డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్  అనువాదం-శుభవార్త  

డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్  అనువాదం-శుభవార్త  

–సాహితీ బంధువులకు శుభకామనలు  – ప్రముఖ అణుశాస్త్ర వేత్త ,117 వ మూలకం టెన్నిస్సిన్ ను ఆవిష్కరించిన  ఆంద్ర శాస్త్రజ్ఞులు డా ఆకునూరి వెంకటరామయ్య గారి జీవితం పై నేను రాసిన పుస్తకం సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు స్పాన్సర్ చేసి సరసభారతి ద్వారా ప్రచురించటం ,ఆపుస్తకం అమెరికాలో రెండుసార్లు ,ఉయ్యూరులో రామయ్యగారి బంధు మిత్రుల సమక్షం లో సరసభారతి ఉగాది వేడుకలలో మూడవ సారి , మన శాసనమండలి సభ్యులు శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన సంగతి మీకు తెలిసిన విషయమే . 

  డా రామయ్య గారి పుస్తకాన్ని ఇంగ్లీష్  లోకి అనువాదం చేయించామని ,దాన్ని రామయ్య గారు వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా 5గంటలు నిశితంగా పరిశీలించి సవరించి ఆమోదించగా  హై క్వాలిటీ లో  ప్రింటింగ్ కు హైదరాబాద్ లో ఇచ్చినట్లు ,పది రోజులలో పుస్తకాలు రెడీ అవుతాయని మైనేనిగారు సెప్టెంబర్ 25 న నాకు మెయిల్ రాశారననే శుభ వార్త  మీకు తెలియ జేయటానికి సంతోషంగా ఉంది-దుర్గాప్రసాద్  -2-10-20
Posted in పుస్తకాలు | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -11 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -2

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -11

8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -2

టెలోస్ లో స్నేహవతావరణం ఉన్నా ,సాహసాలు కూడా ఎక్కువే .టౌన్ బయట అడవి అందులో అడవి జంతువులూ ఉంటాయి .ఇక్కడ చాలా జాతులవారున్నారు ,ఎవరి తరహాజీవితం వారిదే .వాళ్ళ ఆచార వ్యవహారాలూ వేరే అర్ధం చేసుకోవటం కష్టం కూడా .ఐతే మిగిలినవాళ్ళు పట్టించుకోరు .ఇక్కడ మానవ స్వాతంత్ర్యం ఉంటుంది .ఇదే అన్నిటికన్నాముఖ్యం అన్నాను అమ్మమ్మతో ..’స్వేచ్చ మంచిదే కాని ,ఇతరులు కూడా ఉన్నప్పుడు పూర్తి స్వేచ్చ ఇబ్బందికరం .నాయనా అనేక రకాల స్వేచ్చలున్నాయి టిం.ఇక్కడ మీకు కొన్ని నిబంధనలు ఉండి ఉంటాయి అవేమిటోతెలుసా నీకు ?’’అమ్మమ్మ ప్రశ్నించింది .’’అవి తరువాత తెలుస్తాయిలే .వాటి గురించి ఇప్పుడు చర్చ అనవసరం .భూమిపై ఉన్న లైబ్రరీలకంటే, ఇక్కడ మనకు ఊహించవీలుకాని అద్భుతమైన లైబ్రరీలున్నాయి.అవి ఒక ఆటగా అనిపిస్తాయి .వివరించి చెప్పటం కష్టం అమ్మమ్మా చూస్తేనే కాని నీకు తెలీదు .అవి నీకు బోర్ కొట్టి౦చవని నాదీ హామీ .టాక్సీలో లైబ్రరీకి వెళ్ళటానికి డబ్బు ఖర్చుకాదు  తేలికకూడా ‘’ అన్నాను ,

‘’అద్భుతంరా కన్నా .రేపు మనం టూర్ ప్లాన్ చేద్దాం .అప్పుడు నాకు ఇక్కడి విషయాలెన్నో  తెలుస్తాయి .ముందు నా ఇంటికి వెళ్లి అక్కడ గార్డెన్ చూడాలి ‘’ అన్నది .’’అబ్బో పెద్ద టూర్ ప్లాన్ లోనే ఉన్నావ్ ‘’అని నవ్వి ముందు నా ఇంటికి   వెడదాం .అక్కడ ఇళ్ళు దగ్గర దగ్గరగా ఉంటే ,ఇక్కడ ప్లాన్ ప్రకారం దూర దూరంగా పెద్దగా,విశాలంగా  ఉంటాయి.గార్డెన్ ఉంటుంది నీకు కావాల్సింది నువ్వు పండించుకో వచ్చు చేతకాకపోతే సహాయం చేస్తారు .నాన్సీ కి వంట ఎలా చేయాలో చెప్పాను .మన ఇంటికి వెళ్లి లంచ్ ,రాత్రికి డిన్నర్ కూడా చేద్దాం ‘’అన్నాను .ఇంటికి చేరి ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకొన్నాం ..

               9-టెలోస్ ,పరిసరాల టూరు

‘’అమ్మా టైమెంత’’అంటూ ఆవలిస్తూ నాన్సీ బెడ్ మీద నుంచి కూతురు మాట వినిపించింది ..’’మన వాచ్ లు ఇక్కడ పని చేయటం లేదు .రాత్రి మనం నిద్ర పోయే సరికి ఇంకా చీకటి పడలేదు .చాలాసేపు నిద్ర పోయి ఉంటాం .లేచే టైం అయింది .బయట చూసి తెలుసుకో వాల్సినవి చాలా ఉన్నాయి .నీ స్కూలు ఎక్కడో ఎప్పుడు మొదలు పెడతారో తెలియాలి .నీకు ఇక్కడ మంచి కిన్దర్ గార్టెన్ స్కూల్ ఉంటె బాగుంటుంది .అసలిక్కడ పగలు రాత్రికి తేడా తెలీటం లేదు .అందుకని ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేవాలో అర్ధం కావటం లేదు ‘’అంది నాన్సీ .’’అమ్మా బ్రేక్ ఫాస్ట్ విసుగ్గా ఉంది నాకు మామూలుపాలు సీరియల్ కావాలి .నువ్వు కాఫీ కాచి తాగావా ??’అన్నది పిల్ల .’’ఇక్కడ స్టవ్ లేదు .కాని లేచేసరికే లోకల్ ఫుడ్ ప్లేట్ లో రెడీ గా ఉంది .టిం చేశాడేమో .చూడటానికి బాగానే ఉంది .బ్రెడ్ కూడా ఉంది ‘’అన్నది .’’నాకు చీజ్ ఇష్టం కదా ఉందా ?’’’’అక్కడ ఉన్నది తినమ్మా ముందు .తర్వాత పూల్ లో స్నానం చేద్దాం ‘’అన్నది .

  నాన్సీ కాస్త నిట్టూర్చింది .అమెరికాలాగా లేదిక్కడ .సియాటిల్ కు ఇక్కడికి ఉన్న విప్లవాత్మకమైన  తేడా ఎల్లిస్ కు ఎప్పుడు తెలుస్తుందో ఏమో పిచ్చిపిల్ల .ముందు దానికి పాలు చీజ్ సీరియల్ చాకలేట్ డ్రింక్ కావాలి సియాటిల్ లో లాగా .నాన్సీకి రోజూ తాగే కాఫీ లేదు బ్రేక్ ఫాస్ట్ కూడా లేదు .నిన్న సాయంత్రం అమ్మమ్మ తనతో స్వీడెన్ నుంచిన తెచ్చుకున్నదాన్నే అందరు తిన్నాం. భలేగా ఉందది .’’మీరు భూమిపై చూసినవాటికంటే ఇక్కడి విషయాలు చాలా తేడా గాఉంటాయి  ‘’అంటూ నవ్వుతూ సంచీనిండా లోకల్ ఫుడ్ తో లోపలి వచ్చాను .’’సముద్రం లో షిప్ రెక్ అయితే ,మనదగ్గరున్నది తిని ఎలా ఉంటామో ఇక్కడా అంతే.అలవాటు పడాలి .ఇక్కడివి తింటే మీకు అక్కడివి ఇక గుర్తుకు రానే రావు .నా విషయం లో కూడా అలాగే జరిగింది .అక్కడ మనం తిన్న అన్నీ మర్చే పోయాను ఇక్కడ.’’తమరు నోరు మూస్తారా ? నేను అలవాటు పడతా .పిల్లా అలవాటు పడుతుంది .కానీ ఇక్కడికి వచ్చి తప్పు చేశానేమో అని నిన్ను కడిగి పారేస్తూనే ఉంటా. మన ఇష్టానిస్టాలు పిల్లమీద రుద్దు తున్నామేమో ఆలోచించావా ?అంది నాన్సీ .

 నాకు ఎక్కడో మండి,కోపం తన్నుకొచ్చి ‘’ఇది స్వర్గం నాన్సీ .ఇక్కడ ఏం తిన్నామనికాదు,నీలోపల ఏముందో అన్నది ముఖ్యం .అంటే నా ఉద్దేశ్యం  ప్రేమ సంతోషం అందం స్నేహం ,జాలికరుణ దయ ఇక్కడ ముఖ్యం .ఇవన్నీ నా కంటే బాగా తెలియ చెప్పటానికి ఇక్కడ మనుసులున్నారు .అమ్మమ్మ బయట కూర్చుని ఉంది మనం ఇప్పుడు త్వరగా టూర్ కి వెళ్ళాలి ‘’అన్నాను .

  నాన్సీ గొణుగుకున్నా,తయారై నేను ఏర్పాటు చేసిన హోవర్ క్రాఫ్ట్ ‘’లోకి ఎక్కింది .అందరం ఎక్కగానే అది కొద్దిఎత్తుకు  యెగిరి, గాల్లో తేలిపోయింది .కింద ఇళ్ళువిశాలం గా పెద్దగా అందంగా తీర్చి దిద్దినట్లు కనిపిస్తున్నాయి .ఎక్కడా రోడ్లు లేనేలేవు ,గడ్డిలో జాడలు మాత్రమున్నాయి .’’భూమ్మీద,ఎక్కడో ఎప్పుడో తయారు చేయబడిన పదార్ధాలు ప్రాసెస్ చేసినవిచాలా దూర తీరాలనుంచి వచ్చినవి  తినటం అలవాటయింది మనకు.వాటిని మనకు తెలియని వాళ్ళు తయారు చేస్తారు .అవి శక్తినిచ్చేవికావు వాళ్ళ ఇష్టప్రకారం వండినవి .తాజాతనం రుచి స్వచ్చత ఉండవు .కానీ ఇక్కడ మనకు దగ్గరగా పండినవేతినే మనం వండుకొని తింటాం .అక్కడ ఫ్రిజ్ లో దాచినవి మైక్రో వేవ్ లలో పెట్టి వేడి చేస్తాం అందువల్ల వాటి పోషక విలువలు నాశనమైపోతాయి .ఇక్కడ బీన్స్ లాంటివాటిని మనకు కావలసిన స్పైసేస్ కలిపి హాయిగా తాజాగా వండుకొని తింటాం  .’’అని దాదాపు క్లాస్ పీకినట్లు  చెప్పాను .అమ్మమ్మ ‘’అవి ఎక్కడ దొరుకుతాయిరా అబ్బీ సెంట్రల్ ఫుడ్ స్టోర్స్ ఉందా ఇక్కడ ?’’అనగా ,హోవర్ క్రాఫ్ట్ లో   వెళ్ళచ్చనీ దూరం కాదనీ చెప్పాను .’’ఒరే అబ్బాయీ !ఇక్కడ ఎవడూ పని చేస్తూ కనిపించటం లేదే .అజ్ఞాత బానిసలు  ఇక్కడ పని చేస్తారా ?”’అని జోకింది అమ్మమ్మ ‘’కాదమ్మమ్మా !  ఇక్కడ అందరూ రోజుకు నాలుగు గంటలే పని చేస్తారు .నాలుగుగంటలూ అ౦కిత భావంగా  నాన్ స్టాప్ గా పని చేస్తారు .ఇక్కడ అంతాపెర్ఫెక్ట్ గా పధ్ధతి ప్రకారం జరుగుతుంది .ఇక్కడ బానిస వ్యవస్థ లేనే లేదు .పని అవగానే  వెళ్లిపోవటమే .ఎవరి అనుమతీ అక్కర్లేదు .ప్రతివాడికీ జాబ్ శాటిస్ఫాక్షన్ ,ఆనందం ఉంటుంది సమస్యలుండవు’’అన్నాను .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం       203-అమెరికాదేశ సాహిత్యం -20

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -20

20వ శతాబ్ది సాహిత్యం -12

ఆఫ్రో అమెరికన్ సాహిత్యం

నల్లజాతి రచయితలు  రిచార్డ్ రైట్ సాంఘిక నిరసన కోప మార్గానికి భిన్నమైన దాన్ని అనుసరించారు. జేమ్స్ బాల్డ్విన్ ,రాల్ఫ్ ఎల్లిసన్ లురైట్ ప్రభావితులు .నల్లవారి జీవితాల సంక్లిష్టత పై వివాదాత్మక వ్యాసాలూ రాశారు .బాల్ద్ద్విన్ ‘’గో టెల్ ఇట్ ఆన్ ది మౌంటేన్ ‘’-1953 అనే గొప్ప నవల రాశాడు .హీర్లాం ప్రపంచం అందులో బ్లాక్ చర్చి లతో తన అనుభ వాలకు అద్దం పట్టాడు .అబ్సర్దిక్ హ్యూమర్, జానపద మిశ్రమం తో రియలిజం దట్టించి రాల్ఫ్ ఎల్లిసన్ ,పూర్తిగా నల్లవారి జీవితం వలసలు ,ఘెట్టో సంఘటనలు వర్ణిస్తూ జాతీయత కమ్యూనిజం బోధిస్తూ నవలలు రాశాడు .1952లోఇతడు రాసిన ‘’ఇన్విజిబుల్ మాన్ ‘’నవల పోస్ట్ వార్ సాహిత్యం లో ఉ త్కృష్టమైనదని చాలా మంది భావిస్తారు .

   తర్వాత ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ మహిళలు గొప్ప సాహిత్యం పండించారు .అందులో టోరి మారిసన్ –ది బ్లుయేస్ట్ ఐ -1970,సులా -1973,సాంగ్ ఆఫ్ సాల్మన్ -1977,బిలవ్డ్-1987,జాజ్ -1992,పారడైజ్ -1998నవలలలో సృజనాత్మక ఫిక్షన్ ,మాజిక్ రియలిజం తో పద్యానుభూతి కలిగించింది .వైవిధ్య జానపద శైలులను ప్రయోగించి ప్రభావితం చేసింది .చాలా పదబంధాలు సృష్టించింది బ్లాక్ హిస్టరిలో .1933లో నోబెల్ ప్రైజ్ పొందింది కూడా .ఆలీస్ వాకర్ చాలా కవిత్వం రాసి ,సివిల్ రైట్స్ ఉద్యమం పై 1976లో మెరిడియన్ నవలరాసి ,బ్లాక్ ఫెమినిస్ట్ నవల ‘’ది కలర్ పర్పుల్ ‘’-1982లో రాసి పులిట్జర్ బహుమతి అందుకొన్నది .

    ఈ కాలపు పురుష ఆఫ్రికన్ అమెరికన్ రచయితలలో ఇస్మాయిల్ రీడ్ కామిక్  టెక్నిక్  లతో ,జేమ్స్ అల్లాన్ మెక్ ఫెర్సన్ కథలు ,చార్లెస్ జాన్సన్ –ఆక్స్ హీర్దింగ్ టేల్స్-1982 ది మిడిల్ పాసేజ్ -1990నవలల లో చారిత్రాత్మక ఊహాత్మక ఎల్లిసన్ బాల్డ్విన్ శైలిలో రాసి పేరుపొందారు .కాల్సన్ వైట్ హెడ్ –ప్రయోగాత్మక టెక్నిక్, జానపద రీతిలను ‘’ఇంట్యూషనిస్ట్’’-1999,జాన్ హెన్రి డేస్-2001లో ప్రయోగించాడు .

                    కొత్త ఫిక్షన్ విధానాలు

   రెండవ ప్రపంచయుద్ధ దురాగతాలు ,అమెరికన్ కోల్డ్ వార్,అటామిక్ బాంబ్ భీభత్సం ,విలక్షణమైన వినియోగ సంస్కృతీ ,1960లో జాతులమధ్య గొడవలు  చూసి రచయితలు వాస్తవికత ఫిక్షన్ కు ఉన్న సాంఘిక బాధ్యత నుండి తప్పించుకోరాదు అని గ్రహించారు  .కనుక రొటీన్ కు భిన్నంగానవల కథ ఫిక్షన్ ఉండాలని భావించారు .అందుకే పోస్ట్ మోడరన్ నవలలను విలియం గాడిస్,జాన్ బార్త్,జాన్ హాక్స్ ,డోనాల్డ్ బార్తేల్మి ,ధామస్ పించాన్ ,,రాబర్ట్ కూవర్ ,పాల్ఆస్టర్,జాన్ డెలిలో లు రియాలిటీ కే పెద్ద పీట వేసి చాలా శక్తివంతంగా ఫిక్షన్ రాశారు .దగా ,మానసిక అపసవ్యాలను వాడుకున్నారు .తమ నవలలనువాళ్ళు కళాకృతులుగా,ఐరానిక్ రియలిస్టిక్ టెక్నిక్ లుగా భావిచారు .దీనితో హింస పెంచారు .డాక్యుమెంటేషన్ లేక ఫాంటసి పెరిగింది .నార్మన్ మైలర్ ,జాయిస్ కరోల్ ఓట్స్ లు ఈ కొత్త దృక్పధాలకు పెర్ఫెక్ట్ ఉదాహరణలు .

  ‘’ది నెకేడ్ అండ్ ది డెడ్’’-1948 నవలలో మైలర్ డాస్ పాధోస్ సోషల్ ప్రొటెస్ట్ శైలిని అనుసరించాడు .రియలిజనికి ఉన్న పరిమితులను దాటి సర్రియలిజం ఫాంటసి ని ‘’ఆన్ అమెరికన్  డ్రీం -1965,వై ఆర్ వుయ్ ఇన్ వియత్నాం -1967లో దట్టించాడు .’’ నాన్ ఫిక్షన్ ఫిక్షన్ ‘’లేక ఫిక్షన్ ఆజ్ హిస్టరీ విధానం ‘’ది ఆర్మీస్ ఆఫ్ దినైట్ ,దిమయామి అండ్ ది సీజ్ ఆఫ్ చికాగో -1968నవలలలో మైలర్ తన కొత్త గొంతును ఆవిష్కరించాడు కామిక్ గాఉన్నా  పూర్తి బౌద్ధికమైనవి .ట్రూ లైఫ్ నవల పులిట్జర్ బహుమతి పొందిన ‘’ది ఎక్సి క్యూషనర్స్ సాంగ్’’-1979, అతడు ఫిక్షన్ లోకి మళ్ళాక చాలాప్రతిభావంత౦ గా ‘’హార్లోట్స్ ఘోస్ట్ ‘’-1991,నవల సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ  పై రాశాడు  ..ఇతని చివరి నవలలు –జీసెస్ క్రైస్ట్ –ది గాస్పెల్ అకార్డి౦గ్ టుసన్,-1997,అడాల్ఫ్ హిట్లర్—ది కాజిల్ ఇన్ ది ఫారెస్ట్ -2007లలో పైవిషయమే వర్ణితం .

  జాయిస్ కరోల్ ఓట్స్ –ఎ గార్డెన్ ఆఫ్ ఎర్త్లి డిలైట్స్1967,దెం-1969లలో సహజసిద్ధంగా హింసాత్మక నగర విషయాలు –అంటే డెట్రాయిట్ రయట్స్,లో ప్రతిబింబింప జేసింది .వీటిని పండించి ,సర్రియలిజం లోకి వెళ్లి ‘’వండర్ లాండ్ ‘’1971లో ,గోధిక్ ఫాంటసి ని –బెల్లీ ఫ్లూయర్ 1980 రాసింది .న్యూయార్క్ లో తన యవ్వన జీవితాన్ని అంతకు ముందే 1986లో ‘’మార్యా ‘’లో రాసింది .ఆమె తర్వాత రచనలలో -బ్లాండే నవల -2000,లో మేరిలిన్ మన్రో ఫిక్షనల్ బయోగ్రఫీ రాసింది .మైలర్ ,ఓట్స్ మాత్రం రియాలిటి ప్రతిఫలమైన నవలకు లొంగక .శక్తి వంతమైన కొత్త ఫిక్షన్ విధానాల వేటలో పడక తప్పలేదు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నో నో నో నో—

నో నో నో నో—

          సీన్ -1

  • అర్చకసంఘం –అయ్యా !కరోనా వల్ల ఆలయానికి ఎవరూ రావటం లేదు .మా రాబడీ లేదు నిండుగా ఉండే హుండీ గుండు సున్నా అయింది .విఐపిలు, మంత్రులు వస్తున్నా ,వారు జాగ్రత్తలు తీసుకోకుండా ఆలయం లోకి రావటం తో , వాళ్ళ రోగం  అందరితో పాటూ మాకూ అంటుకొంటో౦ది.ఇప్పటికే మా  అర్చకులలో,సిబ్బందిలో  నాలుగోవంతు కరోనా పీడితులే మా ఆడాళ్ళు బెంబేలెత్తి పోతున్నారు .బ్రహ్మోత్సవాలూ తూనా బొడ్డు గానే చేశాం .వచ్చే నవరాత్రులూ అంతేగామరి  .కనుక మాదో విన్నపం .ఉద్యోగుల్లాగానే మేము కూడా శ్రీవారి సేవలు వర్క్ ఫ్రం హోమ్ గా  చేస్తాం .బాగానే ఉంది మరి నైవేద్యాల సంగతేమిటి అని అడుగుతారని తెలుసు .’’పోటుగాళ్ళ’’సారీ అంటే నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేసే వారని మా అభిప్రాయం  వాళ్ళ పని కూడా ఉండదు .వాళ్ళనీ ఇంట్లోనే వాటిని తయారు చేసి ఆన్ లైన్ లోపంపిస్తే ,నైవేద్యాలు పెట్టేస్తాం .ఖర్చూ కలిసొస్తుంది .ఇకపోతే తిరుక్షవరం

అంటారా ,అదే స్వామీ ౧కళ్యాణ కట్ట వాళ్ళపని .వాళ్ళు కూడా తలగొరుగుతున్నట్లు జుట్టు తీస్తున్నట్లు యాక్ట్ చేస్తారు .ఎవరింట్లో వాళ్ళే తలనరుక్కోవాలి సారీ జుట్టు నరుక్కోవాలి .తలనీలాలు కావాలంటే పోస్ట్ లోనో  కొరియర్ లోనో అదీ దండగే ఆన్ లైన్ లో పంపేయచ్చు.వాళ్లకి డబ్బూ, శ్రమా మిగుల్తాయి  .కరోనా కల్లోలమూ ఉండదు. అది అ౦ టుకుంటు౦దన్నభయమే ఉండదు . దిగులూ ఉండదు .ఆల్ హాపీ .అలాగే కళ్యాణ మండపాలలో కూడా పెళ్ళిళ్ళు ఇలానే జరుపుకోవచ్చు .మంగళవాద్యాల హోరు అక్కర లేదు వాళ్ళూ వాయించినట్లు నటిస్తారు ఆన్ లైన్ లో .పుస్తెలు మాత్రం ఇంట్లో నే ఎవరికి వారు కట్టుకోవాలి .తప్పదు .ఉపనయనాలూ అంతే .గర్భాదానాలూ వర్క్ ఫ్రం హోం లో నే జరగాలి అవి ఎలాగూ అలానే జరుగుతున్నాయనుకోండి .గృహప్రవేశాలూ అంతే అంతా యాక్షన్ తో సరి .తద్దినాలు కూడా వర్క్ ఫ్రం .తద్దినం పెట్టించే బ్రాహ్మణుడు తన ఇంట్లోనుంచి తంతు జరిపిస్తాడు .భోక్తలూ అంతే.కానీ అన్నీ యధా విధిగా జరగాలి. లేకపోతె పితృ దేవతలు శపిస్తారు .ఇదో పితలాటకం .

అధికారులు –బానే ఉందయ్యా మీ ఆలోచన .మేం యాక్సెప్ట్ చేస్తున్నాం తీర్మానం కూడా వర్క్ ఫ్ర్రం హోంచేసి పంపిస్తాం .ఇంతమందికి ఇన్ని భాషల్లో కంప్యూటర్లు ఎలా సప్ప్లై చేయాలి ?  .దీనికి మీ సొల్యూషన్ ఏంటి?పోనీ ఆర్ధిక మంత్రి ని అడుగుదామా ?

సంఘం –ఆవిడ దగ్గరేముంది శివాలయం .బడ్జెట్ ప్రెజెంటేషన్ అంకెల గారడీ .రైతులకు ఇచ్చిందీ లేదూ .వలసకార్మికులకు అందించిందీ లేదు .వాళ్ళాయనే ఆమె బడ్జెట్ పై పెదవి విరుస్తుంటే ఆమెనడిగి లాభం ఉండదు సార్.

అధికారి –అన్నీ మీరే చెబుతున్నారు. మీకందరికీ వర్క్ ఫ్రం హోం కావాలని డిమాండ్ చేస్తున్నారు. మాకూ మీపై సానుభూతి ఉంది .దీనికీ మీరే పరిష్కారం చెప్పండి సాములూ

సంగం –వెరీ సింపుల్ .మోడీ గారికి ట్రంప్ జగిని దోస్త్ కదా .అందుకని అమెరికాలోని భారతీయ వోటర్లను ఆయనకే’’ గుద్దేస్తామని ‘’అదే సార్ ఓట్లు వేస్తామని ప్రకటన చేయమనండి .కావాల్సినన్ని  క౦పులు అవే నండీ కంప్యూటర్లు క్షణాలలో వచ్చి వాలేట్లు ట్ర౦ప్ చేస్తాడు.ఫికర్ నై .మోడీ హూనా.

అధికారి –ఇప్పుడే ఆన్ లైన్ లోఆయనకు ఈవిషయం పంపించి అర్జెంట్ గా ట్రంపు నుంచి క౦పులు వచ్చేట్లు చేయమని తీరమానం చేసి యాక్షన్ తీసుకో మంటాం.

సంఘం –ధన్యవాదాలు సార్ మా అందరి దీవెన, స్వామి వారి ఆశీర్వచనం మీ కెల్లప్పుడూ లభిస్తాయి .కావాలంటే  మీ ఇంట్లో ఏకార్యక్రమమైనా మేమే వచ్చి నిర్వహిస్తాం .

              సీన్ -2

లచ్చి నుంచి ఫోన్ –అమ్మగోరో !నాను రేపటి నుంచీ ఇంటికొచ్చి పనిసేయనండి .మా సంగం అలా తీర్మానం సేసినాదమ్మా .అయ్యగోరు అదేదీ వక్క ప్రం హాంఫట్ చేస్తున్నట్లే మేమూ మీ పనులన్నీ ఇంటి నుంచే చేత్తామమ్మా .ఆరునెలలైనా కరోనా కోవిడ్ పెరిగిందే కానీ తగ్గింది లేదు .మా వర్కర్లు శానా మంది దాని బారినపడి సనిపోనారండీ .మీకైతే పెన్షన్లు వగైరా ఉంటాయికాదండీ. మాకేటి ఉంటాది ,చేస్తే జీతం లేకుంటే పస్తులు .మా మావ కూడా పని కెల్లద్దని రాత్రి తాగొచ్చిఇరగ్గొట్టి   మరీ  సెప్పాడమ్మా .

సీత ఫోన్ లో  –ఇదేం చోద్యమే .అంట్లు ,పాచి వర్క్ ఫ్రం హోం చేస్తావా ?ఎలా కుదుర్తుందే అది .కోరిక గొంతెమ్మ కోరిక కాకూడదే.

లచ్చి-గొంతెమ్మో చితమ్మో నాకేటి తెల్సు .వా వోళ్ళు అన్నారు. నాను సెప్పాను .ఆళ్ళ మాట ఇనకపోతే ఎలేస్తారమ్మా.ఫైన్ కూడా కట్టాలంట .

సీత –సరే నే .నీ ఇంటినుంచి  మా ఇంటి పని ఎలా చేస్తావే ?వివరంగా చెప్పు ?

లచ్చి- ఏటీ లేదమ్మ గోరో.తమరు నాకు కంప్యూటర్ ఇచ్చి నేర్పిస్తే నాను ఇంట్లో నుంచి చేత్తానన్నమాట,

సీత –ఎలా? హౌ ?

లచ్చి –చిమ్పుల్ అమ్మగారో .నేను మా ఇంట్లో కంప్యూటర్ లో ఇల్లు ఊడుస్తున్నట్లు అంట్లు తోముతున్నట్లు బట్టలు ఉతుకు తున్నాట్లు యాక్ట్  చేత్తానన్నమాట .మీరు హాయిగా ఆ పనులన్నీ మీ ఇంట్లో చేసుకోవాలన్నమాట .నెలజీతం ఖచ్చితం గా ఒకటో తారీకు నా అకౌంట్ లో పడితీరాలి .లేకపోతె రోజుకు పది రూపాయలు ఫైన్ కూడా మీరే   కట్టాలని మా సంగం తీర్మానం .

సీత –నోనో నో

మా ఆవిడ –ఏమిటండీ నోనో నో అని నిద్రలో అరుస్తున్నారు ?పీడ కలేమైనా వచ్చిందా .చీపురుతో దిష్టి తీయనా ?

  అనగానే మెలకువ వచ్చి ఇదంతా కల అని తెలిసి౦ది .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-9-20-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం                         203-అమెరికాదేశ సాహిత్యం -19

ప్రపంచ దేశాల సారస్వతం

203-అమెరికాదేశ సాహిత్యం -19

20వ శతాబ్ది సాహిత్యం -11

దక్షిణ దేశ ఫిక్షన్

రెండవ ప్రపంచ యుద్ధానంతరం దక్షిణాది రచయితలు ఫాక్నర్ వారసత్వాన్ని ప్రేరణగా పొందారు .ముగ్గురు మహిళలు ఇడోరావెల్టి , ఫ్లానరి ఓకాన్నోర్ ,కార్సన్ మెకల్లస్ లు అసహజ వికృత అంటే గ్రోటోస్క్ విధానం లో దక్షిణాదిసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు .కానర్ మాత్రం దక్షిణాది ప్రొటెస్టెంట్ లో రోమన్ కేధలిక్ గా గొప్ప కామెడీని నైతికసంబద్ధత (మోరల్ ఇ౦కా గ్రుటి)శైలిలో చిన్న కథలను ప్రతిభా వంతంగా రాసింది .గోప్పస్టైలిస్ట్ అయిన వెల్టి తన మొట్ట మొదటి కథాసంపుటులు ‘’ఎ కర్టెన్ ఆఫ్ గ్రీన్ -1941,ది వైడ్ నెట్ అండ్ ది స్టోరీస్ -1943 లతో మహా కీర్తి పొందింది .లూజింగ్ బాటిల్ అనే నవల 1970,పులిట్జర్ ప్రైజ్ పొందిన నావేల్లా –దిఆప్టిమిస్ట్ స్ డాటర్ 1972,కూడా రాసింది .మెక్ కల్లర్ ‘’ది హార్ట్ ఈజ్ ఎ లోన్లీ హంటర్ ‘’-1940 నవల సుదూర సౌత్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారం గారాసి చదువరుల హృదయాలు కొల్లగొట్టింది .రిఫ్లెక్షన్స్ ఇన్ ది గోల్డెన్ ఐ -1941,ది మెంబర్ ఆఫ్ ది వెడ్డింగ్ -1946,ది బాలడ్ఆఫ్ ది శాడ్ కేఫ్-1951,నవలలు రాసింది .ఈమూడూ సినిమాలుగా వచ్చాయి .ఎలిజబెత్ స్పెన్సర్ –దిసదరన్ వుమన్ -2001.రేనాల్డ్స్ ప్రైస్-ఎలాంగ్ అండ్ హాపీ లైఫ్-1961 కైటే వైడేన్ నవల -1986కూడా ఈకాలపు రచయితలే .దక్షిణాది గొంతుకు ప్రాధాన్యం పొందిన ట్రూమన్ కపోటే-అదర్ వాయిసెస్ అండ్ అదర్ రూమ్స్ -1948,లో దికోల్డ్ బ్లడ్1965లో నూ రాసి పబ్లిష్ చేసింది .టాం ఉల్ఫ్ ,నార్మన్ మైలర్ లు డాక్యుమెంటరి రియలిజం అనే కొత్త జర్నలిజం సృష్టించారు .ఫిక్షన్ లో వాడే టెక్నిక్ లన్నీ దీనిలో వాడటం ప్రత్యేకత .

  విలియం స్టిరాన్-మొదటి నవల లై డౌన్ ఇన్ డార్క్ నెస్-1951లో ఫాక్నర్ ప్రభావం బాగా పండి పోయినట్లు కనిపిస్తుంది .తర్వాత రాసిన రెండు వివాదాస్పద నవలలు సమాజం లో చీకటి కోణాలను  చిత్రించాయి-అవే- ది కన్ఫెషన్స్ ఆఫ్ నాట్ టర్నర్ – 1967,లో పూర్తిగా బానిసల తిరుగుబాటు ఉంది ,సోఫీస్ చాయిస్ నవల -1979లో హాలోలోకాస్ట్ హారర్ చిత్రీకరణ ఉంటుంది .ఫాక్నర్, మార్క్ ట్వేన్ ల ప్రభావం తో విలియం హంఫ్రి రెండు శక్తివంతమైన నవలలు టెక్సాస్  ఆధారంగా రాశాడు-అవే-హోం ఫ్రం ది హిల్స్-1958,ది ఆర్డ్ వేస్-1965.వాకర్ పెర్సి –దిమూవీ గోయర్-1961,దిలాస్ట్ జెంటిల్మన్-1966 లతోసదర్న్ ఫిక్షన్ కు గొప్ప ఊపు తెచ్చాడు .వీటిలోని మ్యూజింగ్ ఫిలసాఫికల్ స్టైల్ గోధిక్ శైలికి భిన్నంగా తర్వాత రచయితలను ప్రభావితం చేసింది .ఈ ప్రభావం తో రిచర్డ్ ఫోర్డ్ –దిస్పోర్ట్స్ రైటర్ 1986లో ,సీక్వెల్ గా ఇండి పెండేన్స్ డే-1995లో కదిలించేట్లు రాశాడు .అదే ధోరణిలో పీటర్ టైలర్అనే సోషల్ రియలిస్ట్ గొప్ప కథా కథన విధానం లో అభివృద్ధికి దోహదపడేట్లు గతకాల వైభవ ప్రస్తుతిగా –ది ఓల్డ్ ఫారెస్ట్-1985 ఎ సమాన్స్ టు మెంఫిస్-1986లో రాశాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-9-20-ఉయ్యూరు ,

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అరె ఏమైందీ –

అరె ఏమైందీ —– /// శర్మాజీ ///
😌😌🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏

ఆగస్టు 5 : “అందరి లాగా నాకూ కొరోనా వచ్చింది ఇప్పుడే సోషల్ మీడియా ద్వారా వీడియొ పెట్టాను. “ఇంటికి వేళ్ళ లేదు. ఎంజీఎం ఆసుపత్రిలో ఫ్రెండ్స్ మధ్య లో ఉన్నాను. ” మేనేజర్ కి అన్నీ ప్రోగ్రామ్స్ కాన్సిల్ చెయ్యమని చెప్పా. ఫ్రెండ్స్ అందరితో కాల్స్ చేసాను.

అన్ని టెస్ట్స్ తీసుకొన్నారు. అన్ని జాగర్తలు చెప్పారు. బచ్చన్ గారికి వచ్చింది పోయింది. అమిత్ షాకు వచ్చింది పోయింది పెద్ద బెంగ లేదు అదీ ఆశ

ఆగస్టు 6 : హాయ్ గా ఉంది , చాల రోజుల తర్వాత చక్కగా నిద్ర పోయాను. సావిత్రి, చరణ్ , పల్లవి తో మాట్లాడాను. ప్రశాంతం గా ఉంది నా మెడికల్ రిపోర్ట్స్ అన్ని తెప్పించారు. చక్కగా పాటలు పాడుకొంటూ. కొంచెం దగ్గు, ఇన్ఫెక్షన్ అని పిస్తోందని చెప్పాను. టెస్టులు చేస్తున్నారు. నోట్లో ,గొంతులో…… ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అటు ఇటు మంచం మీద నుంచి. నా కోసం పాటలు పెట్టారు లో వాల్యూమ్ లో … ఇప్పటి దాకా పాటలు , రికార్డింగ్స్ , యాక్టర్స్ , సింగెర్స్ , ఆర్చెస్ట్రా… సడన్ గా డాక్టర్స్ ,నర్సుస్ , మందులు సూదులు , మన పక్కన మన వాళ్ళు ఎవరూ లెకపోవటం.. చప్పట్లు కొట్టా , గంట కొట్టా , దీపాలు వెలిగించా అయినా కరోనా కరుణించింది.కొరోనా మీద “భారత భూమి” పాట పాడిన నాకు కొరోనా.

ఆగస్టు 7: : అనీజీ గా ఉంది డాక్టర్స్ కి చెప్పాను. కొరోనా లో నార్మల్ అని చెప్పారు. ఇంజెక్షన్స్ ఇచ్చారు. సెలైన్ ఎక్కించారు అన్ని లిక్విడ్స్ ఇస్తున్నారు. పాటలు వింటూ … చరణ్ వచ్చాడు. ఫోన్ మాట్లాడ వద్దు అన్నారు. ఆక్సిజెన్ పెట్టారు. పెడుతున్నారు మళ్లీ తెస్తున్నారు. కొరోనా లో అలాగే ఉంటుంది మందు లేనప్పుడు ఇదే ట్రీట్మెంట్ అన్నారు. కృష్ణ గారితో మాట్లాడలనిపించింది మెసేజ్ పెట్టాను.

ఆగస్టు 8 : ఇవ్వాళ అలాగే ఉంది… ఒక్కసారి జీవితం గిర్రని తిరిగింది.. సంవత్సరం క్రింద చనిపోయిన అమ్మ , నాన్న కళ్ళ ముందే ఉన్నాడు. ఇద్దరు అన్నలు ఐదుగురు అక్క చెల్లెల్లు వసంత, శైలజ అన్న అన్నా అని చేయి పట్టుకొని స్కూల్ కి తీసుకెళుతున్న దృశ్యం. ఏమైంది నాకు మళ్ళి టెస్టులు రిపోర్ట్స్. డాక్టర్స్ ఫ్రెండ్స్ వస్తున్నారు, వెడుతున్నారు… ఇప్పటి దాకా సలహా అడిగిన డాక్టర్స్ నాతొ ఏమి మాట్లాడటం లేదు. ఫోన్లో చరణ్ తో సంప్రదిస్తున్నారు.

నిద్ర లేదు మత్తు, ఆహరం లేదు. అంతా ఒక మాయ లాగా ఉంది. స్పృహ వస్తోంది పోతోంది..

ఆగస్టు 9 : రూమ్ షిఫ్ట్ చేసినటున్నారు… నేను లేవలేను. నర్సులు వస్తున్నారు వెడుతున్నారు. పలకరిస్తున్నారు. చెప్పలేను. కదలలేను , మెదలలేను పెదవి విప్పి పలకలేను .. మాస్టారి పాట మనసులోనే అందరికి ధన్యవాదాలు.. మనసులో నే పాటలు. ” చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన …. ఆడవే మయూరి… ”

“శివరంజని నవ రాగిణి. వినినంత నా మనసు..”

నాకు తెలిసి పోయింది ఎదో అయిపొయింది అని.

ముక్కులో పైప్స్. గొంతులో పైప్స్ , వెంటిలేటర్ మీదకి వెళ్ళాను. కానీ నేను గాలి పీల్చుకోలేక పోతున్నాను. నాకేమి జరుగుతోందో నాకే తెలియదు

ఆగస్టు 13 : పరిస్థితి విషమంగా ఉన్నటుంది అవును ఆంటీవిటల్స్ , స్టెరాయిడ్స్ , ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేశారు ఇవి అన్ని కొరోనా లో కామన్ అని ముందు చదివాను. అందరు కళ్ళకు కనబడుతున్నారు. అంతే .. మనసు మాత్రం నా జీవితం మొత్తం తెగ తిరిగి తిరిగి వస్తోంది. నా గురువులు , నా శిష్యులు , నా కుటుంబం , మనుషులు. ప్రపంచం , దేశం రాష్ట్రము , నేను చూసిన ప్రదేశాలు. పిల్లలు. సావిత్రి ..

ఏమి చెయ్యగలను లెవలేను.

ఆగష్టు 14 : ఫామిలీ డాక్టర్స్, రెగ్యులర్ డాక్టర్స్, వచ్చారు లేపారు. అతి కష్టమీద కూర్చోపెట్టారు.

ఆక్సిజెన్ ఎక్కువ తాగేస్తున్నావు. ఆక్సిజన్ సపోర్ట్ చాలడం లేదు అన్నారు. నాకు చెప్పడానికి భయపడుతున్నట్లు అన్నారు. మనకి వెంటిలేటర్ ఆప్షన్ మీరు ఓకే అంటే పెడతాము. నాకు తెలుసు ఏంటో మందిని చూసాను. వెంటిలేటర్ అంటే ఇక అంతే అని. ఇప్పటికే వారం రోజులు అయ్యింది ఇక్కడకు వచ్చి ..నాకు నరకమే కనబడుతోంది. అది పెడితే బ్రతికినా పాడలేను. నాలోని సింగర్ కి ఆగస్టు 14 లాస్ట్ డే … కామ్ గా “మీకు ఏది మంచిది అని పిస్తే అదీ చెయ్యండి ” మెల్లగా స్పర్శ కోల్పుతున్నాను.

ఆగస్టు 15 : రూమ్ మార్పు, డాక్టర్స్ మార్పు. వెంటిలేటర్ . బాడీ లో ఏ అంగము పనిచేటం లేదు అనిపిస్తోంది. మెదడు మొద్దుబారి పోయింది. అన్ని ట్యూబ్స్ , కంప్లీట్ కొరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. EKMO గుండె కి, కృత్రిమ ఊపిరి ఆడటానికి . సావిత్రి కి కూడా కొరోనా , ఇదే హాస్పిటల్ లో వేరే వార్డ్ లో ఉంది

ఆగస్టు 17 : . ఏ శ్వాసలో మ్రోగితే గాలి గాంధర్వ అవుతున్నదో.. ….

అర్ధమయ్యింది 45 వేలకు పైగా పాటలు పాడి 1000 పైగా స్టేజి ఫై మిమ్మల్ని పాటల తో ఊదిన ఊపిరి తిత్తులు అలసి పోయాయి అని. ఆగిపోతున్నాయి అని. బహుశా అవి కోలుకోలేవని

ఆగస్టు 20 : అంతటా యాంత్రికం గా జరుగుతున్నాయి. పగలూ లేదు రాత్రి లేదు. ఆహరం లేదు, గాలి లేదు , వెలుతురూ లేదు సూర్యుడు లేడు చంద్రుడు లేడు మెల్ల మెల్లగా అన్ని మర్చిపోతున్నాను ఆత్మ కథ పుస్తం గా రాలేదే అనిపించింది. మాస్టారి విగ్రహం రవీంద్ర భారతి నేను పెట్టించాను . రాష్ట్రాలు విడిపోయింతరువాత అది ఎక్కడుందో ….

చాలా క్రిటికల్ పరిస్థితి. ఏమి తెలియటం లేదు , అన్నీ బందించి ప్రాణాలు ఆపినట్లున్నారు.. కన్ను తెరచినా , మూసినా ఒకటే … గాలి లో తేలినట్లు. ఎగిరి పోయే ప్రాణం వెనక్కి లాగుతున్నట్లు.

హాస్పిటల్ ముందు నేను బ్రతకాలని కాండిల్ లైట్స్ , కొందరు విజిల్స్ వేస్తున్నారని నర్స్ చెబుతోంది ….

ఆగస్టు 29 సెకండ్లు, నిముషాలు గంటలు, రోజులు, వారాలు గడిచిపోతున్నాయి. ఏ మార్పు లేదు అనుకొంటాను అచేతనం గా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. నాకు తెలియకుండా. అంపశయ్య మీద గాయాలతో ఉన్న భీష్మునికి నాకు పెద్దగా తేడాలేదు … అయన గాయాలతో… నేను గాలి కూడా పేల్చక్కర్లేదు. అన్ని అవే పనిచేస్తున్నాయి. ఆయనకు ఇచ్చా మరణం మరి నాకు ….

సెప్టెంబర్ 6 : వివాహ దినోత్సవం ఇద్దరికీ కొరోనా ఇద్దరం ఒకే హాస్పిటల్ .. కేక్ తెచ్చారు , కట్ చేశారు. చూడట మే కానీ స్పందించటం లేదు. కాళ్లు , చేతులు వ్యాయమ ప్రక్రియ చేస్తున్నారు. చరణ్, .. సావిత్రి గుర్తు పట్టాను. డాక్టర్స్ , నర్సులు ఎంకరేజ్ చేస్తున్నారు. పాటలు ఆస్వాదించే పరిస్థితి లేదు . నా నిమిత్తం లేకుండా అన్నీ జరుగుతున్నాయి.

సెప్టెంబర్ 7 : కొరోనా నెగటివ్ అని డాక్టర్స్ నర్సులు జయించావు అంటూ . అని బాగా పాటలు పాడారు . చప్పట్లు కొట్టారు. ఇంకేముంది పది రోజులలో ఇంటికి అన్నారు. మెదడు పెద్దగా పనిచేసున్నట్లు లేదు.. పాటలు పోయాయి. కన్ఫ్యూషన్ కోమా … నీళ్ళు తాగించారు మెల్లగా అన్ని తినవచ్చు అనుకొన్నాను. అటు ఇటు బెడ్ మీద తిప్పారు.

సెప్టెంబర్ 15 : పూర్తి రొటీన్ ,, టెస్టులు, సెలైన్ ఇంజెక్షన్స్, బ్లడ్ ఎక్కించటం. ఇంకా ఉండాలనిపించటం లేదు. ఇంటికి పద అని చరణ్ కి చెప్పాను . చెప్పటం కాదు అన్ని సంజ్ఞలే … ఎవరైనా 5 మీటర్ల దూరమే …

సెప్టెంబర్ 22 : ఇప్పటి దాకా బాడీ మీద పనిచేసిన డాక్టర్స్ నా మెదడుకి పని పెట్టారు. CT స్కాన్, MRI స్కాన్. బహుశా MGM అన్ని డిపార్ట్మెంట్స్ కి నేను అతిధిని కొరోనా శరీరం లోంచి మెదడుకి పాకినట్లున్నది. ఒకటే హడావుడి. ఇప్పుడు చూడక్కర్లేదు . వినక్కర్లేదు బహుశా కొరోనా శరీరం కి వస్తే నివారించవచ్చు మెదడుకి మండే లేదు

సెప్టెంబర్ 23 : ఇంక అంతా అయిపొయింది. మాక్సిమం లైఫ్ సపోర్ట్ మీద ఉంది నా బాడీ . అది తీసేస్తే పూర్తిగా స్వస్తి అంటా మర్చిపోయాను. ఏటో ఎగిరిపోతున్నట్లు. …. బహుశా ఆకాశంలో నన్ను పిలుస్తున్నారు. నాకు ఎవరు లేరు భవబంధాలు తెంచుకొంటున్నాను.

సెప్టెంబర్ 24 : ఆకాశం లో అందరూ ఇప్పుడు స్పష్టం గా కనబడుతున్నారు. ఇంకా నన్ను చూడంలేదు మనిషి లాగా , కమల్ వచ్చాడు . భారతీ రాజా చూశాడు . వార్తలు వేసేసారు. జీవిత చరిత్ర చెప్పేసారు. ఇక లేరా ? అని నన్నే ప్రశ్నిస్తున్నారు . మెదడులో రక్త స్రావం దాని మందు లేదు. ఇప్పటి దాకా పనిచేసినవి మళ్ళి ఆగిపోయాయి… చరణ్ ముహూర్తం పెట్టించినట్లున్నాడు రేపు బాగుంది అని

సెప్టెంబర్ 25 : హమ్మయ్య విముక్తి … 1:00 కి సీసా మూత తీసేసారు. కస్టపడి 3 నిమిషాలు గాలి పీల్చాను. , సాగర సంగమం లో బాలు చివరి శ్వాస లాగా నాది ఆగిపోయింది. 1:04 అని ఫైల్ మూసేసారు.

ప్రణబ్ గారిని మించి , అమ్మ జయ లలితను తలపిస్తూ నా ఆసుపత్రి కథ ముగిసింది ఇంక ట్విట్లు పెట్టండి , వాట్సాప్ మోత ముగించండి , FB దుమ్ము దులపండి శకం ముగిసింది. ఎవరు అప్పుడే వికీపీడియా అప్డేట్ చేసారు. 1:5 కే

నా పాట నాతో పాటే ఇప్పటి దాకా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను . ఇప్పుడు మీవంతు. నా పాటలు నాకే పెట్టెయ్యండి

సెప్టెంబర్ 26 : అప్పుడే స్వర్గం లో తుంబురుడు, నారదుడు వచ్చి తీసుకెళ్తున్నట్లు పేపర్స్ లో వేసేసారు. బహుశా ముందే రెడీ చేసినట్లున్నారు ఆగస్టు లోనే రెడీ అనుకొంటాను హెడ్ లైన్స్ అన్నీ, స్వర్గం లో మాస్టారు, బాపు, రమణల తో , వేటూరి గారితో ఏకంగా ఫొటోస్ పెట్టేసారు. సాయంత్రం స్వరాభిషేకం ఉందని ఆహ్వాన పత్రిక డిజైన్ చేసేసారు. అప్పుడే తెలిసింది నేను ఎవర్ని అని. అప్పటి దాకా మా వాడే అనుకొన్న వాళ్ళు కొంచెం తగ్గారు. భారత రత్న ఇచ్చేసారు . కనీసం నేను అప్లై చెయ్యాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం అప్లై చెయ్యాలి అని తెలియకుండా. నన్ను మా రాష్ట్రంలో పుట్టు, అని ఆర్డర్స్ వేసేసారు. ఆ పని దేవుడికి వదిలెయ్యండి

51 రోజులు రోజూ పాపం చరణ్ ఇబ్బంది పడుతూ పైన విశేషాలు మీకు చెప్పలేక, మాట్లాడలేక , ఇంగ్లీష్ లో చెబుతూ . చరణ్ ఫోన్ లో ఒకటి చెబితే మీకు ఇంకోటి అర్ధమయ్యి … నన్ను స్మరించి. అందరికి 11 రోజులు సంతాప దినాలు. నాకు 41 రోజులు చేశారు. ఇంత కంటే అదృష్టం ఏమి ఉంది.

చివరగా ఎప్పుడూ  చెబుతున్నట్లే ” శుభం భూయాత్ ” /// శర్మాజీ ///

Posted in సభలు సమావేశాలు | Leave a comment

బాలు తో మాట -మంతీ

బాలు తో మాట -మంతీ

 

అవి  ఘంటసాల మాస్టారి పాటల స్వరాభి షేకం ఆంద్ర దేశం లో ఊరూరా జరుగుతున్నా సువ ర్ణ మయ కాలం .అంటే సుమారు పాతిక సంవత్సరాలకు ముందు .ఆయన శిష్యుడు శ్రీ గంగాధర శాస్త్రి మొదలైన వారు వీర విజ్రు౦భ ణ గా  బాద్య భుజాలపై వేసుకొని ,ఏకాహాలు మూడు రోజుల ముచ్చట్లుగా నిర్వహిస్తున్నారు .మాస్టారి శ్రీమతి సావిత్రిగారు కుమారుడు శ్రీ రత్నకుమార్ ,ప్రముఖగాయకుడు శ్రీ జి .ఆనంద్ మొదలు ఎందరెందరో వర్ధమాన గాయనీ గాయకులు ఘంట సాల వారి స్వరలహరిని తమ గాత్రాలలో  నింపుకొని ఉర్రూత లూగిస్తున్న పరమ పవిత్రకాలం .అందులో పాల్గొనటమే ,మాస్టారి అర్చనగా ,పరమ అదృష్టంగా వీక్షకులూ భావి౦చేకాలం  .అలా ఒక సారి మాస్టారి పాటల పల్లకీ ఊరేగింపు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో రెండు రోజులో ,మూడు రోజులో జరిగింది .ఒక రోజు శ్రీ శ్రీపతి ప౦డితారాధ్యుల బాల  సుబ్రహ్మణ్యం అనే బాలు గారు కూడా పాల్గొంటునట్లు పేపర్ లో చదివి ,ఆ రోజు సాయంకాల౦  ఆపండుగలోపాల్గొని తరిద్దామని నేను ఉయ్యూరు నుండి సాయంకాలం వెళ్లాను. బహుశా అది సమాపన ఉత్సవం అని గుర్తు .ఆరోజు శ్రీ గంగాధర్ ,శ్రీ ఆనంద్ మొదలైనసుప్రసిద్ధులతో పాటు శ్రీ బాలు కూడా ఇతర వర్ధమాన గాయకీ గాయకులతో పాటు ఘంటసాల వారి పాటలు పాడి ఘన నివాళు లర్పించి ,తన్మయం కలిగించారు .నేనూ మహదానంద పడ్డాను .నా మనసులో ఎన్నాళ్ళ నుండో ఒక విషయం సుళ్ళు తిరుగుతూ ,ఎవరికి చెప్పాలో అసలు చెప్పాలో చెప్పకూడదో అనే సందేశం పీడిస్తోంది .ఏమైనా అందరూ ఇక్కడ ఉన్నారు కనుక  నా దగ్గర ఉన్న నోట్ బుక్ లో ఒక కాగితం చింపి ,అందులో నా మనో భావం స్పష్టంగా రాసి ,బాలుకు అందివ్వమని ఒక కార్య కర్తకు ఇచ్చి కూర్చున్నాను .కార్యక్రమం దాదాపు పూర్తయ్యే సమయం అది .బాలు నేను రాసిన కాగితం చదివి ‘’ఉయ్యూరు నుంచి ఒక మేష్టారు దుర్గా ప్రసాద్ గారు వచ్చి ,కార్యక్రమ లో పాల్గొని ఆనందించి ,ఒకకాగితం లో ఒక ముఖ్య విషయం రాసి నాకు పంపారు .అది వారి నోటి మీదుగా అందరికీ తెలియ జేయాల్సింది గా  ఆయన్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ‘’అన్నాడు .సరే ధైర్యం తెచ్చుకొని వేదికపైకి చేరి బాలు కు అభివాదం చేసి నేను రాసి పంపిన కాగితం లోని విషయాన్ని ఇలా చెప్పాను ‘’అందరికీ నమస్కారం . ఘంటసాల  మాస్టారి  పై ఉన్న అత్యంత గౌరవం తో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నవారికీ, పాల్గొన్న వారికి హృదయ పూర్వక అభినందనలు .హిందీ వివిధ భారతి లో ప్రతి రోజు ఉదయం కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు హిందీ సినిమా పాటలకు అమరత్వం కలిగించిన సైగల్ గారి పాట రికార్డ్ వేసి స్మృత్యంజలి ఘటించి కార్యక్రమ౦ మొదలు పెడుతున్నారు .అలాగే మన తెలుగు సినిమా పాటలకు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తన అమరగానం తో చేకూర్చిన ఘంటసాల వారి పాటలకు సైగల్ కు చేసినట్లు మనం అలా న్యాయం చేయటం లేదు .ఇది చాలా బాధాకరమైన విషయం .ఎవరికీ ఈ ఆలోచన రాకపోవటం దురదృష్టం .కనుక ఈ వేదిక మీదుగా ప్రభుత్వానికి ,రేడియో వారికీ ,అందరికీ కూడా  చెప్పేదేమిటి అంటే ‘’తెలుగు వివిధ భారతి ప్రోగ్రాం ప్రతి రోజూ  ఘంట సాల వారి పాటతో ప్రారంభించి ఆ అమరగాయకునికి సైగల్ కు లాగా గౌరవ ప్రతి పత్తి కలిగించాలి .బాలుగారు ఈవిషయం లో చొరవ తీసుకొని సంబంధితమైన వారికి చెప్పి ఈ పని జరిగేట్లు చేయాలి ‘’అన్నాను .హాలంతా చప్పట్ల మోత మోగింది .బాలు ‘’నిజమే మనం ఎవరం ఇంత వరకు దీనిపై దృష్టి పెట్ట కపోవటం మనలోపమే .మీడియా వారు రేడియో వారు ఈ విషయం గమనించి తెలుగు వివిధభారతి  ఘంట సాల వారి పాటతో నే ప్రారంభించాలి. నేనూ నావంతు కృషి చేసి, అలా జరిగేట్లు చూస్తాను ‘’అనగా మళ్ళీ హోరున చప్పట్లు ప్రతిధ్వనించాయి .   అ తర్వాత అది వేదిక వాగ్దాన౦ గానే ఉన్నది కాని కార్యరూపం దాల్చినట్లు కనిపించలేదు .

  రెండవ సారి బాలుగారిని 1997 అక్టోబర్ 7 న హైదరాబాద్ మారుతి  స్టూడియో ‘’పాడుతా తీయగా ‘’ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు చూశాం .అప్పుడు మా అబ్బాయి శర్మ అక్కినేని కి చెందిన ‘’రాజ్య లక్ష్మి టెక్స్ టైల్స్ ‘’లో కంప్యూటర్ విభాగం లో పని చేస్తున్నాడు .వాళ్లకు  కాంప్లి మెంటరీ పాస్ లు ఇస్తారట .మేము. వస్తామంటే తీసుకొని ఉంచుతాను అంటే  సరే నని వెళ్లి  వాళ్ళింట్లో ఉండి ఆ పాస్ లతో నేనూ మా శ్రీమతి వెళ్లి ప్రేక్షకస్థానం లో కూర్చుని చూసి ఆనందించి ,అయిపోగానే ,ఆయన దగ్గరకు మేమిద్దరం వెళ్లి పరిచయం చేసుకోగా ఎంతో సంతోషించి నమస్కరించగా మేము ‘’మేము ఉయ్యూరు నుండి వచ్చాం .మీ బంధువు శ్రీమతి సీతం రాజు మల్లికగారు మాకు కుటుంబ స్నేహితురాలు .ఆమె తండ్రి బెజవాడలో ప్రసిద్ధ హోమియో డాక్టర్ తాడినాడ భోగ  మల్లికార్జునరావు గారు  వాస్తు జ్యోతిష్యులు ‘’అనగానే ‘’చాలా సంతోషం మాస్టారు .మల్లిక మాకు చాలా దగ్గర బంధువు .వారి నాన్నగారు మాకు దైవ సమానులు .తరచుగా వారితో మాట్లాడుతూ ఉంటాం ‘మల్లిక కూడా ఫోన్ చేస్తూ ఉంటుంది .అడిగానని చెప్పండి ‘’అన్నారు .ఈ విధంగా రెండు సార్లు మాత్రమే  చూసి మాట్లాడే అవకాశం కలిగింది .

మూడో సారి శ్రీ వేటూరి వారు తమ స్వగ్రామం పెదకళ్ళేపల్లిలో రెండు రోజులు అన్ని ఖర్చులు తానె భరించి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు1999ఫిబ్రవరి లో  ఆయన స్వంత ఇంట్లో .దానికి మేమిద్దరం వెళ్లాం .కళాస్రష్ట శ్రీ విశ్వనాథ్ ,శ్రీదేవదాస్ కనకాల దంపతులు ,సప్తపది హీరోయిన్ సబిత మొదలైన వారంతా  వచ్చారు .అందరికీ  కాఫీ టిఫిన్లు మధ్యాహ్న భోజనాలువేటూరి గారి పెంకు టింట్లో నే .వంటబ్రాహ్మణులతో  రుచిగా కమ్మని వంటలు చేయించారు నవకాయ పిండివంటలతో .కడుపు నిండా అందరం తిన్నాంఅందరం . ప్రతివారినీ వేటూరి పలకరించారు .ప్రక్కనే ఉన్న ఆడిటోరియం లో ఉదయం మీటింగ్ .బాలు కూడా రావాలి కాని ఉదయం రాలేదు .సాయంత్రం వస్తారన్నారు .ఆయన  ఆ రోజో మర్నాడో  ప్రక్కనే ఉన్న ఘంటసాలవారు పుట్టిన టేకుపల్లి లో విగ్రహా విష్కరణ  చేయాలి .సాయంత్రం దాకా చూసి మేము ఉయ్యూరు వచ్చేశాం .కనుక మూడోసారి బాలును మిస్ అయ్యాం.

   మాట అయింది ఇక మంతి-బాలు 40వేలపాటలు 16భాషలలో పాడటం ,డబ్బింగ్ చెప్పటం  నటించటం సంగీత దర్శకత్వం ,సినిమాలు నిర్మించట మొదలైన వాటిలో ఆరితేరినవాడు .బహుశా ఈ రికార్డ్ అధిగమించే అవకాశం ఇంక ఎవరికీ దక్కక పోవచ్చు .అది ఆయనదీ, మన  అదృష్టం కూడా .అంటే ‘’ఆల్ రౌండర్ ‘’ఆయన భారీ శరీరం లాగానే .శంకరాభరణం సినిమా పాటలు ఆయనకు చిరకీర్తి  నార్జించి పెట్టాయి .ఇవేం పాటలు అని బాలమురళి లాంటి వాళ్ళు అన్నా ,ఎవరూ పట్టించుకోకుండా బ్రహ్మ రథం పట్టారు జనం .సంగీతలో నిష్ణాతుడై పాడటం వేరు అందులో ప్రవేశం లేకుండా కేవలం శ్రుత పాండిత్యం తో పాడి భేష్ అనిపించుకోవటం పూర్వ జన్మ సంస్కారం ,తండ్రిగారి వారసత్వం ,దీవన . ఆపాటలను నేను కేసెట్లలో  వినని రోజు ఉండేదికాదు .అంత తన్మయత కలిగించేవి .తర్వాత బాపుగారి ‘’త్యాగయ్య ‘’మరో గొప్ప మలుపు .ఇప్పుడు కొద్దో గోప్పోసాధన చేసి పాడాడు .త్యాగయ్యగారి జీవితం లో ప్రతిఘట్టానికీ సంబంధిన కృతి పెట్టి పాడించి బాపు త్యాగయ్యగారిని చిరస్మరణీయులను చేశాడు .అవి ఫీలింగ్ లకు సంబంధిన పాటలు .అవి అనుభవిస్తూ పాడాలి అలా పాడి తనకు సాటి లేరని పించాడు బాలు .ఈ కేసెట్లు కూడా నేను రోజూ వినేవాడిని .కారణం అందులో లైఫ్ ఉంది .జీవితగమనం  ఒడి దుడుకులు రామునిపైఅచంచల భక్తీ విశ్వాసాలు ఉన్నాయి .సోమయాజులు పాత్రలో జీవిస్తే బాలు పాటలలో జీవించాడు .కాని సినిమా కొందరికి డాక్యు మెంటరి లా అనిపించి ఆదరించలేదు .నాకు మాత్రం బాపు బాలు యాజుల త్రివేణీ సంగమం అని పిస్తుంది .ఇక్కడ కూడా నామార్కులు బాలు కు సెంట్ పర్సెంట్ .

  ఆతర్వాత సిరివెన్నెల సినిమాలో బాలు పాడిన మొదటి పాట అదోలోకం లోకి తీసుకు వెడుతుంది .సీతారామ శాస్త్రి గీతం ,మామ మహదేవన్ సంగీతం బాలు గాత్రం  ఇక్కడకూడా  త్రివేణిగా ప్రవహించింది .ఎన్నెన్నో  వెరైటీ సినిమాలలో చాలా వెరైటీగా పాడుతూ సోపానాలు అధిరోహించాడు బాలు .సాంఘిక సినిమాలలో మొదట్లో కౌ బాయ్ గా పాడిన పాటలునటుడు  కృష్ణ కు బాగా నప్పాయి .అప్పుడే మొనాటనివచ్చి కొంత ఈస డింపు కూడా కలిగింది .’’మంచి మనుషులు ‘’సినిమాలో శోభన్ బాబు కు పాడిన పాటలలో స్థాయి పెరిగింది .ఘంటసాలగారికి ఒక ఆల్టర్నేట్ గాత్రం వచ్చింది అని నాకు అనిపించింది .దాన్ని చక్కగా కాపాడుకొని దున్నేశాడు. రామారావు నాగేశ్వరరావు వంటిదిగ్గజాలకు కూడా గొంతు సవరించుకొని దీటుగా భేఫర్వాగా పాడి సెభాష్ బాలు అనిపించాడు .బహుశా కృష్ణకు రావి సీతారాం గొంతు కూడా సింహాసనం మొదలైన సినిమాల్లో గొప్పగా నే ఉండేది .కనుక తనగొంతు తానే సవరించుకొని  మంచి మనుషులు సినిమాతో పునర్జీవి అయ్యాడు బాలు. అక్కడి నుంచి ఆయనను పట్టుకోవటం ఎవరి తరం కాలేదు .వామనుడు విరాట్ రూపం పొందినట్లు ఎదిగి పోయాడు .కోదండరామి రెడ్డి ,రాఘ వేంద్రరావు ,ఇళయరాజా,చిత్ర ,చక్రవర్తి  కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు హిట్లే హిట్లే చప్పట్లే చప్పట్లు .

  అన్నమయ్య లో చివరి పాట విని స్పందించని హృదయం లేదు. అక్కడ సుమన్ కు శ్రీవారి మాటలు  పాటలు ,సంగీతం మళ్ళీస్వర త్రివేణి అయింది మరోలోకం లోకి చేర్చింది కళ్ళు చెమరించని వారు ఉండనే ఉండరు  .ఈ అదృష్టం ఎందరికి దక్కింది ?బాలు అదృష్టవంతుడు .రామదాసులో అంతారామమయం పాటలో రామదాసుగారు చూసిన రామమయ లోకాన్ని ప్రత్యక్షంగా చూస్తూ వీనుల విందుగా వింటూ ఆనందపు హరి విల్లు అనుభవించాం .ఇంతటి అనుభూతి అందించాడు బాలు ,మామ ,రాఘవేంద్రుడు .విశ్వనాథ్ సినిమాలలో ఒకరకమైన పునర్జీవనం కలిగితే ,కమ్మర్షియల్ హిట్ సినిమాలలో మరో విశ్వరూపం ప్రదర్శించి మరో రకమైన ఆనందం అందించాడు .అంతటా స్వయం కృషి ,స్వయం శిక్షణ కనిపిస్తుంది .

  ఆదిత్య ,శుభసంకల్పం లాంటి సినిమాలు తీసినా చేతి చమురు భాగోతమే అయి౦దంటారు .డబ్బింగ్ లో కింగ్ మాత్రమె కాదు,  ఎంపరర్ అయ్యాడు .జంధ్యాల మల్లె పందిరి సినిమా నుంచి పక్కింటి అమ్మాయి ,మిథునం దాకా వెరైటీ సినిమాలలో నటించాడు .కానీ పాత్రలు కాక అన్నిట్లో బాలు మాత్రమే కనిపిస్తాడు .అందుకని అతని నటన నాకు నచ్చదు.మిథునం లో ‘’అరవ పయ్యా’’లాగా ఉన్నాడని సినిమా చూసిన మొదట్లోనే రాశాను .భరణి అయితే బాగా ఉండేది. ఎల్బీ శ్రీరాం ఐతే పెర్ఫెక్ట్ అని నా నమ్మకం .సరే గతం గతః .అరవ దేశం లో ఉంటున్నందున వాళ్లకు సహజమైన అతి నటనలోపొంగి ప్రవహించి వెగటు పుట్టిస్తుంది .అంటే ఓవర్ యాక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది .

  ఎవరూ చేయని చేయలేని పని బాలు చేశాడు ‘’పాడుతా తీయగా ‘’తో .తెలుగు పాటకు విశ్వ కీర్తి సాధించిపెట్టాడు .మొదట్లో జెమిని వారు చేబట్టినా, తర్వాత రామోజీ సహకారం తో సెంచరీలు దాటించాడు .యువ గాయకులకు ఊపిరులు అందించాడు .పాటకు ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేశాడు శాశ్వతం చేశాడు .పాటతోపాటు పద్యానికీ స్వరాభి షేకం చేశాడు జరిపించుకొన్నాడు .బహుశా ఏ భాషలోనూ ఇంతటి ఘన చరిత్ర ఎవరూ సృస్టించ లేదను  కొంటాను .అది చాలు. ఆయన కీర్తి ఎవరేస్ట్ శిఖరారోహణ చేసింది .

  తనకు నచ్చిన గాయకుడు ‘’రఫీ ‘’అనటం తెలుగు వారి హృదయాలకు కారం రాసి నట్లయింది .ఘంటసాల సంగీత దర్శకుడు రఫీ కి అది లేదు .మాస్టారిని కాదని రఫీ అంటే ఒకసారికాదు చాలా సార్లు అంటే భరించలేని వేదన కలిగింది .రఫీ యే స్వయంగా తనక౦టే ఘంటసాల గారే చాలా బాగా పాడారని పలు సందర్భాలలో చెప్పాడు .ఇది మర్చిపోతే ఎలా .రఫీ పాడిన ‘’చల్ఉజ్ జారే పంచీ ‘’కంటే ఘంటసాల పాడిన ‘’పయనించే ఓ చిలుకా ‘’పాట వెయ్యి రెట్లు అనుభూతిని  కురిపించిందని  రఫీ చెప్పాడు .

  ఘంటసాల బాలు ఇంటికి స్వయంగా వెళ్లి తనసినిమాలో ఒక పాటపాడమని అడిగినట్లు మొన్నజ్యోతిలో బాలు చెప్పినట్లు చదివా .మరి ఇలా వర్ధమానగాయకులుఎ౦దరికి బాలు అవకాశం ఇచ్చాడో నాకు తెలీదు .ఏకవీర లో మాస్టారితో కలిసి పాడిన పాట ఎవరైనా మెచ్చారా ?మణి శర్మ హేమ చంద్ర ,కారుణ్య వంటి వారికి అద్భుత మైన అవకాశాలు కల్పించాడు .పాడుతా తీయగా లో గాయకులను అందర్నీ సమదృష్టి తో చూసినట్లు గా కొన్ని ఎపిసోడ్ లు అనిపించవు .మనస్పూర్తిగా గాయక ,గాయని ప్రతిభను మెచ్చటం కూడా తక్కువే అని పిస్తుంది నాకు .అతని మాట హృదయం లోంచి రాదేమో అనే అభిప్రాయం కల్గిస్తుంది .అక్కడ కూడా నటన చోటు చేసుకొంటుంది .మనో చాలా భావ యుక్తంగా పాడుతాడు .కానీ అతడికి సరైన న్యాయం జరగలేదు ,జరగట్లేదు.ఎంత లేదన్నా డామినేషన్ ప్రభావం ఇండస్ట్రీని శాసిస్తూనే ఉంది ఎప్పుడూ .

  బాలు తన శరీరం లావు అయిందని బరువు తగ్గించుకొన్నట్లు  తెలుస్తోంది .అలా చేయించుకొన్న ఆర్తీ అగర్వాల్ ,దాసరి లు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని  చేయించుకొన్న అతి తక్కువ కాలం లోనే చనిపోయినట్లు మనకు తెలుసు .ఈ అనుభవం చూసి, తెలిసికూడా బాలు ఎందుకు ఆ సాహసం చేశాడో అంతు చిక్క లేదు నాకు . ఎవరూ అతనికి నచ్చ చెప్పలేక పోయారా ?చెప్పినా విని పించుకోలేదా .తోసుకు వస్తే ఎవరూ ఏమీ చేయలేరను కోండి .పైగా కరోనా సోకటం పరిస్థితి తీవ్రతరం చేసింది .హాస్పిటల్ లో చేరిన రోజు ఫోటో పేపర్ లో చూశాక నాకు బాలులో ‘’జీవ కళ ‘’తప్పినట్లు కనిపించింది .మా ఇంట్లో ఆమాట అనుకొన్నాం కూడా అందరం . . ఏమైనా సంగీతం లో లెజెండ్ అనిపించుకొన్న గాన గ౦ధర్వ బాలు  ఇక లేరు అన్నమాట  జీర్ణించు కోలేని, కలత కలిగించే విషాద విషయం .ఆయన ఆత్మకు శాంతి కలగాలని పరమేశ్వరుని ప్రార్ధిస్తూ   ఆ కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-20-ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

   ధర్మవరం

   ధర్మవరం

ఒకప్పుడు పసపు లేటి నాయుడు అనే రాజు ,మైసూరు నుండి ఉత్తరంగా పరివారం తో వస్తూ  పెన్నా మాగాణి దగ్గర ఒకగుట్ట మీద బస చేశాడు .కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది .దానిదగ్గరే చిత్రావతి నదిలో ఒక ఉదయం స్నానం చేస్తుంటే ,ప్రవాహం బాగా ఎక్కువై ,వెంటనే గట్టు మీదకు వచ్చి నెమ్మదిగా నడుస్తుంటే ప్రవాహం పెరుగుతూనే ఉంది .అతనికి ఈ నీటికి అడ్డుకట్ట వేసి నిలవ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన స్పురించింది .అప్పుడే ఒక ఆజానుబాహువైన సన్యాసిఅటు వస్తుంటే ఆయనకీ చెప్పగా ఆలోచన చాలామంచిదని వెంటనే పని ప్రారంభించమని ,మళ్ళీ వస్తానని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు .

  నది వరద తగ్గగా ,గ్రామ కరణాన్ని పిలిపించి ,తన ఉద్దేశ్యం చెప్పి కావలసిన డబ్బు తాను  సమకూరుస్తానని చెప్పి పని మొదలుపెట్టమని ఆజ్ఞ జారీచేశాడు .మర్నాడే తొండ మాలలు ,హరికారులు (అరకాల వాళ్ళు) నేమర్సు జాతులలో త్రావాకం పనిలో నైపుణ్యం ఉన్న వారిని నియమించి పని మొదలు పెట్టించాడుకరణం .పని క్రమంగా పెరిగి పోతుండటం తో ,రాజు దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చైపోయింది .అప్పటికి సుమారు మూదు వంతుల పని  మాత్రమె జరిగింది.నాయడు విచారం లో మునిగిపోయాడు. అకస్మాత్తుగా ఆయన్ను ఆశీర్వదించిన  సన్యాసి ప్రత్యక్షమై ,తన ఉత్తమ క్రియా శక్తితో పూర్తి చేశాడు .ఆయనే’’ శ్రీ క్రియా శక్తి ఒడయరు’’.కనుక ఈ చెరువు నిర్మాణానికి ముఖ్య ప్రోద్బలం ఒడయరు గారే .

  నీటి వసతి ఏర్పాటైంది కనుక గ్రామ నిర్మాణం జరగాలని భావించారు అంతకు ముందు ఇక్కడ ‘’చిలుముత్తూరు ‘’అనే పల్లె ఉండేది .దీనికి 1133-34లో తుమ్మల మల్లరుసు కరణం గా ఉండేవాడు .ఇతని తాత మాదయ .తండ్రి నాగరుసు .క్రియా శక్తి ఒడయారు ఒకరోజు వచ్చి అక్కడ గ్రామం నిర్మించాలను కొంటున్నానని మల్లరుసు తో చెప్పాడు .సంతోషించి 1153-54 శ్రీ ముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి సోమవారం ముహూర్త౦ నిర్ణయించారు .పని ప్రారంభం కాగా నే జనం తండోపతండాలుగా వచ్చి సాయం చేశారు .క్రియా శక్తి ఒడయరు కీర్తి దశదిశలా వ్యాపించింది .కూలీలు సాయంత్రం దాక పని చేసి ,ఒక్కొక్కడు తన ఎదుట చిన్న మట్టి కుప్ప చేయటం ,స్వామి వచ్చి వెండి బెత్తం తో వాటిని తాకుతూ ‘’మాడిదవనిగే మాడి దస్టుమహరాయా ‘’అంటూ వెళ్ళిపోయేవాడు. కూలీలు  తర్వాత వచ్చికుప్పలో వెదికితే ఆ రోజు కూలి ఖచ్చితంగా అందులో దొరికేదట .గ్రామ నిర్మాణం చేసి దానికి తనతల్లిపేరు  మీదుగా ‘’ధర్మవరం ‘’అని పేరు పెట్టాడు .ఇక్కడ పని అంతాపూర్తయ్యాక ఒడయారు స్వామి ఆనే గొంది కి వెళ్లి అక్కడి నుంచి చెన్న కేశవ స్వామి విగ్రహం తెచ్చి ధర్మవరం లో ప్రతిష్టించి ,ఆలయం కట్టించి పంచ విగ్రహ ప్రతిష్టలు కూడా చేశాడు .700ఏళ్ళక్రితం చిత్రావతీ నదీ తీరం లో ఒడయా-రు స్వామి నిర్మించిన ధర్మవర గ్రామం క్రమంగా వృద్ధి చెందింది .

  గ్రామ నిర్మాణం పూలన్నీ విజయవంతంగా అయ్యాక కరణం మల్లరుసు క్రియా శక్తిఒడయరు స్వామిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి ,ఆతిధ్యమిచ్చి సన్మానించి గౌరవించాడు .తాను  కడుపేదననీ కుటుంబ పోషణకు కరణం వృత్తిచాలటం లేదనీ స్వామికి విన్నవించగా ,ఆయన తనతో వస్తే విజయనగరరాజు ప్రౌఢ దేవరాయలకు మనవి చేయవచ్చునని సలహా ఇవ్వగా ,వెళ్లి రాజును కలిసి,స్వామి విషయం  తన విషయం చెప్పుకొన్నాడు మల్లరుసు .చాలా సంతోషించి స్వామి ఆజ్ఞగా భావించి ,తుమ్మల సీమలోని ధర్మవరానికి చెందిన 32గ్రామాలు ,పండపేటి స్థలం లో కనగానిపల్లెలకు చెందినా 20గ్రామాలు ,పినాకినీ గడ్డకు పప్పూరికి చెందినా 37గ్రామాలు యాడికి వణితానికి 34గ్రామాలు మొత్తం 123గ్రామాలను శ్రీముఖ ఆశ్వయుజ పౌర్ణమి నాడు తామ్రాశాసనంగా రాయించి అందజేశాడు .ఈ విజయనగరం హంపీ విజయనగరం కాదనీ 1156-57లో తుంగభద్రా తీరం లో విజయధ్వజరాజు నిర్మించి పాలించిన చిన్న విజయనగర పట్టణం అనీ విజయధ్వజుడే ప్రౌఢ దేవరాయలు కావచ్చునని అంటారు.

  మల్లరుసు మరొకసారి విజయనగరం వెళ్లి ప్రౌఢరాయలకు కార్యనిర్వాహకుడైన సోమదేవ రాయని ఆశ్రయం పొందాడు .

  విజయనగర రాజుల తర్వాత హండే దొరలూ ,తర్వాత రాయదుర్గం దొరలూ తర్వాత అనేకమంది పాలించాక శ్రీరంగాపట్టణ పాలకుడు హైదరాలీకి,తర్వాతకొడుకు టిప్పు సుల్తాన్ కు  ధర్మవరం చేరింది ,తర్వాత ఇంగ్లీష్ వారు పాలించారు. కాలక్రంగా బాగా అభివృద్ధి చెంది విద్యా వైద్య సదుపాయాలూ రోడ్లు దేఆలయాలు మసీదులు మొదలైన ప్రార్ధనామందిరాలు అన్నీ విస్తరించాయ.కళలకుకాణాచి అయింది .క్రియా శక్తి ఒడయరు సమాజం ఏర్పడి సా౦ఘికాది సేవలు నిర్వహిస్తోంది .అనేక క్షామాలను ,ఉపద్రవాలను ఆటు పోట్లను తట్టుకొని ఎదుర్కొని నిలిచింది .

  ధర్మవరానికి చెందిన ప్రముఖులలో సంస్కృత నిధి కోడేకొండ్ల పెద్దయాచార్యులు ,ఆయుర్వేద సంస్కృత విద్వాంసులు వైద్యం కృష్ణమాచార్యులు ,ఆంధ్రనాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యులు ,సంస్కృతపండితుడు దుద్దాల నారాయణ శాస్త్రి,బంధకావ్యాలను కంఠస్థం  చేసిన ఉచితంగా బోధించిన అంధులు పంచకావ్యం రామాచార్యులు ,హఠయోగిగోపాలం చిన్నప్ప ,పోలీస్ ఇన్స్పెక్టర్ మద్దిపి హనుమంతనాయుడు  గార్లు ధర్మవరాని కి యెనలేని కీర్తి నార్జి౦చి పెట్టారు .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-20-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged , | Leave a comment

సర్పవర క్షేత్ర

అభినవ వాగనుశాసనుడు ,కవి సార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి ‘’సర్పవర క్షేత్రాన్ని

← Back

Thank you for your response. ✨

‘’గురించి లీలాసు౦దరీ పరిణయం ‘’అనే కావ్యం రాశాడు .కవి నియోగి కౌన్డిన్యస గోత్రం  బయ్యనామాత్యుని ముని మనవడు .తిమ్మయ మనవడు .గంగనామాత్యుని కొడుకు .తల్లి లక్ష్మమ .జగ్గన సింగన నరసన పెద తండ్రులు .వీరమ ,పాపమ మేనత్తలు .రాజన,సింగన ,పెద్దన పెత్తండ్రి కొడుకులు . రాజన్న  జగ్గన సూరన సోదరులు .భార్య బుచ్చమ .నివాసం పిఠాపుర సంస్థానం లోని కందరాడ గ్రామం .ఆవూరి కరణం మనకవి .పుట్టి పెరిగింది చంద్రమపాలెం . దెందులూరి లింగారాధ్య దత్త ఉమా మహేశ్వరాచార్య౦ వాడైనా ,అద్వైతమతమే అవలంబించాడు .ఒకరోజు భావనారాయణ స్వామి కలలో కనిపించి ‘’శివుడికి నాకు భేదం లేదు .శివుడికి చాలకృతులు రాసి సమర్పించి పేరు పొందావు .నాకూ ఒకటి అంకితం చేయి ‘’అని అడిగాడు .దానిప్రకారమే పై కావ్యం రాసి ఆయనకు సమర్పించాడు కూచిమంచి తిమ్మనకవి .

  పీఠికాపుర సంస్థాన ప్రభువు రావు మాధవరావు కాలం లో ఉండేవాడు .కావ్యాలురాసి కవి సార్వభౌముడు మొదలైన బిరుదులు పొందాడు .రెండవ కావ్యం రుక్మిణీ పరిణయం1715లో, చివరిది శివలీలా విలాసం 1756లో రాసినట్లు భావిస్తారు .తిమ్మకవి 18వ శతాబ్ది ప్రారంభం లో పుట్టి ,ఆ శతాబ్ది మధ్యవరకూ జీవించాడు .పైన చెప్పినవే కాక రాజశేఖర విలాసం లేక భళ్ళాల చరిత్ర ,సింహాచల మహాత్మ్యం ,అచ్చ తెనుగు రామాయణం ,సారంగధర చరిత్ర,సాగర సంగ మహాత్మ్యం ,,లక్షణ సార సంగ్రహం ,రసిక జన మనోభిరామం తో పాటు చాలా శతకాలు దండకాలు కూడా రాశాడు .’’ప్రబంధ రాజ వెంకటేశ్వర విజయ విలాసం’’ రాసిన గణపవరం వెంకట కవి తర్వాత ఇన్ని రచనలు చేసినవారు లేరు .ఇతని కవితా ప్రతిభ అమోఘం కనుకనే బంధువైన ఏనుగు లక్షణ కవి ‘’హాటక గర్భ  వదూలీ లాటన చలితా౦ఘ్రినూపురా రావ శ్రీ పాటచ్చరములు ,తేనియ తేటలు మా కూచిమంచి తిమ్మయమాటల్’’అని అందరికీ తెలిపాడు .               కథ

     ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ సంబంధమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించిన ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరివల్లాకాదనే నిర్ధారణకి వచ్చారు. అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా, అనుక్షణం విష్ణు నామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు. ఈ సంగతి కాస్తా విష్ణుమూర్తికి తెలిసింది. ఆ తరువాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్లాడు. సంధ్యావందన సమయం కావడంతో ఓ కొలనులోకి దిగాడు. ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్టు తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. గట్టున పెట్టిన మహాతి (వీణ) కానీ, కమండలం కానీ కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు. నారదుడిగా సర్వ శక్తులను కోల్పోయి గతం మరిచిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుని చూసి మోహించిన పీఠికాపురం (పిఠాపురం) పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ రాజు శత్రు రాజుల చేతిలో హతుడయ్యాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ, అది అందక ఇబ్బంది పడసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి వచ్చి అక్కడికి దగ్గరలోని కొలనులో స్నానం చేసి వస్తేనే గాని ఆ పండు అందదని చెప్పాడు. దానితో నారద స్త్రీ కొలనులోకి వంగిన ఓ చెట్టుకొమ్మ పట్టుకుని నీళ్ళలోకి దిగి ఓ మునకవేయగానే స్త్రీ రూపం పోయి నారద రూపం వచ్చినప్పటికీ, కొమ్మని పట్టుకోవడం వలన తడవని చేతి గాజులు మాత్రం అలాగే ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్య పోతూ ఒడ్డుకువచ్చిన నారదుడికి అదంతా విష్ణుమాయ అని అర్థమైంది. దానితో శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి, వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రదేశంలో కొలువుదీర వలసిందిగా నారదుడు కోరడం వలన భావనారాయణ స్వామిగా ఆయన అక్కడ వెలిశాడు. ఆ తరువాత రాజ్య లక్ష్మీ అమ్మవారిని స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించారు.

పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను . ఆ తరువాత స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలను నేటికీ ఇక్కడ పక్కపక్కనే దర్శనమిస్తాయి. విశాలమైన ప్రాంగణం. శిల్ప కళా శోభితమైన గాలి గోపురం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ క్షేత్ర మహిమ గురించి శ్రీ నాథుడు తన కావ్యాల్లో ప్రస్తావించాడు. ‘వైశాఖ శుద్ధ ఏకాదశి’ రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరుపబడుతుంది. శేష, గజ, అశ్వ వాహనాలపై ఊరేగే లక్ష్మీ నారాయణులను చూడటానికి భక్తులు ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొంటారు.

 సర్పవరం కాకినాడకు 5కిలో మీటర్ల దూరం లోనే ఉంటుంది .

    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-20-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహా యోగులు -22(చివరి భాగం )

మనకు తెలియని మహా యోగులు -22(చివరి భాగం )

66-నెమళ్ళ దిన్నె హుస్సేన్ గురు -1850-1929

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ తాలూకా  చాగలమర్రి వ్యవసాయ ముస్లిం కుటుంబం లో వనల చిన్న హుంసూర్ ,హుసేన్ బూ దంపతులకు 1850లో  హుసేన్ పుట్టాడు .అయిదవ ఏటనే ఏకాంతంగా ధ్యానం చేసేవాడు .వయసుతో పాటు ధ్యానం గ్రంథ పఠనం సాధు సంతతిసేవ పెరిగాయి .పెళ్లిఅయినా మార్పు రాలేదు .అక్కడి శివనాగమయ్య బోధనలతో భక్తీ వైరాగ్యాలు పెరిగాయి .విరాగిలా పిచ్చి వాడిగా తిరిగేవాడు .ఒక రోజు కలలో ఒక పురుషుడు కనిపించి మర్నాడే మార్గదర్శనం జరుగుతుందని చెప్పాడు .అనుకొన్నట్లే మర్నాడు చంద్రోదయకాలం లో ఒక దిగంబర అవధూత వచ్చి హుసేన్ కు సౌఖ్య సూత్రం ,నాదానందం ,పంచ ముద్రలు సాకార నిరాకారాలు పరిపూర్ణం అమనస్కత వగైరా బోధించి ,శిరసుపై చేయి ఉంచి ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు .

  వెంటనే అడవిలో ఒక చెట్టెక్కి కొమ్మపై వెల్లకిలా పడుకొని ధ్యానమగ్నడయ్యాడు.తర్వాత సంసార బంధాలన్నీ తెంచుకొని ,అడవులలో తిరుగుతూ ,ఒక దేవాలయం లో బస చేయగా ఎందరో శిష్యులేర్పడ్డారు .అద్భుతాలు చూపేవాడు 27-10-1929శుక్ల ఆశ్వయుజ బహుళదశమీ ఆదివారం 79వ ఏట హుసేన్ గురుడు దేహం చాలించాడు .మర్నాటి ఉదయం సమాధి చేశారు .తర్వాత మందిరం కట్టి ఉరుసు ఉత్సవం చేశారు .ప్రతి చైత్ర పౌర్ణమి ,ఆశ్వయుజ బహుళ ఏకాదశి నాడు ఆరాధనోత్సవాలు జరుపుతారు .

67-ఫిరోజీ మహర్షి -1829-1889

సత్తెనపల్లి మరాఠా వీధిలో నర్సోబీ నర్సూ బాయి దంపతులకు చిదంబర యోగి ఉపదేశించిన ఆదిత్య మంత్రోపాసన ఫలితంగా మొదటికొడుకుగా ఫిరోజీ పుట్టాడు .పెద్దయ్యాక సత్తెనపల్లిలో చిదానంద యోగిని సేవించి తారకమంత్రోప దేశం పొంది యోగరహస్యాలు గ్రహించాడు .తారకమంత్రం దీక్షగా జపిస్తూ , సద్గ్రంథాలు చదువుతూ ,సాధువులను సేవిస్తూ ,పద్యాలు కీర్తనలు రచించాడు  .నూజి వీడుకు చెందినఘటకాల వెంకోజీ కుమార్తె వీరాబాయితో వివాహమై ,ఆత్మ దర్శనాభి లాష పెరిగి ,పంచదశి సీతారామాన్జనేయం రామస్తవరాజం ,వాసుదేవ మననం ,ఉపనిషత్తులజ్ఞాన సారం వంటబట్టి౦చు కొన్నాడు .బాలుడిగా ఉండగానే యోగసిద్ధులు పొందాడు

  వేదాంత ప్రవచనాలను అత్యంత సులభంగా సుబోధకం గా ఫిరోజీ బోధించేవాడు .దీనితో సుదూర ప్రాంతాలనుంచి జనం వచ్చి వినేవారు . అద్వైతి అయినా అన్ని భావాళ వారినీ మతాలవారినీ ఆదరించేవారు .సంచారం చేస్తూ జ్ఞానబోధ చేసేవారు. 9-7-1889 విరోధి ఆషాఢ శుద్ధ ఏకాదశి మంగళవారం 60 ఏళ్ళవయసులో పెద్దకొడుకు లక్ష్మాజీ రావు కు హితోపదేశం చేసి ,గురు పీఠం నెలకొల్పమని చెప్పి ,బ్రహ్మ రంధ్రం ద్వారా ప్రాణత్యాగం చేశారు .తోటలో సమాధి చేశారు .పూర్వం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆరాధన చేసేవారు .అది వర్షాకాలం కావటం తో ఇప్పుడు లఘు పూజ  మాత్రమె ,చేసి మాఘ శుద్ధ ఏకాదశినాడు పెద్ద ఎత్తున ఆరాధనోత్సవాలు జరుపుతున్నారు .

68-రామ యోగి కవి -1825-1895

మార్కాపురంతాలూకా సుంకేసుల లో కాశ్యప గోత్రీకులైన విశ్వబ్రాహ్మణ దంపతులు పున్నోజు శేషయ్య వీరమ్మ లకు రామయ్య పుట్టాడు .అక్కడే చదివి ,పండితులవద్దసాహిత్య ఛందో వ్యాకరణాలు జ్యోతిష గృహవాస్తు  జలవాస్తు ,శల్యవాస్తు విద్యలు నేర్చాడు .స్వర్ణ దారు శిల్ప కళలలో ఆరితేరాడు ,.మంచి కవిత్వం రాసేవాడు .సజ్జన సాంగత్యం లో వేదాంత వాసనా అలవాటైంది .సుబ్రహ్మణ్య బ్రాహ్మణ గురువు వద్ద బ్రహ్మోపదేశం పొంది,మహానందిలో మూడు నెలలు కఠోర సాధన చేశాడు .

  తడకనపల్లి స్థిరపడి ,నిస్సంగం గా సంసారం ఈదుతూ  అష్టాంగ యోగం లో నిష్ణాతుడై ,బ్రహ్మ సాక్షాత్కారం పొంది ,రాజయోగి అయి ,వాక్సుద్ధి దూరదృష్టి,దూర శ్రవణం అలవడిసాహిత్య వేదాంత రాజయోగాలు శిష్యులకు బోధించాడు .మహా నందీశ్వరుడికి అంకితమిస్తూ చాలా గ్రంథాలు రాశాడు .వాటిలో శంకర శతకం ,మహానంది లింగ శతకం ,వేదాంత సూత్రాలు ,షట్ స్థల దర్పణం,పంచరత్నాలు ,నవరత్నమాలిక ,శంభు శతకం ,లింగ మూర్తి పాట,భ్రమరాంబా దండకం ,రామతారక బ్రహ్మ శతకం ,మహావాక్య ప్రకరణం ,శుద్ధ రాజయోగం ఉన్నాయి .ముందుగానే శిష్యులకు చెప్పి 5-12-1895 మన్మథ మార్గశిర బహుళ తదియ గురువారం 70వ ఏట రామయోగి శివైక్యం చెందారు .తడకన పల్లి లో సమాధి చేసి లింగప్రతిష్ట మందిర నిర్మాణం చేశారు .మార్గశిర బహుళ తదియనాడు ఆరాధన రధోత్సవం వైభవం గా చేస్తారు .

69-సయ్యద్ ఆహ్మదలీ ఖాదర్ వలీ -1868-1948

నల్గొండ జిల్లా గొల్లపల్లి జాగీర్దార్ వంశం లో సయ్యద్ అహ్మదలీ ఖాదర్ వలీ 1868 లో జన్మించి తూగోజి అమలాపురం తాలూకా ముమ్మడి వరం మండలం కొత్తలంకలో 1948 సిద్ధి పొంది కొత్తలంక యోగి గా ప్రసిద్ధుడయ్యాడు .1921 జనాభా లెక్కలప్రకారం ఆయన వయసు 125ఏళ్ళు .కనుక పుట్టింది 1796 గా భావిస్తారు .1850 కుండలేశ్వర గ్రామం గౌతమీ నది ఒడ్డున మిథాయి దుకాణం వద్ద మొదటిసారి గోచీతో కనిపించాడు .శరీరం తడవ కుండా గౌతమీ నదిని రెండు సార్లు దాటటం చూసి సిద్ధ పురుషుడుగా భావించారు .

   రాజమండ్రి కోటి లింగాలవద్ద ఉండే కృష్ణావదూతే వలీ గారి అనుగ్రహం కోసం పరితపించి సేవించి తరించారు .తన పరీక్షలో నెగ్గిన వారినే శిష్యులుగా తీసుకొనేవారు .శుభాశుభ  ప్రశ్నలకు తేలికగా సమాధానాలు చెప్పేవారు .బ్రాహ్మణులతో సహా అన్ని వర్ణాలవారూ శిష్యులయ్యారు .ఖండయోగం ప్రదర్శించేవారు .రంగూన్ సైనికాధికారి ఆదేశం తో బ్రిటిష్ వారు దాడిచేస్తారని కాలజ్ఞానం చెప్పారు .కొబ్బరికాయలకు కొమ్ములు మొలిపించి ఆశ్చర్యపరచారు .22-1-1948 మిలాది నబి మహమ్మద్ ప్రవక్త జన్మ దినం రోజున సర్వజిత్ పుష్య శుద్ధ ఏకాదశి గురువారం జీవ సమాధి చెందారు .ఆయన సమాధి వద్ద వరుసగా మూడు రోజులు నిద్ర చేస్తే సాక్షాత్కరించిన సంఘటనలు చాలా ఉన్నాయి .1947 రాష్ట్రనాయకులు కళావెంకటరావు ,బులుసు సాంబమూర్తి గార్లు వలీ గారిని దర్శించే నాటికి ఆయనవయసు 175ఏళ్ళు అని అంచనా .1953లో సమాధిపై దర్గానిర్మించారు .దేశం నాలుగు మూలలను౦ చేకాక కువైట్ ,పాకిస్తాన్ దుబాయ్ వంటి దేశాలను౦చి కూడా భక్తులు వచ్చి దర్గా సందర్శిస్తారు .

70-కవి యోగి ధేనువ కొండ వెంకయ్య -1851-1936

ప్రకాశం జిల్లా అద్దంకి  మండలం గార్లపాడులో ధేనువకొండ పిచ్చయ్య కనకమ్మలకు వెంకయ్య 1851లోపుట్టాడు .ధేనువకొండ వేణుగోపాలస్వామి భక్తుడు .వారసత్వంగా సంగీత సాహిత్యాలు అలవడినాయి . తండ్రి అసంపూర్ణంగా రాసివదలిన ‘’వామన పురాణం ‘’యక్షగానం సమర్ధంగా పూర్తి చేసి తండ్రి మెప్పు పొందాడు .మేనత్తకూతురు కనకమ్మ ను పెళ్ళాడాడు.సంతానం కలగలేదు .నిరతాన్నదానం వలన ఆర్ధిక ఇబ్బండులేర్పడ్డాయి .సిరి సంపదలు సాధించాలని కాశీవెళ్లి మంత్రసిద్ధులను సాధించి పదేళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు .

 మంత్రోపాసన ధ్యానధారణ తోపాటు హరికథలు యక్షగానాలు రాశాడు .మొదటి రచన ‘’విరాట పర్వం ‘’జంగం కథ ను తన ఇష్టదైవం ధేనువకొండ వేణుగోపాలస్వామికి అంకితమిచ్చాడు .ఎరి నైనా సద్గురువు ను దీక్షితుడై యోగాధ్యయనం చేసి సేవించి ,సన్యాసం స్వీకరించాలనే సంకల్పం తో కుర్తాళ0 వెళ్లి సిద్దేశ్వర  పీఠ౦ స్థాపించిన పీఠాధిపతి మౌనస్వామిని దర్శించి ,శివ చిదానంద భారతీ స్వామిశిష్యుడై సన్యాస దీక్షను ‘’శ్రీరామతారక బ్రహ్మానంద అవధూతేంద్ర సరస్వతి ‘’దీక్షానామం పొందారు .తర్వాత తీర్ధయాత్రలు చేస్తూ అనంతపురం తాడిపత్రి చేరి ,కరణం గారి తోటలో విడిది చేసి,లీలలు అద్భుతాలు ప్రదర్శిస్తూ ,ఆదివ్యాధులను నయం చేస్తూ ,జ్ఞానబోధ చేస్తూ జనాలను  సన్మార్గం లో పెట్టారు .12-3-1936యువనామ సంవత్సర ఫాల్గుణ బహుళ చవితి గురువారం 85వ ఏట కపాల చేదనం చేసుకొని కవియోగి,అవదూతేంద్ర సరస్వతి విశ్వ చైతన్యం లో కలిసిపోయారు .ఘనంగా ఆరాధనోత్సవాలు చేస్తారు .

మనకు తెలియని మహాయోగులు సమాప్తం

ఆధారం –మొదటి ఎపిసోడ్ లోనే తెలియజేసినట్లు ‘’మనకు తెలియని మహాయోగులు ‘’ధారావాహికకు ఆధారం –శ్రీకొత్తపల్లి హుమంతరావు గారి రచన ‘’మహా యోగులు’’.

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహా యోగులు -21 61-పూదోట లింగావదూత -17వ శతాబ్దం

మనకు తెలియని మహా యోగులు -21

61-పూదోట లింగావదూత -17వ శతాబ్దం

కర్నూలు జిల్లా పాలేరు నదీ తీరాన అవుకు గ్రామం లో సోమమ్మ సోమిరెడ్డి దంపతులకు లింగమూర్తి పుట్టాడు .ఐదవ ఏటనే చెట్టు కింద శివనామం జపిస్తూ గడిపేవాడు .తలిదండ్రులు చనిపోగా ఏగంటి శివరామ యోగి మంత్రోపదేశం చేసి,శివ లింగగుహకు తీసుకు వెళ్లి,సమస్త విద్యలు నేర్పాడు .దృశ్య భేదన యోగం ,చైతన్య జడ సంధాన చిన్మయయోగం వంటి అనేక యోగాలు నేర్పి తీర్చి దిద్దాడు .

   శివరామ గురుడు ‘’పూదోట గురు పీఠం’’స్థాపించి ,లింగమూర్తిని మొదటి పీఠాధిపతి ని చేసి ,’’పూదోట లింగావదూత ‘’  నామకరణం చేసి ,విశ్వమతాన్ని స్థాపించి వేద వేదాంగాలు అందరికీ అందుబాటులోకి తీసుకు రమ్మని ఆదేశించాడు .రవ్వలకొండ గుహలో గోచీ మాత్రమే ధరించి మహిమలు చూపుతూ ఆశువుగా వేదా౦తతత్వాలు రాసి పాడుతూ పండిత పామరులను ఆకర్షించాడు .ఈ గీతాలను ఆశ్రమ వారసుడు 13దళాలుగా ,715పాటలను తాటాకులపై రాస్తే ,10వ పీఠాధిపతి’’పూదోట తత్వ గీతామృతం ‘’పేరిట శ్రీ ఆనందన స్వామి 1962లో ప్రచురించారు .తాను  తనువు చాలించే విషయం ము౦దేచెప్పిచ జ్యేష్ట పూర్ణిమనాడు దాసావదూతను పీఠాదిపతిని ,చేసి ,జ్యేష్ట బహుళ ఏకాదశి నాడు సంగమేశ్వర తీరాన చిన్న వనం చేరి భక్తుల జయజయ ధ్వానాల మధ్య లింగమూర్తి  అవధూత స్వామి కృష్ణా నదిలో మోకాలి లోతు నీటిలో ,చివరగా ఒక తత్వాన్ని ఆశువుగా పాడి ,కృష్ణాజినంపై పద్మాసనం లో కూర్చుని ,ప్రవాహం మధ్యలోకి వెళ్ళగా ,ఆయన దేహం చుట్టూ మంటలు లేచి అవి ప్రకాశంగా మారి సూర్యమండలం వైపు సాగి పోయాయి .ఏటా జ్యేష్ట బహుళ ద్వాదశినాడు ఆరాధనోత్సవాలు పరమవైభవంగా చేస్తారు .శివ కేశవ భేదం లేదని చాటిన శివా౦శ  సంభూతుడుస్వామి .‘

62-త్రికాలజ్ఞాని ధరణి సీతారామ యోగీంద్ర స్వామి -1714-1796

కాశీ నుంచి ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడిన తర్కశాస్త్ర మాధవభట్టు వంశం లోని వశిష్ట గోత్రీకుడు ధరణిసుబ్బయ్య ,తిమ్మాంబ దంపతులకు కడపజిల్లా పొద్దుటూరు తాలూకా కోర్రపారు లో 4-1-1714 జయ పుష్యబహుళచవితి సోమవారం సీతారామ స్వామి మూడవ సంతానం గా పుట్టాడు .నాలుగేళ్ళకే తండ్రి చనిపోగా ,ఆవులను కాస్తూ వాగు గడ్డ పై ఉన్న గుడి దగ్గర ఆడుకొంటు౦టే ,ఒక యోగి వచ్చి అతనిలోని వర్చస్సు గుర్తించి నాలుకపై బీజాక్షరాలు రాసి దత్తాత్రేయ మంత్రోప దేశం చేశాడు  .అప్పటినుంచీ ఆమంత్రాన్ని జపిస్తూ ,మహిమలు చూపుతూ తల్లి అనుమతితో బ్రహ్మ చర్యం పాటించి సన్యాసం తీసుకొన్నాడు .పుణ్యక్షేత్ర దర్శనం చేసి శ్రీశైలం ,అహోబిలం లలో తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొంది ,అష్ట సిద్ధులు వశం చేసుకొని దేశ సంచారం చేస్తూ ,ధర్మ ప్రబోధం చేస్తూ అరిష్టాలు వ్యాధులు తొలగిస్తూ ,కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ దగ్గర లింగాలదిన్నె చేరి ,ఆశ్రమమ శివాలయం తటాకం ఏర్పరచుకొని తపస్సు చేస్తూ లింగాలదిన్నె సీతారామ యోగీ౦ద్రస్వామిగా ప్రసిద్ధి చెందారు .

  చాలా చోట్ల నందీశ్వర ఆలయాలు దత్తాత్రేయ మఠాలుతోటలు ఆలయాలు నిర్మిస్తూ జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు .శిష్యులను గ్రంధ రచనకు ప్రోత్సహించి సాహిత్య సేవచేశారు 17-12-1796 నల మార్గశిర బహుళ  తదియ శనివారం 82వ ఏట సమాధిలో ప్రవేశించి ,700 ఏళ్ళు సజీవ చైతన్యంలో ఉంటాయని శిష్యులకు అభయమిచ్చి సమాధి గతులయ్యారు మైసూరు దత్తగురువు శ్రీ గణపతి సచ్చిదానందస్వామి తమకు సీతారామ యతీంద్రుల సాక్షాత్కారం కలిగిందని చెప్పారట .మార్గశిర పౌర్ణమి నుంచి మూడు రోజులు వైభవంగా ఆరాధనోత్సవాలు చేస్తారు .

63-సొరకాయల స్వామి -1700-1902

తిరుపతి దగ్గర నిరుపేద గొల్ల కుటుంబం లో 1700లో రామ స్వామి పుట్టి , కొండ కోనలలో మేకలు గోర్రేలుకాస్తుండగా ఒకయోగి మంత్రోపదేశం చేయగా ఇహలోక బంధాలన్నీ తెంచుకొని ,నాలు గిళ్ల భిక్షం ఎత్తి ఆకలి తీర్చుకొంటూ ఉండేవాడు .బుజాన గుడ్డలమూట, నెత్తిన ముతక గుడ్డ తలపాగా, మోకాళ్ళవరకు చిరుగుల పంచె ,ఒక చేతిలో పేలికలతో అల్లిన తాడు కు కట్టిన రెండుకుక్కలు ,బుజం పై కావడి ,దానికి ఒకవైపు మలమూత్రాలకుండ ,మరో వైపు తినటానికీ తాగటానికీ పనికి వచ్చే సొరకాయ బుర్రలు ఆయన అవతారం .అందుకే సొరకాయల స్వామి అనే ఏరు వచ్చింది .

 రోగగ్రస్తులకు తాను  తినే ఆకులు భోజనం  నీళ్ళు ఇచ్చి  నయం చేసేవాడు .వచ్చే ప్రమాదాలను ముందే హెచ్చరించేవాడు .పశుపక్షాదులనన్నిటినీ ప్రేమిస్తూ పిచ్చివాడుగా కనిపించేవాడు .ఆయన అగ్ని హోత్రం వెలిగిస్తే దత్తాత్రేయ స్వామిగా కనిపించేవాడు .ఎక్కడికైనా ఎంతదూరమైనా కాలినడకే .ప్రకృతి శక్తులైన పంచభూతాలు ఆయన అధీనం లో ఉండేవి .1902ఆగస్ట్ లో మద్రాస్ చేరి ,నారాయణవనం ఆరణి నది ఒడ్డున ,ఒక గులకరాయి విసిరి అది పడిన చోటే తనసమాది అని ము౦దేచేప్పి,తనవయసు యెంత అని ఎవరో అడిగితె 500ఏళ్ళు అని తెలిపి , 2-8-1902 శుభకృత్ శ్రావణ శుద్ధ పంచమి శనివారం మధ్యాహ్నం 12గంటలకు 202 ఏళ్ళ వయసులో శరీరం వదిలారు .ఆయన కోరిన చోటనే సమాధి చేశారు.మొదటి ఆరాధన’’కైంకర్య సమాజం ‘’అధ్యక్షుడు  రత్న సభాపతి పిళ్లే అనే భక్తుడి ఆధ్వర్యంలో జరిగాయి.ఈ సమాజం వసతి గృహాలు కళ్యాణ మండపాలు భోజన శాలలు కట్టిస్తూ ఘన౦గాఆరాధనొత్సవాలు చేస్తున్నారు

64-ఆర్తత్రాణ పారాయణ  మహాకవిజ్ఞాని భక్త శిరోమణి -శ్రీధర వేంకటేశ అయ్యావళ్-1635-1720

సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సహాధ్యాయి ,గురువు ,పండితుడు ,కవి శ్రీధర వేంకటేశ అయ్యావళ్,వైదిక బ్రాహ్మణ కుటుంబం లో ,కౌశిక గోత్రీకుడు శ్రీధర లింగార్యుని కుమారుడుగా 1635లోపుట్టాడు. గొప్ప శివ భక్తుడు. గృహస్థ రాజయోగి .తంజావూరు మహారాజు షహాజీ కావేరీ తీరం లో తిరువశ నల్లూరు గ్రామాన్ని శాహరాజవు అనే పేరుగా మార్చి,1693లో 46గురు వేదపండితులకు దానమిచ్చాడు .అందులో మన శ్రీధర వెంకటేశకూడాఉన్నాడు .

  మధ్యార్జునం అనే పేరున్న తిరువిడ మరుదూరు లోని మహాలింగస్వామి శ్రీధరుని ఇలవేలుపు .ఆ భజన సంప్రదాయానికి ఆద్యుడుకూడా .సంస్కృత గ్రంథాలు చాలారాశాడు .శాలేంద్ర విలాసం అనే ఎనిమిది సర్గల మహాకావ్యాన్ని, భక్తీ వేదా౦త పరంగా ఆఖ్యా షష్ఠి,దయాశతకం , ఆర్తిహర స్తోత్రం,కుళీరాష్టకం ,  అచ్యుత శతకం ,శివ భక్త లక్షణం ,శివభక్తి కల్ప లతికా మాతృ భూతాష్టకం, తారావళీ స్తుతి,స్తుతిపద్దతి ,డోలా నవరత్నమాల ,దోష పరిహరాష్టకం, భగవన్నామ భూషణం మొదలైనవి ముఖ్యమైనవి . షాజీ మహారాజు కోరికపై నల్లాధ్వరి, వేంకటేశ శాస్త్రి అనే ఇద్దరు పండితులతో కలిసి ‘’పదమణి మంజరి ‘’అనే నిఘంటు నిర్మాణం చేశాడు .శ్రీధరునికి ఉన్న శివకేశవ భేదాతీతమైన భక్తీ ,శమదమాదుల షట్క  సంపత్తి,సర్వభూత దయాగుణం చూసి సమకాలీనులు ‘’అయ్యావాళ్’’అని గౌరవంగా సంబోధించేవారు .

  ఆర్తత్రాణ పరాయణుడు ,నిరంతదైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీధరపండితుడు .తిరువిశనల్లూరులో అనావృష్టి సంభవిస్తే ‘’కుళీరాష్టకం ‘’స్తోత్రం రాసి గానం చేసి వానలు కరిపించాడు .మృత్యువుతో పోరాడుతున్న శిశువుని తారావళి స్తోత్రం తో కాపాడాడు .భగవన్నామ సంకీర్తనకు ఉచ్చనీచాలు ఉండరాదని బోధించేవాడు .ఒకసారి కావేరీ నది దాటి  తిరువిడ మరుదూర్  లోని తన ఇష్ట దైవమైన  దేవాలయానికి వెళ్లి గర్భాలయం ప్రవేశించి అదృశ్యమై పరమ శివునిలో ఐక్యంచెందారు శ్రీధరులు .,మానవీయ విలువలను పాటించిన మహా సంస్కర్త శ్రీధరులు 85ఏళ్ళు సార్ధక జీవితం గడిపారు .

65-సనారీ విశ్వనాథ అవధూత -1856-1914

కాశీ విశ్వనాథుని అవతారంగా భావింపబడే సనారీ విశ్వనాథ అవధూత 3-11-1856 నల కార్తీక శుద్ధపంచమి సోమవారం శ్రీకాకుళం జిల్లా నాగావళీ నదీ తీరాన పాలకొండకు చెందిన సింహాద్రి వీరాచారి ,గౌరీ దేవి భక్త దంపతులకు విశ్వనాథాచార్యులుగా జన్మించాడు  .ఏక సంథాగ్రాహి .,అయిదేళ్ళకే వేదం ,శాస్త్రాలు కావ్యాలు ఇతిహాసాలలో నిష్ణాతుడయ్యాడు .రసవాద విద్యలో ఉద్దండుడు .తలిదండ్రులు చనిపోతే పెదతండ్రికొడుకు  నీలయ్యాచార్యుని దగ్గర పెరిగి ,ఏటి ఒడ్డున శివాలయం లో రోజూ ఏదో ఒకటి రాస్తూ ఉండేవాడు .అతని వైరాగ్యభావన గ్రహించి అన్నగారు  పంచబాణ విద్యలు నేర్పాడు .రాగి బంగారం పనుల్లో శిల్పాలు చెక్కటం లో కుస్తాగిరి మాలామా పనుల్లో గొప్ప నేర్పు సాధించాడు .పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే తనకోసం పుట్టిన అమ్మాయి పాలకొండలో ఉందని చెప్పి వెళ్ళగా ,అక్కడ అన్నపూర్ణ అనే కన్య అతడే తన భర్త అని నిశ్చయించింది .1873వైశాఖ శుద్ధ ఏకాదశి శుక్రవారం ఇద్దరికీ వివాహం చేశారు .

  భార్యకు అజపాగాయత్రి బోధించి తాను  రాజయోగిగా గృహస్థాశ్రమ  ధర్మం పాటించాడు .శిష్యులకు ఎన్నో విషయాలు శాస్త్రాలు బోధించాడు .సనాతన ధర్మ ప్రచారం కోసం దేశ సంచారం ప్రారంభి౦చి ,రాజమండ్రి కోటి లింగాల రేవు దగ్గర పర్ణశాల నిర్మించుకొని చాలాకాలం తపస్సు చేశాడు .’’సనారీ విశ్వేశ్వర సంవాదం ‘’అనే గ్రంథంరాశాడు .12ఏళ్ళ తర్వాత ముద్రణకోసం మద్రాస్ బయల్దేరుతూ ,శ్రీశైలం చేరి 23-10-1914ఆనంద కార్తీకశుద్ధ పంచమి శుక్రవారం 58వ ఏట బదరికావన గుహలోఅంతతర్ధాన మయ్యారు .ఇప్పటికీ సజీవంగా ఉంటూ శుక్రవారం దర్శనమిస్తూ భక్తులకోరిక తీరుస్తున్నారు  .పాలకొండ దుర్గామందిరం లో ఇప్పటికీ అలా జరుగుతూనే ఉందని భక్తుల నమ్మకం ,విశ్వాసం .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1

 

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10

8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1

 మౌంట్ శాస్తా నుంచి మేము అక్కడికి చేరగానే ‘’ఇక్కడి పూలు ఎంతబాగా ఉన్నాయో చూడు ‘’అంది నాన్సీ .అన్నిరంగులపూలు కనువిందు చేశాయి .మాన్యుల్ వచ్చి పిల్లలతోకూడా వచ్చినదుకు సంతోషం స్వాగతం అన్నాడు .అమ్మమ్మ కూడా చుట్టూ చూసి పరవశించింది ‘’నాకు కలలో కనిపించిన లోకం ఇప్పుడు చూస్తున్నందుకు ఆనందంగా ఉంది ‘’అన్నది అమ్మమ్మ ఎమిలీ .టన్నెల్ లో నుంచి మా లగేజ్ అంతా ప్రత్యేక ట్రక్ లో వచ్చేసింది .అక్కడ వెహికల్స్ తేలుతూ ఉన్నాయి .ఒకదానిలో మమ్మల్ని ఎక్కమన్నాడు మాన్యుల్ .మేము ఎక్కింది కారు కాదు బోటుకాదు ఫ్లైట్ కూడా కాదు దాన్ని ‘’హోవర్ క్రాఫ్ట్ ‘’అన్నారు ..ఆ హో చూడు గోష్ ‘’అనగానే మేము మా కొత్త ఇంటి దగ్గర ఉన్నాం .అమ్మమ్మ సంతోషం తో చప్పట్లే కొట్టింది .మాన్యుల్ ను పాతస్నేహితుడిలాగా గ్రీట్ చేసింది .ఈలోకాన్ని గురించి నేను అమ్మమ్మ కు  వాళ్ళింట్లో చెప్పిఅనప్పుడు ఆమె ఏమాత్రం ఆశ్చర్యపోలేదు .

   అమ్మమ్మ మాంచి హుషారుగా ఇంటి తలుపు తట్టింది .పైకప్పు మామూలు గోడలు లేకపోవటం ఇక్కడి ఇళ్ళ ప్రత్యేకత అని ముందే చెప్పుకొన్నాం .మధ్యలో లివింగ్ రూమ్ ఉంది .ఇప్పుడు బెడ్ రూమ్ కావాలి .’’డిష్ వాష్ ఓవెన్ లేవే ‘’అంది నాన్సీ .నవ్వు వచ్చిందికాని నవ్వలేదు నేను .’’మహామంచిది వంట చెయ్యక్కర్లేదు ‘’అని అమ్మమ్మ .బాత్ రూమ్ కోసం చూస్తోంది ఆమె .ప్రక్కడోర్ చూపించా .అక్కడ మంచి బాత్ రూమ్ ఉంది .అక్కడి టాయ్ లెట్ ప్రత్యేకమైంది .శరీరమలం అంతా అదృశ్యమై వెంటనే కరిగిపోతుంది .కిచెన్ మెషిన్ కి ఆర్డర్ చెబితే కావాల్సిన వండిన భోజనపదార్ధాలన్నీ వచ్చేస్తాయి .దీనికి ‘’పవర్ ఆఫ్ ధాట్’’కావాలి .గార్డెన్ లో తిరుగుతుంటే ‘’ఇక్కడ పని చేసే వాళ్ళు ఉంటారా ‘’అని అడిగింది అమ్మమ్మ ‘’నువ్వు ఎక్కడ ఉంటావురా ‘’అన్నది అమ్మమ్మ .’’ఇక్కడికి దగ్గరలో నాకు ప్రత్యేక ఇల్లు ఉంది .ఇక్కడ అందరూ పని చేస్తారు అమ్మమ్మా ‘’అన్నాను .నువ్వు ఏంచేస్తావిక్కడ ‘’అమ్మమ్మ ‘’నేను హీలర్ గా ఉన్నాను .ప్రజలకు సాయ పడతాను .ఇక్కడ హాస్పిటల్ ఉంది .ఐతే మనకున్నలాంటిదికాదు.పరస్పరసాయం ఎలా చేసుకోవాలో నేర్పిస్తాం ‘’అన్నాను .’’అమ్మమ్మ కాలు విరిగితే ‘’అంది నాన్సీ .’’నిమిషాల్లో నేను నయం చేస్తాను .ప్రతిదాన్నీ మా పద్ధతిలో మేము నయం చేస్తాం ‘’అన్నాను ‘’అక్కడికీ ఇక్కడికీ అంత తేడా ఎలా వచ్చిందో .అక్కడి మట్టీ ఇక్కడి మట్టీ ఒకటేగా ‘’‘’అంది నాన్సీ . ‘’ఒకటేకాని కాలం లో తేడా ఉంది .ఇక్కడి వారు చాలా ప్రాచీనులు అఫ్ కోర్స్ మనలో కొందరు కూడా. ఇక్కడ ప్రాచీన విజ్ఞానం స్థాపించబడింది .’’అన్నాను అమ్మమ్మ బయటికి వెళ్లి కంగారూ జంతువూ ను చూసి ఆశ్చర్యపడి ముచ్చట పడింది . ‘’ఇక్కడ అడవి జంతువులన్నీ ఫ్రీగా తిరుగుతాయి. అపాయం చేయవు .మనుషులు జ౦తువులు స్నేహంగా ఉంటారిక్కడ.క్రూర జంతువులను తలమీద తట్టరాదు.మెడమీద తట్టాలి ఆప్యాయంగా .అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి మనమూ అలానే ఉండాలి ‘’అన్నాను .మా కుక్క టిచ్ జాగ్రత్తగా కాపలా కాస్తోంది .అందరం లోపలి వెళ్లాం అమ్మమ్మ కూర్చుని ఉంది .అక్కడ మూల సీటు దొరుకుతుందా అని అడిగింది .’’లేదు నీకు ప్రత్యేకంగా ప్రక్కిల్లు ఏర్పాటు చేశారు దానిలో ఉంటుంది ‘’అనగానే పట్టరాని సంతోష పడింది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గురూ -మనగురు ఢిల్లీ కి వెళ్లి స్వయం ప్రతి పత్తి ,పోలవరం నిధులను అడుగుతానని చెప్పి వెళ్ళాడు ఏమైంది బ్రూ 

గురూ -మనగురు ఢిల్లీ కి వెళ్లి స్వయం ప్రతి పత్తి ,పోలవరం నిధులను అడుగుతానని చెప్పి వెళ్ళాడు ఏమైంది బ్రూ

బ్రూ-చెప్పింది అదే కానీ అక్కడ వాళ్ళు పిలిపించారని ఎవరూ ప్రచారం చేయలేదు బ్రూ . ఇంతకీ అక్కడ ఏమైంది బ్రూ
గురు -అక్కడ షా క్లాసు పీకాడని ప్రచారం బాగా జరిగింది బ్రూ రెండ్రోజులూ కూడా
బ్రూ  క్లాసేనా ఇంకా ఏమైనా ఉందా ?
గురు -అంతఃపుర రహస్యాలు బయట పడవు . క్లాస్ తో పాటు కాష్ కూడా పీకి ఉండవచ్చునని గిట్టని వాళ్ళ గోల బ్రూ .
బ్రూ -అవున్లే చాలా నెలలైంది కప్పం కట్టి అని చెవులు కొరుక్కుంటున్నారు
గురు -అదే అన్నీ కలిసొస్తాయనే యాత్ర .ఐతే ఏదీ సాధించకుండా తలకు నవరత్న తైలమర్దన షామ్ పూ తో తలంటి పంపారని మీడియా గగ్గోలు .అయినా ఇవన్నీ మామూలే బ్రూ .అందుకే మంగళవారం రాత్రి అంతా అసహనం తో ఊగిపోయినట్లు పత్రికాకథనం బ్రూ .
బ్రూ -అందుకే శ్రీవారి దర్శనం తో సకల దోష నివారణ కూడా జరిగి ఉంటుందని కమలీయుల ప్రచారం
ఇంతకీ డిక్లరేషన్ విషయం లో మీసాలు గడ్డాలూ దువ్విన సాములోర్లు ,కాషాయం వాళ్ళు ఏమీ చేయలేక పోయారేంటి బ్రూ
గురు -మొండివాడు రాజుకంటే బలవంతుడు అన్నారు కదా బ్రూ .ఎవరిపాపాన వాళ్ళు పోతారనే వైరాగ్యం అందర్నీ ఆవహించింది బ్రూ
  మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -24-9-20 -ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—20 56-నాగండ్ల ప్రతాప కోటయ్య శాస్త్రి -1854-1896

మనకు తెలియని మహాయోగులు—20

56-నాగండ్ల ప్రతాప కోటయ్య శాస్త్రి -1854-1896

బాపట్లతాలూకా నాగండ్లలో ప్రతాప జోగయ్యశాస్త్రి దంపతులకు కొటయ్యశాస్త్రి 1854లో పుట్టాడు .బాల్యం నుంచే సర్వభూతాలయడ దయ సానుభూతి ఉండేది .దాన ధర్మాలు చేసేవాడు .20ఏట మహాలక్ష్మమ్మతో పెళ్లి జరిగింది .ధనసంపాదనకోసం నిజాం రాష్ట్రం వెళ్ళాడు .ఒక వ్యాధి గ్రస్తుడు నారాయణ కు  స్వస్తత కూర్చటం తో పేరు మారు మోగింది .అతడు కోటయ్య తలిదండ్రులకు అపార ధనంపంపి ,కోటయ్య కోరిక మేరకు కాశీ పంపాడు .కాశీలో బాలసరస్వతి స్వామి త్రిపురసుందరి మంత్రోపదేశం చేయగా దీక్షగా జపించి మంత్ర, యోగ సిద్ధులు పొందాడు .గురువు అనుమతితో స్వగ్రామ౦  వచ్చి అన్నదానం నిరంత  భగవధ్యానం చేస్తూ ,జపతపాలాచరి౦చాడు..మళ్ళీ కాశీ వెళ్లి 42ఏట 1896లో కోటయ్యశాస్త్రి బ్రహ్మ రంధ్రం చేదించుకొని దేహత్యాగం చేశాడు .

57-కర్తవ్య కరి బసవ స్వామి -1762-1832

రాయ చూరు జిల్లా నారద క్షేత్రం లో యాదవ గిరి శైవ పీఠాధిపతి చన్న బసవస్వామి ,కౌండిన్య నగరం లో ఒక బాలుడిని చూసి ,అతడి తేజస్సు గుర్తించి యాదగిరి పీఠానికి తీసుకువెళ్ళి హస్త మస్తక సంయోగం చేయటం తో అతడికి జ్ఞానోదయమై సమస్త విద్యలలలో శివా నుభవ శాస్త్రం లో ,సాంఖ్యం లో నిష్ణాతుడయ్యాడు .అతడికి కరిబసవ స్వామి పేరుపెట్టి ,కొంతకాలం తర్వాత మఠం బాధ్యతలు అప్పగించి చన్నబసవస్వామి నారద క్షేత్రానికి వెళ్ళిపోయాడు .

   గురవాజ్ఞ మేరకు దేశ సంచారం చేస్తూ ,తపోబలం తో రోగులకు ఆర్తులకు సౌఖ్యం కలిగిస్తూ జ్ఞానార్ధులకు జ్ఞాన బోధ చేస్తూ కరిబసవస్వామి శిష్య ప్రశిష్యులను పొందారు .ఆతని కర్తవ్య దీక్షకు మెచ్చినగురువు ‘’కర్తవ్య కరి బసవ స్వామి ‘’బిరుదు ప్రదానం చేశారు .ఆంద్ర ,కర్నాటక నిజాం రాష్ట్రాలలో 800మఠాలు స్థాపించి  వాటి పోషణకు 20 వేల ఎకరాల భూమి సేకరించి పటిష్ట పరచారు .

  అనంతపురం జిల్లా ఉరవకొండలో భక్తులకోరికపై ఒక మఠం ఏర్పాటు చేసి ,దానికి’’ గవి మఠం’’పేరు పెట్టి దానికి అనుబంధంగా మైసూరులో ‘’కరంబి మఠం’’స్థాపించారు స్వామి .పల్లకీ లో ఉరవ కొండ  వెడుతూ  మేనా తలుపులు మూసుకొని కరి బసవ స్వామి శివైక్యం చెందారు ఫాల్గుణ శుద్ధ పంచమి నుంచి 8రోజులు ఘనంగా ఆరాధనోత్సవాలు చేస్తారు .చుట్టుప్రక్కల రాష్ట్రాలను౦చి కూడా భక్తులు అశేషంగా వస్తారు .స్వామి 1762లో పుట్టి 1832లో 70వ ఏట శివైక్యం చెందినట్లు భావిస్తారు .,

58-మహాయోగిని మాణిక్య నగరం వెంకమ్మ -1808-1862

చిన్నతనం లోనే పెళ్లిఅయి  భర్త చనిపోగా వెంకమ్మ మనసు ఆధ్యాత్మిక భావం వైపుమరలి ధ్యానం ధారణా అలవాటయ్యాయి .ఒకసారి కర్ణాటకలోని మాణిక్ ప్రభు సామ్రాజ్యం లో దత్తావతారం అయిన మాణిక్ ప్రభు దర్శనం కోసం ఆమె తలిదండ్రులతో బండీలో వెడుతుంటే ,దారిలో రాళ్ళవాన కురిసి వాగులూ వంకలు పొంగి ఎద్దులబండి మునిగి పోయే పరిస్థితి వస్తే వెంకమ్మ భక్తిగా ఆర్తిగా  మాణిక్ ప్రభువును మూడు సార్లు గొంతెత్తి పిలువగా ,ఒక 16ఏళ్ళ బాలుడి రూపం లో వచ్చి కాపాడటం తో ఆమె మాణిక్ ప్రభుకు మహా భక్తురాలై,ఆయన చరణాలే నమ్ముకున్నది .ఆమెను అనేక రకాలుగా పరీక్షించి ప్రభు,ఆత్మ సాక్షాత్కారం కలిగించి యమ నియమ ఆసన ప్రాణాయామ నిధి ధ్యాన మానస సమాధులు పొందేట్లు అనుగ్రహించారు .జప ధ్యానలలో ఉన్నతోన్నత్సి స్థితి సాధించి,మాణిక్యనగరంవెంకమ్మగా పేరుపొందింది .భక్తులకు సాధకులకు హితోప దేశం చేసేది .ఆహ౦కారం నశిస్తే సద్గురుకటాక్షం లభిస్తుందనీ ,సాధకుడు సద్గురువుతో ఏకరూపం పొందాలని ఉపదేశించేది. 23-8-1862దుందుభి శ్రావణ బహుళ త్రయోదశి శనివారం 54వ ఏట మహా యోగిని వెంకమ్మ దేహత్యాగం చేశారు.మాణిక్య ప్రభువు  వెంకమ్మను  దేవతలాగా పూజించి  ,స్వయంగా సమాధిలో కూర్చోబెట్టి సమాధి చేశారు .సమాధి ను౦చి కూడా చాలా అద్భుతాలు చేసేది .1982లో భక్తుల కరసేవతో ఆమె మందిర నిర్మాణం జరిగింది .ఆశ్వయుజ పంచమి నుంచి ,నవమి వరకు  పంచ రాత్ర ఉత్సవాలు చేస్తారు .వెంకమ్మ మందిరం లో దేవీ నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు .దత్తాత్రేయ శక్తి వెంకమ్మ రూపం లో ఇక్కడ ఉన్నదని అందరి విశ్వాసం

59-నారాయణ రెడ్డి అవధూత -1834-1915

కడప జిల్లా కమలాపురంతాలూకా గంగిరెడ్డిపల్లె  లో  నర్రెడ్డి సింగిరెడ్డి రామాంబ దంపతులకుశ్రీ నారాయణ అంశతో నారాయణ రెడ్డి 1834లో పుట్టాడు .పూర్వ జన్మలోబెస్తవాడుగా పుట్టి బ్రహ్మం గారిని సేవించినట్లు కథనం .చిన్నతనం నుంచే ఏకాంతం లో ఉండటం ఇష్టం .పసువులను మేపుతూ ఏకాంతం లో ధ్యానం చేసుకోనేవాడు .ఒకసారి కుంభ వృష్టికురిసినా అందరు గోపబాలురూ తడిసిపోయినా యితడు తడవక ఆశ్చర్యం కలిగించాడు .లీలలూ అద్భుతాలు చూపేవాడు .ఉన్న ఊరు నచ్చక 16వ ఏట ఊరు వదిలేసి 60ఏళ్ళ వరకు తిరిగి రాలేదు .

   20వయసులో కర్నూలు వెళ్లి అడవుల్లో తిరుగుతూ  తీవ్రంగా తపస్సు చేశాడు.అవధూత అయి అమనస్క యోగం లో ఆరి తేరాడు .అష్ట సిద్ధులు వశమైనా ఎప్పుడూ ప్రదర్శి౦చ లేదు .రాత్రీ పగలూ తిరుగుతూనే ఉండేవాడు .వస్త్రాలు అడిగి తీసుకొని పేదలకు పంచేవాడు .అడిగినవారికి మంచీ చెడ్డా చెప్పేవాడు .కంది మల్లయ్యపల్లి వెళ్లి బ్రహ్మం గారి సమాధిని సేవించాడు .చివరికి ఓబుళరాజుపల్లె చేరి ,ఓబుళరాజు నారాయణ రెడ్డి అవధూత అనిపించుకొన్నాడు.గ్రామాధికారి వీరారెడ్డికి తాను  దేహం చాలిస్తున్నట్లు చెప్పి 12-3-1915ఆనంద ఫాల్గుణ బహుళద్వాదశి  శుక్రవారం 81వ ఏట శ్వాస బంధించి ప్రాణం వదిలారు .వీరారెడ్డి అంత్యక్రియలు ఘనం గా నిర్వహించి ,గ్రామానికి పడమరవైపు తన స్వంతపోలం లో సమాధి మందిరం నిర్మించాడు .సమాధి నుంచి ఘంటారావం,వీణా,తాళ మృదంగ ధ్వనులు వినిపిస్తాయి .ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు ఆరాధన జరుగుతుంది .

60-రెడ్డి సుబ్రహ్మణ్య మహర్షి -1860-1949

రెడ్డి సుబ్రహ్మణ్య మహర్షి రౌద్రనామ సంవత్సర జ్యేష్ట శుద్ధ చవితి గురువారం పుష్యమీ నక్షత్రం లో 1860లోగోదావరి జిల్లా ఈతకోటలో బ్రహ్మన్న శేషమ్మ దంపతులకు సపుట్టాడు .చిన్నప్పటినుంచి భూతదయ ,పాపభీతి భక్తీ అలవాటయ్యాయి .తులసి కోటవద్ద శ్రీ రామ ధ్యానం చేస్తుంటే శ్రీరాముడు ,రాత్రి ఆకాశంలో చూస్తుంటే సీతారాములు దర్శనమిచ్చేవారు .12వ ఏట ఉపనయనం జరిగి ,పోణంగిలోని రామభక్తుడు సోమయాజుల పాపయ్యశాస్త్రి రామతారక మంత్రం దీక్ష ఇచ్చి ,మానసిక పూజా విధానం నేర్పాడు .ఆయనవద్ద ఆరేళ్ళు సాధన చేశాడు .జప సమయంలో సీతారాములు కనిపిస్తే ఆశువుగా పద్యాలు చెప్పి స్తుతి౦చే వాడు .బలవంతంగా పెళ్లి చేస్తే ,సంసారం వదిలేసి తీర్ధయాత్రలు చేస్తూ వివిధ మతాలకు చెందిన 72మంది యోగులను దర్శించి ,రాజమండ్రి లో శ్రీ విశ్వ నాథ అవధూత సన్నిధికి చేరాడు.

   ఆయనవద్ద హఠ యోగాదులు రాజయోగం సాధన చతుస్టయ౦ అభ్యసించగా గురువు ‘’స్వేచ్చానం ‘’అనే దీక్షానామమిచ్చి గృహస్థ ధర్మం పాటించమని ఆదేశించాడు .ఒకసారి మహారాష్ట్ర బ్రహ్మ చారి బాబ్ కోకిల్ 60ఏట సన్య సించి ,పామర్రులో ఉంటున్న సుబ్రహ్మణ్య యోగి ఇంటికి వచ్చి భిక్ష చేసి అనేక యోగరహస్యాలు బోధించగా అష్ట సిద్ధులు వశమై అనేక అద్భుతాలు చూపేవాడు .అద్వైత రహస్యం మానసబోధ గాయత్రీ నాటకం ,అచల బ్రహ్మానంద ప్రబోధం ,పరవాసుదేవ శతకం ,దండకాలు మొదలైన 17రచనలు చేశారు  .22-3-1949 సర్వధారి ఫాల్గుణ బహుళ అష్టమి మంగళవారం 89వ ఏట మహేంద్రవాడ లో పీఠస్తులై,మూలాధారం బిగించి హంసను షట్చక్రాలు దాటించి భ్రూమధ్యలో చేర్చి నాసాగ్రం పై దృష్టి నిల్పి షట్చక్ర సీతారామ తారక బ్రహ్మం లో ఐక్యమయ్యారు సుబ్రహ్మణ్య యోగి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-20-ఉయ్యూరు    .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—19 46-ఎల్లారెడ్డి పేట హజ్రత్ ఇమామలీ బాబా -1825-1934

మనకు తెలియని మహాయోగులు—19

46-ఎల్లారెడ్డి పేట హజ్రత్ ఇమామలీ బాబా -1825-1934

కరీమ్ నగర్ జిల్లా ఎల్లారెడ్డి పేట కు చెందిన హజ్రత్ ఇమామలీ బాబా గంభీరావు పేట లో 1825 లో జన్మించినట్లు తెలుస్తోంది .110 ఏళ్ళు జీవించి 1934లో మరణించారు .కొంతకాలం బడి పంతులు గా చేశారు .1908లో మూసీ నదికి వరదలు వచ్చి దానిదగ్గరున్న మానేరు నది ఒడ్డునున్న నామాపురం గట్టు చరియపై గుహ లో తపస్సు చేస్తుంటే ,తపోనిష్టలో ఉండి చరియ లో కూరుకు పోయారు .వరద తగ్గాక ,ఇసుక తీయగా బయటపడి ఆశ్చర్యం కలిగించారు .గ్రామ పటేలు పాపా రెడ్డి భక్తుడై  రెండు అంతస్తుల మేడ కట్టించి అందులో బాబాను ఉంచాడు .ఆశ్రితులు ,భక్తులు వస్తే వారు రాగానే వారి వివరాలన్నీ తానె చెప్పి సాయం చేసేవారు .4-7-1934భావ జ్యేష్ట బహుళ పంచమి గురువారం110ఏళ్ళ వయసులో  బాబా తనుఉ  చాలించారు .ఆయన సమాధి నేటికీ యాత్రాస్థలం గా వర్ధిల్లుతోంది .

47-యల్లం పల్లె పుల్లయ్య అవధూత -1920-1983

కడపజిల్లా దిగువ నేలటూరు భట్రాజదంపతులు వెంకటరాజు లక్ష్మమ్మ దంపతులకు 1920లో వెంకట రాజరాజు పుట్టాడు .రాజయ్య  అని పిలిచేవారు .ఊరిలోనే చదువు ప్రారంభించి తండ్రి దగ్గర భారత రామాయణాలు ప్రబంథాలు నేర్చాడు .సుస్వరంగా త్యాగారాజకృతులు పోతనభాగవత పద్యాలు పాడేవాడు .బడిపంతులుగా కూడా పని చేశాడు .1932లో మర్రి పుల్లయ్య యోగి గురి౦చి విని వెళ్లి శిష్యుడై ,ఉపదేశం పొంది ‘’పుల్లయ్య స్వామి  ‘’అయ్యాడు .పెళ్లి వద్దని కొండల్లో గుహల్లోఅడవుల్లో తిరుగుతూ సమాధి పొందేవాడు .అందరూ ఆతిధ్యమిచ్చి ఆదరించేవారు యల్లం పల్లె ,మిట్టమాని పల్లె ప్రజలకు ఆరాద్యదైవమయ్యాడు .మహిమలులీలలు చూపేవాడు .11-7-1983రుధిరోద్గారి ఆషాఢ శుద్ధ పాడ్యమి సోమవారం 63వ ఏట పుల్లయ్యస్వామి దేహం చాలించాడు .ఆయన సమాదినిర్మించి ఏటా ఆరాధనోత్సవాలు చేస్తున్నారు

48-నెల్లూరు నిత్యానంద స్వామి -1864-1936

డెహ్రాడూన్ సీస్మానదీ తీరం లో శాలికోటలో దయా౦బా ,గాలూరాం దంపతులకు 7-8-1864రక్తాక్షి శ్రావణ శుద్ధ పంచమి ఆదివారం పూర్ణ రాముడు పుట్టాడు.రెండేళ్లకే తండ్రి చనిపోతే ఆధ్యాత్మిక ప్రసంగలు వింటూ ,12వ ఏట 1876లో వైరాగ్యం తో ఇల్లువదిలి తీర్ధ క్షేత్ర దర్శనం చేస్తూ వశిష్టాశ్రమం చేరాడు .హిమాలయ గుహలలో ఏడేళ్ళు తుంగ ముస్తెలు మాత్రమె తింటూ కఠోర తపస్సు చేశాడు .ఒకరోజు గంగాతీరం లో కృష్ణానంద సరస్వతి యతీంద్రుల దర్శనం లభించింది .ఆయన ప్రణవ మంత్రోపాసన చేసి ‘’నిత్యానంద స్వామి ‘’దీక్షానామ౦ , సన్యాస౦ ఇచ్చారు .

  గురువు అనుమతితో హిమాలయ గుహలలో తపస్సు చేస్తూ ఆత్మ సాక్షాత్కారం పొంది దేశ సంచారం చేస్తూ ,రోజుకు 30మైళ్ళు నడిచి 1894లో నెల్లూరు చేరి స్థిరపడ్డారు .నవాబు పేటలో పెన్నా  తీరం లోని వేమూరి వారి మామిడితోటలో ఆశ్రమ౦  ఏర్పాటు చేసుకొని ఉన్నారు అందులో ఒక పెద్ద చచక్కపెట్టే ,కలప తో ఉన్న కుటీరం  .శిష్యబృందం ఏర్పడింది అన్ని సిద్ధులూ సాధించినా ప్రదర్శించలేదు .లీలలు  మహిమలు చూపారు .యువనామ సంవత్సర పుష్య బహుళ అమావాస్య శుక్రవారం 24-1-1936 న 72వ ఏట శిష్యుడు హరిహరానంద స్వామి ఈశావాస్యోపనిషత్ పఠించటం పూర్తికాగానే పద్మాసనం వేసుకొని మూడుసార్లు ఓంకారం బిగ్గరగా  ఉచ్చరించి దేహత్యాగం చేశారు .వెంకటగిరిలో కైవల్య నదీ తూర్పు తీరాన సమాధి చేశారు .ఆరాధనోత్సవాలు ఘనంగా జరుపుతారు .

  49-రాజయోగి పగిడ్యాల కృష్ణ బ్రహ్మేంద్రస్వామి -1850-1947

రంగారెడ్డి జిల్లా పరిగి తాలూకా గండ్వీడు మండలం పగిడ్యాల లో భాగమ్మ రామప్ప దంపతులకు 1850లో  కృష్ణయ్య పుట్టాడు .నాలువతరగతి లోనే చదువు ఆపేసి,తండ్రి కుల వృత్తి కమ్మరం లో సాయం చేసేవాడు .12వ ఏట తల్లీ తండ్రీ చనిపోయారు .అన్నగారు చిన్నయ్య అతడిపెళ్లి  నరసమ్మతో జరిపించాడు .

  జన్మ రాహిత్యం పై కోరిక కలిగి యాలాలలో దొడ్డప్రభువును ఆశ్రయించి,మంత్రోపదేశం యోగ సాధన నేర్చి ,సన్యాసం స్వీకరించి కృష్ణ బ్రహ్మేంద్ర స్వామి దీక్షానామం పొందాడు .గురువు ఆజ్ఞతో మునుల గుట్ట , చన్నరాయని గుట్ట ,దోనగుట్ట ,యానగొ౦ది గుట్ట ,కోసగి కాళికాలయాలలో తపస్సు చేశాడు .12ఏళ్ళు దేశ సంచారం చేసి యోగులవద్ద యోగ రహస్యాలు గ్రహిస్తూ అష్ట సిద్ధులు వశం చేసుకొన్నాడు .హిందూ ముస్లిములు ఆయన్ను సేవించేవారు .దౌలతాబాద్ వేంకటేశ్వరాలయం లో ప్రతి ఏడూ ,మాల,మాదిగ కులాలకు చెందిన పేద లకు వివాహాలు ఉచితంగా జరిపించేవారు కృష్ణ బ్రహ్మేంద్రస్వామి .97సంవత్సరాల సార్ధక జీవితం గడిపి 31=8-1947సర్వజిత్ నిజ శ్రావణ పౌర్ణమి ఆదివారం బ్రహ్మ రంధ్రం భేది౦చు కొని దేహత్యాగం చేశారు.మాఘ శుద్ధపంచమినాడు ఆరాధనోత్సవాలు జరుగుతాయి

50-పలుగు రాళ్ళపల్లి గోవిందస్వామి -1650-1750

కడపజిల్లా బద్వేలు –పోరుమామిళ్ళపల్లి దారిలో పలుగు రాళ్ళపల్లి లో 17-18శతాబ్దిలో వైదిక బ్రాహ్మణ కుటుంబం లో గోవిందస్వామి పుట్టాడు .యాదాటి రామచంద్రభట్టు పార్వతమ్మ తలిదండ్రులు .శిశువుగా ఉంటూనే మహత్తులు చూపేవాడు .ఉయ్యాలలో పడుకొని ఉంటె ఘటసర్పం పడగ గొడుగులాగా పట్టింది .ఊరి చెరువు దగ్గర బంకమట్టితో పళ్ళెం చేసి ,పంచరంగుల గులకరాళ్ళు శివ పంచాయతనం గా అమర్చి ,సుద్ద పొడి విభూతిగా ,కావిరాళ్ళ పొడి కు౦కుమగా ,గడ్డి వెన్నులు అక్షతలుగా ,అల్లిపూలు పుష్పాలుగా చెరువు నీరు అభిషేక జలంగా ,పిచ్చుక గూడు కొబ్బరికాయగా ,తుంగ గడ్డలు నైవేద్యంగా అర్పించి తీర్ధ ప్రసాదాలు భక్తులకు పంఛి బాధలు పోగొట్టేవాడు.

  పెద్దవాడై తండ్రి వద్ద స్మార్తం ,గరుడాద్రి యాదయ్య వద్ద మంత్రోపదేశం పొంది ముచుకుందా గుహలో సాధన చేశాడు .లక్ష్మమ్మను పెళ్ళాడి సంసారం చేస్తూ ,తపస్సు చేస్తూ రుతంభరం మొదలైన విద్యలు నేర్చాడు  .కాశీ రామేశ్వర యాత్రకు వెళ్ళే వారికి ఇంట్లోఆతిధ్య మిస్తూ,పది మందికివండినపదార్దాలు వదమందికి సరిపోయేలా చేస్తూ మహిమలు చూపేవాడు .1750లో సుమారు శతమానం జీవించి మాఘశుద్ధ పౌర్ణమి నాడు గోవిందస్వామి జీవసమాధి చెందారు .ముందే కాశీ నుంచి ఒక లింగాన్ని తెచ్చుకొని ఉంచగా, మునిమనవాడు యాదాటి నరసయ్య గోవిందస్వామిమఠం ఆవరణలో ముత్తాత తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్టించి ,ఆలయం నిర్మించాడు .శివలింగం పేరు నర్మదేశ్వరుడు. అమ్మవారు మీనాక్షీ దేవి .మాఘ శుద్ధ త్రయోదశించి అమ్మవారికి అయ్యవారికి వైభవంగా కల్యాణోత్సవం ,మాఘ పూర్ణిమ నుండి  పాడ్యమిమివరకు గోవిందస్వామి ఆరాధనోత్సవం ఘనంగా చేస్తారు .

51-ఆచలయోగి రామడుగు శివరామ దీక్షితులు -1690-1791

నల్గొండ జిల్లా నారాయణ పేట సంస్థానం లో రామడుగు విశ్వనాధ శాస్త్రి నిర్మలాంబ , వైదిక బ్రాహ్మణ దంపతులకు 1690లో శివరామ దీక్షితులు పుట్టాడు .వేదాలు  య జ్ఞ,యాగాలు బోధలు మోక్షాన్ని ఇవ్వవు అని గ్రహించి ,ఆత్మజ్ఞానం కోసం దేశ సంచారం చేస్తూ ,ఒక దొమ్మరి గడసాని లక్ష్య శుద్ధికి అబ్బురపడి ,ఆమె గురువైన శ్రీధరులను దబ్బాకుపల్లిలో వటవృక్షం క్రింద తపస్సులో ఉండగా దర్శించాడు .ఇతనికోసమే అయన దేహత్యాగం చేయకుండా ఉన్నాడు .మూడురకాల తీర్దాలు ప్రసాదాలు ఇచ్చి తారకం అమనస్కత బోధించాడు .మూడు దీక్షలిచ్చాడు .నాలుగు మహావాక్యాలు ,వాటి శబ్దార్ధాలు బోధించి ద్వాదశి పంచదశి షోడశి మంత్రాలు అర్ధాలు బోధించి వాటిని ప్రచారం చేయమని ఆదేశించి పాదుకలు అనుగ్రహించారు .21వ రోజు గురువు దేహం చాలించాక ఉత్తరక్రియలు జరిపి స్వగ్రామం  చేరి అమనస్కత ప్రచారం చేశాడు దీక్షితులు .’’శివరామ దీక్షితీయం ‘’అనే బృహత్ గ్రంథం అచల సిద్ధాంతం వివరిస్తూ రాశారు 101ఎ ఏళ్ళు జీవించి 23-11-1791విరోధి కార్తీక శుద్ధ శనివారం దేహం చాలించారు .

52-యోగానంద నరసింహస్వామి -1798-1899

కర్నూలు జిల్లా మార్కాపురం తాలూకా గుట్టల ముమ్మిడివరం లో అప్పయ్య లక్ష్మమ్మ అనే మధ్యతరగతి దంపతులకు మూడవ సంతానంగా 1799లో లక్ష్మీ నరసింహ మూర్తిపుట్టాడు .తీర్ధయాత్రలు చేస్తూ దత్తాత్రేయ సంప్రదాయానికి చెందిన రామావదూతను దర్శించి ,ఆయన పెట్టిన పరీక్షలకు తట్టుకొని రాజ వశీకరణ ,యజ్ఞసిద్ధి అష్టాక్షరీ పంచాక్షరీ మంత్రాలు నేర్పుతాను అంటే తనకు ముక్తిమార్గం తప్ప ఏదీ వద్దు అని చెప్పాడు .సరే అని అచలం బోధించి రామతారకమంత్రం రామాయణ సారం బోధించి ‘’యోగానందుడు ‘’పేరు పెట్టి ,ఇంటికి వెళ్లి సాధన చేయమని పంపాడు .వెళ్ళకుండా అక్కడే ఉంటూ ,గురువు ఆదేశం మేరకు 27మండలాలు అష్టాంగయోగ సాధన చేశాడు .చండాముని అనే తాపసి మరికొన్ని మంత్రాలు ఉపదేశించాడు .వీటితో అద్భుతాలు ప్రదర్శించేవాడు .కలలో గురువు ఇచ్చిన ఆదేశాను సారం ‘’ముక్తికాంత ‘’గ్రంథంతోపాటు 15 గ్రంధాలు  రాశాడు .సోనీ పురం చేరి తపస్సు చేస్తూ జ్ఞానబోధ చేస్తూ గడిపాడు .

    దివ్యవాణి ఆదేశం తో మన్నెం కొండలలో స్థిరపడి తపస్సు చేస్తూ ,1-5-1899 వికారి చైత్రబహుళ షష్టి సోమవారం ఉదయం 101వ ఏట దేహం చాలించారు.చైత్ర మాసంలో ఆరాధనలు జరుగుతాయి .

53-తాండూరు సూఫీయోగి అబ్దుల్ కరీం షా వలీ -1870-1947

ఆఫ్ఘనిస్తాన్ లో షాజీ గ్రామం లో 19వశతాబ్ది మధ్యలో పుట్టిన అబ్దుల్ కరీం షావలీ ,బాల్యం నుంచే చదువు ఆటపాటలపై విముఖత చూపిస్తూ గ్రామం బయట ధ్యానం తో ,రాత్రిళ్ళు అడవుల్లో తపస్సు చేసేవాడు .12వ ఏట పినతండ్రి సయ్యద్ వలీ మహమ్మద్ దత్తత తీసుకొని ,నిజాం లోని తా౦డూరుకు తీసుకు వెళ్లి 14వ ఏట పెళ్లి చేశాడు .

  కొంతకాలానికి సయ్యద్ సుల్తాన్ ఆలీషా అనే మహాత్ముడు దేశ సంచారం చేస్తూ ఎఖేలి గ్రామం వచ్చాడు .ఈయన వద్ద ఉపదేశం పొందాలని షా వలీ భావించాడు .ఆయన ఆడంబరాలు చూసి అనుమానించి ఆయన సర్వజ్ఞత్వం అర్ధం చేసుకొని భక్తుడు గా మారాడు .ఆయన ఏకాంతం లోకి తీసుకు వెళ్లి శిరసుపై చేతులుంచి.ఆలింగనం చేసుకొని  నిండుగా ఆశీర్వదించాడు  .ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గి పరమాత్మ నిష్ఠ పెరిగింది .ఒకసారి గురువు ఆయన గురువు ఆరాధనోత్సవాలకు హైదరాబాద్ వెడితే శిష్యుడూ అక్కడికి వెళ్లి ,ఆయన ఆదేశం మేరకు గుల్బర్గా షరీఫ్ కు వెళ్లి అక్కడ సుప్రసిద్ధ ముస్లిం యోగి ఖాజాబండ నమాజు దర్గా లో రెండేళ్ళు సేవ చేయాగా ఒకరోజు ఆయన ప్రత్యక్షమై ఆశీర్వదించి గురువు దగ్గరకు వెళ్ళమని చెప్పాడు .అలాగే చేసి ఆయన ఆజ్ఞ తో  లాలె చారు ,పాకూ పఠాన్ వెళ్లి అక్కడ షేక్ ఫరీద్ షక్కర్ గంజ్ అనే మహాత్ముడిసమాధి  దర్శించిఅక్కడ రోగుల ఆర్తులకు సేవ చేయగా   షక్కర్ గంజ్ ప్రత్యక్షమై దీవించి ఇంటికి పంపాడు .మళ్ళీ హైదరాబాద్ లో గురువు ను దర్శించి ,ఎఖేలీ చేరాడు .గురువు సిద్ధిపొందాడు .శిష్యులకోరికపై వలీ షా పీఠాధిపతిఅయ్యాడు .తాండూరు బయట స్థలం కొని విశాలమైన ఇళ్ళు వసతులు కల్పించిగురువు ఆరాధన వైభవంగా జరిపించాడు .నలుగురు భార్యలతో సంసారం చేస్తూ రాజయోగిగా ఉంటూ పదిమందికొడుకులు ఇద్దరు కూతుళ్ళకు జన్మ ఇచ్చాడు .

   1946లో తీవ్రంగా జబ్బుపడి అయిదు నెలలు బాధపడి 26-12-1947సర్వజిత్ మార్గశిర శుద్ధ పాడ్యమి శుక్రవారం 77వ ఏట ఆ రోజునే చనిపోతున్నట్లు ముందే ప్రకటించి దేహం చాలించారు .తాండూరు సమాధి హిందూ ముస్లిం లందరికీ యాత్రాస్తలమే .

54-చాయాపురుష యోగి దీపాల దిన్నె పాలెం పాటిబండ్ల వీరయ్య -1867-1922

గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా దీపాల దిన్నె పాలెం లో వ్యవసాయం చేసే పాటి బండ్ల బాపయ్య బాపమ్మదాంపతులకు 1867ప్రభవ నామ సంవత్సరం లో  మూడవ సంతానంగా వీరయ్య పుట్టాడు. బాల్యం లోనే వేదాంతం జ్ఞాన తృష్ణ అలవాటయ్యాయి .వీధిబడిలో చదివి స్వయం కృషి తో తెలుగు సంస్కృతం లలో పాండిత్యం సాధించాడు .రెండుభాషల్లోనూ గ్రంథాలు రాశాడు .

  సత్తెనపల్లిలో ఫీరోజి మహర్షి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు విని శిష్యుడై ,మంత్రోపదేశం పొంది సాధన చేసి సిద్దుడయ్యాడు  .సాత్విక లక్షణాలు అలవడి ,ఆత్మ శక్తి పెరిగింది .మళ్ళీ గురువును చేరి ఆధ్యాత్మిక రహస్యాలు గ్రహిస్తూ కవితా సాధన చేశాడు .గురువు గొప్పతనాన్ని వర్ణిస్తూ కీర్తనలు రాసి పాడుతూ ఆయన భావాలను వ్యాప్తి చేస్తూ విరాళాలు స్వీకరించి గురువుగారి మఠానికిఅంతరాలయం ముఖమండపం విమాన గోపురాలు కట్టించాడు .నిత్యపూజకోసం భక్తులనుంచి అయిదు ఎకరాలు సంపాదించాడు .ఒకసత్రం బావి ఏర్పాటు చేశాడు .ఆయుర్వేదమూ నేర్చి వైద్య సేవ చేశాడు .చాయాపురుష లక్షణం లో నిష్ణాతుడయ్యాడు 9-11-1922సాయంత్రం దుందుభి కార్తీక బహుళ పంచమి గురువారం 55వ ఏట భగవన్నామం చేస్తూ ,సంపూర్ణ వివేకం తో బ్రహ్మైక్యం చెందారు .ఫిరోజీ మహర్షి సమాధికి ఎదురుగా స్వామి సమాధి నిర్మించారు

55-మిట్టపాలెం నారాయణ స్వామి -1750

నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా కోవలం పాటి మిట్టపాలెం లో కొమ్మినేని వెంకటరామయ్య మహాలక్ష్మమ దంపతులకు కొండయ్య పుట్టాడు .చిన్ననాటి భక్తీ క్రమంగా పెరిగి ,తండ్రి చనిపోయాక తల్లితో తీర్ధయాత్రలు చేస్తూ ,పురాణకాలక్షేపాలు చేస్తూజీవనం సాగించాడు .తల్లి చనిపోగా తమ్ముడి బాధ్యత పెద్దక్కకు వదిలేసి ,నారుకొండలో ఉంటూ పిచ్చివాడు అనుకొన్నవారికి బుద్ధులు బోధిస్తూ తిరుగుతూ  ,మహిమలు అద్భుతాలు చూపిస్తూ ఉండగా ఒక మహనీయుడు వచ్చి నాలుకపై విభూతి చల్లి మంత్రోపదేశం చేయగా ,నారాయణ మంత్రం జపిస్తూ  నారాయణ స్వామిగా ప్రసిద్ధి చెంది బ్రహ్మంగారి మాటలు ఫలిస్తాయని ప్రకటించి తానూ త్వరలో జీవసమాధి చెందుతాననని చెప్పాడు .

   10వ రోజున నాగ ప్రతిష్ట ,పోలేరమ్మ ప్రతిష్ట జరుగుతుందని చెప్పి ,శిష్యులను పిలిచి భజనలు కీర్తనలు పాడమని చెప్పి పాదుకలు బెత్తం ధరించి సమాధి ప్రవేశం చేసి ,బండరాయితో మూసేయించారు .సమాదినుంచే భక్తులకోర్కెలు తీరుస్తారనే నమ్మకం సమాధి వద్ద దీపాఆధనలు జరుగుతాయి .అక్కడ అయిదువారాలు నిద్రిస్తే దీర్ఘ రోగాలు పోతాయని నమ్మకం .భద్రాయపాలెం లోని ఈ సమాధి గొప్ప యాత్రాస్థలమైంది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—18 41-త్రికాలజ్ఞాని అవధూత ప్రకాశానంద స్వామి -1871-1963

మనకు తెలియని మహాయోగులు—18

41-త్రికాలజ్ఞాని అవధూత ప్రకాశానంద స్వామి -1871-1963

  విజయనగరం దగ్గర ఒక వెలనాటి బ్రాహ్మణ కుటుంబం లో 1871లోవెంకట్రామయ్య ,గౌరమ్మ దంపతులకు అనంతయ్య పుట్టాడు .తండ్రి 8వ ఏట ,15వ ఏట తల్లీ చనిపోయారు .తాత లక్ష్మీ నరసింహం ,నాయనమ్మ మీనాక్షమ్మ ల వద్ద ధర్డ్ ఫారం చదివి ,15వ ఏట చదువు మానేసి సంస్కృతం, జ్యోతిష్యం నేర్చాడు .పెళ్ళికి తాంబూలాలు తీసుకోనగానే వధువు అకస్మాత్తుగా చనిపోగా వైరాగ్యం కలిగి౦ది .ఇంగ్లీష్ మేస్టార్ వేదాంతి దత్తయ్య పంతులు గొప్ప గురువు దొరుకుతాడని హామీ ఇచ్చాడు

  జ్ఞానన్వేషణకోసం 16వ ఏట ఇల్లువదిలి దేశాటనం చేస్తూ 1887జనవరి 14 బెల్గాం చేరి ,అక్కడ వేదాంతి డిప్యూటీ కలెక్టర్ లల్లూభాయ్ గోవర్ధనదాసు తో పరిచయం కలిగి, యోగ వాశిస్టం మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి , సన్యసించా లన్న కోరిక చెప్పగా అందులో ఉన్న కష్ట నిష్టూరాలు తెలియజేయగా ఆకోరిక బలీయం కావటం తో ఆయన అనుమతితో  ఇల్లు వదిలి మళ్ళీ దేశాలమీద పడి,తిరుమల చేరి పుష్కరిణిలో ప్రేమ మంత్రం చెప్పుకొంటూ స్నానంచేసి శిఖా యజ్ఞోపవీతాలు తీసేశాడు .మద్రాసు వెళ్లి బుచ్చయ్య పంతులు వద్ద భాష్యం తో సహా ఉపనిషత్తులు నేర్చి ,అక్కడి నుండి నాశిక్ ,హరిద్వారం సందర్శించి ,దారిలో మహా వైయాకరణి అమరేశానందులవద్ద  సిద్ధాంత కౌముది ,వ్యాకరణ మహాభాష్య౦  అభ్యసించాడు అన౦తయ్య .అమరేశానంద అనంతయ్యకు ‘’ప్రకాశానంద స్వామి ‘’అని పేరు పెట్టారు .

   హృషీకేశం లో శ్రీ సుఖానంద స్వామి వద్ద హఠయోగ ప్రక్రియలు నేర్చి ,గుజరాత్ లోని నడియార్ చేరి ,అక్కడి సంత్ రాం గుడిలో ప్రమేయ గ్రంథాలు చదివారు .ఆశ్రమ స్వీకారం తర్వాత 15ఏళ్ళు లల్లూరాం గురువును సేవించి ,ఆయన సిద్ధిపొందాక సర్వ సంగ పరిత్యాగి యై ,జిజ్ఞాసువులకు జ్ఞాన బోధ చేస్తూ ,40వ ఏట ఆత్మ సాక్షాత్కారం పొందారు .త్రికాలజ్ఞానిగా గుర్తింపు పొందారు.ముముక్షువులకోసం చాలా గ్రంథాలు రాశారు .వార్తాలాప గ్రంథం ,సంతగురు పరిచయం ,ఆపరణోధర్మ,సప్తశ్లోక గత ధర్మ జ్యోతి రచనలలో ఆయన అపార పా౦ డిత్యం వెలువడింది .వాటినీ గుజరాతీ భాషలో ముద్రించారు .ద్వారకలో దేహం చాలించాలని సంకల్పించి 15-1-1962న చేరి 23-2-1962నప్లవనామ సంవత్సర మాఘ బహుళ చవితి శుక్రవారం  స్వామి ఆత్మ చిదాత్మలో 91ఏట కలిసిపోయింది .వారి సమాధి గొప్ప యాత్రాస్థలమైంది .

42-వాడరేవు లలితానంద స్వామి -1886-1950

స్కందుని అంశతో 17-11-1886వ్యయ వృశ్చికమాస బహుళ షష్టి మంగళవారం శ్రవణా నక్షత్రం లో  జన్మించిన లలితానంద తమిళనాడు  స్వామి మేలు వలక్కూరు గ్రామాధికారి కాకర్ల వెంకట నరసు సోమయాజులు అనే ముర్కినాటి బ్రాహ్మణుడికి జన్మించారు. ఆయనకు ఆంద్ర దేశం లో చాలామంది బంధువులున్నట్లు తెలుస్తోంది .పశుమల కొండ గుహలు తనియాల గ్రామం లోని కైలాసనదేశ్వర అఖిలాండేశ్వర ఆలయం చీరాలదగ్గర వాడరేవు ఆయన తపోవన క్షేత్రాలు .దేశాటన చేసి 1940విక్రమనామ సంవత్సరం లో పశుమల చేరి గుహలో ఏకాంతంగా దిగంబరంగా తపోదీక్ష కొనసాగించారు .1941లో అక్కడ స్వామికి డాక్టర్ తంగిరాల సీతారామయ్య ,కొసరాజు నాగయ్య లు మఠం కట్టించారు .

  సనాతన వైదిక ధర్మ ప్రచారం కోసం యజ్ఞయాగాలు మంత్రం అనుష్టాన బోదా కార్యక్రమాలు చేశారు. పసుమల తనియల వాడ రేవులలో ఏడాది పొడవునా ఏదో ఒక యజ్ఞం నిర్వహించేవారు ,   సాక్షీమాత్రులుగా ఉంటూ పరబ్రహ్మాను భవం సాధించిన జీవన్ముక్తులు స్వామి .సన్మార్గ ప్రవర్తన ధర్మానుష్టానం వైరాగ్యాలే సత్యాన్వేషణకు మార్గాలని బోధించేవారు 24-11-1951ఖర కార్తీక బహుళ దశమి శనివారం వారి పసుమల మఠం ఆయన ఉన్నగదిలోనుంచి ఒక దివ్యజ్యోతి ఆకాశం వైపుకు వెళ్ళింది. తలుపులు తెరచి చూస్తే స్వామి దేహం చాలించారని తెలిసింది .ఆయనను విధివిధానంగా సమాధి చేసి దానిపై నర్మదా లింగం ప్రతిష్టించారు .ఆయన పేర లలితానంద భక్త సమాజం ఏర్పడింది .ఆత్మజ్యోతి మాసపత్రిక వాడరేవు ఆశ్రమం ద్వారా వెలువడేది .

43-సద్గురు జగన్నాధ స్వామి -1885-1974

ఒంగోలులో కోటి సుబ్బయ్య కామమ్మ వైశ్య దంపతులకు 11-8-1885పార్ధివ శ్రావణ శుద్ధ విదియ మంగళవారం జగన్నాధస్వామి జన్మించాడు .ఉయ్యాలలో ఉండగానే యోగాసనాలు వేసి ఆశ్చర్యపరచేవాడు .ఆరేళ్ళ వయసులో తలిదండ్రులు చనిపోతే ,చేబ్రోలు రెడ్డిపాలెం లో మేనమామ ఇంట పెరిగాడు .కేశవరాజ యోగీంద్రుడు ఒక సారి కనిపించి ఆయన్ను సూక్ష్మ రూపం లో ఆకాశమార్గం లో తీసుకువెళ్ళి శ్రీశైలం గుహలలో దింపాడు .అక్కడి మహర్షులు పరకాయ ప్రవేశం మొదలైన విద్యలు నేర్పారు .త్రిమూర్తులు ప్రత్యక్షమై దేవాలయాలు నిర్మిస్తూ జన్మ సార్ధకం చేసుకోమని బోధించారు .

  భక్తిప్రచారం చేస్తూ మంత్రోపదేశాలు చేస్తూ ఉత్తర దక్షిణ దేశయాత్ర చేశారు .పొన్నూరులో సహస్రమ లింగేశ్వర,దశావతార దేవాలయాలు  కట్టించారు .చెంచమ్మను పెళ్ళాడి ఆమె కొద్దికాలానికే చనిపోతే ,కోటి రత్నమ్మను  ద్వితీయం  చేసుకొన్నారు ,ఆడబిడ్డ పుట్టాక ఆనందాశ్రమం చేరి ,భార్య చనిపోగా గురువు ఆజ్ఞతో సీతమ్మను మూడవ పెళ్లి చేసుకొని ,కూతురు సీతమ్మతో బాపట్ల చేరారు .శ్రీశైల యాత్రకు వెళ్లి కొండఎక్కుతూ కాలుజారి లోయలో ఒకమహర్షి  ఒడిలో పడగా ఆయన నాలుకపై బీజాక్షరాలు రాయగా ,ఇలా ఎన్నో గండాలు గడుస్తూ దేవాలయ నిర్మాణాలు చేయిస్తూ ,అధ్బుత మహిమలుప్రదర్షిస్తూ జగన్నాధ స్వామి 10-9-1974ఆనంద భాద్రపద బహుళ నవమీ మంగళవారం 89వ ఏట దేహం చాలించారు .భాద్రపద  బహుళ నవమినాడు బాపట్లలో ఆరాధనోత్సవాలు దివ్యంగా చేస్తారు .

44-సహజకవి నార్పల తిక్కయ్యస్వామి -1870-1924

నార్పల తిక్కయ్యస్వామి 1904లో చెళ్ళ గురికి లో హజాము భీమన్నపోలం లో ఎర్రి తాతను దర్శించి ,నాలుగేళ్ళు సేవించి ,మఠంకట్టించి గురువును అందులో ప్రవేశపెట్టి ,1909లో గురువు ఆదేశం పై అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు .1920లో అనంతపురం మండలం నార్పల గ్రామం చేరి ,దక్షిణంగా నడిచి ,దుగమరి ఊరికిఉత్తరాన ఉన్న దత్తాత్రేయ ఆశ్రమం చేరి ,అక్కడినుండి సుల్తాన్ పేట వెళ్లి ఒక వరిపొలం లో రైతు నంద్యాం తిమ్మారెడ్డి ని పేరుపెట్టి పిలిస్తే ఆశ్చర్యపోయి,ఇంటికి తీసుకు వెళ్లి భోజనవసతి సౌకర్యాలు కల్పించాడు .అక్కడి ధనిక పేదజనం అందరూ ఆయన్ను బాగా ఆదరించారు .అష్టసిద్ధులు మహిమలు ప్రదర్శించి రోగాలు నివారిస్తూ వారికి సాయం చేశాడు .

  ఒక రోజు స్వామి ఒక వెండి రూపాయిని బలం గా విసిరితే అది దూరంగా ఉన్న బ్రహ్మజెముడు డొంక పడింది .అక్కడే తనను సమాధి చేయమని ఆదేశించాడు. 10-4-1924రక్తాక్షి చైత్ర శుద్ధ షష్టి గురువారం 54వ ఏట తిక్కయ్యస్వామి కుండలిని భేదించుకొని బ్రహ్మైక్యం చెందారు .1925లో సమాధిపై మందిరం నిర్మించారు .సమాధిపై స్వామి ఇత్తడి శిరస్సు ,నాగపడగ స్థాపించి పూజలు చేస్తున్నారు .చైత్ర శుద్ధ పంచమి నుండి మూడు రోజులు ఉత్సవాలు చేస్తారు .

45-రెండవ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి –పుదుక్కొట జడ్జి స్వామి -1850-1915

విశాఖ లో వేదమూర్తి శాస్త్రి అనే వేదపండితుని కుమారుడిగా1850లో పుట్టిన  ఆయన జాతకం చూసి పరివ్రాజక శిరోమణి అవుతాడని చెప్పారు. తండ్రి వద్ద తెలుగు సంస్కృతాలు నేర్చి ,వేదం తోపాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవటానికి మద్రాస్ వెళ్లి న్యాయ శాస్త్ర డిగ్రీ సాధించి ,జూనియర్ వకీలుగా కొంతకాలం పని చేసి ,తర్వాత స్వతంత్రం గా ప్లీడర్ గాఉంటూ మంచిపేరు పొందాడు.తల్లీతండ్రీ కాశీ వెళ్ళిపోయారు .

   జడ్జిస్వామి న్యాయ సమ్మతమైన కేసులే వాదించేవాడు. న్యాయం కోసమే తప్ప డబ్బుకోసం ప్రయత్నించేలేదు .20ఏళ్ళు ప్లీడర్ గా ఉంటూ లోకాచారం శిక్షాస్మృతి స్థానికాచారం  కటుంబ ఆచారం చారం అనే నాలుగు కోణాలలో కేసులపై తీర్పులిస్తూ తిరువాన్కూరు హైకోర్ట్ జడ్జిగా పనిచేశారు .ఒకసారి చట్టప్రకారం ఒక అమాయకుడికి మరణ శిక్ష విధించాల్సి వచ్చి ,సత్యాన్వేషణలో సంసారం ఉద్యోగం వదిలేసి అడవులలో తిరుగుతూ కరాచీలోని ఉపనిషణ్మఠం  చేరి ,అక్కడ ఐదేళ్ళు 1899వరకు ఉపనిషత్ సత్యాన్వేషణలో గడిపి ,శ్రీ రామకృష్ణావదూత ఆదేశం మేరకు దిగంబరంగా ఉంటూ నేరూరు వెళ్లి సదాశివ యతీంద్రుల సమాధి వద్ద కొంతకాలం తపస్సు చేసి హిమాలయాలకు వెళ్లి ఋషీకేశ్ లో తపస్సు చేశారు .

  శరీరత్యాగానికి సమయం దగ్గర పడిందని తెలిసుకొని ,పుదుక్కొట దగ్గర నర్తమలై చేరి చోళరాజుల ప్రాచీన శివాలయం లో తీవ్ర తపస్సు చేశారు .బ్రహ్మ తేజస్సుతో వెలుగుతున్న స్వామిని ప్రజలు పల్లకీలో ఊరేగింపుగా పుదుక్కోటకు తీసుకు వెడుతుంటే  .పల్లవ సరసు వద్ద స్వామి ప్రాణాలు అన౦త ప్రాణం లో కలిసి పోయాయి .మార్తాండ భైరవ తొండమాన్ చక్రవర్తి స్వామి వారి సమాధికోసం పుదుక్కోటకు తూర్పున విశాల స్థలం ఇచ్చి సమాధి చేయించారు .కొంతకాలం నిత్యపూజలు జరిగేవి .తర్వాత సమాధి నిర్లక్ష్యానికి గురైతే ,శిష్యులు భువనేశ్వరీ విగ్రహ ప్రతిష్ట చేసి మందిరం అభి వృద్ధికి తోడ్పడగా ఆప్రాంతం భువనేశ్వరీ నగరంగా వర్ధిల్లింది .జడ్జి స్వామి అసలుపేరు ఎవరికీ తెలియదు .కానీ శ్రీ కాళహస్తిలో గురువు రామ కృష్ణ అవధూత మాత్రం ‘’రెండవ సదాశివేంద్రుడు ‘’అన్నారు  .ప్రస్తుతం జడ్జిస్వామి సమాధి గొప్ప క్షేత్రంగా మారింది .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—17 36-పశి వేదల ప్రజ్ఞానంద స్వామి -1903-1983

మనకు తెలియని మహాయోగులు—17

36-పశి వేదల ప్రజ్ఞానంద స్వామి -1903-1983

పగోజి పాలకొల్లు దగ్గర చింతపల్లిలో వారణాసి రామకృష్ణయ్య మహాలక్ష్మమ్మ దంపతుల రెండవ కుమారుడుగా 7-10-1903శోభకృత్ ఆశ్వయుజ బహుళ పాడ్యమి బుధవారం వెంకటప్పయ్య పుట్టాడు . రామభక్తిఅలవాటై చదువుతో పాటు స్తోత్రాలు కీర్తనలు నేర్చి పాడేవాడు .స్వాతంత్రోద్యమమం లో దేశభక్తి బోధించేవాడు .బ్రహ్మచర్యం అపక్వాహారం గాయత్రీ జపం ,ప్రణవోపాసన ,ప్రాణాయామం యోగాసనాలు కుండలినీ యోగ సాధన చేశాడు. భగవద్గీత ,పంచదశి సీతారామంజనేయం చదివి జీర్ణం చేసుకొన్నాడు .1922లో తణుకు జాతీయ పాఠశాలలో హిందీ పండిట్ చేరి,హరిజనబాలల హాస్టల్ నిర్వహణ కూడా చేసేవాడు .స్వరాజ్యం కోసం పని చేశాడు .

   1924లో గొరగనమూడి వచ్చి స్వామి జ్ఞానానంద వద్ద సన్యాస దీక్ష ,ప్రజ్ఞానంద నామం పొందాడు .ఉత్తర దేశ యాత్ర చేసి ఉత్తరకాశి చేరాడు .1932నుంచి పదేళ్ళు చాలా చోట్ల తీవ్ర తపస్సు చేసి ,1934లో నండూరు చేరి మౌనధ్యానంలో ఉంటూనండూరి స్వామిగా ప్రసిద్ధి చెందారు ప్రజ్ఞానంద .1936లో నాసికా త్రయంబకం దర్శించి ,హరిద్వారం వెళ్లి అనేకచోట్ల తపస్సు చేసి లక్ష్మీ వనం సహస్రధార చక్రతీర్ధం దర్శించి ,తీర్ధ విధులు నిర్వహించి ,చంద్ర ,సూర్య విష్ణు కుండాలమీదుగా స్వర్గారోహణ పర్వతం చేరారు .అక్కడ తపస్సు ఫలించి దివ్యానుగ్రహం లభించింది .బదరి వెళ్లి ,1937నుంచి రెండేళ్ళు అనేక చోట్ల తత్వోపదేశం చేశారు .1939లో కొవ్వూరు దగ్గర పశివేదల లో చిదానంద ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేశారు .

  1940నుండి 42వరకు తిరుమల వైకుంఠ తీర్ధ గుహలో ఏకాంతంగా తపస్సు చేసి ,మళ్ళీ పషి వేదుల ఆశ్రమం చేరి,గోదారి వరదబాధితులకు అన్నసంతర్పణ వైద్యం ,నివాస ఏర్పాట్లు చేసి పశివేదల ప్రజ్ఞానందస్వామిగా ప్రసిద్ధి కెక్కారు .బాల వితంతువులకు మళ్ళీ వివాహం చేసిన సంస్కర్త .పటిష్టమైన గ్రామ సంఘాలు ఏర్పాటు చేసి గ్రామ రక్షణకు తోడ్పడ్డారు .వేలాది శిష్యులేర్పడ్డారు .14-9-1983రుధిరోద్గారి భాద్రపద శుద్ధ అష్టమి బుధవారం ఉదయం 11.45గంటలకు ప్రజ్ఞానందస్వామి 80వ ఏట బ్రహ్మైక్యం చెందారు .చిదానందాశ్రమ గోశాలలో సమాధి చేశారు .ఆరాధన ,జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు .

37-పద్మశ్రీ ప్రణవా నంద స్వామి – 1896-1989

తూగోజి కొత్తపేట మండలం మండపల్లి దగ్గర ఏనుగుల మహల్ లో భారద్వాజస గోత్రీక తెలగాణ్య వైదిక బ్రాహ్మణ కుటుంబం లో కనకదండి విశ్వపతి శాస్త్రి ,సీతమ్మ దంపతుల మొదటి కుమారుడుగా 14-1-1896దుర్ముఖి మాఘ శుద్ధ పాడ్యమి నాడు వెంకట సోమయాజులు పుట్టాడు .ఎంఏపాసై స్వాతంత్రోద్యమం లో చేరదలచి ,పంజాబ్ లోని లాహోర్ లోఉన్న లాలాలజపతిరాయ్ స్థాపించిన డిఎవి కాలేజీలో చేరి 1919లో డిగ్రీ పొంది,వాయవ్య రైల్వేలో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ,1920-26మధ్య పగోజి కాంగ్రెస్ హరిజన సంక్షేమం ఖద్దరు శాఖలో సేవలందించి ,సహాయ నిరాకరణ ఉద్యమం లో కారాగార శిక్ష అనుభవించాడు .    1927లో హిమాలయాల్లో తిరుగుతూ స్వామి జ్ఞానానంద వద్ద దీక్ష , ప్రణవానంద నామం పొందాడు  .హిమాలయాల్లో కఠిన తపస్సు చేసి హఠయోగ రాజయోగ ఖేచర ముద్రలు సాధించి యోగం లో ఉన్నతస్థాయి పొందారు .భగవద్గీత కు ‘’జ్ఞాన దీపిక ‘’వ్యాఖ్యానం రాసి గురువు స్వామి జ్ఞానానందకు 29-5-1928న అంకితమిచ్చారు .అమరనాద్ గుహలో 15రోజులు ఏకాంతవాసం చేసి ,మానససరోవర కైలాసపర్వత ,పశ్చిమ టిబెట్ బౌద్దారామమాలలో తపస్సు చేశారు .హిమాలయాలలొ25 చాతుర్మాస్యదీక్ష నిర్వహించి ఘన ప్రతిష్ట పొందారు .కైలాస పర్వతాన్ని 36సార్లు ,మానస సరోవరాన్ని 33సార్లు ప్రదక్షిణ చేసి రికార్డ్ నెలకొల్పారు .భూ ఉపరితలానికీ భూగర్భసంబంధిత పరిశోధనలు చేశారు .దేశ సంస్కృతీ చరిత్ర రాజకీయాలకు అసమాననిష్కామ  సేవ చేశారు .1929లో అమరనాథ్ గుహలో 15రోజులుండి,శివ పార్వతి గణేశ లింగాలు ఏర్పదేతీరును పరిశోధించి  వ్యాసాలూ రాశారు .1937,42,46లలో అనేక సాహస యాత్రలు చేసి కైలాస  శిఖరానికి అనేక కొత్తమార్గాలు కనిపెట్టిచారిత్రిక విశేషాలు రాశారు .1947లో భారత ప్రభుత్వం స్వామి ప్రణవాన౦దకు ‘’పద్మశ్రీ ‘’పురస్కారం ఆ౦దించి గౌరవించింది

  ప్రనవోపాసకులైన ప్రనవానందులు శ్రీ చక్రం పై గోప్పసిద్ధాంత గ్రంధం రాశారు .ఏనుగుల మహల్ చేరి ఏనుగుల మహల్  ప్రణవానంద స్వామి గా ప్రసిద్దులై అక్కడ 28-3-1983న రెండుటన్నుల  శ్రీ మహాత్రిపుర సుందరీ అమ్మవారి శ్రీ చక్ర మేరు యంత్రాన్ని ప్రతిష్టించారు .మానస సరోవరం దగ్గర ‘’తుగోల్హో’’లో ఒక యజ్ఞ వాటిక నిర్మించారు .అక్కడ అప్పటినుంచి ఇప్పటిదాకా శ్రీ కృష్ణ జన్మదినోత్సవాలు అద్భుతంగా జరుపుపుతూనే ఉన్నారు .గాయత్రీ మంత్రార్ధం తో సహా చాలా గ్రంథాలు రచించారు .1978లో ఎండ దెబ్బ బాగా తగిలి జ్ఞాపక శక్తి తగ్గింది .17-5-1989శుక్లనామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి బుధవారం ప్రణవానంద స్వామి 93ఏట  హైదరాబాద్ లో విశ్వ చైతన్యం లో కలిసిపోయారు .తన అవశేషాలేవీ మిగల్చవద్దని స్వామి వారి ఆదేశం ప్రకారం విద్యుత్ స్మశాన వాటికలో దహనం చేశారు .మాఘ శుద్ధ పాడ్యమినాడు ఆరాధనోత్సవాలు జరుపుతారు .

38-రాయదుర్గం భంభం స్వామి -1886-1969

చిప్పగిరి భంభం స్వామిశిష్యుడే రాయదుర్గం భ౦భం స్వామి అనే షేక్ అబ్దుల్ సాహెబ్ 1886లోఆదోనిలో  ఆలీసాహేబ్ రాజాజీ దంపతులకు అబ్దుల్ వహాబ్ పుట్టాడు .అతడి ఆగడాలకు తట్టుకోలేక 12వ ఏటనే చిప్పగిరి భంభం స్వామి దగ్గర చేర్చారు .ఆయన ఈయన చెవిలో ద్వాదశాక్షరి మంత్రం ఉపదేశించిలింగం , జందెం గాజులుధరి౦ప జేసి ‘’భం షేక్ అబ్దుల్ ‘’దీక్షానామమిచ్చి పంపించేశాడు .14వ ఏట ఆలూరుకు తిరిగివచ్చి వివాహమాడి గృహస్థాధర్మం నిర్వర్తిస్తూ రాజయోగం సాధించాడు. తర్వాత హఠయోగం నేర్చి,పోలీసు శాఖలో ఉద్యోగం లో చేరి ,గురుబోదను మతసామరస్యాన్నీ బోధించేవాడు .అనుచరులు శిష్యులు పెరిగారు .రోగగ్రస్తులకు గ్రహపీడితులకు మానసిక వైకల్యమున్నవారికి పూర్తిగా నయం చేసి మంచి పేరు పొందాడు .ఆయన్ను ‘’జిమేదారు స్వామి ‘’గా పూజించేవారు. లీలలు అద్భుతాలు చూపేవాడు .201కీర్తనలు ,11తత్వాలు రాశాడు .తన సమాధి స్థలాన్ని నెలరోజులు ముందే ఎంచుకొని 21-2-1969కీలక ఫాల్గుణ శుద్ధ దశమి శుక్రవారం ఉదయం 9-25గంటలకు గురుమంత్రం జపిస్తూ 83వ ఏట పరమాత్మలో లీనమయ్యారు .ఏటా ఆరాధనోత్సవాలు బాగా చేస్తారు .

39-నీల కంఠ సచ్చిదానంద ఘనే౦ద్రులు -1788-1907

కర్ణాటకలోచిక్కమగుళూరు తాలూకా దాసమాస గ్రామం లో వైదికాచార పరులైన భాగీరధీ ,గోపాల పండితులకు  1788కీలక నామ సంవత్సర ఆషాఢ బహుళషష్టి శనివారం నంజుండయ్య పుట్టాడు.ఐదవ ఏట అక్షరాభ్యాసం జరిగి 12ఏళ్ళకే అసమాన ప్రజ్ఞావంతుడైనమేదావి గా  పేరు పొందాడు .

   శ్రీ రామానంద ఘనేన్ద్రులనే యోగి నంజుండయ్య ప్రతిభ గుర్తించి ,ఇంటికి వచ్చి తల్లికి ఒక కాగితమిచ్చి అదృశ్యమయ్యాడు .ఆకాగితం చదవగానే వైరాగ్యభావన కలిగి ,రామానందుని అన్వేషణ కోసం బయల్దేరి చము౦డేశ్వరి కొండ గుహలో సమాధి నిష్టలో ఉన్న ఆయన్ను చేరాడు .గురు శుశ్రూష కొన్నేళ్ళు చేసి ,యోగాలన్నీ నేర్ఛి సచ్చిదానందుడు అయ్యాడు .గురుదీవనతో దాస మాస కు చేరి ,తలిదండ్రులను కొంతకాలం సేవించి వారి అనుమతితో శ్రీశైలం చేరి భ్రమరాంబా మల్లికార్జునులను దర్శించి పాతాళగంగ దగ్గర ఒకగుహలో 24ఏళ్ళు దీక్షగా తపస్సు చేసి పూర్ణ హఠయోగ  సిద్ధిపొందారు .అష్టసిద్ధులు ,ఘటికా పాదుకా గమనాదులు ,పరకాయ ప్రవేశం మొదలైన విద్యలన్నీ కరతలామలకం చేసుకొన్నారు .

   తర్వాత ఆసేతు హిమాచలపర్యంత పుణ్య క్షేత్ర సందర్శనం యోగ భూములు దర్శించి ,వివిధ యోగాలు నేరుస్తూ ,అడిగినవారికి నేర్పిస్తూ ,60ఏళ్ళు దివ్యయోగ జీవితం గడిపారు .1890లో బళ్ళారి జిల్లా విరూపాక్ష క్షేత్ర సమీపం లోని గౌరీపురం చింతామణి పీఠానికి భక్తులకోరికపై పట్టాభి షిక్తులయ్యారు .అప్పటినుంచి’’ శ్రీ సచ్చిదానంద నీలకంఠ సదానంద చింతామణి ‘’ సార్ధక నామధేయులయ్యారు .తమ శక్తులను తనకోసం ఎన్నడూ వాడుకొని యోగి పురుషులాయన .30-11-1907ప్లవంగ కార్తీక బహుళ దశమి శనివారం మధ్యాహ్నం 12గంటలకు 119వ ఏట నీలకంఠ సచ్చిదానంద ఘనే౦ ద్రులు ఆ నీలకంఠుని సన్నిధానం చేరారు .చైత్రమాసం లో శ్రీరామ కల్యాణోత్సవం ,ఆశ్వయుజంలో శరన్నవరాత్రి ఉత్సవాలు దశమినాడు స్వామి వారి ఆరాధనోత్సవం జరుగుతాయి .

40-తుంగతుర్తి బుచ్చయ్యయోగి -1760-1854

గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా చేజెర్ల శ్రీ కపోతేశ్వరస్వామి దేవాలయం లోనే జీవితం గడిపి ,94వ ఏట 7-9-1954ఆనంద భాద్రపద బహుళ పాడ్యమి గురువారం తుంగతుర్తి బుచ్చయ్యయోగి బ్రహ్మైక్యం చెందారు .ఆలయ చరిత్రలో ఆయన గురించి కొంత సమాచారం లభిస్తుంది .కరణకమ్మ వైదిక బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన బుచ్చయ్య వ్యవసాయం చేస్తూ గడిపేవాడు.ఒకసారి మేఘాల మల్లికార్జున కొండ దగ్గరపొలం దున్నుతుంటే దాహమేసి నీటికోసం కొండగుహలోకి వెడితే అక్కడి రుషి ఆయన నాలుకపై బీజాక్షరాలు రాసి ‘’మధుమతి ‘’విద్య ఉపదేశించాడు .అప్పటినుంచి కవి జ్ఞాని మహిమాన్విత యోగి అయ్యాడు బుచ్చయ్య .

   శ్రీగిరికి వెళ్లి ఆరేళ్ళు తపస్సు చేసి ,వారానికో పదిహేను రోజులకో సమాదినుంచి బయటికి వచ్చేవాడు .కాయ కసరులు తినేవాడు .ఆరేళ్ళ తర్వాత తనపుట్టిన ఊరు  కురిచేడు చేరి దేవాలయం లో ఉండేవాడు .తర్వాత చేజెర్ల కపోతేశ్వరస్వామిని దర్శించి,శ్రీశైలం వెళ్లగా అమ్మవారు భ్రమరాంబ సాక్షాత్కరించింది .ఆసమయం లో అమ్మవారి బింబం కదిలిపోతే ,తన తపోమహిమతో యధాస్థానం లో పునః ప్రతిష్ట చేశాడు .ఇప్పుడు శ్రీశైలం లో పూజలందుకొంటున్న అమ్మవారి బింబం బుచ్చయ్యయోగి ప్రతిస్టించిందే  ఈ  అమ్మవారి ఆదేశం తోనే చేజర్లకపోతేశ్వరాలయం లోదేవీ ప్రతిష్ట చేశారు .ఆకాశగమన విద్యతో దేశంలోని క్షేత్రాలన్నీ సందర్శించాడు బుచ్చయ్యయోగి .సహజ పండితుడైన బుచ్చయ్య ఆధ్యాత్మిక గీతాలు రచించి తన్మయత్వం తో గానం చేసేవాడు .ఆయన రచించిన ‘’కపోతేశ్వర అష్టకాన్ని ‘’బ్రాహ్మణ సమరాధనలలో పాడుతూ ఉంటారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -9 7-టిం కొత్త సంసారం

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -9

7-టిం కొత్త సంసారం

సియాటిల్  వెళ్లాలని నిర్ణయించాను.నామనసులో చలా ప్లాన్లున్నాయి .టెలోస్ గురించి వివరంగా ఒక ఆర్టికల్ రాయాలని ఉంది దాన్ని కేయాస్ ప్రింట్ చేస్తానని హామీ ఇచ్చాడు కూడా .అమ్మమ్మని వదిలి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది . స్వీడన్ స్పిరిట్యు యాలిటితో ఆమెవిసిగిపోయింది .నాతో టెలోస్ వస్తుందేమో అడగాలి .టిచ్ ను వదలాలంటే కూడా ఇబ్బందిగా ఉంది .దాన్ని క్వారంటైన్ లో ,లేక పంజరం లోనో పెట్టాల్సివస్తుంది .అయినా మాన్యుల్ సాయం చేస్తాడులే .ఎమైనా  టెలోస్  కు త్వరగా వెళ్ళాలి .మాన్యుల్ రావటం టిచ్ ను తీసుకువెళ్లటం ఇద్దరూ అదృశ్యమవటం క్షణాల్లో జరిగిపోయి నాకు రిలీఫ్ గా ఉంది .

  సియాటిల్ చేరి టాక్సి లోకి జంప్ చేసి కూర్చున్నాను .సరాసరి టెలోస్ వెళ్ళకూడదు .ముందు మాట్ కుటుంబాన్ని  కలవాలి .ఈ పాటికినాన్సీ డెలివరి అయిఉంటుంది.మాఇంట్లో ఒక నెలఉండి,తర్వాత భూగర్భలోకం వెళ్ళాలి . టెలోస్ లోని  విజ్ఞానం ఇక్కడ అందటం లేదు .స్వీడిష్ కెనెడియన్ చదువు చాలదనిపించింది నేను కెనడియన్ నే అని చిన్నప్పటి నుంచీ నా భావం .

  ఇంటికి వెళ్ళే ముందే మాట్ ని కలిసి స్వీడన్ కబుర్లు అర్జెంట్ గా  చెప్పాలని తొందరగా ఉంది .మాట్ ఇంటికి వెళ్లి బెల్ కొట్టాను .ఆలస్యంగా వచ్చి నాన్సీ తలుపు తీసింది .ఆమె కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. చిన్నారి ఎలినార్ కనిపించలేదు. నాన్సీ చిక్కింది కనుక ప్రసవం జరిగి ఉంటుంది .మాథ్యూ చనిపోయాడన్న దుర్వార్త విన్నాను. కార్ యాక్సిడెంట్ లో పోయాడు .పని నుంచి ఇంటికి తిరిగివస్తుంటే తాగిఉన్న కారు డ్రైవర్ గుద్దటంవల్ల చనిపోయాడు మాట్.వెంటనే హాస్పిటల్ లో చేర్చినా లాభంలేకపోయిందట .నాన్సీ నన్ను పట్టుకొని విపరీతంగా రోదించింది .ఆమెను ఓదార్చాను నాకు వచ్చినమాటలతో .ఎలినార్ గబుక్కునవచ్చి నా ఒళ్లో చేరి ‘’నాన్న చచ్చిపోయాడు .నాకు డాడీ కావాలి .నువ్వు డాడీగా ఉంటావా ప్లీజ్ ‘’అంది అమాయకం గా .నాన్సీ పిల్లను ఓదార్చింది ఎలినార్ ను ఎత్తుకు తీసుకొని పరుపు మీద పడుకోబెట్టాను .నాన్సీ కి నెలలు నిండకుండా డెలివరిజరిగి మాట్ చనిపోయిన కొద్ది రోజుల్లోనే శిశువు చనిపోయిందట .నాన్సీ కిందకు వెళ్ళింది .ఎలినార్ నా చెవుల్లో ‘’నాన్న చనిపోతాడని, నువ్వు అమ్మ ,పువ్వులు బాగా ఉండే చోటుకు వెడతారని నాకు కనిపించింది ‘’అని రహస్యంగా చెప్పింది . ఆమాటలకు అవాక్కయ్యాను .మాట్ ఫామిలీని టెలోస్ కు తీసుకు  వెళ్ళచ్చా’’అని సందేహం .

   అమ్మమ్మ కు ఫోన్ చేసి త్వరలో భూగర్భ లోకానికి వెడుతున్నానని చెప్పాను .ఆమె కుంగి పోయినట్లు అనిపించింది .ఆమె పారాసైకాలజి  ఫ్రెండ్స్ ఆమెకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట ,వార్నింగ్ ఇస్తూ ఉత్తరాలు వస్తున్నాయట .చంపుతామని బెదిరింపులు కూడా ట.పోలీస్ కంప్లైంట్ చేయచ్చుకాని దానికి చాలాసమయం పడుతుంది. మాతోపాటు అమ్మమ్మకూడా టెలోస్ కు తీసుకు వెడితే ?అన్న ఆలోచన వచ్చింది .మాన్యుల్ ను సలహా అడిగా .అమ్మమ్మ రావటం అతడికి ఇష్టమే .ఆమెకు ఫోన్ చేసి వెంటనే అందుబాటు లో ఉన్న ఫ్లైట్ లో రమ్మనటం ,ఆమె అంతే స్పీడ్ గా సామాను తో రావటం జరి గింది .శాస్తా కు వెళ్ళటం ఇబ్బందే కాని మాన్యుల్ మాకుసహాయం చేస్తాడన్నా ధీమా నాది .మాన్యుల్ నా కుక్కతో సహా కనిపించాడు .నా ఆనందం చెప్పనలవి కానిది .టిచ్ తో  నాన్సీ కి దోస్తీ కుదిరింది క్షణాలమీద .ఆమె ప్రయాణానికి తగిన ఏర్పాట్లుకూడా నిమిషాలలో చేసేసింది .ఇక నేను రాసేదంతా అగర్తా గురించే .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—16 31-అనుభవ యోగి -నిత్యానందస్వామి -1893-1965

 

మనకు తెలియని మహాయోగులు—16

31-అనుభవ యోగి -నిత్యానందస్వామి -1893-1965

 కడపజిల్లా పొద్దుటూరు తాలూకా పర్లపాడు లో బీరెడ్ది చిన్న చెన్నారెడ్డి అనే పేద కర్షక దంపతులకు ఐదవ సంతానంగా బాల వెంకట సుబ్బారెడ్డి 1893 డిసెంబర్ లో విజయ మార్గశిరమాసం లో పుట్టాడు .బాల్యం లోనే తలి దండ్రులు చనిపోతే పెద్ద జొన్నవరం వెళ్లి సంస్కృతాంధ్ర సాహిత్యాలు బాగా నేర్చాడు .16వయేట ఈ రెండుభాషల్లో కవిత్వమూ రాశాడు .పరాపర విద్యలు గణిత సూత్రాలు శుర్ది సూత్రాలు భూమి కొలతలు ,కరణీకం నేర్చాడు 1914లో రాయచోటిలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి పెద్ద జొన్నవరం లో ఉపాధ్యాయుడుగా చేరాడు .సత్యాన్వేషణపై దృష్టి మరలి ,ఆళ్లగడ్డ తాలూకా రాంపల్లిలో రంగారెడ్డి అనే సత్పురుషుని చేరి ,శిష్యుడై ,సన్యాస దీక్ష ,నిత్యానంద స్వామి అనే ఆశ్రమ నామం పొందాడు.అష్టాంగ యోగం మొదలైనవి గురువు వద్ద నేర్చాడు .1925నుండి తీవ్ర తపోదీక్షలో ఉంటూ ‘’విశ్వం భరీయ ‘’  శ్రీమన్నారాయణ శాస్త్ర శరణాగతి ,రామనామం ,జానకీ రామ శతకం ,నారాయణ స్తవం ,శతపత్రం పుత్ర హితబోధిని వంటి గ్రంథా లెన్నో రాశాడు .

   ప్రొద్దుటూరులో ఒక భక్తుని ఇంట్లో 17-2-1965తెల్లవారు ఝామున 4గంటలకు 72వ ఏట చనిపోయాడు నిత్యానందస్వామి.ఆయనకోరిక పై శవాన్ని దహనం చేసి ,కుందూ నదిలో చితాభస్మం కలిపారు .మహిమలు వగైరా చూపేవాడు కాదు. అనుష్టాన వేదాంతం బోధిస్తూ అనుభవ యోగిగా గడిపాడు .

32-రేపల్లె చిన్నమ్మ -1887-1963

గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా గొరిగ పూడిలో రేపల్లె లక్ష్మయ్య ,శాయమ్మ కాపు దంపతులకు చివరి సంతానం మాచమ్మ.14వ ఏట గరిగపాటి గోవిందయ్య తో పెళ్లి జరిగింది .అత్తవారి ఊరిలో బొబ్బర్లంక లక్ష్మీ దేవమ్మ యోగినితో పరిచయమైంది  .ఏడుగురు సంతానాన్ని కని ,పరమేశ్వర సాక్షాత్కారం పొందిన మాచమ్మకు ఎనిమిదవ బిడ్డ పుట్టాక భర్తపై పితృభావం భర్తకు ఆమె పై మాతృ భావం ఏర్పడ్డాయి  .మాచమ్మమహాత్మురాలని లోకం గ్రహించింది .

  మంగళ సూత్రం వదిలేసి మాచమ్మ 12ఏళ్ళు మౌన దీక్ష పూని 7ఏళ్ళు మాట్లాడి మళ్ళీ 5ఏళ్ళు మౌనంగా ఉన్నది .నల్లూరుపాలెం బొబ్బర్లంక ,గొరిగపూడి గ్రామాల్లో ఎందరికో వ్యాధులు నయం చేస్తూ 7ఏళ్ళు అన్నం తినకు౦డా  ఒక నిమ్మతొన, కొద్దిగా సోడా నీరు తాగుతూ గడిపింది .గాంధీజీ ఆమెను దర్శించి ప్రభావితుడై ఆమె బోధలు అందరూపాటించాలని  ‘’య౦గ్ ఇండియా ‘’పత్రికలో రాశాడు .రేపల్లెలో స్థిరపడి రేపల్లె చిన్నమ్మగా ప్రసిద్ధి చెంది౦ది .రేపల్లె బావాజీ పేటలో భక్తుడు కట్టించిన కుటీరం లో ఉంటూ ,టైఫాయిడ్ జ్వరం వచ్చి దుర్ముఖి మార్గశిరశుద్ధ పంచమి 12-5-1956 సాయంత్రం 4గంటలకు ,76వ ఏట చిన్నమ్మ పరమపదించింది .మర్నాడు రాత్రి సమాధి చేశారు .భక్తులకు, ముముక్షువులకు అది గొప్ప యాత్రాస్థలమైంది. ఒక్క మెతుకు కూడా వృధా చేయవద్దనీ ,నీరు కూడా అనవసరంగా వాడవద్దనీ ,అన్ని వృత్తుల రాహిత్యమే జన్మరాహిత్యమనీ చిన్నమ్మ ఉద్బోధ.

33-స్థిత ప్రజ్ఞురాలు పిరాట్ల రామ లక్ష్మమ్మయోగిని  -1882-1969

పల్నాటి సీమలో పల్లికుంత గ్రామానికి చెందినశ్రీరామభక్తులైన కంభంపాటి వెంకటప్పయ్య బుచ్చమ్మ  బ్రాహ్మణ దంపతులకు 12-4-1882చిత్రభాను చైత్రబహుళనవమి బుధవారం కృష్ణాజిల్లా జుజ్జూరులో మేనమామ ఇంట్లో రామలక్ష్మమ్మ పుట్టింది.చిన్నప్పుడే పెద్దబాలశిక్ష రామాయణ భాగవతాలు చదివింది .ఆధ్యాత్మ రామ కీర్తనలు రామదాసుకీర్తనలు తండ్రి వద్ద నేర్చిపాడేది .8వ ఏట ముక్త్యాలకు చెందినపిరాట్ల మృత్యుంజయ శాస్త్రి తో పెళ్లి జరిగింది .నలుగురుకొడుకులు అయిదుగురు కుమార్తెలు పుట్టారు .ఇంత పెద్ద సంసారం ఈదుతూ కూడా ఆమె యోగిని అయింది

  అనాధలకుసేవ  ,సంసారం లో మునిగితేలే స్త్రీలకు మార్గదర్శనం చేయాలనిపించి ,జన్మ సాఫల్యంకలిగించాలని తలంపు కలిగి రాత్రిళ్ళు అత్తామామా  నిద్రపోయాక  ధ్యానం ,యోగ సాధనా చేసేది .ఒకరోజు ధ్యానం లో మనసు అంతర్ముఖమై సమాధి స్థితి పొందింది .తోటి స్త్రీలకూ భక్తివైరాగ్యాలు,యోగ రహస్యాలు  బోధించేది . 1932 లో భర్తతో కలిసి హనుమకొండ వెళ్ళింది .అక్కడి వారు ఆమె ప్రతిభగుర్తించి ఆదంపతులకు ఒక ఇల్లు సమకూర్చి అక్కడే ఉండమని కోరారు .ఆ ఇంటికి ‘’సచ్చిదానంద ఆశ్రమం ‘’ అని పేరుపెట్టి సత్సంగం దేవతార్చన తపోధ్యానాలకు ఉపయోగించారు దంపతులు .

  కొడుకు చదువుకోసం కాకినాడలో ఆమె ఉంటే, ఎందరో బాధితులకు మనశ్శాంతి కలిగించింది .7-1-1933 న భర్త మరణించాడు .1938లోకాకినాడ లో పెద్ద ఆశ్రమం స్థాపించి పేద విద్యార్ధులకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయించింది .అనాధలకు ఆవాసం సత్సంగానికి మందిరం కట్టించింది .హైదరాబాద్ లో భక్తులు ఆశ్రమ౦  నిర్మించారు .ఈమూడు ఆశ్రమాలలో జీవిత శేషాన్ని సేవలో గడిపింది .87వ ఏట 4-1-1969కీలక పుష్యబహుళ పాడ్యమి శనివారం నాడు శ్రీరామ చంద్రుని చరణార వి౦దాలను ను చేరింది నిరాడంబరయోగిని రామలక్ష్మమ్మ .మూడు ఆశ్రమాలలో ఆరాధనలు ఘనంగా జరుగుతాయి .ఆశ్రమ వార్షికోత్సవాలు శరన్నవ రాత్రులు సీతారామకల్యాణం వైభవంగా చేస్తారు. కాకినాడ ఆశ్రమం ప్రభుత్వ ఆధీనంలో ఉంది .

34-పాకల పాటి గురువులు -1911-1970

పగోజి ముండూరు అగ్రహారం లో దామరాజు గంగరాజు వెంకమ్మ ఆరువేల నియోగి దంపతులకు మూడవ సంతానంగా  వెంకట్రామయ్య 1911లో పుట్టాడు.ఆరు నెలల వయసులో తల్లి , 9వ ఏట తండ్రీ చనిపోయారు.8వ తరగతి చదువుతూ  డాంబికాకాచారులను సంస్కరించే ప్రయత్నం చేశాడు .అసాధారణ గ్రహణ ధాణలతో అందర్నీ మెప్పించాడు.గారపాటి పుల్లయ్య అనే కమ్మ భూస్వామి చేరదీసి గౌరవంగా ‘’బాబుగారూ ‘’అని సంబోధి౦చేవాడు .అదే సార్ధకమై అందరూ అలానే పిలిచేవారు .ఏలూరులోటికెట్ లేకుండా  కలకత్తా రైలు ఎక్కితే నర్సీపట్నంలో టికెట్ కలెక్టర్ దించేశాడు.అక్కడదిగి బీళ్ళూ కొండలు కోనలు తిరుగుతూ ,బొబ్బిలి దగ్గర కలువరాయి చేరి ,అక్కడ బ్రహ్మర్షి కావ్యకంఠ గణపతి ముని ని సేవించి ఎన్నో విద్యలు నేర్చాడు .నిష్టగా గాయత్రీ జపం చేసి మంత్రం సిద్ధుడయ్యాడు  .ఆయనది కంప్యూటర్ మేధస్సు .ఒకరోజు అకస్మాత్తుగా కలువరాయి వదిలేసి ,అరణ్యాలు క్షేత్రాలు నదీ తీరాలు యోగభూములు ,టిబెట్ బర్మా ,రంగూన్ సిలోన్ అడవుల్లో సుందర దృశ్యాలు చూస్తూ పులకిస్తూ గడిపాడు. ఇతిహాస ,పురాణ జ్యోతిష ,మంత్రం మూలికా వైద్య పాక శాస్త్రాలలో నిష్ణాతుడయ్యాడు .ఎందరెందరో మహా యోగులను దర్శించాడు .

  1930-31లో మళ్ళీ నర్సీపట్నం చేరి లంబసింగి ఆశ్రమ౦ లో స్థిరపడ్డాడు .కసర్లపూడిలో ఒక భజన సమాజం ఏర్పాటు చేసి ,ఏజెన్సీ అడవులలో ఆటవికులకు లౌకిక పారమార్ధిక విషయాలు బోధిస్తూ చాలా ఆశ్రమాలు స్థాపించాడు .భక్తులు పాకలపాడులో ఒక ఆశ్రమం నిర్మించి ఇచ్చారు .ఇందులో నిరాహారం గా చాలానెలలు కఠోర తపస్సు చేశాడు .జయపురం మహారాజు బాబుగారిని ఆస్థాన కవీశ్వరుని చేశారు .ఆటవికులకు భక్తిప్రపత్తులు నేర్పి వారి ఆరాధ్యదైవంగా ఉన్న బాబుగారు 6-3-1970సౌమ్య మాఘ బహుళ చతుర్దశి శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన 59ఏళ్ళకే  లింగోద్బవ సమయం లో సిద్ధాసనం లో కూర్చుని రామనామ జపం మూడు సార్లు చేసి రామునిలో ఐక్యమయ్యారు .

35-అవధూత -రామ చంద్ర మాలిక్ బాబా -1910-1990

కర్నూలు జిల్లా ద్రోణాచలం లో 1960లో చేరి ,నిత్యాన్నదానం తో అందరి ఆకలి తీర్చి ,విభూతితో ఆదివ్యాధులను నయం చేసి అందరినీ సమానంగా ఆదరించి ద్రోణాచల పరిసరాల్లో ఆరాధ్యుడయ్యాడు అవధూత రామ చంద్రమాలిక్  .తనపేరు రాం చందర్ అనీ తనుపుట్టింది బదరీ నాథ్ అనీ మాత్రమె చెప్పారు .ద్రోణాచలం చేరేటప్పటికి ఆయనవయసు 50కనుక 1910లో పుట్టినట్లు భావించారు .చాకిరేవు వెనక మర్రి చెట్టుకింద ధ్యానం చేస్తూ కనిపించారు .రేయింబవళ్ళు ధుని వెలుగుతూనే ఉంచేవారు .ఆబూడిదనే ప్రసాదంగా ఇచ్చేవారు .వింత లీలలు ప్రదర్శించేవారు .చిన్న చిట్కాలతో వ్యాధులు నయం చేసేవారు .డబ్బు ఖర్చు చేసి షిర్డీ వెళ్ళేవారిని  మందలించేవారు .ద్రోణాచలం మాణిక్ బాబాగా ప్రసిద్ధిపొందారు .

  20రోజులముందే శరీరత్యాగం విషయం చెప్పి ,27-2-1990 శుక్ల ఫాల్గుణ శుద్ధ విదియ మంగళవారం ఉదయం అవధూత రామ చంద్రమాలిక్ బాబా 80వ ఏట శరీరం చాలించారు .ఆయన తపస్సు చేసిన మర్రి చెట్టుకింద సమాధి చేసి ,20-4-1992న మందిరం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేసి నిత్యపూజలు చేస్తున్నారు .మాఘబహుళ విదియనుంచి అయిదురోజులు ఆరాధనోత్సవాలు జరుపుతారు వైభవంగా .సమాదినుంచే భక్తుల కోరికలు తీరుస్తారుబాబా అని నమ్ముతారు .

    సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -8

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -8

6-అసాధ్య కార్యం

అమ్మమ్మకు  అలౌకిక శక్తులతో ఉన్న పరిచయం కొంత ఉత్సాహం కలిగించి౦దినాకు .ఆమెకు పరిచయమైన  అక్కల్ట్ శక్తులున్న వారందరికీ ఫోన్ చేసి పిలిపించి,శనివారం24మందితో  మీటింగ్ పెట్టింది .హాలోఎర్త్ విశేషాలు వారందరికీ బాగున్నాయనిపించాయి .వాళ్ళ ప్రశ్నలకుసమాధానాలిచ్చాను .వెనకకూర్చున్న ఒకాయన నేను ఇక్కడే ఉంటానా ,టెలోస్ గురించి చెబుతావా అని అడిగాడు .వారందరికీ పారసైకాలజీ మీద అభి రుచి బాగా ఉన్నట్లు అర్ధమైంది .చాలామంది భూగర్భలోకం ఉందన్న విషయం నమ్మలేదు .అంతకు ముందు ఎవరూ అక్కడికి  వెళ్ళలేదా  అనే ప్రశ్న వేశారు .నేను’’ స్పిరిట్యువల్  కాన్మాన్ ‘’ అనే ఆధ్యాత్మిక మోసగాడిని కాను అన్నాను .నేను చెప్పింది సైన్స్ ఫిక్షన్ అనుకొన్నారు కొందరు .అమ్మమ్మ నన్ను బాగా సమర్ధించింది అన్ని రకాలుగా .నాకుఅదే ధైర్యం .తన పరిచయస్తులు నా యెడల అపనమ్మకం తో ఉన్నందుకు నేను వారి మధ్య అన్ పాప్యులర్ అయినందుకు  ఆమె బాధ పడింది కూడా .

  గ్రేట్ డేన్ అనే రెండేళ్ళ కుక్కటిచ్ ను పెంచుకొంటున్నాను.మేమిద్దరం మంచిస్నేహితులమయ్యాం .నేనెక్కేడికి వెళ్ళినా నా వెంట నడిచేది .అమ్మమ్మ,కయాస్  టిచ్ లకు మాత్రమె అక్కడి అనుభవాలు చెప్పేవాడిని .ఒకరోజు అమ్మమ్మ ‘’ఏరా వచ్చి మూడు నెలలయింది .ఇక్కడే ఉండాలని ఉంటె నాకు అభ్యంతరం లేదు. ఈ స్వీడేన్లు నిన్ను నమ్మరు నాయనా .నువ్వు చెప్పేదానికి సాక్ష్యం కూడా నీ దగ్గర లేదుకదా.స్వీడేన్లు ప్రూఫ్ ఉంటేనే నమ్ముతారు ‘’అన్నది నాబాధ అర్ధం చేసుకొని .’’సాక్ష్యమా ?నేను చాలనా ?’’అన్నాను .’’నీ అస్తిత్వానికి ఆధారం ఒక్క నీ పాస్ పోర్ట్ మాత్రమె కదరా .దానికి మించిన ప్రూఫ్ ఉండాలిరా అబ్బాయీ .నువ్వు ఒక ధ్యేయం అంటే మిషన్ తో కర్తవ్యమ్ తో వచ్చావు .నేను నీకు సహాయం చేయాలి. ఆపని మీదే ఉన్నాను ‘’అన్నది .

 కుక్కతో లాంగ్ వాక్ లు చేస్తున్నాను .ఒకసారి ఒక అడవిలోకి వెళ్లాను .నాకు ఎవరో సాయం చేయాలి .మాన్యుల్ మాత్రమె దిక్కు అనిపించి అతడిచ్చిన  విజిల్ ఊదాను .వెంటనే మాన్యుల్ వచ్చేశాడు .సమస్య ఏమిటని అడిగాడు .’’నేను ఇక్కడ ఉండాలా అగర్తాకు వెళ్ళాలా అనే సందేహం లో ఉన్నాను ‘’అన్నాను .టిచ్ తిరిగి వచ్చింది .ఈసారి నాతొ దాన్ని కూడా టెలోస్ కు తీసుకురమ్మన్నాడు .’’ఇదేనా నీ సమస్య .దీనికి పరిష్కారం నువ్వే చూసుకోవాలి నేను సలహ ఇవ్వను .నీ అంతరాత్మ ఏ నీకు సలహా ఇస్తుంది అడుగు .కామన్ సెన్స్ ఉపయోగించు కాని ఎమోషన్స్ లో  కొట్టుకుపోకు’’అన్నాడు. ధాంక్స్ చెప్పాను .అంతలో అతడు వెళ్ళిపోయాడు .టిచ్ కి అతడు అదృశ్యమయ్యాడన్న ఫీలింగ్ లేదు .గబగబా ఇంటికి చేరాం .

  నేను కారుకొనలేదు అమ్మమ్మ ఆడి కారునే వాడుతున్నా .నా సియాటిల్  స్వీట్ హోమ్ మీద గాలి మళ్ళింది .నాకు ఎన్నిళ్ళున్నాయి . తమాషా గా ఉంది ఈ ఆలోచన .కయాస్ ను కలవటానికి డిజూరా వెడుతున్నా అమ్మమ్మ ఆడి కారులో అతి వేగంగా .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—15 29యోగి రాజు -మాదిరాజు వెంకట అప్పారావు -1859-1935

మనకు తెలియని మహాయోగులు—15

29యోగి రాజు -మాదిరాజు వెంకట అప్పారావు -1859-1935

కవి రాజు ,రాజయోగి మాది రాజు వెంకట అప్పారావు గుంటూరు జిల్లా మునుమాక లో కాశ్యపస గోత్రీకులైన నియోగి బ్రాహ్మణ భక్తులు ,నిష్టా గరిష్టులు వెంకమాంబ ,లక్ష్మీ నారాయణ దంపతులకు 23-7-1859 సిద్ధార్ధి నామ సంవత్సర ఆషాఢ బహుళ అష్టమి శనివారం జన్మించాడు .ఉపనయనం జరిగి తొమ్మిదవ ఏటనే వేదాధ్యయనం మొదలు పెట్టాడు .18వయేత తండ్రి చనిపోవటం తో ,ఖమ్మం కోర్టులో వాది ,ప్రతి వాదులకు తెలుగు,ఉర్దూ భాషలలో కాగితాలు రాసిస్తూ ,వచ్చే కొద్ది ఆదాయంతో జీవితం గడిపాడు .తర్వాత చి౦తిరేల పోస్ట్ మాస్టర్ గా ఉద్యోగం వస్తే చేరాడు .అక్కడ వేదాంత విద్యా విశారదుడు రాళ్ళబండి నరసింహ శాస్త్రి గారి తో పరిచయమై ,వేదాంత గ్రంథాలు అధ్యయనం  చేస్తూ , చర్చలు చేసేవాడు .ఉద్యోగం లో అకారణం గా నిందకు గురై ,విచారణలో తాను  నిర్దోషి అని రుజువు అయినా కూడా,విరక్తి చెంది ,తల్లిని మేనమామ ఇంటికి పంపేశాడు .

  నరసింహ శాస్త్రి గారితో కలిసి అప్పారావు హైదరాబాద్ వెళ్లి ,అక్కడ ‘’పీల్ఖానా శంకర ప్రభు ‘’ను దర్శించగా ,ఆయన పంచ ముద్రలు ,అష్టాంగ యోగం బోధించి ,శ్రీశైలం లో నిర్జన ప్రదేశం లో సాధన చేయమని ఆదేశించాడు .శ్రీ శీలం చేసి శ్రీ భ్రమరాంబా ,మల్లికార్జునులను దర్శించి ,నిర్జన ప్రదేశం లో తపస్సు చేశాడు .కొంతకాలం గడిచాక పీల్ఖానా ప్రభువు అప్పారావు ను పిలిపించి ,ఆహారం తినమని చెప్పి ‘’అచల జ్ఞానం ‘’బోధించారు .త్రివిధ దీక్షలు ,త్రివిధ ప్రసాదాలు అనుగ్రహించి ,జీవ బ్రహ్మైక్య సంధానం చేశారు .ద్వాదశీ ,షోడశీ మంత్రోప దేశం చేసి ,పునర్జన్మ లేని మార్గం చూపించారు .సన్యాసం వద్దనీ ,రాజయోగమే మార్గమని బోధించి ,పెళ్లి చేసుకొని ,సంసారం చేస్తూ తల్లికి సంతోషం కలిగించమని హితవు చెప్పారు .అలాగే ఇంటికి వెళ్లి వివాహం చేసుకొని ,మళ్ళీ శంకర ప్రభు గారిని కలిశాడు .ఇంటి పేరును మాధవ రాజుగా ,పేరును  వెంకటేశ్వర దాసుగా మార్చుకోమన్నారు .అప్పటినుంచి మాదిరాజు వెంకట అప్పారావు మాధవరాజు వెంకటేశ్వర దాసుగా పిలువబడ్డాడు .

  శంకర ప్రభు సిఫార్సు చేసి రెవిన్యు ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పించారు వెంకట దాసుకు .ఖమ్మం లోనే ఉంటూ ఉద్యోగం చేశాడు .తన ఆధ్యాత్మిక ప్రగతికి ఉద్యోగం అడ్డంకిగా ఉందని భావించి వదిలేసి ,చెక్ పోస్ట్ లో’’ కరోడ్గిరీ మాస్టర్’’ గా చేరి ,క్రమంగా పదోన్నతులు పొందుతూ ,తిరిగి చింతిరేల చేరాడు .కొన్నాళ్ళకు ఈ ఉద్యోగమూ వదిలేసి గురు సన్నిధి చేరాడు .

  శంకర ప్రభు కటాక్షించి ‘’పరిపూర్ణ జ్ఞానానంద దేశిక ‘’అనే సార్ధక బిరుదు ప్రదానం చేసి మంత్రం దీక్ష ఇచ్చే అధికారం కలిగించారు అప్పారావు కు .1900లో కూతురు పెళ్లి చేసి ‘’భాక్తానంద సాగరం ‘’అనే గ్రంథం రచించాడు .శిష్య బృందం పెరిగారు .వేమవరం లో స్థిరపడి సహజకవి అప్పారావు ,’’జ్ఞానామృతం ‘’,’’సీతా కల్యాణం ‘’పుస్తకాలు అనేక భక్తీ వేదాంత గ్రంథాలు రాశాడు .అద్భుతాలు ,మహిమలు ప్రదర్శించేవాడు.కొంతకాలం తర్వాత పక్షవాతం వచ్చి తగ్గింది .27-8-1935 యువ నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య మంగళవారం సాయంత్రం 4గంటలకు76వ ఏట కవి రాజు యోగిరాజు మాదిరాజు వెంకట అప్పారావు సహస్రారం చేదించుకొని బ్రహ్మైక్యం చెందారు .అప్పటినుండీ నవరాత్రి ఉత్సవాలు భవానీ చంద్ర శేఖర కల్యాణం ,శ్రీవారి ఆరాధనోత్సవాలు నిరంతరం వైభవంగా జరుగుతున్నాయి .

30-పేరంటపల్లి బాలానంద స్వామి -1900-1976

కేరళ రాజకుటుంబం లో బాలానంద స్వామి 1900లో జన్మిఛి ఉండవచ్చు నని భావిస్తారు .ఎప్పుడూ ఏకాగ్రతా సాధనలో ఉండటం వలన విశ్వ మాతసాక్షాత్కారం పొందారు .వివేకాన౦దస్వామి రచించిన ‘’మై మాస్టర్స్ ‘’పుస్తకం చదివి,దివ్యానుభూతి సాధించాలనే లక్ష్యం తో ఏకాగ్రతతో భగవత్ దర్శనం కోసం పరితపింఛి ,పరి వ్రాజకులై దేశ సంచారం చేశారు .1925లో పోచవరం ప్రాంతంలో ఒక రోజు రాత్రినిద్రిస్తున్న ఆయనను  ఆజానుబాహువైన ఒక శ్యామలాంగి తనతో ,పెద్ద పెద్ద చెట్లు ,పొదలు డొంకలు ఉన్న చోటుకు తీసుకు వెళ్లి వదిలేసి  అంతర్ధాన మైంది .తెల్లారి లేచి చూసేసరికిస్వామికి పానవట్టం తో ఉన్న శివలింగం కనిపించింది .ప్రక్కనే ఉన్న సెలయేటిలో స్నానం చేసి ,లింగానికి అభి షేకం చేసి ,అక్కడే ఆశ్రమం నిర్మించి  కొంతకాలం తపస్సు చేశారు  .

   తర్వాత భద్రాచలం వెళ్లి అక్కడి శివాలయం లో నాలుగు నెలలు మౌనంగా తపస్సు చేశారు అనేక సార్లు దివ్యానుభూతి, శబ్ద బ్రహ్మాను భూతి కలిగాయి.కూనవరం దగ్గర మందారం లో శ్రీ రామకృష్ణ పరమహంస సశరీరంగా ప్రత్యక్షమై ,అనేక వేదాంత రాజకీయ,వేదకాలం నాటి సమసామాజిక  ఆదర్శాలు , ధర్మాలు బోధించారు .అదే ఆదేశంగా భావి౦చి పేరంటపల్లి చేరి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ,స్వామి ఆ ఆదర్శాలను ప్రచారం చేస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేయటం ప్రారంభించారు  .ఆశ్రమం లో శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ రామతీర్దుల చిత్ర పటాలను పెట్టి నిత్య పూజ చేసేవారు .

  పేరంటపల్లి ఆశ్రమానికి ‘’శ్రీ రామ కృష్ణ ముని వాటం ‘’అంటారు .12సూత్రాలతో ఆశ్రమ నియమావళి రూపొందించారు బాలాస్వామి .కొంతకాలం ఆశ్రమ౦ వదిలేసి ,పైన ఉన్న కొండపై చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని ధుని వెలిగించి తపస్సు చేశారు . శ్రీ కృష్ణుని  దివ్య దర్శనం లభించి౦ది .ఇంగ్లీష్ భాషలో అరడజను ఆధ్యాత్మిక గ్రంథాలు రాశారు .స్వాతంత్ర్య ఉద్యమానికి తోడ్పడ్డారు .దీన జనులకు చేయూత కలిగించారు. సమాజాభి వృద్దికి తోడ్పడ్డారు .15-1-1976రాక్షస నామ సంవత్సర పుష్య శుద్ధ త్రయోదశి గురువారం ఉదయం 4గంటలకు 76 వ ఏట బాలస్వామి చైతన్యం విశ్వ చైతన్యం లో లీనమైంది .మర్నాడు పేరంటపల్లిలో సమాధి  చేశారు .భక్తియోగి కర్మయోగియై ,ప్రకృతిని సేవించే ప్రకృతి యోగియై ,జ్ఞానయోగియై ,బాలయోగి విశ్వచైతన్యం లో లీనమయ్యారు .ఏటా అక్కడ ఆరాధనోత్సవాలు జరుగుతాయి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -7 4-సియాటిల్ లో విషాదం -2

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -7

4-సియాటిల్ లో విషాదం -2

  ఆంటీ అన్నంతపనీ చేసింది .ఒక మధ్యవయసు అందమైన అమ్మాయి న్యూస్ పేపర్ రిపోర్టర్ గా వచ్చి పలకరించింది .నేను చెప్పిందంతా జాగ్రత్తగా వింటూ పాయింట్లు నోట్ చేసుకొంది.నా బాల్యం గురించి అడిగింది .నేను మాత్రం టెలోస్ గురించే ఎక్కువ చెప్పాను .కొన్ని రోజుల్లోనే పేపర్లో నాఫోటో నేను చెప్పిన విషయాలూ అన్నీ వచ్చి నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది .పేపర్ లో నేను తిరిగి వచ్చిన స౦గతి చదివినవారు ఫోన్లు చేయటం మొదలుపెట్టారు .నా ముఖ్య స్నేహితుడు ఫోన్ చేసి త్వరలో వచ్చి కలుస్తానని చెప్పాడు .అతడు డెంటిస్ట్ నన్ను డిన్నర్ కు రమ్మన్నాడు .అతడికి పెళ్లి అయి ఒకచిన్న కూతురు కూడా ఉంది .వెంటనే వెళ్లి మాట్ ను హత్తుకున్నాను ఆనందం తో .ఎర్రజుట్టు ఉ౦డేదికనుక ‘’రెడ్ మాట్’’అనే వాళ్ళం .అతని భార్య ప్రెగ్నంట్ అందంగా ఉంది .అతనిది విశాలమైన ఇల్లు గార్డెన్ .మా ఇంట్లో ఉన్నట్లే ఫీలింగ్ కలిగింది అక్కడ .ఈమూడేళ్ళూ ఏమైపోయావని అడిగాడు .భోజనాలయ్యాక తీరిగ్గా చెప్పుకొందాం, అయినా నువ్వు నమ్మకపోవచ్చు అన్నాను .అతడి కూతురు నా పక్కనకూచుని శ్రద్ధగా వింటోంది .మా పడవ మునకకు ముందే మాట్ పెళ్లి చేసుకొన్నాడు .అతడిభార్య నాన్సీ భోజన౦ రెడీ ,రమ్మని చెప్పింది .కూతురు ఎలినార్ చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లాను .అ చిన్నారి ‘’నీవెనక పొడవైన ఆయన నిలబడి ఉన్నాడు  నీ ఫ్రెండ్ట.పేరు చెప్పన్నన్నాడు .నువ్వు స్వీడిష్ కదా ‘’అంది .’’అవును సగం స్వీడిష్ ,సగం అమెరికన్ .నాన్సీ వంట బాగా చేసింది రుచిగా ఉన్నాయన్నీ .మాట్’’మీ అమ్మమ్మ కు నువ్వు బతికి ఉన్నట్లు తెలుసా ??అన్నాడు .ఏం చెప్పాలో తోచలేదు అమ్మమ్మ అంటే నాకు మహా అభిమానం ఆమెకూ అంతే.రేపే వెళ్లి అమ్మమ్మను చూసిరమ్మన్నాడు మాట్.నా కథంతా మాట్ కు వివరంగా చెప్పాను .చివర్లో అతని భార్యకూడా వచ్చి విన్నది .నమ్ముతావా నేను చెప్పింది అంటే నిన్ను నమ్ముతాను అన్నాడు .రేపు ఆదివారం కనుక  పొద్దున్న పదింటికి వస్తాను ఇద్దరం కలిసి వాకింగ్ చేస్తూ మాట్లాడుకొందాం అన్నాడు .

5-స్వీడెన్ ట్రిప్

అనుకోన్నట్లే అమ్మమ్మా వాళ్ళ ఇంటికి వెళ్లాను .అమ్మమ్మ ఆనందంగా ‘’టిం నువ్వేనా ‘’అని ఆశ్చర్యానందాలతో ఆహ్వానించింది ‘’నాన్నా ఒక్కగానొక్క మనవడివి ఇంతకాలం ఎందుకు ఫోన్ చేయలేదురా’’అనగా ‘’నేనే అమ్మమ్మా నీ టిం నే’’అన్నాను .అమ్మమ్మతో గడిపి నాలుగేళ్ళు దాటింది ఇలా ఆలోచనలు సాగాయి నాలో ..ఇంతలో మాట్ వచ్చాడు ఇద్దరం నడుస్తున్నాం ‘’నువ్వు చెప్పింది అంతా నమ్ముతున్నాను .మానవాతీతులు౦టారని నమ్మతున్నాను’’అన్నాడు .ఒక నిమ్మ చెట్టు దాటి వెడుతూ ఉంటె దానికొమ్మ నా చేతిలోకి వచ్చి ఆశ్చర్యం కలిగించింది .’’నువ్వు మంత్ర గాడివా ‘’   అన్నాడు మాట్.నాకూ ఆశ్చర్యంగా ఉందన్నాను .రేపు పొద్దునే స్వీడెన్ వెడుతున్నాను అని చెప్పాను .’’నీకు టెలిపోర్ట్ లేకపోతె నేను వచ్చి ఎయిర్ పో ర్ట్ కు నా కారులో తీసుకు వెడతాను ‘’అన్నాడు నవ్వుతూ .మర్నాడు నేను ప్లేన్ ఎక్కి స్వీడెన్ చేరి టాక్సీ లో ఫ్లోడా లోని అమ్మమ్మగారింటికి వెళ్లాను .రెండు చేతులు జాపి నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి అక్కున చేర్చుకొన్నది అమ్మమ్మ .బతికి ఉన్న ఒక్కగానొక్క బంధువు అమ్మమ్మ ‘’నువ్వు బతికున్నావ్ బతికున్నావ్ నాయనా .మీ అమ్మ ఎక్కువ దుఖం తో చచ్చిపోయింది అంది చెక్కిళ్ళమీద నుంచి కన్నీరు కారుతుండగా  .

‘’ఎమైయ్యావురా ఈ మూడేళ్ళూ ఫారిన్  బ్రోతల్  లో గడిపావా “”అంది నవ్వుతూ .నేను మూడేళ్ళూ భూగర్భలోకం లో ఉన్నానని వివరాలన్నీ చెప్పాను ‘’చాలా తమాషాగా ఉందిరా అబ్బాయ్ .భూమిలోపల మనుషులు ఉంటారని వినేదాన్ని .నువ్వు చూసే వచ్చావన్నమాట .నీకు గుర్తున్నవన్నీ పూసగుచ్చినట్లు చెప్పు నాయనా వింటాను ‘’అన్నది ఉత్కంఠ ఆపుకోలేక .అన్నీ చెప్పీ చెప్పీ అలసిపోయాను .అమ్మమ్మ నా రెండు చేతులు తన చేతుల్లోకితీసుకొని ఆప్యాయత చూపింది ‘’అమ్మమ్మా నువ్వు తప్పఎవరూ నమ్మలేదు ‘’అన్నాను ‘’’మనం నమ్మించేట్లు చేయాలి నాయనా ‘’అన్నది గ్రాండీ .రేపు ఆలోచించచ్చు లే అనుకోని డిన్నర్ కి కూర్చున్నాం.’’నీ బావమరిది మాత్రం నమ్మడురా .వాడు వి౦త మనిషి నీ చెల్లెలు ఎలా వాడి వలలో పడిందో తెలీడు ‘’అన్నది .భోజనాలయ్యాక ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చున్నాం .అమ్మమే చెప్పటం మొదలు పెట్టింది ‘’నా గురించి ఎప్పుడూ నీకు చెప్పలేదు .నేను మధ్యతరగతి దానిని. ఐతే అందరికి సాయం చేస్తాను .అందుకే నేనంటే అందరికి గౌరవం .ఇతర ప్రపంచాలగురించి వాళ్లకు బోధిస్తూ ఉంటాను .వాళ్ళ అంతరాత్మలను శోధించుకోమని సలహాలిస్తాను .వాళ్ళ హృదయాలను వింటాను. వాళ్ళ మనసులను సరిచేస్తాను ‘’అన్నది అమ్మమ్మ .’’వాళ్ళ కార్డ్స్ అంటే జాతకాలు చూసి చెబుతావా ??’’అన్నాను .’’కాదు  వాళ్ళ కళ్ళల్లోకి చూసి చెబుతా .  వాళ్ళ పెదిమలు చెప్పలేనివి  కళ్ళు చెబుతాయి .వాళ్ళ ఆరా అంటే చుట్టూ ఉండే కాంతి చక్రం బాగా సహాయకారిగా ఉంటుంది .లేకపోతె నాక్తుర్నల్ అంటే రాత్రి స్నేహితులు సాయం చేస్తారు .వాళ్ళు పగలుకూడా నాకు కనిపిస్తారు .ఐతే నేను ట్రాన్స్ లో ఉండాలి. ఉంటే కనిపిస్తారు .నాకుఒక స్పిరిట్ గైడ్ గా అనేక  జన్మల నుంచీ ఉన్నాడు తెలుసా నీకు .అతడితో మాట్లాడుతా .అతడిమాటలు వి౦టానుకూడా ‘’అంది .జీజెసా ‘’?అన్నాను .నవ్వి ‘’కాదు .ఆయనతో చాలామది కాంటాక్ట్ లో ఉంటారు. కానీ నా గైడ్ పేరు ‘’మెల్చి జెడెక్’’అన్నది .’’మంచి గైడ్ అతడు .అతడు పైస్థాయి మాస్టర్ .బుద్ధినుంచి  ఏర్పడిన వాడు ‘’అన్నాను .’’నాకు తెలుసు .తమాషా వ్యక్తీ బుద్ధిజీవి ఆల్కమిస్ట్ కూడా .అబ్రహాం కు టీచర్ .ఇప్పుడు నాకు గురువు ‘’అంది నవ్వుతూ కాన్ఫిడెంట్ గా అమ్మమ్మ ‘’’నిజమే ఆయన్ను చూస్తావా ‘’?అన్నాను. ‘’నా లోదృష్టితో చూస్తాను .నాకు చాలాబోధించాడు .నాకు కుటుంబ క్షోభ కలిగినప్పుడు  నన్ను ఓదార్చాడు .అతడే నిన్నుకూడా రక్షించి ఉంటాడు .నాకు చెప్పటానికి అతడికి ధైర్యం లేకపోయింది .ఎవరి దయవల్లనైనా కానీ నువ్వు బతికి బట్టకట్టి మళ్ళీ నాకు కనిపించి, నా మనో వ్యధను తీర్చావు సంతోషం నాయనా ‘’అంది అమ్మమ్మ డగ్గుత్తికతో .అమ్మమ్మ చెప్పిన దాన్నిబట్టి ‘’హై మాస్టర్స్ ‘’ఉంటారన్న నానమ్మకమూ బలపడింది.అమ్మమ్మ నాకొక డైరీ ఇచ్చింది అది ఈ భూమిపైనాకు ఒక సాధనం గా ఉపయోగపడుతుంది .

     సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—14 27-లింగాల దిన్నె బ్రహ్మస్వామి -1820-1889

మనకు తెలియని మహాయోగులు—14

27-లింగాల దిన్నె బ్రహ్మస్వామి -1820-1889

తమిళనాడు సేలం జిల్లా సదాపేట లో కౌ౦డిన్యస గోత్ర వెలనాటి వైదిక బ్రాహ్మణులునుదురుపాటి  లక్ష్మీ నరసయ్య ,గున్నమ్మ దంపతులకు 1920లో నరసయ్య పుట్టాడు .బాల్యం లో సేలం కొండపై జరిగే లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు సమారాధనలకు స్నేహితులతో కలిసివెల్లి ,ఒకగుహలో ఉన్నయోగి దయకు పాత్రుడై శ్రీ లక్ష్మీ నరసింహ మహా మంత్రాన్ని ఉపదేశంగా పొందాడు .ఆయన ఉపదేశించినట్లు కళ్ళు మూసి తెరిచేలోపు కాశీకి చేరి ,అక్కడే ఆ మంత్రాన్ని దీక్షగా జపించాడు .మహిమలెన్నో చూపి,25 ఏళ్ళకే  బ్రహ్మస్వామిగా గుర్తింపు పొందాడు .

   బ్రహ్మస్వామి కీర్తి దేశమంతటా మారుమోగింది .పుష్పగిరి పీఠాథిపతి శ్రీశంకర భారతీ స్వామి సగౌరవంగా బ్రహ్మస్వామిని ఆహ్వానించి ,తూగుటుయ్యాలపై ఊగించి ఇష్టాగోష్టి జరిపారు .తొడుగుపల్లె అగ్రహారం లో బ్రహ్మస్వామి ఒక బావి త్రవ్వించి ఆ బావి నీటిని కాశీ గంగ గా చెప్పారు .ఇప్పటికీ జనం గంగాజలంగా పవిత్రంగా భావిస్తారు .ఒక భక్తుడు స్వామిని పరమేశ్వరూపంగా భావించి నిర్మల భక్తితో పూజిస్తే లింగాకారం లో సాక్షాత్కరించారు .

  బ్రహ్మ స్వామి 32లక్ష్మీ నరసింహ సాలగ్రామాలను బంగారు మూతతో సహా ధరించేవారు అవిచ్చిన్నంగా అన్నదానాలు జరిపేవారు .కవులు,పండితులు  కృతులు రాసి స్వామికి అంకితమిచ్చారు .75ఏళ్ళు నిండగానే దేహం చాలిస్తున్నట్లు ప్రకటించి 13-10-89వికృతి భాద్రపద అమావాస్య సోమవారం బ్రహ్మ  రంధ్ర ఛేదనం చేసుకొని బ్రహ్మానందస్వామి బ్రహ్మైక్యం చెందారు .లింగాల దిన్నె శివాలయం లో ఆయన సమాధి నిర్మించి ,దానిపై శివ లింగం ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేసి పూజిస్తున్నారు .ఆయన గతించి నూరేళ్ళు దాటినా నేటికీ ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు .స్వామి వారి వెండి పాదుకలు ,,మేనా దర్భాసనం ,చిత్రాసనం రుద్రాక్షమాల ,చిత్రపటం దేవాలయం లో పూజల౦దు కొంటున్నాయి .

28-లద్ద గిరి రామ దాసు  -1833-1893

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం హ౦ద్రీనది ఒడ్డున ఉన్న లద్దగిరి కి 30ఏళ్ళ వయసులోఉత్తర భారతం నుంచి  1833లో రామదాసు చేరి లద్దగిరి రామ దాసుగా ప్రసిద్ధి చెందాడు .జి౦కచర్మం పై కూర్చుని తపస్సు చేస్తూ అవసరమైతే దాన్నే కప్పుకోనేవాడు .అందరినీ సమానంగా ఆదరించేవాడు .బాధితుల కస్టాలు తీర్చేవాడు .

  ఒక వర్షాకాలం లో కుంభ వృష్టి కురిసి ,కొండ చరియలు విరిగి రామదాసు హంద్రీ నదిలో పడి కొట్టుకు పోయి నీటిలో మునగకుండా నీటిపై తేలుతూ సమాధి నిష్టలో కనిపించి ఆశ్చర్యం కలిగించాడు .లయ ,హఠ యోగాలు రామ దాససామికి స్వాదీనమయ్యాయి .నిరంతర రామనామ జపం చేసేవారు .జలస్తంభన విద్యలో ఆరితేరారు .వింత చర్యలతో సూచనలతో రాబోయే ప్రమాదాలు తెలియ జేసేవారు .ప్రజలలో శాంతి సుహృద్భావం కలిగించి జ్ఞానమార్గం లో నడిపించారు .

  తన శరీర త్యాగాన్ని 5 నెలల 10రోజులు ముందుగానే తెలియజేసి .60ఏళ్ళు నిండాక ఆరుమాసాలతర్వాత తన సమాధిని తెరచి చూడమని ఆదేశించి 5-12-1893 విజయనామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి గురువారం దేహం చాలించారు రామదాసస్వామి .స్వామి చెప్పిన చోటనే ఊరి బయట సమాధి చేశారు . ఆరు నెలల తర్వాత సమాధి తెరచి చూడగా ,స్వామి నిద్రలో ఉన్నట్లే కనిపించి ,చిరు నవ్వుతో కళ్ళు తెరచి మూడు సార్లు ఓంకారం పలికి కళ్ళు మూసుకొని శాశ్వత సమాధి చెందారు .స్వామి సమాధి నేటికీ భక్తులకు కల్పవృక్షంగా ఉంటూ మనోభీష్టాలను నెరవేరుస్తోంది .మూడేళ్ళ తర్వాత భక్తులకు కనిపించి ,తన సమాధిపై మందిరం నిర్మించమని ఆదేశించగా ,ఆలయ నిర్మాణం చేశారు .ప్రతియేటా కార్తీక బహుళ ఏకాదశి ద్వాదశి నాడు ఆరాధనోత్సవాలు ఘనం గా చేస్తారు .మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయ భాస్కర రెడ్డి స్వామివారికి వెండి రథం చేయించి 1953లో సమర్పించారు .అప్పటినుంచీ రథోత్సవంకూడా వైభవంగా చేస్తున్నారు .ఆప్రాంత ప్రజలు స్వామిపేరునే తమపిల్లలకు పెట్టుకొంటారు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -6 4-సియాటిల్ లో విషాదం

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -6

4-సియాటిల్ లో విషాదం

మౌంట్ శాస్తా దిగటం గుర్తులేదుకాని అక్కడ మోటేల్స్, షాపులు కనిపించాయి .అక్కడనుంచి బస్ లో బయల్దేరి దగ్గరున్న ఎయిర్ పోర్ట్ చేరి సియాటిల్ కు వెళ్ళే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను .అమ్మా చెల్లీ జ్ఞాపకం వచ్చి కన్నీళ్లు చెంపలపై జారాయి .నేను ఇల్లువదిలేనాటికి మా చెల్లి కి17ఏళ్ళు .అమ్మ రూపం మనసులో కనిపిస్తూనే ఉంది .నా కుటుంబమే నా సర్వస్వం దాన్ని వదిలి చాలాకాలం ఉండిపోవాల్సి వచ్చింది .ఇంటికి చేరుతున్నానన్న ఆనందం .ఫ్లైట్ లో ఇచ్చిన ఆహారం తిన్నాను .సియాటిల్ నాకు బాగా తెలుసు .ఎయిర్ పోర్ట్ కోస్ట్ కు దగ్గరలోనే ఉంటుంది .ఫ్లైట్ దిగి ఈల వేసుకొంటూ టాక్సీ ఎక్కి ఇంటికి బయల్దేరాను .

  ఇంటికి చేరి బెల్ కొట్టి తలుపు హాండిల్ ముద్దుపెట్టుకొన్నాను .ఇలా నేనూ మా చెల్లెలే చేస్తాం .మళ్ళీ బెల్ కొట్టాను .ఎవరినుంచీ సమాధానం లేదుఇంట్లో .అమ్మా చెల్లీ బయటికి వెళ్లి ఉంటారు .నాదగ్గర తాళం చెవి లేదు .అప్పుడొక  స్త్రీ గొంతు  వినిపించింది గుర్తుపట్టాను .అది ప్రక్కింటి బిగ్ టిల్లీఆంటీ గొంతు .వెనక్కితిరిగి చూస్తే ఆమె కనిపించింది ..’’టిమొతీ బ్రూకేనా ? నువ్వు మునిగిపోలేదా ?దెయ్యానివా ?’’అంది ఆశ్చర్యంగా . ‘’నేను బతికే ఉన్నా. అందరూ మునిగి చనిపోయారు .మా వాళ్లకు కబురు అందించే అవకాశం కుదరలేదు .మా అమ్మావాళ్ళు ఎక్కడున్నారో తెలుసానీకు ఆంటీ ‘’అన్నాను .ఆమె అమాంతంగా వచ్చి నన్ను దగ్గరకు తీసుకొని కన్నీరు కార్చింది .’’నాయనా నువ్వు వెళ్లి మూడేళ్ళయింది .మీ అమ్మా చెల్లీ చనిపోయారు .మీ చెల్లి  రహస్యం గా పెళ్లి చేసుకొని ,ఈ వార్తకు ముందు ,ఆరునెలల్లో పిల్లను కని  చనిపోయింది .షిప్ రెక్ వార్తవిని మీ అమ్మ దిగులుతో జబ్బుపడి కొన్ని నెలలకే చనిపోయింది .కుటుంబాన్ని అ౦తటినీ పోగొట్టుకొన్న దుఖంతోనే ఆమె చనిపోయింది ఇల్లు బేరం పెట్టారు .కాని అమ్మలేదు .కనుక ఇల్లు నీదే .మీ బావ బెర్టీ వాంకోవర్ లో ఉంటున్నాడు .బహుశా మళ్ళీ పెళ్లి చేసుకొని ఉంటాడు ‘’అన్నది .’’మీ అమ్మ లాయర్ అడ్రస్ నా దగ్గర ఉంది .ఆయనదగ్గర మీ అమ్మ విల్లు ఉండి ఉంటుంది .నేను టీ తెస్తాను .ఇక్కడే ఉండి నీ పనులన్నీ చూసుకో ‘’అని లాలనగాచేప్పింది .టిల్లీ ఆంటీ ఎంతో దయగా మాట్లాడి నాకు ఊరట కలిగించింది .ప్రపంచం లో ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు .ఒంటరి వాడిని అనిపించింది .

  ఆంటీ ఫోన్ చేసి లాయర్ కు చెప్పింది .నేను కీస్ కోసం టాక్సీ చేసుకొని ఆయన ఇంటికి వెళ్ళాను  .ఆయన వారసుల సంగతి  తేలేదాకా ఇల్లు అమ్మకం కుదరదని ఆపేశానని చెప్పాడు .సాక్ష్యాలు వగైరాలకోసం ఆయన ఇబ్బందిపెట్టలేదు .ఆంటీ మాట పై నమ్మకం తో నేనే వారసుడినిఅని గ్రహించాడు .అమ్మయ్యా నాకు నిలవ నీడ దొరికింది అని అనుకొన్నాను .కీస్ తీసుకొని ఇంటికి వచ్చాను .నా బెడ్ రూమ్ అంటా దుమ్మూదూళీతో ఉంది .ఆంటీ హారీ దంపతులు ఎంతో ప్రేమ చూపారు .మా కుటుంబం  పొందిన విషాదాన్ని మరచి పోయే ప్రయత్నంచేశారు .నన్ను వ౦ట చేయనివ్వలేదు. మంచి ఆహారపదార్ధాలు వాళ్ళే వండి తెచ్చి తినిపించేవారు .టెలోస్ లో    శాకాహారం అలవాటయింది కనుక ఇక్కడ  మాంసం తినబుద్ధికాలేదు .వాళ్ళు తెచ్చింది ఫోర్క్ లేక బీఫ్ అయితే బయటపారేసేవాడిని .అమ్మా వాళ్ళ సమాధులు చూడాలని పించి చూశాను .ఆంటీనా బట్టలుకూడా ఉతుకుతోంది .సడన్ గా  వచ్చి ‘’నీ స్నేహితులున్నారుగా .ఉండు నేను లోకల్ పేపర్ వాడిని అడిగి వాళ్లకు ఫోన్ చేసి నువ్వు వచ్చావని చెబుతాను ‘’అన్నది .బానే ఉందికాని వాళ్ళను చూడాలని నాకు లేదు .నేను టెలోస్ విషయాలు ఆంటీ అంకుల్ కు చెప్పాను అ౦కుల్ పగలబడి నవ్వాడు .ఆ౦ టీనుంచి రియాక్షన్ లేదు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—14

మనకు తెలియని మహాయోగులు—14

27-వెంకయ్య స్వామి -1887-1982

1887లో నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం ఆత్మకూరుతాలూకా ,నాగురి వెల్లటూరు లో సోంపల్లి పిచ్చమ్మ ,పె౦చ లయ్యనాయుడు కమ్మ దంపతులకు వెంకయ్య స్వామి పుట్టాడు .బాల్యం నుంచే అడవుల్లో ఏకాంతంగా తిరిగేవాడు . షిర్డీ సాయిబాబా ఒక సాధువు రూపం లో వచ్చి అతడి నాలుకపై బీఆక్షరాలు రాసి వెళ్ళగా అవధూత వెంకయ్యస్వామి గా ఆరాధనలు అందుకొన్నాడు .గ్రామాలు తిరగటం ,ప్రతి చోటా ధుని వెలిగించటం చేసేవాడు. బొటన వ్రేలుపై సిరా తో అద్ది తెల్లకాగితం పై ముద్రవేసి ప్రసాదంగా అందించేవాడు .చెడు లక్షణాలున్నవారిని కులహీనులుగా, సద్గుణాలున్న వారిని బ్రాహ్మణులుగా భావించేవాడు .చేతి స్పర్శతో అన్నం ఔషధంగా మారి రోగాలు మాన్పించేది .అతి పేదగా జీవిస్తూ ఆశ్రితులకు సిరులు ఇచ్చేవాడు .తాను  ఎక్కడికీ పోననని ,వారిమధ్యనే ఉంటానని ,పిలిస్తే పలుకుతాననీ చెప్పేవాడు .24-8-1982న 95ఏళ్ళ వయసులో అవధూత గొలగమూడి వెంకయ్య దేహం చాలించారు .అంతకు ముందురోజు ‘’సంపన్నత్వం ,సాధారణత్వం ,సద్గురు సేవ’’అని చాలాసార్లు స్వామి అనటం అందరూ విన్నారు .అదే ఉపదేశంగా భావించి అనుసరిస్తున్నారు .

28-నిత్యానంద స్వామి -1905-1959

రామానుజ మతావలంబులైన కమ్మ దంపతులు అప్పాస్వామి నాయుడు ,రుక్మిణీ అమ్మాళ్ లకు తిరునల్వేలి జిల్లా కోయిల్ పట్టి లో 2-11-1905 విశ్వావసు కార్తీక శుద్ధపంచమి ద్వితీయ సంతానం గా రంగనాథ స్వామి పుట్టి తర్వాత నిత్యానందస్వామిగా కీర్తి పొందాడు.ఊరిలోనే 8వ క్లాసు వరకు చదివి ,తల్లి పూజలో చేసే ప్రాణాయామం అభ్యాసం చేస్తూ ఉంటె ,ఒక రోజు కలలో ఒక సిద్ధ పురుషుడు కనిపించి తలపై చేయిపెట్టి ప్రాణాయామం నేర్పి అదృశ్యమయ్యాడు .దీక్షగా కొనసాగించాడు .

   విమలానందుని పరీక్షలలో నెగ్గి శిష్యుడై , 15వ ఏట తల్లి అనుమతితో   సన్యసి౦చాడు . రమణమహర్షి ఆశ్రమం లో కొంతకాలం గడిపి ,మద్దికెర లో విమలానందుని  ఆశ్రమం లో స్వామికి శుశ్రూష చేస్తూ గీతారహస్యాలు యోగరహస్యాలు గ్రహించాడు .16ఏళ్ళు అక్కడే ఉండి అనేక పరీక్షలకు తట్టుకొని చిన్నస్వామిగా గుర్తింపుపొంది  విరాగి అయ్యాడు .గురువు వదిలేసిన ధనుశ్శాల  ఆశ్రమాన్ని ఏకా౦త వాసంగా చేసుకొని తపస్సు చేశాడు .తర్వాత వనముల పొద లో నిర్మించి ఇచ్చిన ఆశ్రమం చేరాడు .శిష్యులనేకులేర్పడ్డారు .1946లో బొల్లవరం లో విమలానందుని నుంచి సన్యాస దీక్ష పొంది నిత్యానంద దీక్షానామం పొందాడు  .అద్భుతాలెన్నో చూపేవాడు .2-11-1959 వికారి కార్తిక శుద్ధ తదియ సోమవారం శవాసనం వేసి ,ప్రాణాన్ని సహస్రారం చేర్చి ,తనను త్వరగా సమాధి చేయమని శిష్యుడు శివయ్యకు చెప్పారు .వైద్యులనుపిలిపించి వైద్యం అందించారు కాని ఫలితం శూన్యం .30-1-1959 అమావాస్యనాడు శిష్యులు,సోదరులు  ప్రముఖులు లింగనవాయి కి బండీలో తీసుకు వెళ్లి జీవ సమాధి చేశారు .చాలాచోట్ల ఆరాధనోత్సవాలు కార్తీక అమావాస్యనాడు ఘనం గా నిర్వహిస్తున్నారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యక్కలూరి సాహిత్య ధ్యేయం ఒక్కటే –సామాజిక శ్రేయస్సు

యక్కలూరి సాహిత్య ధ్యేయం ఒక్కటే –సామాజిక శ్రేయస్సు

శ్రీ యక్కలూరి శ్రీరాములు గారి గురించి నాకు అంతగా తెలీదు .వారి రచన సర్వస్వం పై అధ్యయనం చేసి ,లోతులు తరచి ,అందులోని మణిమాణిక్యాలను  లోకానికి స్పష్టంగా’’యక్కలూరి సాహిత్యం –అనుశీలన ‘’ద్వారా  తెలియ జేసినవారు  ఆత్మీయులు ,విజయవాడ వెటనరీ డాక్టర్ ,సాహిత్యోపజీవి ,కండగలకవిత్వాన్ని పండించిన ఆచార్య  డా మక్కెన శ్రీను గారు . ఈపుస్తకం పంపి నెలరోజులు దాటినా దానిపై నా చూపు పడలేదు . అదొక రిసెర్చ్ గ్రంథం.కనుక నేను విడిగా చెప్పాల్సిన అవసరం లేదనే ఉపేక్ష కూడా కారణం .కానీ చదివి నాలుగు మాటలు రాసి మర్యాద నిలబెట్టుకోవటం ధర్మం అని పించి ఇవాళే చదివి .నా భావాలు తెలియజేస్తున్నాను .ఇందులో డాక్టర్ గారి  రచనగురించి తక్కువగా,  శ్రీరాములుగారి సాహిత్యం గురించి  ఆయన ఒక్కగానొక్క సాహిత్య ధ్యేయం పరిచయం అందులో ఉన్నమాటలతోనే చెప్పాలని మొదలు పెట్టాను .యక్కలూరి వారు కవి కథకులు ,వ్యాసరచయిత ,విమర్శకులు నాటిక  నవలా రచయిత గా బహు ముఖీన ప్రతిభ ప్రదర్శించారు. వీటినన్నిటినీ మక్కెనగారు  త్రాసులో తూచి నిగ్గు తేల్చారు .

కనుక శ్రీరాములు గారిది ప్రక్రియా వైవిధ్యం.కవిత్వానికి బంగారు గని ,వారి కొత్త చూపు అభి వ్యక్తీ లోకోత్తరం .ఒకకంట్లో కెమెరా ,మరో కంట్లో కవిత్వం ఉన్నవాడు .ఆయనరచనలు రసమయాలు .ఆయనొక కవితా ప్రబంధం ,నాటక మకరందం వ్యాస గంధం అనుభూతుల తరగని గని  .ఆయన కవితలు కురిసిన భావపు మొయిళ్ళు ,తడిసిన హృదయపు లోగిళ్ళు. పదపదం లో రస వృష్టి పలికించిన కవితా పరమేష్టి ‘’ అచ్చు తప్పో ఏమోకానీ ‘’మెయిళ్ళు’’అని పడింది మొయిలు అంటే మేఘం . సువర్ణసుందరిలో ‘’హాయిహాయిగా ఆమని సాగే ‘’  మాధురమైన పాట లోకూడా మనకు పరిచయమే .శ్రీనుగారు వారు రాసిన 15 కవితలను  5వ్యాసాలను ,నాటికలు నవల వ్యాసాలులాంగ్ పోయెం,షేడ్స్ ఆఫ్ మూన్ లైట్  అనే కవిగారి స్వీయ  ఆంగ్ల అనువాదాలను చక్కగా సమీక్షించారు .జలశిల్పంగా కొన్ని మలిచారు .

కవితామయమైన కవి గారి పంక్తుల్ని మీ ముందు ఉంచుతున్నాను .’’దేశం లోని ఆకలి వేకువతో ప్రారంభమై ,శోకం లో మిగులుతుంది ‘’.స్త్రీ ఔదార్యాన్ని సహనాన్ని మాతృత్వ మాధుర్యాన్నీ ‘’అన౦తతత్వం ‘’కవిత లో వ్యక్తీకరించారు .’’రాయల సీమసర్వస్వం –రగులుతున్న భాస్వరం ‘’,’’రాయలసీమలో విస్తరిస్తున్న ఇసుక ఎడారి –రానున్నకాలం లో అది ఒంటెలకు రహదారి ‘’,’’నువ్వు నా కలం లోంచి జారి-పరిగెత్తే జింక లాంటి గీతిక ‘’ బాల్యానికి సంకెళ్ళు వేసి సమాజం లోకి వదిలారు .అందుకే బంతులతోకాదు  పూబంతులతో కాదు బాంబులతో ఆడుకుంటున్నారు ‘’అని సానుభూతి దీర్ఘకవితలో వర్షించారు .నాగరకత పెరుగుతుంటే మానవత వెనక్కి వెడుతోందని నిరాశచెందారు .’’కార్పోరేట్ నిర్ణయించిన వ్యవస్థకు –నా రెండు పాదరక్షలతో నమస్కారం ‘’అని చెప్పు దెబ్బలు కొట్టారు.

‘’విత్తనమంత అక్షరం లో మహా వృక్షమంత అర్ధం కవిత-బిందువంత పదం లో సింధు వంత పరమార్ధం కవిత ‘’,’’ఉప్పు కూడా ఒకప్పుడు –నిప్పులా మండిన ఆయుధమే ‘’అని ఉప్పుసత్యాగ్రహం గుర్తుకు తెస్తారు .’’మనిషి సమస్త ఆలోచనలు –ఆయుధాల అవయవాలే ‘’ మనిషి మానవాళి శ్రేయస్సుకోసం పాటుపడితే ఇలలో స్వర్గమే అన్నది ఆయన ఆంతర్యం .’’ప్రజాస్వామ్యం –హస్తి నలో దేహీ ‘’అని అడుక్కునే దీనస్థితిలో ఉన్నందుకు వ్యధచెందారు .’’పంచభూతాలే మన పంచ ప్రాణాలు ‘’,’’ఉగ్రవాద పిడికిలిలో ప్రపంచం ఒక సజీవ శవం ‘’అని వాపోయారు .వారినాటకాలలోని పాత్రలు సజీవ మానవులే .వాటిలో శైలీ ప్రాయోజితకల్పన సంభాషణా చాతుర్యానికి హాట్సాఫ్ చెప్పారు మక్కెన గారు .

‘’చెట్టుకు విత్తనం ,చేపకి సముద్రం ,పిట్టకుఆకాశ౦,భాషకు మాండలికం అవసరం’’ అన్నారు .భాషా పరిణామమే మనిషి నిర్మాణం అంటారు ,భాషకే స్వాతంత్ర్యం లేకపోతే దేశానికిస్వతంత్ర్యమా అని ఎద్దేవాచేశారు .’’అక్షరాలూ చినుకులు –కవులు మేఘాలు –సాహిత్యం సముద్రం ‘’అని గొప్ప నిర్వచనం చేశారు ‘’కవి ఒక స్రష్ట –కవిత్వమే జీవిత పరాకాష్ట ‘’మరో కోటబుల్ కోట్. ‘’ఒక్కో చినుకూ ఒక్కో  వీర్య కణం-భూమితో సంగమిస్తూమళ్ళీ మొలకెత్తేబీజం ‘’అద్భుత భావన . ప్రేమ యెంత మధురమైనదో చెప్పే కవితా పంక్తులు ‘’నా హృదయం ఒక్కసారే ప్రేమిస్తుంది న్రంతరం –నీతోనే ఉంటుంది .మరణాన్ని కూడా జయిస్తుంది ‘’

‘’మేఘం చినుకుల ధారగా –వాన దారంగా మారి-భూమికిచిలక పచ్చచీర  సారెగా  ‘’ఇచ్చిందట .’’ఆకు దాహం తీరుస్తూ –విశ్వ వీధుల్లోంచి జారే పతాకమై –సకలజనులకు విజయ బావుటా ‘’గా దర్శనమిచ్చింది భావుకకవికి .అందుకే శ్రీనుగారు ‘’ఆయన కవిత్వం జీవ, వర్ష ధారల సజీవకవనం ‘’అని చక్కగాఎస్టిమేట్ చేశారు.’’అమ్మడానికి మందు మాంసాలతో పాటు –దేశం లో మగువ శరీరాలూ వేలాడు తున్నాయి ‘’అని నిట్టూర్చాడు కవి .ఈ భావంతో రాసినదే-‘’టెన్ డౌనింగ్ స్ట్రీట్ ‘’ కథ .’’రియల్ ఎస్టేట్ విపణిలో రాజకీయ పాచికలతో చెరచబడుతున్న ద్రౌపది ఈ భూమి .వేలం పాటలో నిర్లిప్తంగా నిలుచున్న చంద్రమతి ‘’లాగా కనిపించింది .చిన్నప్పుడు కవిగారు చూసిన పాత  దృశ్యాన్నీ చిత్రించారు పలనాటి వీర చరిత్రను రక్తి కట్టించిన కోరమీసాల వీరన్న ,కోలముక్కు లచ్చుమక్కల కళావిహీన బతుకు చిత్రాలు శిల్పించారు అక్షరాలతో .కుదేలౌతున్న కుటీర పరిశ్రమలకు పునర్వైభవం తెచ్చే కథలు మనసుకు హత్తు కొంటాయి .కవి గురించి కవి గారి స్పందన గొప్పగా ఉంటుంది –‘’ వేటగాడికో బాణం ,జాలరికో గాలం అవసరం దేన్నైనా కొట్టటానికి పట్టటానికి .కానీ ‘’ఏ కాలం లో నైనా ,ఏ ప్రాంతం లో నైనా ఎన్ని హృదయాలైనా ,ఒక్కసారిగా ప్రేమించటానికి ఒక్క క్షణం చాలు ఒక్క హృదయ స్పందన చాలు ‘’

ఒక సాధారణ స్త్రీ సమాజ వైచిత్రి వలన ఎలా పరిణామం చెంది ,ఎలాంటి స్థితికి ఎదిగిందో ఆస్త్రీ ధీరోదాత్త ను చూపే నవల కూడా రాశారు యక్కలూరి .ప్రపంచానికి  అన్నం పెట్టే రైతన్నపై లోతుగా కవిత్వం రాసినకవిగా కవిగారికి కితాబు ఇచ్చారు డాక్టర్ గారు .క్రీడలు కూడా వ్యాపారమై ,క్రీడాకారుల ఎంపికలో పక్షపాతాలు ప్రతిభను అణగ ద్రొక్కటాలు పోయి ,రాజకీయ అవసరాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థ కు శ్రీకారం చుట్టాలని కోరుకొన్నారు కవి .కవిగారు ‘’చెట్టు ను చూసినా ,మట్టిని చూసినా ,కాలానికి అతీతంగా –లోకానికి శాశ్వత సంకేతంగా –విశ్వం లోని శూన్యతగా అనిపించి ,-ఊగితే భోగిగా ,ఆగితే యోగిగా ఉంటాను .నేనొక అనేకం ‘’అంటారు .’’నీ సాహిత్యం నీ బొటన వేలు ముద్ర ‘’గా ఉండాలి అనే గొప్ప సందేశమిచ్చారు .’’పాణినీయ వ్యాకరణం ను ఇతర దేశాలు ప్రతిశాస్త్రానికి అనుసంధానం చేసి లబ్ది పొందారు ‘’అని పాణినికి లాల్ సలాం చేశారు .

సాధారణంగా ఈ నాటి కవులు పోతనలాంటి కవులను మెచ్చుకోవటం అరుదైన విషయం .కానీ యక్కలూరి వారు పోతనభాగవతాన్ని ‘’భక్తీ రసం .శాస్త్ర విజ్ఞానం ,సాంఘిక అవసరం ‘’గాగుర్తించటం ఆయన విశాల దృక్పధాన్ని తెలియజేస్తుంది ‘సాహిత్యం లో సర్వం సాధించిన పోతన ఆధ్యాత్మిక తత్వవేత్త .అయిన్ స్టీన్ కంటే ముందే వ్యాసుడు ,పోతన పరమాణువు అణువుల గురించి కాలజ్ఞానం తో చెప్పారు .పోతన భాగవతం లో యెంత ప్రపంచాన్ని చూపాడో అంతే లేదు .అన్ని శాస్త్రాల పరిచయం సృష్టి రహస్యాలు శోధించి చెప్పాడు .సాహిత్యమే అన్ని శాస్త్రాలకు మూలం అనిపోతన నిరూపించాడు ‘’అని గొప్ప కీర్తి కిరీటం పెట్టారు యక్కలూరి .దీనిపై స్పందిస్తూ మక్కెన గారు భాగవతం తెలుగు వారి స్వంతం ప్రతి తెలుగు వాడూ చదవాల్సిన ,చదివించాల్సిన గ్రంథం’’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .

యక్కలూరి సాహిత్యాను శీలనం చాలా వైవిధ్య భరితంగా ,రక్తిగా లోతులను తరచి అందించి యక్కలూరి శ్రీరాములు గారి రచనా వైశద్యాన్ని కళ్ళకు కట్టించిన డాక్టర్ మక్కెన శ్రీను గారు అభినందనీయులు .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-9-20-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి

విశేషార్ధాలను బహు గ్రందాలనాధారంగా వివరిస్తూ వేద, వేదాంత ,ఉపనిషత్,పురాణాల  ఆంతర్యాన్ని జోడిస్తూ ,ప్రతిదానికీ ఉపపత్తి చూపుతూ  వ్యాస వాల్మీకి హృదయాలను ఆవిష్కరిస్తూ ,అందుకు భిన్నంగా ఎవరైనా రాసినా,పలికినా,తీవ్ర నిరసన తెలుపుతూ సంస్కృత మూల౦  లో ఉన్న భావానికి సరితూగే తెలుగు కవుల పద్యాలను హాయిగా చదివి కైమోడ్చుతూ ,మహాకవి తిక్కనకూడా ,వ్యాస హృదయాన్ని అర్ధం చేసుకోనిని సందర్భాన్ని నిర్భయంగా బయటపెడుతూ ,వ్యాస హృదయన్ని గొప్పగా చాటిన పద్యాలను ఉచ్చైశ్వరం తో గానం చేస్తూ ,కరుణశ్రీ పద్యాల రామనీయకత్వాన్ని వివరిస్తూ ,ధూర్జటి భక్తీ గరిమను శ్లాఘిస్తూ ,కాలిదాస అతిలోక కవిత్వాన్ని ఉదాహరిస్తూ ,చమత్కారం జోడిస్తూ భక్తిభావ రసోల్లాసంగా గా౦గ ఝరీ వేగంతోఅమృత తుల్యం గా ప్రవచనం చేసే నేర్పు బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారిది .ఇదంతా తమతాతగారు బ్రహ్మశ్రీ మల్లాది రామకృష్ణ చయనులుగారి శ్రీ దత్తాత్రేయ స్వామి  అనుగ్రహ౦గా భావిస్తారు. వారి ప్రార్ధనా శోకాలతోనే ఒక గోప్పఆధ్యాత్మిక భూమికను సృస్టిస్తారు .అందులో ప్రవేశిస్తే వారు మల్లాది వారు కానేకారు అపరా శుకులు ,పరాశరులు,  సూతులు ,అనిపిస్తారు .అలాంటి మహా మహుని  జీవిత విశేషాలను తెలియ జేయటమే నేను చేసే ప్రయత్నం .

   శ్రీ చంద్ర శేఖర శాస్త్రి గారి తలిదండ్రులు శ్రీమాన్  దక్షిణా మూర్తి దంపతులు .తాతగారు రామకృష్ణ విద్వత్ చయనులుగారు .శాస్త్రిగారు 22-8-1925క్రోధన నామ సంవత్సర భాద్రపద తదియ నాడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా కోసూరు మండలం హస్సనాబాద్ లో జన్మించారు .గుంటూరుజిల్లా అమరావతిలో నివాసం .పురాణ ప్రవచన ,ప్రబోదాధ్యాపనాలే వారి వృత్తి. యవ్వనం లో వేదం ,తర్కం ,మీమాంస శ్రౌత ,స్మార్త ,వ్యాకరణ ,వేదాంత సాహిత్య శాస్తాలను మహామహులైన వేత్తల వద్ద అధ్యయనం చేశారు .వీటిలో నిష్ణాతులయ్యాక తాతగారి మార్గం లో భాగవత భారత రామాయణ పురాణ ప్రవచనం ప్రారంభించి వేలాది ప్రవచనాలు చేశారు.19వ ఏటనే స్వగ్రామం లో రామాయణం పై ప్రవచనాన్ని మహా పండితుల ఎదుట చేసి తన సత్తా చాటుకొన్నారు .తర్వాత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి అధ్యక్షతన  విజయవాడలో అద్భుత ప్రవచనం చేసి అందర్నీ ఆకట్టుకొన్నారు .ప్రవచనం లో శాస్త్రి గారిదోరణి విలక్షణమైనదని,సర్వోత్కృష్టమైనదని  అందరూ ప్రశంసించారు .రామాయణ భారత భాగవతాదులేకాక శ్రీ దత్తాత్రేయ స్వామిపై కూడా ప్రవచనాలు చేశారు .క్రమంగా ఇంతింతై వటు డింతయై ఆన్నట్లు ప్రవచనం లో విశ్వరూపం ప్రదర్శించి ,తమ విరాట్ సత్తాను రుజువు చేసుకొన్నారు ‘

  సంస్కృత తెలుగు లోని  అష్టాదశ పురాణాలపై  గొప్ప ఆధిపత్యం సాధించారు శాస్త్రిగారు .అన్నీ కరతలామలకాలే వారికి .హ్యూమన్ కంప్యూటర్ లాగా ఏదైనా వెంటనే స్ఫురించి వివరించటం శాస్త్రిగారి విశిష్ట లక్షణం .అందుకే వారికి ‘’పురాణ వాచస్పతి ‘’అనే అరుదైన బిరుదు లభించింది .భద్రాచల సీతారామ కల్యాణం ,తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయం లో శాస్త్రి ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యానం  ,లక్షలాది మందిని ఉర్రూత లూగించింది .ఎందరికో ఒజ్జబంతి గా నిలిచింది .తిరుమల దేవస్థానం తరఫున ఆంద్ర ప్రదేశ ప్రభుత్వ ఆహ్వానం పైనా మల్లాది వారు చేసిన పంచాంగ శ్రవణ౦విలక్షణం ,అద్వితీయం .దూర దర్శనిలో   హిందూమతం మొదలైన ఆధ్యాత్మిక అంశాలపై వేసిన ప్రశ్నలకు వారు  చెప్పిన సమాధానాలు సమాదరణీయాలు ,,సముచితాలు ,విశేషాలు కూడా .ఇలాంటి  కార్యక్రమం ‘’ధర్మ సందేహాలు ‘’గా’’ధర్మ సూక్షాలు’’గా  శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ లో కూడా ప్రసారమై వారి దార్మిక  వివేచనా దృష్టీ ,తీర్పు లకు ప్రేక్షక జనులు నీరాజన౦ పట్టారు .

  తిరుమల తిరుపతి దేవస్థానం వారి పురాణప్రవచన కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసి ,ఎందరికో మార్గదర్శనం చేశారు .శాస్త్రి గారి ప్రవచనాలు రచనల కు ‘’అభినవ వ్యాస ‘’ అనే సార్ధక బిరుదు లభించింది .ప్రవచన ,పంచాంగ శ్రవణాలను నిత్యజీవితం తో అనుసంధించి ,చమత్కారం,  హాస్య రస౦ రంగరించి చెప్పటం రమ్యంగా ఉంటుంది . వింటున్న కొద్దీ వినాలనే అనిపిస్తుంది . హనుమాన్ లాగా ఒక వేదాంత విషయాన్నుంచి మరో దానికి దానినుంచి మరో ధర్మసూక్షానికి దూకి మనల్నీ తమతో పాటు దూకిస్తారు .గొప్ప చలన శీలత,తాదాత్మ్య్తత వారి ప్రవచనం లో ఉంటుంది .ఖంగుమనే ఆ కంఠం దేవాలయ  ప్రణవ ఘంటానాదమే .అదే వారి ప్రత్యేకత .

  మల్లాది వారి శక్తి సామర్ధ్యాలకు తగిన గౌరవ పురస్కారాలు లభించాయి .శ్రీ రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం 2005లో అందుకున్నారు .ఒక లక్ష రూపాయల నగదు ,సన్మానం తోపాటు శాస్త్రిగారికి కానుకగా అందించారు .అమెరికా న్యు జెర్సీ లోని తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారి తరఫున  డాక్టర్ వి కే రావు ,డాక్టర్ జ్యోతి రావు దంపతులు మల్లాది శాస్త్రిగారిని  సన్మానించి 2 వేల డాలర్ల నగదును కానుకగా అందజేశారు.కానీ శాస్త్రిగారు ఆ భారీ మొత్తాన్ని సద్గురు శివానంద మూర్తి గారు విశాఖలోని భీముని పట్నం లో నిర్వహిస్తున్న ‘’సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ‘’కు అందించి ఆసంస్థ ధార్మిక కార్యక్రమాలకు తోడ్పడిన దొడ్డ హృదయంచాటారు   .

శృంగేరి శంకర మఠం వారు ‘’సవ్యసాచి ‘’బిరుదు ప్రదానం చేసి గౌరవించి సత్కరించారు .సద్గురు శివానంద  ట్రస్ట్ వారు ‘’ఎమి నెంట్ సిటిజెన్స్ అవార్డ్ ‘’ అందించి ఘనంగా సత్కరించారు .ప్రతి ముఖ్య నగరం సాహిత్య సంస్థ  వారిని సన్మానించి గౌరవించింది .శృంగేరి పీఠ౦ శాస్త్రిగారి విద్వత్తును గుర్తించి ఆత్మీయులను చేసుకొన్నది . కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ పద్మ పురస్కారం త్వరలో అందించాలని ,శతాధిక ఆయుస్సుతో ఆరోగ్యంగా శాస్త్రి గారు ఉండాలని కోరుకుందాం ..

  శాస్త్రి గారు 1-భారతము ధర్మ సూక్ష్మ దర్శనం 2-కృష్ణ లహరి –స్వేచ్చానువాదం ,రామాయణ రహస్య దర్శిని గ్రంథాలు రచించారు .ఇవికాక రామాయణ రహస్యము ,భాగవత తత్వము కూడా రాశారు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-9-20-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు 14

  • మనకు తెలియని మహాయోగులు—14

27-లక్ష్మీ  కాంతానంద యోగి -1888-1970

    నటుడు గాయకుడు వైద్యుడు ,త్రిభాషా పండితుడు ,యోగి లక్ష్మీకా౦తానందయోగి గుంటూరు జిల్లా కొత్తరెడ్డి పాలెం గ్రామకరణం చెన్నం రాజు ,కామేశ్వరమ్మలకు 11-1-1888సర్వజిత్ పుష్యబహుళ త్రయోదశి బుధవారం మూలా నక్షత్రం లో జన్మించాడు గుంటూరు ఎసి కాలేజిలో మెట్రిక్ పాసై ,18వ ఏట మద్రాస్ ఇంజనీరింగ్ కాలేజీలో డ్రాఫ్ట్స్ మన్ ప రీక్ష పాసై కృష్ణా –గుంటూరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం లో చేరాడు .తండ్రి చనిపోయాడు .ప్రతియేటా ఇంట్లో జరిగే సీతారామ కళ్యాణ బాధ్యత మీద పడింది .అధికారులు సెలవు ఇవ్వనందున రాజీనామా చేసి ,అనసూయమ్మను  పెళ్ళాడి ,గ్రామకరణీకం వ్యవసాయం సీతారాముల సేవలో గడిపాడు .నాటకాలలో హరిశ్చంద్ర ,నల బాహుక సారంగధర నరకాసుర భీష్మ పాత్రలు ధరిస్తూ మంచి పేరు పొందాడు .హిందీ ,సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేశాడు .సుశ్రావ్యంగా గానం చేసేవాడు .వీణావాదనలో దిట్ట అనిపించాడు .హరికథలు ,పురాణ ప్రవచనాలలో రాణించాడు ,ఆయుర్వేద గ్రంథాలు చదివి జీర్ణం చేసుకొని ఆయుర్వేద  మందులు తయారు చేసి పేదలకు ఉచితం గా అందించేవాడు .

   లక్ష్మీ కాంతుని గుణ శీలాలు,ఆధ్యాత్మిక చింతన  గుర్తించి చంద్ర శేఖరానంద సరస్వతీ స్వామి తమ ఆశ్రమ స్థలం తోట ఆయనకు వదిలేసి కాశీ వెళ్ళిపోయారు .తమ్ముడు సుబ్బారావు తో కలిసి అక్కడ ఆధ్యాత్మిక సాధన చేశాడు .హఠాత్తుగా తమ్ముడు చనిపోవటం తో విరక్తికలిగి ,మనసు వికలమై, ఆ ప్రదేశం లో ఆనందాశ్రమం అనే పేరుతొ మూడు కుటీరాలు నిర్మించి ఉత్తర భారతయాత్రకు బయల్దేరాడు .కాశీలో బ్రహ్మానంద సరస్వతీ స్వామి ఋషీకేశ్ లో ఆన౦ద  యోగి లను దర్శించి ,యోగ రహస్యాలు గ్రహించి ,కాశ్మీర మాధవానందులతో కలిసి  ,హిమాలయాల్లో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఆనందాశ్రమం లో శివ లింగం ప్రతిష్టించి రుషి వాటికగా మార్చారు .ఆనందశ్రమం లోనిఒక కుటీరం లో భూ గృహం ఏర్పాటు చేసుకొని అక్కడ రోజుకు కనీసం అయిదు గంటలు యోగ సాధన చేసేవారు .అద్భుతాలు మహిమలు ప్రదర్శించారు .సేవాకార్యాలు సాంఘిక సంస్కరణకర్యక్రమాలు చేబట్టారు.సుమారు 25గ్రంథాలు రాశారు .21-11-1970సాధారణ సంవత్సర కార్తీక బహుళ అష్టమి శనివారం 82 వ ఏట లక్ష్మీకా౦తానంద స్వామి తమ ఆరాధ్యదేవత గాయత్రీ మాత ను హృదయం లో నిలుపుకొని బ్రహ్మైక్యం చెందారు .

28-ప్రణవానంద స్వామి -1888-1969

కేరళలో పుట్టి కృష్ణాజిల్లా గుడివాడలో స్థిరపడి గుడివాడ ప్రణవానంద స్వామిగా ఖ్యాతి పొంది.భారత దేశానికి జ్ఞాన భిక్ష ప్రసాదించిన ఆయన కేరళ పాల్ఘాట్ లో ఆల్తూరు గ్రామంలో 15-5-1888సర్వధారి వైశాఖ శుద్ధ చవితి మంగళవారంజన్మించారు  పసితనం లోనే తలి దండ్రులు గతించారు .గురుకులం లో చదివి ఆధ్యాత్మిక భావ సంపద పొందారు .మళయాళ సంస్కృత తమిళ కన్నడ భాషలు నేర్చి శ్రీ కృష్ణానంద అవధూత శిష్యులై బ్రహ్మ విద్య గ్రహించారు .విద్యార్ధిగా ఉండగానే బ్రహ్మచర్యం పాటించి తత్వాన్వేషణ చేసి  సన్యసించాలి అనే కోరిక బలీయంగా ఉండేది .పాద చారియై దేశ సంచారం చేస్తూ ,1917లో గుడివాడ చేరారు .

   గుడివాడలో తాతిరెడ్డి తోట ను తపోభూమిగా చేసుకొని నిష్కళంక నిరాడంబర జీవితం గడుపుతూ దీక్షగా తపోసాధన చేశారు .సులభంగా అందరికీ అర్ధమయేట్లు గహనమైన వేదాంతాన్ని బోధిస్తూ అందరి మనసులను ఆక్రమించారు .మీర్జాపురం రాజా దంపతులు  భక్తులై  ,1936లో ప్రణవాశ్రమం నిర్మించి  శంకర ప్రతిష్ట చేసి ,నిత్యా రాదనకు తోడ్పడ్డారు .గుడివాడ ,పరిసర ప్రాంత ప్రజలు ‘’సనాతన హిందూ ధర్మ ప్రబోధ సంఘం ‘’స్థాపించి ,స్వామివారితో చాలా చోట్ల ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయించారు .స్వామి ఎవరినీ  శిష్యులుగాచేర్చుకోకపోవటం ప్రత్యేకత .ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్దరించారు .విశ్వహిందూపరిషత్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వారు .గా౦ధీస్మారక నిధికి విరాళాలు సేకరించి అందించారు .హృషీకేష్ లోని స్వామి శివానంద దివ్య జీవన సంఘానికి గుడివాడలో 1930లో ఒక శాఖను ఏర్పాటు చేశారు .కవిపండిత నటగాయక నర్తక హరిదాస భాగవతులను  ఆహ్వానించి ,ఆదరించి సన్మానించేవారు .

  ప్రణవాశ్రమం లో ప్రాతి ఏడాది  సప్తాహ దీక్ష తోపాటు గణపతి, దేవీ, నవరాత్రులు కృష్ణాష్టమి గీతాజయంతి ,త్యాగరాజ ,విద్యారణ్య జయంతి ,రామానుజ ,మధ్వాచార్య, జయంతి రమణమహర్షి జయంతి మొదలైనవాటిని వైభవోపేతంగా నిర్వహించేవారు .దేశమంతా అయన పేరిట అనేక ఆశ్రమాలు ఏర్పడ్డాయి .80వ ఏట కూడా నిరంతర పరిశ్రమ చేసేవారు .1967లో అనారోగ్యానికి గురయ్యారు .1969 మే15 సాయంత్రం 3గంటలకు 81వ ఏట ప్రణవాన౦దస్వామి బ్రహ్మైక్యం చెందారు  .ఆశ్రమం ప్రక్కనే సమాధి నిర్మించారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆదర్శ మూలాల కు అనురూపమైన శ్రీ మతి కోపూరి పుష్పాదేవి ‘’ఒక్క క్షణం ‘’కథలు

ఆదర్శ మూలాల కు అనురూపమైన శ్రీ మతి కోపూరి పుష్పాదేవి ‘’ఒక్క క్షణం ‘’కథలు

తొమ్మిది కథా సంపుటాలు, రెండుకవితా సంపుటాలు వెలువరించి ఆంధ్ర దేశం లోలబ్ధ ప్రతి ష్టురాలైన సాహితీ మూర్తి శ్రీమతి కోపూరి పుష్పాదేవి .సాహితీ సంస్థలకు వెన్ను దన్ను .నిలువెత్తు ఆంద్ర  సంప్రదాయ మహిళా స్వరూపం .రచనలో నవ్యత,భావం లో నవీనత ,అవసరమైతే షాట్ గన్ గా పేల్చగల సామర్ధ్యం ,సాధారణంగా సర్దుకుపోయే తత్త్వం ఆమెకు సహజ ఆభరణాలు .నాకు దాదాపు రెండు దశాబ్దాలుగా ,సరసభారతికి ఒక దశాబ్దిగా పరిచయమున్న అక్కలాంటి అమ్మ .తాజాగా 2020లో ప్రచురించిన ‘’ఒక్క క్షణం ‘’కథలు,విలక్షణం, విశేష గుణం కలవి .ఆదర్శాలకు ఆయువు పట్లు .ఇందులో ఉన్న 33 కథలు సగటు తెలుగు వారి వే.సంఘటనలు నిత్యం మనం చూస్తున్నవే .వాటికి ఆమె అక్షరారూపమిచ్చి సార్ధకం చేశారు .ఇవన్నీ ప్రముఖ పత్రికలలో చోటు చేసుకొన్నవీ ,కొన్ని బహుమతులు పొందినవీ కూడా .

  తండ్రి రైసు మిల్ లో గుమాస్తాగా చేరి ,ఆమెను పెళ్ళాడి అదృష్టం తేనె తుట్టెలా ఎక్కడో పట్టి కార్పొరేటర్ అయి ,అక్రమాలు, అతివలవేటలో ఆరి తేరి ,తను వద్దని వారిస్తుంటే విడాకులతో బెదిరిస్తూ ,నరకం చూపిస్తూ ఇప్పుడు ఎం .ఎల్ .ఏ .టికెట్ కోసం హైదరాబాద్ వెడుతున్న భర్త ,కొంపదీసి గెలిచి మంత్రి ఐతే ,నేరాలు ఘోరాలకు అంతూ దరీ ఉండదని భావించి తననుకూడా రమ్మంటే రైలు ఎక్కి ,అతడు అభిమాన గణం వీడ్కోలు హడావిడిలో కదుల్తున్న రైలు ఎక్కే ప్రయత్నం చేసి,భార్యకు చెయ్యి అందించి లోపలికి లాగమంటే  ‘’ఒకసారి చెయ్యందించి నా జీవితం నాశనం చేసుకొన్నాను ,మళ్ళీ చేయ్యందుకొని రాష్ట్రాన్ని దుంప నాశనం చేస్తావా “’అని మనసులో’’ ఒక్క క్షణం ‘’అనుకొని , జాపిన చెయ్యి వెనక్కి తీసేసుకొన్నది .అంతే’’ఇంకేమీ చెప్పలేదు రచయత్రి .అతడు జారిపడటం చావటం దేశాని పీడా వదలటం మన ఊహకు వదిలేసింది .ఈ ‘’ఒక్క క్షణం’’ ఈ కథకు, సంపుటికి మకుటాయమానమైనసార్ధకమైన  శీర్షిక .

  పోరాడి గెలిస్తేనే దేని విలువైనా తెలిసేది .దానితో ఆత్మ సంతృప్తి లభిస్తుంది .ప్రగతి వైపుకు సాగిపోవటమే జీవితం అనే జీవిత సత్యం చెప్పే కథ‘’ప్రస్థానం’’. భర్త, కొడుకు ఒకే సారి చనిపోతే లలిత తనకోడలు ప్రత్యూషను కూతురులా చూసుకొంటూ ,ఆమెకడుపులో పెరుగుతున్నకూతురు రూపాన్ని భద్రపరచినది  .రిటైర్ మెంట్ బెనిఫిట్స్ తనిష్టం వచ్చినట్లు అనాధ శరణాలయానికి ఇచ్చేసి సంతృప్తి పడిన లలిత చేసిన పనికి  ప్రత్యూషను కోపం తార స్థాయికి చేరింది . ఆమె కూతురు  బుద్ధి చెప్పేపని  చేసి ,అమ్మమ్మ లలితతో కూతురు ప్రోమోదినీ ప్రణ య్ కు అక్షితలు వేయిస్తుంటేచూసిన   ప్రత్యూష ఖంగు తింది .ఆల్ ఈజ్ వెల్ లా అంతా కలిశారు .లోకంలో రావణులు ,కీచకులేకాడు శూర్పణఖ లూ ఉంటారని చెప్పేదే ‘’మేమేం తక్కువా ?””కథ .తనూ పిల్లలు కూడా బెట్టిన డబ్బు పని మనిషి కొడుకు కు యాక్సిడెంట్ అయితే ఖర్చుకు ఇచ్చి సార్ధకం చేసిన  భారతి,పుట్టిన రోజు డ్రెస్ కు భారీగా ఖర్చుచేసి’’ రిక్షాకూలి పది హేను రూపాయలు ఇచ్చి నా మందు బిళ్ళలు కొనుక్కోటానికి పుణ్యం కట్టు కొండి బాబయ్యా   ‘’అన్న వాడి మాటలకు విలువ లేకుండా, ఎక్కువ అడిగాడని విసుక్కొని  ఆదుకోవాల్సిన జంట ,నడిచి వెళ్ళిన సంఘటన ,వాడు తన డ్యూటీ చేశాడు ,మనమెందుకు సాయం చేయాలన్న సంకుచిత ఆలోచన ఉన్న మనుషులు ,అమ్మాయిల జీవితాలలో ఆడుకొనే వాడికి ధైర్యంగా గుండుగీసి సున్నం బొట్లు పెట్టి ,వీడియో తీసిన సగటు ఆడపిల్ల ధైర్యం మనకు ఆదర్శాలుగా కనిపిస్తాయి .పొగరు, అహంకారం పొరలుకమ్మి ,అంది వచ్చిన ఉద్యోగాలు కాలదన్నుకొని ,చివరికి గణపాఠం నేర్చి ,తాను  జీవిత పరీక్షలన్నీ పాసైన ఉత్తమ విద్యార్ధిని అని తెలియజేసి , ‘’నమ్మితే మీ ఇంట్లో మీ పిల్లలకు తల్లిగా ఉద్యోగం ఇవ్వమన్న’’వందన ,అనుబంధాలూ ఆత్మీయతలూ పెంచుకోవటానికి బానే ఉంటాయి కాని తుచు కోవటం’’ ‘’అంత వీజీ  కాదు’’. కాని దాన్ని అక్షరాలా ఆచరించి వానప్రస్థాశ్రమం తీసుకొని కొడుకుకు బుద్ధిచెప్పిన  ముసలి జంట ,అందరూ చైతన్యవంతులైతే అశాంతి స్థానం లో శాంతి నెలకొంటుంది అన్న వసుంధర ధైర్యం,సొంత ఇంటికోసం ఉన్న దంతా ఖర్చు చేసి ,రేపటి సంగతి ఏమిటో తెలీని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అయోమయంలో ఉన్న సగటు మధ్యతరగతి జీవులు ,అహం వీడితే హళ్లికి  హళ్లి అని గ్రహించిన నారాయణమూర్తీ అందరూ మనకు తెలిసిన వాళ్ళే .’’ఒక అన్నలాగా దగ్గరుండి మా పెళ్లి చేయి  .మేమిద్దరం కలిసి అనాధ శరణాలయం నడుపుతాం ‘’అన్న తాను  ప్రేమించిన వసుంధర అంటే మైండ్ బ్లాంక్ అయి ఇప్పటిదాకా తన ఆలోచనలు ఎంతగా దారి తప్పాయో  తెలుసుకొని తనకు నిష్కృతి లేదు అనుకొన్న  మూర్తి,  ఆదర్శాల పేరిట ఆవేశంగా ప్రవర్తిస్తే అనర్ధం జరిగి ,అవసరం బ్రతుకు తెరువును శాసిస్తుందని గ్రహించిన శారద ,ఎక్కడో లేరు మనమధ్యే ఉన్నారు .

   భర్తను అదుపు చేయలేక  తనకున్న ఉక్రోషం పిల్లలపై చూపి ,చెయ్యి దాటిపోతే జీవితం లో ఓటమి పాలై విలపించిన వినోదినీ ,ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని,కొంత మూల్యం చెల్లించటం తప్పదనీ ,  వాళ్లకు ఆత్మస్థైర్యం అందించాలని ధైర్యం చెప్పిన ఆమె అక్క వసంత  సగటు తెలుగింటి ఆడపడుచులే .స్వామీజీల డొల్లతనం తెలివిగా బయటపెట్టిన జానకి ఆధునిక విజ్ఞానం తెలిసిన స్త్రీ .మనిషి ప్రశాంతంగా బతకటానికి డబ్బూ దస్కమే కాదు ,’’ఆక్సిజన్ వంటి ఆత్మీయత’’ కావాలి .ఆత్మీయత  అందుకోవాలి, అందించాలి ప్రేమను పొందటం పంచటం మనిషి ఉచ్చ్వాస నిశ్వాసాలు కావాలి ‘’అనే ఎరుక చెప్పిన కథవెలుగురేఖలు లో అనంతలక్ష్మీ తనపాపను తీర్చిదిద్దుకొంటానని ఆత్మ విశ్వాసం తో చెప్పి నిజం చేసుకొన్నది .తండ్రి వ్యసనం నుంచి మరల్చటానికి మనవడిని ప్రయోగించిన కొడుకు ఆదర్శంగా కనిపిస్తాడు .భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద ఆఫీస్ లో చిన్న ఉద్యోగం పొంది ,క్రమమక్రమంగా చదువులో ఎదిగి ఉద్యోగం లో ఉన్నతి సాధించి ,అత్తమామలను ఆదరిస్తూ ,తనపిల్లలనూ ఆడబడుచు పిల్లల్నీ సమానంగా చదివిస్తూ ,ఆదరిస్తూ ఉన్న భవాని  ఉత్తమ గృహిణి గా ,ఆమె ఇల్లు ఉత్తమ గృహం గా జడ్జీలు ఎంపిక చేయటం ఆదర్శ జీవితానికి పట్టాభి షేకమే .’’మనసుకు నచ్చిన పని చేయటానికి ఆత్మ సంతృప్తి ఒక్కటి చాలు’’అన్న స్థిర నిశ్చయం ఉన్న జమున ఎవరిమెప్పులూ ,మేకతోలూ ఆశించదు. .మనకర్తవ్యాలు మనం చేస్తే అదే గొప్ప దేశ సేవ .తమ తలిదండ్రులను వాళ్ళ అమ్మా నాన్నలు ఆదరించి ,గౌరవిస్తే ,అదే బాటలో నడిచి వాళ్ళ వివాహ రజతోత్సవం చేసి అదే సత్కారం అని భావించిన రాజశేఖర్ ,రజని దంపతులు.నీరు లాంటి ప్రేమ పల్లానికే ప్రవహిస్తుంది .తాముకన్నవారి ఉన్నతి గురించే ఆలోచన తప్ప తమను కన్నవారి బాగోగుల గురించి పట్టించుకోని సమాజం లో భారతి లాంటి వారు నూటికి ఒక్కరు మాత్రమే ఉంటారు .ఆదర్శంగా ‘’డెఫ్ అండ్ డంబ్ ‘’అమ్మాయిని పెళ్లి చేసుకొన్నకొడుకు హిమాలయం అంత ఎత్తుగా కనిపించాడు తల్లికి . కలకాలం ఆ అమ్మాయితో కలిసి కాపురంచేస్తానని మాటకూడా ఇచ్చాడు .ఆమాట మీద నిలబడమని హితవు చెప్పింది .  రెండేళ్లకే వాడి బండారం బయటపడి ,రెండో పెళ్లి చేసుకొంటానని,తల్లితో అంటే ,అది తప్పు అని ఎన్నిరకాలుగా చెప్పినా వినక తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని ధీమా ప్రకటిస్తే ‘’మేమేమీ చెయ్యక్కర్లేదు నీ ఉద్యోగం ఊడి, జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది ‘’అని గట్టిగా చెప్పి ‘’బిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఏ తల్లీ చూస్తూ ఊరుకోదురా పిచ్చి సన్నాసీ .నాకోడలుకూడా ఇవాల్టినుంచీ నా బిడ్డేఅని కళ్ళల్లో నిప్పులు కరిపించిన వాడి తల్లి .  అత్తగారు కాదు నిజంగా తల్లి ,మాతృమూర్తి గా మన అభిమానం పొంది ,  అపర మహిషాసుర మర్దినిగా జేజేలు అ౦దు కొంటుంది ‘’విజయదశమి ‘’కథ లో .

  మంచి ఆదర్శాలు ఆదర్శభావనాలు అనురూపమైన కథా సంవిధానం ,నిర్వహణ ,ఏదో క్లైమాక్స్ ఉండాలన్న తపన లేని సాధారణ  వర్ణన లతో ,జీవ భాష తో కథలన్నిటికీ జీవం పోసిన పుష్పాదేవి గారు అభిన౦దనీయులు. తెలుగు కథ వారి కలం లో జీవ కళతో సాక్షాత్కరించింది .

మీ- గబ్బిటదుర్గాప్రసాద్ -14-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ట్రాన్స్ జెండర్లతో కదా చాలనం ప్రజాశక్తి లో 14.09.2020

ట్రాన్స్ జెండర్లతో కదా చాలనం

Posted in రచనలు | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—13

మనకు తెలియని మహాయోగులు—13

25-మునీంద్ర స్వామి -1876-1961

ఆంద్ర ప్రదేశ చిత్తూరుజిల్లా తిరుమలదగ్గర స్వర్ణముఖీ నదీ తీరం లో యలమండ్య గ్రామం లో గాలిమాసి లక్ష్మణ రెడ్డి ,అన్జేరమ్మ అనే పాకనాటి రెడ్డి దంపతులకు మునిస్వామి రెడ్డి 1876లో పుట్టాడు .చీరాల సుబ్బయ్య అనే భాగవతోత్తముడు అక్షరాభ్యాసం చేసి తారకమంత్రం ఉపదేశించగా ,వ్యవసాయపనులతో సహా అన్ని పనులూ చేస్తూ కూడా దీక్షగా జపించాడు .ఒక రోజు సృష్టి రహస్యం భధించాలన్న ఆలోచన కలిగి ,ఏకాంతం లో ఉండటం మొదలుపెట్టాడు. 18వ ఏట చెంగమ్మతో పెళ్ళిచేశారు కాని దాంపత్యం పరమాత్మజీవాత్మ బంధంగా ఉన్నది

 5-1-1925రక్తాక్షి సంవత్సర పుష్యశుద్ధ ఏకాదశి నాడు మునిస్వామి వ్రత దీక్షతో తదేక రామతారకనామాన్ని జపిస్తుంటే శుద్ధ నిర్వికల్ప సమాధి లభించింది .ఆత్మదర్శనమై ప్రపంచమంతా పరమాత్మ స్వరూపంగా కనిపించింది .నిద్రాహారాలు మాని 8 నెలలు బ్రహ్మానంద మగ్నుడయ్యాడు.ఒక శ్రావణ పౌర్ణమి నాడు వేదవేదా౦త జ్ఞాని నారాయణాచార్యులు ,అష్టాక్షరీ మంత్రముపదేశించి భ్రూమధ్యం లోకి చూడగా బాహ్య దృష్టి నశించి ఆత్మ దృగ్గోచరమైంది .మునీంద్ర స్వామి దీక్షానామమిచ్చి వేదాంత రహస్యాలు బోధించాడు .అప్పటినుచి ఏకాంత తపస్సు చేస్తూ ,ఆత్మశక్తితో సమస్తవిషయాలూ తెలుసుకొంటూ మహిమలెన్నో చూపాడు.నాస్తికులను ఆస్తికులుగా మార్చాడు శిష్యకోటి పెరిగింది .

  అనుష్టాన వేదాంతి మునీంద్ర స్వామి జిజ్ఞాసువులకు కల్ప వృక్షమైన  ‘’బ్రహ్మజ్ఞానామృత సంగ్రహం ‘’గ్రంథం రాశారు .పుత్తూరుతాలూకా కదిరి మంగళం లో ఆశ్రమమ స్థాపించి కదిరి మంగళం మునీంద్ర  స్వామిగా ప్రసిద్ధి చెందారు .తన నిర్యాణ సమయాన్ని వారం రోజులు ముందే ప్రకటించి 18-5-1961 ప్లవనామ సంవత్సర జ్యేష్ట శుద్ధ పంచమినాడు 85వ ఏట కళ్ళు తెరచి భక్తులను శిష్యులను ఆశీర్వదించి మునీ౦ద్రస్వామి జీవ సమాధి చెందారు .ప్రతి పూర్ణిమ నాడు గురుపూజ ,వార్షికోత్సవాలు ఘనంగా చేస్తారు .ప్రస్తుత పీఠాధిపతి బ్రహ్మానంద భారతీ స్వామి .

26-యోగానంద నరసింహ మహర్షి-1886-1960

ఒంగోలు జిల్లా మార్కాపురం తాలూకా తోకపల్లి  లో 1886లో సుబ్బారాయుడు పుట్టాడు .వీధి బడి లో చదివి ,నాట్యనాటకాలపై అభిరుచి పెరిగి ,ఒకనాటక సమాజ నటుడయ్యాడు .ఒక వైష్ణవ పండితుడు చేరదీసి ,పురాణ వేదాంత సారం వంట బట్టించి మంత్రాలు ఉపదేశించాడు దీక్షతో మంత్రం రాత్రి పగలు చేస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు.ఒక పాశ్చాత్య సర్వేయర్ అతడికి ఉద్యోగమిచ్చి ,తీరిక వేళల్లో అతడి భక్తి గేయాలువింటూ భక్తుడైపోయాడు .అతడు ఏది చెబితే అది జరిగేది .

  ఉద్యోగ రీత్యా  వీరరాఘవ క్షేత్రం ఐన తిరువళ్ళూరు వెళ్లి అక్కడ నిద్రాహారాలు మాని రామనామ జపంచేశాడు .దొర ఇతడిని మద్రాస్ కు మార్చాడు.ఒక రోజు ఒక అవధూత కనిపించగా ఆయనపాదాలపై మూడు రోజులు పడిఉండగా ,నాల్గవ రోజు దీవి౦చగా సుబ్బారాయుడి ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోయింది .మంత్రాలు సిద్ధులు యోగామర్మాలు వచ్చేశాయి . ఆ దిగంబర అవధూత తన శక్తులన్నీ సుబ్బారాయుడికిదారపోసి,అదృశ్యమయ్యాడు .

  ఎన్నెన్నో అద్భుతాలు లీలలు ప్రదర్శిస్తూ కపిలగిరిపై చేరి తపస్సు చేయగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యక్షమై ఆలయం కట్టమని కోరగా కట్టించి స్వామిని ప్రతిష్టించి ,నిత్యపూజా నరసింహ జయంతి ఉత్సవాలు జరిపించారు కపిలగిరి యోగానంద మహర్షి .తనను జీవ సమాధి చేయమని శిష్యులకు ఆదేశించి తనవారసునిగా నారాయణ దాసును పీఠాదిపతిని చేసి 30-12-1960 శార్వరి పుష్యశుద్ధ త్రయోదశి శుక్రవారం 75 వ ఏట సమాధి స్థితులై బ్రహ్మ రంధ్రాన్ని చేదించుకొని యోగా నంద మహర్షి లక్ష్మీ నరసింహస్వామిలో ఐక్యమయ్యారు .కపిలగిరి మెట్ల ప్రక్క ఈశాన్యం లో సమాధి చేశారు .ఏటాగురుసమారాధనలు వైభవంగా జరుగుతాయి .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-9-20-ఉయ్యూరు     

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియనిమహాయోగులు—1223-ముద్దయ్యస్వామి -1850-1940

కర్నూలు జిల్లా ద్రోణాచలం తాలూకా గోవర్ధనగిరి లో యాదవకులం లో బద్దుల రంగయ్య చౌడమ్మ దంపతులకు చివరి సంతానంగా1850లో  ముద్దయ్య పుట్టాడు  .బాల్యం నుంచి దైవభక్తితో గడిపాడు .అడువులకు ఆవులను తోలుకు వెళ్లి మేపుతూ చెట్టు నీడన ఏకాంత ధ్యానం లో మునిగి పోయేవాడు .ఒక రోజు పెద్ద నాగుపాము ఆయనకు ఎండ తగలకుండా పడగా విప్పి గొడుగులాగా కాపాడింది .ఊళ్ళో ఉన్న మాలదాసరి కౌలుట్లయ్యను తమకోడుకును ప్రయోజకుడిని చేయమని తలిదండ్రులు కోరారు .యాగంటి క్షేత్రానికి తీసుకువెళ్ళి మంత్రోపదేశం చేయగా నిరంతరం మంత్రజపం దీక్షగా చేశాడు .ఒక రోజు కోటి పెట్టి బావి దగ్గర జ్యోతి వెలిగించి శివలింగం చెక్కటం మొదలు పెట్టాడు .విషయం తెలిసిన అన్నలు వచ్చిజ్యోతి ముందు ధ్యానమగ్నమై ఉన్న ముద్దయ్యకు తెలీకుండా శివలింగాన్ని ‘’భోజనం బావి ‘’లో పారేసిపశువులను ఇంటికి తోలుకుపోయారు .

   ధ్యానముద్ర నుంచి లేచిన ముద్దయ్య విషయం తెలిసి నూతిలోకి దూకి ఒక చేతిలో శివలింగం మరో చేతిలో జింక చర్మం తో నీటిపై తేలాడు .నడి బావిలో జింక చర్మం పరచి పద్మాసనం లో కూర్చుని చేతిలో శివలింగంతో ధ్యానమగ్నడయ్యాడు .ఈ విషయం అంతటావ్యాపించి అతని మహిమలకుందరూ ఆశ్చర్యపోయారు .తలిదండ్రులు అతడికి బలవంతం తో పెళ్లి చేయగా రజస్వలకూడా కాని భార్య ఆకస్మాత్తుగాచనిపోవటం తో వైరాగ్యం పెరిగి జ్ఞానం కోసం దేశాటన చేశాడు .తల్లి మరణవార్త తెలిసి తిరిగివచ్చి ఆమెకు సమాధి కట్టి అక్కడ ఒక  చెట్టునాటి ,చిన్న కుటీరం కట్టుకొని ఆశ్రమజీవితం మొదలుపెట్టాడు. ఆ పర్ణశాలను ‘’ముసలమ్మ కట్ట’’ అంటారు .శిష్యులు పెరిగారు రోగులకు వ్యాధి నయం చేసేవాడు .

 పత్తికొండ తాలూకా గొనె గండ లో ఉన్న చింతలస్వామి నీ  నే యాగంటీశ్వరుడిని అప్పుడప్పుడు వెళ్లి దర్శించి వచ్చేవాడు .బాల్యంలో చెక్కిన శివలింగాన్ని ఆశ్రమం లో ప్రతిస్టించాడు .తాను  సమాధి అయ్యేరోజును అయిదేళ్లకు ముందే ప్రకటించి ,సమాధి నిర్మి౦ప జేసుకొని బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణవాయువును వదిలేసి 1940లో 90వ ఏట  గోవర్ధనగిరి ముద్దయ్య స్వామి సమాధి చెందారు .శ్రావణ శుద్ధ సప్తమి నాడు ఆరాధనోత్సవం చేస్తారు .

24-మౌనస్వామి -1868-1943

 బాపట్ల తాలూకా నూనె వారి పాలెం అచ్యుతుని బాపనయ్య ,సీతమ్మలకు 20-4-1968 న పిచ్చయ్య మూడవ కొడుకుగా పుట్టాడు .పందిళ్ళ  పల్లి వాసి  అచ్యుతుని లక్ష్మీ నరసయ్య సుందరమ్మలు దత్తత తీసుకొని శివయ్యగా పేరు మార్చి చదువు చెప్పించారు .కామేశ్వరమ్మతో పెళ్లి జరిగి ఆబ్కారీ శాఖలో ఉద్యోగం లో కొంతకాలం ఉద్యోగం చేశాడు .

   1943లో రాజమండ్రి వెళ్లి ధాన్యం వ్యాపారిదగ్గర గుమాస్తాగిరీ చేస్తూ ,దేవీ ఉపాసన మొదలుపెట్టాడు .రాత్రిళ్ళు పురాణప్రవచనాలు .హరికథా కాలక్షేపాలు చేసేవాడు .క్రమంగా దృష్టి అంతర్ముఖమై ,1906లో ఇల్లువదిలేసి గురువు అన్వేషణ కోసం దివ్య క్షేత్రాలు యోగభూములు దర్శిస్తూ  దేశాటనం చేశాడు .తిరువన్నామలై లో శ్రీ రమణమహర్షి ఆశ్రమం లో ఒకఏడాది  గడిపాడు .

  ఉత్తర దేశ యాత్రలో అచ్యుతానంద సరస్వతీ స్వాముల దర్శనం కలుగగా ఆయన ‘’’’శివ చిదా నంద సరస్వతి ‘’దీక్షానామం తో సన్యాసం ఇచ్చారు .గురువు అనుమతితో యోగ సాధన చేస్తూ మళ్ళీ దేశయాత్ర చేశారు .1908లో నైమిశారణ్యం చేరి ,అక్కడ వంద సంవత్సరాలుగా తపస్సుచేస్తున్న’’ వెంకటాచలం పంతులు’’గారిని  సేవించి ,అనేక యోగ శక్తులు సాధించారు దత్తాత్రేయుని అపరావతారమైన శ్రీ వాసు దేవానంద సరస్వతి శుశ్రూష చేసి, సమస్త శాస్త్రాలు యోగం లలో నైపుణ్యం సాధించారు .సిద్ధ పురుషులైన చిదానంద అప్పటినుంచి మౌనంగా ఉంటూ ‘’మౌనస్వామి ‘’గా పేరు పొందారు .పంచవటి వద్ద గుహలో యోగ సాధన చేశారు .తర్వాత కర్నాటక మూకాంబికా క్షేత్రం చేరి ,అక్కడనుండి మంగులూరుకు  బయల్దేరి మధ్యలో చిత్రకూట పర్వత ప్రాంతం లోసమాధి లో ఉంటూ  అనేక  అద్భుతాలు ప్రదర్శించారు .చివరకు తమిళనాడు చేరి కుర్తాళం వద్ద స్థిరపడి ‘’కుర్తాళం మౌనస్వామి ‘’అని పిలువబడ్డారు

  తమ మఠాలకు,మందిరాలకు ట్రస్ట్ ఏర్పాటు చేసి 28-12-1943న 75వ ఏట మౌనస్వామి అనంత మౌనం లో కలిసిపోయారు .దండాయుధ పాణి మందిరం లో సమాధి చేశారు .13-7-1951న సమాధిపై శివ లింగ ప్రతిష్ట జరిగింది .ఆనాడు ఆయన దత్తాశ్రమ౦ లో స్థాపించిన ‘’సిద్దేశ్వరీ పీఠం’’,ఈ నాటి  పీఠాధిపతి –శ్రీ సిద్దేశ్వర చిదానంద భారతీ స్వామి (పూర్వాశ్రమంనామం ప్రసాదరాయ కులపతి )ఆధ్వర్యంలో ప్రశస్తిపొంది ,దేశం లో గొప్ప అద్వైత పీఠంగా భాసిల్లుతోంది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—11 21-శాస్త్ర వేత్త యోగి –స్వామి జ్ఞానానంద -1896-1969

మనకు తెలియని మహాయోగులు—1121-శాస్త్ర వేత్త యోగి –స్వామి జ్ఞానానంద -1896-1969

పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం తాలూకా గొరగనపూడి లో భూపతి రాజు రామ రాజు ,సీతయ్యమ్మ అనే సంపన్న క్షత్రియ దంపతులకు 5-12-1896దుర్ముఖి సంవత్సర మార్గ శిర శుద్ధ పాడ్యమి శనివారం లక్ష్మీ నరసింహ రాజు జన్మించాడు .స్వగ్రామం ,వీరవాసరం ,నరసాపురం టైలర్ హైస్కూల్ లో ప్రాధమిక మాధ్యమిక ఉన్నత విద్య నేర్చి ,తణుకు లో చదివే రోజుల్లో 1908లో శ్రీ వాసు దేవానంద సరస్వతి ‘’వాసు దేవ మంత్రం’’ ఉపదేశించారు .అప్పటినుంచి రాజు కు శ్రీకృష్ణుడు ఆరాద్యదైవమయ్యాడు .వివాహం జరిగినా శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ శారదా మాత ల దివ్య దాంపత్యం లాగానే జీవితం సాగింది .తండ్రి లైబ్రరీలో ఉన్న అరుదైన వేదాంత గ్రంథాలన్నీ చదివి ,మద్రాస్ లో ఆనిబిసేంట్ ను దర్శించి దివ్యజ్ఞాన గ్రంథాలు రామకృష్ణ వివేకానంద గ్రంథాలు పఠించి బాలగంగాధర్ ఉపన్యాసాలతో ప్రేరితుడై అజ్ఞాతం గా ఉన్న త్యాగవైరాగ్యాలు బయట పడి ,1917 స్కూల్ ఫైనల్ పరీక్షా ఫలితాలలో నంబర్ కనపడ నందున ,విరక్తితో ఇల్లు వదిలి అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు .

ఢిల్లీ ,హరిద్వార్ మీదుగా ఋషీకేశ్ చేరి స్వర్గాశ్రమమ లో చేరి సాధన చేశాడు .ఫలితంగా శ్రీ కృష్ణ పరమాత్మ సాక్షాత్కారం పొందేవాడు .ఆయన తీవ్ర యోగ సాధన చూసి యోగి రాజ్ అని సంబోధించేవారు .తర్వాత ఆబూ పర్వతం చేరి ,గురు శిఖరం పై ఉన్న దత్తాత్రేయ గుహలో ఆరు నెలలు పశ్చిమోత్తాన ఆసనం లో సాధన చేసి ,నీల కంఠ మాహా దేవ్ లో హఠయోగ ప్రక్రియలు సాధించి ,సవికల్ప సమాధి పొంది శ్రీ కృష్ణ దర్శన భాగ్యం పొందేవారు . రుషీ కేశ్ లో శరశ్చంద్ర అనే సిద్ధ పురుషుడు ఈయన 25వ ఏట ఉపదేశం చేసి ‘’స్వామి జ్ఞానానంద ‘’అనే దీక్షానామ మిచ్చారు .గురువుల అనుమతితో బారాముల్లా వెళ్లి సంత్ సింగ్ గుహలో నాలుగు నెలలు ,ప్రాణాయామ ఆసన ధ్యానాలు చేశారు .శ్రీనగర్ కాళీ పర్వత గుహలో ,పర్వతం పై గుహలలో కొంతకాలం తపస్సు చేశారు .జాడీ పురా యాపిల్ తోట కుటీరం లో ధ్యాననిమగ్నుడై నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళేవారు .

స్వగ్రామం గొరగన పూడి చేరి తోటలో కుటీరం ఏర్పరచుకొని ‘’మాన్ టు బుద్ధ ‘’ అనే ఇంగ్లీష్ కవిత రాశారు .తర్వాత కైలాస మానస సరోవర యాత్రలు చేసి అక్కడకూడా మూడు రోజులు తపస్సు ఆచరించి ,తన యోగ సాధన అనుభూతులను స్వామి జ్ఞానానంద 30పూర్ణ సూత్రాలుగా రాశారు .పరబ్రహ్మ సాక్షాత్కారం పొంది తర్వాతజర్మని ఇంగ్లాండ్ అమెరికాలలో అకు౦ఠిత దీక్షతో చదివి న్యూక్లియర్ ఫిజిక్స్ లో అత్యున్నత శిఖరాలు అందుకున్నారు .భారత ప్రధాని నెహ్రూ ఆహ్వానం పై నేషనల్ ఫిజిక్స్ లేబరేటరి పరమాణు విజ్ఞాన పరిశోధనా విభాగం అధిపతిగా 17ఏళ్ళు సేవలందించారు .1965నుండి 69వరకు ఎందరికో మంత్రం దీక్ష అనుగ్రహించారు .1954లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు భౌతిక విజ్ఞాన విభాగం మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసి లో10ఏళ్ళు ఆచార్యులుగా, శాఖాధ్యక్షులుగా వెలుగొంది వాటికి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు. వీరి జ్ఞాపకార్ధం పరమాణు భౌతిక శాస్త్రంలోని ప్రయోగశాలకు “స్వామి జ్ఞానానంద పరమాణు పరిశోధన ప్రయోగశాల” (Swami Jnanananda Laboratories for Nuclear Research) గా నామకరణం చేశారు. సన్యాసి వస్త్ర ధారణతోనే ఉండేవారు 117వ మూలకం కనిపెట్టిన డా ఆకునూరి వెంకరామయ్యగారు జ్ఞానానంద శిష్యులే .ఆయన ప్రోద్బలం తోనే అమెరికా వెళ్లి అనేక పరిశోధనలు చేసి 117 వ మూలకం టెన్నెస్సీకనిపెట్టి ఆంద్ర దేశానికి భారతదేశానికీ అత్యంత గౌరవం తెచ్చారు .

జ్ఞానానంద రచించిన పూర్ణ సూత్రాలు తెలుగులోకి అనువదించబడ్డాయి. పరమాణు భౌతిక విజ్ఞాన ప్రాథమిక పాఠాలు, ఫిలాసఫీ ఆఫ్ యోగ, రాజయోగ గ్లిమ్సెస్, హై వాక్యుయా మొదలైనవి ఆంగ్లంలో ముద్రించబడ్డాయి.

ఆచార్యోత్తములు, పరమహంస, దర్శనవేత్త, కర్మయోగి అయిన స్వామి జ్ఞానానంద 1969 సెప్టెంబరు 21 తేదీన సౌమ్య సంవత్సర భాద్రపద శుద్ధ దశమి ఆదివారం ఉదయం 7-45 గంటలకు 73వ ఏట పరమపదించారు. గొరగనమూడిలోరామజ్ఞాన మందిరం లో వీరి సమాధిని పలువురు దర్శించుకొంటారు.

వీరి స్వీయచరిత్ర “శ్రీ స్వామి జ్ఞానానంద చరితామృతము” వీరు మరణించిన తరువాత వెలువడిన గ్రంథం.

స్వామి జ్ఞానానంద ఆశ్రమం విశాఖపట్నంలో వెంకోజీపాలెంలో ఉంది.

22-అనునిత్య భగవదను భూతి పొందినపరిపూర్ణ యోగి – బూర్లె రంగన్నబాబు -1895-1979

ఒంగోలు జిల్లా దర్శి తాలూకా శ్రీరమ భద్రపురం నుండి వీరి పూర్వీకులు పగోజి ఏలూరుకు తరలి వచ్చారు .వీర బ్రహ్మేంద్రస్వామి భక్త దంపతులు బూర్లె పుల్లయ్య ,జాలమ్మలకు 1895లో రంగన్నబాబు పుట్టాడు.ఒక అపరిచయ బాలుడు ఆతన్ని చిన్నతనం లో ఆరు నెలలు దేశ మంతా తిప్పి భద్రంగా ఇంటికి చేర్చాడు .సత్సంగాలు ధ్యానాలకు వెళ్లి రంగన్న ధ్యానం తో ఇష్టదైవాన్ని పొందవచ్చు అని తెలుసుకొన్నాడు .హృదయం రామకృష్ణ ఆ౦జ నేయులని ప్రతిస్టించు కొన్నాడు .లక్ష్మీ దేవమ్మను పెళ్ళాడి ఆరుగురు సంతానం పొందాడు . నీళ్ళ కావిళ్ళు మోసి వారిని పెంచాడు .ఆయన భక్తులు ఈపని తప్పించి గుంటూరులో పెట్టుకొని ‘’బాబు గారు ‘’అని గౌరవంగా పిలిచేవారు .తాత్విక విషయాలు జన్మ కర్మ విషయాలు బోధించేవాడు .నామం చేస్తే కర్మకరిగిపోతుందని చెప్పేవాడు .మహిమలు ప్రదర్శిస్తూ అవన్నీ శ్రీరామకరుణా కటాక్షమే అనే వాడు .22-7-1979 సిద్ధార్ధి సంవత్సర కార్తీక శుద్ధ విదియ సోమవారం పూర్ణయోగి రంగన్నబాబు 84 వ ఏట శ్రీరామ సన్నిధి చేరాడు .ఆయనకు సమాధి మందిరం లేవు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉయ్యూరుకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిగపూడి ప్రేమ్ చంద్(87) మరణం

ఉయ్యూరుకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిగపూడి ప్రేమ్ చంద్(87) మరణం

ఉయ్యూరుకు చెందినప్రపంచ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిగపూడి  ప్రేం చంద్ గారు నిన్న 9-9-20 బుధవారం రాత్రి హైదరాబాద్ లో మరణించినట్లు ,ఈ రోజు ఉదయం అక్కడే మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరిగినట్లు ఈ ఉదయం 11-50కి గండిగుంట వాసి, గుంటూరు నాగార్జున యూని వర్సిటీ రిటైర్డ్ లైబ్రేరియన్ ,ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న సరసభారతి ఆత్మీయులు శ్రీ సుంకర కోటేశ్వరరావు గారు వాట్సాప్ లో మెసేజ్ పంపారు .నేను సాయంత్రం 4గంటలకు చూసి, రిప్లై ఇచ్చాను .ప్రేం చ౦ద్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను వారి  కుటుంబానికి  సాను భూతి తెలియ జేస్తున్నాను .

జీవిత విశేషాలు

శ్రీ ఆరిగపూడి ప్రేంచంద్22-3-1933 న ఉయ్యూరు మండలం  కడవకొల్లు అనే కుగ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ 1925లో స్వంత ఖర్చులతో గ్రామస్తుల సహకారం తో కడవకొల్లు లో హయ్యర్ ఎలిమెంటరి స్కూల్ నిర్మించి నడిపారు .ఆర్ధిక పరిస్థితులు కలిసిరాక ,దాన్ని కృష్ణా జిల్లా బోర్డ్ కు అప్పగించి ,మకాం ఉయ్యూరు కు మార్చి ఏది చేసినా కలిసిరాక బాగా నష్టపోయారు ..ప్రేంచంద్ గారు పామర్రు హై స్కూల్ లో ఎస్ ఎస్ ఎల్సి  చదివిపాసయ్యారు విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో  హిస్టరీతో ఇంటర్ చదివి ,ఉత్తమ శ్రేణి లో ఉత్తీర్ణులై ,ఆర్ట్స్ సబ్జెక్ట్ లో ఘనత సాధించి రికార్డ్ సృష్టించారు .కుటుంబం దుర్భర జీవితాన్ని గడుపుతున్నా ,స్వయం శక్తి తెలివి తేటలతో ప్రగతి సాధించారు .ప్రేమ చాంద్ గారి బావగారు శ్రీ త్రిపురనేని సుబ్రహ్మణ్యంగారు ఉయ్యూరు హై స్కూల్ లో మాకు తెలుగు పండితులు  ఎస్ వి  రంగారాఉ పర్సనాలిటి మేస్టారిది.

విశాఖ ఆంద్ర విశ్వవిద్యాలయం లో ఎకనామిక్స్ లోబి ఏ ఆనర్స్ చదివి , ఫస్ట్ క్లాస్  లో పాసై మరో రికార్డ్ నెలకొల్పారు .అప్పటిదాకా సైన్స్ లెక్కల సబ్జెక్ట్ లవారికే ఇలా తండ్రి మరణం తో కుటుంబ బాధ్యతలు గ్రహించారు శ్రీమతి రామ గారితో వివాహం జరిగి దిశా దశ తిరిగింది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డిప్లొమా చేసి ,ఆంధ్రాయూని వర్సిటీ లో ట్యూటర్ గా చేరి విద్యార్ధులకు ముందస్తు తరగతులు బోధించారు .ఆలిండియా సర్వీస్ పరీక్ష పాసై ,ఢిల్లీ సెంటర్ సెక్రెటేరియట్ లో చేరి ,కేంద్ర బడ్జెట్ రూప కల్పనకు తోడ్పడ్డారు .

ప్రేంచంద్ రాసిన ‘’కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్ పెండిచర్’’అనే బృహత్ గ్రంథాన్ని  ప్రపంచ ఆర్ధిక వేత్తలు చదివి ‘’కర దీపిక ‘’గా ప్రశంసించారు .ఆర్ధిక రంగం లో వచ్చిన మొట్ట మొదటి ఆ పుస్తకం నాలుగు నెలలలో ద్వితీయ ముద్రణ పొంది ,ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రచారమైంది .తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆర్ధికవేత్త గా పని చేసి ,ఢిల్లీ లో ఫోర్డ్  అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగించారు .’’పెర్మార్మింగ్ బడ్జెట్ ‘’అనే గొప్ప అరుదైన పుస్తకం రాసి ,మరింత పేరు ప్రఖ్యాతు లార్జించారు .అదృష్టం ,స్వయం ప్రతిభ కృషి కలిసొచ్చి అమెరికాలోని వాషింగ్టన్ లో ఉన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి –ఐ .ఎం. ఎఫ్. లో ఈ ఆర్ధిక వేత్తకు అనువైన హోదా ఉద్యోగం గౌరవం లభించాయి .ఈ సంస్థలో 30సంవత్సరాలు పని చేసి ,తన అనుభవాలను అన్ని దేశాలకు అందించి ,ఐఎంఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు .ఆర్ధిక విషయాలపై డజనుకు పైగా అపూర్వ గ్రంథాలు రాశారు. అందులో లేటెస్ట్ బుక్ 2017మార్చి లో   రాసిన ‘’పబ్లిక్ ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్  అండ్ పబ్లిక్ పాలిసి ఇన్ ఇండియా –క్రైసిస్  అండ్ రెన్యువల్ ‘’.ఉద్యోగం లో ఉండగా ప్రపంచ దేశాలన్నీ పర్యటించారు .ఎన్నో దేశాలకు ఆర్ధిక సలహాదారుగా ఉన్నారు .ఆ దేశాల ఆర్ధిక పరిపుష్టి కి విలువైన సలహాలిచ్చి అమలు జరిగేట్లు చేసి ,ఆర్దిక  ఉన్నతికి సాయం చేశారు .వీరి సేవలు గుర్తించిన అమెరికా తానా సంస్థ ‘’ఎక్సలెంట్ అండ్ ఒరిజినల్ కంట్రి బ్యూషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎకనమిక్స్ ‘’పురస్కారం అందించి గౌరవించింది .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి తగిన పురస్కారాలు అందించకపోవటం శోచనీయం .

ప్రేంచంద్ గారు  తమ జీవిత చరిత్ర ను ‘’ఆన్ ఫ్రింజేస్(అంచులు ) ఆఫ్ గవర్నమెంట్ –ఎ పర్సనల్ జర్నీ ‘’గా రాశారు .ఇందులో తాను పుట్టిపెరిగిన కడవకొల్లు ఉయ్యూరు లలో ఆనాటి జనజీవితాన్ని ,పరిస్థితులను గ్రంధస్ధం చేసిన మొదటి వ్యక్తి .తనకుటుంబం చదువు ఉద్యోగాలు సామాజిక స్థితిగతులు ,సహచరులు ఉపాధ్యాయులు ,అధ్యాపకులు మొదలైన అన్ని విషయాలపైనా నిర్మోహమాటంగా ఆత్మీయంగా రాశారు. అది ‘’ఒక సమర్ధుని  జీవిత యాత్ర ‘’అని ఖచ్చితంగా అని పిస్తుంది .అర్ధ శతాబ్దికి పైగా అమెరికాలో ఉంటూ ,ప్రపంచ ఆర్ధిక శాస్త్ర వేత్తలలో ఒకరుగా గుర్తింపు పొంది ,సదరన్ కాలి ఫోర్నియా ఇర్విన్ లో నివాసముండే వీరు సుమారు పదేళ్ళ నుంచి హైదరాబాద్ లో దర్గా వద్ద స్వగృహం లో  అర్ధాంగి శ్రీమతి రమగారితో  తో  కాపురం ఉంటున్నారు .మద్య మాంసాలకు దూరంగా శాకాహారిగా ఉంటున్న ఆ దంపతులు అందరికీ ,ప్రేరణ ఆదర్శం .నీతీ నిజాయితీ అంకిత భావం తో కర్తవ్య నిర్వహణ చేసిన ప్రేంచంద్ అవి అందరిలో ఉండాలని ఆశిస్తారు .

ప్రేమ చంద్ గారితో నా పరిచయం – .2004లో అమెరికా నుంచి ఉయ్యూరుకు తమ తలిదండ్రుల పేర నిర్మించబడినభూరి విరాళం తో ’’ శ్రీ మైనేని వెంకట నరసయ్య  శ్రీమతి  సౌభాగ్యమ్మ  దంపతుల  స్మారక ఎసి గ్రంధాలయం ‘’ప్రారంభోత్సవానికి వచ్చిన ఉయ్యూరు వాసి అక్కడి యూని వర్సిటీలైబ్రరీలో అత్యుత్తమ పోస్ట్ లో ఉన్న శ్రీ మైనేని గోపాలకృష్ణగారు వచ్చారు  .అదే తొలి పరిచయం .దాని నిర్మాణకమిటీకి నేను కన్వీనర్ .దక్షిణభారతం లో తొలి ఎసి లైబ్రరీ అది . 2008 లో అమెరికాకు మూడవసారి మా దంపతులం మాఅమ్మాయి వాళ్ళు ఉంటున్న మిచిగాన్ రాష్ట్రం లోని ట్రాయ్ దగ్గరున్న స్టెర్లింగ్ హైట్స్ కు వెళ్లాం .అప్పుడు మైనేనిగారితో పరిచయం బాగా ఎక్కువై ,రోజూ ఫోన్ లో మాట్లాడటం ,మెయిల్స్ రాసుకోవటం జరిగింది .అప్పుడు ప్రేంచంద్ గారి గురించి చెప్పి ఫోన్ లో పరిచయం చేశారు .ప్రేమచంద్ గారు తమ జీవిత చరిత్రను నాకు పోస్ట్ లో పంపితే ఆబగా చదివి వారం లో దాదాపు 40పేజీల సమీక్ష’’’’ఒక సమర్ధుని జీవిత యాత్ర ‘’గా  రాసి మైనేని గారికి ,పంపితే ఆయన ప్రేమ్చంద్ గారికి పంపగా చదివి ఎంతో బాగా నచ్చి అభినందించి ఫోన్ చేశారు .అప్పటినుంచి తరచూ ఫోన్ లో మాట్లాడుకోనేవారం .మైనేనిగారు ఒక సారి నాకు ఫోన్ చేసి ‘’ఉయ్యూరులో ప్రేమ్చంద్ గారికి మీరు నిర్వహిస్తున్న సాహితీ మండలి ద్వారా ఘన సన్మానం చేయాలి .ఖర్చు అంతా నేను భరిస్తాను .పట్టు బట్టలు ఆదంపతులకు పెట్టాలి, మీదంపతులూ కొనుక్కోవాలి ‘’అని ఆజ్ఞలాంటి కోరిక తెలియ జేశారు .సరే అని 2008 అక్టోబర్ చివర్లో ఇండియా వచ్చి ,మైనేనిగారి కోరికపై మద్రాస్ వెళ్లి మైనేని గారి దగ్గర బంధువు శ్రీమతి రోజా గారు మా ఇద్దర్నీ రిసీవ్ చేసుకొని  మా మేనకోడలు వాళ్ళింటికి తీసుకు వెళ్లి , వెళ్లి  మద్రాస్ లో  ఉన్న ప్రేమ చ౦ద్ గారి పెద్ద కుమార్తె దంపతులను డిసెంబర్ 24 న ఉయ్యూరులో జరిగే ప్రేమ చ౦ద్ గారి సన్మాన సభకు ఆహ్వానించి ,మైనేని గారికీ శ్రీ బాపు రమణ ల గారికి ఉన్న అపూర్వ స్నేహం వలన రోజా ను మమ్మల్ని బాపు రమణల ఇంటికి వెళ్లి కలిసే ఏర్పాటు ముందే చేసి ఆ మహానుభావులను  కలిసే అదృష్టం  మా దంపతులకు  దక్కించారు  .మద్రాస్ లోనే పట్టు బట్టలు కొని ఉయ్యూరు చేరి ,పోరంకి లో విశాల భవంతి ఐన స్వగృహం లో ఉన్న ప్రేంచంద్ దంపతులను  ఆహ్వానించి వచ్చాం .

ఉయ్యూరు లైబ్రరీ లో కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చ౦ద్ ,విజయవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ .శాసనమండలి సభ్యుడు శ్రీ వవైవిబి రాజేంద్ర ప్రసాద్ మొదలైన ప్రముఖుల సమక్షంలో ప్రే౦ చాంద్ గారికి పట్టుబట్టలు పుష్పహారాలు శాలువాలాతో ఘన సన్మానం చేశాం .ఒక రకంగా అది ‘’ఆర్ధిక పూర్ణ ప్రేమ చంద్రుని ప్రతిభకు’’కు చంద్రునికో నూలు పోగు .  వారిపై నేను రాసిన  కర పత్రం  అందరికి పంచాం .ఆయనకోరికపై ఆయన చిన్నతనం లో పరిచయమైన వారినీ ఆహ్వానించాం .ఖర్చు అంతా మైనేని గోపాల కృష్ణగారిదే.శ్రీ సుంకర కోటేశ్వరరావు, శ్రీ రామినేని భాస్కరేంద్ర,శ్రీ దేవినేని మధుసూదనరావు గార్లు  కూడా వచ్చారు .అదొక చిరస్మరణీయమైన సంఘటన . మీడియా అంతా బాగా ఇంటర్వ్యు చేసి గొప్ప ప్రచారం కల్పించారు .రేడియో వారు స్టూడియోకి పిలిపించి ఇంటర్వ్యు చేశారు .ఉయ్యూరు కాలేజీ వారు ఆతర్వాత ఆహ్వానించి ప్రసంగం ఏర్పాటు చేసి సత్కరించారు .మాది నాందీ ప్రస్తావన అవటం గర్వకారణం .దీని వెనకున్న మైనేని వారి అమృత హృదయం  వెలకట్ట  లేనిది. ప్రేమ్ చంద్ గారంటే అధికమైన గురు భక్తి గోపాలకృష్ణ గారికి .

2012లో మేమిద్దరం నాలుగో సారి అమెరికా వెళ్ళేటప్పుడు హైదరాబాద్ లో ప్రేమ చంద్ దంపతులను చూసి ఆశీస్సులు పొంది వెళ్లాం .ఆతర్వాత సరసభారతి పుస్తకాలు  ఎప్పటికప్పుడు పంపేవాడిని .అందినట్లు తెలియ జేసేవారు మెయిల్ లో. ఎప్పుడూ నన్ను ‘’మాస్టారూ ‘’అని సంబోధించే సంస్కారం ఆయనది . సరసభారతి బ్లాగ్ రెగ్యులర్ గా చదివేవారు .చక్కని కామెంట్స్ రాసేవారు .ఒక సారి ‘’యక్ష ప్రశ్నలు ‘’గురించి పూర్తి వివరాలు కావాలని మెయిల్ రాస్తే సమగ్రంగా బ్లాగ్ లో రాసి పంపితే మహాదానందపడ్డారు .కెమటాలజి పిత డా. కొలాచల సీతారామయ్య గారి పుస్తకానికి ముందు మాటలు వారితోనే రాయించాలని నేనూ, మైనేని గారు భావించి ఫోన్ లో తెలియ జేస్తే, గొప్ప గా ఇంగ్లీష్ లో రాశారు .నేను ‘’అజ్ఞాత మార్గదర్శి ‘’గా అనువదించి వారిద్దరికీ పంపి, ఓకే చేయించి అందులో చేర్చాను .శ్రీ శార్వరి ఉగాదికి సరస భారతి ఆవిష్కరించిన పుస్తకత్రయం లో’’ ఆధునిక ఆంద్ర విజ్ఞాన శాస్త్ర మణి రత్నాలు  ‘’పుస్తకం లో వారి గురించి విపులంగా రాసి ఋణం తీర్చుకోన్నాను .

ఒక గొప్ప ఆర్ధిక శాస్త్ర వేత్త మనకు దూరమయ్యారు .వారి ఆత్మకు శాంతి కలుగజేయమని భగవంతుని కోరుతున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-9-20-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—10

మనకు తెలియని మహాయోగులు—10

19-దివ్యమాత కోన అంజనాదేవి -1917-1977

అన౦తపురం జిల్లా పెనుగొండ తాలూకా పైదేటి గ్రామంలో నిరుపేద కుమ్మరి కుటుంబం లో అంజనాదేవి 1917లో పుట్టింది .ఆమె బాల్యంలో పెనుగొండ బాబయ్య  అనే ముస్లిం యోగి సమాధి వెనుక శివాలయం దగ్గర చక్కర చెట్టునుంచి రాలే పంచదారను ప్రసాదంగా పంచేది .15వ ఏట నారాయణప్పతో వివాహం జరిగి ,30 ఏళ్ళుసంసారజీవితం అనుభవించి దైవ బలంతో ఎందరికో మేలు చేసేది ,కోన క్షేత్ర పాండురంగ స్వామి కలలో ఒక రోజు కనిపించగా ,తనజీవితాన్ని గుట్టూరు కోన కణ్వాశ్రమం లో గడపాలని నిర్ణయించింది .

   భక్తులెందరో వచ్చేవారు ఆపదలలో ఉన్నవారిని ఆర్తులనుదీనులను రోగులను  ఆదుకోన్నది .జ్ఞానబోధ చేసేది .కోన అంజనా దేవిగా కోన మాతగా దివ్యమాతగా  ప్రసిద్ధి చెందింది .వాక్శుద్ధి భవిష్యవాణి లతో అందరినీ దగ్గరకు చేర్చింది. 4-6-1977పింగల సంవత్సర జ్యేష్ట బహుళ చవితి శనివారం సాయంత్రం దివ్యమాత అంజనాదేవి 60 వ ఏట దివ్యలోకాలకు చేరింది.

20-కళా ప్రపూర్ణ ఓరుగంటి నృసింహ యోగీంద్రులు -1914-1978

తూర్పు గోదావరిజిల్లా రాజోలు తాలూకా గంటి గ్రామం లో ఓరుగంటి సీతమ్మ లక్ష్మీనారాయణ అనే సంపన్న బ్రాహ్మణ దంపతులకు లక్ష్మీ నరసింహ మూర్తి 17-10-1914 ఆనందసంవత్సర ఆశ్వయుజ బహుళ త్రయోదశి శనివారం ముంగండ లో జన్మించాడు .8వ ఏట ఉపనయనం చేసి వేదం నేర్పించారు .పదేళ్ళ వయసులో షహీద్ భగత్సింగ్ ,అల్లూరి సీతారామ రాజుల వీర గాధలకు ప్రేరణ చెంది ,దేశస్వాతత్ర్యం కోసం ఇల్లు వదిలి వెళ్ళాడు .అన్నవరం దగ్గర కనిపిస్తే  తండ్రి ఇంటికి తెచ్చాడు .

   మళ్ళీ పారిపోయి గుంటూరులో కాశీ కృష్ణాచార్యుల వారివద్ద సంస్కృతం నేర్చి తెలుగు హిందీ సంస్కృతాలలో అనర్గళం గా మాట్లాడే  నేర్పు సంపాదించాడు  .తాతగారు నరసంహం గారికితెలిసి ఇంటికి తీసుకు వెళ్లి ,గట్టికాపలా పెట్టి కావ్య పాఠాలు చెప్పించారు .సిద్ధ పురుషులను సేవించి మహిమలు సాధించాలనే బలీయమైన కోరికతో ,మళ్ళీ1926లో ఒక అర్ధరాత్రి  ఇల్లువదిలి తణుకు లో రైలు ఎక్కగా ,హరిద్వార్ కు చెందిన ఒక మార్వాడీ దంపతులు తమతో ఇంటికి తీసుకు వెళ్లారు .ఆరు నెలలలో అనేక శాస్త్రాలు నేర్చాడు .1927లో మార్వాడీ దంపతుల అనుమతి తో బదరీ యాత్రకు బయల్దేర్రి ,ఎనిమిది రోజులు నడిచి పాండవులు స్వర్గారోహణ చేసిన ‘’శీతో పథం’’దగ్గర పర్వత గుహలో సమాధి నిష్టుడైన 350ఏళ్ళ సిద్ధ పురుషుడు సర్వానందావ దూతను దర్శించి శిష్యుడై హఠయోగం లో కొన్ని క్రియలు నేర్చాడు .గురువు ఈయనకు 7రొజులు తర్వాత  మంచు వాతావరణం లో తట్టుకొనే శక్తిని ప్రసాదించాడు.

  గుర్వాజ్ఞాపై హరిద్వారం చేరి మార్వాడీ దంపతులింట్లో ఉండి,మరికొంతశాస్త్రాధ్యయనం చేసి గురువును చేరాడు. పూర్తి హఠయోగం,ఇతర యోగాసాధనలు నేర్పాడు .సచ్చిదానంద అవధూత గురువు మూర్తిని ఆయనగురువు రామాలాల ప్రభువును ఆశ్రయించమనీ , ,ఆయనే మోక్ష ప్రదాత అని చెప్పి సిద్ధి పొందాడు .

  లక్ష్మీ నరసింహమూర్తి 2-10-1930న రామాలాల ప్రభువును రుషీకశ్ లో  దర్శించగా ,’’నర్సింగ్ ‘’అని పేరు పెట్ట గా, మహా కృష్ణ భక్తుడై మధురకు వెళ్లి కృష్ణనామ స్మరణతో కొంతకాలం గడిపి ,ఏక సంతాగ్రాహి కనుక అక్కడ బృహద్భాగవతం కంఠస్తమైంది .మళ్ళీ రామలాలా గురువును చేరి పత౦జలి యోగసూత్రాలు కొన్ని సాధన చేసి ,1936లో స్వగ్రామం గంటి వెళ్లి శాస్త్రాధ్యయనం చేసి రామలాలా దేహం చాలించేముందు ఋషీకేశ్ చేరాడు ..గుర్వాజ్ఞపై  ఆంధ్రదేశానికి తిరిగివచ్చి లక్ష్మీదేవిని పెళ్ళాడి ,చాలామందికి ధ్యాన దీక్షనిచ్చి ,దేశమంతా పర్యటించి భాగవత ఉపన్యాసాలు చేశాడు .నెహ్రు ,రాజేంద్ర ప్రసాద్ వంటి వారివద్ద ‘’వజ్రోళి’’వంటి యోగశక్తులను ప్రదర్శించి ఆశ్చర్యపరచాడు . వజ్రోళి అంటే హఠ యోగం లో ఒక ముద్ర .  వీర్యాన్ని నిలువ చేసి, వదిలేసి  మళ్ళీ సేకరించటం . 1975లో ఆంద్ర విశ్వ విద్యాలయం ‘’కళా ప్రపూర్ణ ‘’బిరుదప్రదానం చేసి సత్కరించింది .నృసి౦హ యోగి 16-6-1978న 64వ ఏట చనిపోయాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -5

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -5

3- టిం చేయాల్సిన ముఖ్యమైన పని

నాతో డాన్స్ చేసిన అమ్మాయి మనసులో మెదిలి ,ఇక్కడే ఉ౦దామనుకొన్నాను .నా భావం గ్రహించి చిరునవ్వుతో ‘’ఆమె పేరు సిసిల్లా ‘’అన్నాడు .తర్వాత మా గమనం అంతా ఆకాశ విహారమేకనుకు చుట్టూ ఉన్నవి దీక్షగా చూసే అవకాశం లేదు .పర్వతాలు అరణ్యాలు సరస్సులు చకచకా కదిలిపోతున్నాయి .విమానప్రయాణ౦  కంటే మహా ముచ్చటగా ఉంది .హంస వాలినట్లు కింద నెమ్మదిగా వాలాం.ఇల్లులాంటి ఇంటికి చేరాం .గుండ్రంగా ఉంది పైకప్పు లేకపోవటం షరామామూలే .ఊహించరాని అన్నిరకాల పుష్పాలు కనిపించాయి .’’దీన్ని టౌన్ హాల్ ,సమావేశ మందిరం అంటాం . ఇక్కడే ప్లానింగ్ మీటింగులు జరుపుతాం. సహాయ కార్యక్రమాలు చేస్తాం .ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడి వారిని అడగాలి నువ్వు .’’అన్నాడు .లోపలి వెళ్లి చూస్తే కళ్ళు  చెదిరి పోయాయి అందానికి .గోడలనిండా సహజ చిత్రాలు నేలపై తెల్ల పసుపు పుష్పాలు .ఆజానుబాహులైన వ్యక్తులు నడుస్తూ ఇక్కడ కనిపించారు .మధ్యలో ఉన్న తిరుగుడు మెట్లు ఎక్కి పైకి వెళ్లాం. అక్కడ వేలాడే ప్లాట్ ఫారం కనిపించింది .అదికదలటం లేదు. మాన్యుల్ నా చెయ్యిపట్టుకొని ఒక పెద్ద ఫ్లోటింగ్ రూమ్ లోకి తీసుకు వెళ్ళాడు .అక్కడ తొమ్మిదిమంది ఆడామగా వారున్నారు .సుఖాసీనులై ఉన్నారు .ప్రతివారిముందు  గుండ్రని టేబుల్ ఉంది .నేలపై వివిధ పుష్పాలు గోడలు అల్లిన కొమ్మలు గా ఉన్నాయి .

  మేము లోపలి వెళ్ళగానే రెండు కుర్చీలు తెచ్చి వేసి మా ఇద్దర్నీ కూర్చోమన్నారు .అది ఒక నుయ్యిలాగా ఉంది .నా కాళ్ళకు జెల్లీ   అంటుకున్నట్లు  అనిపించింది .అందులో మధ్యలో కూర్చున్నాయన నీలికళ్ళతో నావైపు చూశాడు పొడవైన తెల్లని జుట్టు గడ్డం ఉన్నాయి .ముఖం పై ముడతలు లేవు .యవ్వనోత్సాహంతో హాయిగా కనిపించాడు .చేతులతో ఆహ్వానిస్తే నేనూ బదులిచ్చాను .’’భూమిపైనుంచి వచ్చిన యువ స్నేహితుడా స్వాగతం .నేను ఆర్నియాల్ .ఈ  సింపోజియం  కు లీడర్ ను .నీకు ఇక్కడ సుఖంగా ఉందనుకొంటా .ఇక్కడ ఉండాలను ఉందని భావిస్తా ‘’అన్నాడు స్వచ్చమైన స్పుటమైన ఇంగ్లీష్ లో .’’ఇక్కడ  నాకు కనిపించిన ప్రతిదీ మహా ఆశ్చర్యంగా ఉంది .అయినా అమ్మను చెల్లిని వదిలి ఉండలేను .ముందు నేను వెళ్లి వాళ్ళను చూడాలి .ఆతర్వాత తిరిగి వచ్చి ఇక్కడి మంచిని తెలుసుకొంటాను ‘’అన్నాను.

  ‘’నీ కోరిక గ్రాంట్ చేస్తున్నాం. కాని ఒక కండిషన్ .భూమిపై జనానికి మేము ఇక్కడ ఉన్నట్లు తెలియజేయాలి నువ్వు .తర్వాత తిరిగి రావచ్చు .ముందు మేమిక్కడ ఉన్న మెసేజ్ అందించాలి నువ్వు ‘’అన్నాడు ‘’నా కాకమ్మ కబుర్లు వాళ్ళు నమ్మరు ‘’అన్నాను .’’ .వాళ్ళు ఏమనుకొన్నా ధైర్యం కోల్పోకు .నీకు కష్టమొస్తే  రక్షించటానికి మేము సిద్ధంగా ఉంటాం .మేమిక్కడ ఉన్నామని వాళ్ళు అక్కడ వంటరి వాళ్ళు కాదన్న సందేశం వాళ్లకి చేరాలి మిత్రమా .వాళ్ళ కాలుష్యం ,కష్టాలలో మేము పాల్గొనం .ఈ విషయం గట్టిగా చెప్పు .వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ పొతే తమ నాశనాన్ని వాళ్ళే కోరి తెచ్చుకొంటున్నారని చెప్పు .ఉపేక్షిస్తే వాళ్ళు సర్వనాశనమౌతారని హెచ్చరించు .దానివల్ల భూమికంటే ప్రజలకే తీవ్రనష్టం .చాలా ప్రమాదకరమైన అంచుమీద ఉన్నారు .త్వరలోనే పతనం తప్పదు’’అన్నాడు .నేను భయంతో ‘’మమ్మల్ని రక్షించేవారు లేరా ??’’అన్నాను .’’ఆప్రయత్నం లోనే ఉన్నాం .లేకపోతె ఆప్రమాదం మాకూ తప్పదు .టిమోతీ మిత్రమా ఇప్పుడు నువ్వు మా మెసెంజర్ వి .’’అన్నాడు ‘’నా శాయశక్తులా కృషి చేస్తాను ‘’అన్నాను గొణుగుతూ .ఆయన నాకు ఒక విజిల్ ఇచ్చి ‘’ఇబ్బందుల్లో ఉంటె విజిల్ ఊదు.దాని శబ్దం నీకేమీ వినిపించదు.కానిమాకు మనసు వేగంతో సిగ్నల్ అందుతుంది .దీన్ని పారేసుకోకు ‘’అని జాగ్రత్త చెప్పాడు .వంగి నమస్కారం చెప్పాను .నవ్వుతూ ఆర్నెల్ ‘’డబ్బు గురించి బెంగ వద్దు .మాన్యుల్ నీకు కావలసినంత ఇచ్చి పంపిస్తాడు .నీ ఇస్టమొచ్చి నంత కాలం ఉండు అక్కడ .మౌంట్ షాస్తావరకు మాన్యుల్ నీకు తోడుగా ఉంటాడు నాయనా .’’అన్నాడు .

  నా చొక్కా పట్టి మాన్యుల్ నెమ్మదిగా లాగాడు .కనుక మిగిలినవాళ్ళను చూసి తెలుసుకోలేకపోయాను . వాళ్ళంతా కొత్త వాళ్ళే.మాన్యుల్ ‘’నీకు మంచి  బట్టలుకావాలి’’అని నన్ను ఆటన్నేల్ ద్వారా ఒక టైలర్ దగ్గరుకు తీసుకువెళ్ళి ‘’ఈ కుర్రాడికి భూమిపై వేసుకొనే  డ్రస్సులు  ఒక సంచి నిండా ఇవ్వు ‘’అన్నాడు . వెంటనే ఇచ్చేశాడు వాలెట్ లోని డబ్బు తీసి మాన్యుల్ నాకు ఇచ్చాడు  ‘’సరాసరి కాలిఫోర్నియాకే వెడుతున్నానా ‘’అడిగాడు .’’అవును అక్కడినుంచి మీ సియాటిల్ కు రెగ్యులర్ ఫ్లైట్స్ ఉంటాయి .’’అన్నాడు. ‘’నేను తిరిగి రావాలంటే ?”’అన్నాను .’’ముందుగా మనకు ఒక బ్రిడ్జి కనిపిస్తుంది అది దాటాలి .ముందుగా నీకు టైలర్ తగినట్లుగా బట్టలు కుట్టాడో లేదో  వెళ్లి చెక్ చేసుకోనిరా .నేను ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ‘’అన్నాడు

  నేను నాగైడ్ దగ్గరకు  జీన్స్, పేల్ బ్లూ పుల్  ఓవర్  నేవీ జాకెట్ తో తిరిగి వచ్చాను .అతడుమోకాళ్ళదాకా  ఉన్న గౌన్ తో కనిపిస్తే ఆశ్చర్యపోయాను .ఒక వాలెట్ లో నా పాస్ పోర్ట్ కూడా పెట్టి అందించాడు .అవి అతనికి ఎలా దొరికాయో నాకు సందేహం .’’భూమి మీదకు ఇది కొత్తపాస్ పోర్ట్ .మాకు అక్కడ ఎమేమి  అవసరమో  తెలుసు .అక్కడి చట్టాలూ తెలుసు .తెలీదనుకున్నావా ‘’అన్నాడు నవ్వుతూ .నా బాక్ పాక్ కూడా రెడీ చేసి ఇచ్చారు ,అందమైన టెలోస్ నుంచి టన్నెల్  చేరాం .అక్కడున్న చిన్న వెహికిల్  లో నేనూ మాన్యుల్ కూర్చునగా అతడు రెండు బటన్స్ నొక్కగా అది స్టార్ట్ అయింది ‘’మీ వాళ్ళు ఎంతక్రూరంగా ప్రవర్తించినా దిగులు పడకు ఆశ వదులుకోకు .అని కస్టాలు ఎదుర్కొంటూ ఉండు అక్కడ ఒకమ్మాయి నీకు కనిపిస్తుంది .ఆమెకు మా గురించి చెప్పు. ఆమె నిన్ను నమ్మితే ఆమెను ఒక్కదాన్నే ‘’ మళ్ళీ నీతో ఇక్కడికి తీసుకురా ‘’అన్నాడు .’’నేను ఇంటి దగ్గరే ఉంటా అమ్మా చెల్లెలుతో. వాళ్ళను కనిపెట్టుకొని ఉండాలి  అమ్మకు  వచ్చే పెన్షన్ నామ మాత్రమె ‘’అన్నాను .’’నక్షత్రాలను మార్గదర్శనం చేయమని కోరుతాను .అవే నీకు మార్గదర్శకం చేస్తాయి ‘’అని గట్టిగా హత్తుకొన్నాడు .నక్షత్రాలు అంటాడేమిటి అనుకోని చూస్తె మినుకు మినుకు మనే రెండు లాంతరు  దీపాలు మాత్రమె కనిపించాయి .మా వెహికిల్ ఒక స్టెయిర్ కేస్ ముందు ఆగింది .అవి ఎక్కి పైకి వెడితే ఒక ప్లాట్ ఫారం పైకి చేరాను .అక్కడి ఇనుపగేటు తెరుచుకొన్నది .అది పర్వతం ప్రక్కన ఉంది .గాలి వర్షం పడుతోంది .మౌంట్ షాస్తాఒక చిన్నమానవ మాత్రుడు చీకటి ని కౌగలిస్తూ తను నిజం అని నమ్మే లోకం లోకి ప్రవేశించటానికి సాక్షీ భూతంగా ఉంది .

    సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’నాటక రంగ వేజేత’’ అలేక్జాండర్’’ శ్రీజయప్రకాష్ రెడ్డి

’నాటక రంగ వేజేత’’ అలేక్జాండర్’’ శ్రీజయప్రకాష్ రెడ్డి

 

 

సుమారు 167సినిమాలలో జీవించాడు .నెల్లూరు యాసకు  హాస్యనటుడు రమణారెడ్డి జీవం పోస్తే ,జెపి రాయలసీమ యాసకు ప్రాణం పోశాడు

ఉయ్యూరుకు దగ్గర గండి గుంట కు చెందిన స్టేజి ,టి.వి.నటుడు,ప్రొడ్యూసర్, డైరెక్టర్  ఉయ్యూరు హైస్కూల్ లో  విద్యార్ధి శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు  ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం గత రెండు సార్లుగా ఘనం గా నిర్వహించాడు .మూడవసారి  మొదటి రోజు 18-4-16 సోమవారం శ్రీ కోట శంకరరావు ప్రదర్శించిన ”మినిస్టర్ ”నాటకం ,ప్రసిద్ధ పౌరాణిక నటుడు శ్రీగుమ్మడి గోపాల కృష్ణ ప్రదర్శించిన శయన దృశ్యం (పడక సీను ) బాగా ఆకట్టుకొన్నాయి ముఖ్య అతిధిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు .

రెండవ రోజు విలన్కేరక్టర్ యాక్టర్ గా రాయలసీమ యాస భాష తో ప్రసిద్ధులైన శ్రీ తూర్పు  జయ ప్రకాష్ రెడ్డి ‘’అలెక్సాండర్’’నాటకం ఆద్యంతం రక్తి కట్టింది .రచన కీ శే పూసల .నటనా ,నిర్వహణ శ్రీ రెడ్డి .దాదాపు ఏక పాత్రాభినయం .అయితే కొత్త ప్రయోగం .దీన్ని గురించి రెండేళ్ళ క్రితం పేపర్లో చదివి రెడ్డిగారు చాలా బాగా చేస్తున్నారని తెలుసుకొన్నాను. ప్రత్యక్షంగా నిన్న చూశాను .నిజంగా చెప్పాలంటే ‘’ప్రీ రికార్డెడ్ ‘’నాటకం .రికార్డర్ లో వచ్చే మాటలను బట్టి పెదిమలు కదిలిస్తూ హావ భావ ప్రకటన చేస్తూ, ఒంటి చేత్తో శ్రీ జయ ప్రకాష్ రెడ్డి నిర్వహించాడు .మిగిలిన పాత్రలున్నా అవి వినిపించేవే కాని  స్టేజి పై కనిపించేవికావు .కాని వారందరి గొంతుకలు చాలా నిర్దుష్టంగా పాత్రల స్వభావాలకు తగినట్లు ఉండటం మహా గొప్ప గా ఉంది .వారి సెలెక్షన్ ,రెండరింగ్ లో తీసుకొన్న జాగ్రత్త మెచ్చ దగినది .సంఘం లో ఉన్న అనేక సాంఘిక దురన్యాయాలు ,పిరికితనం ,ఆరళ్ళు వంటి వాటికీ హెల్ప్ లైన్ లో శ్రీ రెడ్డి చెప్పిన పరిష్కారాలు ,అవి క్లిక్ అయిన వైనాలు బాగా ఆకర్షించాయి .ఇతర దేశాలలో బెకెట్ధారన్ టన్ వంటి నాటక రచయితలూ ఎన్నెన్నో ప్రయోగాలు చేసి నోబెల్ బహుమతి అందుకొన్నారు .ఎన్.ఆర్ నంది వంటి వారూ ప్రయోగాలు చేశారు .నిలకడ నీరు ఆరోగ్యం కాదు. ప్రవాహ జలం ఆరోగ్యకరం అందుకే ప్రయోగాలు .

  శ్రీ రెడ్డి ఒక్కడే స్టేజి అంతా దున్నేశాడు అన్ని రకాల భావోద్వేగాలకు చిరునామాగా నిలిచి పోషించి సెహబాస్ అనిపించాడు .పూసల డైలాగులు సహజ సిద్ధంగా ఉండి’’మణిపూసలు ‘’అని పించాయి అని నేను స్పందన తెలియ జేయమని అడిగితే వేదికపై చెప్పాను .అలాగే ‘’నాటక రంగ వేజేత అలేక్జాండర్’’గా శ్రీ రెడ్డి బహుముఖీన ప్రజ్నకనిపించారని ఆయన నాటక సినీరంగానుభవాలను రంగ రించి అందించిన కళాత్మక నాటకం’’ అన్నాను.అయితే నాకేమని పించింది అంటే నాటకం నిడివి పది హేను నిమిషాలు తగ్గి ఉన్నట్లయితే ఇంకా చిక్కగా గొప్పగా నిర్దుష్టంగా ఉండేది .అంతేకాదు ముఖ్య నటుని లో వచ్చిన మార్పు తానూ ఏ సలహాలు చెప్పి ఎదుటి వారిలో మార్పులు తెప్పించాడో అలాగే తాగుడు సిగరెట్ .కొడుక్కు దూరంగా ఉండటం విషయాలలో కూడా క్రమంగా మార్పు వస్తే మరింత ఎఫెక్ట్ ఉండేది .తానుతాగి అనుభవించి అందరికీ దూరమై చివర్లో’’ సినేమా డైలాగులు ‘’వల్లించటం సినిమాటిక్ గా ఉందికాని డ్రమాటిక్ గా లేదని పించింది ..శ్రీనివాస అక్షరాలయ డైరెక్టర్ శ్రీపరుచూరి శ్రీనివాసరావు తమ కాలేజి విశాఖ లో జరిగిన పోటీలో నందీ అవార్డ్ పొందిందని ఇక్కడి ఇంతమంది  జనాన్ని చూస్తుంటే ఒళ్ళు పులకించి పోతోందని ఈ నాటకోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించే బాధ్యత తమ కాలేజి తీసుకొంటుందని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు .కీప్ ఇట్ అప్ శ్రీ రావ్.

       వల్లభనేని వెంకటేశ్వరరావు తరువాత ఏడు జరిపిన నాటకోత్సవం లో’’ రచయితకు ఇచ్చే పురస్కారం’’  నాకు ప్రకటించి ,నేను అప్పుడు హైదరాబాద్ లో ఉండటం తో నేను వచ్చాక ,మా అబ్బాయి రమణద్వారా తెలుసుకొని ఆజ్ఞాపికను భద్రంగా ఇంటికి పంపాడు .

ఇప్పుడు జయప్రకాష రెడ్డి జీవిత విశేషాలు తెలుసుకొందాం .

  శ్రీ జయప్రకాష రెడ్డి  కర్నూలు జిల్లాఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1946మే 8న జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు. కొన్నాళ్లకి జయప్రకాశ్ తండ్రి డిఎస్పీ హోదాలో నల్లగొండకు బదిలీ అయ్యాడు. తండ్రికోసం నల్లగొండ వచ్చిపోతుండేవాడు. అక్కడ బంధువులూ, స్నేహితులతో మాట్లాడటంతో తెలంగాణ భాష మీదా పట్టు దొరికింది. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. చదువులోనూ ముందుండే వాడు. గుంటూరు ఏ సి కాలేజీలో డిగ్రీ చదువుతూ ,నాటకాలు వేస్తూ ,అక్కడే తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందాడు ఇక్కడ ఉన్నప్పుడే ఆయనకు ‘’బాట సారి ‘’అనే నిక్ నేం ఉండేది .

నటజీవితం

అనంతపురంలోని పాఠశాలలో చదివేటపుడు అక్కడి టీచర్లందరూ ఆచార్యులే. గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్‌కి హెడ్‌గా పనిచేసేవారు. కళలపై ఆయనకున్న అభిమానం ఇతనిపై చాలా పనిచేసింది. ఎంతంటే ఒకరోజు ఇతడు, ఇతడి స్నేహితుడు ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఆయన చాలా కోపంగా ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా..’ అంటూ అరిచారు. ఇతడి స్నేహితుడు లైట్‌గా తీసుకున్నాడు గానీ.. ఇతడు మాత్రం చాలా ఫీలయ్యాడు. మూడురోజులు బెంగపెట్టుకున్నాడు. ఆ బాధ, కసి కారణంగానే నటనను వృత్తిగా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు. జె. పి.థియేటర్ ఏ. పి. పేరుతో ప్రతి సంవత్సరం తన తండ్రి పేరుమీద నల్లగొండలో నాటకోత్సవం జరిపేవారు.జెపి శిష్యుడు పెట్టిన ‘’ప్రజా పోరు ‘’పత్రిక  వార్షికోత్సవాన్ని దాసరి నారాయణరావు ను ఆహ్వానించి ,ఆయన ఎదుట మాడభూషి దివాకర్ బాబు రాసిన ‘’గప్ చుప్’’ నాటకం వేస్తూ రెడ్డి ‘’దాసరిగారి కోసమే ఈనాటకం ఆడుతున్నాం ‘’అని ప్రకటించగా ‘’గొప్ప ఫిట్టి౦గేపెట్టావు ‘’అని ఆసాంతం చూసి అతని నటనను మెచ్చి ,సత్కరించి ‘’ఈ రత్నం ఇక్కడ కాదు సినీ రంగం లో ఉండాలి .నేనే మొదటి అవకాశమిస్తాను ‘’అని హర్ష ధ్వానాలమధ్య ప్రకటించాడు . తర్వాత దాసరి పరిచయం చేయగా రామానాయుడు 1888లో ‘’బ్రహ్మ పుత్రుడు ‘’సినిమాలో వేషం ఇచ్చాడు   కొన్ని సినీ ఆఫర్లు అవచ్చినా ,రామానాయుడు సంస్థ తప్ప తప్ప మిగిలినవారెవరూ అనుకొన్న డబ్బు ఇవ్వలేదు .గుర్తింపూ రాలేదు .అయిదేళ్ళు ఎదురు చూసి గుంటూరుకు తిరిగివచ్చి ఉపాధ్యాయ వృత్తి లో లెక్కల మేస్టారుగా 1991 లో చేరాడు .హెడ్ మాస్టర్ గా కూడా పని చేశాడు .మంచిపేరు సంపాదించుకొన్నాడు .

సినీ వీరంగ0

  ఒక సారి స్నేహితుడికి హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ వెడితే ,రామానాయుడు గుర్తుపట్టి పిలిచి ‘’ఏమైపోయావ్ ఇంతకాలం .నీకోసం మంచి పాత్ర ఉంది సురేష్ బాబు ను కలువు ‘’అన్నాడు .కలిశాడు .వాళ్ళు తీస్తున్న ‘’ప్రేమించు కొందా౦ రా ‘’లో విలన్ పాత్ర చేయాలన్నాడు .దానికి హిందీనటుడు నానాపటేకర్ కోటిన్నర డిమాండ్ చేశాడట .పరుచూరి బ్రదర్స్ రెడ్డిని సెలెక్ట్ చేశారు  రాయలసీమ మాండలికం పెడితే బాగుంటుందని  సురేష్ బాబు సూచించాడు .తనాకూ అలానే అనిపించి తిరుపతి కర్నూలు వగైరా ప్రాంతాలకు బస్ లో వెళ్లి రాయలసీమ యాస పకడ్బందిగా నేర్చి ఆ మాండలికం పండించి హావభావాలతో   విరగ దీశాడు డైలాగులతో ,సూపర్ డూపర్ హిట్  .ఇక వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలగలేదు

తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు.’’ఆయనలో పాజిటివ్ ఎనర్జీ చాలాఉంది.ఎప్పుడూ నాటకాలు సినిమాలు పాత్రలగురించే మాట్లాడుతాడు ‘’అన్నాడు దర్శకుడు శీను వైట్ల .’’అన్ని రకాల కేరక్టర్లు చేశానుకానీ  సెంటి మెంట్ పండించే పాత్ర చేయలేదు ‘’అనే లోటు ఫీలయ్యేవాడు

అలెగ్జాండర్ నాటక0

రంగస్థల, సినిమా నటుడు ఆశిష్‌ విద్యార్థితో కలిసి నటించినపుడు, తాను ఒకే పాత్రతో నాటకాలు వేశానని ఆశిష్‌ విద్యార్థి చెప్పడంతో తాను కూడా తెలుగు నాటకరంగంలో అలాంటి  ప్రయోగం చేయాలనుకున్నాడు. పూసల వెంకటేశ్వరరావు రాసిన అలెగ్జాండర్‌ అనే నాటకాన్ని తయారుచేసి రిటైర్డ్‌ మేజర్‌ పాత్రలో ఏకపాత్రాభినయంతో 100 నిమిషాలపాటు ఏకధాటిగా ఆ నాటకాన్ని 30 ప్రదర్శనలిచ్చాడు.

 జయప్రకాష్ గొప్ప శివ భక్తుడు .ఏటా శివ దీక్ష తీసుకొని మహా శివరాత్రికి శ్రీశైలం వెళ్లి భ్రమరాంబా మల్లికార్జునస్వామిని దర్శిస్తాడు .’’శివుడు మా కులదైవం మల్లన్న సన్నిధిలో యెంత సేపున్నా తనివి తీరదు .శ్రీశైలం లో నా పేరు మీద ఒక కాలేజి ఉంది ‘’‘’అని పొంగిపోతూ చెబుతాడు .

 

అతడు సినిమాల్లో పండించిన కొన్నిడైలాగులు

  • వచ్చేదానికంటే పొయ్యేదే ఎక్కువ ఉందేమి రా?
  • ఒరేయ్ పులీ! ఏమిరా నెత్తికి అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్, బోడెమ్మ లెక్క!
  • మీ మనసులు దెల్చుకున్న్యాం, మా అలవాట్లని మార్చుకున్న్యాం.
  • పెళ్ళి నాడు గుడక మాంసం ఏంది రా? ఒక్క దినము గుడక ఉండలేవా?
  • ఏమి రా నోరు లేచ్చండాదే?
  • ఆడ ఏం ఉండాయో ఏం లేవో. కంది బ్యాడలు, శెనగ బ్యాడలు, అన్ని ఒక లారీకి ఏసి పంపిజ్జామా?
  •   ఇవికాక అతడి నటన లో వెరైటీ బాగా చూపిన పాత్రలు కబడ్డీ లో హెడ్డు .’’ఏందిరా ఏంజేస్తాన్నా’’అని జీవా ను అడిగితె ‘’పాలుపితుకున్నా హెడ్డు గారూ ‘’అంటే ‘’దున్నపోతుకు పాలుపితుకు  డే౦దిరా’’అంటే కడుపు చెక్కలౌతుంది .రామదాసు సినిమాలో తానీషా బామ్మర్ది పాత్ర నటన  తెలుగు తురక మిశ్రమ భాష ఉచ్చారణ మర్చిపోలేం .అన్నిటికంటే ‘’ఢీ’’సినిమాలో మాటలేని ‘’పెదనాయన ‘’పాత్రలో ప్రతిక్షణం చూపిన హావభావాలు చిరస్మరణీయం .మాటలు లేకుండా కూడా తన నట విశ్వ రూపం చూపాడు జెపి .తండ్రీ కొడుకులుగా కూడా నటించి తెలంగాణా శకుంతలను పెళ్ళాడే పాత్రకూడా మర్చిపోలేనిది .ఇలా చాలా ఉన్నాయి .సబ్ ఇన్స్పెక్టర్ గా ఉంటూ హెడ్ కోట ప్లాన్ లలో చిక్కి వెర్రి వెంగలప్ప అయి సస్పెండ్ అవుతూ భార్యను కూడా బ్రోతల్ కేసులో బుక్ చేసిన పాత్ర సరదాగా  హాస్యభరితంగా అమాయకంగా ఉంటుంది .స్క్రీన్ అంతా నిండిపోయే పర్సనాలిటి .పంచకట్టినా ఖాకీ డ్రెస్ వేసినా  లుంగీ కట్టినా నిండుగానే ఉంటాడు .·         సుమారు 167సినిమాలలో జీవించాడు .నెల్లూరు యాసకు  హాస్యనటుడు రమణారెడ్డి జీవం పోస్తే ,జెపి రాయలసీమ యాసకు ప్రాణం పోశాడు
  •   తెలుసు సినీ పరిశ్రమాకు మళ్ళీ గండం వచ్చి పడింది .సుమారు నెలరోజులక్రితం హాస్యనటుడు రచయిత రావి కొండలరావు మరణం ,మొన్న పౌరాణిక నటుడు లవకుశ నాగరాజు ,నిన్న జయప్రకాష్ రెడ్డి మరణం ఊహిస్తే బాధగా ఉంది .వీరందరికీ ఆత్మలకు శాంతికలగాలని వారి కుటుంబాలకు సానుభూతి తెలియ జేస్తున్నాను .
  •   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-9-20-ఉయ్యూరు
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—9

మనకు తెలియని మహాయోగులు—9

17-సూక్ష్మ మూర్తెమ్మ యోగిని -1807-1928

పాతికేళ్ళ కే  భవబందాలన్నీ తెంచుకొని నూరేళ్ళు తపస్సులో తరించిన మూర్తెమ్మ 1807కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా కుందూ నదీతీరంలో పెద్దముడియం గ్రామంలో యనమదల గురవాచారి ,అచ్చమ్మ అనే విశ్వబ్రాహ్మణ దంపతులకు పుట్టింది .బాల్యం లోనేతల్లిని కోల్పోయి ఒంటరిగా నదీ తీరంలో గుంటలు తవ్వుతుంటే శివలింగం దొరికితే ఇంటికి తెచ్చి నిత్యపూజా చేసేది .పెళ్ళైనా తీరు మారలేదు .మహిమలు చూపేది. ‘ .యోగిని అన్నారు.

  ఇరవై ఏళ్ళ వయసులో ఆమెను మేనత్త దంపతులు 1827లో గంగాయపల్లె కు తీసుకు వెళ్ళారు .అక్కడ అంతర్ముఖత్వం ఏర్పడింది .పిచ్చయ్య అనే గురువు మంత్రోపదేశం చేసి ,ఆమెతో ఉన్న  శివలింగాన్నే పూజించమని చెప్పాడు .ఆమె సూక్ష్మ దృష్టి  మంత్రాను స్టానం నుంచి యోగం వైపు మళ్ళింది .అప్పటినుంచిగంగాయపల్లె  ‘’సూక్ష్మ మూర్తెమ్మ ‘’గా ప్రసిద్ధి చెందింది ,కమలాపురం మండలం అప్పాయ పల్లెకు చెందిన సుబ్బయ్య గురువు వద్ద బ్రహ్మోపదేశం పొంది ,యోగసాధన తీవ్రం చేసింది .సంయమయోగం సాధించి కీర్తనలు క౦దా ర్ధాలు ,సహస్రార ప్రదర్శన ,యక్షగానాలు,ద్విపదలు  రాసింది .ఒక శిష్యుడు బెంగుళూరు దగ్గర యలహంక లో  ఒక ఆశ్రమ౦ ఏర్పాటు చేస్తే, ఉంటూ యోగశాక్తులు ,చమత్కారాలు ప్రదర్శించింది .జానపదులు దేవతలా కొలిచారు .కడప –మద్రాస్ రైలు మార్గం లో ఉన్న ఇక్కడ అన్ని రైళ్ళు ఆగే ఏర్పాటు చేశారు .31-10-1928విభవ సంవత్సర ఆశ్వయుజ బహుళ తదియ బుధవారం మధ్యాహ్నం 12గంటలకు121 ఏట  కుండలినీ యోగం తో కపాలం చేదించుకొని సూక్ష్మ మార్తెమ్మ యోగిని  సూక్ష్మ  పరబ్రహ్మం లో ఐక్యమైంది .ఆమె పేర ఆరు ఆశ్రమాలలో సాధకులున్నారు .ఆశ్వయుజ శుద్ధ తదియ ,చవితి నాడు ఆరాధనోత్సవాలు ఘనంగా జరుపుతారు

18-ఆంజనేయ పరమహంస -1892-1941

కృష్ణాజిల్లా గుడివాడలో భైరవభట్ల సీతమ్మ ,జోగీశ్వర శర్మ రామభక్త బ్రాహ్మణ దంపతులకు ఆంజనేయ శర్మ 13-11-1892 న నందన వత్సర కార్తీక బహుళ ఆదివారం పుట్టాడు .రామనామం పాడితేనే నిద్రపోయేవాడు.ఆ నామం వినిపిస్తే ఏడుపు ఆపేవాడు .అయిదవ ఏట అక్షరాభ్యాసం, 8వ ఏట ఉపనయనం చేశారు .సీతారామా౦జ నేయ గ్రంథాన్ని  ఒంటపట్టించుకొని  పరమాత్మ తత్వ రహస్యం అవగాహన చేసుకొన్నాడు .13వ ఏట తండ్రి చనిపోయాడు. 16వ ఏట లక్ష్మీకాంతమ్మ తో పెళ్లి జరిగింది .

  నూజివీడులో ఉద్యోగం లో చేరాడు .మనసు మాత్రం  రామ నామాంకితం గానే   ఉండేది. ఒక రోజు భద్రాచల ఓంకార ఆశ్రమ మండలికి చెందిన సచ్చిదానంద జోగీశ్వరావదూత వచ్చి మంత్రోప దేశం చేశారు .దీనితో రెండేళ్లలో బ్రహ్మవిద్యారహస్యాలు తెలిశాయి .కష్టాలలో ఉన్నవారికి రామకథలు చెప్పి బాధా నివారణ చేసేవాడు .బ్రహ్మ భావన లేకపోతె వేదోపనిషత్తుల జ్ఞానానికి పూర్ణత్వం సిద్ధించదు అని ప్రవచి౦చేవాడు .25వ ఏట నే వాన ప్రస్థాశ్రమం  తీసుకొని,గుడివాడ తాలూకా పామర్రు దగ్గరున్న కొండిపర్రులో  ఒక మామిడి తోటలో శ్రీ ఆంజనేయ విగ్రహం ప్రతిష్టించి ,పూజిస్తూ సద్బోధ చేసేవాడు .భార్య కూడా బాగా సహకరించేది .ఏకాగ్ర చిత్తమే సమాధి అనీ ,సమాధిలో ధ్యేయ వస్తువు తప్ప ఏదీ కనిపించదని అనుభవ పూర్వకంగా చెప్పేవాడు .క్రమంగా  భక్త గణం పెరిగింది .గుడివాడ ఆంజనేయ పరమహంస గా ప్రసిద్ధి పొందాడు .

  గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీ మారుతి ప్రణవాశ్రమ౦ నిర్మించి జ్ఞాన బోధ చేసేవారు .11-10-1941వృష నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ షష్టి శనివారంరాత్రి 9 గంటలకు ఆంజనేయ పరమహంస  49 వ ఏట  ఆంజనేయ సన్నిధి చేరారు .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనసున్న పౌరాణి కనటుడు లవకుశ నాగరాజు

మనసున్న పౌరాణి కనటుడు లవకుశ నాగరాజు

లవకుశ సినిమాలో లవుని పాత్ర పోషించిన అనపర్తి నాగరాజు –‘’లవకుశ నాగరాజు’’ గా గుర్తింపు పొందాడు .అసలు పేరు నాగేంద్ర రావు .తండ్రి కీలుగుఱ్ఱం హరిశ్చంద్ర  సినిమాలలో నటించిన ఎ. వి .సుబ్బారావు .శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నలవకుశ నాగరాజు-71   హైదరాబాద్‌ గాంధీ నగర్‌లోని తన స్వగృహంలో సోమవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను ,కుటుంబ సభ్యులు 15ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ త్రిప్పినా ,ఎవరూ చేర్చుకోలేదు .చివరికి ఇంటి వద్దే మరణించారు .

ఎన్టీఆర్‌, అంజలిదేవి జంటగా 1963లో సి.పుల్లయ్య, సి.ఎస్‌.రావు దర్శకత్వంలో రూపొందిన ‘లవకుశ’ చిత్రంలో13 వ ఏట  లవుడి పాత్రలో  వెండితెరకు పరిచయమయ్యారు నాగరాజు. అమ్మ మీద అమితమైన ప్రేమ, తండ్రిని ఎదురించే సాహసం కలబోతగా సాగే పాత్రలో అద్వితీయ అభినయాన్ని కనబరిచి మెప్పించారు. కుశుడుగా సుబ్రహ్మణ్యం నటించాడు .ఈ జంట కాదు ముచ్చటగా ఉండేది .ఈ చిత్రంతో ఎన్టీఆర్‌తో నాగరాజుకు చక్కటి అనుబంధం ఏర్పడింది. అనంతర కాలంలో ఎన్టీఆర్‌తో కలిసి ఇంద్రజీత్‌, భీష్మ, టైగర్‌రాముడు, భామవిజయం, శ్రీకృష్ణసత్యతో పాటు నలభై వరకు సినిమాలు చేశారు నాగరాజు. నారదుడిగా పలు సినిమాల్లో నటించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ భాషల్లో 340కిపైగా సినిమాలు చేశారు.  పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడంలో నాగరాజు దిట్ట. నటించిన తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న ప్రతిభావంతుడు. బాలనటుడిగా, సహాయ నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్న నాగరాజు తన నటనతో ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశారు.  తన నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రతిభావంతుడునాగరాజు  .నాగరాజుకు భార్య ,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు .ఒక్కగానొక్క కుమారుడు 2017లో చనిపోయాడు .

  దురదృష్ట వంతుడు నాగరాజు ఒక్కగానొక్క కొడుకు నాగరాజు కుటుంబానికి దూరమయ్యాడు .అది మనసులో బాధగా ఉండేది .హైదరాబాద్ లో ఒక వదాన్యుడు షిరిడీ సాయిబాబా ఆలయం నిర్మించి ,ఆయన కుటుంబానికి ఆశ్రయం కలిపించాడు నాగరాజు కుటుంబం అందులో ఉంటూ, బాబా  సేవలో తరిస్తున్నట్లు ఒకసారి ఏదో పేపరు ఇంటర్వ్యు లో చెప్పాడు .అది నేను చదివాను .

నాగరాజు తో మా పరిచయం –అల్లు అర్జున్ నటించిన ‘’వరుడు ‘’సినిమా షూటింగ్ 2008 ఏప్రిల్ –జూన్ నెలలలో రామోజీ ఫిలిం సిటీ లో జరిగింది .గుణశేఖర్ దర్శకుడు .మా మనవడు ఛి హర్ష –మా అబ్బాయి శర్మ కొడుకు ను చిన్న అల్లు అర్జున్ వేషానికి ఎంపిక చేశారు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ .మా అబ్బాయి బలవంతం తో మేమందరం హైదారాబాద్ లో వాళ్ళింట్లో ఉండి మేమూ షూటింగ్ కు వెళ్లాం .మగవారందరికీ అందరికి పట్టుపంచెలు లాల్చీ ఉత్తరీయాలు ,ఆడవారికి పట్టు చీరలు జాకెట్లు కట్టించారు నగలు .రోజూ రెండు కార్లు ఇంటికి వచ్చి ఎక్కించుకొని వెళ్ళేవి .అక్కడే అందరికీ కాఫీలు టిఫిన్లు .మధ్యాహ్న భోజనం .సాయంత్రం స్నాక్స్ .రాజభోగంగా ఉండేది .సాయంత్రం షూటింగ్ అవగానే స్నాక్స్ పెట్టించి మళ్ళీ కార్లమీద ఇంటికి పంపేవారు. మేమిద్దరం  మా మనవడు చరణ్ ,మనవరాలు రమ్య , వారం రోజులు షూటింగ్ లో పాల్గొన్నాం .మా అమ్మాయి విజ్జి ,మనవలు  శ్రీకేత్ , ఆశుతోష్,పీయూష్  మా పెద్దాడు శాస్త్రి కోడలు సమత పిల్లలు సంకల్ప్ భువన్,మా వియ్యపురాలు శ్రీమతి ఆది లక్ష్మి ,మా బావమరిది ఆనంద్ భార్య రుక్మిణి ,పిల్లాడు వంశీ ,మా అమ్మాయి ఆడపడుచు భర్త లను కూడా ప్రోత్సహించి మాతో తీసుకు వెళ్లాం ,మా అబ్బాయి శర్మ కోడలు ఇందిర హర్ష ,మనవరాలు హర్షిత  లకు రోజూ తప్పని సరి .ఈ షూటింగ్ లో రావి కొండలరావు ,రాధాకుమారి దంపతులు ,సింగీతం శ్రీనివాసరావు ,అనితారెడ్డి ,సుహాసిని ,నరేష్ ,లవకుశ నాగరాజు , బొంబాయి హీరోయిన్ ,అల్లు అర్జున్ వగైరా నటీనటులంతా కొందరు యువ టివి ఆర్టిస్ట్ లుకూడా రోజూ ఉండేవారు .

   మొదటి రోజునే లవకుశ నాగరాజు తో పరిచయమైంది .మా వాళ్ళందరికీ పరిచయం చేశాను .అందరితో చాలాకలుపుగోలుగా మాట్లాడేవాడు .ఎన్నో ఫోటోలు తీసుకొన్నాం .తాను  అప్పుడప్పుడు ఉయ్యురులో విశ్వశాంతి స్కూల్ కు వస్తాననని ,అందుకని ఉయ్యూరు బాగా తెలుసన్నాడు .ఈ సారి వస్తే మా ఇంటికి రమ్మని చెప్పాం తప్పక వస్తామనన్నాడు.సెల్ నంబర్ ఇచ్చాడు .మేము ఇంటినుంచి ఏదైనా టిఫిన్ తెచ్చుకొంటే ఆయనకూ పెట్టేవాళ్ళం హాయిగా తినేవాడు .భేషజం లేదు .ఆ కీచు గొంతు భలేగా ఉండేది .తాను  ఏయే సినిమాలలో నటించిందీ వివరాలు చెప్పాడు .తాను ఎవరినీ అడగకుండానే వేషాలు లభించేవని సంతోషం చెప్పాడు .తన నటజీవితం సంతృప్తి కరం అన్నాడు .మీనా నటిస్తున్న వెంగమాంబ సినిమాలో తానూ నటించాననీ ,బాగా వచ్చిందనీ తప్పక చూడమని చెప్పాడు .మాగాయి కావాలంటే మా అబ్బాయి ఇంటినుంచి తీసుకు వెళ్లి ఇచ్చాం .చాల కృతజ్ఞాత చెప్పాడు . షూటింగ్ తక్కువ హడావిడి ఎక్కువా .ఖాళీ సమయం లో మేమిద్దరం దూరంగా కూర్చుని కబుర్లు చెప్పుకోనేవాళ్ళం పద్యాలు బాగా పాడి వినిపించేవాడు .సిగరెట్ కాల్చేవాడని గుర్తు .తన తండ్రిగొప్పనటుడు అనీ చెప్పాడు .తమది కాకినాడ అని చెప్పినట్లు జ్ఞాపక౦ .కుశుడు వేసిన సుబ్రహ్మణ్యం తో గాఢమైన అనుబంధం ఉండేదని చెప్పాడు .తన నాటకాను భవం సినీ ప్రవేశం అన్నీ చెప్పేవాడు .పౌరాణిక సినిమా తీస్తే  అడగకుండానే తన అనుభవం చూసి తప్పక వేషం ఇస్తారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు .అతనిలో నాకు సంతృప్తి బాగా కనిపించేది .డబ్బపండు వంటి పచ్చని శరీరఛాయ ,తీర్చిదిద్దినట్లుండేఅవయవాల పొందిక ,మంచి హావభావాలు, గాంభీర్యం ,స్పష్టమైన ఉచ్చారణ ,చూపుల్లో ఆకర్షణ ఎర్రని  నిలువు బొట్టు,అందమైన చిరునవ్వు   నాగరాజు ప్రత్యేకం .’’లవబుల్ లవకుశ నాగరాజు ‘’.

  సుహాసిని ,అనితా రెడ్డి లు మా ఆవిడను వదిలే వారు కాదు ఆవిడతో ,మా అమ్మాయి,పిల్లలతో కలిసి ఫోటోలు తీయి౦చు కోనేవారు.నరేష్ కు రోజూ ఇంటి నుంచి భోజనం కారియర్ వచ్చేది .ఒకమ్మాయి విస్తరి వేసి వడ్డించేది .ఆపోసనపట్టి కమ్మగా భోజనం చేసేవాడు .రోజూ నేను ఆయనతో కూడా మాట్లాడేవాడిని .బాగా మాట్లాడేవాడు .ఒకరోజు ‘’మీరు ఇంత అందంగా ఉన్నారు సినిమాల్లో అంత అందంగా చూపించట్లేదు మిమ్మల్ని ‘’అని అడిగాను ‘’అలాగా’’ అని నవ్వేశాడు .అల్లు అర్జున్ మాంచి ఎనర్జీటిక్ గా యాక్ట్ చేసేవాడు .ఆశ్చర్యమేసేది .వేటూరి పాటలు భావగర్భత౦గా  రాశారు .డాన్స్ లు ఊపేశాడు  అర్జున్ .చేతులు చూసి జోశ్యం చెప్పేవాడు .మా ఆవిడకూ చెప్పాడు .దీనికోసం జనం మూగేవారు .రోజూ గుణశేఖర్ ను పలకరించేవాడిని .రావి దంపతులతో,సింగీతం తో ఫోటోలు తీసుకొన్నాం . ఒక రోజు రానా కూడా వచ్చి వెళ్ళాడు .బొంబాయి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లు డాన్సర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి షూటింగ్ లో పాల్గొనేవారు .అంతా సందడి సందడిగాసరదాగా గడిచిపోయింది .షూటింగ్ జరిగిన తీరు చూస్తె ‘’ఇది బతికి బట్టకట్టే సినిమా కాదు  నిర్మాత దానయ్యకు పెద్ద బొక్క ‘’‘’అని నాకు అనిపించేది .రాధాకుమారి రోజూ విసుక్కొనేది .’’ఇక్కడి రావటం టైం వేస్ట్.టివి సీరియల్స్ లో చేస్తే ఇంతకంటే ఎక్కువ డబ్బులొస్తాయి ‘’అని గొణిగేది.తూర్పు గోదావరిజిల్లా దంపతులు దీనికి కొంతస్క్రిప్ట్ కూర్చారనుకొంటా .వాళ్ళ హవా ఎక్కువగా ఉండేది .

  వరుడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ .మా శర్మను మా ఫోటోలు పంపమంటే అప్పుడు మేము అమెరికాలో ఉన్నామని చెప్పి పంపాడు .చాలాబాగున్నారని మా కుటుంబాన్ని అంతా షూటింగ్ లో చేర్చాడు శ్రీకాంత్ .రోజూ సెట్స్ దగ్గర నమస్కారం తో పలకరించేవాడు మా ఇద్దర్నీ  షాట్ లో తప్పక ఉండేట్లు చేసేవాడు .ఇంతచేసినా ఎక్కదోదూరపు షాట్ లో ఒక చోట కనిపించీ కనిపించకుండా ఉన్నట్లు’’ బొమ్మ’’ లో ఉంది.

నాగరాజు వీలైనప్పుడల్లా ఫోన్ చేయమని చెప్పాడు .నాలుగైదు సార్లు ఫోన్ లో మాట్లాడుకొన్నాం ఒకటి రెండు సార్లు తానే ఫోన్ చేశాడుకూడా .2018ఏప్రిల్ 2న మా మనవడు ఛి శ్రీకేత్ ఉపనయనాన్ని మా అమ్మాయి విజ్జి అల్లుడు అవధాని దంపతులు కుటుంబంతో  అమెరికా నుంచి  వచ్చి  హైదరాబాద్ లో బాగ్ లింగం పల్లి ఫంక్షన్ హాల్ లో చేశారు .నాగరాజు కు ఫోన్ చేసి  అడ్రస్ తీసుకొని శుభలేఖ పంపి తప్పక రమ్మని ఆహ్వానించాను .మా అమ్మాయి వాళ్ళతో కూడా బాగా పరిచయం  ఉందికనుక తప్పక వస్తానన్నాడు .ఆయన ఇచ్చిన అడ్రస్ సాయి బాబాదేవాలయం అడ్రస్ అనే బాగా జ్ఞాపకం .వడుగు హడావిడి లో నేను మళ్ళీ ఫోన్ చేయలేకపోయాను నాగరాజు రాలేదు . ఆ బాధ నాలో ఉంది. కారు పంపించి ఉంటె తప్పక వచ్చేవాడేమో అని పించింది .

   మనసున్న ఒక మంచి పౌరాణిక నటుడిని మన తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది .నాగరాజు ఆత్మకు శాంతి కలగాలని ,ఆకుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-20-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -4

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -4

2-భూగర్భ స్వర్గం -2

దీనితోనో సంబంధం లేని వాళ్ళు ,జనం గుంపులుగా చేరారు వారిలో పిల్లలు ,పెద్దలు కూడా ఉన్నారు .సంగీతం పెరుగుతోంది అందరూ డాన్స్ చేస్తున్నారు .’’ఉదయం మొదలు వీళ్ళు డాన్స్ చేస్తూనే ఉన్నారా ?’’అని అడిగితె ‘’ఔను .పనిలో కూడా ఎవరికైనా డాన్స్ చేయాలానిపిస్తే ,గంతులేస్తూ పాడే అవకాశం ఇస్తాం .అనుమానమొచ్చి ‘’పని పాడుకాదా’’?అన్నాను .’’పనిలో ఉన్నదానికంటే ఎక్కువ పనే చేస్తారు ‘’అన్నాడు .ఇదో కొత్తలోకం .ప్రతిదేశానికి దాని పధ్ధతి దానికి ఉంటుంది .ఇద్దరం నిలబడి చూస్తున్నాం .కెనెడియన్ స్వీడిష్ ఫోక్ డాన్స్ చూశానుకనుక ఇది జానపద నృత్యం అని తెలిసింది .సంగీతకారులూ డాన్స్ చేస్తున్నారు వాయిస్తూకూడా .వాళ్ళ ఫిడేల్స్ ,ఇతర వాద్యాలను బట్టి కూడా అది ఫోక్ మ్యూజిక్  అనే అనిపించింది .మా అమ్మమ్మ  ఉండే దలార్మా స్వీడెన్ లలో ఇలాంటి మ్యూజిక్ విన్నాను ఈమధ్య వెళ్ళలేదు కాని స్వీడిష్ మిడ్ సమ్మర్ మహా ఆహ్లాదంగా ఉంటుంది .అలాగే ఉంది ఇక్కడ కూడా .ఇక్కడ తాగుడు పోట్లాట లేదు .

  మాన్యుల్ వైపు సాభిప్రాయంగా చూడగా అతడు నన్ను డాన్సర్ల మధ్యకు తీసుకు వెళ్ళాడు ,నా చేతిని ఒక అమ్మాయి మెత్తని చెయ్యి తాకింది ,ఇంకో యువతి  నాచుట్టూ తిరిగింది .డాన్స్ ఎక్కువకాలం సాగలేదు .నా అండర్ గ్రౌండ్ గైడ్ నన్ను వెంటనే లాగేశాడు .’’మనం వెళ్ళాలి ‘’అని నా అసహనాన్ని గుర్తించి అన్నాడు .అక్కడి లాండ్ స్కేప్ దాటి ఒక గ్రామాన్ని చేరాం .కొద్ది ఇళ్ళు మాత్రమె ఉన్నా తీర్చి దిద్దినట్లు తేనే తుట్టె  శైలి లో ఉన్నాయి .పైకప్పులు లేవు .వర్షం తుఫాను ,మంచు లాంటివి వస్తే ?అని అనుకున్నాను . మనసు గ్రహించి మాన్యుల్ ‘’లేదు .ఇక్కడ సంపూర్ణ వాతావరణమే ఎప్పుడూ ఉంటుంది .తొలి వేసవిలాగా ఏడాది అంతా ఉంటుంది ఇక్కడ .ఎప్పుడూ ప్రకాశామానంగానే ఉంటుంది .’’అన్నాడు .’’భూమ్మీద మాకు వర్షాలు తుఫాన్లు మంచు వస్తే ఇక్కడ మీకు ఎలా ఉటుంది ?’’అన్నాను .’’అది మాదాకా రాదు  ‘’అన్నాడు నవ్వుతూ ..అక్కడ ఒక బెంచి కనిపిస్తే కూర్చోమని సైగ చేస్తే కూర్చున్నా .ఇక్కడి శీతోష్ణ స్థితిని అతడు ‘’ప్రతిదీ విశ్వాసం ప్రకారం నడుస్తుంది .మాకు ఇక్కడ అంతా సురక్షితమే .మాకు భయం అసూయ ఆదుర్దా చెడు ఆలోచనలు ఉండవు .ఇక్కడ శాశ్వత శక్తి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది .ఇక్కడ సర్వభద్రమైన సురక్షితమైన జీవితం గడుపుతున్నామనే గొప్పనమ్మకం లో ఉంటాం .ఆ శక్తి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందనే నమ్మకం మాది .ఋణాత్మక ఆలోచనలు వాతావరణాన్ని , స్ట్రాటో స్ఫియర్ ను కాలుష్యం చేస్తాయి .మన ఆలోచనలను బట్టే వాతావరణ మార్పులు వస్తాయి .భూమిపై నాశనం మీటిరోలాజికల్ ఫోర్స్ లవల్ల కూడా కలుగుతుంది .అక్కడ సామరస్య౦ ఉండదు .మతకలహాలు ,అసూయ అనుమానాలే ఎక్కువ .డబ్బు, డ్రగ్స్ ప్రభావమే ఇదంతా .కనుక నిర్మాణం కంటే వినాశనం ఎక్కువ .అక్కడ మంచి ఎప్పుడూ నష్ట పోతూనే ఉంది .’’అన్నాడు .’’అంటే మన ఆలోచనలను బట్టి వాతావరణం ఉంటుందా ?వాతావరణం అనేక బయటి శక్తులపై ఆధార పడి ఉంటుందికదా ‘’?అని నా జాతీయ వాతావరణ శాఖ జ్ఞానం తో ప్రశ్నించాను .

  మాన్యుల్ ‘’ఇక్కడి భూమి ఒడిలో ఉన్నఅనుభూతి ఉంటుంది .కనుక సురక్షితం .అక్కడి విపరీత విపత్కర పరిస్థితులు ఇక్కడికి చొచ్చుకు రాలేవు  .భూమాతను మేము అనుక్షణం తలుస్తాము .దానికి ప్రత్యామ్నాయంగా ఆమె మాకు రక్షణ ,ప్రేమ ఇస్తుంది .  నీకు ఎప్పుడైనా విచారంకలిగినా,డిప్రేషన్ వచ్చినా ఈ అగర్తా లోకం లోని ఆలోచనలు నీకు బలాన్ని శక్తినీ  ప్రసాదిస్తాయి .’’మీ గురించి మాకసలు తెలీదుగా .మీరున్నారని తెలిస్తేగా మీ సహాయం కోరేదీ?అన్నాను కొంచెం అసహనం తో .’’సరే ఇప్పుడు భూమి మీద మనుషులను చూసే సమయం వచ్చింది .తిరస్కరణ ,అవిధేయతా బీజ వ్యాప్తికి మేము ప్రోత్సహించం .కనుకనే మేము ఎవరికీ కనపడకుండా ఉంటాము .అసలు మీరు ఏ దేవుడిని ఆరాధిస్తారు ?ఆయనకు రంగరంగ వైభవంగా భోగాలు సమకూర్చి ఉత్సవాలు చేస్తారు మీరు .ఆయన్ను ప్రార్ధిస్తారు ఆయన తరఫున యుద్ధాలు చేస్తారు వాదిస్తారు .మీ తప్పులన్నీ ఆయనపాదాలమీద పడేస్తారు .ఇదేలాంటి మతంబాబూ .అది చాలా హేతుబద్ధం అంటారు మీరు .మేము ఇక్కడ అలా చేయం .అందుకే భూప్రజలను ఇక్కడికి అనుమతి౦చటం మాకు కష్టమౌతుంది .మేము ఎంపిక చేసి తీసుకురావటమో లేక నీలాగా వచ్చిన వారికో ప్రవేశం ఉంటుంది ఇక్కడ ‘’అన్నాడు .’’నాకు  ఇంటికి వెళ్లి ఈ విషయాలన్నీ  చెప్పాలని ఉంది  ‘’అన్నాను .తల ఊపాడు .ఇద్దారంలేచాం .’’భూమ్మీదలాగానే ఇక్కడా పిల్లలు హాయిగా ఆడుకొంటున్నారు ఇక్కడ ఎక్కువమందిని కలవ లేదు .ఇక్కడ ఇసుక గోతులు ,స్వింగ్స్ ఉన్నాయి పెద్దలు  పర్యవేక్షిస్తూ ఉంటారు .పిల్లలు ఉత్సాహంగా ఈతకొట్టే అందమైన ఆకర్షణీయమైన జలాశయాలున్నాయి .నడిలోకిజారటానికి తేలికగా ఉండే వాలు మెట్లున్నాయి .పిల్లలు’’ ఫెయిరీ టేల్ ‘’ లోలాగా అద్భుత ప్రపంచం లో జీవిస్తున్నారిక్కడ .వాళ్ళు ఇక్కడికి ఎలావచ్చారో అడగాలను కొన్నా .నా మనోభావం పసిగట్టి పెద్దగా నవ్వి మాన్యుల్ ‘’జాగ్రత్తగా విను కుర్రాడా !సెక్స్ పాఠాలు కావాలా ?మీ లోకం లో ఉన్నట్లే అవీ ఉంటాయి .దాన్ని మేము ప్రేమ అంటాం .ఇక్కడ సెక్స్ ను అనైతికంగా  చూస్తాం .అది ఇక్కడ అరుదుగా నే ఉంటుంది . ఇక్కడ ధనాత్మకం కనుక గౌరవిస్తాం .ఇక్కాడ పెళ్ళిళ్ళు ఉండవు .శారీరకమానసిక కలయిక మాత్రమె ఉంటుంది .అది కారణాత్మకమే ‘’అన్నాడు .’’తప్పులు అశ్లీలం ,విచాక్షణారాహిత్యం ,విడాకులు ఉంటాయా “’?అన్నాను .పగల బడి నవ్వి ‘’మళ్ళీ తప్పులో కాలేశావ్ కుర్రాడా .మా నిఘంటువులో అసలు ఆమాటలే లేవు .మీ భూమిమీదమీరు శారీరక జీవులుగా నే ప్రవర్తిస్తారు .ఇక్కడ మేము అంతకంటే ఉన్నతస్థాయి అయిన మనసు ,ఆత్మలతో జీవిస్తాం .మీది బాడీ పార్టనర్ షిప్ .మాది సోల్ పార్టరన్ షిప్ .మాది ఉన్నతమైన చేతన.మీలాగా మేమూ తమాషాలు చేస్తాం .కానీ జీవితాంతం కలిసే ఉంటాం అదీ తేడా మిత్రమా .’’అన్నాడు ‘’వంద లాది ఏళ్ళు అలాగే ఉంటారా ?విసుగు అనిపించదా  బోర్ కొట్టదామహానుభావా .సెక్స్ లో వివిధ భంగిమలు ప్రయత్నిస్తారా’’ ??చిలిపిగా ప్రశ్నించా .’’ఎందుకో నాకు అర్ధం కాలేదు .ఇక్కడి మా ప్రేమ అలానే శాశ్వతం .టెలోస్ లో మౌంట్ షాస్తా క్రింద సింపోజియం జరుగుతుంది అక్కడికి వెళ్దాం రా .అక్కడ భూ వాసుల విషయమై చర్చలు జరుగుతాయి. అందుకే అక్కడికి నిన్ను తీసుకు వెడుతున్నా ‘’అన్నాడు .నాక్కూడా ఉత్సాహ౦ గా ఉంది అక్కడి నుంచి భూమిమీదకు వెళ్ళవచ్చు ననే ఆశ కలిగింది .మౌంట్ షాస్తా అనేది కాలిఫోర్నియాలో ఉంది .అక్కడినుంచి సియాటిల్ కు ఫ్లైట్ లో వెళ్ళచ్చు.కానీ నాదగ్గర సొమ్ములు నిల్. నా మనసు గ్రహించి మాన్యుల్ ‘’భయం వద్దు బ్రదర్ .నీకు ఇంటికి  వెళ్ళాలనిపిస్తే మేమే పంపిస్తాం .డబ్బు  ఏర్పాటు కూడా మేమే చేస్తాం ‘’అన్నాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—8

మనకు తెలియని మహాయోగులు—8

15-చీరాల అవధూత -1912-1972

కడప జిల్లాలో  వైశ్య కుటుంబంలో పుట్టిన చీరాల అవధూత ,1943లో చీరాల ఆస్పత్రి దగ్గర గు౦పెన చెట్ల నీడలో కాషాయబట్ట లతో గురువు వెంట మొదట కనిపించాడు  1912లో పుట్టినట్లు నిర్ధారించారు .. అగరు వత్తులు  వెలిగించి ఇసుకలో పెట్టి బియ్యం చల్లేవాడు .ఎడమకాలు బోదకాలు అవటం తో బోదకాలు స్వామిగా ప్రసిద్ధుడు .ఆహారం లేకపోయినా బలంగానే ఉండేవాడు .1959లో చిలకలూరి పేటకు వెళ్లి 1963 వరకు ఉన్నాడు. పగలే కనిపించేవాడు రాత్రిళ్ళు కనిపించే వాడు కాదు .ఒకేసారి నెల్లూరు హైదరాబాద్ గుంటూరు,శ్రీశైలం  లలో కనిపించేవాడు.రోగులరోగాలు నయం చేస్తూ శక్తులు ప్రదర్శించేవాడు  .దేహం నిలవటానికి  కొద్దిగా తినేవాడు .నిరీహి .అఖందయోగం చూపేవాడు అంటే కాళ్ళు చేతులు మొండెం వేర్వేరు గా ఉండేట్లు చేసి మళ్ళీ కలిపేవాడు .3-9-1972 60 వ ఏట పరీధావి సంవత్సర శ్రావణ బహుళ ఏకాదశి ఆదివారం తెల్ల వారు ఝామున అవధూత హంస పరమహంసలో లీనమైంది .

16-పరమహంస -ధాభా కొండ యార్య -1834-1939

మహారాష్ట్ర చా౦దా జిల్లా  ధాభా గ్రామంలో అంబేద మల్లయ్య ,సుగంధమ్మ అనే జంగం దంపతులకు 10-2-1934 విజయ సంవత్సర మాఘ శుద్ధ తదియ సోమవారం కొండయ్య పుట్టాడు .పుట్టగానే ‘’నమో బసవ లింగాయనమః ‘’అని ఉచ్చరించి అందర్నీ ఆశ్చర్య పరచాడు .జ్యితిష్యులు  ఆబాలుడు నూరేళ్ళకు పైగా బతికి .జీన జనోద్దరణ చేస్తాడని చెప్పారు .పుట్టిన 12వ రోజు నుంచే మహిమలు ప్రదర్శించాడు .ఏడాదికే విద్యలన్నీ గడించాడు

  పెళ్లి అయినా ఇల్లు వాకిలీ వదిలేసి కొండా కోనలు తిరుగుతూ ,శ్రీశైలం అడవులకు చేరి క్రూర జంతువులను మచ్చిక చేసుకొని  వేటగాళ్ళ నుండి వాటిని రక్షిస్తూ ,నిత్యం పాతాళగంగాస్నానం మల్లికార్జున భ్రమరాంబా దర్శనం తో పులకి౦చేవాడు .ఒక రొజుఆలయ సింహద్వారం  వద్ద సహస్ర సూర్య కాంతులతో’’ సర్వేశ్వర తేజం ‘’దర్శనమిచ్చింది .సర్వసంగ పరిత్యాగి కొండయ్యకు సద్గురు కటాక్షం లభించి౦ది అష్టాంగ యోగం ,రాజయోగం సిద్ధిస్తాయని ఆశరీరవాణి తెలిపింది .అన్నట్లుగానే చెల్పూరులో పరమారాధ్యుల రాజయ్య  ఆశీర్వాద లభించి ఇద్దరూకలిసి శ్రీశైల గుహలలో తీవ్ర తపస్సు చేశారు .కొండయ్యకు మంత్రోపదేశం చేసి సకల శక్తులు ధారపోసి’’ పరమహంస ‘’బిరుదునిచ్చి లోక కాల్యాణ౦ కోసం దేశాటన చేయమని గురువు ఆశీర్వదించి పంపాడు

  12ఏళ్ళు తపస్సు చేసి ఈశ్వరతత్వాన్ని సాధించి అక్కడి నుండి నంది మేడారం చేరి మహిమలు చూపి ,దేశ సంచారం చేస్తూ అద్భుతాలు ప్రదర్శిస్తూ బాధితుల రోగ నివృత్తి చేస్తూ జ్ఞానబోధ చేస్తూ 14-11-1939కార్తీక శుద్ధ చవితి మంగళవారం 105 వయేట ముందుగానే కట్టించుకొన్న సమాధిలో జీవ సమాధి అయ్యాడు పరమహంస కొండయార్యులు. మాధినుండి సూక్ష్మరూపంలో భక్తులకు కొంగుబంగారంగా వెలుగుతున్నారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-20-ఉయ్యూరు  .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ట్రాన్స్ జెండర్ల బాధా సమస్యా,పరిష్కార కథా సర్వస్వం- ‘’అస్మిత ‘’

ట్రాన్స్ జెండర్ల బాధా సమస్యా,పరిష్కార కథా సర్వస్వం- ‘’అస్మిత ‘’

సుమారు పదిహేను రోజులక్రితం బెజవాడ నుంచి శ్రీమతి కోపూరి పుష్పాదేవి గారు ఫోన్ చేసి తాము ‘’అస్మిత ‘’అనే కథా సంకలనం ,’’ఒక్క క్షణం ‘’ అనే తన కథా సంపుటి ప్రచురించామని ,పంపుతున్నామని ,అభిప్రాయం తెలియజేయమని  చెప్పి ,వెంటనే కొరియర్ లో పంపగా అవి వారం తర్వాత నాకు అందాయి .ఈలోగా ఆమె వాట్సాప్, లో ఫోన్ లో వచ్చాయా అని అడగటం రాలేదని చెప్పటం కూడా అయింది .రాగానే వెంటనే తెలియజేశాను .నాలుగురోజులక్రితం ‘’అస్మిత ‘’చదివారా అని వాట్సాప్ప్ చేస్తే ,అప్పుడే కొరియర్ విప్పి పేర్లు చూసి, ఇంకాలేదు చదివాక తెలియజేస్తా అని సమాధానమివ్వగా ధాంక్స్ చెప్పారు .బిజీ బిజీ గా ఉన్ననేను నిన్ననే ఆపుస్తకం ఆదివారం చదివి ,నా భావాలు రాయాలనుకొని ,ఇవాళ ‘’లైవ్ ‘’ అయ్యాక ఉదయం 11-30కు చదవటం మొదలుపెట్టి 8కథలు చదివి ,భోజన విశ్రాంతి తర్వాత సాయంత్రం మళ్ళీ చదివి పుస్తకం ఇప్పుడే ఒక అరగంట క్రితం చదివి పూర్తిచేశాను. అదో లోకం .నాకు తెలియనిది .శీర్షికకూడా వెంటనే స్పురించలేదు ,ఇప్పుడే పై శీర్షిక మనసులో తట్టి  రాయటం ప్రారంభిస్తున్నాను .

  సమాజం లో కొజ్జాలు ,’’అదో టైపు ‘’నపుంసకులు ,హిజ్రాలు,ట్రాన్స్ జ౦డర్లుఅనే అనేక పేర్లతో పిలువబడేవారి ‘’జీవితం బాధలు సమస్యలు ,వాటికి పరిష్కారాలు గురించి జనసామాన్యానికి తెలియ జేసి, వారిపై ఆత్మీయత స్నేహం పెంచే గొప్ప సదుద్దేశ్యం తో కోపూరి ట్రస్ట్ వారు ‘’సమన్విత ‘’సంస్థద్వారా తెలుగు రాష్ట్రాలలోని రచయితలను పై సమస్యపై కథలపోటీ ఏర్పాటు చేసి,  రాసి పంపమని కోరితే స్పందించి రాసిన వాటిలో  15కథలను మాత్రం ఎంపిక చేసి ,సమన్విత బృందం వారి నాలుగు కథలనూ చేర్చి మొత్తం 19 కథలను ‘’అస్మిత ‘’పేరుతొ ఈ సంవత్సరమే ప్రచురించి ఆదర్శంగా నిలిచారు .ఇందులో  మూడు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు ,నాలుగు కన్సొలేషన్ బహుమతులకు ఎంపికయ్యాయి. వీరికి వెన్ను దన్నుగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం –ఐద్వా నిలిచింది .అభినందించదగిన  గొప్ప ప్రయత్నం .ఈ పుస్తకాన్ని హస్తభూషణం చేసుకొన్న వారందరికీ అంకిత మిచ్చారు విశాలహృదయం తో .

  ఇంతకీ నాకు ‘’అస్మిత ‘’అంటే ఏమిటో అసలు అర్ధం కాలేదు .నిఘంటువు వెతికా .అందులో ‘’నేను అనే భావం ‘’,అహం అనే భావం ‘’అహమిక ‘’అంటే ఆదేశం ,ఉద్ధతి ,పొగరు ,బీరము  హం కారం అనే అర్దాలున్నట్లు తెలిసింది .ఎవర్ని ఉద్దేశించి ఈ పుస్తకం తెచ్చారో వారందరిలో ‘’నేను అనే భావం ‘’అంటే అస్తిత్వ భావన కలగాలన్నది గొప్ప ధ్యేయం కనుక శేర్షిక చాలాబాగా సరిపోయింది అనిపించింది .అహ౦ భావం లేకపోతే సమాజం గుర్తించదు.అది పొగరు కాదు  అస్తిత్వ  నిరూపణమాత్రమే .అని మనం గుర్తుంచుకోవాలి .

  మొదటి బహుమతి పొందిన కథ-‘’కసారా నుంచి రైలు ‘’ను శ్రీ  పివిఆర్ శివకుమార్ రాశారు .రైలు పెట్టెలలో బస్సుల్లో ,రోడ్లమీద హిజ్రాలు గుంపులు గుంపులుగా వచ్చి డబ్బు ఇవ్వమని పీడిస్తూ వెకిలి చేష్టలు చేయటం చూస్తూనే ఉంటాం .వాళ్ళను చూడంగానే  అంటరాని వారుగా భావించి దూరం పోవటం కూడా మనకు తెలుసు .శ్రీ హరి పెళ్లి అవుతుంటే తెలిసి ‘’చక్కాలు ‘’వచ్చి  వాళ్లమామూలు అడిగారు .తండ్రికి ఇష్టం లేదు .ఇంట్లో ఎవ్వరికీ అదొక జుగుప్స మేళం అనిపించింది .పెళ్లి కొడుకే  బయటికి వచ్చి వాళ్ళు అడిగిన రెండు వేలే కాక పైన మరో అయిదు వందలు వేసి ఇచ్చి ‘’ఇది అందరం పంచుకుంటాం .మీ గోడ మీద సైను పెడతా .మా వాళ్ళు ఎవరూ మళ్ళీ రారు ‘’అని హామీఇచ్చింది నాయకురాలు రంజని .ఆశీర్వదించి౦ది. ఆమె కళ్ళలో కోటి కాంతులు చూసాడు హరి .వీరిపై సానుభూతి కలగటానికి తన ఫ్లాష్ బాక్ చెప్పాడు .ఒక సారి నాసిక్ నుంచి ముంబై రైలులో వెడుతుంటే కసారా స్టేషన్ లో తనప్రక్క కూర్చున్న వ్యక్తిని  చూడగానే  ఏవగింపు కలిగి దూరంగా జరిగాడు .ఆమె ముఖం కోపం తో ఎర్రబడి ‘’కూచో౦డి ఎందుకు దూరంగా అరుగుతారు నేను అడుక్కొటానికి రాలేదు .కాసేపాగాక ఆమె తాను  కఠినంగా మాట్లాడినందుకు సారీ చెప్పి అతనిలాంటి విద్యావంతులు కూడా తమలాంటి వారని అవమానంగా చూడటం బాధగా ఉందని ‘’అంటే  వాళ్ళ ప్రవర్తన వల్లనే అలా జనం చీత్కరిస్తున్నారని అతడు అంటే, ఆమె తమ ప్రవర్తన వెనుక విషాదం అంతా వివరించింది .తానూ సోషియాలజీ  ఎం.ఏ.అనీ ,ఉద్యోగం కోసం ఇంటర్వ్యులకు  వెడితే ట్రాన్స్ జెండర్ అనే నెపంతో ఉద్యోగం ఇవ్వలేదని అలాంటి వారి ప్రక్క మిగిలిన ఉద్యోగులు కూర్చోటానికి కూడా ఒప్పుకోరనీ ,ప్రభుత్వాలు తమలాంటివారికోసం ఉద్యోగాలు కేటా ఇంచాలనీ ,తమ శారీరక వైపరీత్యం తమ చేతుల్లో లేదనీ ,ఆకలి తీర్చుకోటానికి అనేక చెడు మార్గాలు పడుతున్నామని ,తమకు పని కల్పించరు ,తమకు తోచింది చేయనివ్వదు ఈ సమాజం అని వాపోయింది .హరి మైండ్ బ్లాంక్ అయిపోయి యదార్ధం తెలిసి కళ్ళు తెరుచుకొన్నాయి .ఆమె తలిదండ్రులు కూడా పట్టించు కోరా అనే పిచ్చ ప్రశ్న వేశాడు .ఇంట్లో అవమానాలు భరించలేక వీధిన పడుతున్నామనీ ,ఇంట్లో వాళ్ళే తమపై జుగుప్సతో ఉండటం భరించలేకపోవటమే కారణమనీ తల్లులు మాత్రం జుగుప్సకీ ,కన్నపేగుకీ మధ్య నలిగి పోతున్నారనీ ,బయటికొచ్చి విశృ౦ఖలతకు స్వేచ్చాజీవితానికి అలవాటు పడిపోతున్నామని ,ఒక రకంగా సమాజానికి ఎదురీది బతుకు తున్నామని చెప్పింది .వీరిద్దరి మధ్య ఆత్మీయమైన అవగాహన కలిగి  హరి ఇంట్లో వారికి చెప్పి ఉద్యోగం మానేసి గార్మెట్ ఇండస్ట్రీ పెట్టి ఆమెను  అడ్మిని స్ట్రేషన్ భాగం అప్పగించి ,ట్రాన్స్ జెండర్లనే ఇద్దరూ ఆసంస్థలో ఉద్యోగులను గానియమించి క్రమ౦ గా అనేక శాఖలు గా ఎదిగి  ఎందరికో ఆసరా గా నిలబడ్డారు .ఒక ఇడియా హిజ్రాలజీవితాలలో వెలుగే నింపింది .

  రెండో కథలోకి వెళ్లేముందు మీ దృష్టికి ఒకవిషయం తెస్తున్నాను .సుమారు అయి డా రేళ్ళక్రితం డా.అలిసేటి నాగరాజు  అనే అంధుడు శ్రీ గంథం  వేంకాస్వామి శర్మగారి కథాసంపుటి ‘’అమృత హస్తాలు ‘’పై పరిశోధన చేసి ,పుస్తకం ఆవిష్కరణ జరిపినప్పుడు శర్మగారి ద్వారా పరిచయమై ,తర్వాత ఆతనే తనలాంటి ‘’దివ్యా౦గులు ‘’చేత కథలు రాయించి, నాకు పంపి అభిప్రాయం రాయమని కోరితే దాదాపు అన్నీ చదివి ముందుమాట రాస్తే ఆకథలను నేను రాసిన దానితో సహా ముద్రించి ఆవిష్కరించాడు .అతడికి మూడేళ్లక్రితం సరసభారతి స్వయం సిద్ధ పురస్కారం అందించింది .అలా ఈ పుస్తకం లో ట్రాన్స్  జ౦డర్ల  చేత రాయించే ప్రయత్నం జరగలేదని అనిపించింది అంతే .

   ద్వితీయబహుమతి ప్రఖ్యాత వైద్యులు డా రమణ యశస్వి రాసిన ‘’తోటమాలి చమత్కారం ‘’కి దక్కింది .హిజ్రాలను ఈస డించే వారే కానీ వారిని ఇంట్లో పనిలో పెట్టుకోటానికి ఎన్నో గుండెలు ఉండాలి . ,ఇంటిపనికోసం ఒక మనిషికావాలని ప్రకటన ఇస్తే అమ్మాయో అబ్బాయో అర్ధంకాని ఒక మొరటు శాల్తీ వస్తే తానూ రోజూ రైలు గేటు దగ్గర చూసే  వింత హావ భావాలు చూపి డబ్బులు అడుక్కొనే  నాగరాజు అని గుర్తి౦చగా తల్లి వాడు అబ్బాయిగానే పుట్టి ,క్రమ౦గా అమ్మాయి లక్షణాలు పొందాడని,వాడిపై ముగ్గురూ మగపిల్లలేనని తాగుబోతు భర్త  బలవంతం తో   వీడిని కన్నానని, సుఖం లేకుండా పోయిందని బావురుమన్నది .రాజు తనలాంటి ఇంకోడిని ఈ డాక్టర్ దగ్గరకు తెచ్చాడు .వాడి పేరు  పేరయ్య అని  పమిట సవరిస్తూ చెప్పుకొన్నాడు .గజ్జల్లో నెప్పులతో బాధవాడికి .పరీక్షిస్తే తొంటి కీళ్ళు రెండూ చెడిపోయాయి ఎక్సరే వగైరా పరీక్షలు చేయించి రిపోర్ట్ తీసుకురమ్మంటే అడుక్కుంటే కాని పొట్టగడవదని చెబితే సానుభూతితో ఉచితంగా చేయించాడు డాక్టర్ బాబు .దీనికి తోడూ  హెచ్ ఐ వి   పాజిటివ్ అనీ తేలింది .తనగు౦పు లో  సగం మందికి ఈజబ్బు ఉందని ,దేవుడికి కూడా తాము అక్కర్లేదని బాధపడ్డాడు .మందు బిళ్ళలు రాసిస్తే ‘’నొప్పి లేకపోతే రోజూ స్వర్గమే సారూ ‘’అని కూలబడి ఏడ్చాడు .దోవ చూపే వారు లేక వాళ్ళు అలా అయ్యారని బాధపడ్డాడు .

 నాలుగురోజులకు గేటుదగ్గర కూరలమ్మి వచ్చి తనకొడుకు ను యదకొచ్చిన గేదె లాగాఉన్నాడని మూడోరకం జనం మీద పడి పోతున్నారని ఏడ్చింది .అప్పుడు అర్ధమైంది పేరయ్య అన్నమాటలు .వాడికి తోటమాలి ఉద్యోగం ఇచ్చాడు డాక్టర్ .మొక్కలు బాగాపెంచి ఫలసాయం బాగా తీస్తున్నాడు .ఒక రోజు డాక్టర్ ఆస్పత్రిలో ఉన్న సమయం లో వాడిని కొజ్జాలువచ్చి అత్యాచారం చేస్తే స్పృహ కోల్పోయాడు .వారం ట్రీట్ మెంట్ తర్వాత కోలుకొన్నాడు . వాళ్ళ సంగతి తెలుసుకోవటానికి డాక్టర్ వెడితే పేరయ్య కనిపించాడు .అతనిద్వారా వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని ,వాళ్లకు ఉచిత హెల్త్ కార్డులు ఇచ్చి ,రాజు జోలికి రావద్దని హెచ్చరించి ,వైద్య శిబిరం పెట్టి కేసులు చూసి కౌన్సెలింగ్ ఇచ్చి  వృత్తి మాన్పించాడు .రాజు ఇంటి దగ్గర గార్డెన్ పనిలో రాటు దేలాడు   అంటుకట్టి  సగం తెలుపు సగం ఎరుపు గులాబీ పూయించాడు .దానికి ముళ్ళు ఎక్కువే .వాసన లేదు .దేవుడి సృష్టీ ఇలాగే ఉంటుంది అనుకొన్నాడు డాక్టర్ బాబు .ఇందులో హిజ్రాల బాధలు ఒత్తిడి చెబుతూ ,పరిష్కారం కూడా చూపారు రచయిత.

 ‘’మానవత్వం ‘’అనే మూడవ బహుమతి పొందిన కథ రచయిత శ్రీ కోయిలాడ రామమోహనరావు .ఇందులో హిజ్రాల సాహసం చూస్తాం .నాలు గేళ్ళక్రితం  ఈస్ట్ ఢిల్లీలో ‘’త్రిలోకపురి ‘’ప్రాంతం లో హిందూ ముస్లిం లమధ్య మతకల్లోలాలు బాగాజరిగితే ,పోలీసుల వశం కాకపొతే అక్కడి హిజ్రాలు ధైర్యం గా ఆ రెండు వర్గాలమధ్యా నిలిచి ఆపకపోతే తమబట్టలు విప్పేస్తాము అని బెదిరించగానే కల్లోలాలు ఆగిపోయాయి .కనుక వారిలో ప్రాణాలకు తెగించే సాహసం ఉందని తెలుస్తోంది ఇన్స్పెక్టర్ అహ్మద్ గ్రహించి తనింట్లో పెళ్లి జరిగితే హిజ్రాలకు గొప్పనగదు బహుమతి ఇచ్చానని పరాంకుశానికి చెబితే బిత్తరపోయి  తనింటికి వచ్చిన  అలాంటివారికి డబ్బిచ్చిపంపాడు .ధాయలాండ్ ‘’అల్కజార్ షో’’ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందులో డాన్స్ చేసే వాళ్ళు వీళ్ళే .ఈ కథ2014అక్టోబర్ 28 న ఢిల్లీ లో జరిగిన యదార్ధ సంఘటనకు కథారూపమే .

కన్సొలేషన్ ప్రైజ్ వచ్చిన ‘’రంగుటద్దం’’లో ఉమ  తనజీవితాన్ని వీడియోలలో పెట్టి తనలాంటి వారిని ఎడ్యుకేట్ చేసి చాలాపాప్యులరరై’’ప్రతివాడూ తనజీవితానికి తానేకర్త ,సంస్కర్త ‘’అని ప్రబోధించింది .ధర్డ్  జ౦డర్ల లలో అమ్మతనం అనంతంగా ఉంది దాన్ని చానలైజ్ చేసి అనాధపిల్లలకు అందించిన కథ ‘’ప్రేమ బృందావనం ‘’.తనకొచ్చే ఉద్యోగాలకు ట్రాన్స్ జ౦డర్ కారణంగా ఆగిపోతుంటే కోర్టులలో సవాలు చేసి ,దాన్ని కోర్టులో ధృవీకరి౦పజేసుకొని వారిహక్కులకోసం వెల్ఫేర్ కమీషన్ లాంటివి ఏర్పాటు చేయించాలని కృషి చేసిన సోనాలీ కథ, ,,పర్వతాలరావు కు  యాక్సిడెంట్ అయితే మానవత్వం చూపి కాపాడిన హిజ్రా విశాలాక్షి ఆదర్శాలకు చేయూతనిచ్చి కుటీర పరిశ్రమ స్థాపించి జాలీ నాలీ లేని తనలాంటి వారుస్వయం శక్తితో నిలబడేట్లు చేసిన విశాలాక్షిగా మారిన విశాల్ ‘’చీకటి జాబిలీ ‘’గా కనిపిస్తుంది .’’కొత్త చిగుళ్ళు ‘’లో స్నేహితులంతా  కలిసి హిజ్రా సమస్యలను కూలం కషంగా అధ్యయనం చేసి అన్నిమాధ్యమాలద్వారా ప్రజల దృష్టికి తీసుకు వెడతారు .కొడుకు తల్లిని వదిలించుకొని పారిపోతే ఆముసలిది ఎక్కడో దిగి ఒక చిన్న హోటల్ నడిపే ఊర్వశి దగ్గర చేరి పనులు చేస్తూ ,ఆమెకు తోడుగా తనకు ఆమె తోడుగా ఉంటూ బతుకు  వెళ్ళ దీస్తుంటే  చివరికి ఆ ఊర్వశి తాను  మగపోకడలు ఉండటం  గ్రహించి ఇంట్లో నుంచి గెంటేసిన తనకూతురు బాల అవటం   ఫినిషింగ్ టచ్ గా ఉన్నదే ‘’ఎదిపుణ్యం ఏది పాపం ?’’

  హిజ్రాల జీవితాలలో రిఫార్మ్స్ తీసుకురావాలి సంఘంలో వారికి గౌరవమర్యాదలు దక్కాలి .అనే ధ్యేయంతో జమునారాణి బెంగుళూర్ లో ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ,దానికి తగిన ఆర్ధికస్తొమతు కోసం ప్రయత్నిస్తుంటే  కేశవ శ్రమకు  నచ్చి, తన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పగా సంతోషం లో బెంగళూరు వెళ్లగా కొందరు దుండగులు దొంగ చాటుగా ఆమె పైకాల్పులు జరిపి పారిపోయారు .తన స్నేహితుడు ఐబిఐ డైరెక్టర్ కు చెబితే ,రైఫిల్  అసోసియేషన్  సభ్యురాలై కాల్పుల విషయం బయటపడకుండా జాగ్రతపడి౦ది చావు భయం లేని ఆమె .’’ధ్యేయం బలమైనప్పుడు ,మానవాళికి అత్యవసరమైనప్పుడు మృత్యువు కూడా కరుణించి కొన్నేళ్ళు వేచి ఉంటుందని చెప్పేదే ‘’వైఖరిలో మార్పు ‘’.

 అబ్బాయిగా పుట్టినవాడు  జెట్ స్పీడ్ లో అవయవాలలో హార్మోన్ల మార్పుల వల్ల స్త్రీగా మారి తే ,తలిదండ్రులు కూడా సానుభూతిగా అర్ధం చేసుకొంటే  డాక్టర్ల  సంప్రదింపులతో  తల్లి సహకారం తో ,స్వచ్చంద సంస్థల సాయంతో బొంబాయిలో సర్జరీలు చేయించుకొని నాగరాజు నాగమణి గా మార్పు చెంది మిస్ ఇండియా పోటీలో గెలిచి ,తన్ను తిరస్కరించిన చోటే అత్యుత్తమమహిళగా  గుర్తింపు పొందాలన్న  కాంక్ష నెరవేరి, ఆ గౌరవంతో తనలాంటి ట్రాన్స్ జండర్ లసంక్షేమం కోసం కృషి చేసే ప్రయత్నం చేసిన కథ ‘’విజేత ‘’.హిజ్రాలపై కవిత్వం రాస్తే విని పరవశించే తత్త్వం ,కన్నీరు కార్చిన అనూషా అనే  హనుమంతు విషయమే’’మాకూ మనసుంది ‘’.హిజ్రాలు స్వతంత్రంగా బతకాలనీ , వాళ్లజీవితాలలో వెలుగులు  ని౦పాలనీ సదుద్దేశ్యంతో అగర్వాల్ అనే ధనవంతుడు చేసే కృషి కల లోకి వచ్చి ,అదికలకాకూడదని నిజమై తీరాలని ,అది కర్తవ్య బోధ  అని గ్రహించటమే ‘’కొత్తదారి’’.

‘’ట్రాన్స్ జండర్ జాతి మాది  అని గర్వం గా చెప్పుకొనేట్లు చేస్తాను. జన్యుపరంగా ఏర్పడిన లోపాలకు గురైన జాతి మాది అని గర్వంగా చెప్పుకొనేట్లు చేస్తాను ‘’అన్న అతడు . ‘’వికసించిన పుష్పం లాంటి వాడు ‘’అని చెప్పినదే ‘’వికసిత కుసుమం ‘’

  అబ్బాయిల్లో సెకండరి సెక్సువల్ కారస్టిక్స్ డెవలప్ అయి అమ్మాయిలుగా ప్రవర్తి౦చటం మహేష్ లో  జరిగితే ,ఇంట్లో వాళ్ళ బాధ అర్ధం చేసుకొని అందనంత దూరం గమ్యం లేకుండా వెళ్లి హిజ్రాలపరిచయంకలిగి మహేశ్వరి పేరుతో ఉంటూ , వాళ్ళజీవితాలను అర్ధం చేసుకోవటం ‘’సమాజ నిరాదరణకు గురౌతున్న ఈ అంటరాని అభాగ్య జాతి పట్ల ‘’ప్రభుత్వాలు వారిని జనజీవన స్రవంతిలో భాగస్వాములయేట్లు సకల చర్యలూ తీసుకోవాలని ఉద్బోధించటమే  ‘’పంజరం ‘’ధ్యేయం .ఇంట్లో పనిమనిషి వెంకటరమణ అదో టైపు. భార్య సుభద్రకు మొదట్లో ఇష్టం లేకపోయినా భర్తను కాదనలేక చేర్చుకొన్నది .ఆమెకు అన్ని రకాల సేవలూ వెంకటరమణ చేసి మనసు గెలిచి భర్తపోయాక కూడా ఆసరాగా నిల్చి౦ది . తన మనసులోని బాధను ‘’మాలా౦టివాళ్ళం అందరి తిట్లు చివాట్లు తినాలనికాదు .సమాజం మమ్మల్ని చీడ పురుగులుగా చూస్తోంది .కళ్ళు కాళ్ళు లేనివారిపై చూపే సానుభూతి మాపై ఎందుకు చూపరు ?.మా తప్పుకాని మా పుట్టుకకు మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు ‘’అని వలవలా  ఏడిస్తే రజని లాంటి యువరక్తం తాము అండగా నిలబడతామని భరోసా ఇవ్వటం శ్రీమతి కోపూరి పుష్పావతిగారి కథ ‘’చేయీ చేయీకలిపి ‘’.

  హిజ్రాల పెళ్లి రిజిస్టర్ చెయ్యరు .లేకపోతె సెక్స్ మార్పు చేయించుకొని సర్టిఫికేట్ ఇవ్వాలి ఇది అనవసరం అనుకొన్న అభిరాం ,ఆషాగా మారిన హిజ్రా అరుణ్ పెళ్లి చేసుకొని హాయిగా గడుపుతున్నారు .కొత్త ఇల్లు కట్టుకొని అనాథాశ్రమలో పెరుగుతున్న పిల్లను దత్తత చేసుకొని ‘’కోకిల ‘’పేరు పెట్టుకొని కిలకిలా నవ్వులతో గడిపే కథ’’కోకిల ‘’.ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త పిల్లలు పుట్టకపోతే మారు మనువుకు సిద్ధమైతే అతడి మనస్తత్వానికి విసిగిపోయిన చామేలీ కి లేడీ డాక్టర్ స్వంతిల్లు ఏర్పడే వరకు విడాకులకు అంగీకరించవద్దని సలహా చెప్పి సాంత్వన కలిగించినదే ‘’చమేలీ ‘’కథ . గ్రామీణ కొండ ప్రాంతం లో పుట్టి జీవనపోరాటం లో ఆరితేరి ప్రకృతి విసిరే సవాళ్ళకు జవాబు ఇస్తూ ,క్రీడలలో రాణించి ,ఆర్చెరీలో ఒలింపిక్స్ లో గెలవాలన్న ధ్యేయం తో ఉన్న ట్రాన్స్ జండర్ స్త్రీల విభాగం లో పోటీ చేయటానికి ఎన్నో  అడ్డంకు లేర్పడితే అన్నిటికీ తెలివి తేటలతో సమాధానాలు చెప్పి ఒప్పించి గెలిచి సత్తా చూపించిన ఒలింపిక్ చాంపియన్ అమీ కధ’’సమత్వం ‘.ఇందులో ఆమె తనలక్ష్యం ను ‘’SI DDOD’’గా చెప్పింది .అంటే ‘’సేవ్ఇండియా ,డ్రైవ్ ఔట్ డిస్క్రిమినేషన్’’అని అర్ధం .లింగ వివక్షత పోవాలి. లింగ నిర్దారణహక్కు వ్యక్తులకే ఉండాలికాని సమాజానికి కాదు .సమాజంలో లింగ వివక్షతకు స్థానం ఉండరాదు .ఈ కథలన్నిటీ లక్ష్యం అదే .

  మంచి ఆలోచనలతో సమస్యను వివిధకోణాలతో చిత్రించిన చిత్రిక పట్టినకథలు ఇవన్నీ .ఉద్దేశ్యం చక్కగా నెరవేరింది .రచయితలంతా లోతైన అధ్యయనం చేసి ,గొప్ప అవగాహన తో రాసిన ఆణి ముత్యాలే ఇవి .అందరూ అభినందనీయులే .ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు హిజ్రాల విషయం ఆలోచించి కొన్ని నిర్ణయాలు చేసి అమలు చేస్తున్నాయి .కొందరు శాసన సభ్యులయ్యారు .కానీ చేసింది సముద్రంలోనీటి బొట్టుమాత్రమే .ఇకనైనా సమాజాలు సంఘాలు ప్రభుత్వాలు వారి సంక్షేమం , ఉద్ధరణపై పూర్తి దృష్టి పెడితేనే తగిన న్యాయం వారికి లభిస్తుంది .ఈ సంకలనం ఒకరకంగా గుంటూరు శేషేంద్ర శర్మ అన్నట్లు ‘’శూన్య మైన వేదనలో ఒక స్వరం పలకరింపు ‘’

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

5-9-20శనివారం సాయంత్రం గురుపూజోత్సవ సందర్భంగా బ్రహ్మశ్రీ కోటసూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురుపూజోత్సంగా సరసభారతి 154 వ కార్యక్రమం లాంజనేయస్వామి దేవాలయం -శ్రీ సువర్చ -విద్యార్ధులకు నగదు పురస్కార౦ ,ఉపాధ్యాయులకు సన్మానం ”

5-9-20శనివారం సాయంత్రం గురుపూజోత్సవ సందర్భంగా బ్రహ్మశ్రీ కోటసూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురుపూజోత్సంగా సరసభారతి 154 వ కార్యక్రమం లాంజనేయస్వామి దేవాలయం -శ్రీ సువర్చ -విద్యార్ధులకు నగదు పురస్కార౦ ,ఉపాధ్యాయులకు సన్మానం ”

https://photos.google.com/share/AF1QipOe-Bt4sE_g6FNghgkz-E11hy69BhLeG8PqRsJrabatebRdGOHI_6y8WmwDlH2alw/photo/AF1QipMOzNlfWbEvLh1gQKtB0_HSgezkNwKVSqmyn0gv?key=MVM5ZHp6YzJTOXREQ1hrdlFHNUNQSVRQbDZRQ2VR

సరసభారతి 154 వ కార్యక్రమంగా బ్రహ్మశ్రీ శ్రీ కోట గురు వరేణ్యుల గురుపూజోత్సవ విశేషాలు

5-9-20శనివారం నాడు సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సాయంత్రం 6-30గంటలకు భారత మాజీ రాష్ట్ర పతి  ,భారతరత్న డా సర్వేపల్లి రాధా కృష్ణ పండితుని 132వ జయంతి నాడు సరసభారతి 154వ కార్యక్రమంగా బ్రహ్మ శ్రీ కోట గురు వరేణ్యుల గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది . ముందుగా ఇటీవలే మరణించిన భారత మాజీ రాష్ట్రపతి ,భారత రత్న శ్రీ ప్రణవ్ ముఖర్జీ  మరణానికి ,సుప్రసిద్ధ హాస్యనటుడు రచయిత,శ్రీ రావి కొండలరావు ,బాలసాహిత్య రచయిత శ్రీ కలువకొలను సదానంద మొదలగు రచయితలకు ,కరోనా కల్లోలం లో అశువులు బాసిన వేలాది ప్రజలకు ,వారికి సేవల౦దిస్తూ ఆవ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు నర్సులు ,పోలీసు సిబ్బందికి ,  ప్రైవేట్ స్కూళ్ళలో , కాలేజీలలో పని చేస్తూ ,హాయిగా జీవితాలుగడిపి ,ఈ లాక్ డౌన్ల ఫలితంగా జీతాలు లేక రాక మరణించిన ఉపాధ్యాయ మిత్రులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాం .

     తర్వాత బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి  మొదటగా నేను పుష్పమాల అలంకరించి ,పుష్పాలు సమర్పించి ,శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ ,హాజరైన ఉపాధ్యాయ ,విద్యార్ధులు , తలిదండ్రుల చేత పుష్పాలను సమర్పింప జేశాము .తరువాత నేను కోట గురువరేణ్యుల వద్ద నేనూ శ్రీ మైనేని గోపాలకృష్ణగారు సుమారు 75 సమ్వత్సరాఆల క్రితం ప్రాధమిక విద్య నేర్చిన సంగతి ,మైనేని గారు ఏర్పాటు చేసిన గురువుగారి స్మారక పురస్కారాలసంగతి ,గురుపుత్రులు తమతలిదడ్రుల స్మారకార్ధం ఏర్పరచిన పురస్కార విశేషాలు తెలియజేశాను. తర్వాత రాధాకృష్ణ పండితుని శేముషీ వైభవాన్ని గురించి  నేను కొంచెం మాట్లాడి ,తర్వాత సన్మాననగ్రహీతలైన ఉపాధ్యాయుల చేత మాట్లాడింప జేశాం .

   ఆ తర్వాత శ్రీ రాజేంద్ర ప్రసాద్ కూడా సర్వేపల్లి  ఘనకీర్తి వివరించి ఆయన ను ఆదర్శంగా గ్రహించాల్సిన విషయాన్ని తెలియ జేశారు .వెంటనే 2020 పదవతరగతి  పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన పేద ప్రతిభగల విద్యార్ధినీ విద్యార్ధులకు శ్రీ  మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారాలను నాలుగు స్కూళ్ళకు చెందిన 7గురు విద్యార్ధినీ విద్యార్ధులకు ,ఒక్కొక్కరికి 2 వేలరూపాయలు వంతున ,పిమ్మట శ్రీ కోట గురుపుత్రులు ఏర్పాటు చేసిన తమతలిదండ్రుల స్మారక నగదు పురస్కారాలను  ఈ సంవత్సరం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులై ,ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరిన పేద ,ప్రతిభగల ఇద్దరు బ్రాహ్మణ విద్యార్ధినులకు ఒక్కొక్కరికి 10 వేలరూపాయల వంతున ,సరసభారతి ప్రత్యేకంగా   పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి ఏర్పాటు చేసిన 5 వేలరూపాయల నగదు పురస్కారాన్ని ,సరసభారతి శ్రీ శార్వరి ఉగాదికి ఆవిష్కరించిన మూడు పుస్తకాల సెట్ తోపాటు నేనూ ,శ్రీ రాజేంద్ర అందజేశాము .

 ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు పొందిన శ్రీ వేమూరు సదాశివరావు శ్రీఆదిరాజు హనుమంతరావు ,శ్రీమతి ఆదిరాజు కనకదుర్గలకు శ్రీ  రాజేంద్ర చేతులమీదుగా సరసభారతి సత్కారం చేయించి తలొక 5 వందల రూపాయల నగదు పురస్కారం ,సరసభారతి మూడు పుస్తకాల సెట్ ,ఇందించి శాలువాలతో సత్కరించాం .నిరాడంబరంగా ఉత్సాహంగా కోవిడ్ జాగ్రతలైన మాస్కులు, శానిటైజర్ల  వాడకం తో కార్యక్రమ౦ ఘనంగా జరిగింది .కార్యక్రమాన్ని కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ,కోశాధికారి ఛి గబ్బిట వెంకటరమణ ,సాంకేతిక సలహాదారు శ్రీ వి.బి.జి.రావు గార్లు చక్కని ఏర్పాట్లతో సహకరించారు .

  నా ప్రసంగం లోని కొన్ని ముఖ్య విషయాలు – బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ గురువరేణ్యులు 26-3-1903 శుభకృత్ ఫాల్గుణ బహుళ త్రయోదశి నాడు జన్మించారు తలిదండ్రులు శ్రీ కోట పున్నయ్య ,శ్రీమతి సరస్వతమ్మ దంపతులు .68 వ ఏట 7-2-1971సాధారణ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి ఆదివారం మరణించారు .గుడివాడ కలువపాముల ,ఉయ్యూరులో ఉపాధ్యాయులుగా పని చేసి ఎందరి జీవితాలనో  తీర్చి దిద్దారు .తర్వాత గుడివాడలో ఒక ప్రైవేట్ సంస్థలో చేరి జీవితాంతం  ఉద్యోగించి మంచి కీర్తి పొందారు .రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ శిక్షణలో గొప్ప పేరు సంపాదించి ఎందరో ఉన్నత విద్యలలో రాణి౦చటానికి తోడ్పడ్డారు.

  శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన 5-9-1888న తిరుత్తణి లో శ్రీ వీరాస్వామి ,శ్రీమతి సీతమ్మ నిరుపేద బ్రాహ్మణ దంపతులకు జన్మించారు .చదువు చెప్పించే స్థోమత లేక  తండ్రి గారు రాధాకృష్ణన్ ను పూజారిగా ఒక గుడి లో చేరమన్నారు .ఆయనకు చదువు మీద బాగా ఆసక్తి  ఉండటం చేత ,కాదని తిరుపతిలో ఒక మిషనరీ స్కూల్ లో చేరారు .అరిటాకు కొని అందులో తినే ఆర్ధిక స్తోమతు కూడా లేక పోవటం తో నేలను శుభ్రం చేసుకొని ,నేలపై భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి .అక్కడి నుంచి చదువులో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ విద్య అంతా  స్కాలర్ షిప్  లతో చదివిన మేధావి రాధాకృష్ణపండితుడు .21 ఏళ్ళకే మద్రాస్ ప్రేసిడెన్సి కాలేజి ప్రోఫెసరయ్యారు .శ్రీనంజుండయ్య వీరిప్రతిభగుర్తించి మైసూర్ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ గా ఆహ్వానిస్తే చేరి తత్వశాస్త్ర ప్రొఫెసర్ అయ్యారు .తర్వాత  విశ్వకవి రవీంద్ర నాథ టాగూరు ,మహా మేధావి విద్యావేత్త లాయర్ అశుతోష్ ముఖర్జీలగౌరవ ఆహ్వానంతో కలకత్తా యూని వర్సిటీ ప్రొఫెసర్ గా చేరి ఇక్కడే  ‘’ఇండియన్ ఫిలాసఫీ ‘’గ్రంథం రాశారు .

 కట్టమంచి రామలింగారెడ్డి గారి పదవీ విరమణ తర్వాత 1931లో ఆంద్ర విశ్వవిద్యాలలయ వైస్ చాన్సలర్ అయ్యారు .తన పదవీ కాలం లో దేశంలోని అత్యున్నత విద్యావేత్తలను సగౌరవంగా ఆహ్వానించి ఉద్యోగాలలో నియమించారు.అలా నియమింపబడిన వారిలో హీరేన్ ముఖర్జీ ,హుమాయూన్ కబీర్ వంటి మేదావులున్నారు ..భారత రాజ్యంగపరిషత్ సభ్యులుగా ఆయన 1947ఆగస్ట్ 14-15రాత్రి చేసిన ప్రసంగం మహా ఉత్తేజంగా  సాగింది .రష్యారాయబారిగా ఆయన నియంత స్టాలిన్ హృదయం లో పరి వర్తన తెచ్చారు.ఉపరాష్ట్ర పతిగా 1952నుండి 1962 వరకు పదేళ్ళు ఉన్నారు అప్పుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ భారత తోలి రాష్ట్రపతి .వీరు తొలి ఉపరాష్ట్ర పతి .1962నుంచి 1967వరకు రాధాకృష్ణన్ భారత రెండవ రాష్ట్ర పతిగా కీర్తి ప్రతిష్టలు తనకు దేశానికీ పదవికీ ఆర్జి౦చి పెట్టారు .భారత రత్న పురస్కారం పొందిన శేముషీ  దురంధరుడు  .

  యాన్ ఐడియలిస్టిక్ లైఫ్ ,ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ ,ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్  వంటి అత్యుత్తమ గ్రంథాలు రచించారు .పాశ్చాత్య ,భారతీయ తత్వ శాస్త్రాలను తులనాత్మకంగా పరిశోధించి గొప్ప పుస్తకాలు రాశారు .’’ప్రస్థాన త్రయానికి అనితరసాధ్యమైన ఆంగ్ల వ్యాఖ్యానం’’ రాసిన మహోన్నత మేధావి రాధాకృష్ణన్.కొరాన్ బైబిల్ లను సాధికారికంగా వ్యాఖ్యానించే నేర్పు ఆయనది .దార్శనిక గ్రంథాలేకాదు తర్క ,మానసిక శాస్త్రాలలోనూ మహాపండితుడు .ఆయన అపార పరిజ్ఞానం తో రాసినవన్నీ విజ్ఞాన భా౦డాగారాలే ,భిన్నత్వంలో ఏకత్వం సాధించేవే .వైరుధ్యాలమధ్యసమానత్వం సాధిస్తాయి .మానవ కర్తవ్య నిర్దేశానికి మానవోద్ధరణకు  రాసినవి  .వాటిలోని సమ్యక్ దృష్టి అసాధారణం ,అపూర్వం .రాధాకృష్ణన్ అమోఘ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ శ్రీ నార్ల ‘’కర్ణునికి సహజ కుండలాలతో పుట్టినట్లు  రాధాకృష్ణన్  ‘’ఆయనకే ప్రత్యేకమైన  తెల్లని శిరో  వేష్టవం ‘’తో జన్మించారేమో ‘’

 భారతరత్న రాధాకృష్ణన్ 17-4-1975 న 87 వ ఏట మరణించారు

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-20

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యులar గురు పూజా మహోత్సవ ఆహ్వానం

 

 

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా   5-9-20  శనివారం   సాయంత్రం 6-30 గంటలకు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి వార్ల దేవాలయం లో  సరసభారతి 154 వ కార్యక్రమంగా,  నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య  అతిధిగా  పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

 

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి  గౌరవాధ్యక్షులు

ఆత్మీయ అతిధులు –   శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు ,శ్రీ కోట రామ కృష్ణ గారు ,శ్రీ కోట సీతారామాంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )

కార్యక్రమ వివరం

స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణశాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం  ,పుష్ప సమర్పణ

ఉపాధ్యాయ  దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు

1-శ్రీ వేమూరు సదాశివరావు –గణిత ఉపాధ్యాయులు –విశ్వశాంతి స్కూల్ –ఉయ్యూరు

2-శ్రీ ఆదిరాజు హనుమంతరావు –ప్రిన్సిపాల్ ,ఫ్లోరా స్కూల్ –ఉయ్యూరు

3-శ్రీమతి ఆదిరాజు కనకదుర్గ –ప్రిన్సిపాల్ ,శ్రీ భారతీ విద్యానిలయం –ఉయ్యూరు

 

ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ  బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి  శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార ‘’ప్రదానం

 

–2020 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన  పేద ,ప్రతిభగల విద్యార్ధినీ విద్యార్ధులకు

1-  స్థానిక జిల్లాపరిషత్  పాఠశాల విద్యార్థిని-కుమారి . కె శ్రీకన్య  –కు 2,000 రూపాయలు,2-విద్యార్ధి చి.చొప్పరపు నాగ ఫణికుమార్ కు –  2,000 రూపాయలు

2-..అమరవాణి పాఠశాల 1- విద్యార్ధి –ఛి.జిత్తు నిఖిల్ బాబు కు –   2,000 రూపాయలు 2-విద్యార్ధిని –కుమారి .బుద్ద జయలక్ష్మి కు 2,000 రూపాయలు

3–వి.ఆర్ .కె.ఎం విద్యార్ధిని –కుమారి వై .మాధవి కు -2,000 రూపాయలు

4-పబ్లిక్ స్కూల్ విద్యార్ధిని- కుమారి పామర్తి జ్ఞాన శరణ్య కు -2,000 రూపాయలు

.

.-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు  శ్రీమతి సీతమ్మ దంపతుల  పేరిట    ఇంటర్ చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధిని ,విద్యార్ధికి ఒక్కొక్కరికి   10,,000 గా ఏర్పాటు చేసిన  స్మారక ప్రోత్సాహక నగదు పురస్కారప్రదానం   –  ఈ సంవత్సరం బాలుడు ఎవరూ లేనందున ఇద్దరు బాలికలకు అందజేయబడినది .

5–2020 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో  స్థానిక నారాయణ స్కూల్ లో ఉత్తీర్ణత సాధించి అక్కడి జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న  -కుమారి-మద్దాలి అలేఖ్యకు -10 వేలరూపాయలు

6- స్థానిక ఫ్లోరా స్కూల్ లో ఉత్తీర్ణత సాధించి ఏ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారి-గండూరి ఉమాశైలజ కు -10 వేలరూపాయలు-

 

శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .

 

7-సరసభారతి ప్రత్యేక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం

విజయవాడ శారదా కాలేజి హైస్కూల్ లో పదవతరగతి ఉత్తీర్ణత సాధించి ,శారదా కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పేద ,ప్రతిభగల విద్యార్ధిని –కుమారి గరిమెళ్ళ షణ్ముఖలలితా శ్రీ బాల కు – 5వేలరూపాయలు అంద జేయబడుతుంది .

సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి

 

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

ఆహ్వాని౦చు వారు

జోశ్యుల శ్యామలాదేవి      మాదిరాజు శివలక్ష్మి  గబ్బిటవెంకట రమణ                  గబ్బిట దుర్గా ప్రసాద్- సరసభారతి అధ్యక్షులు

గౌరవాధ్యక్షులు               కార్యదర్శి               కోశాధికారి                          సరసభారతి అధ్యక్షులు

 

ఉయ్యూరు -2-9-20- ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -3

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -3

టిం మరియానాకు మరిన్ని వివరాలు చెప్పాడు ‘’మా అమ్మ నాకోసం బెంగపెట్టుకొంటు౦ది .ఇక్కడ చూడటం అయ్యాక నన్ను ఇంటికి పంపిస్తారా ?అని అడిగాను .’’ఇంకా నీకు వెళ్ళాలనే అనిపిస్తే పంపటానికి ప్రయత్నిస్తాం.ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లాలని అనుకోరు .ఒక వేళ వాళ్ళు వెళ్లి ఇక్కడి విషయాలు చెప్పినా అక్కడి వాళ్ళు నమ్మరు .ఇది చాలా ప్రశాంత ప్రదేశం .ఇక్కడ డబ్బుకోసం పోట్లాటలు ఉండవు .మాకు కావాల్సినవన్నీ  సమకూరుతాయి  . భూమిపై  వాళ్ళను ఓ కంట కనిపెడుతూనే ఉంటాం.వాళ్ళు సాధించిన అభి వృద్ధి  వినాశనానికే తోడ్పడుతోంది  .ఇక్కడ అంతా తేలిక .నీకు నచ్చుతుంది ‘’అన్నాడు.నా చేతులు తీసుకొని నాకళ్ళల్లోకి సూటిగా చూశాడు డేరియాల్  .దానితో నాకు వర్ణించలేని గొప్ప మనశ్శాంతి లభించింది.అయినా మానాన్న ,అమ్మ మా చెల్లెలు చిన్నారి అన్ గురించి బెంగ పోలేదు .కాని క్రమంగా ఈ భావం నశించి ఇక్కడే కొంతకాలం ఉండిఈ దేశ  వింతవిషయాలు తెలుసుకోవాలని పించింది .ఒక దేవదూత మెత్తని రెక్కలస్పర్శ అనుభవి౦చి నట్లుగా ఉంది .కొద్ది దూరం లో మధురమైన లలిత సంగీతం వినిపిస్తోంది. అది జర్మనీకి చెందినా మొజార్ట్ లాంటి పాతతరం వాళ్ళ  మోడరన్ మ్యూజిక్ లాగా లేదు .’’మాన్యుల్ నిన్ను కొద్దిరోజుల్లో మా సరిహద్దులదగ్గరకు విహారానికి తీసుకు వెడతాడు .మొదటగా ఉపరితలం పై నుంచి ఇక్కడికి చేరే ‘’టెలోస్ ‘’  చూపిస్తాడు.టిమోతీ నేను నీ స్నేహితుడిని   నీకు వచ్చే అన్ని సందేహాలకు సమాధానాలు చెబుతాను .సమయం వచ్చినప్పుడు మళ్ళీ మనం కలుసుకొందాం ‘’‘’అన్నాడు డెరిక్.

2-భూగర్భ స్వర్గం

‘’దుఖం లేని దేశమా ?’’అన్నాను ఆశ్చర్యంగా మాన్యుల్ తో అతడు నన్ను ఒక గ్రామానికి తీసుకు వెడుతుండగా .అతడు చిన్నగా నవ్వాడు .’’అవును నిజమే .ఇక్కడ  ఉండే వాళ్ళంతా నీ లాగా ,నా లాగా సాధారణ మనుషులే .ఇక్కడా దుఖం ఉంటుంది .దాన్ని వేరే విధంగా నివారిస్తారు .అక్కడ దుఖం మిమ్మల్ని డామినేట్ చేస్తుంది .ఇక్కడ మేము దాన్ని కంట్రోల్ చేసి నిరోధిస్తాం .సాయం కావాల్సి వచ్చినప్పుడు ఆపన్నహస్తాలు శారీరకం గా మానసికంగా ఆదు కొంటాయి .భూమిపైన మీరు ఒకరికొకరు సాయంచేసుకోరు .మీ యావ డబ్బు మీదే .అందరిదగ్గరా డబ్బు ఉండదుకదా.కానీ మిత్రమా టిం!ప్రతివాడికి హృదయం ఉంది .దానికి ఖర్చు పెట్టాల్సిదేమీ లేదు కదా .కాని నువ్వు దాని మాట వినాలి అంతే.నీమనసు నీకు మంచి సలహా ఇస్తుంది .నువ్వుకూడా అదేభాష మాట్లాడుతూ ఆ అనుభావం పొందుతూ ,అర్ధం చేసుకోవాలి .అదే నీకు సహాయకారి అవుతుంది ‘’అన్నాడు .

    తర్వాత ఏమి జరిగిందో నాకు తెలీదు .అంతా వేగంగా జరిగిపోయింది .నా చెయ్యిపట్టుకొన్న మాన్యుల్ బడికి వెళ్ళే ఏడేళ్ళ కుర్రాడిలాగా మొదట కనిపించాడు  .అక్కడ దృశ్యాలన్నీ చకచకా మారి పోతున్నాయి .కొద్దిసేపటికి నా కాళ్ళ కింద నీరు చూశాను .ఆనీలి నీటిపై తెల్లని బాతు ఈదుతోంది  .తర్వాత బంగారు రంగు ఇసుక ఉన్న బీచ్ లు ,తర్వాత మరకతం అంటే పచ్చలు పరచినట్లున్న పచ్చగడ్డి ,చివరికి భూమి కనిపించింది .’’చుట్టూ బాగా చూడు ‘’ఆన్నాడు మాన్యుల్ .అతడు చేయి పత్తుకొని ఉండకపోతే నేను మూర్చపోయి ఉండేవాడిని .నా కంగారుకు కారణం ఉంది .అక్కడ అందమైన ప్రదేశాలే అన్నీ .స్పష్టంగా ,ఆహ్లాదంగా ,వైల్డ్ గా ఉన్నాయి .అక్కడ ప్రతి చిన్న పొద ,చెట్టు పువ్వు  శబ్దం చేస్తోంది .కాకిగోలగా ఉంది .చిన్నచిన్నవి యేవో  ఇటూ అటూ ప్రశాంతంగా పడవప్రయాణ౦ చేస్తున్నాయి.చుట్టూ తిరుగుతున్నాయి .చెట్లల్లోకి పొదల్లోకి దూరుతూ ఆశ్చర్యంగా తిరుగుతున్నాయి .’’

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-9-20-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment