మా శ్రీమతి అక్కయ్య గారినీ చూడాలని అనుకొన్నాం .
ఉయ్యూరు నుంచి మాతో వచ్చిన కారు ,మా మేనల్లుడు శాస్త్రి కారు లో ఉదం 11 గంకు మేమిద్దరం,మా అబ్బాయి మా ఇద్దరుకోడళ్ళు రాంబాబు ,శ్రీను బయల్దేరి యూసఫ్ గూడా లో ఉన్న ప్రమీల గారింటికి వెళ్లి ,పలకరించాం .ఆమె ఆనందానికి అవధులు లేవు .జ్ఞాపిక అందించి త్వరలో కోలుకోవాలని చెప్పాం .యోగాలో పరుగుపందెం లో ఆటాపాటలలో ఎన్నో బహుమతులు పొందిన ఆమెకు గుండె జబ్బు అంటే ‘’ఇనుముకు చెదలు ‘’పట్టటమే .అక్కడ ఇచ్చిన మజ్జిగతాగి బయల్దేరి సరాసరి ఓల్డ్ బోయిన్ పల్లి లో ఉన్న మా బావగారు -92ఏళ్ళ శ్రీ వివేకానంద్ గారిని చూసి నమస్కరించి ఆశీస్సులుపొంది నూతన వస్త్రాలు అందించి శాలువా కప్పి , జ్ఞాపిక నిచ్చాం .మమ్మల్ని చూడగానే ఆయన ఆనందం ఉత్సాహం రెట్టింపు అయింది .ఆయన నాతొ ‘’నేను ఆంజనేయస్వామికార్యక్రమాలకు నువ్వు అడగక పోయినా వీలువెంట డబ్బు పంపుతున్నాను .ఇంకా కావాల్సి వస్తే మొహమాటం పడకుండా అడుగు ‘’అన్నారు .నేను ‘’మాకు డబ్బు ఏమీ అక్కర్లేదు .మీ ఆరోగ్యం బాగా ఉంటే,మీ ఆశీస్సులు ఉంటె చాలు బావగారూ ‘’అన్నాను .ఆయన వద్ద సెలవు తీసుకొని ,బాచుపల్లి లో ఉన్న 90ఏళ్ళ మా తోడల్లుడు గారి భార్య ,మా ఆవిడ పెద్దక్కగారు శ్రీమతి లక్ష్మీ గారిని-చూసి జ్ఞాపిక అందించి ,వాళ్ళబ్బాయి సూర్యం ఇచ్చిన డ్రింక్ తాగి బయల్దేరి మళ్ళీ క్లబ్ హౌస్ కు సాయంత్రం 4కు చేరాం .అప్పుడు ఏదో తిన్నాం అనిపించినట్లు భోజనం చేసి రూమ్ కు వెళ్లి విశ్రాంతి తీసుకొన్నాం .
సాయంత్రం మెహిందీ హడావిడి ,తర్వాత ఎదుర్కోలు ,ఆతర్వాత సంగీత విభావరి జరిపారు .కుర్రకారు ముసలి వారు అత్యుత్సాహంగా సంగీతం ,నృత్యాలలో పాల్గొన్నారు .ఊగారు తూగారు స్టెప్స్ వేశారు .కిక్ తెప్పించారు .రామకృష్ణ బంధువు ఒక కుర్రాడు అద్భుతంగా చేసి అందరి మెప్పు పొందాడు .హాల్ లోకే మాకు ‘మైసూర్ బొండా’’ సర్వ్ చేయించారు .బాగున్నాయి .మా బావగారరుశ్రీ వేలూరి వివేకానంద్ గారి పెద్ద బావగారు అంటే పెద్దక్కయ్య గారి భర్త శ్రీ మైలవరపు కృష్ణ శాస్త్రి గారి అమ్మాయిలు శ్రీమతి నళిని,సోదరీమణులు భర్తలతో సహా వచ్చి వారే పరిచయం చేసుకొని ,వాళ్ళు నా ఫాన్స్ అని చెప్పి సంతోషం కలిగించారు .ఫోటోలు తీసుకొన్నాం .ఒకే ఒక పుస్తకం ఉంటె నళిని గారికిచ్చి ,అడ్రస్ రాస్తే పుస్తకాలు పంపిస్తానని చెప్పి ఇవాళ రిజిస్టర్ పార్సిల్ లో ఉయ్యూరు నుంచి పంపాను .అక్కడే బయట ఒక వీల్ పై నిలబడి అది గుండ్రంగా తిరుగుతుంటే వీడియో తీయిన్చుకోన్నాం ఉచితంగా .రూమ్ కు వెళ్లి పడుకున్నాం . నాల్గవరోజు 21-8-22 ఆదివారం –ఉదయమే లేచి స్నాన సంధ్య పూజలు పూర్తీ చేసి ,కిందకు దిగే టప్పటికి మద్రాస్ నుంచి రాత్రి ఫ్లైట్ లో వచ్చిన మా పెద్ద మేనకోడలు అంటే మా పెద్దక్కయ్య లోపాముద్ర కుమార్తె ,కొడుకు బాలాజీ ,కోడలు అన్నపూర్ణ కనిపిస్తే పరమాశ్చర్యం వేసింది .అందరు శాస్త్రి కుటుంబం రామ కృష్ణ కుటుబం సరదాగా మాట్లాడుకొంటూ,మాఅమెరికా మనవడు పీయూష్ సరదాగా అడిగినట్లు ‘’టిపినీలు’’తాగి ,‘’కాఫీలు’’ తిన్నాం .సందడే సందడి ,ఊరంతా పండగే ,ప్రతి రోజు పండగే గా ఉంది .మాచి జోష్ ఫీలయ్యారంతా .ఆతర్వాత మా తమ్ముడుమోహన్ ,మరదలు సునీత వచ్చారు.శుక్రవారం కృష్ణాష్టమి సెలవు రోజున ఉదయం మల్లాపూర్ నుంచి మా పెద్దబ్బాయి శాస్త్రి ,కోడలు సమత వచ్చి రాత్రి దాకా ఉండి వెళ్ళారు . మా అన్నయ్యగారి మనవడు రవి భార్య గాయత్రి కొడుకు రేయా౦శ్ లు కూడా వచ్చారు .కళావాళ్లకు జ్ఞాపిక ఇచ్చాం .
ఉదయం 10గంటలకు చి రామకృష్ణ ,చి. సౌ .పద్మ ల షష్టి పూర్తి వేడుక వివాహం పురోహితుడు చక్కగా చేయించారు .మట్టెలు మంగళసూత్రధారణ ,బంతాట ,బిందెలో నీళ్ళలో వేసిన ఉంగరాలు తీయటం వగైరా పెళ్లి తంతు లన్నీ జరిపించారు .తెనాలి నుంచివచ్చిన మస్తానయ్య, కుమార్తె నాదస్వరం వాయిస్తే డోళ్ళువాద్యాలపై ఇద్దరు చక్కని సహకారం అందించి’ సునాద నాద వినోదం ‘’కలిగించారు .అందరూ మహా మెచ్చారు .చెవుల తుప్పు వదిలించారు .ఆ బృందాన్ని అభినందించి సరసభారతి తరఫున మస్తానయ్యగారికి నూతన వస్త్రాలు అందించి ,తండ్రీ కూతుళ్ళకు శాలువాకప్పి రెండు వేల రూపాయలు అందించాం మేమిద్దరంమా మేనల్లుడు శాస్త్రి కుటుంబం .
ఈ నాలుగు రోజులు రాత్రి 11గబ్తలదాకా ఫంక్షన్ లో ఉంటూ మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలకు హాజరవుతూ అలసట లేకుండా ,అందర్నీ చక్కగా పలకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ అంతాతామే గా పని చేసి షష్టి పూర్తిని ఇష్టపూర్తి గా నిర్వహించిన రవి తేజ ,భార్య రమ్య ,రవళి ,భర్త వంశీ లకు అభినదన పూర్వకంగా ‘’వీర తాడుగా ‘’శాలువా కప్పి బుజాలు తట్టి మనస్పూర్తిగా అభినదనలు తెలిపాం మేమిద్దరం .ఆ నలుగురు శిరసులు వంచి కృతజ్ఞతలు తెలియ జేస్తుంటే తెలియని ఆనందం కలిగింది అందరికి .ఇదొక చిన్న అప్రీసి ఏషన్’’మాత్రమె .మేము చూసింది నాలుగు రోజులనుంచే అంతకు ఎన్ని రోజులముందు నుంచి వారు శ్రమిస్తున్నారో ఆలోచిస్తే అర్ధమౌతుంది .అంకితభావంతో చేసిన సమష్టి కృషి ఫలించింది .ఉదయం బాచుపల్లి నుంచి మా రెండో అబ్బాయి శర్మ కోడలు ఇందిర, మనవడు హర్ష ,మనవరాలు హర్షిత కూడా వచ్చి పాల్గొన్నారు .అందరికి హనుమజ్జయ౦తినాడు స్వామివార్లకు వెయ్యి రసాలమామిడి పళ్ళతో చేసిన పూజ ప్రసాదం గా అందరికి గుడిలో పంచగా మిగిలిన పళ్ళతో చేసిన మామిడి తాండ్ర ప్రసాదం అంద జేశాం . ఆతర్వాత భోజనాలు .అప్పుడు మేనల్లుడు శాస్త్రి కొడుకు కృష్ణ తో ‘’మీ నాన్న షష్టి పూర్తి ‘’కూడా మీరు చేయాలి .ఇన్ని రోజులు కాకపోయినా ఒక్కరోజు ఇంతటి ఆర్భాటం లేకుండా చేయండి ‘’అన్నాంమేమిద్దరం .వాడు ‘’మాకూ చేయాలనే ఉంది మార్గశిరమాసం లో .నాన్న ఒప్పుకోవటం లేదు ‘’అన్నాడు ఒప్పించి చేయండి అని సలహా ఇచ్చాం .ఉచిత సలహానేగా .తప్పని సరిగా అన్నాడు .
సాయంత్రం మినర్వా గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో రిసెప్షన్ .మళ్ళీ హడావిడి .ఒకతను ట్రంపెట్ చాలా శ్రావ్యంగా నేపధ్య సంగీతంగా మొదటి నుంచి చివరిదాకా వినిపిస్తూనే ఉన్నాడు .వేదిక పై పద్మ దంపతులకు అభినందన తెలియజేయటానికి మిత్రులు బంధువులు ,కుటుంబ సభ్యులు వచ్చారు .తెలుగు విద్యార్ధి సంపాదకులు స్వర్గీయ కొల్లూరి కోటేశ్వరరావు గారబ్బాయి రమణ ,కొడుకు కోడలూ ఉన్నారు . పత్రిక వస్తోందా అని అడిగితె ‘’మీకు పంపకుండా పత్రిక నడుపుతానా .కరోనా నుంచి పత్రిక నడపటం లేద’’న్నాడు రమణ నిజాయితీగా .
మేనల్లుడు శాస్త్రి పెద్దబావమరాది స్వర్గీయ సత్యనారాయణ భార్య కొడుకు కూతురు వచ్చారు.శుక్రవారం ఉదయం చిన్న బావమరది కామేష్అమెరికా నుంచి కూడా వచ్చి వెళ్ళాడు .మా తమ్ముడికొడుకు రాజు ,కోడలు రాజ్యలక్ష్మి వచ్చారు .మా మేనల్లుడు అశోక్ దంపతులు ,కూతురు భార్గవి అల్లుడు మురారి ,వచ్చారు మనవలు వచ్చారు .మురారి విశ్వనాధ సత్యనారాయణ గారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారి మనవడు అంటే కొడుకు శ్రీనివాస్ కుమారుడు .శ్రీనివాస్ ఉయ్యూరు హైస్కూల్ లోనూ ఇంటి దగ్గర ట్యూషన్ లోనూ శిష్యుడు .బిహెచ్ ఎల్ నుంచి మా కోడలు రాణి అన్నయ్య, కొడుకు వచ్చారు .మళ్ళీ ఇక్కడా సందడే సందడి .పెంద్రాళేభోజనం చేసి కళా వాళ్ళు మద్రాస్ వెళ్ళిపోయారు .మేమూ భోజనాలు చేసి ,బయటకు వస్తుంటే మా శ్రీమతి చిన్ననాటి స్నేహితురాలు వసంత కుటుంబం కనిపించారు .మమ్మల్ని స్టేజి పైకి పిలిచి అందారితో కలిసి ఫోటోలు తీయించాడు రామకృష్ణ .వెళ్లి పోతుంటే ‘’బాబాయి గారూ !రేపు పొద్దున్న ఏడున్నరకు మాఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళాలి మీరు ‘’అన్నాడు సరే అన్నాం .రూమ్ కు వచ్చి పడుకున్నాం .
22-8-22-సోమవారం స్నానసంధ్యాదులు పూజ అయ్యాక పద్మా వాళ్ళింటికి వెళ్లాం .రమణ కూడా వచ్చాడు .అందరికి పొంగల్ ఇడ్లీ గారే సాంబారు అల్లం చట్నీ కారప్పొడి వగగైరాలతో టిఫిన్ పెట్టారుకాఫీ ఇచ్చారు పద్మ దంపతులు .లడ్డూలు ఇచ్చారు . .అన్నీ పూర్తీ చేసి ఉదయం 10గంటలకు కారులో బయల్దేరాం .మల్లాపూర్ మా శాస్త్రి ఇంటికి వెళ్లి మనవడు భువన్ కు ఉయ్యూరు నుంచి తెచ్చిన కొబ్బరికాయలు రామకృష్ణ ఇచ్చిన స్వీట్లు అందించి అక్కడి నుంచి ఉప్పల్ దగ్గర ఆర్ టీసి కాలనీ లో ఉన్న మా బావ వివేకానంద్ గారి చెల్లెలు 86ఏళ్ళ శ్రీమతి శాంతమ్మగారిని చూశాం .ఆమెవరలక్ష్మీ వ్రతం నాడు కుర్చీలోంచి కిందపడితే తుంటిఎముక విరిగితే ఆపరేషన్ చేసి రాడ్ వేశారు .మా కుటుంబం అంటే ఆమెకూ ఆమె భర్త గాడేపల్లి శ్రీమన్నారాయణ గారికి మహా అపేక్ష .రవళి పెళ్ళికి మేమంతా రోజూ ఒకే చోట కూర్చుని భోజనాలు చేశాం. ఆయన నాలుగేళ్ళక్రితం చనిపోయారు .రామకృష్ణ రెండు అంతస్తుల డాబా కట్టుకొన్నాడు .మామిడి చెట్టు ఉసిరి చెట్టు తమలపాకు చెట్టు పెంచాడు. ముందు శ్రీ సంజీవరాయ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది .ప్రశాంత వాతావరణం .మా అందరికి రామకృష్ణ వల్లి దంపతులు నూతనవస్త్రాలు అందించి గౌరవించారు రెండావ కొడుకు మహేష్ కూడా చాలా ఆప్యాయత చూపించాడు .రామకృష్ణ ను జూన్ 27న ఉయ్యూరులో జరిగిన సరసభారతి సాహితీ పుష్కరోత్సవం నాడు ఉయ్యూరుకు ఆహ్వానించిపురస్కారం అందించి నూతనవస్త్రాలు సమర్పించి శాలువాకప్పి జ్ఞాపికా నగదుతో సత్కరించాం .భార్యకు మా ఇంటి వద్దనే చీర సారే పెట్టాం .చాలాకలుపు గోలుగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఉయ్యూరులో .
అక్కడినుంచి మళ్ళీ రోడ్డునపడి ,మధ్యాహ్నం 3కు సూర్యాపేట దగ్గర కాకినాడ వారి సుబ్బయ్యగారి హోటల్ లో భోజనంఒక్కొక్కరికి 279రూపాయలతో చేసి రాత్రి 7-30కు ఉయ్యూరు చేరాం .ఈ అయిదు రోజుల పర్యటనలో మా మనవడు చరణ్ మనవరాలు రమ్య మా రెండు ఇళ్ళను ,వాటర్ ప్లాంట్ ను చూసుకొంటూ వాడు జాబ్ ట్రెయినింగ్ అవుతూ కాన్ఫరెన్స్ కు అటెండ్ అవుతూ ,పిల్ల బెజవాడ కాలేజికి వెళ్లి వస్తూ ఎంతో ధైర్యంగా ఉన్నారు .హైదరాబాద్ నుంచి ప్రతిపూటా ఫోన్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాం .వీళ్ళిద్దరూ అభినందనేయులే .
పదనిసలు –
1-సాధారణంగా షష్టి పూర్తికి చేసే కలశ స్థాపన ,పూజ ఉద్వాసన తర్వాత దంపతులు ,దంపతి పూజ చేసి సత్కరించి ఆశీస్సులు పొంది భర్తకు కలశం కొబ్బరికాయ ,భార్యకు జాకెట్ ముక్క ఇవ్వటం సంప్రదాయం .కానీ పద్మా వాళ్లకు ఆవిషయం తెలుసో లేదో తెలీదు .చేయించే బ్రహ్మగారు చెప్పారో లేదో తెలీదు .అవగానే పురోహితుడు అన్నీ మూటలు కట్టి తీసుకు వెళ్ళటం చూశాం .కాంట్రాక్ట్ వ్యవహారం లో భాగమేమో .
2-క్లబ్ హౌస్ లో వేడినీరు సరఫరా లేదు .ముసలి ముఠాకు ఇబ్బంది .మాకు రూమ్ లో కరెంట్ తో వేడినీళ్ళు కాచుకొనే ఫ్లాస్క్ ఉంది .కనుక ఇబ్బంది లేదు దానితో కాచుకొని మా శ్రీమతి స్నానించింది .నేను చన్నీళ్ళే చేశాను .
3-ఎసి కూడా సరిగా పని చేయలేదు .మాకు ఇబ్బంది లేదుకాని పద్మ అక్కయ్య బావగారు మా పక్క రూమ్ లో ఉన్నారు బాగా ఇబ్బంది పడ్డారు .ఆవిడ చాలా కలుపుగోలు మనిషి. వాళ్ళల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆవిడే .
3-రూమ్ క్లీనింగ్ లేదు .పక్కబట్టలు మార్చటం లేదు .ఇవి క్లబ్ మేయిన్ టేనెన్స్ వారి బాధ్యతలు .
4-వై.ఫై. రోజులివి .కింద తప్ప పై రూమ్స్ కు కనెక్షన్ రాలేదు .
సరిగమలు
కార్యాలలో ఇవన్నీ మామూలే .వీటిని మించి మనం ఆలోచించాలి .మేము అయిదు రోజుల షష్టి పూర్తీ అతి ఆనందంగా అనుభవించాం .ఒకరకంగా పరవశించాం .ఆప్యాయత ఆదరణ గౌరవం మన్నన మర్యాదా చూపిన పద్మ రామ కృష్ణ కుటుంబానికి మనస్పూర్తిగా అభినందనలు .రామ కృష్ణ అన్నగారబ్బాయి ఒకాయన మా దగ్గరకు వచ్చి ‘మీరు రావటం వలన కార్యక్రమానికి నిండు దనం వచ్చింది. ధన్యవాదాలు ‘’అని చాలా సార్లు అన్నారు .పద్మ దంపతులు పదే పదే అలానే అన్నారు .వారందరికీ వినాయక చవితి ,నవరాత్రి, దీపావళి శుభా కాంక్షలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-22-ఉయ్యూరు
.
భారతీ నిరుక్తి .38వ భాగం.24.8.22
Video link
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
‘’అక్షరం లోక రక్షకం ‘’
సాహితీ బంధువులకు శుభకామనలు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు
సరస భారతి 167వ కార్యక్రమంగా 2022 మార్చి లో లో పదవతరగతి పాసై , అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦ శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం నాడు 5–9-22 సోమవారం ఉదయం 10.గం కు అమరవాణి హైస్కూల్ లో మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .అలాగే శ్రీ కోట మాస్టారి శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం పేద ప్రతిభగల ఒక SC విద్యార్ధికి ,ఒక BC విద్యార్ధినికి అంద జేయబడుతుంది .సాహిత్య ,విద్యాభిమానులుఅందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
కార్య క్రమం -5-9-22 సోమ వారం ఉదయం 10.గం.లకు
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ఆత్మీయ అతిధులు -పురస్కార ప్రదాతలు శ్రీ కోట గురుపుత్రులు ,శ్రీ కోట సోదరులు – శ్రీ కోట చంద్రశేఖర శాస్త్రి గారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు ,శ్రీ కోట రామకృష్ణగారు ,శ్రీకోట సీతారామాంజనేయులు గారు .
కార్యక్రమ వివరం
శ్రీ కోట గురువరేణ్యుల ,శ్రీసర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్ర పటాలకు పుష్పమాలాలంకరణం
1- శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన – శ్రీ కోట గురువరేణ్యులు కీ .శే .శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం –
ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో చదివి 2022 పబ్లిక్ పరీక్షలో పదవతరగతి 546/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీచైతన్యలో ఇంటర్ చదువుతున్న –చిర౦జీవి కుందేరు నాగ సాయి కృష్ణ తేజ కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )
2-శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన -కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం
ఉయ్యూరు శ్రీనివాస అక్షరాలయం లోచదివి 2022 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 536/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీనివాస కాలేజిలో ఇంటర్ చదువుతున్న
కుమారి వేదాంతం శ్రీ కమల తేజస్విని కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )
3-శ్రీ కోట గురు వరేణ్యుల శిష్యులు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన
కీ.శే. శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారం –S.C..విద్యార్ధికి
ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 549/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,నారాయణ కాలేజిలో ఇంటర్ చదువుతున్న
చిరంజీవి జిత్తుక దీక్షిత్ బాబు కు –
5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతి అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.
4- కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం -BC విద్యార్ధినికి
ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 576/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీ చైతన్య కాలేజిలో ఇంటర్ చదువుతున్న
కుమారి ధూళి పూడి త్రిష కు
5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతి అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.
సరస భారతి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సన్మానం
–అమరవాణిలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు
ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలతో
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు పివి.నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి హైస్కూల్
24-8-22-ఉయ్యూరు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి.జీవితం.5వ భాగం
Video link
సంప్రదాయం ,ఆధునికత కలిపి చేసిన షష్టి పూర్తి
నేపధ్యం –మే 22 న మామనవడు చి. చరణ్ ఉపనయనం ఉయ్యూరులో చేయగా ,మా మేనకోడలు శ్రీమతి పద్మ ,భర్త చి రామకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చిఆత్మీయంగా పాల్గొని ఆశీర్వదించి ,వెడుతూ రామకృష్ణ మా దంపతులతో ‘’బాబాయి గారు ,పిన్ని గారూ! నా షష్టిపూర్తి ఆగస్ట్ లో చేసుకొంటాం ,మా ఇరువైపులా పెద్దలు మీరే .తప్పక వచ్చి ఆశీర్వదించాలి ‘’ అని కోరారు .’’సరే ‘’అన్నాం మామూలుగా .
ఆతర్వాత తిధులప్రకారం జ్యేష్టబహుళ సప్తమి సోమవారం నాడు నాకు 82వెళ్లి 83 వచ్చిన సందర్భం గా ఉదయం మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారి దేవాలయం లో ,నవ గ్రహ పూజ అత్యంత వైభవంగా ప్రతి గ్రహానికి ఆవాహన ,ఆ గ్రహం ఉండే కిలో రంగు పూల తో పూజ ,నైవేద్యం ,ఆ గ్రహానికి ఇష్టమైన ధూపం సమర్పణ ,విసర్జన ,తర్వతా ఆయుస్సు హోమం చాలా శాస్త్రోక్తంగా విజయవాడ నుంచి పిలిపించి ఇద్దరు వైష్ణవ పండితులతో చేయించాడు మా అబ్బాయి రమణ .ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నూతన వస్త్ర ధారణా ,ప్రసాదం నైవేద్యంజరిపించాం పూజారి చేత .ఆతర్వాత మా దంపతులకు అందరి దంపతుల చేత ఒక పళ్ళెం లో పాదాలను కడిగించి ఆపాద జలం అందరికి చల్లించి ,పాద పూజ అనేక రంగుల పుష్పాలతో చేయించారు .తర్వాత దంపతులు వచ్చి మా దంపతులకు నూతన వస్త్రాలు అందించగా మేమూ వారికి అప్పటికప్పుడే వస్త్రాలు అందించాం .చేయించిన వారిని నగదుతో సత్కరించాం .ఆతర్వాత ,వచ్చిన వారందరికీ విందు ఇచ్చాం .దీనికి మంత్రాంగం అమెరికాలో ఉన్న మా అమ్మాయి శ్రీమతి విజ్జి ,ఇండియాలోని మా అబ్బాయిలు శాస్త్రి,శర్మ .ఆ రోజు ఉదయం మా ఇంటినుంచి మమ్మల్ని కారులో ఊరేగింపుగా మా గుడిదాకా సన్నాయి మేళం తో తీసుకు వెళ్ళటం ,గుడికి వంద మీటర్లదూరం కారు ది౦పించి అక్కడినుంచి వేదమంత్ర ఆశీస్సులతో పూర్ణ కుంభం తో పూజారి మురళి ము౦దునడువగా ,బాలిక చేత రెండువైపులా నుంచి పుష్పాలు చల్లించటం ,దారిలో పుష్పాలను చల్లిస్తూ మమ్మల్ని గుడికి తీసుకు వెళ్ళటం ఒక హైలైట్ గా నిలిచి చిరస్మరణీయమైంది .
తేదీల ప్రకారం నా పుట్టిన రోజైన 27-6-22 సోమవారం సాయంత్రం ఏసీ లైబ్రరీలో సరసభారతి ఏర్పడి 12 సంవత్సరాలు అయినందున ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’నా సహస్ర చంద్ర మాసోత్సవం’ కూడా కలిపి సాహితీ మిత్రుల సమక్షం లో జరుపుకొని ,బందరు సంగీత విద్వాంసురాలు శ్రీమతి రాధికా సుబ్రహ్మణ్యం చేత సంగీత కచేరి ,మూడవ తరగతి చదువుతున్న చి.శ్రీవల్లిక చేత నాట్య ప్రదర్శన ఇప్పించి కవి సమ్మేళనం జరిపించి , బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ,మహా అవధాని శ్రీ ఆముదాల మురళి ,యువ అవధాని చి ఉప్పలధడియం భరత శర్మ ,శ్రీమతి చిల్లర భవానీదేవి.శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారితో తో సహా ‘’ 12మంది లబ్ధ ప్రతిష్టితులైనసాహితీ వేత్తలకు ‘’విశిష్ట సాహితీ పురస్కారం ‘’మరో 12అంది యువ సాహితీవేత్తలకు ‘’విశేష సాహితీ పురస్కారం ‘’అంద జేశాం .అందరికి నగదు ,నూతనవస్త్రాలు శాలువా ,జ్ఞాపిక అందించాం .కవులకు నగదు ఉత్తరీయం ,జ్ఞాపికలు అంద జేశాం .ఇక్కడా మాకు నూతన వస్త్రాలు సమర్పించిన వారున్నారు .కార్యక్రమ ప్రారంభం లో అందరికి ఫలహారం టీ ,చివర్లో బొబ్బట్టు వగైరాలతో కమ్మని విందు అంద జేశాం .దీని నిర్వహణా మా అబ్బాయి రమణ ఆధ్వర్యం ,అమెరికానుంచి మా అమ్మాయి మంత్రాంగం లో జరిపింది ,మా అబ్బాయి శర్మ మనవడు హర్ష హైదరాబాద్ నుంచి వచ్చి పాల్గొన్నారు .ఆ మధ్యాహ్నం ఇందులో కొందరు పురస్కార గ్రహీతలు మా ఇంట్లో నే భోజనం చెయ్యటం ,మా కోడళ్ళు సహకరించటం హై లైట్ .ఇదంతా నేపధ్యమే .
పద్మా ,రామ కృష్ణ ఆహ్వానం పంపటం ,ఫోన్ లోమాట్లాడటం జరిగాక తప్పక వెళ్లాలని నిర్ణయించుకొని ,నా పూజాదికాలు అయ్యాక మేమిద్దరం మా అబ్బాయి రమణ కోడలు మహేశ్వరి మూడవ కోడలు రాణీ లతో 18-8-22 గురువారం ఉదయం 7 కు కారులో బయల్దేరి ,మధ్యలో సూర్యాపేట లో ప్రసాద్ గారి హోటల్ లో టిఫిన్ కాఫీలు లాగించి ,మధ్యాహ్నం హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువు గేట్ దగ్గరున్న ‘’ఫార్ట్యూన్ ప్రైం’’ క్లబ్ హౌస్ కు చేరాం .అప్పటికే అందరి భోజనాలు అయ్యాయి .పద్మ దంపతులు కొడుకు అల్లుడు కోడలు కూతురు ఆప్యాయంగా ఆహ్వానించి మాకు పైన రెండు రూమ్స్ కేటాయించగా అందులో చేరి,కిందకు వచ్చి భోజనాలు చేశాం .అప్పటికే మా పెద్దమేనల్లు అశోక్ సంధ్య దంపతులు ,అమెరికా నుంచి వచ్చిన చిన్నమేనల్లుడు శాస్త్రి కొడుకు కృష్ణ కూడా మహాదానందపడ్డారు .అందరం పాతకబుర్లు చెప్పుకొంటూ నవ్వుకొంటూ సరదాగా మాట్లాడుకొంటూ భోజనాలుచేశాం .ఫోటోలు తీసి పంపుకున్నాం .కీరు పరవాన్నం ,పులిహోర పప్పు కూర ,చట్నీ సాంబారు ,రసం పెరుగు వగైరా లతో భోజనం .తృప్తిగా తిన్నాం .’’ఎట్ హోం అట్మాస్స్ ఫియర్ ‘’అనుభవించాం .ఇప్పటి నుంచి రెండు పూట్ల ఒకపూట చేయని పప్పు కూర స్వీట్ హాట్ రిపీట్ కాకుండా వెరైటీ ని చక్కగా మెయింటేన్ చేయించారు పొద్దున్న టిఫిన్ లలో మధ్యాహ్న ,రాత్రి భోజనాలలోకూడా .ఇంతగా ఆలోచించి చేయించటం బహు అరుదు .రసమలై ,పాలకోవా ,రసగుల్లా ,గులాబ్ జాం,జిలేబి ,లడ్డు,బొబ్బట్లు వగైరా స్వీట్లు ,వాంగీ బాత్ ,గోంగూర పులిహోర, బిర్యాని ,ఆకుకూరల చపాతీ ,పూరీ కూర గారే దోసె,ఊతప్పం ,పుల్కామొదలైన వేరైటీ లతో కమ్మని విందు హాయిగా చేయించి ,అడిగి అడిగి వడ్డించి తినిపించారు .బెండు అప్పారావు సినిమాలో రఘుబాబు ఆహుతి ప్రసాద్ తో ‘’అందరూ కత్తులు కఠార్లతో చంపుతుంటే ,మీరు కమ్మటి భోజనాలు పెట్టి చంపుతున్నారండీ ‘’అన్నట్లుగా ఉంది వాతావరణం .ఇంతకీ తి౦ డికోసమే వచ్చావా బాబూ పొద్దున్న జరిగిన విషయాలు చెప్పవా అంటారుకదా –ఉదయంఒక వేదికపై అంకురార్పణ ,60కళాశాల ఆవాహన ,గణపతి పూజ వగైరా లు జరిగాయి మేము వచ్చే లోపే .
సాయంత్రం కల్చరల్ ప్రోగ్రాం .నవ్విస్తూ కవ్విస్తూ ఒకాయన ఈవెంట్ బాగా నిర్వహించాడు .మాజిక్ చేశాడు అందరూ ఫిదా అయ్యారు పోటీలు పెట్టి బహుమతులిప్పించాడు ఒకదానిలో మా కోడలు రాణి ప్రైజ్ కొట్టేసింది కదలకుండా మెదలకుండా సైలెంట్ కిల్లర్ లా .రాత్రి భోజనం చేసి రూమ్ కు వెళ్లి పడుకోన్నాం .
19-8-22 శుక్రవారం తెల్లవారగానే లేచి నేను స్నానం సంధ్య , శ్రీ కృష్ణ జన్మాష్టమి కనుక విష్ణు సహస్రనామం ,కృష్ణ అష్టోత్తరం తో స్పెషల్ గా పూజ నైవేద్యం చేసి ,మా కోడళ్ళు తెచ్చిచ్చిన కాఫీలు తాగి ,కిందికి దిగి టిఫిన్ తిని కాఫీ తాగి పక్కనే ఉన్న పద్మా వాళ్ళ అపార్ట్ మెంట్ లో వాళ్ళింటికి వెళ్లి అక్కడ జరుగుతున్న ఆయుస్ హోమం చూశాం .నాకు ఒక రూమ్ ఇవ్వగా నేను ఒకగంట ‘’భారతీ నిరుక్తి ‘’ప్రత్యక్ష ప్రసారం ఫేస్ బుక్ లో చేశా .తర్వాత పూర్ణాహుతి చూశాం .ఒకప్రక్క సూర్యనమస్కారాలు ,వేరోకప్రక్క మహాన్యాసంతో రుద్రాభిషేకాలు జరిపించారు .ఇది పూర్తయ్యాక మళ్ళీ క్లబ్ హౌస్ కు వచ్చి ,కలశాలకు ఉద్వాసన చెప్పించి,మళ్ళీ పద్మా వాళ్ళ ఇంట్లో అవబ్రుధ స్నానాలు చేయించి మళ్ళీ క్లబ్ హౌస్ కు చేరి ,దశ షోడస దానాలు ఇప్పించి వేదపండిత ఆశీర్వచనం చేయించారు .అందరూ ఘనులైన పండితులే నిష్ణాతులే .తర్వాత భోజనాలు .
సాయంత్రం గానా బజానా యువ బృందం కిరాక్ తెప్పించారు .పద్మ దంపతులు ,కొడుకు కోడలు కూతురు అల్లుడు వాళ్ళతో కలిసి స్టెప్పులకే అందాలు తెప్పించారు ఆడారు పాడారు .పద్మ మనవడు ‘’ఇరగదీశాడు ‘’ఇదంతా యువ బృంద గానం ,ఆట పాట,మజాకా .రామకృష్ణ స్నేహితులు బంధుజనం కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు .భీమ సేన్ నిర్మల్ గారి అమ్మాయి కూడా వచ్చి పాల్గొని నిండుదనం తెచ్చారు .తర్వాత భోజనాలు చేసి మేము రూ౦కు వెళ్లి నిద్రపోయాం .మా అమ్మాయి విజ్జితో ఫోన లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తాజాసమాచారం తెలియ జేస్తూ ,ఫోటోలు పంపించాము .ఈ రోజు నేను పంచ లాల్చీ ధరించాను .పొద్దున్నే చూసిన పద్మా వాళ్ళ డ్రైవర్ సంజీవ ‘’అద్భుతం తాతగారు ‘’అని సంతోషిస్తే బాగుంది తాతగారు అన్నాడు చిరునవ్వుతో తేజ .అంతటా ఆత్మీయత ,అనురాగం గౌరవం దర్శనమిచ్చాయి .ఆ రాత్రి సంజీవ మా రూమ్ కు వచ్చి నాతొ ఎన్నో ఫోటోలు తీసుకోగా అతనికి సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక ఇచ్చాను .అందరూ అభినందనీయులే .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -23-8-22-ఉయ్యూరు
భారతీ నిరుక్తి 36వ భాగం.20.8.22
Video link
భారతీ నిరుక్తి 35వ భాగం.19.8.22
Video link
Video link
శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.4వ భాగం.17.8.22
Video link
శ్రీమద్ధయ వదన (శ్రీమత్ హయ వదన )సంస్కృత శతకం
అంటే శ్రీ హయగ్రీవ శతకం .శతకకర్త శ్రీ బెల్లం కొండ రామరాయకవి ..రామరాయకవి గా ప్రసిద్ధులు .శతకానికి సంస్కృత వ్యాఖ్యానం కూడా ఆయనే రాశారు .నరసరావు పేట డిస్ట్రిక్ట్ మునసబ్ కోర్ట్ ప్లీడర్ శ్రీ నడింపల్లి జగన్నాధ రావు గారిచేత భారతీ ముద్రాక్షర శాలలో ప్రచుతితం వేల కేవలం అర్ధరూపాయి .
మొదటి శ్లోకం –స్వతస్వేతంమందస్మిత రుచిరపరీ వాహ సుభగం –సముద్యడ్డి౦డీరచ్చవి పరివృత౦ కేసర భరం –స్రజాప్తం ,మల్లీనాం కటి విలసిత క్షౌమ రుచిరం –తత శ్రీ ఖండాంబుం,హయవదనt5 మిందు స్థిత మయే ‘’
దీనికి సంస్కృత వ్యాఖ్యానం కూడా రాశారు హయవదనం తో .మందస్మిత ముఖారవి౦ద౦ తో ,కాంతి ఛటలతో ,ధీరోదాత్త౦గా ,షడ్గుణ5 పరిపూర్ణుడై,నురుగు వం6555 హయగ్రీవుడు .చివరిదైన 100వ శ్లోకం –
‘’భవల్లీలా పా౦గ స్రుతత నవసుధాప్లావవివశ –త్వదీయాస్య భ్రష్టం ప్రలపిత శతం కేవలమయ –శబర్యా ఉచ్ఛిష్టంఫలమివ కియంతంరసమిద౦ –ప్రదత్తేవా తే త్వాంహయవదన మిందుస్థితమయే’’
శబరీ ఎంగిలి పండ్లను ఆస్వాదించి ఆనందం పొంది ,కరుణతో మోక్షం ప్రసాదించిన హయవదనుడు శ్రీ హయగ్రీవుడు ,నేను రాసిన రసభ్రష్ట శతకాన్ని ఆయనలాగా రసమయంగా భావించి స్వీకరించి ,కటాక్షించు .హయవదన మిందుస్థితమయే’’ అనేది శతక మకుటం .
‘’ఇతి బెల్లంకొండోప నామక –రామకవి కృతి షు హయ వదన శతకం సంపూర్ణం
శ్రీ హయగ్రీవార్పణ మస్తు .
బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, ప్రముఖ పండితులు, కవి శిఖామణి. ఇతడు గుంటూరు జిల్లా నరసారావుపేట సమీపంలోని పమిడిపాడు గ్రామంలో యువ నామ సంవత్సరం మార్గశిర అమావాస్య నాడు (డిసెంబరు 28, 1875) జన్మించారు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 148 గ్రంథములను రచించారు. వానిలో అష్టకములు, స్తుతులు, అష్టోత్తర శతనామ స్తోత్రములు, సహస్రనామ స్తోత్రములు, గద్య స్తోత్రములు, దండకాలు, శతకములు, కావ్యములు, వ్యాఖ్యాన, వ్యాకరణ, వేదాంత గ్రంథములు మొదలైన అనేక వాజ్మయ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి.
జీవిత విశేషాలు
వీరి తండ్రి మోహన్ రావు, తల్లి హనుమాంబ. వీరిది నియోగి బ్రాహ్మణ కుటుంబం. వీరి పూర్వులు దొండపాడు, గుంటగర్లపాడు అను రెండు అగ్రహారములకేకాక 84 గ్రామములకు ఆధిపత్యము కలిగియుండిరి. వీరందరును దాతలు, శ్రోత్రియులు, నిత్యాన్నదాతలు, విద్యాదాతలు. ఈ వంశములో స్త్రీలు సంస్కృత పాండిత్యము కలిగియుండిరి.శ్రీ రామరాయకవికి ఐదవ సంవత్సరము వచ్చునాటికే తండ్రి దివంగతుడు అయినారు. వీరి పినతండ్రి కేశవరావుగారు శ్రీరామరావు కుపనయనము గావించి కొంత ప్రాధమిక విద్యనేర్పించి తరువాత ఆంగ్ల విద్యాభ్యాసము కొరకు గుంటూరులో ఒక ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టెను.సంస్కృత సాహిత్యమునకు అద్వైత సాహిత్యమునకు అపారమైన సేవ చేయవలసి యుండిన శ్రీ రామరావుకు ఆంగ్లవిద్య వలదని తలచెను కాబోలు ఆయనకు నిత్యము శరీరావస్థత కలుగుచుండెను.విసిగిపోయిన కేశవరావు శ్రీ రామరావును పమిడిపాడులో బెల్లంకొండ సీతారామయ్యగారి వద్ద సంస్కృత విద్యనభ్యసించుటకు ప్రవేశపెట్టెను.అందరికి ఆశ్చర్యపరుచునట్లు సంస్కృత విద్యాభ్యాసముతో శ్రీ రామరావుకు స్వస్థత చేకూరెను.బాల్యము నుండి శ్రీ రామరావు అసమాన ప్రజ్ఞాశాలి. తమ పురోహితులవద్ద కొంత వైదిక విద్యను నేర్చుకొని ఉత్తమ విద్యాప్రాప్తికొరకు తమ ఇంటివద్దనున్న ప్రాచీన హయగ్రీవ సాలగ్రామమునకు భక్తి శ్రద్ధలతో నిత్యము అర్చించుచుండెను.ఒకనాడు హయగ్రీవుడు ఒక వృద్ధబ్రాహ్మణ రూపమున స్వప్నములో శ్రీ రామరావుకు సాక్షాత్కరించి హయగ్రీవమంత్ర ముపదేసించి ఆ మంత్రమునకు అవసరమగు కవచము, మాల, పంజరము, యంత్రము మొదలగువాటిని సమీపమునున్న దమ్మాలపాడు గ్రామములో వైభానస రత్నమాచార్యులవద్ద లభించునని చెప్పి అంతర్ధానమాయెనట.శ్రీ రామరావు గారు దమ్మాలపాటికేగి రత్నమాచార్యుల నుండి హయగ్రీవ మంత్రాంగములగు కవచ, పంజరాదులను సంపాదించుకొని శాస్త్ర విధి అనుసరించి అక్సరలక్షలు జపించి మంత్రమునకు పునశ్చహ్రణము గావించుకొనిరి.తత్ఫలితముగా వారికసాధారణ మేధ, ధారణశక్తి, కవిత్వము లభించెను.తనయొందు పొగి పొరలు భక్తి భవమునకు కవిత్వము తోడుగా రమావల్లభరాయ స్తోత్రము, రమావల్లభరాయ శతకము మొదలగు స్తోత్రములను తమ 16వ యేట రచించిరి. తమ పదునారువ సంవత్సరమునకే “రుక్మిణీపరిణయ చంపూ” “రమాపరిణయ చంపూ” కందర్పదర్ప విలాస భాణము” మొదలగు కావ్యములను రచించిరి. అటుపై తన 19వ సం.న నెల్లూరు వాస్తవ్యులు సింగరాజు వేంకటరమణయ్యగారి ద్వితీయ పుత్రిక ఆదిలక్ష్మమ్మతో వివాహము జరిగెను.వీరికి సంతానము కలుగలేదు.చాలామంది విద్యార్ధులకు అన్నము పెట్టి చదువు చెప్పించి విద్యాసేవ చేసిరి.
గోదావరి మండలము నుండి పురిఘల్లు రామశాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి అను సోదరులు గద్వాల సంస్థానమునకు వెళ్ళుచు పమిడిపాటు చేరి శ్రీరామారావు గారి కోరికపై వ్యాకరణ తర్కశాస్త్రములను బోధించిరి.గురు దక్షిణగా చంపూ భాగవతమునకు “మంధర” అను వ్యాఖ్యను వ్రాసి ఇచ్చిరి.భయంకర రంగాచార్యుల అను శ్రీవైష్ణవ గురువులు తో విభేధము వలన ఆయన వైష్ణవ సంప్రదాయమును తిరస్కరించి స్మార్త బ్రాహ్మణ సాంప్రదాయమును అనిసరించి విభూతి, రుద్రాక్షలు ధరించుచు అప్పటినుంచి విశిష్టాద్వైతమును విభేదించుచు శంకర అద్వైతమును పోషించిచు అనేక విధమైన గ్రంధములను రచించిరి. తమ శిష్యుడగు రాళ్ళభండి నరశింహశాస్త్రి కోరికపై శ్రీ శంకరరామానుజాచార్యుల గీతభాష్యములను రెంటిని చదివి శ్రీరామానుజ గీతాభాష్యము శృతి, స్మృతి ప్రమాణ విరుద్ధమని నిరూపించుచు మూడు మాసములు పాఠప్రవచనము గావించిరి. ఇదే “భగవద్గీతాభాష్యార్క ప్రకాశిక” అను గ్రంధముగా వెలయించిరి.
నిరంతర గ్రంధ రచనానిరతులు, బ్రహ్మచింతా నిమగ్నుడునగు శ్రీరామారావు బాల్యమునందుండి అజీర్ణవ్యాధితో బాధపడుచుండిరి. దానికితోడు మధుమేహ వ్యాధి మరింత పీడించసాగెను. తమ కిష్టములేకున్నను బంధు మిత్ర, శిష్యగణ నిర్బంధముచే చికిత్స కొరకు మద్రాసులోని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులగు పండిత డి.గోపాలాచార్యుల వారి కడగేగిరి. కొంతకాలము మానసిక పరిశ్రమకు తావిచ్చు గ్రంధ రచనము మానుకొనినచో వ్యాధి చికిత్స చేయగలమని చెప్పగా శ్రీరామారావు గారు దానికి అంగీకరింపక చికిత్సను తిరస్కరించి స్వగ్రామమునకు మరలిరి.దినదినమునకు వ్యాధి ముదురుటచే తనకు అంత్యకాలము ఆపన్నమైనదని గ్రహించిరి.బంధు మిత్రాదులు, భార్య బలవంత పెట్టుటచే దత్తపుత్రుని స్వీకరించిరి. చివరకు మధుమేహ వ్యాధి ముదరగా ఆనంద సంవత్సర కార్తీక శుద్ధ నవమి (27-10-1974) నాడు శ్రీరామారావుగారు అస్తమించిరి.
వారి మరణానంతరము బంధువుల నిరాదారణము, శిష్యుల అజాగ్రత వలన వారి ఆముద్రిత గ్రంధములలో కొన్ని నష్టము కాగా కొన్ని అన్యాక్రాంతములయినవి. మిగిలినవి విజయవాడలోని అడ్వొకేటు శ్రీ పాటిబండ సుందరరావుగారు అధీనములోని కొంతకాలమున్నవి. శ్రీరామారావు జీవితాకాలములో కొన్ని మాత్రమే ముద్రింపబడి ప్రకటింపబడినవి.అటుపై ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు నరసారావుపేట వాసి అగు శ్రీ కంతా వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి పలు విరాళములు సీకరించి కొన్ని సంస్కృత లిపిలోను మరికొన్ని తెలుగులోను ముద్రించిరి.
రచనలు[మార్చు]
· చంపూ భాగవతం
· శ్రీ హయగ్రీవ నవరత్న స్తుతి
· వివర్ణాది విష్ణు సహస్రనామ స్తోత్రము
· సిద్ధాంత సింధువు
· భాష్యార్క ప్రకాశిక
· శరీరక చతుస్సూత్రీ విచారము
· వేదాంత ముక్తావళి
· శంకరాశంకర భాష్య విమర్శనము
· శరద్రాత్రి
· శ్రీ రమావల్లభరాయ శతకము
· వేదాంత కౌస్తుభం (1918)
· రుక్మిణీ పరిణయము
· గరుడ సందేశము
· హయగ్రీవ శతకము
· కందర్ప విలాసము
· కృష్ణలీలా తరంగిణి
· కరిభూషణమ్
· కామ మీమాంస
· ధన వర్ణనమ్
· ధర్మ ప్రశంసా
· విద్యార్ధ విద్యోత:
· శూద్ర ధర్మ దర్పణమ్
· అద్వైతాన్యమత ఖండనమ్
· అద్వైతామృతమ్
· అద్వైత విజయః
· వేదాంత నిశ్చయః
· శంకరా శంకర భాష్య విమర్సః
· సిద్ధాంత సిందుః (శ్రీ మధుసూదన సరస్వతి విరచిత సిద్దాంత బిందువునకు విపుల వ్యాఖ్య)
· భగవద్గీతా భాష్యార్క ప్రకాశిక (శ్రీ శంకరవిరచిత గీతాభాష్యమునకు విపుల వ్యాఖ్య)
· చిత్ర ప్రభోపోద్ఘాతః
· త్రిమత సమ్మతమ్
· సుమనో మనోరంజనమ్
· రామాయణాభ్యుదయ హరికధా
· శ్రీ వీరరాఘవస్తోత్రమ్
· శివభుజంగ ప్రయాతమ్
· శరద్రాత్రి (వ్యాకరణ గంధము-సిద్ధాంత కౌముదీ వ్యాఖ్యానము)
· గుంజు గర్వ భంజనం (తిరుపతి వెంకట కవులతో విమర్సనా వ్యాసములు)
· పంచానన పలాయనమ్
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు
హైదర్ జంగ్ ,యయాతి ,విశ్వామిత్ర నాటక తులసీ జలంధర ,మయసభ ఏక పాత్రాభినయంఫేం ,’’చిల్డ్రన్ నటశిక్షణాలయ’’ స్థాపకుడు,హంస అవార్డీ –ఆచంట వెంకటరత్నం నాయుడు
ఆచంట వెంకటరత్నం నాయుడు (1935 మే 28 – 2015 నవంబర్ 25) ఒక రంగస్థల నటుడు.
జీవిత విశేషాలు
ఈయన 1935, జూన్ 28 వ తేదీన కృష్ణాజిల్లా, కొండపల్లిలో జన్మించాడు. వెంకటరత్నం నాయుడు తండ్రి ఆచంట వెంకటేశ్వర్లు నాయుడు, తల్లి వెంకట నరసమ్మ. తండ్రి రంగస్థల కళాకారుడు. అదే వారసత్వంగా ఈయనకు అబ్బింది. గుంటూరు హిందూ స్కూల్లో ఎస్.ఎస్.ఎల్.సి. పాసైన ఆచంట కొంతకాలం ఆయుర్వేద మందులకి రిప్రెజెంటేటివ్గా పనిచేసి, వృత్తికీ, ప్రవృత్తికీ సమన్వయం కుదరక వృత్తిని వదులుకొని నాటకాలలో ప్రవేశించాడు.
తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే నీతిశాస్త్రంలో శ్లోకాలు, పద్యాలు కంఠస్థం చేసి, స్పష్టమైన వాచికంతో, చక్కటి గాత్రంతో పాడుతుంటే స్కూల్లో ఉపాధ్యాయులు ప్రశసించేవారు. కేవలం పద్యనాటకమేకాక అనేక సాంఘిక నాటకాల్లో కూడా ఆచంట తమ ప్రతిభా పాటవాలను తెలుగు దేశ ప్రజలకి తెలియజేశాడు. గుంటూరు నాట్యసమితి ప్రదర్శించిన రామరాజు, నాయకురాలు, అపరాధి వంటి నాటకాలతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తనకంటూ ఓ ముద్ర నేర్పరుచుకున్న నాయుడి ప్రతిభ చూసిన పలు నాటక సంస్థలు ఆయనకి పౌరాణిక చారిత్రక నాటకాల్లో కూడా ప్రధాన పాత్రలను ఇచ్చి ప్రోత్సహించాయి.
ఆంధ్ర లలిత కళాపరిషత్ ప్రదర్శించిన బొబ్బిలి నాటకంలో హైదర్జంగ్, తులాభారం నాటకంలో వసంతకుడు, సక్కుబాయి నాటకంలో కాశీపతి, రామాంజనేయ యుద్ధం లో యయాతి, హరిశ్చంద్ర లో విశ్వామిత్ర మొదలైన పాత్రలతో విజయదుందుభి మోగించాడు.
మయసభ ఏకపాత్రాభినయం నాయుడి నట జీవితంలో ఒక మైలురాయి. సాత్విక పాత్రలకంటే తామస పాత్రలు ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనప్రతిభకు మెచ్చిన అనేక సంస్థలే కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సన్మానాలు, సత్కారాలతో ఆయనని అభినందించింది. ఈలపాట రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయ రాజు, ఎ.వి. సుబ్బారావు, మాధవపెద్ది సత్యం, పీసపాటి నరసింహమూర్తి మొదలైన ఉద్ధండులైన 40 మంది నటులంతా ఒక బృందంగా ఏర్పడి తులసీజలంధర నాటకం ప్రదర్శించారు.
డి.వి. సుబ్బారావు (హరిశ్చంద్ర పాత్రధారి) నెలకి 4 నాటకాలు ప్రదర్శించి, కళాకారులకు నెలకి కచ్చితంగా జీతాలిచ్చేవారట. దేనికైనా క్రమశిక్షణ, పట్టుదల, శ్రద్ధ ముఖ్యం అంటారు ఆచంట. బురదనాయుడు సతీసావిత్రిలో ఒరిజినల్ దున్నపోతుమీద వచ్చేవారట. విజయవాడకి సుమారు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘నున్న’ ప్రాంతంలో ఒక చిల్డ్రన్ నటశిక్షణాలయం స్థాపించి భావితరాలకు పద్యనాటక కళాకారులను తీర్చిదిద్దారు.
నటించిన నాటకాలు
నటించిన పాత్రలు
పురస్కారాలు
· ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే హంస అవార్డు (2000)
· తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు (2002)
· సి.హెచ్.సాంబయ్య స్మారక పురస్కారం (2009)
· ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కారం (2001)
మరణం
తెలుగు పౌరాణిక నాటక రంగానికి విశేషమైన సేవలను అందించిన ఆచంట వెంకటరత్నం నాయుడు తన 81వ యేట 2015, నవంబర్ 25, బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో కుమార్తె గృహంలో మరణించాడు.[1]
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు
అకళ౦క దేశభక్తుడు గాంధేయవాది ,మహోన్నత మానవతావాది ,ఆంధ్రా ఏకైక గదర్ వీరుడు ,కధకుడు చిత్రకారుడు,నేనూ నాదేశం రచయిత –దరిశి చెంచయ్య
దరిశి చెంచయ్య తెలుగులో మొదటి అరాచకవాది. అకళంక దేశభక్తుడు, నిరాడంబర గాంధేయవాది, కాంగ్రెస్ వాది, , వామపక్ష వాది. వీటన్నింటికీ మించి మహోన్నతమైన మానవతావాది!
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ డిటెన్యూ. తెలుగులో ఏకైక గదర్ వీరుడు. మొదటి తెలుగు దేశ అనార్కిస్టు యోధుడు. కథకుడు, చరిత్ర కారుడు, అద్భుతమైన రచయిత!
లాలా హర్ దయాళ్, జితేంధ్ర నాధ్ లాహరీ, శ్యాంజీ కృష్ణవర్మ, బిపిన్ బిహారీ గంగూలీ వంటి దేశీయ యోధులతో పాటు ప్రిన్స్ క్రోప్టకిన్, బకూనిన్, సన్ యెట్ సేన్ వంటి విదేశీ విప్లవకారుల్ని సైతం తన స్వీయచరిత్ర లో పరిచయం చేశారాయన!
చెంచయ్య మిత్రుడు సర్దార్ బలవంత సింగ్ కి అంకితం ఇవ్వబడ్డ ఈ గ్రంథం లో మొదటి మార్క్సిస్టు ఇండాలజిస్టు, తెలుగు వారు మరిచిన విస్మృత మహా మేధావి డా. కె. బి. కృష్ణ గారి గురించి కూడా ఉంది!
తీవ్ర జాతీయవాద స్పూర్తితో మొదలై, అంతర్జా తీయ అరాజకవాద రాజకీయాల స్పూర్తితో తీవ్రవాదిగా ఆరితేరి, జాతీయోద్యమంలో గాంధేయవాదిగా మారి, కమ్యూనిస్టు గా చివరాఖరకు సాంస్కృతికోద్యమకారునిగా మిగిలిన ఆయన కథ అద్వితీయం!
వైశ్యులలో మొట్టమొదటి కులాంతర వివాహ నిర్వహణ మొదలుకొని , కాంగ్రెస్ పార్టీ సభలు, అభ్యుదయ రచయితల మహాసభ, ప్రజా నాట్యమండలి , కందుకూరి వీరేశలింగం గారి శతవార్షికోత్సవం..ఇలా ఎన్నో చారిత్రక సంఘటనల ఖజానా ఆయన ఆత్మకథ!
“ఒక మహత్తర సంస్కృతీ ఉద్యమం” అవస రమనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పిన చెంచయ్య, తన చిట్ట చివరి శ్వాస వరకూ సమాజం కోసమే తపించారు. అందు కోసం సర్వం త్యజించారు!
ద్భుతమైన ఆయన ఆత్మకథ “నేనూ – నా దేశం ప్రచురించబడి 70 సంవత్సరాలు అవుతోంది. 1952 లో ముద్రణ పొందిన ఆ గ్రంథం తర్వాత ఎన్నోసార్లు ప్రచురించ బడిన తెలుగులోనే గొప్ప స్వీయచరిత్ర అది!
విచిత్రం ఏమంటే అన్ని పక్షాలలోని మంచిని స్వీకరించినప్పటికీ ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాసే పని చెంచయ్య చేయకపోవడంతో ఈ రోజు ఆయన్ని ఏ సంఘాలు పట్టించుకున్నది లేదు!
స్వీయచరిత్ర తో పాటు చెంచయ్య కొన్ని కథలు కూడా రాసారు. “మీరూ నేనూ” పేరుతో అవి ప్రచురించబడినాయ్. 1990 లో నల్లూరి వెంకటేశ్వర్లు గారు పూనుకుని దర్శి చెంచయ్య గారి శతజయంతి సభలు వైభవంగా నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక సావనీర్ కూడా ప్రచురించి పంచారు!
తెలుగు సాంస్కృతిక వికాసానికి ఎనలేని కృషి చేసిన దరిశి చెంచయ్య గురించి ఈ రోజు తెల్సింది తక్కువ. ఆయన జీవితం, కృషికి సంబంధించిన స్పూర్తిని భావితరాలకి తెలియజేయడం ఈనాటి అవసరం!
మహనీయుడు దర్శి చెంచయ్య గారి స్వీయ చరిత్ర, ఒక రకంగా తెలుగు వారి రాజకీయ, సామాజిక సాంస్కృతిక చరిత్ర. కావున 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ‘నేనూ, నా దేశం’ సమా వేశాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం వర్తమాన సాహిత్య సాంస్కృతికోద్యమ అవసరమని నా అభిప్రాయం! అందులో భాగంగా గతంలో రెండేళ్ళ క్రితం ఆయన ఆత్మకథ ని పరిచయం చేస్తూ రాసిన రైటప్, ఆత్మకథ సాఫ్ట్ కాపీ ,మీరూ, నేనూ కథా సంపుటి సాఫ్ట్ కాపీ ఈ మెసేజ్ తో పాటు పంపుతున్నాను. ఔత్సాహికులు ఎవరైనా స్పందిస్తే సంతోషం!
నేనూ నా దేశం : మహోన్నత సందేశం!!
తెలుగులో ఆత్మకథలు, స్వీయచరిత్రల అంతగా లేదు. రాసే ధైర్యం ఉన్నవారు కూడా అరుదే. కానీ, వచ్చిన వాటిలో తప్పనిసరిగా చదవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో చెంచయ్యగారిది ఒకటి. తన ఆత్మకథని “బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఉరికొయ్య కెరయైన అమరజీవి సర్దార్ బలవంత సింగుకు, ఆయన భార్య కు ” అంకితమిచ్చిన చెంచయ్య ‘నేనూ – నా దేశాన్ని ‘ చారిత్రక డాక్యుమెంట్ గా మలిచారు.
“తాను రచయితను కాదన్న సంకోచం శ్రీ చెంచయ్య గారికి వున్నట్టుంది. కాని, ఆయన సూటిగా ఆలోచిస్తారు. సూటిగా బ్రతుకుతారు. అందువల్ల సూటిగానే వ్రాయగలరు. రచయిత కావడానికి దీన్ని మించిన అర్హత నా మట్టుకు నాకు తెలియదు.” అంటారు పీఠిక లో నార్ల వెంకటేశ్వరరావు గారు. లాలాహర్ దయాళ్ అనార్కిజంతో మొదలై గదర్ వీరోచిత పోరాట నుండి స్వాతంత్రోద్యమం వరకూ పరుగులు చేస్తూ సాగిపోతుందీ రచన.
నెల్లూరు జిల్లా కనిగిరిలో (ప్రస్తుతం ప్రకాశం) పుట్టి, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి అక్కడ గదర్ పార్టీలో చేరి క్రియాశీల కార్యకర్తగా చారిత్రక పాత్ర నిర్వహించిన ఏకైక ఆంధ్రుడాయన. ఢిల్లీ, కన్ననూర్, లాహోరు, కలకత్తా, నెల్లూరు, కోయంబత్తూరు, సింగపూరు, బేంకాక్ జైళ్ళలో ఉన్నారు. ఎనిమిదేళ్ళ జీవితం చెరశాలలో గడిచిపోయింది.
స్వాతంత్ర్య పూర్వ భారతదేశపు ముఖచిత్రం మొదలుకొని స్వాతంత్ర్యానంతరం స్వాతంత్ర్యానంతరం సమాజ మార్పు కోసం వెల్లువెత్తిన వివిధ ఉద్యమాల వరకూ అనేక విషయాలు, విశేషాల సమాగమం దర్శి చెంచయ్య గారి ‘నేనూ నా దేశం’.
“నా చేతిలో మిగిలివున్న కొద్ది ధనాన్ని నేనెంతో పొదుపుగా వాడాల్సిన స్థితి ఏర్పడింది. అందువల్ల రోజూ హారిసన్ కంపెనీలో రొట్టెను కొనుక్కుతిని, కొళాయి నీళ్ళు తాగుతూ కొన్ని వారాలు గడిపాను.” (పేజి 171)
“అసలు ఇతరుల ఆర్దిక సహాయాన్నర్ధించి జీవించడం ఆత్మగౌరవాన్ని చంపుకోవటమేనని నా అభిప్రాయం. కాబట్టి జట్కా బండి తోలుకొని స్వతంత్రంగా జీవించినా గౌరవప్రదమేనని నిశ్చయించుకున్నాను.” (పేజి 172) అంటారు.
“వైశ్యులు ఎంతో ధనం సంపాదించుకున్నారు. ప్రజల సొమ్ము వారి హస్తగతమవుతోంది. వారేమో అధిక భాగ్యవంతులవుతూంటే ప్రజలు మరీ బీదలవుచున్నారు. ధనార్జనయందు తాపత్రయమేకాని సంస్కారమందు కోరికే కనబడదు వైశ్యుల్లో.”(పేజి 258) కంచె ఐలయ్య మీద పడేడ్చే కోమట్లు, వైశ్యుడిగా పుట్టి విశ్వనరునిగా ఎదిగి దశాబ్దాల క్రితం మొహం పగిలేలా చీవాట్లు పెట్టిన చెంచయ్య గారు జీవితాంతం కులాన్ని అసహ్యించుకున్నారని గ్రహించాలి. వైశ్యుల్లో మొదటి వితంతు వివాహం ప్రోత్సాహకర్తగా ఉన్నాయిన, ” ఇండియాలో అన్ని కులాల్లాగే వైశ్య కులం కూడా వైదిక బ్రాహ్మణుల ఆధిపత్యం కింద అణిగిమణిగి ఉంది …(పేజి 190) అన్నారు.
కాంగ్రెస్ , సోషలిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ల నేపధ్యంతోపాటూ ఆర్.ఎస్.ఎస్. క్రూరత్వాన్ని కూడా దగ్గర్నుంచి చూసారాయిన. ” గాంధీ గారి హత్యతో కొందరు సంతోషపడుతున్నారనే విషయం నాకెంత విషాదాన్ని కలిగించిందో వ్రాయలేదు”( పేజి 358) వీరేశలింగం శతవార్షికోత్సవాన్ని మద్రాసు లో జరిపించడంలో చెంచయ్య గారి పాత్ర ఉంది.
“విద్యాధికులైన సభ్యులలో పెద్ద మార్పు రాసాగింది. అదేమంటే పదవీ వ్యామోహం (కెరియరిజము) ఈ దుర్గుణం ఇండియాలో ప్రతి రాజకీయ పార్టీలోను ప్రవేశించి ఆ పార్టీ లను నాశనం చేస్తున్నది. కమ్యూనిస్టు పార్టీలో పొడచూపిన ఈ దుర్గుణాన్ని వెంటనే అణచివేయకపోతే పార్టీ నైతిక దృష్టి క్షీణించిపోతుంది.(పేజి 365) అన్నాయన
“నేను కమ్యూనిస్టు పార్టీ లో సుమారు పది సంవత్సరాలున్నా వాస్తవంగా కమ్యూనిస్టు కాలేకపోతిని….” (పేజి 366-67) లో నిజాయితీగా రాసుకున్నారు.”
వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరమైన ఆయన,”సంపాదించడమనేది కష్టజీవులను దోచుకోవడమేననే భావం నాలో కలిగినందుననే సంపాదన మానేసాను. …భోజనం ఖర్చు తగ్గించుకొంటూ వచ్చాము. పాలు, నెయ్యి, నూనె, కూరగాయలు, పండ్లు వగైరా తగ్గించాము. ఇంతచేసినా ఆర్ధికంగా సవరించుకోలేకపోయాము…….ఆర్థికంగా తీరని కష్టాలు కూడా రాజకీయ జీవితాన్ని మానుకొనుటకు ఒక కారణం”(పేజి 368)
తదనంతరం సాహిత్య సేవ చేయడానికి నిర్ణయించుకున్న వారు జీవితాంతం సమాజం హితం కోసమే మసిలారు. మొట్టమొదటి భారతీయ అనార్కిస్టు (?) లాలా హర్ దయాల్ అసాధారణ జీవితసంగతులు మొదలుకొని
మొట్ట మొదటి మార్స్కిస్టు ఇండాలజిస్టు కాట్రగడ్డ బాలకృష్ణ అసామాన్య పాండిత్యం వరకూ ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ప్రాధాన్యత కలిగిన సంగతుల విలువైన గ్రంధం దర్శి చెంచయ్య గారి “నేనూ, నా దేశం”. అంతా తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు
త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -3(చివరిభాగం )
సీతానగర ఆశ్రమం గోదావరి గట్టున ఉండటం చేత వరదలకు పాములు వగైరాలు వచ్చి ఇబ్బంది పెట్టేవి .ఆశ్రమ వాసులలో మామిడి లక్ష్మీ పతి అనే సంపన్న వైశ్య కుర్రాడు ఇక్కడ ఉండగలడా అనుకొన్నారు .అతడు విలాస జీవితం వదిలేసి ఇక్కడ అతి నిరాడంబర జీవితం గడుపుతూ నిర్మాణ కార్యక్రమాలలో చాలాసహాయం చేశాడు .ఒక రోజు రాత్రి రక్త పెంజెరు కరఛి పొడలులు వస్తే ఒక కోయదోరను పిలిపించి తురాయికట్టిస్తే కొంచెం తగ్గింది .ఇంతకంటే మేలైన వైద్యం చేయిద్దామని తురాయి తీసేస్తే విషం ప్రాకి చనిపోయాడు .అందరూ విచారం లో మునిగారు. క్రమంగా కోలుకొని యదా స్థితికి వచ్చారు .
ఆశ్రమం ఉచ్చ స్థితిలో ఉండగా గాంధీ 1930 లో మళ్ళీ ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టాడు .సుబ్రహ్మణ్యం గారు రెండవ సారి అరెస్ట్ అయ్యారు .రాజమండ్రి కడలూరు జైళ్లలోలో ఏడాది శిక్ష పూర్తీ చేసి ,మళ్ళీ ఆశ్రమానికి వచ్చారు.1932లో గాంధీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లి ,తిరిగి రాగానే అరెస్ట్ చేయబడి ,కాంగ్రెస్ ప్రచారకులపై కసితో వ్యవహరించారుపోలీసులు .గోదావరిజిల్లాలో ఈ దౌష్ట్యం పరాకాష్టకు చేరింది .పెద్దాపురం లో తోట విందులో లాఠీచార్జి జరిగి కోడేటి రంగారావు చేయి విరిగింది .సర్జరీ చేసినా చెయ్యి అతుక్కోలేదు .1937లోచనిపోయాడు .బులుసు సాంబమూర్తి గారిని కాకినాడలో తీవ్రంగా కొట్టారు పోలీసులు .గాయాలు మానటానికి పదిహేను రోజులు పట్టింది .
రాజమండ్రి డిప్యూటీ పోలీస్ సూప రింటే౦డెంట్ ముస్తాఫాలీ ఖాన్ సుబ్రహ్మణ్యంగారి పై పగబట్టాడు .అహంకారి .అన్ని అధికారాలు ఉన్నాయి .రాజమండ్రి సత్యాగ్రహ ఉద్యమం సుబ్రహ్మణ్యంగారి ఆధ్వర్యం లో మహోత్సవంగా జరుగుతోంది .నాళ౦ సుబ్బరాజు గారింట్లో డాక్టర్ గారు ఉండటం గమనించి సిబ్బంది తో వచ్చి ,బయటికి పిలిపించి విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టించాడు .ఎందుకో, ఎవర్ని కొడుతున్నారో పోలీసులకే తెలీదు .మోకాళ్ళు తొడలు నడుము పై కొట్టిన దెబ్బలకు పిడి గుద్దులకు లెక్కే లేదు .పాతికమంది తో కొట్టించాడు బండ బూతులు తిట్టించాడు .గాంధీని నీచంగా మాట్లాడి౦చాడు .డాక్టర్ గారిపై నేరం లేదు ఆయన దోషం లేదు .పగ ప్రతీకారం పైశాచికానందం తో పెట్రేగిపోయాడు ఖాన్ .ఒక్క లాఠీపోటు చర్మం లోనుంచి ఎముకలోకి అక్కడి నుంచి ఊపిరి తిత్తులలోకి దూసుకు పోయింది .ఎందరివో ప్రాణాలను కాపాడిన డాక్టర్ గారి ప్రాణాల పాలిటిఆశనిపాతమే అయింది . ఆ రోజు 23-12-1936వైకుంఠ ఏకాదశి .స్వాతంత్ర్య దీక్షా పరతంత్రులైన డాక్టర్ జోశ్యుల సుబ్రహ్మణ్యం గారు వైకుంఠధామం చేరారు .స్వరాజ్యం రాకపోయినాస్వారాజ్యం పొందగాలిగారు ఆ మహా త్యాగి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు
భారతీ నిరుక్తి .34వ భాగం.17.8.22
Video link
సరోజినీ నాయుడు భర్త ,,నిజాం సైన్య వైద్యాధికారి ,వైద్య సంఘ ఉపాధ్యక్షుడు –డా.ముత్యాల గోవింద రాజులు నాయుడు
ముత్యాల గోవిందరాజులు నాయుడు గారి పూర్వీకులు మద్రాసుకు చెందిన బలిజనాయుడు సైనిక కుటుంబీకులు. నాయుడు గారు హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ వైద్యుడు, సరోజిని నాయుడు భర్త. గోవిందరాజులు నాయుడు 1868లో హైదరాబాదులో జన్మించాడు. మద్రాసు క్రైస్తవ కళాశాల, మద్రాసు వైద్య కళాశాలల్లో చదువుకుని ఉన్నత చదువులకై ఎడిన్బరో విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. హైదరాబాదుకు తిరిగివచ్చి 1892లో నిజాం సైన్యంలో వైద్యాధికారిగా నియమితుడయ్యాడు. హైదరాబాదు వైద్య కళాశాలలో ఉపన్యాకుడిగానూ, హైదరాబాదు వైద్య సంఘానికి ఉపాధ్యక్షుడిగాను పనిచేశాడు. లాన్సెట్ వంటి పత్రికలో అనేక వ్యాసాలు వ్రాశాడు.[1]
2-త్రిభాషా నటుడు ,,న్యాయవాది నాటక సంగీత కళాపరిషత్ సభ్యుడు –దాడి గోవిందరాజులు నాయుడు
దాడి గోవిందరాజులు నాయుడు (ఆగష్టు 27, 1909 – డిసెంబర్ 25, 1970) ఈయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి, న్యాయవాది, ఆంధ్ర నాటక కళా పరిషత్తు, ఆంధ్ర నాటక సంగీత అకాడమి సభ్యులు.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు
శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం 3వ భాగం
Video link
త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -2
1924నుంచి సుబ్రహ్మణ్యంగారు తీవ్రవాదులై ,నిర్మాణ కార్యక్రమాలలో పాల్గోన్నారుకానీ శాసనసభ ప్రవేశానికి మొగ్గు చూపలేదు .చిత్తరంజన్ దాస్ ,మోతీలాల్ నెహ్రూ లు శానసభలో ప్రవేశించి బ్రిటిష్ ప్రభుత్వానికి అడ్డు తగలానని భావించారు .ఇదే స్వరాజ్యోద్యమం .ఇది మణ్యం గారికి నచ్చలేదు .
సీతానగర ఆశ్రమం
రాజకీయాలు చాలా విధాలుగా నడుస్తున్నాయని తెలిసి ,గాంధీ మార్గాన్నే అనుసరించారు సుబ్రహ్మణ్యం గారు .రాజమండ్రి దగ్గర గోదావరి ఒడ్డున ప్రశాంత వాతావరణం లోసీతానగరం లో ఒక ఆశ్రమం నిర్మించి శిష్యవర్గంతో పని చేస్తూ గాంధీగారి నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించారు .దీనికోసం 14ఎకరాలు మూడు వేలరూపాయలు పోగుచేసి కొని ఆశ్రమ నిర్మాణం ప్రారంభించి భవనాలు నిర్మించారు. దీనికి చాలాకస్టపడ్డారు .ఇటుకలు ,పెంకులు కలప కు చాలాడబ్బు కావాల్సి వచ్చింది .నిర్మాణ వ్యయం 20వేలు అయింది .ఇందులో 13ఎకరాలు వ్యవసాయానికి ,మిగిలిన ఎకరం లో భవనాలు నిర్మించారు .వివిధ శాఖలకు వేర్వేరు భవనాలు ,నివాసానికి వేరుగా భవనాలుమొత్తం 12 భవనాలు అన్నీ ఆ ఎకరం లోనే కట్టారు .ప్రజాసేవ ప్రారంభించారు .ఇదంతా గాంధీగారి నిర్మాణ కార్యక్రమం ను అనుసరించే జరిపారు .
గాంధీ గారి దృష్టిలో నిర్మాణ కార్యక్రమాలు అంటే –సత్య ,అహింస పద్ధతులలో సంపూర్ణ స్వరాజ్య సాధన .అంటే జాతి మత కులాలకు అతీతంగా స్వేచ్చా స్వాతంత్ర్యాలు కలిగి ఉండటం .అంటే అన్యోన్య ఆశ్రయంగా కలిసి పని చేయటం .కృషిని బట్టి ఫలితం ఉంటుంది .ఇది సక్రమంగా అమలు జరిపితే ,మనం కోరుకున్న స్వతంత్రం వస్తుంది .ఈ నిర్మాణ కార్యక్రమానికి 13 విషయాలున్నాయి .అవి-వివిధ జాతి సమీకరణ ,అస్పృశ్యతా నివారణ ,త్రాగుడు ,ఖద్దరు పల్లెటూరి పరిశ్రమలు ,గ్రామ పారిశుధ్యం ,నూతన విద్యావిధానం ,వయోజన విద్య ,స్త్రీ జనోద్దరణ ,ఆరోగ్యబోధ ,రాష్ట్ర భాషా ప్రచారం ,స్వభాష ,ఆర్ధిక సమానత్వం .వీటిని ఈ ఆశ్రమం లో ఎలా తీసుకువచ్చి సఫలీకృతం చేశారో చూద్దాం –హిందూ ముస్లిం క్రైస్తవులు పరస్పర అవగాహనతో మిత్రత్వం తో కలిసి ఉండటం .అంటరానితనాన్ని ఆశ్రమం లో పాటింపక పోవటం,కల్లు సారాయి దుకాణాలవద్ద పికెటింగ్ చేసి త్రాగుడు మాన్పించటం , నూలు అందరూ వడికి ఆదాయం పెంపొందించటం .దీనికి ప్రత్తి చెట్లు పెంచి ప్రత్తి తీయించి రాట్నాలు సప్లై చేసి నూలువడికించి వస్త్రాలు నేయించి అమ్మకానికి పెట్టారు .ఇతర పరిశ్రమలు ఇక్కడ పెట్టలేదు. వ్యవసాయమే ముఖ్యంగా చేశారు .గ్రామాలకు వెళ్లి పారిశుధ్యాన్ని బోధించి అమలు అయెట్లు చేశారు .వవైద్యాలయం ఏర్పాటు చేసి రోగులకు సాయపడ్డారు .చిన్న చిన్న బడులు పెట్టి గ్రామస్తులకు విద్య నేర్పించారు .కాంగ్రెస్ అనే పత్రిక స్థాపించి వయోజన విద్యా ప్రచారం చేశారు .మద్దూరి అన్నపూర్ణయ్య ,గాడిచర్ల వారు పత్రికాధిపతులుగా ఉంటూ ప్రేరణాత్మకంగా రాస్తూ ప్రయోజనం కలిగించారు .స్త్రీ జనోద్ధరణకు ప్రత్యెక కృషి చేయలేదు .సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ కనుక గ్రామస్తుల ఆరోగ్యాన్ని చక్కగా కాపాడారు .కొందరుమాత్రమే హిందీ నేర్చారు నేర్పించారు ,కాంగ్రెస్ పత్రిక తెలుగులోనే ప్రచురించి స్వభాషకు గౌరవం ప్రోత్సాహం కలిగించారు .దీనికి అన్నపూర్ణయ్యగారి కృషి అద్వితీయం ,ఆశ్రమనిర్వహణకు ఇతరులపై ఆధార పడాల్సి వచ్చినందున ఆర్ధిక సమానం కు కృషి చేయలేకపోయారు .ఈ ఆశ్రమం ఖద్దరుకు ప్రఖ్యాతి చెందింది .రాట్నాలు కదుళ్ళు చేయించి మంచి దూది తో యేకులు చేయించి ఆశ్రమం లోనూ ,గ్రామస్తులకు ఇచ్చి ఖద్దరు ఉత్పత్తి చేయించారు .ఒకరిద్దరు ఆశ్రమవాసులు ఖద్దరుకోసమే వినియోగి౦పబడ్డారు .సీతానగరం ఖద్దరు అంటే ఆంధ్రదేశం లో మంచి నాణ్యమైనది అనే పేరు పొందారు .మంచి వారపత్రిక ‘’కాంగ్రెస్ ‘’నడపటానికి ముద్రణా యంత్రం కొన్నారు .మద్దూరి అన్నపూర్ణయ్య గారే వీటికి బాధ్యత వహించారు .సుమారు మూడు వేలమంది చందాదారులు ఉండేవారు .ముట్నూరి వారి కృష్ణా పత్రికకు దీటుగా మద్దూరి వారు కాంగ్రెస్ పత్రిక ను ఆకర్షణీయంగా ,విజ్ఞాన దాయకంగా ,ప్రబోధ దాయకంగా నడిపారు .ఒక భవనంలో వైద్యాలయం పెట్టి,రోగులకు ఉచితంగా మందులిచ్చేవారు .డా.సుబ్రహ్మణ్యం గారికి లొంగని రోగం ఉండేదికాదు .కావాల్సిన డబ్బును ప్రజలనుంచి ప్రోగు చేసి ఎలాంటి లోపం లేకుండా వసతులతో వైద్యాలయం ఆదర్శంగా నడిపారు .వ్యవసాయానికి ఎడ్లు బండీ,నాగళ్ళు సంపాదించి వ్యవసాయం చేయిస్తూ కావలసిన కూరగాయలు ,జొన్న చోళ్ళు మిర్చి మొదలైన మెరకపంటలు పండించారు .ఆదాయం బాగా ఉండేది .ఆ ఆదాయం ఆశ్రమవాసుల భోజనాదులకుసరిపోయేది .ఆశ్రమం మాంచి ఉచ్చస్థితిలో ఉండగా గాంధీజీ వచ్చి రెండు రోజులు ఉండి,చూసి మెచ్చి ఆశీర్వదించి వెళ్ళారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-8-22-ఉయ్యూరు
భారతీ నిరుక్తి .33వ భాగం.16.8.22
Video link
త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం
వైదీక తెలగాణ్య శాఖకు చెందిన బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం కొండ వీడుసీమలోని ఫిరంగి పురం లో 12-10-1891న జన్మించారు .కొద్దికాలం అక్కడే చదివి బెజవాడలో చదివారు .మెట్రిక్ తప్పటం వలన చదువు ముందుకు సాగలేదు .నిరాశ చెందక కలకత్తా వెళ్లి నాలుగేళ్ళు వైద్య విద్య నేర్చారు .1915-16లో రాజమండ్రి వచ్చి వైద్య వృత్తిలోచేరి గొప్ప పేరు ప్రఖ్యాతులు,డబ్బు సంపాదించారు .నెలకు సుమారు వెయ్యి రూపాయలు సంపాదించేవారు .బీద విద్యార్ధులకు విద్య చెప్పించేవారు .1916-17లో వచ్చిన హో౦ రూల్ వైపు ఆకర్షితులై ,సేవా భావంతో కార్యదర్శియై ,ప్రజలను జాతీయోద్యమం వైపు మళ్లి౦చ గలిగారు.
1920లో గాంధీగారి సత్యాగ్రహోద్యమం లో పని చేసి ,శాసన సభా బహిష్కారాన్ని ప్రచారం చేసి ,వైద్యం మానేసి ప్రజాసేవలో మునిగిపోయారు .అప్పటికి ఆయనకు వైద్యం కింద అయిదు వేలు రోగులు ఇవ్వాల్సి ఉంది .ఆయన అడగలేదు .కానీ ఇల్లు గడవటం కష్టంగా ఉంటె ఇంట్లోని వారు ఒత్తిడి చేసి వసూలు చేస్తున్నారని తెలిసి ,బాకీ బిల్లుల్ని చింపి పారేశారు .గొప్ప ఉపన్యాసాలివ్వగల వక్త అవటంతో .గోదావరి జిల్లాలోని ప్రతిగ్రామం ప్రతి సభలో మాట్లాడి ఉత్తేజ పరచారు .హాస్యం చతురత తో ఆకర్షించేవారు .ప్రజలు నడుం కట్టి కార్యరంగం లోకి దూకేవారు .ఈయన ప్రభావం మద్దూరి అన్నపూర్ణయ్య ,ధరణిప్రగడ శేషగిరిరావు ,రామ చంద్రుని వెంకటప్ప ,మామిడి లక్ష్మీపతి ,మాచిరాజు రామచంద్ర మూర్తి ,డా.వంగవీటి దీక్షితులు మొదలైన వారిపై పడికర్తవ్య పరాయణులను చేసింది .
1920-21లో తీవ్రంగాసత్యాగ్రహోద్యమం నడపటం చేత 21డిసెంబర్ లో ఈయనను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు లో తర్వాత కడలూరు జైలులో ఉంచారు .శిక్షాకాలం సంవత్సరం లో ఆరోగ్యంగా ఉంటూ తోటఖైదీలకు సాయం చేసేవారు .22నవంబర్ లో విడుదలై ,ప్రజాసేవ చేస్తూ ఉద్యమాలు నిర్వహించారు .1923కాకినాడ కాంగ్రెస్ సభలలో సుబ్రహ్మణ్యం గారి సేవలు నిరుపమానం .నూలు వడుకుతూ వడి కించేవారు .రాజమండ్రిలోని ఆచంట పరబ్రహ్మం అనే డాక్టర్ ,ఈయనపై దురాగ్రహం తో చెంపమీద కొట్ట గా ,ప్రజలంతా మణ్య౦ గారి వెనక నిలబడి ప్రతీకారం తీర్చుకోమని కోరినా అహింసా వ్రతం అవలంబించి ,వారించారు .కొంతకాలానికి పరబ్రహ్మానికి పక్షవాతం వచ్చి బుద్ధి తెచ్చుకొని క్షమాపణ పత్రం రాసి కాళ్ళమీద పడ్డాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-8-22-ఉయ్యూరు
భారత ప్రథమ స్వాతంత్ర్య దినోత్సవం 15.8.1947 నాటిడా.కే.ఎన్. కేసరి గారి గృహ లక్ష్మి పత్రిక విశేషాలు.15.8.22
Video link
తొలిఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -4(చివరిభాగం )
జైలు నుంచి విడుదలకాగేనే మళ్ళీ వైద్య వృత్తి అవలంభించాడు జగ్గన్న శాస్త్రి .అయిదేళ్ళు బాగానే నిలకడగా ఉన్నాడు .ఇంతలో హోమ రూల్ హడావిడి మొదలైంది .కాంగ్రెస్ పునరుద్ధరణ జరిగింది. అల్లూరి సీతారామరాజు గడబిడ .ఈయనతో శాస్త్రికి సంబంధం ఉందని ప్రభుత్వానికి అనుమానం .మూడేళ్ళు ఇద్దరి ఇళ్ళపై కదలికలపై తీవ్ర నిఘా కొనసాగింది .శాసన సభా బహిష్కార ఉద్యమ లో ‘’నో వోట్ కాంపైన్ ‘’ప్రారంభించినపుడు శాస్త్రిని ఉప్పలగుప్తం పోలింగ్ ఏరియాకి పంపితే ,వెళ్లి ఒక్కవోటు కూడా పోల్ కాకుండా చేసి ఖాళీ బాలట్ బాక్స్ లను తిరగొట్టించాడు .1930లో నాయకులంతా జైలులో ఉండగా ,బిక్కిన వెంకటరత్నం గారు జిల్లా నాయకుడు గా నియమింప బడినప్పుడు అయన ఉప్పుసత్యాగ్రహ స్థానమైన కాకినాడ వదలి చోడవరం వెళ్లి ఆయన ఇంటి నుంచే సత్యాగ్రహం నడపాలనుకొన్నారు .శాస్త్రి కాకినాడలో ఉండి సత్యాగ్రహం జయప్రదంగా నిర్వహించాడు .మళ్ళీ ఉద్యమమ దిగ్విజయంగా సాగుతోంది .ప్రభుత్వం గుర్తించి జైలులో పెట్టింది ,అక్కడే ‘’జాతీయ నాయకులు ‘’అనే పుస్తకం రాసిన కోటమర్తి చిన రఘుపతి కూడా ఉన్నారు .వీళ్లిద్దరితోపాటు 59మందిని మొదటి బాచ్ గా రాయవెల్లూరు జైలుకు పంపారు .శాస్త్రి ని మద్రాస్ కు, అక్కడినుంచి అల్లీపూర్ జైలుకు మార్చగా రఘుపతి మాత్రం అక్కడే శిక్ష పూర్తీ చేశారు .
’హిందూ దేశ స్వాతంత్ర్య యుద్ధం
1930ఉద్యమ౦ ,అంతకు ముందు బెంగాల్ విభజన ఉద్యమంలో పాల్గొన్న వినాయక దామోదర సావర్కార్ రాసిన ‘’హిందూ దేశ స్వాతంత్ర్య యుద్ధం ‘’పుస్తకం బాగా ప్రచారమైంది .ఇది మొదట 1906,07లలో మహారాష్ట్ర భాషలో రాయబడి,1907లో ఇంగ్లీష్ లో అనువాదంచేయబడి 1908లో జర్మనీలో ముద్రింపబడింది .బొంబాయిలో దామోదర కంపెనీకి పాలడబ్బాల వ్యాపారం ఉండేది .జర్మనీ నుంచి ద పాలడబ్బాలుదిగుమతి అయ్యేవి .ఒకసారి ఆపాల డబ్బాలతోపాటు ఆ పుస్తకాలు కూడా దిగుమతి అయ్యాయి .జగ్గన్న శాస్త్రి బొ౦బాయి కొన్ని పుస్తకాలు కొని తెచ్ఛి, ఆంధ్రదేశం లో పంచిపెట్టాడు .
గాంధీ సత్యాగ్రహ ఉద్యమం వదిలి శాసన సభా ప్రవేశ ఉద్యమం లో ఉన్నప్పుడు నచ్చక శాస్త్రి దూరమయ్యాడు .సావర్కారు నాయకత్వం లో ‘’హిందూ మహా సభ ‘’లో చేరి పని చేశాడు .సావర్కార్ రాసిన ‘’హిందూ పద శాహి’’గ్రంథాన్ని మృదు మధుర శైలిలో అనువాదం చేశాడు శాస్త్రి .హిందూ మత ధర్మాలు పాటిస్తూ ,మహాసభకు వీర విధేయుడుగా ఉన్నాడు .అనేక గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు .ఒక రోజు కోటమర్తి కి ‘’గాంధీ ముస్లిం కాన్స్పిరసి’’అనే పుస్తకం ఇచ్ఛి ఆపుస్తకం తనలో కలిగి౦చిన మార్పును గురించి చెప్పాడు .ముస్లిం లకు గాంధీ దేశాన్ని కట్టబెట్ట బోతున్నట్లు శాస్త్రి భావించాడు .అందులో కొన్ని ముఖ్యవిషయాలు –‘’బ్రిటిష్ ప్రభుత్వం తో సంధి చేసుకో కూడదని కాబూల్ లోని సుల్తాన్ కు టెలిగ్రాం ఇచ్చానని రాజకీయ నాయకులంతా నాపై కక్ష కట్టారు .నేను కూడా అది మంచిపనికాదని చెప్పాను .కాని బ్రదర్ మహమ్మదాలీ నన్ను పక్కకు తీసుకు వెళ్లి తన చేతి సంచిలోని వ్రాతప్రతి అయిన టెలిగ్రాం ను నాకు ఇచ్చి చదవమన్నాడు .అది అహింసాయుత సహాయ నిరాకరణ ఉద్యమ నాయకుడి దస్తూరిగా ఉండటం నన్ను ఆశ్చర్య పరచింది .’’అని స్వామి శ్రద్ధానంద రాయగా ,గాంధీ తన హరిజన పత్రికలో 10-2-1940న ‘’నేను ఆఫ్ఘనిస్తాన్ అమీర్ కు ఏరకమైన టెలిగ్రాం పంపినట్లు గుర్తు లేదు .ఆ ఆరోపణ నిజంకాదు .స్వర్గీయ స్వామి శ్రద్ధానంద నాతొ ఎప్పుడూ ఈ విషయం ప్రస్తావించ లేదు ‘అని సమాధానం గా రాశాడు గాంధీ .23-3-40న హరిజన్ పత్రికలో గాంధీ –‘’బ్రిటిష్ వారి సాయంతో ముస్లిం లు హిందూ దేశం పై తమశక్తిని ప్రయోగిస్తారు .కాంగ్రెస్ నా వెంట ఉంటె ,వాళ్లకు ఆశ్రమ ఇవ్వను .వారి చేత పరిపాలి౦ప బడటం నాకు ఇష్టమే .కారణం వారిది హిందూ పాలనమే కనుక ‘’అని రాశాడు .ఇవన్నీ చదివి శాస్త్రి ‘’హిందూ దేశం లో గాంధీ మహమ్మదీయుల చేతిలోబందీగా ఉన్నాడు .అది నాకు ఇష్టం లేదు .బయటి బ్రిటిష్ ప్రభుత్వం కంటే ఇంటిలోని మహమ్మదీయ సమస్య పరిష్కరించాలని నేను హిందూ మహా సభ సభ్యుడిగా చేరాను ‘’అని తాన రాజకీయ దృక్పధాన్ని మార్చుకొన్నట్లు శాస్త్రి స్పష్టంగా చెప్పాడు .తాను ‘’హిందూ మహా సామ్రాజ్యం ‘’పుస్తకాన్ని అనువదించటానికి ముఖ్యకారణం హిందూ ఉత్క్రుష్టత ను స్పష్టం చేయటానికే అని చెప్పాడు .ఎర్రమిల్లి జగ్గన్న శాస్త్రి మంచి ఆవేశ పరుడైన విప్లవకారుడు గొప్ప ఉపన్యాసకుడు ,దేశాభిమాన౦ , హిందూ మతాభిమాన మున్న మహోన్నత వ్యక్తీ ‘’అని కీర్తించాడు శాస్త్రి కో డిటేన్యు కోటమర్తి చిన రఘుపతి .
ఆధారం
శ్రీ కోటమర్తి చిన రఘుపతి రచించిన ‘’ జాతీయ నాయకులు –మొదటి భాగం .ఇందులో జగ్గన్న శాస్త్రి తోపాటు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ,డా.పట్టాభి సీతారామయ్య , ,అయ్యదేవర కాళేశ్వరరావు గార్ల జీవిత చరిత్రలూ సంగ్రహంగా ఉన్నాయి .దీన్ని రాజమండ్రిలోని కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్ 1955లో ముద్రించారు .వెల-రూపాయిన్నర .
వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-8-22-ఉయ్యూరు
తొలిఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి -3
రోడ్డా కంపెని
జగ్గన్న శాస్త్రి కలకత్తా లో మెడిసిన్ చదివేటప్పుడు అక్కడ ఒక రోడ్డా అండ్ కంపెనీ ఉండేది అందులో తుపాకులు పిస్తోళ్లు మందు గుండు సామాను అమ్మేవారు .విప్లవానికి చెందిన ఒక చోరీ ఈ కంపెనీలో4-8- 1914న జరిగింది.ఆ రోజే బ్రటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచయుద్ధానికి ప్రకటన చేసి౦ది కూడా .ఆగస్ట్ 14 న ఈ కంపెనీకి విదేశాలనుంచి 202పాకేజీలలో పిస్తోళ్లు మందుగుండు సామాను దిగుమతి అయ్యాయి .నమ్మకమైన అధికారిని కస్టమ్స్ శాఖకు పంపి వాటిని తెమ్మన్నారు .అతడు వెళ్లి 192 పాకేజీలు మాత్రమె దిగుమతి చేసుకొని ,ఆమాట అక్కడి అధికారులకు చెప్పి ఇంటికి వెళ్ళాడు .కాని అతడు ఆ రోజునుంచి మళ్ళీ కంపెనీ ముఖం చూడలేదు .మిగిలిన 10పాకేజీలుకూడా కంపెనీకి చేరనే లేదు .మూడురోజులు చూసి కంపెనీ పోలీసులకు తెలియ జేసింది .ఈ 10 కేసులలో 50పిస్తోళ్లు ,46వేల రౌండు లకు ఉపయోగపడే మందు గుండు సామాను ఉంది .ఇందులో 44పిస్తోళ్లు మొదటిరోజు రాత్రే 9విప్లవ సంఘాలకు చేరిపోయాయని ,మిగిలిన 6 ఏమయ్యాయో తెలీదని ప్రభుత్వం చెప్పింది .1914తర్వాత ఈ పిస్తోళ్ళతో 54 బందిపోటు హత్యలు జరిగినట్లు పోలీసు లెక్కల్లో తేలింది .కొంత కాలానికి 31పిస్తోళ్లు చాకచక్యంగా పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు .అప్పుడు కలకత్తాలో ఒకే సారి 150 ఇళ్ళను సోదా చేయగా అందులో జగ్గన్న శాస్త్రి ఉన్న బస కూడా ఉంది .అప్పటికే ఆయన రాస్ బిహారీ బోస్ తోస్నేహంగా ఉంటున్నాడు . రాస్ బిహారీ బోస్ డెహ్రాడూన్ లో ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ లో హెడ్ క్లార్క్ .బెంగాలీ విప్లవ నాయకుడు .ప్రభుత్వాన్ని పడకొట్టే అనేక ఉపాయాలు ఆలోచిస్తున్నాడు .వ్యాసాలద్వారా, విప్లవ సంఘాలు స్థాపించి ఉద్యమిస్తున్నాడు .1912 డిసెంబర్ లో ఢిల్లీ లో వైస్రాయ్ హార్డింజ్ పై బాంబు వేశాడని అభియోగం ఉంది .అతడిని పట్టిస్తే పెద్ద బహుమతి ఇస్తామని ప్రకటన చేసింది ప్రభుత్వం .ఢిల్లీ ,లాహోర్ కుట్ర కేసులు ఇతనిపై బనాయించినా ఫలితం కనిపించలేదు .కాశీకి వెళ్లి అక్కడ రహస్యంగా విప్లవ సంఘాలు స్థాపించి పని చేస్తున్నాడు .1914లో కాశీలోనే ఉన్నాడు .ఒక బెంగాలీ కుటుంబానికి చెందిన తోట బంగళాలో ఉండటం చేత ఆచూకి దొరకలేదు .రాత్రులలో బయటికి వచ్చి చేయాల్సిన పని చేసేవాడు .పిస్తోళ్లు బాంబులు పేల్చే విధానాన్ని శిక్షణ ఇచ్చేవాడు .ఒక సారిరాత్రి అలా ఇస్తుంటే రెండు బాంబు మూతలు చేతిలో పేలి అతనికి సచ్చీంద్రుడు కి గాయాలయ్యాయి .నివాసం మార్చేశాడు .పూనా నుంచి వచ్చిన గణేశ పింగలే ఇతడిని కలిశాడు .1915లో పింగలే సచ్చీన్ద్రులు రాస్ బిహారీ నికలిశారు .ముగ్గురు కలిసి పంజాబు వెళ్లి ,ఆనెల 21న విప్లవానికి గొప్పప్లాన్ వేశాడు .పోలీసులకు ఈ రహస్యం తెలిసిందని పసిగట్టి ప్లాన్ అమలు చేయలేదు .పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు .రాస్ బిహారీ లాహోర్ వెళ్లి అక్కడినుంచి కాశీ చేరి ,అక్కడినుంచి కలకత్తా చేరి ,మిత్రులను కలిసి హిమాలయాలకు వెడుతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు .1915లో టిబెట్ దాటి చైనాలో ప్రవేశించాడు .అక్కడ సన్యట్ సేన్ కు శిష్యుడై ,చాగ్ కై షేక్ తో కలిసిఉన్నాడు .కొన్ని నెలల తర్వాత జపాన్ వెళ్లి జపాన్ ప్రభుత్వ సాయం తో అక్కడ’’హిందూ దేశ విప్లవ సంఘం’’ స్థాపించాడు .ఆసంవత్సరే జపాన్ లో చనిపోయాడువిప్లవ వీరుడు రాస్ బిహారీ బోస్ .
శాస్త్రి నిర్బంధం
కలకత్తాలో జగ్గన్న శాస్త్రిని అన్నం తిననీయకుండా అరెస్ట్ చేసి బొంబాయి కి తీసుకువెళ్ళారు .అప్పటికే అయిదుగురు అరెస్ట్ అయ్యారు ఆరో వాడుశాస్త్రి .అక్కడి పోలీసులు అతిధి పూజా దురంధరులు .సున్నీల స్వాగతం బూతుల దఅష్టోత్తరపారాయణ ,లాఠీ పూజ చంపదెబ్బల ,అర్ధ చంద్ర ప్రహారాల విందు తన్నుల తాంబూలం ,పిడికిట దక్షిణ లతో నిరంతర సత్కారం చేశారు .కొట్టిన దెబ్బలతో పొడిచిన పోట్లతో కట్టిన బొబ్బలతో కమలిన గాయాలతో కారే రక్తంతో కన్నీళ్ళతో ,చెదరని గుండెతో ,కదలని నాలుకతో కదలలేక కూర్చోలేక నిలబడ లేక పడుకోలేక పగలే రాత్రిగా రాత్రే పగలుగా దినం ఒక యుగంగా గడపిన దీక్షా వ్రతం లో ఆత్మ సాక్షియే దైవంగా సత్యమే దిక్కుగా ,బడలి ఒడలు తెలియని ఆబక్క బాపడు జగ్గన్న శాస్త్రి ని చూసి బాధపడే వారెవరూ లేరు .ఆరునెలలు ఇదే తీరున బాధ పెట్టారు .శాస్త్రితోపాటు ఒక గుజరాతీ ఒక మహారాష్ట్ర వేరొక ఆంధ్రయువకుడు ఉన్నారు ఈబాధాలు భరించిన వారిలో .వీరందరిపై కుట్ర నేరం మోపాలనుకొన్న ప్రభుత్వం ఆటలు సాగలేదు .అప్పుడే దేశోద్ధారక కాశీ నాథుని నాగేశ్వర రావు పంతులుగారు బొంబాయి వెళ్లి వీరందర్నిజైలులో కలుసుకొని మూడు వందల రూపాయలు ఇచ్చి గ్రామపెద్దలకు జాబులు రాసి ,వారి సానుభూతి పొందేట్లు చేయగా ,దాని ఫలితంగా శిక్ష పడకుండా వీరు విడుదలయ్యారు .
సశేషం
భారత స్వాతంత్ర్య అమృతోత్సవ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-8-22-ఉయ్యూరు
భారతీ నిరుక్తి .32వ భాగం.15.8.22
Video link