20వ శతాబ్ది సాహిత్యం -14 203-అమెరికాదేశ సాహిత్యం -22

బహుళ సాంస్కృతిక సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం

20వ శతాబ్ది సాహిత్యం -14

బహుళ సాంస్కృతిక సాహిత్యం -2

ఎన్.స్కాట్ మామడి రాసిన ‘’హౌస్ మేడ్ ఆఫ్ డాన్’’నవలకు 1969లో పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .జేమ్స్ వెల్ష్ రాసిన’’వింటర్ ఇన్ ది బ్లడ్—1974,’’ఫూల్స్ క్రో’’-1986,లెస్లీ మార్మన్ సిల్కో రాసిన ‘’సెరిమని ‘’-1977,లూయీ ఎండ్రిచ్ నవల ‘’లవ్ మెడిసిన్ -1984,ది బీట్ క్వీన్ -1986,యాంటి లోప్ వైఫ్ -1998 నవలలు  నేటివ్ అమెరికన్ హిస్టరీ,అస్తిత్వ  పరిశోధన పై   అస్పష్ట శక్తివంతమైన నవలలు .మెక్సికన్ అమెరికన్ లగురించి రుడాల్ఫోఎ.అనయ రాసిన ‘’బ్లెస్ మీ ఉల్టిమా’’-1972,రిచార్డ్ రోడ్రిగెజ్ రాసిన స్వీయచరిత్ర లాంటి ‘’హంగర్ ఆఫ్ మెమరి ‘’-1981,సాండ్రా సిస్నేరోస్ రాసిన ‘’ది హౌస్ ఆన్ మాంగో స్ట్రీట్ ‘’-1983,ఈమెదే అయిన వుమన్ హోలరింగ్ క్రీక్ ,అదర్ స్టోరీస్ సంపుటాలు మెక్సికన్ లైఫ్ ను చూపేవే .

  పాత, కొత్త సంస్కృతుల లో పెరిగిన వాటిని బాగా అర్ధం చేసుకొన్న ఇమ్మిగ్రంట్ రచయితలైన ఆస్కార్ హిజులోస్ –ది మామ్బో కింగ్ ప్లే సాంగ్స్ ఆఫ్ లవ్ ‘’-1989,క్రిస్టినా గార్సియ –డ్రీమింగ్ ఇన్ క్యూబన్ -1992, ది ఎజిలిరో సిస్టర్స్ -1997,ఆంటిగ్వా లో పుట్టిన జమైకా కిన్కైడ్ రాసిన అన్నీ జాన్ -1984,లూసీ -1990,ఎయిడ్స్ జ్ఞాపకాలైన మై బ్రదర్ -1997,సి నౌ అండ్ దెన్-2013,డొమినికా లోపుట్టిన జునాట్ డయాజ్ రాసిన పులిట్జర్ ప్రైజ్ పొందిన నవల –ది బ్రీఫ్ వండ్రస్ లైఫ్ ఆఫ్ ఆస్కార్ వావో -2007,బోస్నియన్ ఇమ్మిగ్రెంట్ అలేక్జాండర్ హెమాన్  రాసిన క్వేస్చిన్ ఆఫ్ బ్రూనో -2000,నో వేర్ మాన్ -2002,చైనీస్-అమెరికన్ రచయియిత్రి మాక్సిన్ హాంగ్ కింగ్స్టన్ రాసిన వుమన్ వారియర్ -1976,చైనా మెన్-1980 నవలలో ప్రాచీన చైనా వారసత్వం ,అద్భుత కుటుంబ చరిత్ర నుచూపింది . శాన్ఫ్రాన్సిస్కో లోని బే ఏరియాలో 1960 నాటి బోహీమియన్ ప్రపంచాన్ని ‘’ట్రిప్ మాస్టర్ మంకీ,-హిజ్ ఫేక్ బుక్ అనే మొట్టమొదటి నవలో చూపింది .ఇతర ఏషియన్ –అమెరికన్ రచయితలలో గీష్ జెన్ -1991లో రాసిన టిపికల్ అమెరికన్ నవలలో వలస మనుషుల జీవన పోరాటం ఫ్రస్ట్రేషన్ కళ్ళకు కడుతుంది .కొరియన్ –అమెరికన్ రైటర్ –చాంగ్ రే లీ –రాజకీయ జాగృతి కుటుంబ వ్యవస్థ ,తరాల భేదాలను –నేటివ్ స్పీకర్ -1995,గెస్చర్ లైఫ్-1999లో చూపిస్తే ,హా జిన్ –వైటింగ్ -1999,నవలకు నేషనల్ బుక్ అవార్డ్ వచ్చింది .చైనాలో కల్చరల్ రివల్యూషన్ కాలం లో, ఆతర్వాత ఉన్న పిరికితనం ,అణచివేత ,దెబ్బతిన్న ప్రేమ ,పాత కొత్త తరం చైనా లో ఇమడలేని స్థితిని రచయిత అద్భుతం గా ఆవిష్కరించాడు .ఇండియా అమెరికాలో ఉండే భారతి ముఖర్జీ –దిమిడిల్ మాన్ అండ్ ఆదర్ స్టోరీస్  -1988,జాస్మిన్ -1989,డిజైరబుల్ డాటర్స్ -2002,ది ట్రీబ్రైడ్-2004 రాసింది .ఇంకా చాలామంది మాలతి కల్చరల్ రచనలు చేసి ,మారుతున్న అమెరికన్ సాహిత్యాన్ని పరిపుష్టి చేశారు .

   1900కాలం లో చాలా మంది ఫిక్షన్ రైటర్స్ తమ శక్తి యుక్తుల్ని స్వీయ జీవిత చరిత్రలు రాసుకోవటం లో సార్ధకం చేసుకొన్నారు .మేరీ కార్ రాసిన ది లయర్స్ క్లబ్ -1995లో టెక్సాస్ గల్ఫ్ కోస్ట్ లో కుదేలైన కుటుంబ వ్యవస్థ చూపించింది .ఫ్రాంక్ మెక్ కోర్ట్1996లో  రాసిన ఎంజలాస్ యాషెస్ లో డికెన్స్ బాల్యం లాంటి జీవితం ,ఐరిష్ మురికి కూపాలు వర్ణించింది .అన్నే రోఫే-తన ధనిక  తలిదండ్రుల నిర్దయ , ఎయిడ్స్ తో అన్న చనిపోవటం మొదలైనవి –‘’1185 పార్క్ అవెన్యు -1999 లో దయనీయంగా వర్ణించింది .డేవ్ ఎగ్గర్ –‘’ఎ హార్ట్ బీటింగ్ వర్క్ ఆఫ్ స్టాగరింగ్ జీనియస్ ‘’2000లో అనేక కష్ట నష్టాలు అనుభవిస్తూ ఒక యువకుడు తన తలిదండ్రులు చనిపోతే తమ్ముడిని ఆదుకొని తీర్చి దిద్దిన విధానం చూపించాడు .

  నవలల పై చాపల్యం చావలేదు .అనేక పెద్ద ప్రతిష్టాత్మిక నవలలు తెగరాసి పారేశారు రచయితలు .వీరిలో  డేవిడ్ ఫాస్టర్ వాలెస్-ఇన్ఫినిట్ జెస్ట్ -1996,లో ఎన్సైక్లో పీడిక్ మార్మిక నమ్మకాలతో సోషల్ ఫిక్షన్ ,పోస్ట్ మోడరన్ ఐరని కలిపి దంచాడు .జోనాధన్ ఫ్రాన్జేన్-నేషనల్ బుక్ అవార్డ్ పొందిన నవల –ది కరెక్షన్స్ -2001,ఫ్రీడం-2010 నవలలు  ఫామిలి పోర్ట్రైట్ లే.డాన్ లిలోస్ –అండర్ వరల్డ్ -1997,లో ప్రచ్చన్న యుద్ధ అంటే కోల్డ్ వార్ స్థితిగతుల్ని ఫిక్షనల్ ,హిస్టారికల్ పాత్రల కళ్ళతో చూపించి మనము౦దు౦చాడు.ఈ మూడు నవలలో మరీ ఆలస్యమైపోయిన ఏకీకృతం కాని సాంఘిక రియలిజం నుPynchonesque invention   గా కొత్తగా చూపించాడు .పించాన్ బతికి వచ్చి చారిత్రిక నవలలు రాసినట్లు అనిపిస్తుంది ప్రతిదీ కళ్ళకు కట్టిస్తాడు .1997లో రాసిన మేసన్ అండ్ డిక్సన్ లో 18వ శతాబ్దపు ఇద్దరు ప్రసిద్ధ సర్వేయర్లు ,వారి అమెరికన్ కాలనీల గురించి పరిశోధనలు అన్వేషణలు,మాప్ లు తయారు చేయటం గురించి రాస్తే ,2006లో రాసిన ఎగైనెస్ట్ ది డే లో 20వ శతాబ్ది నుంచి 21వ శతాబ్ది కి పయనం కనిపిస్తుంది . రెండవ ప్రపంచ యుద్ధానంతర కవిత్వం గురించి  తర్వాత తెలుసుకొందాం .  

    సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

203-అమెరికాదేశ సాహిత్యం -21 20వ శతాబ్ది సాహిత్యం -13

203-అమెరికాదేశ సాహిత్యం -21

20వ శతాబ్ది సాహిత్యం -13

ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం -2

ఎ గార్డెన్ ఆఫ్  ఎర్త్లి డిలైట్ ,-1967,దెం-1969 రాసిన జాయ్స్ కరోల్ ఓట్స్ – డెట్రాయిట్ హింస లాంటి అర్బన్ ప్రాంత హింస ను సహజ సిద్ధంగా వర్ణించి రాసింది .1971 సర్రియలిజం ను ప్రయోగాత్మకం గా వాడి ‘’వండర్ లాండ్’’ నవల రాసింది .1980లో గోధిక్ ఫాన్సీ తో బెల్లె ఫ్లూయర్,1986లో అప్ స్టేట్ అయిన న్యు యార్క్ లోని బ్లీక్ బ్లూ కాలర్ వరల్డ్ గురించి మార్యా నవల  రాసింది .తర్వాత బ్లాండే-ఎ నావెల్ -2000,లో నటి మార్లిన్ మన్రో జీవిత చరిత్ర రాసింది .వాస్తవతను పట్టుకోవటానికి మాత్రమె కాకుండా మలైర్  ,ఓట్స్ లిద్దరూ ఆ శక్తిని ఫిక్షనల్ మోడ్స్ తో చూపించారు .

   1970లో ఫెమినిజం ప్రవేశించి ,కొత్తతరం స్త్రీ రచయితలూ వచ్చారు .ఎరికా జంగ్ –సెక్సీ అండ్ ఫన్నీ గా ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్ 1974,రీట మే బ్రౌన్ –లెస్బియన్ లైఫ్ ను రూబీ ఫ్రూట్ జంగిల్ 1973లో రాసింది .1970లో వచ్చిన ఇతర ఫిక్షన్ స్త్రీ రచయితలలో ఆన్ బీటీ –చిల్లీ సైన్స్ ఆఫ్ వింటర్ నవలలో ,కధల్లో1960తర్వాతకాలపు జనరేషన్ చిత్రించింది .గైల్ గాడ్విన్1974లో రాసిన ది ఆడ్ వుమన్ లో ఉన్నత నాగరకత ప్రదర్శించింది .మేరీ గార్డెన్-ఐరిష్ కేధలిక్ జీవితాలను ఫైనల్ పే మెంట్స్ -1978 చిత్రిస్తే ,అలిసాన్ లూరీ,అన్నే టైలర్ లు సోషల్ కామెడీలు రాశారు .

  రేమండ్ కార్వర్ ప్రభావం – 1970లో వచ్చిన ప్రేరణాత్మక ఫిక్షన్ రైటర్ మాత్రం రేమండ్ కార్వర్.ఇతడు ఫసిఫిక్ నార్త్ వెస్ట్ లోని  బ్లూ కాలర్ లైఫ్ ను కధల్లో చిత్రించిన మరొక రియలిస్టిక్ రచయిత , 1981లో వచ్చిన ఇతడి ‘’వాట్ ఉయ్ టాక్  వెన్ వుయ్ టాక్ అబౌట్ లవ్ ‘’,1983లో వచ్చిన కేతేడ్రేల్ కధా సంపుటాలు దీనికి నిలువెత్తు సాక్ష్యాలు .జీవితాలను స్వయంగా నాశనం చేసుకొనే అతడి పాత్రలు జీవితాన్ని కోల్పోయిన వారే .అతడి శైలి పై హెమింగ్వే ,సామ్యుల్ బెకెట్ ప్రభావం జాస్తి .గొప్ప సలహాదారుగా దర్శనమిస్తాడు రచయిత .అక్కడక్కడ బార్తేల్మే  మేరీ రాబిన్సన్ ,అమీ హేమ్పెల్ లను చెత్తగా అనుకరించినా, ఆ తరాన్ని బాగా ప్రభావితం  చేశాడు . కార్వార్ ప్రేరణతో అతన్నే  అనుకరించి గొప్పగా నవలలు రాసిన వారిలో రిచర్డ్ ఫోర్డ్ –రాక్ స్ప్రింగ్స్ – 1987,రస్సెల్ బాంక్స్ –కాంటి నెంటల్  డ్రిఫ్ట్-1984,టోబియస్ ఉల్ఫ్ –ది బారక్స్ ధీఫ్-1984,దిస్ బాయ్స్ లైఫ్ -1989 ఉన్నారు .1960కాలపు కౌంటర్ కల్చర్ రియలిస్టిక్ రచయిత రాబర్ట్ స్టోన్ ఉద్బవించాడు .ఇతడి డాగ్ సోల్జర్స్ -1974,లో వియత్నాం జనరేషన్,  డ్రగ్స్ ముఖ్య విషయం. 1981లో వచ్చిన ఎ ఫ్లాగ్ ఫర్ జనరేషన్ మధ్య అమెరికా లోని  అస్పష్ట విషాద కాన్రాడ్ రాజకీయ నవల .అతని పాత్రలలో ఆధ్యాత్మిక అశాంతిని అసలు సాధారణ జీవితం కంటే ఎక్కువగా వర్ణించాడు .1986లో అతడి హాలీ వుడ్ నవల చిల్డ్రన్ ఆఫ్ లైట్ -1986,లో ,డమాస్కస్ గేట్-1989లో హోలీ లాండ్ లోని అలౌకిక వాతావరణం –(అపోకలిప్టిక్ అట్మాస్ ఫియర్ )చూపాడు .రిచార్డ్ రూసో మంచి హాస్యం ,సూక్ష్మ విషయాలతో కూడా వాయవ్య రాష్ట్రాలలో  బ్లూ కాలర్స్ కోల్పోయిన జీవితం  యొక్క శిధిలతను రిస్క్ పూల్ -1988,నో బడీస్ ఫూల్ -1993,ఎంపైర్ ఫాల్స్ -2001లో చిత్రించాడు. ఇతడే అకాడెమియా పై సెటైరికల్ గా స్ట్రైట్ మాన్ -1997 నవల రాశాడు .

  కొంతమంది స్త్రీ రచయితలైన ఇ.అన్నీప్రౌల్క్స్ పురుష పాత్రలను చిత్రిస్తూ ది షిప్పింగ్ న్యూస్ -1993,క్లోజ్ రేంజ్-వైమింగ్ స్టోరీస్-1999,రాస్తే ,ఆండ్రియా బారెట్ –షిప్ ఫీవర్ -1996,రాసింది .స్త్రీలలో రిలేషన్ షిప్ గురించి మేరీ గేయిట్స్ స్కిల్  సెటైరికల్ గా -టు గరల్స్ ఫాట్ అండ్ ధిన్-1991ను నబకోవ్ ,మేరీ మేకార్ధి ప్రభావం తో రాసింది .లారీ మూర్ –వ్యక్తిగత నాణ్యమైన కధలను నవలలుగా రాసింది .డిబోరా ఐసెన్ బెర్గ్ ,అమీ బ్లూమ్ ,ఆంటోన్యా నెల్సన్ ,ధామస్ జోన్స్ లు 20వ శతాబ్ది చివరికాలాన్ని చిరస్మరణీయమైన కధలతో నింపారు .

  బహుళ సాంస్కృతిక సాహిత్యం -20వ శతాబ్దం చివర్లో మల్టి కల్చరల్ సాహిత్యం బాగా ఊపు అందుకొన్నది .కొత్త జ్యూయిష్ వాయిసెస్  ఫిక్షన్ లో వినిపించాయి ఇ.ఎల్.డాక్టర్రో తన సాహిత్యం లో చారిత్రకాన్ని నవలా ఫిక్షన్ లో కలిపి రాగ్ టైం-1975,వాటర్ వర్క్స్ -1994 రాశాడు .సింధియా ఒజిక్ –ఎన్వి లేక యిద్ధిష్ అమెరికా 1969లో యిద్ధిష్ లిటరేచర్ లోని లీడింగ్ మోడల్ కారక్టర్స్ లో వర్ణించింది  .1980లో రాసిన ఈమె కథ’’షాల్’’ లో నాజి కాన్సేన్ట్రేషన్ కాంప్ లో ఒక బేబీ హత్యోదంతం ఉంది .డేవిడ్ లివిట్-హోమో సెక్సువల్ ధీమ్స్ ను పరిచయం చేసి ఫామిలి డాన్సింగ్ -1984లో మిడిల్ క్లాస్ జీవితాన్ని చిత్రించాడు .21వ శతాబ్ది ఆరంభానికి పూర్వపు సోవియెట్ యూనియన్ కు చెందిన గేరీ స్టైయింగార్ట్,లారా వాప్నవర్ రచయితలు అమెరికా చేరిన వలస జనం అనుభవాలను వర్ణించారు .తర్వాత నవలా ప్రస్థానం గురించి తెలుసుకొందాం .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-4-21-ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

203-అమెరికాదేశ సాహిత్యం -20 20వ శతాబ్ది సాహిత్యం -12 ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం

203-అమెరికాదేశ సాహిత్యం -20

20వ శతాబ్ది సాహిత్యం -12

ఆఫ్రికన్- అమెరికన్ సాహిత్యం

20వ శతాబ్ది నల్లజాతి రచయితలు  రిచార్డ్ రైట్యోక్క్  కోపం ,సాంఘిక నిరసన సంప్రదాయానికి భిన్నంగా కొత్త విధానం కనిపెట్టారు .జేమ్స్ బాల్డ్విన్ ,రాల్ఫ్ ఎల్లిసన్ లు రైట్ మార్గగాములు అయినా అమెరికాలో నల్ల వారి సంక్లిష్ట పరిస్థితులను చిత్రించే అనేక వివాదాస్పద వ్యాసాలతో సాహిత్య రచన చేశారు . బాల్డ్విన్ తన 1935లో రాసిన మొదటి నవల  ‘’గో టెల్ ఇట్ ఆన్ ది మౌంటేన్ ‘’లో హార్లెం ప్రపంచాన్ని ,నల్ల వారి చర్చి విషయాలను తన యవ్వన అనుభవాలతో రాశాడు .గ్రామీణ జానపదుల గురించి అబ్సర్దిస్ట్ హాస్యం ను వాస్తవాన్ని జోడించి రాశాడు .రాల్ఫ్ ఎల్లిసన్ మాత్రం నల్లవారి అనుభవాలు గ్రామీణ వ్యవసాయం ,వివక్షత తో కూడిన విద్య ,ఉత్తరప్రాంతాలకు వలస పోవటం ,ఘెట్టో భయానక స్థితులు లపై జాతీయత ,కమ్యూనిజం ప్రేరణకలిగిస్తూ నవలలు రాశాడు .1952లో యితడు రాసిన ‘’ఇన్ విజిబుల్ మాన్ ‘’ను యుద్దానతరం వచ్చిన గొప్ప నవలగా భావించారు .

  తర్వాత ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రులు యుద్ధానంతర అమెరికన్ ఫిక్షన్ రాశారు .1970లో వచ్చిన   ది bhiest ఐ’’,1973రచన ‘’సులా ‘’,1977లోని ‘’సాంగ్ ఆఫ్ సాల్మన్ ‘’1987లో ‘’,బిలవ్డ్’’,1992లో జాజ్ ,1998లో ‘’పారడైజ్ ‘’తోపాటు టోనీ మారిసన్ అనేక విధాల లిరికల్ రి కలెక్షన్ ,మాజిక్ రియలిజం దాకా రాశాడు .  .ఎల్లిసన్ లాగా మారిసన్ వైవిధ్య జానపద గీతాలు ,బ్లాక్ హిస్టరీ లను బానిసత్వాన్ని బిలవ్ద్ లో హార్లేన్ రినైసేన్స్ ను జాజ్ లో చిత్రించింది  .ఎంతో  కవిత్వం రాసిన ఎలిస్ వాకర్ 1976లో పౌరహక్కుల సమస్యపైనవల’మెరిడియన్’’ రాసి,’’కలర్ పర్పుల్ ‘’అనే బ్లాక్  ఫెమినిస్ట్ నవలకు 1982లో పులిట్జర్ ప్రైజ్ పొందింది  .నల్లజాతి పురుషులు కూడా విజ్రుమ్భించి సాహిత్య సృజన చేశారు ఈకాలం లో .వారిలో ఇస్మాయిల్ రీడ్,వైల్డ్ కామిక్ రాస్తే ,జేమ్స్ అలాన్ ,మెక్ ఫెర్సన్ చిన్నకథలు రాశాడు .చార్లెస్ జాన్సన్ రాసిన’’ ది ఆక్స్ హీర్దింగ్ టేల్ ‘’,(1982),డి మిడిల్ పాసేజ్ -1990 నవలలో చారిత్రాత్మక ఊహాత్మకత ప్రదర్శించాడు .Gay రచయిత రాండాల్ కెన్మాన్ మాత్రం ఫోక్ ఇమాజినేషన్ తో బాల్డ్విన్ ఎలిసన్ ల శైలిలో రాశాడు .కాల్సన్ వైట్ హెడ్ ఫోక్ ట్రడిషన్ లో ప్రయోగాలు చేసి, ది ఇంట్యూ షనిస్ట్-1999,జాన్ హెన్రి డేస్-2001లో రాశాడు .

 న్యు ఫిక్షనల్ మోడ్స్-రెండవ ప్రపంచ యుద్ధం ,కోల్డ్ వార్ ,అటామిక్ బాంబ్ ,కలవర పరచే కన్స్యూమర్ కల్చర్ ధోరణి ,1960లోని కల్చరల్ క్లాషేస్ కు ప్రేరితులైన రచయితతలు  సంప్రదాయ ఫిక్షన్ ను వదిలి కొత్త అన్వేషణకు దారి చూపారు .దీని ఫలితంగా పోస్ట్ మోడరన్ నవల పుట్టింది .విలియం గాడిస్,జాన్ బార్త్,జాన్ హాక్స్ ,డోనాల్డ్ బార్తల్మే,ధామస్ పించాన్ ,రాబర్ట్ కూవర్ ,పాల్ ఆస్టర్,డాన్ డెలిలో వాస్తవానికి పెద్దపీట వేసి రియాలిటి కే రియాలిటి తెచ్చారు .వారి నవలలు ‘’ఆర్టి ఫాక్ట్స్’’ అయ్యాయి .రియలిస్టిక్ టెక్నిక్ లను ఐరానికల్ గా ప్రయోగించారు .హింస ను మరింత పెంచారు .డాక్యుమెంటేషన్ కు విలువ పెంఛి ఫాంటసి కి దారి తీశారు .నార్మన్ మైలర్ ,జాయ్స్ కరోల్ ఓట్స్ లు ఈ కొత్తదారి నిర్మాతలు .

   1948లో మైలర్ -రచయిత డాస్ పాసోస్ సాంఘిక నిరసన ధోరణి సంప్రదాయం లో ‘’ది నేకెడ్ అండ్ ది డెడ్’’రాశాడు .దీని పరిమితులకు లోబడి ఫేబుల్స్ లో సర్రియలిస్టిక్ ఫాంటసి ప్రవేశ పెట్టి ,యాన్ అమెరికన్ డ్రీం – 1965,వై అర్ వియ్ ఇన్ వియత్నాం -1967రాశాడు .ఇతని సబ్జెక్ట్ ఏమిటి అంటే రాజకీయం గా, వ్యక్తిగతంగా ‘’నేచర్ ఆఫ్ పవర్’’.తర్వాత దారిమారి ‘’నాన్ ఫిక్షన్ ఫిక్షన్ ‘’లేక ఫిక్షన్ ఆజ్ హిస్టరీ ‘’ఇన్ ది ఆర్మీస్ ఆఫ్ ది నైట్ ‘’,మియామి అండ్ సీజ్ ఆఫ్ చికాగో -1968సృష్టించాడు .మైలర్ తన స్వంత గొంతును గొప్పగా ఉన్న స్వకీయమై ,కామిక్ అయినా మేధోవిలసిం గా సృస్టించు కొన్నాడు .ఈ నూతన విధాన ట్రూ లైఫ్ నవల ‘’ది ఎక్సి క్యూషనర్స్ సాంగ్ ‘’రచనకు  1979లో పులిట్జర్ పొందాడు .మళ్ళీ ఫిక్షన్ కు వచ్చి  సెంట్రల్ ఇంటలిజెన్స్ పై ‘’హార్లాట్స్ ఘోస్ట్’’ -1991రాశాడు అతడి చివరి నవలలు –(జీసెస్ క్రైస్ట్-ది గాస్పెల్ అకార్దింగ్ టు సన్)1997, ,అడాల్ఫ్ హిట్లర్ (ది కాజిల్ ఇన్ ది ఫారెస్ట్ )2007రాశాడు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-21-ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ద్రావిడ భాషాశాస్త్ర  కర్త ,అమెరికన్ లింగ్విస్ట్ –ఫ్రా౦క్లిన్  సి. సౌత్ వర్త్(1929)

– ద్రావిడ భాషాశాస్త్ర  కర్త ,అమెరికన్ లింగ్విస్ట్ –ఫ్రా౦క్లిన్  సి. సౌత్ వర్త్(1929)

ఫ్రా౦క్లిన్  సి. సౌత్ వర్త్ అమెరికన్ లింగ్విస్ట్ 1929లో పుట్టాడు .పెన్సిల్వేనియా యూని వర్సిటి లో సౌత్ ఏషియన్ లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .చాలా పుస్తకాలు రాశాడు .సౌత్ ఏషియా –1-ద్రవిడియన్ లింగ్విస్టిక్ హిస్టరీ 2-రైస్ ఇన్ ద్రవిడియన్ 3-ప్రోటో ద్రవిడియన్ అగ్రికల్చర్ 4-లింగ్విస్టిక్ ఆర్కియాలజీ ఇన్ సౌత్ ఏషియా 5-లింగ్విస్టిక్ ఆర్చియాలజి అండ్ ది ఇండస్ వాలీ కల్చర్ 6-ది సోషల్ కంటెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్  స్టాండర్డై జేషన్ 7-లెక్సికల్ ఎవిడేన్సేస్ ఫర్ ఎర్లి కాంటాక్ట్స్ బిట్వీన్ ఇండో ఆర్యన్ అండ్ ద్రవిడియన్ వంటి 13 విలువైన రచనలు చేశాడు .

  కొలామి అనేది  తెలుగులో గోడ అయిందని ,కిట్ అనేది వ్రాత, తుడిచేయటం గా తెలుగు ,తమిళాలలో మారిందని ,అరి అంటే పన్ను ,పొగడ్త అని దీని అసలు రూపం ధాన్యం అని అదే వరి గా తెలుగులో మారిందని ,.దక్షిణ ద్రవిడియన్ లో ఒక్క్ అనేది గణితం లో ఒకటి అనే తెలుగు పదం అయిందని ,జంతువుల కొవ్వు ‘’నే’’ క్రమంగా నెయ్యి అయిందని ,ఫ్రా౦క్లిన్  చూపించాడు .ఎలి, ఇలి లోంచి తెలుగు ఎలుక వచ్చిందని అంటాడు .

4- భగవద్గీతానువాదం చేసిన అమెరికన్ లింగ్విస్ట్ ,స్కాలర్ -ఫ్రాన్క్లిన్ ఎడ్గర్టన్(1885-1963)

24-7-1885జన్మించి 7-12-1963న 78వ ఏట మరణించిన వాడు అమెరికన్ లింగ్విస్టిక్ ,విద్యావేత్త ఫ్రాన్క్లిన్ ఎడ్గర్టేన్.ఏల్ యూని వర్సిటిలో సాంస్క్రిట్ ,కంపారటివ్ ఫైలాలజి ప్రొఫెసర్ .1953-54 కాలం లో బెనారస్ హిందూ యూని వర్సిటికి విజిటింగ్ ప్రొఫెసర్ .1913 నుండి 1936వరకు పెన్సిల్వేనియా యూనివర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా 23ఏళ్ళు పని చేశాడు .భగవద్గీతను అనువాదం చేయటం తో ఆయన పేరు జగత్ ప్రసిద్ధమైంది .ఇది 38,39 హార్వర్డ్ ఓరియంటల్ సిరీస్ గా 1944లో ముద్రితమైంది .సింహాసన ద్వాత్రి౦సిక పునర్ముద్రణ లోను , ,పంచతంత్రం మూల ప్రతి శిదిలమైతే దాన్ని పూరించటం లో విశేష కృషి చేశాడు .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గత శతాబ్ది మేటి ఇండాలజిస్ట్ –ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ (1907-2003)

గత శతాబ్ది మేటి ఇండాలజిస్ట్ –ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ (1907-2003)

7-7-1907న నెదర్ లాండ్స్ లోని ది హేగ్ లో జన్మించి 96ఏళ్ళ నిండు జీవితాన్ని గడి,14-12-2003 న జీస్ట్ లో మరణించిన  ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ ఇండాలజీ లో విశిష్ట స్థానం ఉన్నవాడు. గత శతాబ్దపు మేటి ఇండాలజిస్ట్ గా ప్రసిద్ధి చెందినవాడు .సంస్కృతం,లాటిన్ ,గ్రీక్ ,ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్స్ లను లైదేన్ యూని వర్సిటి లో అధ్యయనం చేసి ,1934లో సంస్కృత ,ఇతర యూరోపియన్ భాషలలో నాసికా ఉచ్చారణ (నాసల్ ) పత్ర సమర్పణ చేసి ,డాక్టరేట్ సాధించాడు   . ఇండొనీషియాలోని జకార్తా లోఉన్న లైసియం ఆఫ్ బటేవియా లో గ్రీక్ ,లాటిన్ బోధించే ఉపాధ్యాయుడిగా అయిదేళ్ళు ఉద్యోగించాడు .1939లో లైదేన్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .

ఇండో –ఇరానియన్ ,ఇండో –ఆర్యన్ ఫైలాజి ,లింగ్విస్టిక్స్ ,మైథాలజి ,దియేటర్ ఆర్ట్  ,ఇండో –యూరోపియన్ ,ద్రవిడియన్ ,ముండా,పాన్ ఇండియన్ లింగ్విస్టిక్స్ లలోని అన్ని శాఖలోనూ జ్ఞాన నిధి .

   రాయల్ నెదర్లాండ్స్ అకాడెమి అండ్ ఆర్ట్స్ మెంబర్ గా 1937నుంచి 39వరకు పని చేసి  రాజీనామా చేశాడు .ఆర్డర్ ఆఫ్ దినెదర్లాండ్స్ లయన్  కు Knight అయ్యాడు .

 కూపర్ రచనలన్నీ ‘’ఇండియన్ లింగ్విస్టిక్స్ అండ్ ఫైలాలజి ‘’గా ముద్రణ పొందాయి .ఇండియన్ మైదాలజి పై రాసినవన్నీ అతని స్నేహితుడు జె.ఇర్విన్ ‘’ఇండియన్ కాస్మాలజి ‘’గా రెండు దశాబ్దాలక్రితం ప్రచురించాడు .1968వరకు కూపర్ బిబ్లియాగ్రఫీ అంతా ఫెస్టాక్రిఫ్ట్ అంటే ‘’ప్రతి దానం’’ గా లభిస్తుంది .తరువాత విషయాలు అనేక చోట్ల నుంచి  సంగ్రహించారు .

  సంస్కృతం లో కూపర్ అధ్యయనం మొదట  వేదం నామవాచకాలతో1942లో  ప్రారంభమైంది .యుద్ధం తర్వాత 1947లో ట్రేసేస్ ఆఫ్ లేరేన్జీల్స్(నాసికా ధ్వనులు  ) ఇన్ వేదిక్ సాంస్క్రిట్ ‘’ పై అధ్యయనం చేశాడు .ఫైనల్ వొవెల్స్ ఇన్ ఋగ్వేద పై 1955లో పరిశోధించాడు .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ప్రసాద వితరణ

సరసభారతి పుస్తక ప్రసాద వితరణ

సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతి శ్రీ ప్లవ ఉగాదికి ఆవిష్కరించాల్సిన   -1-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లి నాథ సూరి మనీష  2-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు అనే రెండు పుస్తకాలను 13-4-21శ్రీ ప్లవ ఉగాది మంగళ వారం ఉదయం మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి పవిత్ర పాదాల వద్ద ఉంచి స్వామియే ఆవిష్కరించి నట్లు భావించాము .21-4-21 బుధవారం శ్రీరామనవమి నాడు మన ఆలయం లో జరిగిన శ్రీ సీతా రామ కల్యాణం సమయం లో అమెరికా నుంచి వచ్చిన మా అమ్మాయి శ్రీమతి విజయలక్ష్మి తో స్వామి వారి సన్నిధానం లో పై రెండు పుస్తకాలను ఆవిష్కరి౦ప జేసి ,సుమారు 60మంది భక్తులకు 60 సెట్లు  పుస్తక ప్రసాదంగా అందజేయించాము . .
   ఆ తర్వాత  ఈ నెల 22నుంచి 27 వరకు సాహితీ బంధువులకు ,బంధు మిత్రులకు బుక్ పోస్ట్ లో ,రిజిస్టర్డ్ పార్సిల్ ద్వారా 140 సెట్లు పంపాము దాదాపు అందరికి  అందుతున్నట్లు   మెసేజ్ లు,ఫోన్ లు వస్తున్నాయి .ఇలా మొత్తం 200 సెట్లు అంటే 400పుస్తకాలు పుస్తక ప్రసాదంగా అందరికీ అంద జేసి సంతృప్తి చెందాము .మీ -దుర్గా ప్రసాద్ -27-4-21

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఇజ్రేలీ  ఇండాలజిస్ట్ –డేవిడ్ షుల్మన్(1949)

1-ఇజ్రేలీ  ఇండాలజిస్ట్ –డేవిడ్ షుల్మన్(1949)

1-13-1949న  అమెరికా లోని లోవా లోని  వాటర్లూ లోపుట్టిన డేవిడ్ డీన్ షుల్మన్-ఇజ్రాయిల్ ఇండాలజిస్ట్ ,కవి ,శాంతిప్రబోధకుడు .1967లో వాటర్ లూ హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ చేసి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందాడు.వెంటనే ఇజ్రాయిల్ కు వలస వెళ్లి హీబ్రూ యూని వర్సిటి చేరి ,1971లో ఇస్లామిక్ హిస్టరీ అందులో అరెబిక్ ముఖ్య విషయంగా గ్రాడ్యుయేట్ అయ్యాడు .ఇంగ్లిష్ ఎకనామిక్ హిస్టోరియన్ డేనియల్ స్పెర్బెర్ సాన్నిహిత్యం స్నేహం,ప్రేరణ వలన  ఇండియన్ స్టడీస్ పై ఆసక్తి పొందాడు .తర్వాత ఫైలాలజిస్ట్ ,సెమెటిక్ భాషలలో నిష్ణాతుడు అయిన చిన్ రాబిన్ వలన స్పూర్తి పొందాడు .ఐడిఎఫ్ లో పని చేసి ,తర్వాత ఇజ్రేలి దేశం 1982లెబనాన్ ఆక్రమణ లో పిలువబడి ,ఆర్మీసర్విస్ లో వైద్య నైపుణ్యం పొంది ,సెటిలర్ల హి౦స వలన గాయపడిన పాలస్తీనియన్ లకు సేవలందించాడు .

   సంస్కృత ,తమిళాలలో  డాక్టరేట్ చేశాడు .తమిళ శైవ తలపురాణ౦ ముఖ్య అంశంగా పరిశోధన పత్రం రాశాడు .1972-76కాలం లో లండన్ యూని వర్సిటి లో స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ లో ‘’ది మైధాలజి ఆఫ్ తమిళ్ శైవ తల(స్థల )పురాణ0  పై జాన్ ఆర్ .మార్ వద్ద పరిశోధన పత్రం రాసి సమర్పించాడు .దీనికోసం తమిళ నాడులో ఫీల్డ్ వర్క్ కూడా చేయాల్సి వచ్చింది .దీనిఫలితంగా హీబ్రూ యూని వర్సిటిలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ అండ్ కంపారటివ్ రెలిజియన్ శాఖలో ఇంస్త్రక్తర్ గా చేరి ,లెక్చరర్ అయి తర్వాత 1985లో ప్రొఫెసర్ అయ్యాడు .1987-1992కాలం లో  మెక్ ఆర్ధర్ ఫెలో గా  ప్రొఫెసర్ షుల్మన్ ఉన్నాడు .1988లో ఇజ్రాయిల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ హ్యుమానిటీస్ కు మెంబర్ గా ఎన్నికయ్యాడు .2015లో అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ కి ఎన్నికయ్యాడు .జెరూసలెం యూని వర్సిటి ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్ కు ఆరేళ్ళు డైరెక్టర్ గా పని చేశాడు .క్లే సాంస్క్రిట్ లైబ్రరి ని బలపరచాడు .విగల్ బ్రోన్నేర్ తో కలిసి అక్కడే ఒక కొత్త పుస్తకం రాశాడు .2019నుంచి’’ ఇన్ఫోసిస్ ప్రైజ్’’ కు హ్యుమానిటీస్ జ్యూరీ గా సేవలందించాడు  .ఐలీన్ ను పెళ్ళాడి ముగ్గురు మగ పిల్లల తండ్రి అయ్యాడు .

   అహింస అంటే ప్రాణ౦ గా భావించే షుల్మన్ ‘’జాయంట్ ఇజ్రాయిల్ –పాలేస్టైన్ –లైఫ్ ఇన్ కామన్ఆర్ ట్రయోష్ గ్రాస్ రూట్స్  మువ్ మెంట్ ఫర్ నాన్ వయోలెన్స్ ఉద్యమ౦ లో ప్రముఖ శాంతి కాముక పాత్ర పోషించాడు .’’ఇరు వైపులా వారు గెలిస్తేనే ఇరుపక్షాల వారూ ఓడిపోయినట్లు ‘’అనే సిద్ధాంతం అతనిది .ఇరు వర్గాలలో నైతిక సూత్ర వైఫల్యాలను తెలియ జెప్పేవాడు This conflict is not a war of the sons of light with the sons of darkness; both sides are dark, both are given to organized violence and terror, and both resort constantly to self-righteous justification and a litany of victimization, the bread-and-butter of ethnic conflict. My concern is with the darkness on my side.[4]

   2007లో ‘’డార్క్ హాప్’—వర్కింగ్ ఫర్ పీస్ ఇన్ ఇజ్రాయిల్ అండ్ పాల స్టైన్’’’అనే పుస్తకాన్ని రాసి ప్రచురించి అక్కడ శాంతి సాధన ఎంతటి ముండ్ల బాట  పై ప్రయాణమో కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు .దాదాపు 40 విలువైన ఆర్టికల్స్ వివిధ పత్రికలలో రాసి ప్రచురించాడు .సహ రచయితలతోకలిసి 10 పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు .

  ఈనాటి తమిళ భాష సంస్కృత పదాలతో సంపన్నమైనదని వివరంగా రాశాడు “Modern Tamil is astonishingly rich in Sanskrit loan words. Indeed, there may well be more straight Sanskrit in Tamil than in the Sanskrit-derived north-Indian vernaculars. Sanskrit words tend to be Tamilised in accordance with the Tamil phonematic grid, much in the way they were already at the time of the Tolkappiam grammar.”

  తమిళం కూడా సంస్కృతం లాగానే దేవ భాష అని ‘’ముక్తాయింపు’’ ఇచ్చాడు .అతి స్వచ్చ సంస్కృతం అతి స్వచ్చ తమిళం లేవు అన్నాడు .Muttusvāmi Dīkṣitar and the Invention of Modern Carnatic Music: The Abhayâmbā Vibhakti-kṛtis అనే పుస్తకం రాశాడు .స్ప్రింగ్ ,హీట్ అండ్ రైన్స్ అనే దక్షిణ దేశ యాత్ర దర్శిని రాశాడు ..

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-4-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

21-4-21 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ సీతారామ శాంతికల్యాణ మహోత్సవ చిత్రాలలోకొన్ని

21-4-21 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ సీతారామ శాంతికల్యాణ మహోత్సవ చిత్రాలలోకొన్ని

https://photos.google.com/u/1/share/AF1QipNh9b6HxgNpZClnhqqLwhNzDpydN1mEg8mnIgom_HdV4xW7-k1HhP6OFmRomWSMWg/photo/AF1QipOpET2Sw4as98UmXJelZ8RpfdmkMsYDiorZi-ou

Posted in దేవాలయం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

671-నీతిమాల కర్త –విశ్వేశ్వర ఝా (1935)

వ్యాకరణ ఆచార్య విశ్వేశ్వర ఝా 1-2-1935న మధుబనిలో పుట్టి ,అక్కడి సంస్కృత మహా విద్యాలయం లో ప్రొఫెసర్ చేసి రిటైర్ అయ్యాడు .గురుపరంపర –పండిట్ దీనబంధు ఝా ,శ్రీ మధుసూదన మిశ్ర .ప్రత్యేక శిక్షణ   డా ఉమారమణ ఝా ,డా.విశ్వనాథ ఝాల వద్ద పొందాడు .నీతిమాల ,సుకనాశోపదేశం ,సంస్కార వివేచన ,స్వప్న వాసవ దత్తం రాశాడు .

672-సత్యబోధ విజయ కర్త –విఠలాచార్య శేషాచార్య సూను ఝుజర్వేద్(1931)

8-4-1931న కర్నాటక బిజాపూర్ లో బాగల్పేట్ లో పుట్టిన విఠలాచార్య శేషాచార్య సూను ఝుజర్వేద్ ప్రభుత్వ సంస్కృత విద్యాశాఖలో ఇన్స్పెక్టర్ .కేశవాచార్య శిష్యుడు .సత్యబోధ విజయం మాత్రమె రాశాడు .

673-అష్టాధ్యాయి భాష్య కర్త –బ్రహ్మదత్ జిజ్ఞాసు (1892-1972)

1892లో జలంధర్ లో పుట్టిన బ్రహ్మదత్ జిజ్ఞాసు -స్వామి పూర్ణానంద సరస్వతి ,దేవనారాయణ తివారి ,మ. మ.పండిట్ చిన్నస్వామి ల శిష్యుడు .అష్టాధ్యాయి భాష్యం ఒక్కటే రాశాడు .21-2-1964న 72వ ఏట చనిపోయాడు  .కాశీలో మోతీ జీల్ లో పాణిని కాలేజ్ స్థాపించాడు .రాష్ట్రపతి పురస్కార గ్రహీత .

674-జైనతత్వ వివేక కర్త –న్యాయ తీర్ధ జీవన్ ధార్(1974 న మరణం )

1974లో మరణించిన న్యాయతీర్ధ జీవన్ దార్ జైనతత్వ వివేకం మాత్రమె రాశాడు

675- ఆనంద మీమాంస కర్త -తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి(1901 )

ఆనంద మీమాంస ,జ్యోతి నిబంధ ,శుద్ధి సర్వస్వం ,మొదలైన 11పుస్తకాలు రాసిన తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి 27-1-1901న మహారాష్ట్ర లో పిమ్పల్నేర్ లో పుట్టాడు .గురుపరంపర –కె.రాజేశ్వర శాస్త్రి ద్రావిడ్ ,వామాచరణ్ భట్టాచార్య ,తర్కతీర్ధ సంస్కృత పండిట్ బిరుదాంకితుడు .1976లో పద్మభూషణ్ పొందాడు .ధర్మకోశ పత్రిక సంపాదకుడు .స్వాతంత్ర్య సమర యోధుడుకూడా .

676-బాలచంద్ర శాస్త్రి జోషి (1916)

నవ్యన్యాయ ,వేదాంత, మీమాంస ,వ్యాకరణ జ్యోతిష ,అలంకార ధర్మ శాస్త్ర ఆచార్యుడైన బాలచంద్ర శాస్త్రి జ్యోషి 15-6-1919న కర్ణాటకలో పుట్టి విలువైన 4 సంస్కృత గ్రంథాలు రాశాడు .ధార్వాడ జగద్గురు శంకరాచార్య సంస్కృత పాఠశాల ప్రిన్సిపాల్ .సాంప్రదాయ విద్యావిధానం లో విద్యనేర్చి ,నేర్పాడు .అనేకమంది పీఠాదిపతులు అనేక బిరుదులతో సత్కరించి సన్మానించారు .చాలామంది పీఠాదిపతులు ఈయన శిష్యులే .ప్రెసిడెంట్ అవార్డీ.

677-కర్ణభారం కర్త –హరేశ్ అరుణ్ భాయ్ జోషి (1963)

15-12-1963న గుజరాత్ లోని పోర్ బందర్ లో పుట్టిన హరేశ్ అరుణ్ భాయ్ జోషి వేదాంతం లో ఎం ఏ .నీతిశతకం ,కర్ణ భారం ,స్వప్న వాసవ దత్తం ,సంస్కృత సాహిత్య ఇతిహాసం ,వేదాంత దర్శనం అనే 5పుస్తకాలు రాశాడు .

678-ఉదయనాచార్య కృత న్యాయ కుసుమాంజలి కర్త –హేమ చంద్ర జోషి (1925)

1925జులై 31న యుపి అలహాబాద్ లో పుట్టిన హేమచంద్ర జోషి సాహిత్య, న్యాయ, మీమాంస ఆచార్య .గోరఖ్ పూర్ సంస్కృత విశ్వవిద్యాలయప్రొఫేసర్ .ఉదయనాచార్య కృత న్యాయ కుసుమాంజలి మాత్రమే రాశాడు .లక్నోలోని అఖిలభారత సంస్కృత పరిషత్ స్థాపకుడు .ప్రెసిడెంట్ అవార్డీ.

679-శ్రీ శని మహాత్మ్యం కర్త –జాజిరాం పురుషోత్తం జోషి (1924)

కావ్యతీర్ధ జాజిరాం పురుషోత్తం జోషి 9-4-1924 న మహారాష్ట్ర లో రైన్ మాడ్ లోని రోహాలో పుట్టాడు .సాహిత్య శిక్షా శాస్త్రికూడా .గడగిల శంకర శాస్త్రి ,శ్రీధర్ శాస్త్రి ,హరిహర్ ఝా ల శిష్యుడు .శ్రీ శని మహాత్మ్యం కావ్యం  తోపాటు  .ప్రాకృత కావ్యానువాదం రాశాడు .

680-భారతీయ సంస్కృతి కర్త –కేదార్ నారాయణ్ జోషి (1948)

సాహిత్యాచార్య ,వ్యాకరణ తీర్ధ కేదార్ నారాయణ్ జోషి 3-4-1948న మధ్యప్రదేశ్ లో కాన్నౌడ్ లోని  దేవాస్ లో పుట్టాడు .ఉజ్జైన్ విక్రం యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర –డా రేవా ప్రసాద్ ద్వివేది ,డా.రమ్ని హాల్ శర్మ ,డా లక్ష్మణ్ నారాయణ్ శుక్ల .ప్రత్యెక శిక్షణ డా రమేష్ చంద్ర శర్మ ,డా.రామధర్ మాలవ్యాల వద్ద పొందాడు. భారతీయ సంస్కృతీ,సంస్కృత కావ్యేషు వైదిక చిన్తనస్య ప్రభావః ,శ్రీపాద శాస్త్రి హసూరకార వ్యక్తీ ఏవం అభి వ్యక్తీ ,సంస్కృత కావ్యశాస్త్ర ఔర్ నిరాలా రాశాడు .ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్ అవార్డ్ ,బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాఅవార్డ్ ,వాగర్ధ సమ్మాన్, సమాజ్ రత్న సమ్మాన్ పొందిన మహా పండితుడు .

681-మరీచి భాష్యం కర్త –కేదార్ దత్ జోషి (1910)

1910లో అల్మోడా లో పుట్టిన కేదార్ దత్ జోషి ,కాశీ  సంస్కృతకాలేజి లెక్చరర్ .హరిదత్త జోషి ,పండిట్ బలదేవ్ పాఠక్  ల శిష్యుడు .గ్రహ గణితాధ్యాయః ,వాసనాభాష్య౦ ,మరీచి భాష్యం ,గ్రహలాఘవం ,ముహూర్త చింతామణి రాశాడు .

682- రహస్యమయి నాటకం కర్త –కేశవ రాం రావ్ జోషి (1928)

7-4-1928న మధ్యప్రదేశ్ చింద్వాడ జిల్లా రంగరి లో పుట్టిన కేశవ రాం రావ్ జోషి సాహిత్యాచార్య .అమ్బాదాస శాస్త్రి పాండేయ,శంకర శాస్త్రి ,పండిట్ హరి రాం శుక్లాల శిష్యుడు నీల కంఠ విజయ కావ్య౦ ,రహస్యమయి నాటకం రాశాడు .

683-ప్రాధమిక పాణినీయ వ్యాకరణ కర్త –మాధవ్ గణేష్ జోషి (1918)

ప్రాధమిక పాణినీయ వ్యాకరణం ను సంస్కృత ,ఇంగ్లిష్ ,కన్నడ ,మరాటీ భాషలలో రాసిన మాధవ్ గణేష్ జోషి 1918లో పుట్టాడు .కర్నాటక బెల్గాం లోని విద్యామందిర్ లో సంస్కృత టీచర్ .

684-వేదాంత నివేదనం కర్త –మహావీర్ ప్రసాద్ జోషి (1914-2002)

1914లో ఝుంఝును జిల్లా దండ్ లోడ్ లో పుట్టిన మహావీర్ ప్రసాద్ జోషి ఆయుర్వేద సాహిత్య ఆచార్య .రాజ్ ఘర్ సాహిత్య సమితి చైర్మన్ .భవానీదేవి హాస్పిటల్ సెక్రెటరి .రాసిన 22పుస్తకాలలో ప్రతాప చరితం ,ప్రార్ధనా పుష్పాంజలి ,వేదాంత నివేదనం ,పంచతంత్రం, రుద్రాసాధ్యాయి ,ఉన్నాయి 2002లో 88వ ఏట మరణించాడు .సంస్కృత రత్నాకర భారతి మాసపత్రికలలో ఎన్నో విలువైన వ్యాసాలూ రాశాడు .

685-మహారాష్ట్ర పండిత వైదికజ్ఞానం కర్త –మోరేశ్వర్ త్రయంబక శాస్త్రి జోషి (1924)

మోరేశ్వర్ త్రయంబక శాస్త్రి జోషి 1924లో మహారాష్ట్ర లో ఎలం బహాట్ లో పుట్టాడు .కావ్యరత్న ,స్మృతి తీర్ధ ,ధర్మ శాస్త్ర .వినాయక్ శాస్త్రి తిల్లు,అచ్యుత్ శాస్త్రి పద్వేల శిష్యుడు . మహారాష్ట్ర పండిత వైదికజ్ఞానం అనే ఒకే ఒక పుస్తకం రాశాడు .

686-కారక మీమాంస కర్త –మోతీలాల్ జోషి (1935)

దర్శన సాహిత్య వ్యాకరణ కావ్యతీర్ధ ఆచార్య మోతీలాల్ జోషి 1935లో రాజస్థాన్ జైపూర్ లోని సహారాపుర జిల్లా బడీ జోడి లో పుట్టాడు .జైపూర్ మహారాజ సంస్కృత కాలేజ్ ప్రిన్సిపాల్.ప్రభుత్వ సంస్కృత డిపార్ట్ మెంట్ డైరెక్టర్ .సిండికేట్ మెంబర్ .కారకమీమాంస ,ప్రబోధ చంద్రోదయ విమర్శ రాశాడు .జైపూర్ శాహిపురా బాగ్ లో టీచర్ ట్రెయినింగ్ కాలేజి స్థాపించాడు .

687-అధ్యాపక శిక్ష కర్త –ఆర్.ప్రహ్లాద జోషి (1971)

సైకాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ .శిక్షా ఆచార్య ,విద్యా వారిది .23-6-1971లో గుల్బర్గా లో పుట్టాడు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ ప్రొఫెసర్ .అధ్యాపక శిక్షమాత్రమే రాశాడు .

688-కరుణా కటాక్ష లహరి కర్త –రసిక్ బిహారీ జోషి (1929)

రాజస్థాన్ బైవార్ లో 1929లో పుట్టిన రసిక్ బిహారీ జోషి రాసిన 5పుస్తకాలలో మోహ భంగ ,కరుణా కటాక్ష లహరి ,సారస్వతం ,ప్రజ్ఞాపారిజాతం ,శ్రీ గోవర్ధన గౌరవం ఉన్నాయి .

689-రాధా సహస్ర నామ కర్త –రసిక్ విహారీ జోషి(20వ శతాబ్ది )

పుట్టిన తేదీ తెలీదుకాని హిందీ ఆనర్స్ ,శాస్త్రి ,డిలిట్.ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ ,ఇన్వేస్టి గేటర్,el కోలీజియో డి మెక్సికో .35పుస్తకాలు రాశాడు అందులో రాధా సహస్రనామం ,లక్ష్మీ నృసింహ సహస్రనామస్తోత్రం , ,ది యూని వర్సల్ ట్రూత్ ,ఫ్రెంచ్ గ్రామర్ లిటరేచర్ ,యోగ అండ్ మెడిటేషన్ . సంస్కృతకవి .,యుపి సంస్కృత అకాడెమి ,గౌరవ డాక్టరేట్, వెనిజుల అవార్డ్ ,దాల్మియా అవార్డ్ ,సాహిత్య అకాడెమి ,ఢిల్లీ సంస్కృత అకాడెమీ అవార్డ్ తోపాటు ప్రెసిడెంట్ అవార్డీ.హరిత రుషి అవార్డ్ పొందాడు .వార్సా ,బుడాపెస్ట్ ,జెకోస్లోవేకియా ,కంబోడియా ,కొలంబో,మెక్సికో  యూనివర్సిటీ లకు విజిటింగ్ ప్రొఫెసర్ .

690-చిచంద్రిక వ్యాఖ్యాన  కర్త –గోపాలాచార్య కహద్క ర్  (20వ శతాబ్ది )

మహారాష్ట్ర లో పుట్టి ,నీల కంఠ శాస్త్రి శిష్యుడైన గోపాలాచార్య కహద్కర్ ఒకే ఒక్క పుస్తకం సంస్కృతం లో రాశాడు . దుశక్ర దోద్ధాదిని రాసిన చిచంద్రికపై అనేక వ్యాసాలూ రాశాడు ‘

691-అపరాజిత మహాకావ్య కర్త –పూర్ణ చంద్ర శాస్త్రి కలవాటియా(1928)

10-10-1928 న ఒరిస్సాలో పుట్టిన పూర్ణ చంద్ర శాస్త్రి కలవాటియా ఆయుర్వేద ఆచార్య సాహిత్య రత్న .డాక్టర్. అపరాజిత మహాకావ్య౦ ఒక్కటే రాశాడు .

692-తంత్ర అధికారి నిర్ణయ కర్త –అశోక్ కుమార్ కాలియా (1944)

20-4-1944న యుపి బహ్రేచి లో పుట్టిన అశోక్ కుమార్ కాలియా లక్నో యూనివర్సిటి సంస్కృత రిటైర్డ్ ప్రొఫెసర్ .గురుపరంపర –శ్రీమద్ అభీన రంగనాథ్ శిష్యుడు .రాసిన 7పుస్తకాలలో తంత్ర అధికార నిర్ణయం ,లక్ష్మీ తంత్ర ,పంచారాత్ర పరిశీలన ,పురుషోత్తమ సంహిత ఉన్నాయి .అజస్ర సంస్కృత క్వార్టర్లి ఎడిటర్ .2009లో ప్రెసిడెంట్ అవార్డీ.

693-కోసూర శివమాత కర్త –బద్రినాథ్ కల్లా (1931)

3-3-1931 కాశ్మీర్ శ్రీనగర్ లో పుట్టిన బద్రినాథ్ కల్లా –శాస్త్రి .కాశ్మీర్ యూని వర్సిటి లో సంస్కృత డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ .సెంటర్ ఫర్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ లో ప్రొఫెసర్ .కోసూర శివమాత ,విటస్థ మహాత్మ్యం ,మానసాదర పాన అనే హిందీ పుస్తకం రాశాడు .రాష్ట్రీయ భాషా ప్రచార సమితి అవార్డ్ పొందాడు .

694-శ్లోకత్రయ వివరణ కర్త –వరగూర్ రామనాథ శాస్త్రి కళ్యాణ సుందర్ (1911)

సాహిత్య ,వేదాంత శిరోమణి వరగూర్ రామనాథ శాస్త్రి కళ్యాణ సుందర్,,తమిళనాడు తంజావూర్ లో పుట్టాడు .గురుపరంపర – మహా మహోపాధ్యాయ  యజ్ఞస్వామి ,కే.కృష్ణ శాస్త్రి ,వి వైద్యనాధ శాస్త్రి ల శిష్యుడు .వృత్తి మీమాంస ,శ్లోకత్రయ వివరణం రాశాడు ,సుందర రామాయణం ,సతీ విలాసం  వేంకటేశ శతకం ,భగ వనుధ్యాన చంపుకావ్యం ,విచార సారంగధర ,పతంజల మహాభాష్య౦,నీతి ప్రకాశిక ,హరిహరాద్వైత భూషణం పాణిని సూత్ర వ్యాఖ్య,కల్పతరు వ్యాఖ్య ,న్యాయ సిద్ధాంతామృతం  లను తన సంపాదకత్వం లో ముద్రించాడు .

695-వ్యాస సూక్త కర్త –కె.కమల్ (1938)

తెలంగాణా మహబూబ్ నగర్ లో 3-6-1938న పుట్టిన కె.కమల్ హైదరాబాద్ నిజాం కాలేజి సంస్కృత ప్రొఫెసర్ .తెలుగులో కాదంబరి కావ్య సుషమ,శాంతిపర్వ సూక్తులు ,సంస్కృతం లో వ్యాస సూక్తం రచనలు .

696-సంస్కార సాహిత్య ఐతిహాసిక కర్త –కమల్ రత్నం (1914)

1914అలహాబాద్ లో పుట్టిన కమల్ రత్నం ఢిల్లీ లోని రంజాస్ స్కూల్ ప్రిన్సిపాల్..గయా ప్రసాద్  దీక్షిత్ , కె.ఎ. సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు .సంస్కృత సాహిత్యేతిహాసిక –సంస్కృత పరిప్రేయే-కాళిదాస ,కాళిదాస జన్మ భూమి ,అన్వేషణ రాశాడు

697-ఉత్కీర్ణ లేఖా స్తబక వ్యాఖ్య సహిత కర్త –జియాలాల్ కంబోజ (1932)

హర్యానా కర్నాల్ లో 12-2-1932న పుట్టిన జియలాల్ కంబోజ  న్యు ఢిల్లీ హిందూ కాలేజి ప్రొఫెసర్ . ఉత్కీర్ణ లేఖా స్తబక వ్యాఖ్యసహిత అనే ఒకే పుస్తకం రాశాడు .

698-వాగ్భటకృత అష్టాంగహృదయస్య సాంస్కృతిక మధ్యయనం కర్త –వసంత కృష్ణ రావు కన్హే (1939)

1939 డిసెంబర్ 3న రాయపూర్ లో పుట్టిన వసంత కృష్ణ రావు కన్హే సాహిత్యాచార్య .సరస్వతి ప్రసాద్ చతుర్వేది ,డా హస్రూర్కర్ ,డా ఆర్ యెన్ శర్మ ,డా.రేవా ప్రసాద్ ద్వివేది ,పండిట్ రామానందన్ ఓఝా ,పండిట్ రాజేంద్ర చౌదరి ,కరపత్ర స్వామిల శిష్యుడు. వాగ్భటకృత అష్టాంగహృదయస్య సాంస్కృతిక మధ్యయనం మాత్రమె రాశాడు .

699-12పుస్తకాలు రాసిన దిలీప్ కుమార్ కంజీలాల్ (1933)

దిలీప్ కుమార్ కంజీలాల్ 1-8-1933న కలకత్తా లో పుట్టి ,పిహెచ్ డిచేసి ,ప్రభుత్వ సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .రవీంద్రభారతి విజిటింగ్ ప్రొఫెసర్ .కామన్ వెల్త్ యూని వర్సిటీలచే ఎంపిక చేయబడిన విజిటింగ్ ఫెలో .ఏన్శేంట్ అష్ట్రోనాట్ సోసైటీ లైఫ్ మెంబర్ . అమెరికా బోరి ,పూనా చెన్నై లను సందర్శించాడు. ప్రెసిడెంట్ అవార్డీ

700-అభినవ సంస్కృత కథ కర్త –నారాయణ శాస్త్రి కంకార్ (1930)

1930జులై 30న జైపూర్ లోపుట్టిన నారాయణ శాస్త్రి కంకార్ వ్యాకరణ సాంఖ్య యోగ దర్శన ఆచార్య .సాహిత్య రత్న ,ప్రభాకర్ .జైపూర్ మహారాజ సంస్కృత కాలేజి ప్రొఫెసర్ .ప్రభుత్వ ఆయుర్వేద కాలేజి సెక్రెటరి .నవల్ కిషోర్ కంకార్ శిష్యుడు .రాసిన 29పుస్తకాలలో అభినవ సంస్కృత  కథ,రచనాభ్యుదయ మహాకావ్యం ,అభినవ సంస్కృత సుభాషిత సప్తశతి,సంస్కార కథా కౌతుకం  ,వినాయక నామాభినందనం ఉన్నాయి .వ్యాకరణ కేసరి బిరుదాంకితుడు .మద్రాస్ ,రాజస్థాన్ ప్రభుత్వ సంస్కృత అకాడెమి పురస్కారాలు పొందాడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-4-21-ఉయ్యూరు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భద్రాద్రి లో శ్రీరామనవమి కల్యాణం రోజున శ్రీరాముడి పేరు మార్చి చెబుతున్నారు తెలుసా ?తెలిస్తే స్పందించండి

భద్రాద్రిలో శ్రీరామ నవమి నాడు కల్యాణం లో శ్రీరాముడి పేరు ఈమధ్యకాలం లో  మార్చి చెబుతున్నారని తెలుసా మీకు ?బ్రహ్మశ్రీ  అన్నదానం చిదంబర శాస్త్రి గారు లాంటి వారు దీనిపై మీడియాలో ఎంతోకాలంగా పోరాడుతున్నారు .ఫలితం కనిపించలేదు ఇవాల్టి ఆంధ్రజ్యోతి లో దీనికి సంబంధిన ఆర్టికల్ జత చేస్తున్నాను చదివి న్యాయం అనుకొంటే  స్పందించండి-దుర్గాప్రసాద్  

Posted in దేవాలయం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4     

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4     

651-అవాకదాహ చక్ర కర్త –సీతారాం ఝా (1890-1975)

1890లో బీహార్ దర్భంగా జిల్లా చౌగామాలో సతీష్ చంద్ర ఝా పుట్టాడు .జ్యోతిష ఆచార్య ,జ్యోతిష తీర్ధ .కాశీ సన్యాసి పాఠశాలలో సంస్కృత టీచర్ .67గ్రంథాలు రాశాడు. అందులో అవాకదాహ చక్రం ,ఆహిబాల చక్రం ,నీలకంఠవ్యాఖ్య ,బృహజ్జాతక టీకా ,ముహూర్త మార్తాండ టీకా ,మానసాగరీ టీకా ,బృహత్ పారాశర హోరా టీకా ఉన్నాయి .,15-6-1975న 85వ ఏట చనిపోయాడు .జ్యోతిష విద్వాన్  జ్యోతిష రత్నాకర బిరుదాంకితుడు .’’మిధిలా నగర సూర్యుడు ‘’గా ప్రఖ్యాతి పొందాడు .జ్యోతిష శాస్త్రం లో అపార ప్రజ్ఞావంతుడు .

652-కాత్యాయన శ్రౌత సూత్ర కర్త –శంభు కుమార్ ఝా (1970)

  యజుర్వేద ,ఋగ్వేద,ధర్మశాస్త్ర సాహిత్య ఆచార్య శంభుకుమార్ ఝా 25-5-1970 న మధుబనిలో పుట్టి ,జగద్గురు రామచంద్రాచార్య సంస్కృత యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా ఉన్నాడు .గురువు విశ్వేశ్వర ఝా .వైదిక దేవ వాదస్య  సమీక్షాత్మకం –అధ్యయనం ,కాత్యాయన శ్రౌత సూత్రం ,వైదిక సాహిత్యేతి హాసంరాశాడు .

653-రాగ తరంగిణి కర్త –శశి నాథ ఝా (1954)

సంస్కృతం లో 70పుస్తకాలు రాసిన శాశినాధ ఝా బీహార్ మధుబనిలో 15-2-1954లో పుట్టాడు . సంస్కృత డిలిట్.బీహార్ దర్భంగా యూని వర్సిటి ప్రొఫెసర్ .గురుపరంపర –పండిట్ కులానంద మిశ్ర ,పండిట్ తేజనాథ ఝా ,పండిట్ శ్యామసుందర ఝా ,పండిట్ ఖగేన్ద్రఝా,పండిట్ కామేశ్వర ఝా .డా.శంకర్ జి ఝా ,డా.పంచదేవ ఝా ,డా.సదానంద ఝా ,డా కమల్ ఠాకూర్ ల వద్ద ప్రత్యేక శిక్షణ పొందాడు .శుద్ధి కౌముది ,సమాస శక్తి ,రాగతరంగిణి ,దీపికా ,ఉపస్ర-అధాత్వర్ధసంగ్రహం ,బాలశిక్షా సోపానం మొదలైన 70పుస్తకాలు రాశాడు వ్యాకరణం లో అపార పా౦డిత్యమున్నవాడు ,గొప్పరచయిత ,సంపాదకుడు .

654-లక్షణావలి వ్యాఖ్య కర్త –శశినాథ ఝా (1963లో మరణం )

1963లో చనిపోయిన శాశినాథ ఝా బీహార్ లో పుట్టాడు .లక్షణావలి వ్యాఖ్య ,త్రితలా వచ్చేదకత్వ వధ ,ఖండసార రాశాడు .

655- బ్రాహ్మస్పు అసిద్ధాంతస్య సమీక్షాత్మమధ్యయనం కర్త –శివ కాంత ఝా (1956)

1956లో జనవరి 2న బీహార్ మధుబని జిల్లా బర్దహా లో పుట్టిన శివకాంత ఝా ,బీహార్ దర్భంగా లోని ఎస్ కే సింగ్ సంస్కృత విశ్వ విద్యాలయ జ్యోతిష ప్రొఫెసర్, హెడ్ .బ్రహ్మ గుప్తోక్తం వేధాయంత్రం , బ్రాహ్మస్పు అసిద్ధాంతస్య సమీక్షాత్మక మధ్యయనం ,అద్భుత సాగరః ,యోగయాత్ర రాశాడు .జ్యోతిష భాష్య శిరోమణి భాస్కర్ పురస్కారం 2003లో పొందాడు అనేక సంస్కృత విద్యా రిసెర్చ్ కమిటీలలో సభ్యుడు .

656-వ్యాకరణ తత్వాదర్శ కర్త –శివకాంత ఝా (1959)

10-4-1959న బీహార్ మధుబని జిల్లా గోనౌళి అన్దారా తాడి గ్రామం లో పుట్టిన శివకాంత ఝా నవ్యవ్యాకరణ ఆచార్యుడు .జైపూర్ సాస్కృత విద్యాలయ ప్రొఫెసర్ . వ్యాకరణ తత్వాదర్శపాణిని సూత్రార్ధ తత్వ కోశ ,స్ఫోటత్వమీమాంస వగైరా రాశాడు

657-పరమ లఘు కళ కర్త –శోభాకాంత జయదేవ ఝా (1922)

బీహార్ దర్భంగా లో 10-10-1922న పుట్టిన శోభాకాంత జయదేవ ఝా వ్యాకరణ.న్యాయ ఆ  వేదాంత తర్కఆచార్యుడు .మిధిల సంస్కృత శోధన సంస్థాన్ డైరెక్టర్ .పరమలఘు కళ అనే ఏకైక పుస్తకం రాశాడు .ప్రెసిడెంట్ అవార్డీ.

658-సుధాకర భాష్య కర్త –శ్రీమురళీధర ఝా (1869-1929)

  జ్యోతిష న్యాయ వ్యాకరణ సాహిత్య ఆచార్య శ్రీమురళీ ధర ఝా  1869లో మిదిలలోని శ్యాం సుధార్ లో పుట్టాడు .కాశీ  లో సంస్కృత లెక్చరర్ .గురుపరంపర –పండిట్ విద్యాఝా ,పండిట్ సుధాకర ద్వివేది ,పండిట్ మధుసూదన ఝా ..ప్రత్యేక శిక్షణ పండిట్ బాబువా మిశ్రా ,పండిట్ చంద్ర శేఖర ఝా ,పండిట్ గంగాధర మిశ్రా ,పండిట్ మురళీ ధర ఠాకూర్,పండిట్ సీతారాం ఝా లవద్ద పొందాడు .రాసిన 5పుస్తకాలలో సుధాకర భాష్యం ,సిద్ధాంత తత్వ వివేకం ,లీలావతి –బీజగణితం ,శివా స్వారోదయ టీకా,త్రికోణమితి,ఉన్నాయి .1929లో 60ఏళ్ళ వయసులో చనిపోయాడు .1922లో బ్రిటిష్ ప్రభుత్వం మహామహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేసి గౌరవించింది .

659-భారతీ ప్రవేశిక కర్త –సుభద్ర ఝా (1909)

1909జులై 9న మధుబని జిల్లా నగదః లో పుట్టిన సుభద్ర ఝా సాహిత్య ఆచార్య .మైధిలి పాట్నా యూని వర్సిటిలో రిటైర్డ్  ప్రొఫెసర్ .ది ఫార్మేషన్ ఆఫ్ మైధిలి లాంగ్వేజ్ ,దిసాంగ్స్ ఆఫ్ విద్యాపతి,భారతీ ప్రవేశిక రచనలు .సాహిత్య అకాడెమి అవార్డ్ పొందింది .

660-బాల నిబంధ కర్త –సుఖేశ్వర్ ఝా (1938)

4-5-1938బీహార్ మధుబనిలో పుట్టిన సుఖేశ్వర ఝా బీహార్ భాగల్పూర్ యూనివర్సిటిప్రొఫెసర్ .బాలనిబంధాః,నిబంధ సుధా ,పాణినీయంసిస్టం ఆఫ్  యాక్సేంట్ రాశాడు .

661-పురుష మేధ యజ్ఞస్య సమీక్షాత్మక౦ అధ్యయనం కర్త –సు౦దర్ నారాయణ ఝా (1972)

సుందర నారాయణ ఝా 1972ఏప్రిల్ 30న బీహార్ హనుమాన్ నగర్ లో పుట్టాడు  .ఢిల్లీ లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యా పీఠ ప్రొఫెసర్ . పురుష మేధ యజ్ఞస్య సమీక్షాత్మక౦అధ్యనం ,కటియేశి దీపకః ,అవ్యయ పురుష నిరూపణం రాశాడు .

662-వైయాకరణ సిద్దాన్తానాం తులనాత్మక అధ్యయనం కర్త –సురేంద్ర ఝా (1948)

వైయాకరణ సిద్దాన్తానాం తులనాత్మక అధ్యయనం రచించిన సురేంద్ర ఝా 20-6-1948న బీహార్ లో పుట్టాడు .లక్నోకా౦పస్ లోని RSKS ప్రిన్సిపాల్ .

663-కవీంద్ర గంగానంద కవితా తధా కర్తృత్వ కర్త –సూర్యనారాయణ ఝా (1946)

1946జులై 26న బీహార్ లో రత్నాపూర్ జిల్లా సహరస లో పుట్టాడు .ప్రొఫెసర్ . కవీంద్ర గంగానంద కవితా తధా కర్తృత్వ అనే ఒకేఒక పుస్తకం రాశాడు .

664-సంస్కృత –హిందీ కోశ నిర్మాత –తరణీష్ ఝా (1919)

సంస్కృత –హిందీ నిఘంటు నిర్మాణం చేసిన తరనీష్ ఝా 3-4-1919 బీహార్ లోని పంచి ఘటియా లో పుట్టిన వ్యాకరణ, వేదాంత ఆచార్య .నిరాశనకుమార్ ,సదానంద ఝా ,రవినాథ ఝా ల శిష్యుడు .

665-ముదిత మదాలస నాటకం ప్రచురించిన  –త్రిలోక నాథ ఝా (1934)

3-8-1934న బీహార్ మధుబనిలో సరిసాబ్ పాహి లో పుట్టిన త్రిలోక నాథ ఝా సంస్కృత డిపార్ట్ మెంట్ హెడ్ .గురుపరంపర –ఉమాకాన్తఝా,డా రామకరణ శర్మ ,డా.జయంత్ మిశ్రా ,డా .ఎస్ ఎస్ బెగాచి .గోకులనాథ ప్రణీతం ముదిత మదాలస నాటకం తన సంపాదకత్వం లో ప్రచురించాడు .

666-శృంగార సారిణి సమీక్ష కర్త –ఉదయకాంత ఝా (1939)

4-4-1939న బీహార్ మధుబని లోని చతౌని లో పుట్టిన ఉదయకాంత ఝా సాహిత్య హెడ్ .డా.కృష్ణానంద ఝా డా.ఖగేశ్వర ఝా ల శిష్యుడు .శృంగార సారిణి సమీక్ష ,విజయభూతి సమీక్ష రాశాడు .

667-న్యాయసార విచార కర్త –ఉమారమణ ఝా (1925)

న్యాయ  ఆచార్య ఉమారమణ ఝా18-7-1925న యుపి లో పుట్టి ,లక్నో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో సంస్కృత ప్రొఫెసర్ ,ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యాడు .విలువైన 30గ్రంథాలు రాశాడు .అందులో  న్యాయసార విచార,దశ పదార్ధ శాస్త్రం ,తర్కప్రవేశిక ,శ్రీ నెహ్రు చారు చర్చ ,వివేక సహస్రి  మొదలైనవి ఉన్నాయి .యుపి సంస్కృత సంస్థాన్ సభ్యుడు .విశ్వ సంస్కృత సమ్మేళనం లో పాల్గొన్నాడు .రేడియో లో చాలా రాసి ప్రసారం చేశాడు .శ్రీ శృంగేరి, శ్రీకంచి పీఠ పురస్కారాలు,రాష్ట్రపతి అవార్డ్  పొందాడు.

668-త్రిపథగా కావ్య కర్త  -వేదానంద ఝా (1924)

సాహిత్య రత్న ,ఆచార్య వేదానంద ఝా 15-8-1924న బీహార వర్గానియాలోని వసంత పూర్ లో పుట్టాడు .ఢిల్లీ లోని మోతీనాథ్ సంస్కృత మహావిద్యాలయ ప్రిన్సిపాల్ .జన్నీరాం వ్యాస్ ,భూప నారాయణ ఝా లశిష్యుడు . త్రిపథగా కావ్య౦ ఒక్కటే రాశాడు .

669-లోచన విమర్శ కర్త –విదానాథ్ ఝా (1929)

15-12-1929 నబీహార్ లో మిధిలలో పుట్టిన విదానాథ్ ఝా సంస్కృత హెడ్ .డా హజారీ ప్రసాద్ ద్వివేది ,ప్రొఫెసర్ మహావీర్ పాఠక్ ల శిష్యుడు .లోచన విమర్శ ఒక్కటే రాశాడు .

670-కావ్య శాస్త్రీయ సిద్ధాంతదార్శనిక తత్వ విమర్శ  కర్త –విద్యానంద్ ఝా (1951)

సాహిత్యాచార్య ,శిక్షా శాస్త్రి విద్యానంద ఝా 1951జులై 11న బీహార్ లోని బేగూ సరాయ్ లో పుట్టాడు .భోపాల్ కాంపస్ సంస్కృత ప్రొఫెసర్, హెడ్ .మండన మిశ్ర ,కవిరత్న అమీర్ చంద్ర శాస్త్రి ,డా .హర్షనాథ మిశ్రా ల శిష్యుడు .శ్రీమద్ యశోవిజయ ముని కృతయః కావ్యప్రకాశైకయః ద్వితీయ,తృతీయమాత్రోపాలభిదయః సమీక్షా ,కావ్యశాస్త్ర సిద్దాన్తానాం దార్శనిక తత్వ విమర్శ రాశాడు .మహా వక్తగా ,శిష్య మార్గదర్శిగా ప్రసిద్ధుడు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ ప్లవ 2021-22 ఉగాది వేడుకలలో వెలువడిన పుస్తకాలు

శ్రీ ప్లవ 2021-22 ఉగాది వేడుకలలో వెలువడిన పుస్తకాలు

వరుసపుస్తకం పేరువివరాలు
26వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీషసాహిత్య అకాడెమి ప్రచురించిన హైదరాబాద్ సంస్కృత అకాడేమి డైరెక్టర్ శ్రీ పి జి. లాల్యే ఇంగ్లీష్ లో రాసిన ‘’మల్లినాథ ‘ఆధారం  గా రాసినది  ’వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం  మల్లినాథ సూరి  మనీష ‘
27ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు42 మంది ఆధునిక విదేశ సంస్కృత  విద్వాంసుల జీవితం, రచనలు – వివిధ దేశాలలో సంస్కృత ప్రచారం
28Nuclear Physicist Dr. Ankunuri  Venkata Ramayyaఅణుశాస్త్రవేత్త డా ఆకునూరి వెంకటరామయ్య బుక్ లెట్ విశేషాలు  కు ఇంగ్లీష్ లో అనువాదం
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ప్రయాగ రంగదాసు,ఎడ్ల రామదాసు కీర్తనలు

The compositions of Prayaga Rangadasa, Mallekonda Ramadasu and Yedla Ramadasu struggle to remain in public memory.

“B ala Tripura Sundari, Gaikonuma Haarathi…, the strains of this captivating Telugu lyric sung sonorously by a group of children drift out of a small school in Perla village, Karnataka. Their teacher Prince Rama Varma, renowned Carnatic classical vocalist and musicologist, nods his head in approval while keeping rhythm.

This composition is by Prayaga Rangadasa, better known as the maternal grandfather of legendary musician and composer Mangalampalli Balamuralikrishna. Rangadasa is also credited with other little gems like Ramududhbhavinchinaadu (Chenchuruti), Rama Rama Yanarada (Sindhubhairavi), and endearing, alliterative, folksy compositions like Yeme O Chitti, etc.

Rama Varma has also taught these children Eeswaraagya Yemo Theliyadu (Sindhubhairavi) by Mallekonda Ramdasu, another Andhra Pradesh composer. He will soon teach them another Mallekonda piece–– Mayalokamu. Varma has also taught Petrai Saami Devuda by yet another lesser-known but talented composer Yedla Ramadasu. Yedla, whose tomb you can see in Rajahmundry, is also credited with Chaalu Chaalu (Saraswathi) and a beautiful mangalam in Anandabhairavi. (Most above available on youtube).

These three Telugu composers lived between late 19th and early 20th centuries. While Prayaga Rangadasa’s compositions have tunes also by him, those of Mallekonda and Yedla have been all superbly tuned by Balamuralikrishna.

All their compositions are noted for being simple, unembellished, engaging, soaked in bhakti-bhaava or devotional fervour; and with undeniable musical merit. “They belong to simple yet authentic classical music,” states Pappu Venugopal Rao, musicologist and dance scholar, author, and secretary of Madras Music Academy.

These compositions were learnt by Rama Varma from his guru and musical giant Balamuralikrishna who has them as part of his famously vast repertoire. Though these lyrics were part of bhajan-singing perhaps a century ago, they were largely forgotten over the years and sadly neglected by the music world. However, Balamurali, re-introduced them to music-lovers by rendering them in Bhakti Ranjani of All India Radio. Occasionally, he also sang them in his concerts.

It was a great contribution from Balamurali and elicited much appreciation at that time. However, the compositions did not receive their due either from music teachers, performers or rasikas/sabhas––the entities which preserve and propagate music traditions. And thus, gradually slipped into oblivion. The saving grace was that Balamurali, much later, taught them to his student Rama Varma who has been propagating them dedicatedly by rendering them occasionally and also teaching them to his own students who are, ironically, all outside Andhra Pradesh.

To Balamuralikrishna and his star-disciple Rama Varma goes the credit of keeping these compositions still alive. Says Varma, “I love the cadences of these lyrics and their lilting tunes. They are such a delight to sing. And they have an instant appeal––once people listen to them, they want to hear them again and again.” It is indeed a sad state of affairs that such appealing lyrics and even their composers’ names are now largely unheard-of in their own state. There is little documentation too. Why have such deserving compositions disappeared from musicians’ repertoires and music-teachers classes? Explaining possible reasons, Pappu Venugopal Rao says, “There are many composers in Telugu who have receded into oblivion and their songs are not being heard or not being sung. The main reason is they did not have a ‘Sishya Parampara’ that could propagate their music in other areas of the state.”

The compositions of Prayaga Rangadasa, Mallekonda Ramadasu and Yedla Ramadasu, have worthy musical qualities; and are meaningful, melodious and aesthetic. They are deserving of public platforms including concerts. They also merit documentation in written works and audio-records. Thus, a great deal of responsibility rests on musicians, teachers and sabhas/academies who should make efforts to propagate these lyrics.

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

శ్రీ ప్లవ ఉగాది శుభా కాంక్షలు 

శ్రీ ప్లవ ఉగాది శుభా కాంక్షలు 

https://photos.google.com/u/1/share/AF1QipNXy5Li75cvIfSKKSjCqQCAu3-4jfUQG7Nc85iH2BAPX7uhz66nr4Lyy1jAw3ghuA


1-సాహితీ బంధువులకు13-4-21మంగళవారం  శ్రీ ప్లవ ఉగాది శుభాకాంక్షలు 2-సరసభారతి శ్రీప్లవ ఉగాది వేడుకలను రద్దు చేసిన సంగతి మీకు తెలుసు .కానీ ఈ ఉగాదిరోజు న   మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి పాదాల వద్ద 1-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలంమల్లినాథ సూరి మనీష2-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు పుస్తకాలను ఉంచి స్వామి వారే ఆవిష్కరించినట్లు భావించాం .3-21-4-21బుధవారం శ్రీ రామనవమి కల్యాణం సందర్భం గా మన ఆలయం లో ఈ రెండు పుస్తకాలను భక్తులకు అందజేస్తాం .4-శ్రీరామనవమి తర్వాత సాహితీ బంధువులకు బుక్ పోస్ట్  ద్వారా పై రెండు పుస్తకాలు పంపిస్తాము 5-అవిష్కరించాల్సిన 3 వ పుస్తకం Nuclear Scientist Dr. Akunuri   Venkata Ramayya పుస్తకాలు 50 కట్ట ను శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు నాకు సుమారు నాలుగైదు నెలల క్రితమే పంపారు ఆకట్ట నుభద్రంగా దాచాను  .కాని పై రెండు పుస్తకాలు ప్రింట్ అయి వచ్చిన సందర్భంగా పుస్తకాలు సర్దాము .రామయ్యగారి పుస్తకాలకట్ట ఎక్కడ పెట్టామోగుర్తురాక,యెంత వెదికినా కనపడక పోయే సరికి పై రెండు పుస్తకాలే స్వామి పాదాల వద్ద ఉంచి ఆవిష్కరణ జరిపినట్లు భావించాం .అవి కనబడిన తర్వాత ఆవిష్కరించి అందరికి పంపుతాము .ఈ అసౌకర్యానికి మన్నించ మనవి -మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-21-ఉయ్యూరు   

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ ప్లవ ఉగాది ,శ్రీరామనవమి శుభాకాంక్షలు

1-సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,బంధు మిత్రులకు 13-4-21 మంగళవారం శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .21-4-21బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు .

2-ఉగాది రోజు సాయంత్రం 4 గంటలకు  సరసభారతి ఫేస్ బుక్ ద్వారా శ్రీ ప్లవ ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది .

3-20-4-21 మంగళవారం ఉదయం 10 గం.లకు సరసభారతి ఫేస్ బుక్ ద్వారా’’ శ్రీ శంకర విజయం ‘’64 వ చివరి భాగం ప్రత్యక్ష ప్రసారమౌతుంది .

4-21-4-21 బుధవారం శ్రీ రామనవమి నాడు సాయంత్రం 4 గం.లకు ‘’విశిష్ట యోగ వాసిష్టం ‘’ధారావాహిక ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమై ,22-4-21 గురువారం నుండి రోజూ ఉదయం 10 గం.ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది

   మీ గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-21-ఉయ్యూరు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్

సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్

సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్


బాల్యం ,విద్య:

1903 ఏప్రిల్ 3 న కర్ణాటక లోని మంగుళూరు లో కమలాదేవి జన్మించింది .తండ్రి అనంతయ్యధరేశ్వర్ మంగుళూరు జిల్లా కలెక్టర్ .తల్లి గిరిజా బాయ్ కర్ణాటక తీరప్రాంత ఛత్రపూర్ సారస్వత భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందింది .కమలకు తల్లి లక్షణాలు వారసత్వం గా లభించాయి .నాయనమ్మ పురాణ ఇతిహాసాలలో అసాధారణ పాండిత్యం కలది .తల్లి గిరిజా బాయ్ ఇంటి వద్దనే ట్యూటర్ల వద్ద విద్య నేర్చింది .తలిదండ్రుల విశిష్ట లక్షణాలు కమలాదేవిని తీర్చి దిద్దాయి .బాల్యం నుంచే అరుదైన ధైర్య సాహసాలు ,తెలివి తేటలు ప్రదర్శించి కమల మిగిలినవారి కన్నా భిన్నంగా ఉండేది .ఆనాటి దేశభక్తులైన మహా దేవ గోవింద రానడే ,గోపాలకృష్ణ గోఖలే ,రమా బాయ్ రానడే , అనీబిసెంట్ వంటి వారితో వీరి కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేది .అందుకే కమలా దేవికి యవ్వనం లోనే స్వదేశీ ఉద్యమం పై గొప్ప ఆసక్తి కలిగింది .కేరళలోని ప్రాచీన నాటక సంప్రదాయ౦ కుటియాట్ట౦ ను గురువు పద్మశ్రీ మణిమాధవ చాక్యార్ వద్ద ,గురుకులం తిరుక్కురు స్సిమంగళం లోనే ఉంటూ అభ్యసించింది. అత్యంత స్నేహితురాలుగా ఉండే పెద్దక్క సగుణ వివాహమైన కొద్దికాలానికే ,మరణించటం ,తండ్రి కూడా ఆమె ఏడవ ఏట నే చనిపోవటంతో, కమలాదేవి తట్టుకోలేక పోయింది . దీనికి తోడు అంతులేని తన ఆస్తికి వీలునామా రాయకుండానే తండ్రి చనిపోవటం తో ,యావదాస్తి ,బాబాయికొడుకుకు చట్టప్రకారం దక్కి, వీళ్ళకు నెలనెలా పించను మాత్రమె దక్కితే ,తల్లి గిరిజాదేవి, ఆ దయా ధర్మ భిక్షం తిరస్కరించి, స్వయంగా తన కట్నకానుకలతో కూతుళ్ళను పోషించాలని నిర్ణయించింది . చిన్నారి కమల భూస్వామ్య లక్షణాలను తిరస్కరిస్తూ ఇంట్లోని నౌకర్లు చాకర్లతో కలసి మెలసి మెలిగేది .ఇదే ఆమెను గొప్ప స్వాతంత్ర్య సమరయోధురాలిని చేసింది .

వివాహం వైధవ్యం:

కమలాదేవికి 14వ ఏట 1947లో వివాహం జరిగింది .కాని భర్త రెండేళ్లకే చనిపోవటం తో వైధవ్యం ప్రాప్తించింది .మద్రాస్ లో క్వీన్ మేరీస్ కాలేజిలో చేరి ,అక్కడ భారత కోకిల సరోజినీ నాయుడు చిన్న చెల్లెలు సుహాసిని చటోపాధ్యాయ తో పరిచయం కలిగి ,తన అన్నమహా మేధావి హరీంద్ర నాధ చటోపాధ్యాయకు కమలాదేవిని పరిచయం చేసింది.ఈ ఇద్దరూ కళారాధకులవటం వలన బాగా దగ్గరయ్యారు .కమల తన 20వఏట హరీన్ ను పెళ్ళాడింది .ఆనాటి సంఘం విధవా పునర్వివాహాన్ని అంగీకరించక అభ్యంతరం చెప్పింది. అయినా ధైర్యంగా పెళ్ళాడారు .నవ దంపతులకు ఏడాది తిరగాగానే రామ అనే కొడుకు పుట్టాడు

నటన:

.సంఘాన్ని యెదిర్చి కమలా హరీన్ దంపతులు కొత్త ఆలోచనలతో నాటకాలు,స్కిట్స్ రాసి ప్రదర్శించేవారు .అప్పటికి ఇంకా స్త్రీలు సినిమాలలో నటించటానికి భయపడేవారు .కాని కమల కొన్ని సినిమాలలోనూ నటించింది .1931లో శూద్రకమహాకవి రాసిన మృచ్చ కటిక మూకీ సినిమాలో లో వసంత సేనగా ,ఏనాక్షి రామారావు హీరో తో ప్రముఖ కన్నడ దర్శకుడు మోహన్ దయారాం భవాని దర్శకత్వం లో నటించింది .1943లో హిందీ సినిమా తాన్సేన్ లో ప్రముఖ గాయకుడు కె.ఎల్. సైగల్ ,ఖుర్షీద్ లతోనూ ,శంకర్ –పార్వతి లోనూ 1945 లో ధన్నా భగత్ మూకీ లలో కమలాదేవి చటోపాధ్యాయ నటించింది .చాలా ఏళ్ళ తర్వాత పరస్పర అంగీకారంతో భర్తనుంచి విడాకులు పొంది మళ్ళీ సంఘం లో సంచలనం రేపింది .

లండన్ జీవితం:

హరీన్ తో పెళ్లి అయిన కొద్దికాలానికే ,హరీన్ లండన్ వెడితే ,కొన్ని నెలలతర్వాత కమల కూడా వెళ్లి ,లండన్ యూని వర్సిటి లోని బెడ్ ఫోర్డ్ కాలేజిలో చేరి ,సోషియాలజీలో డిప్లమా పొందింది .

భారత స్వాతంత్ర్య సమరం:

లండన్ లో ఉండగానే 1923 లో మహాత్ముని సహాయ నిరాకరణ ఉద్యమం వార్త తెలిసి ,ఇండియాకు తిరిగి వచ్చేసి ,గాంధీజీ సేవాదళం లో చేరి మహిళాభ్యుదయానికి కృషి చేసింది .ఆమె సేవాదళం స్త్రీ విభాగానికి నాయకురాలైంది .దేశమంతటిలోని యువతులకు స్పూర్తి కలిగించి సేవాదళ సభ్యులుగా అంటే సేవికలు గా చేర్పించి గొప్ప శిక్షణనిచ్చి, తర్ఫీదు చేసింది .1926లో అఖిలభారత మహిళా సంఘ సంస్థాపకురాలు మార్గరెట్ కజిన్స్ ను కలిసి ,ఆమె ప్రోద్బలంతో మద్రాస్ ప్రాంతీయ శాసన సభకు శాసన సభ్యురాలిగా పోటీ చేసి, దేశంలోనే శాసనసభకు పోటీ చేసిన మొదటి మహిళ గా రికార్డ్ సృష్టించింది .కానీ 55వోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది .

అఖిలభారతీయ మహిళా సంఘం కార్యదర్శి:

AIWC అంటే అఖిలభారతీయ మహిళా సంఘానికి కమలాదేవి సంస్థాపక సభ్యురాలై,వెంటనే మొదటి కార్యనిర్వాహక కార్యదర్శి అయింది .ఆమె నాయకత్వం లో ఆ సంస్థ దేశ మంతటా శాఖోపశాఖలుగా విస్తరిల్లి అనేక అభ్యుదయ కార్యక్రమాలు చేబట్టి మహిళాచైతన్యం తెచ్చింది .శాసనసభ సంస్కణలకూ మార్గదర్శనం చేసింది .ఆమె పదవీకాలం లో అనేక యూరోపియన్ దేశాలు పర్యటించి అక్కడి మహిళాభ్యుదయ కార్యక్రమాలు అధ్యయనం చేసి ,ఇండియాలోకూడా అమలు చేయించి మహిళల చే నిర్వహింపబడే విద్యా సంస్థల స్థాపనకూ అంకురార్పణ చేసిన ముందుచూపు ఉన్న మార్గదర్శకురాలు కమలాదేవి .అంతే కాదు దేశం లోనే మొట్టమొదటి హోం సైన్స్ కాలేజీ గా న్యు ఢిల్లీ లో’’ లేడీఇర్విన్ కాలేజి’’స్థాపించింది .

ఉద్యమనాయకత్వం:

1930లో గాంధీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సంఘం లో ని ఏడుగురిలో కమలాదేవి కూడా ఒకరై ఉండటం మహిళలకు గర్వకారణం .బొంబాయి సముద్ర తీరం లో ఉప్పు తయారు చేసిన మొట్టమొదటి స్త్రీరత్నం కమలాదేవి చట్టోపాధ్యాయ. ఆమెకు సహాయం గా నిలిచిన మరో ధీరవనిత అవంతికా బాయ్ గోఖలే . 1940లో మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమైనప్పుడు కమలాదేవి లండన్ లో ఉంది .అక్కడ నుంచి ప్రపంచ దేశాల పర్యటన చేసి భారత దేశానికిస్వాతంత్ర్యం యెంత అవసరమో అందరికీ తెలియజేసి బాసటగా నిలిచింది .యుద్ధం ముగిశాక పోరాటం తీవ్రతరం చేసింది .

స్వాతంత్ర్యానంతర సేవలు:

భారత దేశంస్వాతంత్ర్యం సాధించినా దేశ౦ ఇండియా ,పాకిస్తాన్ గా విడిపోవటం ,శరణార్ధుల ను ఆదుకోవాల్సిన అవసరం కలిగి, కమల వెంటనే కార్య రంగం లో దిగి’’ఇండియన్ కోఆపరేటివ్ యూనియన్ ‘’స్థాపించి శరణార్ధులను పెద్ద ఎత్తున ఆదుకొన్నది .శరణార్ధుల ఆవాసానికి టౌన్షిప్ను కో ఆపరేటివ్ తోడ్పాటుతో ఏర్పాటు చేసింది .ఎట్టకేలకు ప్రధాని నెహ్రూ ఒప్పుకొని,ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరరాదనిమెలికలతో షరతు పెట్టాడు .ఎంతో శ్రమతో ఢిల్లీ బయట ఫరీదాబాద్ లో దేశ వాయవ్య సరిహద్దు నుంచి వచ్చిన 50వేలమంది శరణార్ధులకు ఆవాసం కల్పించిన ధీరోదాత్త మహిళ కమలా దేవి .అక్కడ వారికి ఇళ్ళుకట్టుకోవటానికి ఉద్యోగ , వృత్తులకు,ఆరోగ్యానికి క్షణం తీరికలేకుండా సహాయ పడి వెన్నంటి ఉంది .

కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం:

శరణార్ధుల పునరావాసం తోపాటు వారు పోగొట్టుకొన్న కుటీర ,చేతి వృత్తులకు ప్రోత్సాహం కలిగించి మళ్ళీ వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపి, భారతీయ కళలకు విశ్వ వ్యాప్త కీర్తి ప్రతిష్టల వ్యాప్తికి కారణమైంది .స్వాతంత్ర్యానంతర దేశ పురోగతిలో ఇదొక మైలురాయిగా నిలిచింది .

కళా సాంస్కృతిక రంగ సేవ:

భారతదేశ అభి వృద్ధికోసం ఉత్పత్తులను భారిగా పెంచటానికి ప్రధాని నెహ్రు యాంత్రీకరణ ప్రవేశ పెడుతుండటం కమలాదేవిని కలచి వేసి ,దానివలన భారతీయ కళా సాంస్కృతిక రంగాలకు సంప్రదాయ కటీర, చేతి వృత్తుల వారికీ ,అసంఘటిత వ్యవస్థలోని స్త్రీలకూ గొప్ప విఘాతం కలుగుతుందని గ్రహించింది.దీనికి విరుగుడుగా ప్రత్యామ్నాయం గా వరుసగా అనేక క్రాఫ్ట్ మ్యూజియం లు ,భారతీయ సంప్రదాయ కళ ,వృత్తులకుప్రాచీన భాండాగారాలు (ఆర్కైవ్స్ ) శిక్షణకు నిపుణుల ఏర్పాటు పెద్ద ఎత్తున నెలకొల్పింది .వీటితోపాటు ఢిల్లీ లో’’ థియేటర్ క్రాఫ్ట్స్ మ్యూజియం ‘’ఏర్పాటు చేసింది . హస్తకళాకారుల కు ప్రోత్సాహంగా జాతీయ పురస్కారాలు ఏర్పరచింది .దేశ వ్యాప్తంగా’’ సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం’’ లను స్థాపించింది .

నాట్య విద్యాలయ స్థాపన:

బెంగుళూరులో కమలాదేవి 1964లో’’ కథక్ నాట్య ,కోరియోగ్రఫీ’’సంస్థను భారతీయ నాట్య సంఘం కు ఆధ్వర్యం లో నెలకొల్పి ప్రసిద్ధ నాట్య శిరోమణి మాయారావు ను డైరెక్టర్ ను చేసింది .

కాలానికంటే ముందుగా ఆలోచించే నేర్పున్న చటోపాధ్యాయ ‘’ఆల్ ఇండియా హాండి క్రాఫ్ట్స్ బోర్డ్ ‘’ఏర్పరచి ,మొదటి చైర్మన్ గా అందరి ప్రోద్బలం తో ఎన్నికై సమర్ధంగా నిర్వహించింది .క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇండియా కు కూడా ఆమెయే మొదటి ప్రెసిడెంట్ . వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ,ఆసియా ఫసిఫిక్ రీజియన్ కు కూడా ఆమెయే మొదటి ప్రెసిడెంట్ .

సంగీత నాటక అకాడెమీ నిర్వహణ:

నేషనల్ స్కూల్ ఫర్ డ్రామా ను కూడా ఏర్పాటు చేసిన కమలాదేవి ,తర్వాత సంగీతనాటక అకాడెమి నిర్వహణ బాధ్యతలనూ సమర్ధవంతంగా నిర్వహించి,యునెస్కో సభ్యురాలైంది .ఎన్నో బృహత్తర ప్రణాకలు చేబట్టి నిర్వహించిన కమలాదేవి తన స్వీయ జీవిత చరిత్ర ‘’ఇన్నర్ రీసెస్ అండ్ ఔటర్ స్పేసెస్-మెమాయిర్ ‘’ను 1986లో రాసి ప్రచురించింది .

బిరుదు ,పురస్కారాలు:

కమలాదేవి చట్టోపాధ్యాయ సాంఘిక కళా సేవలను గుర్తించి , భారత ప్రభుత్వం 1955లో పద్మ భూషణ్ పురస్కారం అందిస్తే ,1966అంతర్జాతీయ రామన్ మాగ్ సెసే అవార్డ్ ,1974లో అత్యంత అరుదైన సంగీత నాటక అకాడెమి ఫెలోషిప్ ,1977లో హస్తకళలకు ఇచ్చిన ప్రోత్సాహానికి యునెస్కో అవార్డ్ ,1987లో పద్మ విభూషణ్ అనే అత్యుత్తమ పురస్కారాలు పొందింది .శాంతి నికేతన్ సంస్థ కమలాదేవి కి అత్యుత్తమ ‘’దేశికోత్తమ పురస్కారం ‘’అందించి గౌరవించింది .

మహా ప్రస్థానం:

ప్రజాజీవితం లో అత్యుత్తమ సేవలందించి మహిళాభ్యుదయానికి భారతీయ సంప్రదాయ కళలు హస్త కళల అభి వృద్ధికి నిరంతర సేవలందించిన పద్మ విభూషణ్ శ్రీమతి కమలాదేవి చట్టోపాధ్యాయ 85ఏళ్ళ వయసులో 29-10-1988 న పరమ పదించింది .

రచనాప్రస్థానం:

తన స్వీయ జీవిత చరిత్రతో పాటు అవేకెనింగ్ ఆఫ్ ఇండియన్ వుమెన్ ,,జపాన్ ఇట్స్ వీక్నెస్ అండ్ స్త్రెంగ్త్ ,ఇన్ వార్ టార్న్ చైనా ,ఇండియన్ . ఎంబ్రాయిడరి,హాండి క్రాఫ్ట్స్ ఇన్ ఇండియా ,ట్రడిషన్స్ ఆఫ్ ఇండియన్ ఫోక్ లోర్ డాన్స్ ,దిగ్లోరి ఆఫ్ ఇండియన్ హాండిక్రాఫ్ట్స్ ,టువర్డ్స్ ఎ నేషనల్ థియేటర్ ,ఇండియన్ వుమెన్స్ బాటిల్ ఫర్ ఫ్రీడం,,సోషలిజం అండ్ సొసైటీ వంటి 18పుస్తకాలు రాసింది .ఆమెపై ప్రసిద్ధ రచయితలు ఎనిమిదిమంది గొప్ప పుస్తకాలు రాశారు .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 
Telugu Wikipedia : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

Virus-free. www.avast.com


You received this message because you are subscribed to the Google Groups “సరసభారతి సాహితీ బంధు” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z-V7u-yz-Wycq9HoMnsqM4VDDeU7aOPgqch0oA0FR6VVg%40mail.gmail.com.

సమగ్ర సమాచారం.నమఃపూర్వకధన్యవాదాలు
3 ఏప్రి, 2021, శని 06:36కి, gabbita prasad <gabbita.prasad@gmail.com> ఇలా వ్రాసారు:
Show quoted text
Show quoted text

To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAP-rMRGXXzSxSCCUn8yzgnhM1sUBKigwT7c81zVDRRS%2BQttXuA%40mail.gmail.com.

← Back

Thank you for your response. ✨

Posted in రచనలు | Tagged | Leave a comment

డా.కట్టా నరసింహులు గారి తత్వ బోధ ,మరియు సాహితీ బంధువుల సానుభూతి కవితలు

– 

కేంద్ర సాహిత్య అకాడెమి కార్య దర్శి శ్రీ కే.శ్రీనివాసరావు పంపిన సానుభూతి సందేశం

1.: తండ్రి కంటె ముందు తనయుడు వెడలుట
తండ్రికెంత బాధ ధరణి మీద
ఈశ్వరుండు చేయు ఈ వింత ఆటను
 తెలిసినట్టి తండ్రి కలతగనడు.
l ఈశ్వరుని తలంపు నెరిగిన ఆ తండ్రి
గుండె దిటవు చేసికొనునుగాదె..   డా.కట్టా నరసింహులు గారు -తిరుపతి2-హస్తవాసి తోడ హరియించు రోగముల్

హస్తమంద జేసీ ఆదు కొనుచు

అలరించి నావు అందరివాడవై

అంద కుండ పోయె అంత లోనె శ్రీ .దండిభట్ల దత్తాత్రేయ శర్మ -విజయవాడ 3-: స్వార్ధభావములేని సాధుశీలియితండు
దుర్మార్గభావనాదూరుడితడు
వంచనచేయుటావంతనెరుంగడు
స్నేహభావముజూపుచెలిమికాడు
సిరిసంపదలు కోరిచిందులువేయడు
చెలిమినికలిమిగాచింతచేయు
మంచివైధ్యుడనుచుమన్నించప్రజలెల్ల
ఎంచినమార్గానమించెనితడు

తేగీ
ఘనుడుగబ్బిటవంశపుఘనతపెంచెపెన్నిదయ్యనుఈతడుపేదవార్కి
తల్లితండ్రియుబంధులుతల్లడిల్ల
వెన్నెల ంటికీర్తినిగొనివెడలెదివికి
కం
దాతగనెంచిరిసురలే
త్రతగతామెంచిపిలిచెతత్పరుడనుచున
నేతగనుంచగదివికే
మాతాపితరులుసతికినిమాననిబాధే
: మధురకవి  ముదిగొండసీతారామమ్మ4-సీ…చిన్నతనమునుండిచింతలకెదురేగు
               ధృత్యున్నతోత్సాహధీరుడతడు
దూరంబుగానున్నతీరులోదగ్గర
          పిల్లలన్ పెంచిన పెద్ద యతడు
చరవాణిలోపరిష్కారముతెల్పుచు
       వ్యాధులన్ తగ్గించువైద్యుడతడు
పిల్లలలందరిన్  భేదమ్ముచూపక
      ప్రేమను పంచెడు ప్రేమమూర్తి
 ఆ.వె.కన్నవారినెపుడుకంటికిరెప్పలా
  చూచిసేవనజేయుసుతుడతడు
అట్టిఘనుడునేడుఆస్వర్గమునుజేరె
వారికిత్తుఘననివాళులిపుడు
 …శ్రీ పంతుల వెంకటేశ్వరరావు ( తపస్వీ)విజయవాడ  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-21-ఉయ్యూరు 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘మూర్తి’మత్వం

చిన్నప్పటి నుండి సమస్య లకు ఎదురువెళ్ళే తత్వం.

ఒంటరిగా పోరాడే మనస్తత్వం.

తను దూరంగా పిల్లలు అందరికీ దగ్గరగా పెంచిన విశిష్ట లక్షణం.

ఫోన్ లోనే ఆరోగ్య పరిష్కారం.

హస్తవాసి తో గ్రామ గ్రామాన ధన్వంతరి గా వచ్చిన పేరు.

ఏమి ఆశించకుండా వైద్యం.

23 జిల్లాల లో ఆర్ఎంపీ సంఘం కి చేసిన సేవలు.

రాజకీయ నేతల కు  సైతం మనసుకు దగ్గరగా   పని చేసే చతురత.

అందరి పిల్లలని ఒకే విధంగా చూసే నైజం.

తల్లిదండ్రుల ఆరోగ్యం కంటికి రెప్పలాగ కాపాడిన వైనం.

తన గమ్యానికి  పథక రచన  ధైర్యం. ….

ఒక్కటేమిటి  ఎన్నో. ఎన్నో..

చివరకు  ‘ మంచి ‘ అంతా ‘నీళ్ళ ‘  లాగా  మారి పోయి ఎందరికో. దాహం తీర్చి. .

కానీ. ఒక్కటే అప్పుడు ఫోటోలలో లేడు ఇక ఇప్పుడు కనబదడు.

–నీ అన్నలు ..అక్కలు.  తమ్ములు. చెల్లెళ్ళు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

విశిష్ట యోగ వాసిష్టం” ప్రత్యక్షప్రసారం

విశిష్ట యోగ వాసిష్టం” ప్రత్యక్షప్రసారం

సాహితీ బంధువులకు శుభ కామనలు .ఎల్లుండి మార్చి   23 మంగళవారం  64వచివరి భాగంతో సరసభారతి ఫేస్ బుక్  ద్వారా  అందిస్తున్న  శ్రీ  శంకర విజయం ప్రత్యక్ష ప్రసారం పూర్తవుతుంది .పూర్వం ప్రకటించినట్లు వెంటనే నారదుడు వగైరా ప్రసారం చేయటం వాయిదా వేశాం .

    కానీ , మార్చి 24 ఫాల్గుణ శుద్ధ ఏకాదశి బుధవారం ఉదయం 10గం. నుంచి వాల్మీకి మహర్షి రచించిన అద్భుత ఆధ్యాత్మిక బృహద్గ్రంథ౦  32వేల శ్లోకాల” యోగ వాసిస్టం” ను సంక్షిప్త పరచి ”విశిష్ట యోగ వాసిస్టం”గా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-3-21-ఉయ్యూరు 

Posted in సమీక్ష | Leave a comment

కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రం

కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రంస్వర్ణోత్సవాల ఆహ్వాన పత్రిక (6)

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకల ఆహ్వాన పత్రిక

సరసభారతి వేడుకల ఆహ్వాన పత్రిక

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

631-తత్వ ప్రకాశిక టీకా కర్త –కృష్ణ మాధవ ఝా (1898-1996)

1898లో బీహార్ లో జన్మించి 98 ఏళ్ళ సార్ధక జీవితాన్ని గడిపి 1996లో చనిపోయిన కృష్ణమాధవ ఝా పరమ లఘు మంజూష కు తత్వ ప్రకాశిక టీకా అనే ఒకే ఒక గ్రంథం రాశాడు

632-సిద్ధాంత లక్షణ బోధిని కర్త –కృష్ణ మాధవ ఝా (1899-1985)

బీహార్ మధుబని జిల్లా సరిసాబ్ పాహి తాలూకా బిట్టో గ్రామ౦  లో కృష్ణమాధవ ఝా 1899లో జన్మించి 1985లో మరణించాడు .సిద్ధాంత లక్షణ బోధిని అనే ఏకైక గ్రంథం రాశాడు .

633-కాత్యాయన శ్రౌత సూత్ర కర్త –లక్ష్మీశ్వర్ ఝా (1948)

శుక్ల యుజుర్వేద ఆచార్యుడు లక్ష్మీశ్వర ఝా బీహార్ సహస్రా జిల్లా బాఘ్వాలో 5-6-1948 న పుట్టి  ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి కేంద్రీయ సంస్కృత విద్యా పీఠ లో ప్రొఫెసర్ చేశాడు మూడు గ్రంధథాలు రాశాడు. అందులో కాత్యాయన శ్రౌత సూత్ర, వేదాంత సిద్ధాంత ముక్తావళి ,వైదికవాజ్మయ ఇతిహాస ,గౌడపాద కారికా కా సమీక్షాత్మక్ అధ్యయన ఉన్నాయి .గురువులు శీలకా౦త ఝా ,శివదాస మిశ్రా .

634-జాతి బాధక పరిష్కార కర్త –లోక నాథ ఝా (20వ శతాబ్ది )

బీహార్ లో పుట్టిన లోకనాథ ఝా మహామహోపాధ్యాయ .ఉభయ భావ దివాకర పరిష్కార ,జాతి బాధాక పరిష్కార రాశాడు .

635-రసగంగాధర వ్యాఖ్య కర్త –మదన మోహన ఝా (1922)

జగన్నాథ పండిత రాయలు రాసిన రస గంగాధర అలంకార శాస్త్రానికి సంస్కృతం హిందీలో వ్యాఖ్యానం రాసిన మదనమోహన ఝా 1922లో డిసెంబర్ 2 న మధుబనిలోని నవనిలో  పుట్టాడు .సాంప్రదాయ విద్య నేర్చాడు .పాట్నాప్రభుత్వ  సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్.యదుపతి మిశ్రా, ఈశ్వర నాథ ఝా ల శిష్యుడు .వ్యాకరణ సాహిత్య శాస్త్రాలలో నిష్ణాతుడు .

636-వైదిక దర్శన విమర్శ కర్త –మోహానంద ఝా (1972)

15-8-1972 న బీహార్ సమస్తిపూర్ లో పుట్టిన మోహానంద ఝా సంస్కృత పిహెడి.రాసిన 4 గ్రంథాలలో వైదిక దర్శన విమర్శ,తర్క సంగ్రహ సర్వస్వం ,న్యాయ సిద్ధాంత ముక్తావళి ఉన్నాయి .

637-సపర్యాస్టకం కర్త –మహేష్ ఝా (1946)

నవ్యన్యాయ ఆచార్య మహేష్ ఝా 4-2-1946న మధుబనిలో పుట్టాడు .గురుపరంపర –పండిట్ మురళీధర్ ఝా ,బెచేన్ ఝా ,డా.అయోధ్యాప్రసాద్ సిన్హా .చండికా శతకం ,ఆర్యాశతకం ,సపర్యాష్టకం రాశాడు

638-భూ పరిక్రమణ౦ కర్త –మునీశ్వర్ ఝా (1928)

1928 నవంబర్ నాలుగున  బీహార్ కరామౌలి లో పుట్టిన మునీశ్వర్ ఝా సంస్కృత ,హిందీ డిలిట్.12పుస్తకాలు రాశాడు.అందులో భూ పరిక్రమణ౦, వేదం వాగ్వివృత్తి,ఉన్నాయి ప్రెసిడెంట్ అవార్డీ.

639-  విద్యాపతి వాజ్మయ కర్త -మునీశ్వర్ ఝా (1928)

1928నవంబర్ 4న మధుబని లో పుట్టిన మునీశ్వర్ ఝా సాహిత్య ఆచార్య ,మహామహోపాధ్యాయ, విద్యా వాచస్పతి .వైస్ చాన్సలర్ .రాసిన 10పుస్తకాలలో విద్యాపతి వాజ్మయ ,కావ్య ఔర్ భాషా వున్నాయి .ఫ్రాన్స్ జర్మని ట్రినిడాడ్ వెస్ట్ ఇండీస్ సందర్శనచేశాడు .

640-సంస్కార దశ కర్మ పధ్ధతి టీకా కర్త-పరమేశ్వర్ ఝా (1853-1924)

పరమేశ్వర్ ఝా 1853లో దర్భంగా జిల్లా తరువని లోపుట్టి ,వ్యాకరణ ధర్మశాస్త్ర మీమాంస సాంఖ్య వేదాంత ఆచార్య .దర్భాన్గాలోని రామేశ్వర లతా సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు .ఈయన గురు పరంపర లో చిరంజీవి మిశ్రా ,పండిట్ రాజారాం శాస్త్రి ,పండిట్ బాల శాస్త్రి ,పండిట్ తారా చరణ్ భట్టాచార్య ,పండిట్ విశ్వనాథ ఝా ఉన్నారు .ప్రత్యెక శిక్షణ పండిట్ మార్కండేయ మిశ్రా ,పండిట్ త్రిలోక నాథ ,శివానంద ఠాకూర్ ల వద్ద పొందాడు .రాసిన 13గ్రంథాలలో సంస్కార దశ కర్మ పధ్ధతి టీకా ,ఛాందోగ్య వృషోత్సర్గ ,సదాచార దర్పణ ,పరమేశ్వర కోశ ,మిధిలేశ ప్రశస్తి ఉన్నాయి .1924లో 71వ ఏట మరణించాడు .భారత ప్రభుత్వం మహామహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరించింది .వైయాకరణ కేసరి ను భారతార్ధం మహా మండల ప్రదానం చేసింది .

641-ఋతు దర్శన కర్త –పరమేశ్వర ఝా (1856)

1856లో బీహార్ తర్రోనిలో పుట్టిన పరమేశ్వర ఝా 30ఉద్గ్రంథాలు రాసిన సంఖ్య ధర్మ శాస్త్ర వేదాంత వ్యాకరణ ఆచార్య .మిదిలాతత్వ విమర్శ ,రుతుదర్శనం ,యక్ష సమాగమ ,పరమేశ్వర కోశ నిఘంటు ,మొదలైనవి రాశాడు .వైయ్యాకరణ కేసరి బిరుదాంకితుడు .

642-నేపాల సామ్రాజ్యోదయం కర్త –పశుపతి ఝా (1930)

27-4-1930 న పశుపతి ఝా నేపాల్ లో సాధు లో పుట్టాడు .నవ్య వ్యాకరణ ,సాహిత్య ఆచార్య .ప్రొఫెసర్ .గురుపరంపరలో బాలబోధ మిశ్రా ,జీవననాద్ ఝా ఉన్నారు .నేపాల సామ్రాజ్యోదయం రాశాడు .

643-గ్రహార్ఖ దర్శన కర్త –ప్రేమ కాంత్ ఝా (1957)

1957జులై 1న మధుబనిలో ప్రేమ కాంత్ ఝా పుట్టి ,INM  సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ చేశాడు గ్రహార్ఖ దర్శన అనే ఏకైక రచన చేశాడు .

644-యోగ రత్నాకర కర్త – రాం కిషోర్  ఝా(1959)

బీహార్ ముఝపర పూర్ లో 5-11-1959న పుట్టిన రాం కిషోర్ ఝా పిహెచ్ డి .రాసిన 4పుస్తకాలలో యోగ రత్నాకర ,విఖ్యాత వ్యాజ్యం ,చండికా చరిత చంద్రిక ఉన్నాయి .

645-లఘు కౌముది వ్యాఖ్య కర్త –రామ చంద్ర ఝా (1951)

సంస్కృత హిందీలలో 21పుస్తకాలురాసిన రామచంద్ర ఝా 1951న జనవరి 19న దర్భా౦గా లో పుట్టి ,  గణిత, ఫలిత జోశ్య ,ధర్మ శాస్త్ర ఆచార్య .KSDసంస్కృత విశ్వవిద్యాలయ జ్యోతిష్ హెడ్ .సిద్ధాంత కౌముది లఘు కౌముది మధ్య కౌముది లకు సంస్కృత హిందీ వ్యాఖ్యానాలు రాశాడు

646-శివ తత్వ విమర్శ కర్త –రామేశ్వర్ ఝా (1905-1981)

1905లో సమస్తిపూర్ జిల్లా పాటసగ్రాం లో పుట్టిన రామేశ్వర్ ఝా 76 వ ఏట 12-12-1981న మరణించాడు .ఈయన గురువులు రామదత్త మిశ్రా ,రాదా కాంత్ ఝా సదానంద ఝాఉగ్రానంద ఝా , ,పండిట్ బాలకృష్ణ .పురాణతా ప్రత్యభిజ్ఞా,శివ తత్వ విమర్శ రాశాడు .మహామహోపాధ్యాయ బిరుదు ,ప్రెసిడెంట్ సర్టి ఫికేట్ పొందాడు .

647-ముగ్ధా శతకకర్త –రాం కిషోర్ విభాకర్ ఝా (20వ శతాబ్ది )

ముగ్ధాశతకం ,విభాకర వైభవం రాసిన రాం కిషోర్ విభాకర్ ఝా 20వ శతాబ్ది కవి .బీహార్ దర్భా౦గ లో పుట్టాడు .సంస్కృత హిందీ మైధిలి భాషలలో ఎం ఏ .పిహెచ్ డి.దేవఘర్ మహావిద్యాలయ సంస్కృత ప్రొఫెసర్ .

648-మాలవీయ ప్రశస్తి కర్త –రతి నాథఝా (1922)

1922లో బస్ట్ లో పుట్టిన రతి నాథ ఝా వారణాసి లో  సంస్కృత ప్రొఫెసర్.మహావీరాభ్యుదయం గాంధీ శతకం ,మాలవీయ ప్రశస్తి ,అరవింద శతకం ,మహావీరాభ్యుదయ మహాకావ్యం ,వాణీ విలాసం రాశాడు .

649-ఉషతి గోమతి కర్త –సర్వ నారాయణ ఝా (1962)

గణిత ,ఫలిత జోశ్య ఆచార్య సర్వనారాయణ ఝా డిలిట్ 5-6-1962న బీహార్ సహరసా లో పుట్టాడు .లక్నో ssలో సంస్కృత ప్రొఫెసర్ .మేఘమాల ,వైష్ణవి ,ఉషతి గోమతి రాశాడు .

650-సురత చరిత మహాకావ్యపరిశీలన  కర్త –సతీష్ చంద్ర ఝా (1947)

10-5-1947 మధుబని చమపూర లో పుట్టిన సతీష్ చంద్ర ఝా డిలిట్.BRA బీహార్ యూనివర్సిటి  సంస్కృత ప్రొఫసర్, హెడ్ .సురత చరిత మహాకావ్యపరిశీలనం ,కాత్యాయన వార్తికానాం ,భాషా శాస్త్రీయ అధ్యయనం రాశాడు .

   సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4      621-శివ ధర్మ మహా శాస్త్రం కర్త –ధనీంద్ర కుమార్ ఝా (1963)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

621-శివ ధర్మ మహా శాస్త్రం కర్త –ధనీంద్ర కుమార్ ఝా (1963)

ఆచార్య ,విద్యా వారిది ధనీంద్ర కుమార్ ఝా 1963 లో జూన్ 11న ముజఫర్పూర్ లో జన్మించాడు .లక్నో RSKS లో సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర లో ఆచార్య పారస్ నాథ ద్వివేది ,ఆచార్య రమ్యతన శుక్ల ,పండిట్ రాం ప్రసాద్ త్రిపాఠీ ,పండిట్ రఘునాథ శర్మ ఉన్నారు .డా నరేంద్రకుమార్ ,డా ధనుంజయ శుక్లా వద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .శివ ధర్మ మహా శాస్త్రం ,పరాశర సంహిత రాశాడు

622-జ్యోతిర్విజ్ఞానస్య ప్రాసంగికత కర్త –దిలీప్ కుమార్ ఝా (1966)

ధర్మ శాస్త్ర ఘంటా ,ఫలిత జోశ్య  సాహితి ఆచార్య దిలీప్ కుమార్ ఝా 26-10-1966న దర్భంగా లో పుట్టి ,దర్భంగా KSDSయూనివర్సిటి ప్రొఫెసర్ చేశాడు .లక్ష్మీ నాథ ఝా ,బ్రజ కిషోర్ ఝా ,ప్రొఫెసర్ శివ కుమార్ ఝా ప్రొఫెసర్ రామ చంద్ర ఝాల శిష్యుడు .కార్తీక్ కుమార్ ,బ్రిజేష్ కుమార్ ఝా ,గోవింద ఝా లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు . జ్యోతిర్విజ్ఞానస్య ప్రాసంగికత రాశాడు .

623-ఖద్యోత టీకా కర్త –గంగా నాద ఝా (1871-1941)

అలహాబాద్ యూని వర్సిటి వైస్ చాన్సలర్ గంగానాథ ఝా 1871లో పుట్టి 1941లో చనిపోయాడు. ఖద్యోత టీకా ,మండన మిశ్రుని  రచనకు మీమంసాను క్రమణిక రాశాడు .సంస్కృత ఆంగ్లా లలో  విశేష ఖ్యాతి పొందాడు .

624-మైధిలీ భాషా వికాస కర్త –గోవింద ఝా (1923)

వ్యాకరణ ,సాహిత్య ఆచార్యుడు 49గ్రంథాల రచయిత గోవింద ఝా 1923లో అక్టోబర్ 10 న మధుబని లో పుట్టాడు. బీహార్ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్.గురు దీనబంధు ఝా శిష్యుడు .మిధిలా –ఇంగ్లిష్ నిఘంటువు కల్యాణికోశ ,మైధిలి భాషా కా వికాస్ మొదలైనవి రచించాడు సాహిత్య అకాడెమీ అవార్డ్ ,కామిల్ బుల్కా  అవార్డ్  గ్రహీత. ఈయన పై డాక్యుమెంటరి తీశారు.

625-జ్యోతిస్సౌరభం  కర్త –హన్స ధర ఝా (1963)

గణిత ,ఫలిత జోస్యధర్మ శాస్త్ర ,పురాణ ఆచార్య హన్స ధర ఝా 5-10-1963న బీహార్ మధుబని లో పుట్టాడు .భోపాల్ సంస్కృత సంస్థాన్ సంస్కృత ప్రొఫెసర్ .గురుపరంపర –శ్రీ యదు వీరఝా ,పండిట్ శ్రీరామావతార్ మిశ్రా ,ప్రొఫెసర్ రామ చంద్ర ఝా ,ప్రొఫెసర్ శివకాంత్ ఝా ,ప్రొఫెసర్ రాధా కాంత ఠాకూర్,లు. ప్రత్యెక శిక్షణ ను విద్యానాథ మిశ్రా ,డా.రాం కుమార్ కౌల్ ,డా.సుమన్ కుమార్ ,డా అద్వేష్ కుమార్ శ్రోత్రియ లవద్ద పొందాడు .జ్యోతిస్సౌరభం ,గోల పరిభాష ,త్రిస్కంద జ్యోతిషం రాశాడు . ధర్మ శాస్త్రం, పురాణాలలో  లో మహా విద్వాంసుడు .

626-జ్ఞాన సంహిత కర్త –హరేంద్ర కిషోర్ ఝా (1956)

1-5-1956 న హర్పూర్కల లో పుట్టిన హరేంద్ర కిషోర్ ఝా ఎం.ఏ.పిహెచ్ డి.BS రాం సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు జ్ఞాన సంహిత ఒకే ఒక పుస్తకం రాశాడు .

627-సంవిత్స్వ తంత్ర కర్త –కమలేశ్ ఝా (1960)

శంకర వేదాంత, శైవ ఆగమ ,నవ్య న్యాయ ,జైన దర్శన ఆచార్య కమలేశ్ ఝా 4-6-1960న బీహార్ సమస్తిపూర్ లో పుట్టాడు .బెనారస్ హిందూ యూనివర్సిటి లో ధర్మాగమ ప్రొఫెసర్ .7గ్రంథాలు రాశాడు .వీటిలో సంవిత్స్వ తంత్ర,శైవ తత్వ విమర్శ ,ఆగమ సంవిద , పూర్ణతా ప్రత్యాభిజ్న ఉన్నాయి .స్కాట్ లాండ్ సందర్శించాడు

628-ధర్మస్య మూలం అర్ధ కర్త –ఖగేష్ ఝా (1942)

1942 జనవరి 2న మధుబనిలో పుట్టిన ఖగేష్ ఝా ,వైశాలి RPSకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .రమేష్ ఝా ,రామానంద ఝా ,పండిట్ రాం దేవ్ ఝా ,పండిట్ ఉదయకాంత్ ఝా ,పండిట్ మహేష్ ఝా ల శిష్యుడు .పండిట్ ఆత్మానంద శర్మ ,పండిట్ ప్రమణానంద ఝా,పండిట్ రాజెంద్ర ఝా  ,పండిట్ భగలుఝా లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .రాసిన 4పుస్తకాలలో –ధర్మస్య మూలం అర్ధ ,సురభారతి ,ప్రబంధావళి ఉన్నాయి .

629-గూడార్ధ  తత్వాలోక కర్త –కీర్త్యానంద ఝా (1934)

కీర్త్యానంద ఝా 1934బీహార్ దర్భా౦గా జిల్లా జరిసో లో పుట్టాడు .అసిస్టెంట్ ప్రొఫెసర్ గురుపరంపర –పండిట్ అచ్యుతానంద ఝా ,,పండిట్ హరి రాం శుక్లా ఉన్నారు. గూడార్ధ  తత్వాలోక అనే ఏకైక పుస్తకం రాశాడు .

630-న్యాయ శాస్త్రాను శీలనం కర్త –కిషోర్ నాద ఝా (1940)

52ఉద్గ్రంధాలు రాస్సిన కిషోర్ నాధ ఝా వ్యాకరణ,సాహిత్య ఆచార్య .న్యాయ వైశేషిక౦లొ ఎం ఏ .10-6-1940న యుపిలో పుట్టాడు .అలహాబాద్ గంగానాథ ఝా సంస్కృత కాలేజిలో రీడర్ చేసి రిటైరయ్యాడు .డిలిట్.గురుపరంపరలో మధుసూదన మిశ్రా ,దీనబంధు ఝా ,చంద్రమాధవ ఝా ఉన్నారు .ఉత్తరరామ చరితానికి సంస్కృత హిందీ వ్యాఖ్యానం ,న్యాయ శాస్త్రీ ఈశ్వరవాద ,న్యాయ దృశ్యాత్మాను చింతనం ,న్యాయ సూత్రణం పాహ విమర్శ ,న్యాయ శాస్త్రాను శీలనం మొదలైనవి రాశాడు .ప్రెసిడెంట్ అవార్డీ.

   సశేషం

  మహాశివరాత్రి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మార్చి 11 గురువారం మహాశివరాత్రి శుభాకాంక్షలు

మార్చి 11 గురువారం మహాశివరాత్రి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మాతృ భాషా సేవలో తరిస్తున్న ఐస్ లాండ్ దేశం(తెలుగు వెలుగు కు ప్రత్యేకం )

మాతృ భాషా సేవలో తరిస్తున్న ఐస్ లాండ్ దేశం(తెలుగు వెలుగు కు ప్రత్యేకం )

ఎక్కువకాలం చీకటిలో ఉంటూ .ఉద్యోగావకాశాలు తక్కువేఅయినా , అస్థిరమైన భూభాగం
ఉన్నా ,మహిళా మణులను గౌరవిస్తూ ,తమ భాషా సంస్కృతులసేవలో తరిస్తూ, నిరంతరం పరి
రక్షించు కొంటూ ,ఆర్ధికాభి వృద్ధి చెంది ,ప్రపంచానికే ఆదర్శ ప్రాయం గా నిలిచిన
దేశం ఐస్ లాండ్ .అక్కడి భాషా సాంస్కృతిక సేవలను తెలుసు కొనే ముందు ఆ దేశ
పరిస్థితి ని గమనిద్దాం .

అస్థిర అస్తవ్యస్త దేశం

ఐస్ లాండ్ దేశం అంటే మనలాగా నిశ్చింతగా ఉన్న దేశం కాదు .ప్రపంచం లో ఉన్న అగ్ని
పర్వతాలలో మూడవ వంతు ఇక్కడే ఉన్నాయి .ఉత్తర అట్లాంటిక్ ఆర్కిటిక్ సముద్రాల మధ్య
ఉన్న ప్రాంతం .ప్రతి అయిదేళ్లకోసారి ఏదో ఒక అగ్ని పర్వతం బద్దలై భీభత్సం
సృష్టిస్తుంది .దీన్నే అక్కడి వారు ‘’యాత్రిక విస్ఫోటనం (టూరిస్ట్ ఎరప్షన్)అని
సరదాగా అంటారు .అందువల్ల భూభాగం అస్థిరం గా ఉంటుంది .అయితే ఈ అస్థిరత వల్లనే
ఎనభై శాతం ఉష్ణాన్ని పొందుతారు .ఇదొక విపరీతం ..గడ్డకట్టిన మహా సముద్రం ఐస్
లాండ్ .దీన్ని మొదట గుర్తించిన బ్రిటిష్ నావికుడు దీనికి ‘’ధూలే’’అని
పేరుపెట్టాడు .. ఇక్కడి అనిశ్చిత వాతావరణా,న్ని చూసి ‘’నరకానికి ఘనీభవించిన
మార్గం’’ అంటారు.ఐస్ లాండ్ రాజధాని ‘’రెక్ జవిక్ ‘’.ఇక్కడిప్రజలను వైకింగులు
అంటారు .జనాభా సుమారు మూడు లక్షలు .దేశ విస్తీర్ణం 103చదరపు కిలో మీటర్లు .
.3,200అడుగుల మ౦ద౦ మంచు ఉన్న ప్రాంతం .పర్వతాలు ,హిమానీ నదులున్న ప్రాంతం
.హిమానీ నదులు లోతట్టు ప్రాంతాలనుండి సముద్రం వైపుకు ప్రవహిస్తాయి . యూరప్
మొత్తం మీద ఐస్ లాండ్ అతి పెద్ద’’ మంచు టోపీ’’(ఐస్ కాప్).మిగతా దేశాలలో ఉన్న
మంచుప్రాంతాలన్నీ కలిపినా దీనికంటే తక్కువే . ఉష్ణోగ్రత ఎప్పుడూ పది సెంటి
గ్రేడ్ డిగ్రీలకంటె తక్కువే .అంటే పద్నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ .విపరీతమైన
గాలి ,వర్షాలే ఈదేశానికి ‘’పెద్ద ప్లేగు వ్యాధి ‘’అని చమత్కరిస్తారు ..వర్షం
అన్ని వైపులా నుంచే కాదు ,సమాంతర వర్షం కూడా పడటం ఇక్కడి ప్రత్యేకత .ఆర్కిటిక్
వలయానికి అవతలి వైపు ,ఉన్నత అక్షా౦శ రేఖ మీద ఉండటం వలన ఎప్పుడూ చీకటి గా ఉండటం
మరో విశేషం .డిసెంబర్ జనవరి నెలల్లో రోజుకు 5గంటలు మాత్రమే సూర్యుడు
కనిపిస్తాడు .దీనివలన ‘’షార్ట్ డే డిప్రెషన్ ‘’వీరికి ఎక్కువ .శీతాకాలం
లో ‘’మిరుమిట్లు
గొలిపే భయంకర ఉత్తర కాంతులు ‘’(ఘో స్ట్లీ ఆరోరా బొరియాలిస్ )దర్శన మిస్తాయి
.ఆకాశం లో మెరుపుల్లా విద్యుత్ తరంగాలు భయ భ్రా౦తుల్ని చేస్తాయి.ఉష్ణోగ్రతలు
12సెంటి గ్రేడ్ నుంచి మైనస్ 15సెంటిగ్రేడ్ డిగ్రీలవరకూ మారుతూ ఉంటాయి
.ఆర్కిటిక్ వలయం పైన ఉండటం వలన ‘’అర్ధ రాత్రి సూర్యుడు ‘’కనిపిస్తాడు .సమాంతర
రేఖలో ఎప్పుడూ ఇక్కడ సూర్యుడు కుంకడు.ఇదొక వింత .పడమటి ఫిజార్డ్స్ లో పర్వతాలు
సూర్య కాంతిని అడ్డ గించటం వలన చాలా గ్రామాలు చీకట్లోనే శీతాకాలమంతా ఉంటాయి
.ఫిబ్రవరి మార్చి నెలలలో వచ్చే సూర్య దర్శనానికి పులకరించి ఈ ప్రజలు ‘’సన్ షైన్
కాఫీ ‘’త్రాగుతారు .జూన్ ,జులై నెలలో నిజమైన చీకటి రాత్రులు రావు .సూర్యుడు
అర్ధ రాత్రి వేళ దిక్చక్రానికి కిందుగా ఉండటం తో మసక గా ఉండి పగలు అయిపోయి
నట్లు భావిస్తారు .ఆగస్ట్ దాకా నక్షత్రాలుకూడా రావు .ఇక్కడ ‘’శాండీ గ్లేసియల్
డెసర్ట్’’’’పైమంచు ప్రదేశం ,లేక రాళ్ళ ఆకృతులు దిక్చక్రం దగ్గర
‘’ఏర్పడి ‘’తమాషా
ఎండమావి ‘’(ఫాటా మార్గానా ) లా ఉండటం మరో విశేషం .

అస్టిరత లోనూ ఆత్మ స్థైర్యం

ఐస్ లాండ్ ప్రజలు కస్ట జీవులు .వారానికి 46 నుండి 50గంటలు కష్టపడి పని
చేస్తేనే వారి కడుపు నిండు తుంది .ఉద్యోగ స్థాయి 4శాతం కంటే తక్కువ .ఇది
ప్రపంచం లోనే అతి తక్కువ శాతం .ఒకప్పుడు మద్య నిషేధం అమలు పరచారుకాని ఇప్పుడు
ఎత్తేశారు .ఇక్కడి చేపలు పట్టే వారి జీవితం చాలా దుర్భరం గా ఉంటుంది .సముద్రం
పై చేపల వేటకు వెళ్ళిన జాలర్లు సురక్షితం గా తిరిగి వస్తారనే నమ్మకం ఉండదు
.అందుకే భర్తలను కోల్పోయిన జాలరి భార్యలు ఎక్కువగా ఉంటారు .ఇరవై వ శతాబ్దం వరకు
చేపలవేట ఒక్కటే ముఖ్య వృత్తి .ప్రపంచం లో ఉండే తిమింగిలాలు అంటే ‘వేల్స్’’ లో
సగం అయిస్ లాండ్ లోనే ఉండటం విశేషం .వీరికి ఎగుమతులు పెద్దగా ఉండవు .అన్నీ ఇతర
దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే .అందుకే ధరలుఎప్పుడూ ఆకాశాన్ని అంటి
ఉంటాయి .’’ఊహకందని అరుపులు ,ఉంటాయి వృక్షాలు కాని రైళ్ళు కాని ఉండవు .భవన
నిర్మాణ కళ(ఆర్కి టెక్చర్ ) ఉండదు.పండ్లు ,పచ్చదనం ఆరోగ్యావసరాలకు చాలవు .సంపద
తక్కువ కనుక సంస్కృతీ తక్కువగానే ఉంటుంది .యాత్రికుల కు ఆకర్షణీయ అంశాలు చాలా
తక్కువే .సాహిత్యం పగ ప్రతీకారం కేంద్ర మై ఉంటుంది.అయినా ఐస్ లాండ్ ను ఎందుకు
ప్రేమిస్తానంటే ఇక్కడ జనాభా తక్కువ అవటం వల్ల’’అని ప్రముఖ ఆంగ్లో అమెరికన్ కవి
డబ్ల్యు .హెచ్ .ఆడెన్ ‘’లెటర్స్ ఫ్రం ఐస్ లాండ్ ‘’కవిత లో అంటాడు .దేశం ఎన్నో
శతాబ్దాలకాలం నార్వేజియన్ ల పాలన కింద ఉంది .తర్వాత డెన్మార్క్ అధీనం లోకి
వచ్చింది . 1944లో డెన్మార్క్ కబంధ హస్తాలనుండి విడివడి ఐస్ లాండ్
స్వాతంత్ర్యాన్ని పొంది, రిపబ్లిక్ దేశమైంది ..ఇవన్నీ ఈదేశ విపరీత పరిస్థితులే
.అయినా ప్రజలు ఏంతో బాధ్యతగా దేశ నిర్మాణం లో ,సంస్కృతీ ,భాషా పరిరక్షణ లో
నిబద్ధులై ప్రపంచానికి ఆదర్శ ప్రాయం గా ఉన్నారు .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత
దేశం తీరే మారిపోయింది .అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా అభి వృద్ధి చెందింది
.ఐరోపా ఆర్ధిక వ్యవస్థలో భాగస్వామ్య దేశ మైంది .ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన
ఆర్ధిక సంక్షోభానికిగురై,రాజకీయ ఆస్థిరత్వమేర్పడి, మళ్ళీ క్రమంగా పుంజుకొని
యాత్రికాకర్షణ దేశంగా నిలబడింది .స్వేచ్చా వాణిజ్యం అమలు పరుస్తోంది .సాంఘిక
సంక్షేమం ,ఆరోగ్య సంరక్షణ అందరికీ విద్య అందిస్తూ ప్రగతి పధం లో నడుస్తోంది .
ఇప్పుడు ఆర్ధిక ,రాజకీయ ,సాంఘిక రంగాలలో సుస్థిరమైన దేశమైంది . పునరుజ్జీవన
ఇంధన శక్తి వాడకం లో అగ్రగామి దేశం ఐస్ లాండ్ . ’’రెన్యూడ్ హైడ్రో
ఎలెక్ట్రిక్ పవర్ (హెచ్ యి డి )ను విశేషంగా ఉపయోగిస్తారు .’’భూ ఉష్ణోగ్రత తో
వేడి పొందే బాహ్య ఈత కొలను’’ (జియో దేర్మల్ వార్మేడ్ ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్
పూల్) ఐస్ లాండ్ ప్రత్యేకతలలో ఒకటి .

సంస్కృతీ సేవలో ఐస్ లాండ్

ఐస్ లాండ్ దేశీయుల జాతీయ భాష ను ‘’ఐస్ లాండిక్ ‘’అంటారు .అందరు కలసి మెలసి
ఉండటం అనేది వీరి గొప్ప సంస్కృతి .చిన్న చిన్న కుటుంబాలే ఇక్కడ ఎక్కువ .కొన్ని
కుటుంబాలకు జియోగా ,స్కార్మ్,రిచిటర్ ‘’వంటి ఇంటి పేర్లు ఉంటాయి .తండ్రి పేరు
లోని మొదటి పదాన్ని ‘’టాగ్ ‘’గా ఉపయోగిస్తారు .ఉదాహరణకు ‘’బిజోర్క్ గు౦డు
మండ్స్ డాట్టర్’’అంటే బిజోర్క్ అనే ఆమె, గుండు మ౦డు కూతురు అని అర్ధం .అదే
కొడుకైతే చివర్ ‘’సన్’’ఉంటుంది .వీరి సంస్కృతి ‘’మా ప్రజ మీ ప్రజ ‘’ .అంటే
కలిసి మెలసి ఉండటం .వీరిది అహింసా సమాజ సిద్ధాంతం.97శాతం ప్రజలు దేవుని
నమ్ముతారు .చాలా కొద్ది మందిమాత్రమే అలవాటుగా చర్చి కి వెడతారు .
‘’సుమో ఆట ‘’లాగా
వీళ్ళకి ‘’గ్లిమో ‘’ఆట బాగా ఇష్టం.వీరి జాతీయ చిహ్నం ‘’పర్వత మహిళ’’.దీనిని
బట్టి స్త్రీలంటే వీరికి యెంత గౌరవమో తెలుస్తోంది .ప్రపంచం లోనే మొట్ట మొదటి
సారిగా మహిళా వోటు హక్కు అమలు చేసిన దేశం ఐస్ లాండ్ .1922లో జరిగిన ఎన్నికలలో
మహిళకే ఎక్కువ స్థానాలు లభించాయి .

మాతృభాషా సేవలో ఐస్ లాండ్

ప్రపంచం లోనే మొదటి ‘’బ్రాస్క్యు ‘’నిఘంటువు ను ఐస్ లాండ్ దేశపు వాయవ్య భాగం
లో మారు మూల ఉన్న ఒక రైతు తయారు చేశాడు బాస్క్యు నావికులు చేపల వేటకు దగ్గరలో
ఉన్న తీరానికి వచ్చినప్పడు ,ఈయన వారి నుండి భాష నేర్చుకొన్నాడు .ప్రపంచం లో ఏ
దేశానికంటే తలసరి పుస్తక రచన ,ప్రచురణ ,అమ్మకం ఐస్ లాండ్ లో చాలా ఎక్కువ .ప్రతి
ఏడాది కనీసం 500 కొత్త పుస్తకాలు ప్రచురిస్తారు .ఇది అమెరికాలో రోజుకు
విడుదలయ్యే 1200 పుస్తకాలకు సమానం .ఐస్ ల్యాండ్ దేశపు దేశ భక్త కవి ‘స్నార్రి
హిజార్ట సన్ ‘’.’’భూమి ,జాతి ,భాష (లాండ్ ,నేషన్ ,లాంగ్వేజ్)అనేవి
మాత్రమేనిజమైన మూర్తి త్రయం ‘’(ట్రినిటి )అని ఆయన రాశాడు. అందుకే వారి ‘’జాతీయ
కవిగా’’ గౌరవింప బడుతున్నాడు .ఐస్ లాండ్ ప్రజలు కవిని ‘’స్కాల్డ్ ‘’అంటారు
.కవికి అందరికంటే ఉన్నతమైన ఉత్క్రుస్టమైన స్థానాన్నిస్తారు .వీరాభిమానం
ప్రదర్శిస్తారు .సమాజం లో కవికి చాలా గౌరవం ఇస్తారు .దీనికి కారణం కవి సంఘం లో
నీతిని వ్యాపి౦ప జేస్తాడన్న నమ్మకమే .ఐస్ లాండ్ స్వాతంత్ర్య సమరం లో కవులు గణ
నీయమైన పాత్ర పోషించారు .కవిత్వ ప్రతిభను ఉదాత్త వ్యక్తిత్వం గా పరిగణిస్తారు .

ఐస్ లాండ్ ప్రజలు తమ భాషను చాలా పవిత్రం గా, స్వచ్చం గాఉండేట్లు
కాపాడు కొంటారు .పర భాషా ప్రభావం తమ భాష మీద పడ కుండా ఏంతో జాగ్రత్త
తీసుకొంటారు. భాష పలచ బడకుండా కాపాడుకొంటారు .ప్రపంచ మంతా వాడే . అంతర్జాతీయ
అరువు పదాలైన కంప్యూటర్ , రేడియో ,టెలివిజన్ ,టెలిఫోన్ లను అస్సలు వాడరు .వారి
భాషలో వీటికి తగిన ,అర్ధవంతమైన పద సృష్టి చేసుకొన్నారు . ఈ పద సృష్టి కోసం
విద్యా సభలను (ఎకడమిక్ కమిటీ )లను ఏర్పాటు చేస్తారు .కంప్యూటర్ ను
‘’టోల్వా ‘’అంటారు
.టోలా అంటేవీళ్ళ భాష లో సంఖ్యఅని అర్ధం .’’వోల్వా’’అంటే ఊహించి చెప్పటం
(ప్రాఫెటైజ్ )అంటే సంఖ్యా దర్శిని అని అర్ధం .టెలిఫోన్ ను ‘’సిమి ‘’అని
పిలుస్తారు .సిమి అంటే దారం .తీగ ద్వారా వార్తలు పంపటం అనే అర్దం.హెలికాప్టర్
ను ‘’పిర్లా ‘’అంటారు .అంటే ‘’విర్లర్ ‘’తిరిగేది అని అర్ధం హెలికాప్టర్
ఎగరాలంటే పైన ఉన్న రెక్కలు తిరగాలిగా .దానికి సూచన .జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ను’’
పోటా లేక జూమర్ ‘’అంటారు .శాస్త్ర సాంకేతిక పదాలపై లాటిన్ భాషా ప్రభావం పడకుండా
చూసుకొంటారు .సాధారణ ప్రజానీకానికి’’ పద నిర్మాణం’’(వర్డ్ బిల్డింగ్ ) ఒక సరదా
.వీటిపై తరచుగా చర్చలు జరుపుతారు .వీటిలో నూతన శబ్ద ప్రయోగాలు చాలా హాస్య
స్పోరకం గా ఉంటాయి .’’పెజేర్స్ ‘’అనే పదానికి ‘ఫ్రియోప్ జో ఫర్ ‘’అనే సమానమైన
పదం సృష్టించుకున్నారు .దీని అర్ధం ‘’శాంతి దొంగ ‘’అని .ఇవి మన జేబుల్లో ఉండి
రోద చేస్తాయికదా అందుకని . .

’’ఐస్ లాండిక్ భాష ప్రపంచం లో ఏ జాతి భాష కన్నా ఉత్తమమైనది ‘’ అన్నాడు వాళ్ళ
మహాకవి ‘’ఐనార్ బెనడిక్స్సన్’’.ఇదే ఐస్లాండ్ ప్రజలకు వేద మంత్రం అయింది .ఈ
ప్రజలకు మాతృ భాష భావ వినియోగానికి మాత్రమే కాదు, సంస్కృతీ సారం .అది వారి
జాతీయ అస్తిత్వ .సూచకం,జాతి గర్వం ,మనుగడ . వారి హృదయపు లోతుల్లో’’ ఐస్
లాండిక్ భాష ఏ ఇతర జాతీయ భాష కంటే నాణ్యమైన భాష ‘’అని త్రికరణ శుద్ధిగా నమ్మకం
ఉంటుంది .సాధారణం గా వీరి భాష ఉత్తర జర్మన్ కుటుంబ భాష కు దగ్గర గా ఉంటుంది
.నార్వేజియన్ ఫారోస్ భాషలకు సన్నిహితం గా ఉంటుంది . . లాటిన్ భాష లాగా మార్పు
చెందకుండా పూర్వపు రూపం లోనే ఉండటం .సాహిత్యాన్ని పరిరక్షించుకోవటం
,ప్రాచీన ‘’నార్సే
సంస్కృతి ‘’ని భద్రంగా రక్షించుకోవటం వలన ఐస్ లాండిక్ భాష ను ‘’ఉత్తర లాటిన్
భాష ‘’అంటారు .ఐస్ లాండ్ వారి ‘’స్వర్ణ యుగం ‘’క్రీ. శ .1100నుండి ప్రారంభమైంది
.మొదటి నుంచి ఈజాతి కవిజాతియే .9,11శతాబ్దాల కాలం లో 100 మంది ఐస్ లాండ్ కవులు
యూరప్ దేశాలలో ఉన్నారు .10వ శతాబ్దపు చివరలో ఉన్న స్కాండినేవియా రాజాస్థాన
కవి పేరు ’’ ఐస్ లాండర్ ‘’అన్నవిషయం నూటికి నూరు శాతం యదార్ధం .

అంతర్గత అంత్య ప్రాస (యమకం),అనుప్రాస నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు
.వీరికి పౌరాణిక ,వీరోచిత గాధలంటే గౌరవం ఎక్కువ . దీనినే ‘’వైకింగ్
మైండ్ ‘’అంటారు
. ‘’పశువులు చనిపోతాయి ,బంధువులు చనిపోతారు ,చివరికి మనమూ చనిపోతాం ‘’అనే
సామెతనువీళ్ళు తరచుగా వాడతారు .మరొకటి ‘’స్నేహితుడికి స్నేహ హస్తం చాచాలి
.కానుకకు కానుక అందించాలి .నవ్వుకు నవ్వూ ఇవ్వాలి ‘’.ఐస్ లాండ్ దేశం లో1807లో
జన్మించిన ‘’జోనస్ హాల్ గ్రిమ్సన్ ‘’ కవి ప్రజా హృదయాలను దోచుకున్నకవి .జాతికి
ప్రియ పుత్రుడు .అభిమానం తో ప్రజలు ఆయన శిలా విగ్రహం నిర్మించి స్మరిస్తున్నారు
.ఇలా మొట్ట మొదటి గౌరవం దక్కించుకొన్న కవి ఈయనే .ఈయనను ఆంగ్ల కవి విలియం
వర్డ్స్ వర్త్ లాగా ‘కవితా తీవ్ర వాది ‘’ ‘’గా భావిస్తారు .ప్రజల భాషలో కవిత్వం
రాశాడు .వృక్ష శాస్త్ర వేత్త కూడా .నేచురల్ హిస్టరీ గ్రంధం రాశాడు .

1864-1940 లో జీవించిన మరోకవి’’ ఐనార్ బెనేడిట్సన్ ‘’కలకాలం గుర్తుంచుకోదగిన
,ప్రజల నాలుకలపై నర్తించే అద్భుత కవిత్వం రాశాడు .ఈయన నగర,లోక కవి(కాస్మా
పాలిటిక్ ) .ఐస్ లాండ్ కే ప్రత్యేక మైన’’ ఉత్తర కాంతిని ,గల్ ఫాస్ ను
జలపాతాలను’’
సహజ సుందరంగా వర్ణించాడు .

ఈ దేశకవి ‘’హోల్డార్ కిల్జాన్ లాక్స్ నెస్1955లో ‘’సాహిత్యం లో నోబెల్
బహుమతి కూడా పొంది ,దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశాడు . .దేశపు గ్రామీణ
జీవితానికి కవిత్వం లో అద్దం పట్టాడు .’’బెల్ ఆఫ్ ఐస్ లాండ్ ‘’నవల రాసి ,అందులో
18వశతాబ్ది విశేషాలన్నీ వివరించాడు .ఆ దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర అందులో
సవివరంగా వర్ణించాడు .రెండవ ప్రపంచ యుద్ధానంతరం ‘’ఆటం స్టేషన్ ‘’అనే రచన
చేశాడు .ఆయన రాసిన కవితాపంక్తి ‘’దెబ్బ తిన్న బానిస మహా గొప్పవాడు –అతని హృదయం
లో స్వేచ్చ ఉంది ‘’ ఆ దేశస్తులకు స్పూర్తి నిస్తుంది .’’వరల్డ్ లైట్ ‘అనే
త్రిపుటి రచన లో సమాజం లో తన పాత్రను గురించి రాశాడు .ఎన్నో వర్ణ క్రమాలను
(స్పెల్లింగ్)మార్చేసి రాశాడు .వీధి భాష(స్ట్రీట్ లాంగ్వేజ్ ) రాశాడు
.ఆర్ధికాది రంగాలలోనే కాక సాహిత్య౦ లోను ఐస్ లాండ్ అగ్రగామిగా
ఉండి,ప్రపంచానికి ఆదర్శ ప్రాయమైంది . మాట్లాడే జనం లేక భాషలు అంతరించి
పోతున్నాయనే దాన్ని సవాలుగా తీసుకొని ,మాతృ భాషను కాపాడుకొంటూ,సేవచేస్తూ ,బాష
ఆంగ్లపదాలతో కలుషితం కాకుండా అర్ధ వంతమైన పదాలను ఎప్పటికప్పుడు సృస్టిం చుకొంటూ
,స్త్రీ కి ఉన్నత గౌరవాన్ని కలిగిస్తూ ,సంస్కృతీ పరిరక్షణలో అందరికీ ఆదర్శంగా
నిలిచింది ఐస్ లాండ్ దేశం .

గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-15-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 611-హరిశ్చంద్ర ఉపాఖ్యానం కర్త –అద్యాచరణ ఝా (1921)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

611-హరిశ్చంద్ర ఉపాఖ్యానం కర్త –అద్యాచరణ ఝా (1921)

1-11-1921న బీహార్ లో మధుబని జిల్లా మంగ్రోనిలో పుట్టిన అద్యాచరణ ఝా సాహిత్య అలంకార వ్యాకరణ ఆచార్య .బీహార్ KSSV కు ప్రతి కులపతి .25పుస్తకాలు రాశాడు .అందులో మనోరమ శబ్దరత్న ప్రకాశిక ,సంస్కృత రచనా సంగ్రహ ,భారతీయ వాణీ మయేషు రామకథా వర్ణనం , హరిశ్చంద్రోపాఖ్యానం ఉన్నాయి .అనేకరచనలు రేడియో ద్వారాప్రసారాలయ్యాయి ,ప్రెసిడెంట్ అవార్డీ,సాంస్క్రిట్ రత్న సమ్మాన్ ,యుపి సంస్కృత అకాడెమి పురస్కారం పొందాడు .

612-ఆనంద మధు మందాకిని  కర్త –ఆనంద్ ఝా (20వ శతాబ్ది )

 వ్యాకరణ ఆచార్య , వేదాంత వాగీశ ఆనంద్ ఝా ఆనంద మధు మందాకినీ మాత్రమె రాశాడు .లక్నో యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .సకల దర్శన కానన్, సంచార పంచానన్ అనే బిరుదు .రాష్ట్రపతి పురస్కార గ్రహీత .

613-  సంస్కృతోద్గార కర్త –అనిల్ కుమార్ ఝా (1964)

డిలిట్ అయిన అనిల్ కుమార్ ఝా 1964లో జనవరి 26న బీహార్ దర్భా౦గ లో పుట్టాడు .రాసిన 4పుస్తకాలలో సంస్కృతోద్గార ఒకటి .

614-గూడార్ధ తత్వాలోకనం కర్త –ధర్మ దత్త బచ్చా ఝా (1860-1918)

బీహార్ మధుబని జిల్లా మిథిలతాలూకా నివాని లో 1860లో ధర్మ దత్త బచ్చాయా పుట్టాడు సులోచనా మాధవ చంపూ ,గూడార్ధ తత్వాలోకనం(జగదీశుని సిద్ధాంత లక్షణం పై వ్యాఖ్యానం ) రాశాడు .1918లో 58ఏళ్ళకే చనిపోయాడు .న్యాయ శాస్త్రం లో ఎదురులేని వాడు .

615-ప్రమోద లహరి కర్త –బదరీ నాద్ ఝా (1893)

1893లో జనవరి 20న బదరీ నాద ఝా బీహార్ లో పుట్టాడు .న్యాయ ,నవ్య వ్యాకరణ ఆచార్య .జమ్మూ లోని RSKS లో సంస్కృత ప్రొఫెసర్ .7గ్రంథాల రచయిత.కర్ణభారం ,ఊరు భంగం ప్రతిజ్ఞా యౌగంద రాయణ౦ ,మేఘ దూతం వ్యుత్పత్తి వాదం  లపై సంస్కృత వ్యాఖ్యానాలు  రాశాడు .

616-పంచమి సాహిత్య విద్య కర్త –బటోహి ఝా (1951)

సాహిత్య ఆచార్య,శిక్షా శాస్త్రి అయిన బటోహి ఝా10-10-1951న బీహార్ దర్భంగ లోపుట్టాడు .లక్నో సంస్కృత  సంస్థాన్ లో సాహిత్య ప్రొఫెసర్ .పంచమి సాహిత్యవిద్య ,భాగవత సహస్రనామ ,సప్తశతి సహస్రం ,గీతానాంత రసం రాశాడు

617-ఆషాఢరభ విరచిచితస్య కోవిదానందస్య సిద్ధాంత లఘు మంజూషస్య  సమీక్షాత్మకం అధ్యయనం కర్త –భవేంద్ర ఝా (1949)

బీహార్ మధుబని జిల్లా లఖ్నోర్ లో భవేంద్ర ఝా3-1-1949న పుట్టాడు .వ్యాకరణ ఆచార్య .LBSసంస్కృత విద్యా పీఠ౦ లో ప్రొఫెసర్ .ఒకేఒక్క ఉద్గ్రంధం ఆషాఢరభ విరచిచితస్య కోవిదానందస్య సిద్ధాంత లఘు మంజూషస్య  సమీక్షాత్మకం అధ్యయనం రచించాడు .

618-దిల్లీస్థః వి౦శ శతాబ్దయః రచనా కారః కర్త –చంద్ర భూషణ ఝా (1969)

8-7-1969 న బీహార్ దర్భంగా లో పుట్టిన చంద్ర భూషణ ఝా ఎంఫిల్ పిహెచ్ డిచేసి ,ఢిల్లీ యూని వర్సిటి షెఫెర్డ్ కాలేజి  సంస్కృత ఆచార్యుడుగా చేశాడు .మహర్షి బాదరాయణ సమ్మాన్ ,గ్రహీత . దిల్లీస్థః వి౦శ శతాబ్దయః రచనా కారః రాశాడు .

619-వాజపేయి శతక కర్త –నారాయణ దేవ్ ఝా (1952)

సాహిత్య ,వ్యాకరణ ఆచార్య నారాయణ దేవ్ ఝా 12-01-1952 న బీహార్ సీతామండిలో పుట్టాడు ,దర్భంగా సంస్కృత కళాశాల సంస్కృత ప్రొఫెసర్ .ఈయన గురుపరంపరలో పట్టాభి రామ శాస్త్రి, ప్రొఫెసర్ ద్విజెంద్రనాద్ మిశ్రా ,బటుకనాద శాస్త్రి ఉన్నారు .సంస్కృతం లో వాజపేయి శతకం ఒక్కటే రాశాడు .

620-బృహత్ పరాశర హోర కర్త –దేవానంద ఝా (1921)

దేవానంద ఝా 1921లో అక్టోబర్ 15న బీహార్ నాగవాస లో పుట్టాడు .జ్యోతిష ,సాహిత్య ఆచార్య .దీనాలాల్ చౌదరి,ముకుంద శాస్త్రి ల శిష్యుడు . బృహత్ పరాశర హోర ఒక్కటి మాత్రమె రాశాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 591-జైన సంస్కృత కోశ కర్త –భగ చంద్ర జైన్ (1936)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

591-జైన సంస్కృత కోశ కర్త –భగ చంద్ర జైన్ (1936)

భగ చంద్రజైన్ 1936 సెప్టెంబర్ 11న మధ్యప్రదేశ్  చత్తర్పూర్ లో పుట్టి సంస్కృత ,ప్రాకృత జైనాలలో ఆచార్యు డయ్యాడు .నాగ పూర్ ,మద్రాస్ యూని వర్సిటీలలో ప్రొఫెసర్ గా పని చేసి ,మైసూర్ యూనివర్సిటి ప్రాకృత ,అండ్ రిసెర్చ్ కు డైరెక్టర్ అయ్యాడు .ఈయన గురుపరంపర –పన్నాలాల్ జైన్ ,పండిత కైలాస చంద్ర సిద్ధాంత శాస్త్రి ,డా నారాయణ సమతిని .డా కస్తూర్ చంద్ర జైన్ ,డా బి మొహరిల్ ,డా లోఖండే,డా ఖండేర్కర్ ,డా.మలాతీ బొదలె ,డా కాలా త్రికూలె ,డా అధవాలే లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .75గ్రంథాలు రాసిన మహా రచయిత.అందులో జైన సంస్కృత కోశ ,చత్సుచ్చతకం మొదలైనవి ఉన్నాయి .అహింసా ఇంటర్నేషనల్ అవార్డ్ ,ప్రెసిడెంట్ అవార్డ్ మొదలైన ఎన్నో పురస్కార గ్రహీత చాలా దేశాలలో విజిటింగ్ ప్రొఫెసర్ .

592-కర్మ ప్రకృతి కర్త-గోకుల్ చంద్ర జైన్ –(1934)

5-11-1934న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పిదుర లో గోకుల్ చంద్ర జైన్ పుట్టాడు .వారణాసి సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ . కర్మ ప్రకృతి సత్యశాసన పరీక్షా పరిసంవాద వంటి ,అయిదు గ్రంథాలు రాశాడు .గోమటేశ్ విద్యా పీత పురస్కారం ,ప్రశస్తి పురస్కారం ,ప్రెసిడెంట్ అవార్డ్ లు పొందాడు .

593-సిరికుమ్మ చరితం కర్త –జినేంద్ర జైన్ (1962)

మధ్యప్రదేశ్ సిందుది జిల్లా కట్ని లో జినే౦ద్ర జైన్ 1962లో జూన్ 14జన్మించాడు సంస్కృత  ఎం .ఏ. పిహెచ్ డి .రాజకోట్ లోని జైన్ విశ్వభారతి యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .అక్ఖానాయ మణి కోశం ,సిరికుమ్మ చరితం ,అనువాద ప్రాకృత సాహిత్యం ఏవం జైన దర్శన సమీక్ష వగైరా 13 పుస్తకాలు రాశాడు .

594-జైన ఉద్ధరణ కోశ కర్త –కమలేశ్ కుమార్ జైన్ (1960)

జైన దర్శన ,ప్రాకృత ఆచార్య కమలేశ్ కుమార్ జైన్ 21-6-1960న రాజస్థాన్ లో పుట్టి ,జైపూర్ సంస్కృత  యూనివర్సిటిలో జైన ఫిలాసఫీ రీడర్ గా ఉన్నాడు .రెండు భాగాల జైన ఉద్ధరణ కోశం రాశాడు .పండిత గోపాల దాస్ బరేయా స్మారక అవార్డ్ గ్రహీత .

595-జైన పురాణ కోశ కర్త –కస్తూర్ చంద్ర జైన్ (1936)

సుమన్ గా ప్రసిద్ధుడైన కస్తూర్ చంద్ర జైన్ 1936 లో ఏప్రిల్ 12న మధ్యప్రదేశ్ బన్సా జిల్లా తర్ఖేడ దామో లో పుట్టాడు .సంస్కృత ఎం .ఏ .పిహెచ్ డి .రాజ్ కోట్ జైన్ విద్యా మహా సంస్థాన్ శ్రీ విరాజీలో రిసెర్చ్ అసిస్టెంట్ .జైన పురాణ కోశం ,భారతీయ దిగంబర జైన అబిలేఖ ,ప్రాణాన పరీక్షా భాషా వచనిక మొదలైన 5పుస్తకాలు రాశాడు .జైన పురాణ కోశక అవార్డ్ ,శ్రుత సంవర్ధన అవార్డ్ పొందాడు .

596-పాలీ ప్రవేశిక కర్త –కోమల్ చంద్ర జైన్ (1935)

మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బినాలో 20-8-1935న జన్మించిన కోమల్ చంద్ర జైన్ సంస్కృత పిహెచ్ డి చేసి బెనారస్ హిందూ యూనివర్సిటిలో సంస్కృత ప్రొఫెసర్ చేశాడు .పాలీప్రవేశిక ,ప్రాకృత ప్రవేశిక ,రాశాడు .

597-క్షణ భంగుర జీవన కర్త –కృష్ణ జైన్ (1959)

గ్వాలియర్ అటానమస్ ప్రభుత్వ కాలేజిలో ప్రొఫెసర్ కృష్ణ జైన్ 1-7-1959న మధ్యప్రదేశ్ లో పుట్టాడు ,క్షణ భంగుర జీవన ,దశధర్మ గ్రంథాలు రాశాడు .

598-రత్న యోగ సార కర్త –మున్ని పుష్ప జైన్ (1928)

మున్ని పుష్ప జైన్ 22-6-1928న మధ్యప్రదేశ్ దామో లో పుట్టి ,జైన దర్శన ఆచార్య అయింది .రత్న యోగ సార ,పంచేంద్రియ సంవాద వంటి 5పుస్తకాలు రాసింది .

599-మూలాచార కర్త –మున్ని జైన్ (1957)

1957లో జూన్ 22న దామో లో పుట్టిన మున్ని జైన్ –జైన ఫౌండేషన్ డైరెక్టర్ .పండిట్ కైలాస చంద్ర జైన్ ,పండిట్ ఫూల్ చంద్ర సిద్ధాంత శాస్త్రి గురువులు .మూలాచార ,పంచేంద్రియ సంవాద సంయక్త్వ ప్రచ్చిసి ,రత్నయోగ సార రాసింది

600-ముక్తాహార కర్త –పన్నాలాల్ జైన్ (1911)

పన్నాలాల్ జైన్ సాహిత్య ఆచార్య ,శాస్త్రి .5-3-1911న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పర్గువలో పుట్టాడు .సాగర్ లోని శ్రీ గణేష్ దిగంబర జైన సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ .గురుపరంపర –గణేష్ ప్రసాద్ వర్ని ,దయాచంద్ర సిద్ధాంత శాస్త్రి ,కైలాష్ చంద్ర ,హజారీలాల్ న్యాయ తీర్ధ ,కోక్ నాద శాస్త్రి ,కపిలేశ్వర్ ఝా . ప్రొఫెసర్ భగచంద్ర జైన్ ,ప్రొఫెసర్ భగ చంద్ర భాస్కర్ ,డా హరీంద్ర భూషణ్ జైన్ ,.వినయాంజలి అనే కావ్య సంగ్రహం ,ముక్తాహార ,సంయకత్వ చింతామణి ,సుజ్ఞాన చంద్రిక ,ధర్మ కుసుమోధ్యయనం మొదలైన 5గ్రంథాలు రాశాడు .రాష్ట్రపతి పురస్కార గ్రహీత .

601-ప్రారంభిక బౌద్ధ దర్శన్ కర్త –విజయకుమార్ జైన్ (1956)

1-7-1956 ఉత్తరప్రదేశ్ లో పుట్టిన విజయకుమార్ జైన్ లక్నో లోని  RSKS కాలేజి ప్రొఫెసర్ .పండిట్ కైలాష్ చంద్ర శాస్త్రి ,డా కేసి జైన్ ల శిష్యుడు .10పుస్తకాలు రాశాడు .పాలీ సద్దాతృ సంగ్రహ ,ప్రారంభిక బౌద్ధ దర్శన,సంస్కృత సూక్తి సముచ్చయ అందులో ముఖ్యమైనవి .యుపి సంస్కృత సంస్థాన్ అవార్డ్ ,సృత్సంవర్ధన్ అవార్డ్ ,దిగంబర్ జైన్ శాస్త్రి పరిషత్ పురస్కార పొందాడు .సృత్సంవర్ధిని పత్రిక సంపాదకుడు కూడా .

602-జ్ఞాననిది కర్త –యోగేష్ కుమార్ జైన్ (1978)

1978 జులై 4 మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బారాలో జన్మించిన యోగేష్ కుమార్ జైన్ జైన దర్శన ఆచార్యుడు .రాజస్థాన్ విశ్వభారతి యూని వర్సిటి లాడ్నం నాగౌర్ లో ప్రొఫెసర్ .జ్ఞాననిది పుస్తకం ఒక్కటే రాశాడు .

603-నీతిశత కకర్త –సునీతా జైస్వాల్ (1968)

ఉత్తర ప్రదేశ్ గోరఖ్ పూర్ లో 1968 ఫిబ్రవరి 8 న పుట్టిన సునీతా జైస్వాల్ డిఫిల్ చేసి ,యుపి లోని ప్రభుత్వ పిజి డిగ్రీకాలేజి సంస్కృత ప్రొఫెసర్ చేసింది .నీతిశతకం ,కుమార సంభవం ,ఈశా వాస్య ఉపనిషత్ వంటి 5పుస్తకాలు రాసింది .

604-సంస్కృత న్యాయ శాస్త్ర కర్త –జై కుమార్ జలాజ్ (1934)

యుపి లో లలితాపూర్ లో 2-10-1934న పుట్టిన జైకుమార్ జలాజ్ అలహాబాద్ యూని వర్సిటి ప్రొఫెసర్ .28గ్రందాల రచయిత.రాసిన వాటిలో సంస్కృత న్యాయశాస్త్ర ,ఏక పూర్వ విచార ,ఐతిహాసిక భాషా విజ్ఞాన ,మరికొన్ని హిందీ రచనలు ఉన్నాయి అఖిలభారత విశ్వనాధ అవార్డ్ ,భోజ పురస్కారంసాహిత్య సరస్వత్ సమ్మాన్  వంటి అవార్డ్ ల గ్రహీత .

605-లవారస కర్త –హర్ష దేవ మన్ సుఖలాల్ జైన్ (1954)-,

లవారస ,స్వప్నకావ్యం రాసిన హర్ష దేవ మన్ సుఖలాల్ జైన్ 20-10-1954న గుజరాత్ భావనగర్ లో పుట్టి ‘’మాధవ్’’ పేరుతొ పిలువబడ్డాడు .సాహిత్య శాస్త్రం లో నిపుణుడు .

606-నైషధ కావ్యస్య చందు పండిత కృత టీకా కర్త –జయదేవ్ అరుణోదయ్ జాని (1951)

జయదేవ్ అరుణోదయ్ జాని 5-2-1951న గుజరాత్ బరోడా లో పుట్టాడు . అరుణోదయ్ జాని,సురేంద్ర చంద్ర కుంతేవాలా,విద్యాభాస్కర ,మణి శంకర ఉపాధ్యాయ ల శిష్యుడు . నైషధ కావ్యస్య చందు పండిత కృత టీకా అనే ఒకేఒక పుస్తకం రాశాడు .

607-జైన ఆచార సంహిత కర్త –ఉత్తమ సింగ్ జాట్(1975)

ఉత్తమ సింగ్ జాట్15-7-1975న రాజస్తాన్ భరత్ పూర్ లో జన్మించాడు .సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.గురుపరంపర –విజయ కుమార్ జైన్ ,ప్రొఫెసర్ ఆజాద్ మిశ్రా ,జేబీ షా .రాసిన 4పుస్తకాలలో జైన ఆచార సంహిత ,జైన ధర్మ దర్శన ,ముఖ్యమైనవి .

608-వాల్మీకి యుగీన భారతం కర్త –మంజులా జయస్వాల్ (1950)

మంజులా జయస్వాల్ 1950మే 6న అలహాబాద్ లో పుట్టి డిఫిల్ చేసింది అలహాబాద్ సంస్కృత యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్ .వాల్మీకి యుగీన భారత రాసింది .

609-ముహూర్త మార్తాండ కర్త –నేమి చంద్ర జయస్వాల్( 1922)

 సంస్కృత డిలిట్ నేమి చంద్ర జయస్వాల్ రాజస్తాన్ లో బాబర్ పూర్ జిల్లా ధౌల్ పూర్ లో16-9-1922 న  పుట్టాడు .ముహూర్త మార్తాండ ,భారతీయ జ్యోతిష ,సంస్కృత కావ్యాను చింతనం మొదలైనవి రాశాడు .

610-వాస్తు నిర్దోష ప్రకరణం కర్త –శ్వేత జెజూర్కర్ (1973)

సంస్కృత పిహెచ్ డి, సంగీతం లో ఎం ఏ .శ్వేత జెజూర్కర్1973 జూన్ 29న గుజరాత్ వడోదరజిల్లా నిజాంపూర లో జన్మించి ,మహారాజ్ శాయోజీ రావు యూనివర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ చేసింది .డా ఉమా దేశ పాండే శిష్యురాలు. 20పుస్తకాలు రాసింది .అందులో వాస్తు నిర్దోషక ప్రకరణం ,సిద్ధాంత కౌముది ,ముఖ్యమైనవి .

  సశేషం

మనవి –నేను రాసి సరసభారతి ప్రచురించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ 3భాగాలలో 1090మంది సంస్కృత కవులను పరిచయం చేశాను .ఈ గీర్వాణం-4లో ఇప్పటికి 610 గీర్వాణ కవులను పరిచయం చేశాను .అంటే మొత్తం మీద ఇప్పటికి 1700 మంది సంస్కృత కవులను పరిచయం చేసే అదృష్టం దక్కింది .ఇంకా చాలామందే ఉన్నారు .వారినీ పరిచయం చెస్తాను .ఈ నాలుగవ భాగం లో చాలామంది 20వ శతాబ్దానికి చెందిన వారు ,మన సమకాలీనులు కూడా ఉండటం విశేషం .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 571-భేద విద్యావిలాస కర్త –గురురాజాచార్య రాజా –(1921)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4

571-భేద విద్యావిలాస కర్త –గురురాజాచార్య రాజా –(1921)

వేదాంత శిరోమణి, వేదాంత విద్వాన్ గురురాజాచార్య రాజా 17-9-1921న కర్ణాటకలో జన్మించి మద్వ సిద్ధాంత సాహిత్యం లో నిష్ణాతుడయ్యాడు .గురు సార్వ భౌమ సంస్కృత పాఠశాలకు గౌరవ ప్రిన్సిపాల్ గా ,సమీర సమయ సమవర్ధిని సభకు సెక్రటరిగా పని చేశాడు .భేద విద్యా విలాసం ,ఉపాసన సంగ్రహ విజయం ,ఐతరేయ మంత్రార్ధం ,వైగ్వైఖరి వంటి 8సంస్కృత గ్రంథాలు రాశాడు .కమలేశ్ అనే మారుపేరుతో సంస్కృత శ్లోకాలు రాశాడు .విద్యా వైభవ ,సాహిత్యాలంకార ,ధర్మ శాస్త్ర భూషణ్ ,విద్వత్ చూడామణి బిరుదాంకితుడు .సంస్కృత సాహిత్య కృషికి రాష్ట్రపతి పురస్కారం పొందాడు .

572- సంస్కృతం పై కామశాస్త్ర ప్రభావం కర్త -విశ్వనాథ హంపి హోలీ (1955)

1-6-1955లో  బెల్గాం లో జన్మించిన విశ్వనాథ హంపి హోలీసంస్కృత ఎం. ఏ .పిహెచ్ డి.సంస్కృతం పై కామశాస్త్ర ప్రభావం వంటి 8పుస్తకాలు రాశాడు .

573-కిరీ ఆబాస్య కర్త –హర్ష కుమార్ (1936)

 విష్ణు సహస్రనామాలపై కిరీ అభ్యాసం తోపాటు పద్య పుష్పాంజలి రాసిన హర్ష కుమార్ 4-12-1936న ఢిల్లీ లో పుట్టి ,సంస్కృత పి.హెచ్. డి .చేశాడు .ఒకే ఒక సంస్కృత రచన కిరీ అభ్యాసం రాశాడు .

574-చెన్నమ్మ నవలాకర్త –శ్రీనాథ్ హోసూర్కర్ (1924)

26-2-1924లో పుట్టిన శ్రీనా థ్ హోసూర్కర్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ కాలేజిలో సంస్కృత లెక్చరర్ .చెన్నమ్మ సి౦ధుకన్య  నవలతోపాటు అజాత శత్రు ,ప్రతిజ్ఞా పూర్తి ,రాశాడు .

575-సంస్కృత భరత నర్తన మాల కర్త – ,శ్రీపాద శాస్త్రి హోసుర్కర్ (1886)

కొల్హాపూర్ లోని హసూర్ లో 10-6-1886న జన్మించిన శ్రీపాద శాస్త్రి హోసుర్కర్ హోల్కార్ సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరై,నిండోర్  లోని మహారాజా యశ్వంతరావు కాలేజీలో పనిచేశాడు .సంస్కృతం  లో 15పుస్తకాలు రాశాడు .సంస్కృత భరత  నర్తన మాల ,రాణాప్రతాప ,వల్లభాచార్య ,శివాజీ ,సమర్ధ రామదాస ,పృధ్విరాజ ,గురునానక్ ,మహావీర ,బుద్ధ మొదలైనవి వీటిలో ప్రసిద్ధాలు .ఇంగ్లీష్ లో ది గ్రేట్ వుమెన్ ఆఫ్ మహారాష్ట్ర ,అండ్ రాజస్థాన్ రాశాడు .’’మోక్షమందిరస్య ద్వాదశ దర్శన సోపానావలి’’అనే ఉద్రంథ౦ ఆయనకు చిరయశస్సు సాధించిపెట్టింది .

576-గణేశ మీమాంస కర్త –గణపతిశాస్త్రి హెబ్బార్ (1901)

1901లో  కర్ణాటకలోని మంగుళూరు లోజన్మించి , 1986లో మరణించిన   గణపతిశాస్త్రి హెబ్బార్ –ఋగ్వేద న్యాయ వేదాంత రాజనీతి శాస్త్ర కోవిదుడు .మహామహోపాధ్యా య లక్ష్మణశాస్త్రి  ,పండిత భీకం భట్ పట్వర్ధన్,పండిట్ రాజేశ్వర శాస్త్రి  గార్ల  శిష్యుడు .గణేశ మీమాంస గ్రంధం రాశాడు .విద్యాభూషణ్ ,సర్వతంత్ర బిరుదాంకితుడు .

577-శివ స్వారోదయ కర్త –హేమలత (1943)

భాగల్పూర్ లో 15-2-1943న పుట్టిన హేమలత  భాగల్పూర్ యూనివర్సిటి సంస్కృత ప్రొఫెసర్ ,హెడ్. శివ స్వారోదయ రాసింది .

578-వ్యాకరణ శాస్త్ర కర్త –హింద్ కేసరి (1947)

ఉత్తరప్రదేశ్ మణిపూరి జిల్లా  లోని కేసరిలో  15-8-1947 న పుట్టిన హింద్ కేసరి జైపూర్ లో సంస్కృత సంస్థాన్ ప్రిన్సిపాల్ .గోవిందం శాస్త్రి,పండిత రాం ప్రసాద్ త్రిపాఠీ ఆమె గురుపర౦పర .సంస్కృత వ్యాకరణం తో పాటు అయిదు పుస్తకాలు రాసింది .62వ ఏట 2009లో మరణించింది .

579-వివేచని కర్త –నవీన్ హోల్లా (1973)

మంగుళూరులో 1973డిసెంబర్ 8న పుట్టిన నవీన్ హోల్లా,శృంగేరి రాజీవ్ గాంధి కాంపస్ లో సంస్కృత అసిస్టెంట్ ప్రొఫెసర్.వివేచని అని ఒకే ఒకపుస్తకం రాసింది .

580-వసంత సేన కర్త –కృష్ణన్ ఇలాయత్ (1897)

31-5-1897న కేరళ కల్లూరు లో పుట్టిన కృష్ణన్ ఇలాయత్ ఆచార్య ,విద్వాన్ .పటమన వాసుదేవ ఇలయత్ ,కే వాసుదేవన్ ముసత్ ,శ్రీనివాస రాఘవాచార్య ,అనుజన్ రాజా ,నీల కంఠ శర్మగురువు గార్ల  శిష్యుడు .వసంత సేన ,సుహృత్ పుస్తకాలకర్త .

581- తార్కికరక్ష  కర్త –ఎఫ్.ఇరిమాల్(1945)

పారిస్ యూని వర్సిటిలో సంస్కృత ఎం.ఏ .పిహెచ్. డి చేసిన ఎఫ్.ఇరిమాల్ –ఫ్రాన్స్ లోని కేన్ లో 1945మార్చి 27 న పుట్టాడు .గురుపర౦పర –ఎల్ రెనోట్,ఏ మినారి ,సి కైలత్ .భవభూతెహ్ మహా విరచితం ,భవభూతెహ్ సమయం ,తార్కికరక్ష .అనే మూడుపుస్తకాలు రాశాడు

582-మండన మిశ్ర స్య స్పోట సిద్ధి  కర్త –కేయే ఎస్ అయ్యర్ –(1896)

7-9-1896న కేరళ పాల్ఘాట్ లోపుట్టిన కె.యస్. అయ్యర్-నారాయణ శాస్త్రి ,ప్రొఫెసర్ సిల్విన్ లేవి ,డా బ్రినేట్ ,మిసెస్ రైస్ డేవిస్ ల శిష్యుడు .ప్రొఫెసర్ సత్యవ్రట్ సింగ్ ,ప్రొఫెసర్ కేసి పాండే లవద్ద మెళకువలు నేర్చాడు .12గ్రంథాలురాశాడు వాటిలో కాళిదాస విరచితం మాలవికాగ్నిమిత్రం ,మలయాల మా మహాభారతం మండన మిశ్రస్య స్పోట విధి ,భర్తృహరి ప్రణీతం వాక్య పదీయం ఉన్నాయి .అనేక విశ్వవిద్యాలలాలో గౌరవ స్థానం పొందాడు .లక్నో,ఫ్రాన్స్ ,హాలండ్ ,బెల్జియం జర్మని స్విట్జర్లాండ్ ఆస్ట్రియా ,ఇటలీ లలోని లోని అఖిలభారతీయ సంస్కృత పరిషత్ వ్రాత ప్రతుల కేటలాగ్  చీఫ్ ఎడిటర్ .యుపి సంస్కృత సంస్థాన్ విద్వాన్ పురస్కారం ను, ప్రెసిడెంట్ అవార్డ్ ను అందుకున్నాడు .

583-శబ్ద శక్తి కర్త –విరూపాక్ష జడ్డిపాల్ –(1970)

21-7-1970న ఎల్లాపూర్ లో పుట్టిన విరూపాక్ష జడ్డిపాల్ –సంస్కృత ఇంగ్లిష్ చరిత్రలలోఎం. ఏ ..విద్యావర్ధిని తిరుపతి సంస్కృత విద్యా పీఠ౦ ప్రొఫెసర్ .శబ్దశక్తి ,టీచింగ్ ఆఫ్ సంస్కృత మొదలైన నాలుగుపుస్తకాలురాశాడు .

584-జినాష్టకావలి స్తోత్ర కర్త –అభయ్ జైన్

 సాహిత్యార్యుడైన అభయ్ జైన్  గవర్నమెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ .జినాష్టకావాలి స్తోత్రం సంపాదక కర్త .

585-సంవేగ చూడామణి కర్త –అనేకాంత కుమార జైన్ –(1978)

అనేకా౦త కుమార జైన్ 1978లో ఆగస్ట్ 16న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా దలపత్ పూర్ లో జన్మించాడు  ఢిల్లీ లోని SLBSR విద్యా పీఠ సంస్కృత ప్రొఫెసర్ .దయానంద భార్గవ శిష్యుడు .6పుస్తకాలురాశాడు .అందులో సంవేగ చూడామణి ,సద్దర్శనేషుప్రమాణ ప్రమేయ సముచ్చయ ,ఆవశ్యక నిరుక్తి ఉన్నాయి .

586-జైన ధర్మ మీమాంస కర్త –అశోక్ కుమార్ జైన్ –(1959)

1-3-1959లలితపూర్ లో పుట్టిన  అశోక్ కుమార్ జైన్- జైన దర్శన ఆచార్య .బెనారస్ హిందూ యూనివర్సిటి ప్రొఫెసర్ .జగన్నాథ ఉపాధ్యాయ ,ప్రొఫెసర్  వీరేంద్రకుమార్  వర్మల శిష్యుడు. అనే కాంతజైన్ వద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .16పుస్తకాలురాశాడు .అందులో జైనధర్మమీమాంస ముఖ్యమైనది ఆచార్య జ్ఞాన సాగర మహారాజా దార్శనిక వివేచన వగైరాలు ఇతర రచనలు .

587-నైతిక శిక్షావతికర్త –అశోక్ జైన్ (1962)

20-6-1962న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బందా లో పుట్టిన అశోక్ జైన్-సాధనే కే  సూత్రా , శిక్షావతి ,జినేంద్ర పూజావలి రాశాడు

588-అమరభారతి కర్త  –దయా చంద్ర జైన్ (1915-2006)

1915ఆగస్ట్ 11న మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా సాహ్పూర్ మార్గావ్ లో దయా చంద్ర జైన్ పుట్టి ,గణేష్ దిగంబరజజైన్ సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ అయ్యాడు .ఈయన గురుపరంపర లో –గణేష్ ప్రసాద్ వర్ని ,పండిట్ దయాచంద్ర సిద్ధాంత శాస్త్రి, పండిట్ హజారీలాల్ న్యాయ తీర్ధ ,పండిట్ ముకుల్ శాస్త్రి క్షిష్టే లోకనాథ శాస్త్రి కపాలేశ్వర ఝా , పండిట్ బాబూరాం ఝా ఉన్నారు .అమరభారతి ,శ్రీ చతుర్వింశతి సంధాన మహాకావ్య ,భగవాన మహా వీర ముక్తక స్తవం ,విశ్వతత్వ ప్రకాశ సయాద్వాద ,వార్నీజీ కా జీవన పరిచయ .12-2-2006న చనిపోయాడు

589-ప్రాచీనాభి లేఖ  కర్త -భగచంద్ర భగేందు జైన్ (1937)

ఆచార్య ,కావ్యతీర్ధ ,గాంధీ దర్శన ,సాహిత్యరత్న భగచంద్ర భగేందు జైన్1937 ఏప్రిల్ 2న మధ్యప్రదేశ్ రితి కట్నిలో పుట్టాడు .దామోPG కాలేజి  సంస్కృత హెడ్ .భోపాల్ సంస్కృత అకాడెమి  సెక్రెటరి .సంస్కృత ప్రాకృత జైన విద్యా అనుసందాన్ కేంద్ర డైరెక్టర్ .దయాచంద్ర సిద్ధాంత ,పన్నాలాల్, ప్రొఫెసర్ రాంజీ ఉపాధ్యాయ ల శిష్యుడు .సావిత్రీ జైన్ నరేంద్ర సింగ్ రాజ్ పుట్ ల వద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు .ప్రాచీనాభిలేఖ మొదలైన నాలుగు గ్రంథాలురాశాడు .లక్ష్మీదేవి జైన్ అవార్డ్ ,అహింసా ఇంటర్నేషనల్ సాహిత్య అవార్డ్ ,జైన్ రాష్ట్ర గౌరవ అలంకరణ అవార్డ్ ,కుండల్పుర పురస్కారం ,రిషభ దేవ్ పురస్కారం అందుకొన్నాడు .

590-తిలోపపన్నతి సాంస్కృతిక మూల్యాంకన కర్త –ధర్మేంద్ర జైన్ (1940)

సంస్కృత ,ప్రాకృత జైన ,క౦పాపరటివ్ మతాల లో ఎం.ఏ .అయిన ధర్మెంద్రజైన జైన దర్శనాచార్య 24-8-1940లో పుట్టాడు సాహిత్య దర్శన జైన బౌద్ధ ఆచార్య .జైపూర్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ డెవలప్ మెంట్ ఆఫీసర్ .తిలోపపన్నత్తి సాంస్కృత మూల్యాంకన అనే ఏకైక పుస్తకం రాశాడు .ముని పుణ్య అవార్డ్ గ్రహీత .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యుగా౦తాలను సూచించే దేవాలయం

 

యుగా౦తాలను సూచించే దేవాలయం

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కైలేశ్వర  గ్రామం లో యుగా౦తాలకు   సంబంధించిన ఆధారాలున్నాయి .ఇక్కడ  హరిశ్చంద్ర ఘడ్ కోట ఉంది .దీని దగ్గర గుహలాంటి నిర్మాణం ఒకటి ఉంది .గుహలో అత్య౦త పురాతన శివలింగం ఎల్లకాలమూ అయిదు అడుగుల లోతు ఉండే నీటిలో ఉంటుంది .ఈ గుడిని కేదారేశ్వర దేవాలయం అంటారు .లింగం నాలుగు స్తంభాల కప్పు లోపల ఉంటుంది. ఈ స్తంభాలు నాలుగు యుగాలకు సంకేతికాలు .ఈ ఆలయ నిర్మాణం ఎవరు, ఎప్పుడు చేశారు అన్న ఆధారాలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు .ఏ చరిత్రలోనూ లేదు .ఇక్కడి నాలుగు స్తంభాలలో ఒక్కొక్క స్తంభం ఒక్కో యుగం తర్వాత కూలి పోయిందట .ఇప్పుడు మిగిలింది కలియుగ స్తంభం ఒక్కటే .ఈస్తంభం కూలిన మర్నాడే కలియుగం అంతరించి పోతుందని విశ్వాసం .కలియుగం ఇప్పటికి 5వేల సంవత్సరాలే గడిచింది ఇంకా చాలా లక్షల సంవత్సరాలు గడవాలి కనుక మనం కంగారు ,భయం పడాల్సిన పని లేదు .

  ఈ కేదారేశ్వర దేవాలయం నాలుగు గోడలనుంచీ నిర౦తరం చల్లని నీరు ప్రవహిస్తూనే ఉండటం గొప్ప విశేషం ‘కానీ వర్షాకాలం లో మాత్రం గుడిలో చుక్క నీరు కూడా ఉండకపోవటం మరో వింత .హరిశ్చంద్ర ఘడ్  కోట విషయం అగ్నిపురాణం ,స్కాందపురాణం వగైరా పురాణాలలో చెప్పబడింది అంటే ఎంతో పురాతన కోట అని అర్ధమౌతుంది.కోటలోపల ఒక రహస్యమైన సొరంగమార్గం గుండా వెడితే అక్కడ ఒక నీటి కొలను కనిపిస్తుంది .ఇక్కడే ఉన్న శివలింగం మరకత మణి లింగం  .నీరు కూడా ఈ మరకత మణి రంగులో లింగం చుట్టూ ఉంటుంది  .కాలక్రమం లో ఆ మరకత మణి లింగం దొంగలపాలయింది .ఈ ఆలయం లో కనకాంబరం రంగులో ఉన్న వినాయక విగ్రహం మరో ఆకర్షణ .ఈ గణేశుని నిత్యం వేలాది భక్తులు సందర్శిస్తారు .ఆలయం నల్ల గ్రానైట్ రాతి నిర్మాణం .స్తంభాలపై సుందర శిల్పాలు కనువిందు చేస్తాయి .గుడిలో ఏకశిలా నందివిగ్రహం దానికెదురుగా అతి పురాతన శివలింగం కనిపిస్తాయి .

  హరిశ్చంద్ర ఘడ్ దగ్గర సప్తతరణి అనే చోట ఏడు గుహల వరుస సముదాయం ఉంటుంది .దీనికి ఒకప్రత్యేకత ఉంది .ఈ గుహల వద్ద నిలబడితే చాలు ఎసి లో ఉన్నదానికంటే అతి చల్లదనం అంటే మైనస్ డిగ్రీల చల్లదనం అనుభవించవచ్చు ఈ గుహల ఎదురుగా నీటి కొలనూ ఉన్నది .కొలను నీటి చల్లదనమో గుహల చల్లదనమో ఎవ్వరూ చెప్పలేరత అనుభవించి ఆనందం పొందుతారు .  బయట చిన్న జలపాతమూ ఆకర్షణీయమే .లోపల విశ్రాంతి తీసుకొనే చిన్న హాల్ కూడా ఉంటుంది .దీనికి అనుబంధంగా పెద్ద గణేశ విగ్రహం కూడా  తప్పక చూడాల్సిందే ..

  మీ -గబ్బిట  దుర్గాప్రసాద్-5-3-21-ఉయ్యూరు  

Posted in సమీక్ష | Leave a comment

శ్రీ శంకర విజయం తర్వాత ?

శ్రీ శంకర విజయం తర్వాత ?

  సాహితీ బంధువులకు శుభకామనలు -శ్రీశంకర విజయం తర్వాత 1-జ్ఞానదుడు నారదుడు2-శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారి కథలు 3-శ్రీ గంధం యాజ్న్య వల్క్య శర్మ గారి కథలు  సరసభారతి ఫేస్ బుక్ లో ఒకటిపూర్తయ్యాక  మరొకటి ప్రత్యక్ష ప్రసారమౌతుందని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది ..దుర్గాప్రసాద్ -5-3-21-ఉయ్యూరు
Posted in సమీక్ష | Tagged | Leave a comment

భీముడు ద్రౌపది తోకాపురమున్న ప్రదేశం

మధ్యప్రదేశ్ ఛత్తాపూర్ జిల్లా బాస్నా గ్రామం లో ద్రౌపదితో భీముడు కాపురం చేశాడని చెబుతారు .ఇక్కడే గొప్ప జలాశయంఉంది  .పంచపాండవులు ఇక్కడ కొద్దికాలమున్నారు .ఇక్కడ ఉన్న జలాశయాన్ని భీమ కుండ్ అంటారు .పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చారని ఐతిహ్యం .ఇక్కడ ఎడారుల్లాంటి కొండలు అద్భుతంగా వారికి కనిపించి ఇక్కడ ఉన్నారట .ద్రౌపది అసూర్యంపశ్య అంటే సూర్య రశ్మి తాకితే కళ్ళు తిరిగి పడిపోతుంది .ఇంత సుందర ప్రాంతం లో నీరు లేకపోవటం చూసి భీముడు గదతో కొట్టి భూ గర్భ జలాన్ని పైకి తెప్పించి మహోపకారం చేశాడు ఈ జలాశయం లోతును ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు .డిస్కవరీ చానల్ వాళ్ళు డైవర్స్ ను పంపి లోతు కనుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళు సుమారు వంద అడుగులకంటే ఎక్కువ లోతుకు   వెళ్ళ లేకపోయారట .దీనికీఅరేబియా సముద్రానికి సంబంధం ఉందని భావించారు .ఆ సముద్ర ఆలల తాకిడి తోపాటు ,సముద్రాలలో ఉండే అరుదైన జీవరాశులు అంత లోతు నీటిలో కనిపించి పెద్ద ఆశ్చర్యానికి  లోనయ్యారట .

  ఇక్కడే ఒక అద్భుత శివలింగముంది .ఎక్కడ సునామీ వచ్చినా, ఈ జలకుండం లోని నీరు దాదాపు 40అడుగుల ఎత్తునున్న శివలింగాన్ని సెకండ్ల కాలం లోనే తాకుతుందట .గుఅరాత్ ,మనీలా లలో సునామీలోచ్చినప్పుడు ఇలానే జరిగింది .ఈ కుండం లో ఎంతమంది స్నానం చేసినా స్విమ్మింగ్ పూల్ ను క్లీన్ చేస్తే యెంత క్లిస్టల్ క్లియర్ గా ఉంటుందో ఇక్కడా ఎప్పుడూ నీళ్ళు అంత స్వచ్చంగా ఉంటాయి .నారదుడు ఇక్కడ విష్ణుమూర్తి కోసం తపస్సు చేసినందువల్ల దీన్ని నారద కుండం అనీ అంటారు . విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ నీటిలో స్నానిచటం వలన ఆ నీలిమేఘశ్యాముని రంగు ఈనీటికి అంటి నీలంగా కనిపిస్తుంది . ఈ కుండును డీప్ టాంక్ అంటారు. ఇందులోని నీరు ఈ కుండానికీ  అరేబియా సముద్రానికి ,పవిత్ర గంగానదికీ సంబంధం ఉందంటారు .కానీ గంగ వెయ్యి కిలోమీటర్లదూరం లో, అరేబియా సముద్రం అయిదు వందలకిలో మీటర్ల దూరం ఉంది .

  మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ కుండం లోతు తెలుసుకొనే ప్రయత్నం లో మూడు పెద్ద పెద్ద మోటార్లు పెట్టి వారం రోజులు నీటిని బయటికి తోడేసినా, ఒక్క అంగుళం కూడా నీటి లోతు తగ్గలేదు. చేతులెత్తేసింది ప్రభుత్వం .ప్రతి సంక్రాంతికి ఇక్కడి ప్రజలు గొప్ప జాతర ఇక్కడ జరుపుతారు .నది ,సముద్రం, కాలువలలో ప్రమాదవశాన మునిగిన వారి శరీరాలు ఉబ్బి పైకి తేల్తాయి .కానీ ఇక్కడ ఎంతోమంది ప్రమాదానికి లోనై చనిపోయినా ఎవరి శవాలు బయట పడలేదట .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-21-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

మార్చి 3 బుధవారం రాత్రి మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య లతో మేమిద్దరం శ్రీ వీరమ్మతల్లి తిరుణాల లో

మార్చి 3 బుధవారం రాత్రి మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి ,మనవడు చరణ్ ,మనవరాలు రమ్య లతో మేమిద్దరం శ్రీ వీరమ్మతల్లి తిరుణాల లో

 

https://photos.google.com/u/1/share/AF1QipPoy74uXmtSXGtV7W1Lzl8f17RNkShWWbcG6N6YWhmouvyp9ji4MdD2_XbbSj4CFA

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మార్చి లోనూ విజ్రుమ్భించి పూస్తున్న డిసెంబర్లు

మార్చి లోనూ విజ్రుమ్భించి పూస్తున్న డిసెంబర్లు

 

 

https://photos.google.com/u/1/share/AF1QipMp3ybZu0GMJefqdbh2wjO7b1uoPpnw8vJEuStv_-9E4gHzM45ZwElfBPPyAcC7WA

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మూడు నామాల ‘’చేపలున్నశ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం  

మూడు నామాల ‘’చేపలున్నశ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

 

తెలంగాణా భువనగిరిజిల్లా వలిగొండ మండలం వెంకటాపురం లో శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కొండపై ఉన్నది .ఈ ఆలయవిష్ణు  పుష్కరిణి లోని చేపలన్నీ అరమీటరు పొడవుగా ఉండటం తలపై మూడు ఊర్ధ్వ నామాలు కలిగి  ఉండటం ప్రత్యేకం .అందుకే మత్ష్యగిరి అనే పేరొచ్చింది.మాత్స్యాద్రి  అనీ అంటారు .హైదరాబాద్ కు 70కిలోమీటర్ల దూరం లో ఉన్న ఆలయం .స్వామి  శ్రీమన్నారాయణ మూర్తి ఆది అవతారంగా భావిస్తారు .కొండమీదికి మెట్ల దారి ఉంది .స్లోపు గా ఉన్న దారి లో వెళ్ళటం తేలిక .పొట్టిగుట్ట అనే ఊరునుంచి స్వామి వారి దర్శనం చేప ఆకారం లో కనిపిస్తుంది .గిరిపైనుంది చూస్తె అద్భుత ప్రకృతి పులకింప జేస్తుంది .పూర్వం మునులు అర్చనకోసం కొలను కు నీరు తేవటానికి వెడితే అందులో నామాలతో ఉన్న చేపలు కనిపించాయి .అందుకే వీటిని మత్స్యావతారంగా భావించారు .యాదాద్రి తర్వాత అంతటి విశిష్టమైన ఆలయమిది .

   ఈఆలయ పుష్కరిణి నీటిని పోలాలలో చిమ్మితే పంటలకు చీడపీడలు రావు అని గొప్ప నమ్మకం .వ్యాపారస్తులు వ్యాపార సంస్థలలో చల్లుకొంటే వ్యాపారం విపరీతంగా పెరుగుతుందని విశ్వాసం .అనారోగ్యం తో ఉన్నవారు పుష్కరిణి స్నానం చేసి స్వామిని దర్శి౦చి నిద్ర చేస్తే  పూర్ణారోగ్యం కలుగుతుంది .బ్రహ్మోత్సవాలు ,నరసింహజయంతి ,ఉగాది  ఘనంగా నిర్వహిస్తారు .ధనుర్మాస ఉత్సవాలు ,గోదా రంగనాధ స్వామి కళ్యాణమూ వైభవంగా చేస్తారు ఆలయాన్ని ఆనుకొని మూడు గుండాలకలయికతో ఉన్న  కొలను అన్నికాలాల్లో ఒకే స్థాయిలో నీరు కలిగి ఉండటం ఆశ్చర్యం  .కొండ చుట్టూ కొలను నీరు ప్రవహిస్తూ వింత శోభ కలిగిస్తుంది .పుష్కరిణి లోని నామాల చేపలు సంవత్సరం లో అన్ని రోజుల్లోనూ కనిపిస్తాయి .నామాలు స్పష్టంగా కనిపిస్తాయి .శ్రావణం నుంచి కార్తీకం వరకు పుష్కలంగా కనిపిస్తాయి .సంతానం లేనివారు పుష్కరిణిలో స్నానించి ,దగ్గరలో ఉన్న ఒక చెట్టుకు కొబ్బరి కాయలు ముడుపుగా కడతారు .పుష్కరిణి నీటిని 11 రోజులు తీర్ధంగా సేవిస్తే వ్యాధులు మటుమాయం అంటారు  .స్వామివారి అర్చన ,అభిషేకాలకు ఈ జలాన్నే ఉపయోగిస్తారు .ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామ రూపంగా లక్ష్మీ సమేతంగా శంకు చక్రాలతో దర్శనమిస్తాడు .చక్రం లో స్వామివారి ముఖం మధ్యలో నామం ,చేప ఉదరభాగం గా చివరి శంఖంచేప తోకగా దర్శనమనుగ్రహిస్తాడుస్వామి .క్షేత్రపాలకుడు శ్రీ ఆ౦జనేయ స్వామి.గోదా దేవి సీతారామస్వామి దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్  -3-3-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్

స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్

 01/03/2021 గబ్బిట దుర్గాప్రసాద్

← Back

Thank you for your response. ✨

బానిస తలిదండ్రులకు అరమింటా రాస్ గా 18 22 మార్చి లో అమెరికాలోని మేరీ లాండ్ రాష్ట్రం డార్చేస్టర్ కౌంటీ లో పుట్టిన హారియట్ తప్పించుకొని ,13సార్లు ప్రయత్నించి,తన కుటుంబం వారు, స్నేహితులతో సహా 70మంది పుట్టు బానిసలకు సురక్షిత గృహాలనబడే ‘’అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ‘’సీక్రెట్ కోడ్ ద్వారా బానిస విముక్తికై ఉద్యమిస్తూ విముక్తి కల్గించిన ధీరవనిత .అమెరికన్ అంతర్యుద్ధం లో యూనియన్ ఆర్మీలో సాహుధ స్కౌట్ గా ,గూఢచారిగా పని చేసి మెప్పించిన సాహస స్త్రీ .మహిళా వోటు హక్కు ఉద్యమానికీ నాయకత్వం వహించిన సంస్కర్త.

బానిసకుటుంబం లో పుట్టటం వలన బాల్యంలో అనేక మంది తలిదండ్రుల చేత కొరడాలతో చావు దెబ్బలు తిని ఒకసారి ఒక ఓవర్ సీర్ విసిరిన బరువైన ఇనుప వస్తువు తగిలి తలకు తీవ్రగాయమై నరకయాతన అనుభవించింది. ఈ దెబ్బకు ఆమె తలనొప్పి, అతి నిద్ర జబ్బు పట్టుకొని జీవితాంతం బాధించాయి .ఆఫలితం గా వి౦తకలలు ,విజన్ వచ్చేవి .ఇవి దైవ సంకల్పాలుగా భావించేది .వీటికి తోడు మెథడిస్ట్ చర్చి భావాలు కూడా తోడై పూర్తిగా మత ఆరాధకురాలైంది .

1849లో పారిపోయి ఫిలడేల్ఫియాకు చేరి ,మళ్ళీ మేరీ లాండ్ వచ్చి తన కుటుంబానికి బానిస విముక్తి కలిగించాలని భావి౦చి నెమ్మది నెమ్మదిగా ఒక్కో సారి ఒక్కొక్క బృందాలవారీగా వారిని ఆ రాష్ట్రం దాటించింది .1849 సెప్టెంబర్ 17న టబ్ మన్ ఆమె సోదరులు బెన్, హారీ లతో పాటు తప్పించుకొని పారిపోయింది .ఆమె పూర్వ యజమాని కొడుకు,దగ్గరలోని కరోలిన్ కౌంటీ లో పోప్లార్ నెక్ లో వందలాది ప్లాంటేషన్ ఎకరాలున్న ఆంధోనీ థాంప్సన్ కు అద్దె కు వెళ్ళింది .ఈ విధంగా బానిసలను అద్దెకు తీసుకోవటం ఆనాడు ఎక్కువగా జరుగుతూ ఉండేది .పూర్వ యజమాని ఆమె పారి పోయిందని అనుకోలేదు .కేంబ్రిడ్జి డెమొక్రాట్ పేపర్ లో తిరిగి వచ్చిన బానిసకు వంద డాలర్ల బహుమతి అనే ప్రకటన పడింది .ఆమె సోదరులు ఆమెను కూడా బలవంతంగా ఒప్పించి పాత యజమాని ని చేరారు .రెండో సారి ఆమె ఒక్కత్తే తప్పించుకొని వెళ్ళింది .ఒక సీక్రెట్ నెట్ వర్క్ ‘’అండర్ గ్రౌండ్ రైల్వే ‘’ఏర్పాటు చేసుకొని ఉచితంగా ఫీజు లేకుండా బానిసలకు, బానిసత్వ వ్యతిరేకులైన తెల్లవారికీ విషయాలు తెలిపేది .వీరిలో రిలీజియస్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు .వీళ్ళనే ‘’క్వేకర్స్’’ అంటారు .పోప్లార్ నెక్ కు దగ్గరలో ఉన్న ప్రేస్టాన్ లో క్వేకర్స్ ఎక్కువమంది ఉండేవారు .ఆమె తప్పించుకోన్నప్పుడు మొదటి హాల్ట్ ఇక్కడే .ఇక్కడి నుంచి చోప్ టాంక్ రివర్ మీదుగా డెలావర్ చేరి ,తర్వాత పెన్సిల్వేనియా కు వెళ్ళేవారు .ఇదంతా సుమారు 90 మైళ్ళు అంటే 145కిలోమీటర్లదూరం. అంతా కాలినడకే .దాదాపు 27రోజులు పట్టేది .

డజన్లకొద్దీ బానిసలకు ప్రేరణ కలిగించి బానిసత్వం నుంచి తప్పించుకోవటానికి మార్గ దర్శకురాలైంది .రాత్రి పూట అత్యంత రహస్యంగా ధృవ నక్షత్రం అంటే’’ నార్త్ స్టార్’’వెలుగులో ‘’మోసెస్ ‘’అనే మారు పేరుతొ ,ఎవరికంటబడకుండా తిరుగుతూ వారిని తప్పించేది .ఎప్పుడూ ఏ ఒక్కరూ మళ్ళీ దొరకకుండా తప్పించిన నేర్పు ఆమెది . ఫ్రెండ్స్ ఇంట్లో ఉదయం ఊడుపు అవీ చేస్తూ పనిమనిషిలా ఉండేది. రాత్రిపూట ఆఇంటి వారు బండీ లో వేరే ఫామిలీ ఫ్రెండ్ ఇంటికి చేర్చేవారు .అక్కడి అడవులు పొదలు అన్నీ ఆమెకు పరిచయమే.కనుక పగటిపూట ఎవరికీకనపడకుండా అక్కడే దాక్కునేది .1850లో పారిపోయిన బానిసత్వ విషయమై చట్టం అమలులోకి వచ్చాక ,ఆ బానిసలను సుదూరం లో ఉన్న బ్రిటిష్ నార్త్ అమెరికా అనబడే కెనడాకుచేరుకోవటానికి సహకరించి ,కొత్తగా బానిసత్వ విమోచ నత్వం పొందినవారికి అండగా నిలబడి వారి బ్రతుకు తెరువుకు దారి చూపింది .పారిపోయాక మళ్ళీ 1951లో మొదటిసారి డాచేస్టర్ కొంటీకి వచ్చి ,తనభర్త జాన్ ను చూసి ,అనేక ఉద్యోగాలు చేసి సంపాదించిన డబ్బు తో అతనికి ఒక ఇల్లుకొనిపెట్టి ,మళ్ళీ సౌత్ కు వెళ్ళిపోయింది .భర్త ఇంకో పెళ్లి చేసుకొన్నా, ,తనదగ్గరకు రమ్మన్నా వినకపోయినా’’ సీన్ క్రియేట్’’ చేయకుండా కోపం దిగమింగుకొని ,అక్కడి నుంచి తప్పించుకోవాలనుకోన్నబానిసలకు ఫిలడెల్ఫియా వెళ్ళటానికి సాయం చేసింది .ఆతర్వాత పదహారేళ్ళకు భర్తజాన్ ఒక తెల్ల వాడి తో జరిగిన వివాదం లో హత్య చేయబడ్డాడు .

.1858లో జాన్ బ్రౌన్ కు అండగా నిలబడి హార్పర్స్ ఫెర్రీ పై దాడికి 1959లో మనుషులను ఆసరాగా పంపింది .ఫెడ్రిక్ డగ్లస్ అనే బానిస విమోచననాయకుడి ఇంట్లో పారిపోయిన బానిసలనుంచగా ఆయన , డబ్బు సమకూర్చి వారిని సురక్షితంగా కెనడా చేర్పించాడు . .తనమూడవ ఆత్మకధలో డగ్లాస్ ‘’ On one occasion I had eleven fugitives at the same time under my roof, and it was necessary for them to remain with me until I could collect sufficient money to get them on to Canada. It was the largest number I ever had at any one time, and I had some difficulty in providing so many with food and shelter. … “[65] The number of travelers and the time of the visit make it likely that this was Tubman’s group.

అమెరికన్ అంతర్యుద్ధం ప్రారంభమైనప్పుడు టబ్ మన్ యూనియన్ ఆర్మీలో వంటమనిషిగా చేరి, నర్సుగా పనిచేసి ,తర్వాత సాయుధ స్కౌట్ గా, స్పై గా సేవలు అందించింది .కాంబ్ హీ ఫెర్రీ పై సాయుధ దాడి జరిపిన మొదటి స్త్రీ నాయకురాలిగా గుర్తి౦పు పొందింది .ఈదాడి ఫలితంగా 700 మంది బానిసలకు శాశ్వత విముక్తి కలిగించింది .సివిల్ వార్ పూర్తయ్యాక 1859లో సైన్యం లో రిటైరై,న్యూయార్క్ దగ్గర ఆబర్న్ లో తాను కొనుక్కొన్న ఇల్లు, స్థలం లో ఉంటూ ముసలి తలితండ్రులను చూసుకొంటూ ఉంది .స్త్రీ వోటు హక్కు కోసం నిరంతరం పోరాటం చేసింది .తనకూ టబ్ మాన్ కు బానిసల సేవలో తేడా వివరిస్తూ డగ్లాస్ ఇలారాశాడు ‘’ The difference between us is very marked. Most that I have done and suffered in the service of our cause has been in public, and I have received much encouragement at every step of the way. You, on the other hand, have labored in a private way. I have wrought in the day – you in the night. … The midnight sky and the silent stars have been the witnesses of your devotion to freedom and of your heroism. Excepting John Brown – of sacred memory – I know of no one who has willingly encountered more perils and hardships to serve our enslaved people than you have.[66]

‘’మింటీ’’ అనే ముద్దు పేరుతొ పిలువబడిన ఈమె దాదాపు అయిదు అడుగుల ఎత్తు ఉండేది .ఆమె తప్పించుకు పోయాక ఆమెను పట్టి అప్పగిస్తే 40వేలడాలర్ల రివార్డ్ ప్రకటించారు .1860లో బానిసల ను విడిపించటానికి ఆమె చివరి ప్రయత్నం చేసింది .తనసోదరి రాఖేల్ ను,పిల్లలను విడిపించలేకపోయింది .మళ్ళీ తిరిగొచ్చాక రాఖేల్ చనిపోయిందని తెలిసింది .ఇద్దరు పిల్లల్ని విడిపించటానికి ఒక్కక్కరికి 30డాలర్లు ఖర్చు చేయాలన్నారు .అంతడబ్బు ఆమె వద్ద లేదు .కనుక వారిద్దరూ బానిసలుగానే ఉండిపోవాల్సి వచ్చింది .ఎన్నాలిస్ ఫామిలిని నార్త్ కు తీసుకు వెళ్ళటానికి సాయం చేసింది .చలి విపరీతంగా ఉంది .తిండిసరిగా లేదు .స్లేవ్ కాచర్స్ కంటబడకుండా ఎంతో నేర్పుగా ప్రయాణ౦ చేయించి 28-12-1860 న ఆబర్న్ లో ఉన్న డేవిడ్ ,మార్తాదంపతుల ఇంటికి చేర్చింది సురక్షితంగా .

చివరి రోజుల్లో ఆబర్న్ లో ఉంటూ అనేకపనులు చేస్తూ డబ్బు సంపాదించి ముసలి తలిదండ్రుల సంరక్షణ చేసింది .అక్కడే బ్రిక్ లేయర్ గా పనిచేస్తున్న అయిదు అడుగుల 11అంగుళాల పొడవున్న నెల్సన్ చార్లెస్ డేవిస్ తో ప్రేమలోపడి అతడు తనకంటే 22ఏళ్ళు చిన్నవాడైనా18-3-1869న పెళ్లి చేసుకొన్నది .ఈ దంపతులు ఒక అమ్మాయిని దత్తత చేసుకొన్నారు .భర్త నెల్సన్ టి.బి.వ్యాధితో 1888లో చనిపోయాడు .

టబ్ మాన్ అభిమానులు స్నేతులు ఆమెకోసం నిధి సేకరించి అందించారు.సారాహాప్కిన్స్ బ్రాడ్ ఫోర్డ్ అనే అభిమాని ఆమె జీవిత చరిత్రను ‘’సీన్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ హారియట్ టబ్ మాన్ ‘’పేరుతొ రాసి 1869ప్రచురించగా దీనిపై ఆమెకు 1200డాలర్ల ఆదాయం వచ్చింది .దీనినే మార్పులు చేసి ‘’హారియట్ ది మోజెస్ ఆఫ్ హర్ పీపుల్’’గా రాసి ప్రచురించాడు ఈ రెండు పుస్తకాలలోనూ ఆమెను ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ‘’గా ప్రస్తుతించాడు.1896లో ‘’నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఆఫ్రో –అమెరికన్ వుమెన్ ‘’ఏర్పడినప్పుడు ఆమె కీలక ప్రసంగం చేసింది .దేశమంతా ఆన౦దోత్సవాలు జరిపారు ..ఉమెన్స్ ఎరా ‘’అని ‘’ఎమినేంట్ వుమన్ ‘’అనీ పేపర్లన్నీ పెద్దపెద్ద శీర్షికలతో రాశాయి .1897లో బోస్టన్ పట్టణం ఆమెసేవకు జాతీయగౌరవం కలిపించి సత్కరించింది .

20వ శతాబ్ది ప్రారంభం లో అంటే 1903లో ఆబర్న్ లోని ‘’ ఆఫ్రికన్ మేధడిస్ట్ ఎపిస్కోపల్ జియాన్ చర్చ్’’కి తనకున్న రియల్ ఎస్టేట్ లోకొంత రాసిచ్చి ముసలి నల్లజాతి వారి సంక్షేమానికి ఒక భవనం కట్టించమని కోరింది .కాని అయిదేళ్ళ వరకూ ఆపని జరగనేలేదు.అందులో ఉండేవారు వందడాలర్లు ప్రవేశ రుసుముకట్టాలని నిబంధన పెడితే నిరాశ పడిఇలా అన్నది –‘’ ]hey make a rule that nobody should come in without they have a hundred dollars. Now I wanted to make a rule that nobody should come in unless they didn’t have no money at all.”[168]

కాని ‘’హారియట్ టబ్ మాన్ హోం ఫర్ దిఏజ్డ్’’ ను 23-6-1908 న ప్రారంభించినపుడు ఆమె గెస్ట్ ఆఫ్ ఆనర్ గా హాజరయింది .చిన్ననాటి తలగాయం మళ్ళీ బాధ పెట్టి తరచూ తలనొప్పి వచ్చేది ,దీనికి ఆమె బోస్టన్ లోని ‘’మెసా చూసేట్స్ జనరల్ హాస్పిటల్ ‘’లో మత్తుమందు లేకుండానే బ్రెయిన్ సర్జరీ చేయి౦చుకొన్నది .1911లో బాగా బలహీనమైతే ఆమెను ఆమెపెరనే ఉన్న వృద్ధాశ్రమం లో చేర్చారు .’’ఇల్ అండ్ పెన్నిలెస్’’గా ఉన్న ఆమె కోసం మిత్రులు అభిమానులు నిధి సేకరించారని న్యూయార్క్ పత్రిక రాసింది .స్నేహితులు కుటుంబసభ్యుల మధ్య న్యుమోనియాతో టబ్ మాన్ 10-3-1913 న 92వ యేట మరణించింది .ఆమెపేర మ్యూజియం లు చారిత్రక కట్టడాలు వెలిశాయి .ఆమె బొమ్మతో 20డాలర్ల నోటు 2016లో ముద్రించి గౌరవించారు .హారియట్ టబ్ మాన్ ప్రైజ్ ఏర్పాటయింది .ఆమె జీవితం సేవలపై నాటకాలు నవలలు రేడియో టివి షోలు సినిమాలు వచ్చాయి .నాటకశాలలు ,సినిమాహాళ్ళు నిర్మించారు .చాలా అవార్డులు ఆమె పేరిట నెలకొల్పారు .2007లో ‘’హారియట్ టబ్ మాన్ –మిత్ ,మెమరి అండ్ హిస్టరీ ‘’అనే గొప్ప పుస్తకం విడుదలై ఆమెను చిరస్మరణీయురాలను చేసింది .

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు 4-4-21 ఆదివారం

అక్షరం లోక రక్షకం

సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు

సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ,  మరియు ఉయ్యూరు  రోటరీక్లబ్  సంయుక్త ఆధ్వర్యం లో ,కె.సి.పి.షుగర్ ఫాక్టరీ వద్ద గల రోటరీ ఆడిటోరియం లో సరసభారతి 157వ కార్యక్రమంగా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను   4-4-21 ఆదివారం సాయంత్రం 3.00  గం నుండి నిర్వహిస్తున్నాము . భక్తి సంగీత విభావరి ,.మూడు పుస్తకాల ఆవిష్కరణ ,కవి సమ్మేళనం ప్రముఖులకు జీవన సాఫల్య ,,ఉగాది ,ప్రత్యేక,స్వయం సిద్ధ ,శ్రమశక్తి  ,పురస్కారప్రదానాలు  జరుగును  . అతిథులు,. ,కవిమిత్రులు,పురస్కార గ్రహీతలు ,.సాహిత్య ,సంగీతాభిమానుల౦దరికి శ్రీ ప్లవ ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాము .  ,పాల్గొని  జయప్రదం చేయ ప్రార్ధన .

     కార్యక్రమ వివరాలు

ఆత్మీయ అతిథులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు

                        శ్రీ జి.వెంకటేశ్వరావు –సియివో –కె.సి.పి .అండ్ కె .ఐ.సి. –ఉయ్యూరు

                        శ్రీ  చి౦దా వీర వెంకట కుటుంబ రాజు  -రోటరీ క్లబ్ అధ్యక్షులు –ఉయ్యూరు

                   కార్యక్రమ వివరాలు

4-4-21 ఆదివారం మధ్యాహ్నం -3గం.లకు –అల్పాహారం

సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

సభ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్య దర్శి

మధ్యాహ్నం -3-30నుండి 4-30వరకు -1-‘’రామాయణ గానం ‘’ .శ్రీ కంభంపాటి సోదరులు –హైదరాబాద్

నిర్వహణ సహకారం –శ్రీ పంతుల వెంకటేశ్వరావు ,శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ

కవి సమ్మేళనం –సాయంత్రం 4.30గం నుండి 5-30 గం వరకు

అంశం –‘’నేటి ప్రజాస్వామ్యం ‘’

నిర్వహణ –శ్రీ శిష్టు సత్యరాజేష్ –కవి భావుకుడు విమర్శకుడు ,గోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు-అమలాపురం ,శ్రీమతి గుడిపూడి రాధికారాణి-ప్రముఖ కవి రచయిత్రి –మచిలీపట్నం

మనవి -5 పద్యాలుకానీ ,15పంక్తుల వచనకవిత్వానికి పరిమితం .చదివిన కవిత కాపీ సరసభారతికి అందజేయ మనవి .

3-సాయంత్రం 5-30నుంచి 5-45గం వరకు – శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచించి(25,26), ,సరసభారతి ప్రచురించిన(37,38,39) 3 గ్రంథాల ఆవిష్కరణ –అతిధుల చే

1-Nuclear scientist  Dr.Akunuri   Venkata Ramayya –(శ్రీ దుర్గాప్రసాద్ రాసిన  అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య పుస్తకం కు ఆంగ్లానువాదం )-స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)

2-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష – స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా) –ముందుమాటలు రాసినవారు -1.డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు ,పరశు రామాయణం వంటి సంస్కృత గ్రంథ రచయిత,జ్యోతిష్య పండితులు –పొన్నూరు 2-డా.పుట్టపర్తి నాగపద్మిని గారు –సంస్కృత, ఆంద్ర, ఆంగ్ల, హిందీ భాషా విదుషీమణి ,రచయిత్రి, విమర్శకురాలు –హైదరాబాద్ .

3-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు .ముందుమాటలు రాసినవారు –డా .వెంపటి కుటుంబ శాస్త్రి గారు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ పూర్వ వైస్ చాన్సలర్ ,అంతర్జాతీయ సంస్కృత సంస్థ అధ్యక్షులు 14,,15,16,17వ విశ్వ సంస్కృత సమ్మేళనం నిర్వహించిన వారు ,విస్తృత వేద అధ్యయన నిర్వహణ బోర్డ్ సభ్యులు ,బహు గ్రంథ కర్త ,కృష్ణాజిల్లా టేకుపల్లి వాస్తవ్యులు  ప్రస్తుతం పూణే నివాసి .

4- సాయంత్రం -5-45 గం నుండి రాత్రి 7-30గం వరకు

సరసభారతి జీవన సాఫల్య ,ఉగాది పురస్కార ,ప్రత్యేక పురస్కార, స్వయం సిద్ధ ,శ్రమశక్తి పురస్కారప్రదానం ,పురస్కార గ్రహీతల అభిభాషణం

   జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు

1-శ్రీ ఉప్పులూరి .సుబ్బరాయ శర్మ   –ప్రముఖ ,నాటక ,రేడియో, టి.వి..సినిమా నటులు –హైదరాబాద్

2-శ్రీ బెల్లం కొండ నాగేశ్వరావు   –వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ,ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్,తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత ,తెలుగు భాషోద్యమ సమాఖ్య నాయకులు –చెన్నై  ,

3-శ్రీ చలపాక ప్రకాష్   –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు ,కవి ,కధకులు విమర్శకులు,ప్రచురణ కర్త –విజయవాడ  .

5-కీ.శే.విద్వాన్ శ్రీ గబ్బిట  మృత్యుంజయశాస్త్రి ,శ్రీమతి భవానమ్మదంపతుల స్మారక ఉగాది సాహితీ పురస్కార ప్రదానం

   గ్రహీతలు

 1-శ్రీ కట్టా నరసింహులు –కడప బ్రౌన్ స్మారక లైబ్రరి ట్రస్ట్ పూర్వ కార్యదర్శి ,శ్రీతిరుమలతిరుపతి దేవస్థానం పోతన భాగవత  ప్రాజెక్ట్ సభ్యులు –తిరుపతి

2-డా .శ్రీమతి చిల్లర భవానీ దేవి –బహు ప్రక్రియల రచయిత్రి –హైదరాబాద్

3-డా శ్రీమతి నోముల నర్మదా రెడ్డి –ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,పర్యాటక రచయిత్రి ,గాయని ,బాడ్ మింటన్,రన్నింగ్ చాంపియన్ –హైదరాబాద్

4-శ్రీ రహ్మనుద్దీన్ షేక్ –ప్రసిద్ధ తెలుగు అంతర్జాల నిపుణులు –విజయవాడ

5-శ్రీ కానూరి బదరీనాథ్- విశిష్ట  చారిత్రిక పరిశోధకులు ,ప్రాంతీయ చరిత్ర రచయిత-తణుకు.

6-శ్రీ కంభంపాటి  సుబ్రహ్మణ్యం – ఉయ్యూరులో’’1960-70 లో  ఆర్ట్ ఫిలిం’’ ప్రదర్శనకు ‘’ఫిలిం క్లబ్’’ స్థాపించిన విజనరి,,రిటైర్డ్ స్టేట్ బాంక్ మేనేజర్ –విశాఖ పట్నం

6-సరసభారతి ప్రత్యేక పురస్కార ప్రదాన౦

    గ్రహీతలు

  1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు ,సుమధుర గాయని-ఉయ్యూరు

 2-డా.దీవి చిన్మయ –సరసభారతి ఉపాధ్యక్షులు,,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు –ఉయ్యూరు

3-శ్రీమతి కోనేరు కల్పన-ప్రముఖ రచయత్రి ,విశిష్ట సాహితీ సేవాకర్త –విజయవాడ

4—శ్రీ ‘’హాస్యదండి’’ భట్ల దత్తాత్రేయ శర్మ –తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య కోశాధికారి ,హాస్యలహరి కార్యదర్శి ,ప్రముఖ కవి ,విమర్శకులు,,సంస్కృతాంధ్ర సాహిత్య ప్రజ్ఞానిధి స్వర్గీయ  శ్రీ కె.వై.ఎల్ .యెన్. కళాపీఠ౦ స్థాపకులు  –మచిలీపట్నం

5-శ్రీ పంతుల వెంకటేశ్వరావు –శారదా సమితి స్థాపకులు ,ప్రసిద్ధకవి ,రచయిత  –విజయవాడ

6-దావులూరి రాదాకృష్ణ మూర్తి –సీనియర్ జర్నలిస్ట్ ,విశిష్ట యోగాచార్య –ఉయ్యూరు

6-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గార్ల -స్వయం సిద్ధ ఉగాది పురస్కారప్రదానం

   గ్రహీతలు

1-శ్రీ గాదిరాజు రంగరాజు –ప్రముఖ కవి ,విశ్లేషకులు –ఉండి

2-శ్రీ ధూళిపాళ రామభద్ర ప్రసాద్ ––తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త ,-గుడివాడ

3-శ్రీమతి పి.శ్రీవల్లి –లైబ్రేరియన్ –సారస్వత  నికేతనం –వేటపాలెం

4-శ్రీ జమ్మలమడక శ్రీనివాస్ –అసిస్టెంట్ సెక్రెటరి ,లాండ్ డిపార్ట్ మెంట్ –విజయవాడ

5-శ్రీ జంపాన శ్రీనివాస గౌడ్ –మాజీ సర్పంచ్ ,విశిష్ట సామాజిక సేవాకర్త –గురజాడ

6-శ్రీ వీరమాచనేని బాలగంగాధరరావు –సరసభారతి సాంకేతిక నిపుణులు –ఉయ్యూరు

7-శ్రీ వెంట్రప్రగడ వీరా౦జనేయులు –ప్రముఖ సాంఘిక ,సాంస్కృతిక, ధార్మిక సేవా బంధు  –ఉయ్యూరు

8-శ్రీ గుర్రాల  నాగేంద్రరావు –అమృత ఎలెక్ట్రికల్స్ –ఉయ్యూరు –

9-శ్రీ తాడంకి సత్యపవన్ –కంప్యూటర్ మెకానిక్ –ఉయ్యూరు

7-శ్రమశక్తి పురస్కార ప్రదానం –గ్రహీతల పేర్లు తరువాత తెలియజేస్తాము .

8-రాత్రి 7.30గం.లకు విందు

కవి సమ్మేళనం లో పాల్గొను కవిమిత్రులు

అక్షరం ప్రభాకర్ –మానుకోట –వరంగల్ జిల్లా, శ్రీ యల్లాప్రగడ విజయరామరాజు –గుంటూరు -శ్రీ శిష్టు సత్య రాజేష్ –అమలాపురం ,శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ తుమ్మోజు రామలక్ష్మణా చార్యులుశ్రీ బందా వెంకట రామారావు,శ్రీ కంది కొండ రవి కిరణ్ ,శ్రీ పంతుల వెంకటేశ్వరావు ,శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ రొయ్యూరు సురేష్ ,శ్రీ విష్ణుభొట్ల రామకృష్ణ, శ్రీ కొక్కుర వెంకటేశ్వరరావు,శ్రీ బొడ్డపాటి చంద్ర సేఖరరావు ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ ,శ్రీమతి మందరపు హైమవతి ,శ్రీమతి వి.శ్రీ ఉమామహేశ్వరి ,శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని , శ్రీమతి వడ్డాది లక్ష్మీసుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి,శ్రీమతి కోనేరుకల్పన,శ్రీమతి ఎస్.అన్నపూర్ణ ,శ్రీమతి కొమాండూరి కృష్ణా,శ్రీమతి మద్దాలి నిర్మల ,శ్రీమతి సామినేని శైలజ ,శ్రీమతి డి.స్వాతి ,శ్రీమతి విజయశ్రీ దుర్గ ,శ్రీమతి పి.వాణీ రామకృష్ణ ,శ్రీమతి మాచిరాజు మీనాకుమారి ,శ్రీమతి సోమరాజుపల్లి విజయకుమారి ,శ్రీమతి తుమ్మల స్నిగ్ధమాధవి (విజయవాడ )డా జి.విజయకుమార్ (నందిగామ ) శ్రీ వసుధ బసవేశ్వరరావు ,శ్రీ వి.రాఘవాచారి ,శ్రీ జి.మాల్యాద్రి ,శ్రీమతి పుట్టి నాగలక్ష్మి (గుడివాడ )శ్రీమతి పి.శేషుకుమారి (నెప్పల్లె )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (ఆకునూరు )శ్రీ కాట్రగడ్డ వెంకటరావు (గూడూరు )శ్రీమతి వారణాసి సూర్యకుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి.మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీమతి కందాళ జానకి, శ్రీ మహమ్మద్ సిలార్(మచిలీ పట్నం )శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీమాది రాజు శ్రీనివాస శర్మ ,శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి (ఉయ్యూరు )

  సభ నిర్వహణ సహకారం –డా.గుంటక  వేణు గోపాలరెడ్డి ,డా.దీవి చిన్మయ ,శ్రీ గబ్బిట రామనాథబాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతంరాజు మల్లిక,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ చౌడాడ చిన అప్పలనాయుడు .

   ఆహ్వాని౦చు వారు

శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు

శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్యదర్శి

శ్రీ గబ్బిట వెంకట రమణ –సరసభారతి కోశాధికారి

శ్రీ వి.బి.జి .రావు-సరసభారతి సాంకేతిక నిపుణులు

మరియు రోటరీ క్లబ్ ఉయ్యూరు

 ఉగాది శుభాకాంక్షలు

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

ఉయ్యూరు-1-3-21.

మార్చి రెండవ వారం లో పూర్తి వివరాలతో ముద్రించిన ఆహ్వాన పత్రం అంద జేస్తాం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకలు 2021

అక్షరం లోక రక్షకం

సరసభారతి శ్రీ ప్లవ ఉగాది వేడుకలు

-సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ,  స్థానిక రోటరీక్లబ్ సంస్థ తో కలిసి ,కె.సి.పి.షుగర్ ఫాక్టరీ వద్ద గల రోటరీక్లబ్ ఆడి టోరియం లో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ( ఉగాదికి పదిరోజులముందు) 4-4-21 ఆదివారం సాయంత్రం 3.30  గం లకునిర్వహింపబడును . .సాహిత్య ,సంగీతాభిమానులు ,కవిమిత్రులు  విచ్చేసి,పాల్గొని  జయప్రదం చేయ ప్రార్ధన .

     కార్యక్రమ వివరాలు

1-‘’రామాయణ గానం ‘’ .శ్రీ కంభంపాటి సోదరులు –హైదరాబాద్  –

2- ‘’నేటి ప్రజాస్వామ్యం ‘’ అంశం పై –ప్రముఖ కవి మిత్రులచే –కవి సమ్మేళనం

3- శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచించి(25,26), ,సరసభారతి ప్రచురించిన(37,38,39) 3 గ్రంథాల ఆవిష్కరణ –

1-Nuclear scientist  Dr.Akunuri   Venkata Ramayya –(శ్రీ దుర్గాప్రసాద్ రాసిన  అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య పుస్తకం కు ఆంగ్లానువాదం )-స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)

2-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష – స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా) –ముందుమాటలు రాసినవారు -1.డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు ,పరశు రామాయణం వంటి సంస్కృత గ్రంథ రచయిత,జ్యోతిష్య పండితులు –పొన్నూరు 2-డా.పుట్టపర్తి నాగపద్మిని గారు –సంస్కృత, ఆంద్ర, ఆంగ్ల, హిందీ భాషా విదుషీమణి ,రచయిత్రి, విమర్శకురాలు –హైదరాబాద్ .

3-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు .ముందుమాటలు రాసినవారు –డా .వెంపటి కుటుంబ శాస్త్రి గారు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ పూర్వ వైస్ చాన్సలర్ ,అంతర్జాతీయ సంస్కృత సంస్థ అధ్యక్షులు 14,,15,16,17వ విశ్వ సంస్కృత సమ్మేళనం నిర్వహించిన వారు ,విస్తృత వేద అధ్యయన నిర్వహణ బోర్డ్ సభ్యులు ,బహు గ్రంథ కర్త ,కృష్ణాజిల్లా టేకుపల్లి వాస్తవ్యులు  ప్రస్తుతం పూణే నివాసి .

4- సరసభారతి జీవన సాఫల్య పురస్కారప్రదానం

   గ్రహీతలు

1-శ్రీ ఉప్పులూరి .సుబ్బరాయ శర్మ గారు  –ప్రముఖ ,నాటక ,రేడియో, టి.వి..సినిమా నటులు –హైదరాబాద్

2-శ్రీ బెల్లం కొండ నాగేశ్వరావు  గారు –వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ,ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్,తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత ,తెలుగు భాషోద్యమ సమాఖ్యనాయకులు –చెన్నై  ,

3-శ్రీ చలపాక ప్రకాష్ –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు ,కవి ,కధకులు విమర్శకులు,ప్రచురణ కర్త –విజయవాడ

5-కీ.శే.విద్వాన్ శ్రీ గబ్బిట  మృత్యుంజయశాస్త్రి ,శ్రీమతి భవానమ్మదంపతుల స్మారక ఉగాది సాహితీ పురస్కార ప్రదానం

   గ్రహీతలు

 1-శ్రీ కట్టా నరసింహులు –కడప బ్రౌన్ స్మారక లైబ్రరి ట్రస్ట్ పూర్వ కార్యదర్శి ,శ్రీతిరుమలతిరుపతి దేవస్థానం పోతన భాగవత  ప్రాజెక్ట్ సభ్యులు –తిరుపతి

2-డా .శ్రీమతి చిల్లర భవానీ దేవి –బహు ప్రక్రియల రచయిత్రి –హైదరాబాద్

3-డా శ్రీమతి నోముల నర్మదా రెడ్డి –ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,గాయని ,బాడ్ మింటన్,రన్నింగ్ చాంపియన్ –హైదరాబాద్

4-శ్రీ రహ్మనుద్దీన్ షేక్ –ప్రసిద్ధ తెలుగు అంతర్జాల నిపుణులు –విజయవాడ

6-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గార్ల -స్వయం సిద్ధ ఉగాది పురస్కారప్రదానం

   గ్రహీతలు

1-శ్రీ గాదిరాజు రంగరాజు –ప్రముఖ కవి ,విశ్లేషకులు –ఉండి

2-శ్రీ ధూళిపాళ రామభద్ర ప్రసాద్ ––తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త ,-గుడివాడ

3-శ్రీమతి పి.శ్రీవల్లి –లైబ్రేరియన్ –సారస్వత  నికేతనం –వేటపాలెం

4-శ్రీ జమ్మలమడక శ్రీనివాస్ –అసిస్టెంట్ సెక్రెటరి ,లాండ్ డిపార్ట్ మెంట్ –విజయవాడ

5-శ్రీ జంపాన శ్రీనివాస గౌడ్ –మాజీ సర్పంచ్ ,విశిష్ట సామాజిక సేవాకర్త –గురజాడ

6-గుర్రాల  నాగేంద్రరావు –అమృత ఎలెక్ట్రికల్స్ –ఉయ్యూరు –

7-శ్రమశక్తి పురస్కార ప్రదానం –గ్రహీతల పేర్లు తరువాత తెలియజేస్తాము .

                                       ఆహ్వానించు వారు

    గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు, మరియు రోటరీ క్లబ్ ఉయ్యూరు -25-2-21

మార్పులు , చేర్పులతో ,పూర్తి వివరాలతో ఫైనల్ ఆహ్వాన పత్రిక మార్చి రెండవవారం లో అందజేయ బడుతుంది .

 తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వార్తాపత్రిక లో

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణి సింగిరి దాసు

మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణిసింగిరి దాసు

ఒంగోలు మండలం  వెంకటాపురం లో 1840 శార్వరి జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు కామరాజు కృష్ణయ్య ,రామ లక్ష్మమ్మ దంపతులకు సింగిరి దాసు జన్మించాడు .బాల్యం నుంచి జంతువులపై ప్రేమ ఎక్కువ .తల్లి అన్నానికి పిలిస్తే ,ఆడుకొనే కుక్కపిల్లల్ని కూడా వెంట తెచ్చుకొని వాటితో కలిసి తినేవాడు .వేరే కంచం లో వాటికి పెట్టించి తాను  ఇంకో కంచం లో తినేవాడు .లక్కవరపు వెంకట నరసింహం గారి వద్ద బడి చదువు పూర్తి చేసి ,తర్వాత పురాణాలను శ్రావ్యం గా గానం చేసేవాడు .వాటి అంతరార్ధం బోధించే నేర్పు సంపాదించాడు .

  తండ్రికి రోజూ రామాయణం చదివి వినిపించేవాడు .చదువుతూ మైమరచేవాడు రామమందిరం లో భజన చేస్తూ నిద్రపోయేవాడు కాదు .తర్వాత భగవంతుడి పై ఆలోచన తనకు ఆయనకూ ఉన్న సంబంధం గురించి తర్కి౦చు కోనేవాడు .12వ ఏట ఉపనయనం జరిగి ,అప్పటి నుంచి సింగిరి గిరి నరసింహ స్వామిని ప్రతి ఏడాది సందర్శించే వాడు .ఒకరోజు అర్ధరాత్రి వరకు నరసింహ భజన చేసి ,ఇంటికి ఒంటరిగా వస్తుంటే ,దారి తప్పితే ముందు మినుకు మినుకు దీపం కాంతి తర్వాత పెట్రోమాక్స్ లైట్ కాంతి కనిపించి భయ౦,ఆశ్చర్యం కలిగి మనశ్శాంతి కలిగింది .స్పృహ తప్పి నేలపై పడి పోయాడు .స్పృహ వచ్చి చూస్తె ,ఆ జ్యోతి కనిపించలేదు .మట్టిలో పడివున్న అతనిని వెతకటానికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేర్చారు .

ఇంకోసారి ఇంటి నుంచి సాయంత్రం అయిదు గంటలకు బయల్దేరి సింగిరి గిరి నరసింహస్వామి కోవెలకు వెళ్లి నిర్మానుష్యంగా ఉండటం చేత ,సంతోషించి లోపలి వెళ్లి ,స్వామి పాదాలపై పడి,ప్రత్యక్ష దర్శనం కోసం ప్రార్ధించాడు .కనిపించకపోయేసరికి ధారాపాతం గా కన్నీరు కారుస్తూ దుఃఖించాడు .కాసేపటికి ఇదివరకులాగానే దివ్య జ్యోతి మళ్ళీ కనిపించగా సంతోషం తో ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండగా సంప్రజ్ఞానం లో నృసింహ స్వామి దర్శన మిచ్చాడు .సమాధి నుంచి బయటికి వచ్చి ఆనంద బాష్పాలు రాలుస్తూ నృత్యం చేసి ఆలయం నుంచి బయటకు రాగానే ఒక యోగిని కనిపించి ‘’నాయనా !నీ కోసమే ఎదురు చూస్తున్నాను ‘’అని చెప్పి ఆత్మీయంగా కౌగిలించుకొని ‘’తారకం ఉపదేశిస్తా .దానితో నీ అభీష్ట సిద్ధి కలుగుతుంది ‘’అని చెప్పి ఆలయం లోకి తీసుకు వెళ్లి ,సర్వ వేదాంత రహస్యాలు బోధించి తారకమంత్రం ఉపదేశించి ,కనిపించకుండా వెళ్ళిపోయింది .ఆమె సీతాంబ అనే శూద్ర యోగిని బ్రహ్మ చారిణి .అంతకంటే వివరాలు తెలీదు .అప్పటినుంచి దాసుగారి జీవితం అంతా రామమయం అయింది . తండ్రి చనిపోగా బాధ్యతా మీద పడి ఆస్తి అంతా అప్పులపాలై ,ఊళ్ళో అప్పిచ్చే వారు లేక ,ఉద్యోగం చేయటం ఇష్టం లేక ,,మేనమామ వెంకట నరసింహం గారి బలవంతం తో ఉద్యోగానికి దరఖాస్తు చేయగా అ ఉద్యోగం ఆర్డర్ చేతి కందేలోపు ,ఒకరోజు రాత్రి యాత్రకు వెడుతున్నట్లు చెప్పి ,ఇంటినుంచి బయల్దేరి 15రోజులలు నడిచి నెల్లూరు చేరాడు .ఈ ప్రయాణం లో ఒక వింత జరిగింది .పెన్నా నది ని దాటటానికి నదిలోకి దిగి భజన చేస్తూ వెడుతుంటే ,ప్రవాహం పెరిగి ,చేతిలోని తంబూర ,పై గుడ్డ కూడా నీటి వేగానికి కొట్టుకుపోయి నా స్పృహ లేకుండా భజన చేస్తూ ,నది మధ్యకు చేరి మైమరచి నిలచిపోయాడు .ఒడ్డుల్ని ఒరుసుకొని నది తీవ్రంగా ప్రవహిస్తోంది. రామనామం విన్న పల్లెకారులు దివిటీలు ,పడవలతో వచ్చి ,మొలబంటి నీటిలో ఇసుకదిబ్బపై స్పృహ లేకు౦డా  పడి ఉన్న దాసు గారిని చూసి ,స్మృతిత వచ్చేవరకు ఉండి,పడవ ఎక్కించుకొని ,ఒడ్డుకు చేర్చారు. ఆయనెవరో వాళ్లకు తెలీదు .

  నెల్లూరు చేరి శ్రీరంగనాయక దర్శనం చేసి,ఆరాత్రి గుడిలోనే పడుకొని రామనామ సంకీర్తన చేస్తూ తెల్లవార్లూ గడిపారు .ఉద్యోగం పోస్టింగ్ ఇచ్చి ఆయన చేరకపోవటం తో రద్దు చేయగా దాసు గారు చాలా సంతోషించారు . మేనమామ మళ్ళీ ప్రయత్నించి ఉద్యోగం వచ్చేట్లు చేశాడు .రామకూరు ఫిర్కా రెవిన్యు ఇన్స్పెక్టర్ ఉద్యోగం లో బలవంతం మీద చేరి ,విధి నిర్వహిస్తూ ,జపతపాలలో  మునిగి ఆఫీసుకు వేళకు  వెళ్లకపోతే ,పై అధికారి మందలించి భయపెట్టేవాడు .ప్రయోజనం లేక ఉద్యోగం ఊడ పీకేశాడు .బంధన విముక్తి అయిందని సంతోషించి ,భార్య తల్లి తో శ్రీరామ సేవాపరాయణలో గడిపారు .కుటుంబ పోషణ కష్టమైంది .తల్లి అన్నకు బాధ చెప్పుకోనగా ,వెల్లూరు తాలూకా కచేరీలో గుమాస్తాఉద్యొగ౦ వేయించి బలవంతం మీద మేనల్లుడిని చేర్చాడు .ఇదీ మూన్నాళ్ళ ముచ్చటే అయింది .

 గర్భవతి అయిన భార్యను అత్తారింటికి పంపగా రోజూ ఉపవాసాలతో బతకలేక తల్లి చిన్న పిల్లాడితో తన పుట్టింటికి చేరింది .బాదర బందీ లేకపోవటం తో రామనామం తో గడుపుతూ ,తిరుపతి యాత్రకు బయల్దేరి మధ్యలో ధేనువకొండ లో రామకృష్ణయ్యగారు కలువగా,ఆయనతో కలిసి యాత్ర చేసిన తర్వాత అప్పుడప్పుడు ఆయన ఇంటికి వస్తానని చెప్పి , యాత్ర అవగానే బావమరిది ఇంటికి చేరాడు .బావను బతిమాలి బామాలి ,చిత్తూరు మండలం పూతలపట్టులో ఒక బడి పెట్టించాడు .అక్కడ పాఠాలు చెబుతూ పురాణ కాలక్షేపాలు చేస్తూ అందరినీ సంతోషింప  జేస్తున్నాడు దాసు .భార్య రుక్మిణమ్మ పసి పిల్లతో ఇక్కడికి వచ్చి ఒక ఏడాది గడిపింది భర్తతో .

  దాసుగారికి రక్తవిరోచన వ్యాధి వచ్చి ,బడికట్టేసి ,1864లో వెంకటాపురం చేరి ,వ్యాధి తగ్గాక భార్యాపిల్లల్ని అత్తారింటికి పంపి ,శేషాచలం చేరి గోగర్భ ప్రాంతగుహలో , 6 నెలలు తపస్సు చేయగా,కౌపీనం మాత్రమే ధరించిన ఒకముని వచ్చి ‘’నీ తపస్సు ఫలించింది ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు కోరుకొంటే అప్పుడు శ్రీరామ సాక్షాత్కారం లభిస్తుంది .తపస్సు వదిలేసి వెంకటాపురం చేరి ఆదర్శ గృహస్థ జీవితం కొనసాగించు ‘’అని బోధించగా ఆప్రకారమే ఇంటికి వెళ్లి ,నిష్కామకర్మగా జీవించి ‘’శ్రీ భద్రాద్రి రామ దాసు చరిత్ర ‘’రచించి ,శ్రీరామా౦కితం చేశారు దాసుగారు .1869లో మామగారు అప్పయ్య అల్లుడిని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు .ఒక ఏడాది మామిళ్ళపల్లి లో ఉండి ,తర్వాత రేపల్లె చేరి ,తమ్ముడి నుంచి వేరై ,పిత్రార్జితం తో నాలుగు ఎకరాలమాగాణికొని ,ఇల్లు కట్టుకొని భార్యాపిల్లలతో సుఖంగా ఉన్నారు .ఇద్దరు చెల్లెళ్ళు ఒకే రోజు చనిపోయినా ,ఐదారుమంది కూతుళ్ళు చనిపోయినా నిర్లిప్తత కోల్పోలేదు .

 రేపల్లె పాఠశాల ఇంకా నడుస్తూనే ఉంది .ప్రొద్దున లేచినదగ్గర్నుంచి విద్యార్ధులకు పాఠాలు ,భజనలు పురాణ ప్రవచనాలు జపతపాలు అనుష్టానం లతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు  .కొంతకాలానికి భార్య రుక్మిణమ్మ మరణించింది .రేపల్లె వదిలి పెద్దకొడుకు పని చేసే నూజివీడు చేరి ,తత్వార్ధ ప్రధాని యై ఆతర్వాత పొన్నూరు  చేరి చవలి పున్నయ్య  శాస్త్రిని శిష్యునిగా చేసుకొని,పాతూరి కోటయ్యగారి స్నేహం చేసి,ఆతర్వాత శిష్యుల్తో రామేశ్వరం వెళ్లి స్వామి సేవలో ధన్యం పొంది , ధ్వజస్తంభం దగ్గర  భావ సమాధి పొంది మైమరచి పొతే ,భక్తులు హారతులు పట్టి ఆదరించారు .తర్వాత జంబుకేశ్వరం వెళ్లి ,శ్రీరంగం లో రంగని దర్శించి ,దక్షిణ దేశ యాత్ర పూర్తి చేసుకొని ,ఇంటికి చేరి ,బాపట్లలో ఉన్న రెండవ కొడుకు చెన్న కేశవ ఇంటికి చేరి,అద్దంకి వెంకటరాయుడు స్నేహం పొంది ,74వ ఏట ఆతుర సన్యాసం తీసుకొని నలసంవత్సర జ్యేష్ట శుద్ధ పంచమి నాడు మహా సమాధి చెందారు భక్త శిఖామణి సింగిరి దాసు  గారు.

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ – ప్రభావతీగార్ల 57వ వార్షిక వివాహా మహోత్సవ వేడుక 21-2-2021 ” 

“శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ – ప్రభావతీగార్ల 57వ వార్షిక వివాహా మహోత్సవ వేడుక 21-2-2021 ”

https://photos.app.goo.gl/TZ2JXXFXVw5Nr6oZA

Posted in సమయం - సందర్భం | Leave a comment

మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం ఆలయం లో రధ సప్తమి , సామూహిక సత్యనారాయణ వ్రతం చిత్రాలు

https://photos.google.com/share/AF1QipM39VhkRwCmlweefoU22gQ0qRgXyTuBsI6rp630FVVBSOZV1maLP-SekKJTrsZ0-Q?pli=1&key=WFNYNzVGRlZTbklld2pOeG9RQ3o5ZXZnbG1DanV3

 

మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం ఆలయం లో రధ సప్తమి , సామూహిక సత్యనారాయణ వ్రతం చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఇవాళ మా దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 33-తారక బ్రహ్మ వంగల నారాయణప్ప

మహా భక్త శిఖామణులు

33-తారక బ్రహ్మ  వంగల నారాయణప్ప

గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా జగ్గాపురం లో 19వ శతాబ్దిలో వంగల కొండ౦భొట్లు ,కావేరమ్మ దంపతులకు  కేశవభొట్లు ,సుబ్బమ్మ ,నరసమ్మ, సీతమ్మ సంతానం .ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయి రామకూరు ,వేలూరు, ధర్మవరాలలో హాయిగా కాపురాలు చేసుకొంటూ వృద్ధిపొందారు ,కేశవ నే నారాయణ మూర్తి  , నారాయణ భొట్లు అనేవారు .వ్యవసాయమే ఆధారమైనా ఎవర్నీ చెయ్యి సాచి అడగని అభిమాన ధనుడు .నిత్యం ఎవరో ఒకరు ప్రక్కన కూర్చుని భోజనం చేస్తేకాని ఆయనకు తృప్తి ఉండేదికాదు ..వారింట్లో ఎప్పుడో ఒకప్పుడు భోజనం చేయని గుంటూరు వాసి ఎవరూ లేరు .

ఒకసారి కోనసీమ నుంచి వేద వేత్తలైన ముగ్గురు బ్రాహ్మణులు దేశాటనం చేస్తూ వస్తే, వారిని బంధువులను ఆదరించినట్లు ఆదరించి భోజనాలు పెట్టి సంతృప్తి చెందించిన పుణ్యమూర్తి.వీరితో పాటు 10 మంది బ్రాహ్మణులు కూడా పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్నారు .నవలాయ పిండి వంటలతో భోజనం తయారు చేసి వడ్డించి తినిపిస్తున్నారు ఆ దంపతులు .చివరికి మరదలు లక్ష్మీ నరసమ్మగారు పెరుగు వడ్డించింది .అందరూ తృప్తిగా తిన్నారు కానీ ఒక బ్రాహ్మణుడు పెరుగన్నం లో చెయ్యి పెట్టి ఏడుస్తున్నాడు .’’భోజనలోపమా ఆదరణలోపమా ఎందుకు భోజనం చేయట్లేదని అడిగాడు గృహస్తు.అప్పుడాయన ‘’ఏ లోపమూ లేదు. నాకు ముగ్గురు కొడుకులు ,నలుగురు కూతుళ్ళు .వాళ్లకు ఎప్పుడూ ఇలాంటి భోజనం నేను పెట్టనే లేదు .నా కడుపున పుట్టి వాళ్ళు నిర్భాగ్యులుగా పెరుగుతున్నారు .మీలాంటి సంపన్నుల ఇంట్లో పుడితే మృష్టాన్న భోజనం తినే వారు కదా అని ఏడుస్తున్నాను ‘’అని బావురుమన్నాడు .నారాయణప్ప ‘’మీ కోరిక భగవంతుడు తప్పక తీరుస్తాడు దుఖిచకండి ‘’అని ఓదార్చి తినిపించాడు .

భోజనాలయ్యాక అందరూ తాంబూలాలు వేసుకొన్ కబుర్లు చెప్పు కొంటు౦డగా ,పూటకు మానెడు పాలిచ్చే గేదె తో తనదగ్గరకు వచ్చిన పాలేరు చేతిలో కొంత డబ్బు దారి ఖర్చులకోసం పెట్టి ,ఆ గేదెను ,ఆ బ్రాహ్మణుడి ఇంటికి తోలుకు వెళ్లి అప్పగించి రమ్మని చెప్పాడు . దాని పోషణ  కోసం ఒక యకారం భూమికూడా దానం చేశాడు ఉదార హృదయం తో  .నిష్కామ సేవా పరుడైన నారాయనప్ప ఆరాధన పేరుతొ ప్రతి ఏడాది తన శిష్యబృందాన్ని అందరినీ పిలిచి సోదరులలాగా ఆదరించి భోజన సత్కారాలు చేసి,బహుమానాలిచ్చి  పంపేవాడు  .కోనసీమ పండితులు చెప్పుడుమాటలు విని అసూయతో పరీక్షించటానికి వస్తే బ్రహ్మ విద్యలో తన స్వానుభవం చూపించి నిరుత్తరుల్ని చేశాడు .

వరుసగా ఇరవై ఏళ్ళు భద్రాద్రి శ్రీ సీతారామ కల్యాణానికి కాలినడకన వెళ్లి చూసి తరించిన భాగ్య శీలుడు నారాయణప్ప .భక్త బృందం తో ఇంటి నుంచి  భజన చేస్తూ బయల్దేరి ,భద్రాద్రి కల్యాణ శోభ తిలకించి ,పర్ణశాల చూసి ,మళ్ళీ ఇంటికి చేరి మహా సంతర్పణ శ్రీ రామార్పణం అంటూ చేసేవాడు .మూడు సార్లు కాశీ యాత్ర ,రెండు సార్లు రామేశ్వర యాత్ర చేసి ,తెచ్చిన గంగాజలం తో తలిదండ్రులను అభిషె కించేవాడు .చివరి సారి తలిదండ్రులతో కాశీ వెళ్లి దేహాన్ని విశ్వేశ్వరునికి అర్పించి రుణత్రయ విముక్తు డయ్యాడు .

పన్నెండవ ఏట నుంచి గురువు వద్ద చక్కగా వేద శాస్త్రాలు అభ్యసించి ,వాటి సూక్తుల్ని అనుభవం లోకి తెచ్చుకొని ,పాలేళ్ళతో మంచి వ్యవసాయం చేస్తూ చేయిస్తూ ,ధనధాన్య సమృద్ధి పొంది దాన ధర్మాలు నిరంతరం కొనసాగించాడు .తన ఊళ్ళోతన స్థలం లో ఒక చిన్న కుటీరం నిర్మించుకొని పూల వనం పెంచి బావి త్రవ్వించి ,ఆ బావి జలం తో ప్రతి ఉదయం స్నానించి సంధ్యావందనం చేసి కుటీరం లో జప దీక్షలో మునిగిపోయేవాడు .నారాయణ భొట్లు .ఆసమయం లో గాయత్రీ మాట సర్పాకృతి ధరించి  ఆకుటీర ప్రాంతం లో తిరుగుతూ ,ఆయన సమాధి నుంచి లేచే సమయానికి అదృశ్యమయ్యేది అని అందరూ చెప్పుకొనే వారు. ఈ మాట తెలిసి ,ఎవ్వరూ ఆయన దీక్షకు అంతరాయం కలిగించేవారు కాదు .

ఒక సారి శిష్యులైన వేద విద్యార్ధులతో రాత్రి భోజనం చేసి ఆ కుటీరం లో పడుకొని ఉన్నాడు .ఒక నాగు పాము అర్ధరాత్రి సమయం లో వచ్చి నారాయణప్ప ప్రక్కలో పడుకొని ,ఆయన చెవిపై పడగ ఉంచిందట .ఇంతలో ఒక శిష్యుడికి మెలకువ వచ్చి ఆ దృశ్యం చూసి నోటమాట రాలేదట .తర్వాత అందర్నీ లేపి ఒళ్ళూ వాళ్ళను పిలిచి చూస్తే పాము కనిపించలేదు .ఈ హడావిడికి గురువు గారు లేచి విషయం తెలుసుకొని ‘’మా రామప్ప ఈ రకంగా దర్శనమిచ్చాడు కాబోలు ‘’అన్నాడట .అప్పటి నుంచి శ్రీరాముడు ఆయన వెంట ఉండేవాడు .అందుకే ఆయన స్పర్శ తగిలితే వ్యాధులు నయమయ్యేవి .ఒకసారి కుమారస్వామి అనే కుష్టు రోగం తో బాధ పడే బ్రాహ్మణుడు నారాయణప్ప పొలం దున్నుతుంటే వెళ్లి తన గోడు చెప్పుకోగానే దగ్గరలో ఉన్న పొదరింట్లోని ఒక ఔషధ మొక్కను తీసి తినిపించగా ,గుణం కనిపించి నెలరోజుల్లో వ్యాధి మాయమైపోయింది .ఇలాంటివి చాలా ఉన్నాయి .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-21-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీకురుమూర్తి(శ్రీకూర్మ ) నాథ శతకం

‘’కాకుల్మున్గును ,నేను మున్గుదును ,కొంగల్చేయు ధ్యానంబు మి-ధ్యాకల్పంబుగ ‘’అని దొంగ స్నానాలు జపాలు మేలు చేయవు .’’నీవున్నేనును ఒక్కటే యనగ యత్నింతు ర్విమూఢాత్ములా-హా వాలాయముబుట్టి జచ్చు జనులయ్యా ‘’సోహ’’మన్మాటయేలా –వాసి౦గను ,నీ పదాబ్జమ్ముల మ్రోల న్మ్రోక్కుచుం గా౦తుభద్రావాప్తి ‘’అని స్వామి చరణమే శరణం అన్నారు .బాలకృష్ణ లీలలూ వర్ణించారు .స్వామి గుహలో ఎందుకు దాగాడో తెలిసిందట .మత్తేభం లో సరిగమలతో చిరస్మరణీయ పద్య రాజం చెప్పారు కవి –‘’

‘’సరిగా నీపని సాగనీ ,గరిప,దా ,సాగారి సద్ధామ ,మా –గరిమన్ సామ నిదానిగా ,సమపధం గా సాని నీ సారి ,మా

దరిగానీ ,మరి దారి ,సన్నిగమపా , దాసాగమాపా ,సదా – దర మొప్ప౦గురు మూర్తి నాద సురవంద్యా పాహిపాహి ప్రభో ‘’

కురవ గ్రామం లో కుమ్మరికి సాక్షాత్కరించి కురుమూర్తి అనే పేరు సార్ధకం చేసుకొన్నాడట స్వామి .ఛందో వ్యాకరణాలపై పట్టు లేకపోయినా స్వామి అనుగ్రహం పూర్తిగా ఉండబట్టి ఈ శతకం రాయగలిగానని అత్యంత వినయంగా 108వ చివరి పద్యం లో చెప్పి నారాయనరాయ కవి శతకం ముగించారు .సర్వ శాస్త్ర పాండిత్యం, ఛందో వైవిధ్యం ,లోకరీతి, భక్తి స్వభావం, శరణాగత తత్త్వం అన్నీ పుష్కలం గా ఉన్న శతకం ఇది .చదివి ఆనందం అనుభవించ వచ్చు .

శతకం జనం లో ప్రచారమైనదో లేదోకాని ‘’సరిగమ ‘’పద్యం మాత్రం బాగా వ్యాప్తి చెందింది .

శ్రీ కూర్మ దేవాలయ విశేషాలు

శ్రీకూర్మం పూర్వపు కళింగ రాజ్యమునందలి వరాహక్షేత్రములోని పాతాళసిద్ధేశ్వర క్షేత్రమే. ఇచటకల స్వయంవ్యక్త లింగమూర్తి బౌద్ధ మత ప్రభావం ఈప్రాతంలోలేని సమయంలో కళింగ దేశాధీశుడుఇన విజయసిద్ధి ప్రతిష్టించాడు.ఈ లింగమూర్తి వలయాకారపు పానవట్టముపై ఎత్తుగా ఉండి, దర్సన మాత్రమున లింగాకృతి కన్నులకు కట్టి యుండును.

శ్రీకూర్మం, అరసవల్లి, సిమ్హాచలం మొదలగునవి ప్రధమంలో శైవమతమునకు పుట్టినిల్లు. అయినప్పటికీ ఈనాడు వైష్ణవక్షేత్రాలుగా ఉన్నవి.శ్రీకూర్మాలయం, సింహాచలాలలో గల శిలాశాసనాలను బట్టి ఆకాలమున నరహరి తీర్ధులచే వైష్ణవమతము కళింగమున వ్యాపించెనని తెలుస్తున్నది. ఈతని కాలమునాటి శిలాశాసనములు శ్రీకూర్మంలోనూ, సింహాచలం లోనూ చాలా ఉన్నవి.

దీనిని క్రీ.శ. 12వ శతాబ్దంలో వైష్ణవ మతాచార్యుడు శ్రీ రామానుజాచార్యులు తీర్ధయాత్ర సందర్భంగా కళింగదేశం వచ్చాడని, శైవలలో మత సంబంధమైన చర్చలు జరిపి శైవులను అవలీలగా వాగ్వివాదంలో జయించి వైష్ణవాలయంగా మార్చి శ్రీకూర్మనాధుడని నవీన నామకరణం చేసినట్లు సంస్కృతంలోగల ప్రన్నామృతం వలన తెలుస్తున్నది. నాటినుండి పాతాళసిద్ధేశ్వర ప్రశంస మాసిపోయి శ్రీకూర్మనాధ ప్రశస్తి ప్రబలింది. విష్ణుమూర్తిని కూర్మావతార రూపాన ఇచట పూజించటం వలన ఈదేవాలయాన్ని శ్రీకూర్మనాధాలయమనీ ఆగ్రామాన్ని శ్రీకూర్మమని పిలుస్తున్నారు.ఈ దేవాలయం చుట్టూగల స్తంభాల మంటపాలలో నల్లరాతితో చెక్కిన రమణీయమైన శిల్పాలు కలవు. దేవకోష్టమునందు త్రివిక్రమ, పరశురామ, బలరామ, సరస్వతి, కుబేర, మహిషాసురమర్దిని, ఇంకనూ అనేక శంఖచక్రధారియైన విష్ణుమూర్తి విగ్రహాలు కలవు. ఈ దేవాలయమునందు రెండు ధ్వజ స్తంభాలు కలవు. విమానం చోళ రాజుల వాస్తు శిల్పకళారీతులలో నిర్మించారు. చక్కగా కుదురుటచే కాబోలు కుదురుకు కూర్మము చిలుకునకు సింహాచలము అను లోకోక్తి వచ్చినది. శ్రీకూర్మ పురాణం శైవసంప్రదాయసారమై ఉన్నది. దీనిని రాజలింగకవి మండచిట్టి కామశాస్త్రి ఆంధ్రీకరించారు. ఈ క్షేత్ర మహాత్యాన్ని దత్తాత్రేయులవారు వ్యాసమునీంద్రులకు వివరించారనీ, అందు స్థల పురాణం వలన స్వయంగా శ్రీహరిదత్తాత్రేయులకు శ్రీకూర్మనాధ మహాత్యాన్ని గూర్చి స్వప్నంలో చెప్పినత్లు చెబుతారు.

ఇచ్చటి శిలాశాసనముల వలన నాల్గవ శతాబ్దం నుండి పదునాల్గవ శతాబ్దం వరకు పాలించిన తూర్పు గాంగరాజుల చరిత్ర పూర్తిగా తెలుస్తున్నది. క్రీ.శ. 1273లో పాలించిన తూర్పుచాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడు తన ఆస్థానకవి అయిన నన్నయ్య భటారికుని సంస్కృతంలో కల భారతాన్ని తెనుగదించవలసినదిగా కోరినట్లు తెలిపే ఒక శాసనం కలదు. ఆనాటి సాంఘిక, రాజకీయ, పరిస్థితులను వివరించే అనేక శాసనములు కూడా ఇక్కడ కలవు.

తిరునాళ్ళు, ఉత్సవాలతో ఆస్తికులు ఆచరించే జీవిన విధానమే స్మార్తము. దీనిలో ఏ మతం వారైనా పాలు పంచుకొనే అవకాశం ఉంది. కాకతీయుల కాలంలో విరివిగా ‘స్మార్తము’ ఆచరించే కాలంలో, బౌద్ద క్షేత్రంగా వెలుగొంది, అనంతర కాలంలో వైష్ణవ మత ప్రదేశంగా మారినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీకూర్మం తో పాటు సర్పవరం, బాపట్ల కూడా ఇదే రీతిన బౌద్ధ మత కేంద్రాల నుంచి వైష్ణవ మత స్థలాలుగా మారాయి..

రథ సప్తమి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-21-ఉయ్యూరు.

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శుక్రవారం రధ సప్తమి శుభాకాంక్షలు

ఇవాళ 19-2-21శుక్రవారం మా ఇంట్లో రధ సప్తమి,మా శ్రీమతి పూజ ,పాలుపొంగించటం ,నా అరుణపారాయణ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment