18-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు

8-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు

రెండు అముద్రిత శతకాలు రాసిన పరశురామపంతుల లింగమూర్తి ‘’ శ్రీ సీతారామాంజ నేయం ‘’అనే అద్భుత ఆధ్యాత్మిక గ్రంధం రాసిన తెలంగాణా కవి .శేషాద్రి రమణకవులు కూడా పై రెండు శతకాలను ప్రస్తావించలేదు .వంగూరి సుబ్బారాగారు ‘’మనశ్శతకం ‘’గురించి చెప్పారు .బిరుదురాజు రామరాజుగారు మాత్రం అముద్రితాలైన లింగమూర్తి గారి ‘’ఆత్మారామ శతకం ‘’,,గోవింద శతకం’’ గురించి త్రవ్వితీసి లోకానికి చాటారు .నియోగి బ్రాహ్మణుడైనఈ కవి వంశంవారు మహారాష్ట్ర నుండి వలసవచ్చారు .ఈ ఇంటిపేరు వాళ్ళు  అంబాల , ఈదులవాయ  మట్టేవాడలలో ఉన్నారట .కవికాలం 18శతాబ్ది .సీతారామాన్జనేయం 1760లో రచింపబడి ఉంటుందిఅని శేషాద్రి రమణ కవులూహి౦చారు .రతి మన్మధ విలాసం ,  జీవన్ముక్తిప్రకరణం ,బ్రహ్మనారద సంవాదం, తారకయోగం, మానస శతకం ,సీతారామా౦జనేయం లింగమూర్తిగారి కృతులని వారు చెప్పారు .తర్వాత ‘’సీతపాట ‘’అనే అద్భుత గేయకావ్యం వచ్చిందని రాజుగారన్నారు .కవి పోతన్న, రామదాసు వంటి భక్తకవి వేదాంత వేత్తకూడా .భక్తీ వైరాగ్యాల కూడలి లింగామూర్తికవి అన్నారు బిరుదు రాజువారు .ఓరుగల్లులో మట్టేవాడ ఒకభాగం అక్కడ కవి గారి గృహం ఇప్పటికీ దర్శనీయమే .దీన్ని ప్రభుత్వం భద్రపరచాలని కోరారు .ఈ రెండు శతకాలు మరికొన్ని పంచరత్నాలు రెండు’’ బెత్తెలపొడవున్న’’ 34తాటాకులపై వ్రాయబడ్డాయి.

ఇందులో ఆత్మారామ శతకం లో 108కందపద్యాలున్నాయి .100పద్యాల తర్వాత’’ శ్రీ రామార్పణమస్తు’’ అని ముగించి ,తర్వాత ఆరు పద్యాలలో గురు స్తుతి ,కృతి ప్రశంస ,ఫలశ్రుతి చెప్పాడు .రుచికి కొన్ని కందాలు –

‘’నరనారాయణము మన –మిరువురము నవిద్యవలన నేకాత్ముల ,

మక్షర పురుష ,పరమపురుషుల –మరయంగా విద్యవలన నాత్మారామా ‘’.

‘’నిమ్నోన్నతములుగాని సు-షుమ్నామార్గమున నిన్ను జూచి జిత ప్ర

ద్యుమ్నులగు యోగిపు౦గవు –లామ్నాయ విధిం భజింతు రాత్మారామా ‘’

‘’గురుడనగా నీశ్వరుడగు –స్థిరమతి శిష్యు౦డ౦న  జీవాత్ము౦డ

య్యిరువుర కైక్యస్థానం –బరయంగా పరమపదము నాత్మారామా ‘’

‘’ఇల పరశురామ పంతుల –కులజ శ్రీ లింగమూర్తి గురుడవు నీవై

పలికితివి గాక నితరుల –కలవడునే యిట్లుబలుక నాత్మారామా ‘’

  ఈ శతకాన్ని నక్కా నరస౦భట్లు అనే వ్రాయసగాడు  27-4-1798న రాసినట్లు రాజుగారు ధృవీకరించారు .

  15వ కమ్మ రెండవ వైపు ‘’గోవింద శతకం ‘’ప్రారంభమైంది .111కంద పద్యాలు .ఇందులోకూడా వందవ పద్యం తర్వాత ‘’శ్రీరామా ‘’అని ముగించి మిగిలిన 11పద్యాలలో మిగిలిన విషయాలురాశాడు .ఈ శతకం లో భక్తీ, వేదాంతం రెండూ ఉన్నాయి-

‘’శ్రీ లక్ష్మీ నారాయణ –నీలాంబుద నిభ శరీర ,నిగామాధారా

లీలావిహార ,నిర్మల –శీల, చిదానందకంద శ్రీ గోవిందా ‘’

‘’యోగకర ,యోగవిద్వర – యోగాభ్యాస ప్రవీణ,యోగాధారా

యోగైశ్వర్య పరాయణ –యోగానందానుభూతి యుత గోవిందా ‘’

‘’క్షరతత్వము నంటక న –క్షర పురుషుని మించి సర్వ సాక్షి యనంగా

పురుషోత్తముడని వెలసిన –పరాత్ముని నిను భజింతు వర గోవిందా ‘’

83వ పద్యం నుంచి  వివిధ అవతార  స్తోత్రాలురాశాడు –

‘’ధరణీ సురవరద మహా –పరశు ధర ,నృపాల  జలధి బడబానల ,భా

సుర సు తపోధనఘన సు౦ –దర  ,భార్గవ రామ రూపధర గోవిందా ‘’

‘’ఈ స్తోత్ర రత్నరాజము –కౌస్తుభ మణి తుల్యముగను,గని ,కానుకగా

హస్తాబ్జ౦బుల  గైకొని –విస్తరముగ మై ధరి౦పవే గోవిందా ‘’

తర్వాత ఒకపద్యంలో తనను గురించి చెప్పాడు .

వ్రాయసకాడు నక్కా నరసంభట్లు  ‘’శ్రీసీతారామ పరబ్రహ్మణేనమః ,శ్రీ లింగమూర్తి పరబ్రహ్మణే నమః ‘’అని రాసి తానొక పద్యం రాశాడు .వ్రాతకాలం 28-4-1798అన్నారు రాజుగారు

‘’దయ నాదరింపు భక్త హృ –దయ,నా ఫణిశయన వికసితాంబుజ నయనా

నయనామయ  నామయ నా-భయ నాశము చేసి మమ్ముపాలింపు హరీ ‘’

  ఈ రెండు శతకాల తర్వాత పంచరత్నాలున్నాయి –ఒకపద్యం –

సీ-‘’మొదలు ప్రాణాపానములను,తద్రేచక పూరక కు౦భకంబులను నవి మెల౦గు,నిడా ,పింగళా సుషుమ్నల హంసత్వమునే సాక్షి తానె తెలియు

వికచహృత్కమల  కర్ణిక యందు ఘోషించు ప్రణవనాదంబు  నే ప్రభు డెరుగు  -భ్రూ మ, ద్యమమును చూపులను ,నానావిధ కళలను మనము నే ఘనుడు గాంచు

నతడె ప్రత్యగాత్ము డతడెపో పరమాత్ము –డతడె వాసుదేవు డతడె శివుడు

అతడెస్వప్రకాశకుడైన శ్రీమన్మహా –దేవ లింగమూర్తి దివ్యకీర్తి ‘’

ఇలా నాలుగుపద్యాలురాసి తర్వాత అయిదవ సీసపద్యానికి ‘’సాంఖ్యం’’ అని ,ఆరవదానికి ‘’అమనస్కం’’ అని శీర్షికలుపెట్టాడు .వీటి తరవాత ‘’శ్రీరామరామేతి రమే రామే మనోరమే ‘’మొదలైన పంచరత్న శ్లోకాలున్నాయి .వీటి తర్వాత వీటి తెలుగుఅనువాద గీతపద్యాలున్నాయి –

‘’శ్రీమనోరమ శ్రీరామ రామరామ –యనుచు రమియించు రాముని యందు రామ

నామము వరానన సహస్రనామ తుల్య –మట్లు గావున దీని నీ వవధరింపు ‘’

మందారమకరంద తు౦దితాలైన వేదాంత పద్యాలు రాయటం పరశురామపంతుల లింగమూర్తిగారికి ఎన్నతో పుట్టిన విద్య అనిపిస్తుంది వారి ‘’శ్రీ సీతారామాంజేయం ‘’చదివి పులకించని తెలుగువాడు లేడు అని నా అభిప్రాయం .ఈ శతకాలు అలాంటివే .

వీటిని కూడా వ్రాయసకాడు నక్కా నరసంభోట్లు 29-4-1798న రాసినట్లున్నది .యితడు లింగమూర్తికవిని దర్శించి తరించినట్లు చెప్పుకొన్నాడు

ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

17-నేబతి కృష్ణయామాత్యుడు

17-నేబతి కృష్ణయామాత్యుడు

అమాత్యుడు, కవీశ్వరుడు అయిన నేబతి కృష్ణయామాత్యుడు కవిపోషకుడు ,మహమ్మదీయ సుల్తానుల సభకు అల౦కార మైనవాడు .కాని చరిత్ర మరుగునపడటం విధి వైపరీత్యం .కౌండిన్య గోత్రీకుడు .తండ్రి కమలయామాత్యుడు తల్లి కొండాంబ .గోల్కొందదగ్గర సిద్ధలూరు పుట్టినవూరు .దీనికి దగ్గరున్న అనంతగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పు .మహమ్మద్ ఖులీ కుతుబ్ షా అనే మహమ్మద్ షాహి ప్రదానమందలిలో ,కవులలో ఒకడు గా ఉన్నవాడు .’’రాజనీతి రత్నాకరం ‘’అనే ఆరు ఆశ్వాసాల కావ్యం రాసిన ఘనుడు .

పీఠిక లో సమకాలీన రాజకీయ ,సాహిత్య చరిత్ర రాశాడు ..గురువు కందాళ రంగా చార్యుడు .తర్వాత వైజయంతీ విలాసకర్త అయిన సారంగు తమ్మయ గురువు కందాళ అప్పు గారిని ,తర్వాత ముడుంబ సాదు భట్టాచార్యులను స్మరించాడు .చరిత్ర కెక్కని గురు మూర్దన్యుడు ,శతావధాని ,ద్రావిడ ఆమ్నాయ తత్వ రసజ్ఞుడు ,కర్నాటక్షమాభ్రుత్సభాంతర పూజ్యుడు  మరి౦ గంటివెంకట జగన్నాధా చార్యులను కూడా స్మరించటం విశేషం  .ఇంతటిమహాకవి కృతులకూ చిరునామాలేదు .తనకవితావైభావాన్ని గురువు నోట పలికించాడు కవి –

‘’స్వర్దునీ వీచికా సంఘాత ఘమఘమ న్నిర్ఘోషములమించి  నీటు గెల్చి –వాగ్భామినీ పాద వనజాత కంచనా౦గదఝాళంఝాళ రావగతుల దెగడి

నిర్ఝర ద్రుమ జాల నిస్సర న్మకరందధమధమన్నద సంతతుల గేరి –కాంచీ నితంబినీ కాంచీ లతా ఘంటికా ఘణంఘణరావక్రమము మించి

వెలసే భవదీయ సరసోక్తి విరచితాననవద్య గద్య సుపద్య కావ్య ప్రబంధ

దండకోదాహరణ కవితా నిగు౦భనములు కృష్ణ ప్రధానీంద్ర నవరతీంద్ర ‘’

‘’కోనమ దేవీవల్లభ గానకళాలోల సకలకవి బాంధవ ర-క్షా నిధి వైష్ణవ కల్పక దీనిది కమళేంద్రు నేబతి ప్రభు కృష్ణా ‘’

కవిభార్య పేరు కొనమ .84దుర్గాల ఏలిక అయిన కుతుబ్ షా సుల్తాను కవికోటిలోనివాడు మంత్రికూడామనకవి  .కుతుబ్ షాను మనకవులు మల్కిభరాముడు అని,ఇభరాముడని  స్తుతించారు .కవి తండ్రికమలయామాత్యుడు  మల్కిభరాముడు మెచ్చగా ,పానుగంటి పట్టణాధ్యక్షుడై,ఏకాదశీ వల్లభుడై ,ద్వాదశీ చూఠ కారుడై ,సత్యవాక్యపాలకుడై ,సరస సంగీతమహిమలతో ఆది కవుల వలే విరాజిల్లాడు .వంశమూలపురుషుడు అన్నమరాజు .ఏడవ తరం వాడు కృష్ణయామాత్యుడు .ఇంటి పేరైన నేబతి –నియాబత్ పదానికి తెలుగు .అర్ధం రాయబారి లేక స్థానాపతి .ఇందులో రెండవతరానికి చెందిన  నాగరాజు బెదందకోట సుల్తాను శహాకు నేబతి అంటే స్థానాపతిలేక రాయబారి .

కవి విశిస్టాద్వైత మతానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు .ఈకవికి 300 ఏళ్ళ ముందుదూబగుంట నారాయణకవి’’ పంచతంత్రం ‘’రాశాడు  ..కృష్ణయామాత్యుడు తనకావ్యం లో 20పద్యాలలో శ్రీరంగపురవైభావం వర్ణించాడు .తర్వాత సుదర్శన చక్రవర్తి వర్ణన చేశాడు .ఆశ్వాసా౦తపద్యాలలో అందులోని విశేషాలు తెలిపాడు .కావ్యాన్ని 6-12-1838న బోనాల అప్పన్న కుమారుడు వెంకటాద్రి వ్రాతప్రతి రాశాడు .’’నేతటికాలమున నీ తాటియాకుల గొడవ యేరికిని పట్టిరాక వెట్టికి బుట్టిన బిడ్డ వలె నున్నది’’అని ఆచార్య బిరుదురాజు రామరాజుగారు వ్యధ చెందారు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-19-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

16 -గోపతి లింగకవి

16-గోపతి లింగకవి

తెలంగాణలో వీర శైవాన్ని వ్యాప్తి చేసిన వారిలో మధ్యయుగానికి చెందిన గోపతి లింగకవి కూడా ఒకడు .కృతిభర్త మెదకు మండలం వాడు కనుక కవి కూడా ఆ ప్రాంతం వాడే అయి ఉంటాడని బిరుదరాజువారూహించారు .అనేక రచనలు చేసినా రెండు మాత్రమే లభ్యం 1-చెన్నబసవపురాణ౦ 2-అసమగ్రంగా ఉన్న’’అఖండజ్ఞాన మనఃప్రబోధ వచన కావ్యం .ఈ కవి అంగడిమఠం వీర శైవాచార్యులకు  శిష్యుడు .ఇంటిపేరు తుమ్మా. తాత  శివరామ లింగం . శివరామ లింగం ,మల్లమాంబా దంపతులకు జన్మించిన పాపయ లింగం ,మల్లమా౦బా దంపతులకు గోపతి లింగకవి జన్మించాడు =

‘’శివ దేవియు మజ్జననియు –శివ దేవుడు తండ్రి సుప్రసిద్ధముగాగన్

శివభక్తులు బంధువులును –శివ కుల జనితుండ నిరత శివ గోత్రుడన్’’

చెన్నబసవ పురాణానికి విపులంగా పీఠిక రాశాడు .శివ ,గురు,ప్రమధగణ  పాల్కురికి సోమన స్తుతి చేశాడు  .పిడపర్తి బసవన్న ,కొడుకు సోమలింగం గార్లపాటి లక్ష్మయ్య లను స్మరించటం చేత కవి 16వలేక 17 శతాబ్ది వాడై ఉంటాడని రాజుగారన్నారు .గురుపరంపర తర్వాత ప్రబంథరచన ఉద్దేశ్యం చెప్పాడు .శ్రీ గిరీశ్వరుడు జ౦గమాకృతి ధరించి కవితో –

‘’సురుచిర గ్రంథము లారును –వర సుస్తవ మొకటి ,బెక్కు వచనంబులు

స్థిర శతకము లైదును శ్రీ –కర కేదారీశు నోము కథయునుమరియున్’’

మరియు మంగళాస్ట కాలు ,విఘ్నేశ్వర వీరేశ్వర మల్లేశ్వర రామేశ్వరాస్టకాలు ,శారద పదాలు జాజర పదాలు రాశాడని  ,ఇప్పుడు ఈ కృతిరాసి అంకితమివ్వమని కోరాడు .అలాగే చేద్దామని అనుకోగా తండ్రి కలలో కనిపించి అలాగే కోరాడు .అప్పుడు తమ్మడిపల్లె సిద్దయ్య అనే మాహేశ్వరుడు వచ్చి కృతిభర్త ఐన కాసాల పరబణ్ణ వీర మహేశ్వర ఆచార సంపద గుణగణాలు,వంశావళి వివరించాడు .పరబణ్ణ చిరు తొండనంబి కులం వాడట .అతని తమ్ముడు గర్రెపల్లి బసవలింగం .పీఠికలో పూర్వకవుల, స్మ్రుతి శృతి పురాణ ఇతిహాసాల వాక్యాలు  అధర్వణవేదం జాబాలిక ముండక ఉపపనిషత్ బ్రహ్మాండ స్కాంద విష్ణు పురాణ ,వీరాగమ విశ్వాగమ రహస్యం ,ప్రభులింగలీల  వేమన పద్యాలనుండి కూడా ఉదాహరణలున్నాయి .కనుక కవి వేమన తరవాతవాడు ఐ ఉంటాడు .తాళపత్ర ప్రతి రాసినవాడు కవికొడుకు మల్లయ్య .

  గోపతి లింగాని రెండవ కృతి ‘’అఖండజ్ఞామనః ప్రబోధ వచన కావ్య ప్రబంథము .పీఠిక అసమగ్రం .శివ స్తోత్రం ‘ అంగ డీశ్వరు డైన గురు స్తుతి ,తలిదండ్రుల ,పురాతన అధునాతన భక్తగణ౦వివరాల తర్వాత తోటక మఠంకు చెందిన గురువు స్తుతి ,కొలనుపాక సోమేశ్వరస్వామి స్తుతి  చేశాడు  .‘’అమరున్ పాదపములున్,ఖగంబులు నిత్యానంద సింధుల్ పురిన్ –అమరున్ గోవులు కామధేనువులు పుణ్య క్షేత్ర సద్వర్ణన౦-

బమరేంద్రాబ్జభవాచ్యుతాదుల కవశ్యం  బన్నపూర్ణా౦బకున్-భ్రమరా దీశునికున్ సుఖావహము సామ్రాజ్యైక తత్పీఠమున్’’

‘’కమలహితుండు ,తారలును సుదాకరుడున్ గ్రహంబులున్-అమరులు ,తాపసే౦ ద్రులు మహా భయమంద పురంబు  చుట్టునన్

గమిగొని భైరవుల్ ప్రహరి గాచుచు దా విహరింపు చుందుర –  క్కమల విరోధి మౌళిపద కంజములున్ మదిలో దలంపుచున్ ‘’

 ఈ కవి ఇతర కృతులేమయ్యాయో ఆశివునికే ఎరుక .

– ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-19-ఉయ్యూరు


— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కూడేరులో శ్రీ హనుమజ్జయంతి

కూడేరులో శ్రీ హనుమజ్జయంతి

కృష్ణాజిల్లా  మేడూరు దగ్గరున్న కూడేరులో మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయశాస్త్రిగారి ఆంజనేయస్వామి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమ ఆహ్వానం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

15-త్రిలోక భేది

15-త్రిలోక భేది

‘’సకల ధర్మ సారం ‘’కర్త త్రిలోక భేది .ఇది అసలుపపేరో బిరుదో తెలీదు .పీఠిక లేని 4ఆశ్వాసాల గ్రంధం .మధ్యలో కృతిపేరు ‘’సకలధర్మ సారాయ౦ ‘’అయింది .ఆశ్వాసాంత గద్య లో కవి తనను గురించి చెప్పాడు –‘’నవరసానుబంధ బంధుర ప్రబంధ నిబంధ చాతురీ ధురీణ ,సకల విద్యా ప్రవీణ గౌతమగోత్ర పవిత్ర గౌరనామాత్య పౌత్ర ,,రామయమంత్రి పుత్ర,సకల జన స్తోత్ర సంభావిత త్రిలోకభేది ప్రణీతంబైన హరి వంశము నందు ‘’సకలధర్మ సారాయంబు నందు ‘’కవి గౌరనమంత్రికి మనుమడు అయి ఉండచ్చునని బిరుదరాజు వారూహి౦చారు  .కాలం 1485 అయి ఉండచ్చు .శిదిలభాగం తర్వాత ఉన్న కందపద్యం ,పంచ చామరం  లలో శివ్వనమంత్రి శివపూజా దురంధరత్వం చెప్పాడు –

‘కం-శివపూజా పరిపూర్ణా-స్తవ జంగమ పాదపద్మసంసేవక ,స

ద్వివర  విహార ,మహామహ  –  కవి జన సన్మిత్ర తాపఘన సత్పుత్రా ‘’

పంచచామరం –‘’సదా సదాశివార్చనాది సారసాప్త తేజ ,దుర్మదా,మదాదినాగసింహ మానతస్దుర స్థిరా

న్వదాన్వదాను దానకర్ణ  పారిజాత జాత స౦-పదా  పదాభిరాన లోకపావనాంగ సంహృదా’’

రెండవ ఆశ్వాసం లో కృతి పతి గురించి –

‘’శ్రీ మల్లికార్జునార్పిత –ప్రేమాతిశయాను రాగ పృధ్వీజన సు –

త్రామ ,కరుణాపయోనిధి సీమాంతర  జయవిహార శివ్వగ భీరా ‘’

తృతీయాశ్వాసం చివర చెప్పినపద్యం బట్టి శివ్వ మంత్రి అసాధారణ ప్రతిభ కలవాడని  తెలుస్తుంది .అందులోని మాలిని పద్యంలో శివ్వన తల్లి మల్లమా౦బ అని తెలుస్తుంది .కవికీ శివ్వనమంత్రికి ఎలాటి సంబంధముందో తెలీదు .నాలుగవ ఆశ్వాసం లో ‘’పాండవులకు సకల ధర్మంబులు దెలుపుటయు ,వారి సన్నిధికి దూత  ఏ తెంచుటయు,కృష్ణుడు ద్వారక కేగుటయు అను కథలు గలవు ‘’అని చెప్పాడు కవి .

  వ్రాయసకాడు తన ఊరి పేర్లు కూడా చేర్చాడని ,తప్పులుంటే క్షమించమని విన్నపం కూడా చేశాడని రాజుగారన్నారు –

పెద్దలయివారు ప్రేమతో జూచియు –దిద్దరయ్య మీరు తిట్టబోక

సద్దు శాయకురయ్య జాగేలరా మొగిలి –గిద్దె రంగధామ  కీర్తి ధామా ‘’

‘’కాళిదాసుకవిత్వం కొంత, తనపైత్యం కొంత’’అన్నట్లు తయారు చేశాడు వ్రాయసకాడు .అతడు వెంకటేశం అనే వైష్ణవ నియోగి బ్రాహ్మణుడు .మెహబూబ్ నగర మండలం షాద్ నగరం తాలూకాలో మొగిలి గిద్దె గ్రామం ఉన్నదని,వ్రాసిన తేదీ 3-1-1646.అంటే గ్రంథంపుట్టాక 200 ఏళ్ళ తర్వాత వ్రాయసగాడు ఈ ప్రతిని రాశాడని ఆచార్య రాజుగారు చెప్పారు .

ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

14-పొత్తపి వెంకటామాత్యుడు

14-పొత్తపి వెంకటామాత్యుడు

‘’నూట ఎనిమిది దివ్య తిరుపతుల సుబ్బరాయ శతకం ‘’రాసిన పొత్తపి వెంకటామాత్యుడు రాయలసీమకవి .అన్నీ సీసాలే .మొదటిపద్యం చివర –మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ ‘’అని ఉంది .ప్రారంభం లో అశ్వత్ధ నారాయణుడు .పెన్న జూటురి చేన్నరాయలను ,వజగిరి నృసిమ్హుని ,కోన రంగేశుని ,హోన్నూరి రాయని స్తుతించటం చేత  ఈ క్షేత్రాలన్నీ అన౦తపుర మండలం లో ఉండటం వల్లా కవి రాయలసీమ లోని అనంతపురం మండలం వాడై ఉంటాడని రాజుగారి అభిప్రాయం .2నుండి 108పద్యంవరకు 108 దివ్య తిరుపతుల   వర్ణన చేశాడు .109పద్యం లో తనగురించి చెప్పుకొన్నాడు –

‘’ముదితాత్ముడగు పెదముల్కి వెంగనకేను పౌత్రుండ ,హరితస గోత్రజుండ-అనఘ పొత్తపి చెన్నయామాత్య సూనుండ ,మహిత చారిత్రుడ,మానధనుడ

కామక్షమా౦బను  ఘనసాద్వి గర్భ జలధి చంద్రుడ ,మహా సరసి గుణుడ-సిరిమించు రాయల చెర్వు యబ్బారుడ?,ఘనుడ వెంకట నామకవి వరుడ

ధర్మ చరితుండ నిరతాన్న దాతవనుచు –నీకు మ్రొక్కెద నను బ్రోవు లోక వంద్య

మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ ‘’.

కవి వంశంవారు పొత్తపి నుంచి వచ్చి అనంతపురం లో స్థిరపడ్డారు కనుక ఇంటిపేరు ‘’పొత్తపి ‘’అయింది .తాతపేరుకు ముందు పెదముల్కి ,తండ్రి పేరుముండు పొత్తపి, తన పేరుకు ముందు రాయల చెరవు ఊళ్ళ  పేర్లున్నాయి కనుక ‘’మూడుతరాలలో మూడు ఊళ్ళ చెరువు నీరు త్రాగి ఉంటారు ‘’అని చమత్కరించారు ఆచార్య రాజుగారు .110వ పద్యం లో ఈ కృతికి తనను ప్రోత్సహించిన వారి గురించిరాశాడుకవి .కవి శైలీ రమ్యతకు  ఒక పద్యం-

‘’వినయ భక్తి స్థానమున భుక్తినొసగెడు దేవుని నెదనెంచి దిగులు బూని –సారంగముల రెంటి సారంగమున గూర్చి సారంగధరు జూచి సరసుడనుచు

పండు వెన్నెలలోనిపండు వెన్నెలగాంచి పండు వెన్నెలగల బయలు బట్టి

పరితాపమందక  పరితాపమును దీర్చి పరితాపహరు గురు ప్రస్తుతించి

జ్ఞానమార్గంబు దెలిసిన మానవుండు –అధికుడన మించి సత్పథ మందకున్నె

మహితరోపాయ ధూర్జటి మత విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ’’.

‘’తత్వావతార దశకం ‘’అనే పద్యం సౌరు గమనిద్దాం –

‘’శ్రీమద్వరంబున చెన్నొందుగుణనాథు నేవేళ నాత్మలో నెన్నికొనుచు –అల మచ్చెమై నీటి కెదురెక్కవలెగాని,మూపున పెనుగొండ మోవరాదు

ఘోణియై ముస్తెను గోరాడవలె గాని ,దిగు లొ౦దగా నోరు దెరువరాదు-దీనత నొక్కరి తిరియ గావలె గాని తెంపున నృపతుల  ద్రుంపరాదు

కట్టవలెగాని రోకట   గొట్టరాదు – ఉండవలెగాని కత్తి మెండొడ్డ రాదు

మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ’’

ఇందులో చక్కని వ్యాజస్తుతి కనిపిస్తోంది కృష్ణాజిల్లా కాసులపురుషోత్తమకవి గుర్తుకొస్తాడు .

ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

13-ఏదుట్ల శేషాచలుడు

Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇజ్రాయిల్ ఏకైక మహిళా ప్రధాని గోల్డా మీర్ –

బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు:

1898 మే నెల 3వ తేదీ న జన్మించిన’’ గోల్డా మాబో విచ్ ‘’ఆనాటి రష్యా సామ్రాజ్యం లో, నేటి యుక్రెయిన్ లో బ్లూమ్ నీడిచ్ ,మాషే మాటోవిచ్ దంపతులకు జన్మించింది .కార్పెంటర్ అయిన తండ్రి ఉద్యోగాన్వేషణలో 1903లో అమెరికాలోని న్యూయార్క్ సిటీ కి , తర్వాత మిల్ వాకీ సిటీ కి చేరి రెండేళ్ళు బాగా కస్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని తెచ్చుకొన్నాడు తల్లి గ్రోసరి దుకాణాన్ని చూసుకొనేది .గోల్డా ఆమెకు సాయం చేసేది .1906నుండి 1912 వరకు ఫోర్త్ స్ట్రీట్ గ్రేడ్ స్కూల్ లో చదివింది .స్టూడెంట్ లీడర్ గా ఉంటూ తోటి విద్యార్ధులు పుస్తకాలు కొనుక్కోవటానికి నిధి సేకరించి అందజేసింది .’’అమెరికన్ య౦గ్ సిస్టర్స్ అసోసియేషన్ ‘’స్థాపించి ,ఒక హాలు అద్దెకు తీసుకొని సభలు సమావేశాలు జరిపింది .తన క్లాస్ కు ‘’వాలడి క్టేరియన్’’గా గ్రాడ్యుయేట్ అయింది .

చదువుతోపాటు ఉద్యోగం –సామాజిక దృక్పధం:

14 వ ఏట గోల్డా ‘’నార్త్ డివిజన్ హైస్కూల్’’ లో చేరి చదువుతూ ,మిల్ వాకీ పబ్లిక్ లైబ్రరీ వంటి ప్రసిద్ధ సంస్థలలో పార్ట్ టైం ఉద్యోగమూ చేసింది .తల్లికి గోల్డా ను చదువు మానిపించి పెళ్లి చేయాలని ఉండేది .కాని ఇష్టం లేని గోల్డా పెళ్లి అయిన అక్క షెనా కార్న్ గోల్డ్ తో కలిసి డెన్వర్ కొలరెడో లో ఉండటానికి ట్రెయిన్ టికెట్లు కొని వెళ్లి పోయింది . అక్కా, చెల్లెలు తమ మేధస్సును ఇతరులతో పంచుకొంటూ సాయంకాలాలు గడిపేవారు .జియోనిజం ,సాహిత్యం, స్త్రీ ల వోటు హక్కు ,ట్రేడ్ యూనియన్ వంటి సమస్యలపై మీర్ నిస్సంకోచంగా తన స్థిర అభిప్రాయాలు తెలియబర చేది .ఆమె అభిప్రాయాలను అందరూ మన్ని౦చేవారు .తనజీవితాన్ని తీర్చి దిద్దింది డెన్వర్ లో గడిపిన రోజులే అని గోల్డా చెప్పింది .

లేబర్ జియోనిజం పై ఆసక్తి –వివాహం:

1913లో మళ్ళీ నార్త్ డివిజన్ హైస్కూల్ కు వచ్చి 1915లో గ్రాడ్యుయేట్ అయింది గోల్దామీర్ .య౦గ్ పావోల్ జియాన్ లో క్రియా శీలకపాత్ర పోషిస్తూ చివరికి సోషలిస్ట్ జియోనిజం లో చేరింది .మిల్వాకీ లోని స్టేట్ నార్మల్ స్కూల్ లో చేరి ‘’ఇద్ధిష్ స్పీకింగ్ ఫోక్స్ స్కూల్ లో లేబర్ జియోనిజం లో ముఖ్య పాత్ర పోషించింది .మోరిస్ డేయార్సన్ తో సన్నిహిత౦ గా మెలగి లేబర్ జియానిస్ట్ కు అంకితభావంతో పని చేస్తూ మిల్వాకీ పబ్లిక్ లైబ్రరీ లో పార్ట్ టైం ఉద్యోగం చేసింది . మేరిస్ ను తామిద్దరం ఇజ్రాయిల్ లో స్థిరపడటానికి ఒప్పించి గోల్డా అతనిని 1917లో పెళ్లి చేసుకొన్నది .అమెరికా మొదటి ప్రపంచయుద్ధం లో చేరటంవలన ఇజ్రాయిల్ వెళ్ళే అవకాశం ఆగిపోయి ,అమెరికాలోనే ఉంటూ దేశమంతా తిరుగుతూ పోల్ జియాన్ యాక్టి విటీస్ నిధి కోసం తీవ్రంగా కృషి చేసి విజయం సాధించింది .

పాలస్తీనా రాజకీయం –ఉద్యోగ సోపానం:

గోల్డా మీర్ దంపతులు 1921లో పాలెస్తీనా లో స్థిరపడ్డారు. వీరిద్దరితోపాటు ఆమె సోదరి శయనా కూడా వచ్చింది . బ్రిటిష్ మాండేట్ పాలస్టైన్ లో గోల్డా దంపతులు కిబ్బూజ్ లో చేరారు .అక్కడ వాళ్ళపని ఆల్మండ్ లను కోయటం ,మొక్కలు నాటటం ,వంటపని ,గుడ్ల పని చేయటం .ఆమె శక్తి సామర్ధ్యాలు గుర్తించి ఆమెను హిస్ట్రా డట్ అనే జనరల్ ఫెడరేషన్ లేబర్ కు ప్రతినిధిని చేశారు .1924లో దీన్ని వదిలి టెల్ అవైవ్ కు దంపతులు చేరి ఒకకొడుకు ఒక కూతురు లకు జన్మనిచ్చారు .1928లో గోల్డా వర్కింగ్ వుమెన్ కౌన్సిల్ సెక్రెటరి అయింది .దీనివలన 1932-34వరకు రెండేళ్ళు సంతానం తో అమెరికాలో ఆమె ఉండాల్సి వచ్చింది .భర్త జెరూసలెం లో ఉండి పోయాడు .ఇలా విడిపోయిన ఆ భార్యా భర్తలు తిరిగి కలుసుకోలేదు. కానీ విడాకులు తీసుకోనూ లేదు.1951లో మోరిస్ చనిపోయాడు .

రాజకీయ సోపానం:

1934లో అమెరికా నుంచి తిరిగి వచ్చాక గోల్డా మీర్ ‘’హిస్ట్రా డట్’’ఎక్జి క్యూటివ్ కమిటీలో చేరి క్రమంగా ఎదుగుతూ పొలిటికల్ డిపార్ట్ మెంట్ హెడ్ అయింది .ఇందులో పొందిన శిక్షణ ఆమె భవిష్యత్ నాయకత్వానికి గొప్ప ఆసరా అయింది.1938లో అమెరికా ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ 32దేశాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఈవియన్ కాన్ఫరెన్స్ కు పాలస్తీనా తరఫున జ్యూయిష్ పరిశీలకు రాలిగా హాజరై, ఐరోపా యూదుల దయనీయ స్థితి గతులను వివరించి , ఆ దేశాలు యూదు శరణార్ధులను ఎందుకు అనుమతించటం లేదని తీవ్రమైన ఆవేశంతో ప్రశ్నించింది .డొమెనికన్ రిపబ్లిక్ మాత్రం ఒక లక్షమంది శరణార్ధులకు అనుమతించింది .ఆ సమావేశ ఫలితం సంతృప్తి గా లేదని విలేఖరులతో చెబుతూ గోల్డా ‘’నేను బతికి ఉన్నంతకాలం నా పాలస్తీనా ప్రజలకు ఇక సానుభూతి వచనాలు సహించను ‘’అని మొండి ధైర్యం తో తెగేసి చెప్పింది .

యూదుల వాణి:

1946లో బ్రిటిష్ ప్రభుత్వం పాలస్తీనాలో జియోనిస్ట్ ఉద్యమం పై తీవ్రంగా విరుచుకు పడింది ఈషువ్ అంటే బ్లాక్ షబ్బాత్ సభ్యులను మోషే షెర్రత్ తో సహా వందలాది మందిని అరెస్ట్ చేసింది .గోల్డా మీర్ జ్యూయిష్ ఏజెన్సీ కి చెందిన పొలిటికల్ డిపార్ట్ మెంట్ క్రియా శీలక హెడ్ గా బాధ్యతలు తీసుకొని యూదుల సమస్యలను ప్రపంచం దృష్టికి తెచ్చింది .పాలస్తీనా యూదులకు ,బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగటానికి ముఖ్య ప్రాతినిధ్యం వహించింది .షర్రాత్ విడుదలైనతర్వాత గొల్డాను పొలిటికల్ హెడ్ గా ఉంచి ,అమెరికా వెళ్లి ‘’యు యెన్ పార్టిషన్ ప్లాన్ ‘’తో చర్చలు జరిపాడు .

1948 జనవరిలో జ్యూయిష్ ఏజెన్సీ ట్రెజరర్ కు ఇజ్రాయిల్ కు అమెరికన్ జ్యూయిష్ కమ్యూనిటి నుంచి ఏడు లేక ఎనిమిది మిలియన్ల డాలర్ల ఆర్ధిక సాయం మాత్రమే అందే వీలుంటుంది అని తెలియజేశారు .గోల్డా మీర్ అమెరికా వెళ్లి విస్తృతంగా పర్యటించి, అందరినీ భాగస్వాములను చేసి 50,000,000, డాలర్లు సాధించి ,ఆడబ్బుతో యూరప్ యువకులకు ఆయుధాలు కొనుగోలు చేయించింది ఇది ఆమె సాధించిన చారిత్రాత్మక విజయం అని పత్రికలు పతాక శీర్షికలతో రాశాయి .1948 మే 10న ఇజ్రాయిల్ సాధికారంగా ఏర్పడటానికి నాలుగు రోజులముందు గోల్డామీర్ ఆరబ్ మహిళా వేషం లో అమ్మాన్ లో జోర్డాన్ రాజు అబ్దుల్లాతో సమావేశమై యూదులపై దాడి చేయటానికి ఇతర ఆరబ్బు దేశాలతో చేతులు కలపవద్దని కోరింది .ఆయన ఇజ్రాయిల్ దేశం ఏర్పాటుపై ప్రకటనకోసం తొందరపడ వద్దని సలహా ఇచ్చాడు .దీనికి ఆమె ‘’ఇప్పటికి 2 వేల సంవత్సరాలనుంచి ఇజ్రాయిల్ దేశం కోసం ఎదురు చూస్తున్నాం .ఇది తొందరపాటా ?’’అని ఎదురు ప్రశ్న వేసింది .ఇజ్రాయిల్ స్వాతంత్ర యుద్ధం మొదలవటానికి ముందు ఆరబ్బులంతా దేశం విడిచి వెళ్లి పోవాలని అల్టిమేటం ఇచ్చింది .

ఇజ్రాయిల్  ప్రకటన:

1948మే14 న ‘’ఇజ్రేలి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ‘’పత్రం పై గోల్డా మీర్ తోపాటు 24 మంది ప్రముఖులు సంతకాలు చేసి విడుదల చేశారు .ఈ సందర్భంగా ‘’నిజమైన నా ప్రజలు నిజంగా ఈపని చేస్తున్నారా అని ఆశ్చర్య పడుతున్నాను ‘’అన్నది గోల్డా . ఆ మర్నాడే సరిహద్దు దేశాల సైన్యాలు ఇజ్రాయిల్ పై దాడి ప్రారంభించాయి .ఇదే ‘’1948 ఆరబ్ –ఇజ్రాయిల్ యుద్ధం ‘’గా చరిత్రకెక్కింది .ఆసైన్యాన్ని దీటుగా ఎదుర్కొని ,ఇజ్రాయిల్ ప్రజలను సంఘటితపరచి యుద్ధానికి పరి సమాప్తి పలికింది .

మంత్రి పదవి –రష్యా ప్రజల అపూర్వ స్వాగతం –కరెన్సీ నోటు పై గోల్డా బొమ్మ:

మొదటి ‘’ఇజ్రాయిలి పాస్ పోర్ట్ ‘’పొంది గోల్డా మీర్ ఇజ్రాయిల్ మంత్రిగా బాధ్యతలు చేబట్టి1948 సెప్టెంబర్ 2నుంచి 1949మార్చి వరకు ఉన్నది .ఆయుధ సేకరణకు రష్యాతో సంబందాలు అవసరం అని భావించి స్నేహ హస్తం చాచింది .రష్యా నియంత స్టాలిన్ కూడా అనుకూలంగా స్పందించాడు .తర్వాత హిబ్రూ భాష నిషేధం ,యూదుల సంస్థలపై నిషేధం పెట్టిన రష్యాతో మైత్రి తెగ తె౦పులయింది .ఈ కొద్దికాలం లోనే గోల్డా మాస్కో వెళ్లి రోష్ హసన్నా ,యాం కిప్పూర్ సమావేశాలలో పాల్గొన్నది .వేలాది రష్యన్ యూదులు ఆమె పేరు స్మరిస్తూ వీధులలో స్వాగతం పలికారు .ఇజ్రాయిల్ దేశం 10,000ల షెకెల్ బాంక్ నోటు పై ఒకవైపు ఆమె బొమ్మ ,రెండవ వైపు ఆమెకు స్వాగతం పలికిన రష్యా ప్రజల బొమ్మతో ముద్రించి 1984నవంబర్ లో విడుదల చేసి ఆమెకు అత్యధిక గౌరవం కలిగించింది .

ప్రజా సేవలో పునీతం:

1949లో KNESETకు మపాల్ ప్రతినిధిగా ఎన్నికై 1974వరకు 25ఏళ్ళు గొల్డామీర్ సేవలందించింది .1949నుంచి 1965వరకు లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేబట్టి విజయవంతంగా పూర్తి చేసింది .శరణార్ధులను జాతీయ పౌరులుగా తీర్చి దిద్దింది .రోడ్డు గృహ నిర్మాణాలకు భారీ ప్రాజెక్ట్ లను నిర్వహించింది .ఆ కాలం లో 2లక్షల అపార్ట్ మెంట్ లు ,30వేల గృహాలను నిర్మించి ఇచ్చింది .అనేక వ్యవసాయ ,కర్మాగార అభి వృద్ధి కార్యక్రమాలు స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ రోడ్లనిర్మాణ౦ చేసింది .1954లో నేషనల్ ఇన్స్యూ రెన్స్ చట్టం తెచ్చి ప్రజలకు సాంఘిక భద్రత కల్పించింది .1955లో బెన్ గున్యాన్ ప్రోద్బలంతో టెల్ అవైవ్ కు మేయర్ గా పోటీచేసి ఆడవారికి పదవేమిటి అనుకొన్న మఠాధిపతుల ఆహ౦కారానికి బలై, రెండే రెండు వోట్ల తేడాతో ఓడిపోయింది .

సమర్ధ విదేశాంగమంత్రి:

1956లో ప్రధాని డేవిడ్ బెన్ గున్యాన్ మంత్రివర్గం లో విదేశీ వ్యవహారాలమంత్రిగా గోల్డా మీర్ సమర్ధవంతంగా పని చేసింది .ఆమెకు ము౦దు పనిచేసిన మోషే షెరాట్ ఆదేశం ప్రకారం విదేశే వ్యవహార శాఖలో పని చేసే వారంతా హిబ్రూ ఇంటి పేరు తప్పక పెట్టుకోవాలనే నియమం తో గోల్డా తన మేయర్సన్ ఇంటిపేరు ను’’ సంక్షిప్తం చేసి ‘’మీర్ ‘’గా మార్చుకొన్నది .దేశాన్ని తీర్చి దిద్దుకొనే నేర్పు ఇజ్రాయిల్స్ కు ఉన్నదని ఆఫ్రికన్ లకు ఇజ్రాయిల్ ఒక రోల్ మోడల్ గా ఉంటుందని తన చర్యలద్వారా చాటి చెప్పింది .విదేశ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేబట్ట గానే సూయజ్ కాలువ సమస్య తీవ్రమై౦ది .ఇదే రెండవ ఆరబ్ –ఇజ్రాయిల్ యుద్ధంగా మారింది .1956ఇజ్రాయిల్ ఈజిప్ట్ పై దాడి చేసింది .త్రైపాక్షిక సమావేశాలలో అంతర్జాతీయంగానూ సమస్య పరిష్కారానికి ఇజ్రాయిల్ తరఫున నిలిచి తనవాణి వినిపించింది .

ఇజ్రాయిల్ తొలి ప్రధాని గోల్డా మీర్:

1957అక్టోబర్ 29న సమావేశ మందిరంలో ఉండగా శత్రువులు వేసిన మిల్స్ బాంబ్ కు మీర్ పాదానికి కొద్దిగా దెబ్బతగిలింది .గున్యాన్, మోషే కార్మెల్ లు తీవ్రంగా గాయపడ్డారు . యూదులకు అండగా నిలిచినందుకు 1958లో 12వపోప్ పయస్ పాల్ కు కృతజ్ఞతలు తెలియజేసింది .1960లో లి౦ఫామా వ్యాధి సోకింది .లేవి ఎష్కోల్ అకస్మాత్తుగా మరణించగా పార్టీ గోల్డా మీర్ ను ప్రధానమంత్రిగా ఉండమని ఆదేశించగా ఇజ్రాయిల్ దేశానికి తొలి ప్రధానిగా గోల్డా మీర్ 17-3-1969 బాధ్యతలు చేబట్టి,1974వరకు అయిదేళ్ళు సమర్ధవంతంగా పాలించింది .జనరల్ ఎన్నికలలో తనపార్టీకి అఖండ విజయం చేకూర్చి రికార్డ్ సృష్టించింది .1969-70కాలం లో రిచర్డ్ నిక్సన్ ,6వ పోప్ పాల్ విల్లీబ్రాంట్ వంటి ప్రపంచ ప్రసిద్ధ నాయకులతో సమావేశాలు జరిపింది .అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ఆమోదించి యుద్ధానికి స్వస్తిపలికింది . 1973ఫిబ్రవరి 28 వాషింగ్టన్ లో హెన్రి కిసింజర్ చేసిన శాంతి ప్రపోజల్ ‘’సెక్యూరిటీ వర్సెస్ సావేరినిటి ‘’ ని అంగీకరించింది

1972లో మూనిచ్ ఒలింపిక్స్ లో జరిగిన దారుణ హత్యాకాండ కు బాధ్యులైనవారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని మీర్ కోరింది .1970లో 2లక్షల రష్యన్ యూదులను ఇజ్రాయిల్ కు వెళ్ళిపొమ్మని ఆదేశించగా వారు ఆస్ట్రియా నుండి ఇజ్రాయిల్ కు బయల్దేరగా కొందరిపై ఆంక్ష విధిస్తే , వారి విడుదలకై పోరాడింది .1973లో గోలన్ హైట్స్ పై సిరియన్ సైన్యాలు దాడి చేస్తాయని తెలిసి యుద్ధ ప్రమాదం ముంచుకొస్తుందని భయపడే తరుణంలో6రోజుల యాం కిప్పూర్ వార్ తర్వాత చాకచక్యంగా వ్యవహరించి యుద్ధ ప్రమాదం తప్పించింది .అప్పుడు ఆమెకు అండగా నిలిచింది ఒంటి కన్నున్న ఇజ్రాయిల్ రక్షణ మంత్రి మోషే డయాన్ . పదవీ కాంక్ష లేని ప్రధాని.

1973 డిసెంబర్ ఎన్నికలలో మీర్ పార్టీ ఘనవిజయం సాధించింది .కాని గోల్డామీర్ 1974ఏప్రిల్ 11న ‘’ అయిదేళ్ళు సుదీర్ఘ కాలం ప్రధానిగా ఉన్నాను .ప్రజాసేవలో సంతృప్తి చెందాను .ఇక చాలు ‘’అని చెప్పి రాజీనామా చేసింది .ఆమె స్థానం లో రాబిన్ ప్రధాని అయ్యాడు .1975లో మీర్ తన స్వీయ జీవిత చరిత్ర ‘’మైలైఫ్ ‘’రాసి ప్రచురించింది .1977లో ఈజిప్ట్ ప్రధాని అన్వర్ సాదత్ ఇజ్రాయిల్ ను మొట్ట మొదటిసారి సందర్శింఛి చరిత్ర సృష్టించాడు .

గోల్డా మీర్ శక సమాప్తి:

8-12-1979న 80 ఏళ్ళ వయసులో లి౦ఫటిక్ కేన్సర్ వ్యాధితో ఇజ్రాయిల్ తొలి, చివరి మహిళా ప్రధాని , ‘’యూదుల స్వరపేటిక’’,,’’ఐరన్ లేడీ ఆఫ్ ఇజ్రాయిల్ పాలిటిక్స్ ‘’ప్రపంచం లోనే మొట్టమొదటి మహిళా ప్రధాని గోల్డా మీర్ మరణించింది .ఈమె తర్వాత బ్రిటన్ కు మార్గరెట్ థాచర్ ,శ్రీలంకకు సిరిమావో బండారు నాయకే ,ఇండియాకు ఇందిరాగాంధీ ప్రధానులయ్యారు .వీరికి మార్గ దర్శకురాలు గోల్డా మీర్ .

1974లో అమెరికన్ మదర్స్ గోల్డా మీర్ కు ‘వరల్డ్ మదర్ ‘’అవార్డ్ ఇచ్చి సత్కరించారు .ప్రిన్స్టన్ యూనివర్సిటి 1974లో జేమ్స్ మాడిసన్ అవార్డ్ ఇచ్చి గౌరవించింది .1975లో ఇజ్రాయిల్ ప్రభుత్వం ఆమె దేశానికి ,సమాజానికి చేసిన సేవలకు గాను అత్యుత్తమమైన ‘’ఇజ్రాయిల్ అవార్డ్ ‘’అందజేసి సన్మానించింది .ఆమె సేవలను ‘’ది బెస్ట్ మాన్ ఇన్ ది గవర్న్ మెంట్ ‘’అని గొప్పగా చెప్పుకొంటారు . ‘’గ్రాండ్ మదర్ ఆఫ్ ఇజ్రాయిల్ జ్యూయిష్ పీపుల్ ‘’అని గోల్డా మీర్ ను సంస్మరిస్తారు .ఇజ్రాయిల్ ప్రజల మనసులలో ఆమె చిరస్థాయిగా నిలిచి పోయింది .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

విజయావారి సాంఘిక మాయాబజార్ -గుండమ్మకథ

విజయావారి సాంఘిక మాయాబజార్ -గుండమ్మకథ

Continue reading

Posted in సమీక్ష | Leave a comment

12-సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు

12-సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు

అత్తాను రామానుజా చార్యుని ;;శ్రీ రుక్మిణి కురవంజి ‘’తాళపత్ర గ్రంధం లోనే సర్వజ్ఞ పద్మనాయక భూపాలుని ‘’సారంగధర చరిత్ర –యక్షగానం ‘’కూడా ఉందట .కులం ,పదవులు , బిరుదాలు మాత్రమె కావ్యం లో ఉన్నాయి.సర్వజ్న బిరుదు ఇద్దరు ముగ్గురులకు ఉంది .చాలాశిధిలంగా ఉన్న గ్రంధం చదవటానికి ఇబ్బంది గా ఉందని బిరుదరాజు గారువాచ .కంట్లో వత్తులు వేసుకొని ప్రతి అక్షరాన్నీ కొన్ని వారాలు చదివారట రాజుగారు .ఇక్కడ మనకు వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాధసూరి పడిన కస్టాలు గుర్తుకొస్తాయి .ఆయన కంటి రెప్పలకు దారాలు వాటికి చివర రాళ్ళు కట్టుకొని సంస్కృతకావ్య వ్యాఖ్యానం రాశాడు చివరి రోజుల్లో.

ఆటతాలం లో –శ్రీ విభుని బూజించి వాక్పతి ——యెపుడు-నవని పార్వతీశ్వరు ప్రస్తుతి౦తున్

విఘ్న రాజుకు మొక్కి —-వాగ్వితతి నిర్విఘ్నముగ శ్రీ యక్ష —వేడుకొందున్’’

వ్యాసభట్టార్యు  వాల్మీకి మదిని గొలిచి –ఆశుగ బ్రహ్మాది మునులకు నా౦జనేయు

పూని దత్తిలచరన కోహల క్రుంగవాజి ల –గాన శాస్త్ర ప్రబంధ  కర్తల కరుణ వడసి

తివిరి బాణమయూరుల చిత్తమున నిలిపి తక్కిన కవి వరేణ్యుల కెల్ల’’

తర్వాత ద్విపదల పేరిటఉన్న పంక్తులున్నాయి .తర్వాత వచనం ఉన్నది –ధనకనక వస్తు వాహన సమృద్ధి వడసి —నిత్యమై విజయలక్ష్మి గలిగి —-లక్ష్మి పరిపూర్ణమై ‘’

కవి తాను ‘’కాచమ దేవి గారాల సుతుడను ‘’అని చెప్పుకొన్నాడు .గురువుఆచార్య మణి భట్టరు ,కోరుకొండకు చెందిన పరాశరభాట్టరే  మణిభట్టరు అంటారు రాజుగారు .శ్రీశైలానికి ఉత్తరానున్న ఉమామహేశ్వరమే కవి చెప్పిన ఉమాచలం అన్నారు .

తలవరులమాటలను ఉత్కళికలో రాశాడు –‘’ఉభయకుల పావనుడగా ఉద్భవించి –పరగిన శుభ గుణోజ్వల సజ్జనుడ రాసుతుడ—అయ్య ఇదిగోరాజు  మనసు లరసి చూసి –పోయిరి చయ్యనను పయనంబుగావలె సజ్జనుడా ‘’

ఇది యక్షగానం అవునోకాదో, కవి  సర్వజ్ఞుడు రేచర్ల వంశంవాడో కాదో ఇంకా తేలాల్సిన విషయం అన్నారు బిరుదరాజు వారు .ఇంత శ్రమపడి ఈ కృతి విషయాన్ని లోకానికి అందించిన  ఆచార్య బిరుదరాజువారికి తెలుగుజాతి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు ?

ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-19-ఉయ్యూరు

 

 

 

 

 

 


 

I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.
Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

5 of 14,582 25 వేల ఏళ్ళ క్రిందటి నోమాడిక్తెగకు చెందిన మానవ అస్థిపంజరం రష్యాలో దొరికింది

Large Mound in Russia Reveals 2,500-Year-Old Skeletons of Elite Nomadic Tribesmen…And a Horse Head

A farmer in Russia has uncovered the remains of three elite members of a nomadic tribe from 2,500 years ago. A horse’s skull and harness were found buried alongside one of the individuals.

Three 2,500-year-old burials of elite members of a group known as the Sarmatians have been discovered within a kurgan (a large mound) in a village called Nikolskoye located northwest of the Caspian Sea in Russia.

The three skeletons were discovered inside the remains of wooden coffins within the kurgan. [See Photos of the Burials and Skeletons from the Nomadic Tribe]

Though the kurgan had been robbed in ancient times, many artifacts such as weapons, gold jewelry and household items (such as a bronze cauldron) were discovered near the coffins, according to two Russian language statementsreleased by the Astrakhan regional government.

The three burials date back to a time when the Sarmatians flourished in the region. This nomadic group thrived in southern Russia, before moving into eastern and central Europe while fighting wars against other ancient peoples such as the Scythians, Romans and Goths.

Rustam Mudayev discovered the kurgan after noticing a bronze cauldron while working on a farm. Mudayev reported the discovery to authorities, and a team led by Georgiy Stukalov, an archaeologist at the Astrakhan State Museum, excavated the site.

Excavation of the kurgan and analysis of the remains is ongoing. They have yet to determine how the individuals died or their gender and age.

Kurgans have frequently popped up throughout Russia and neighboring countries over the last century; they often contain the burials of elite members of ancient groups.

Archaeological remains from the newly found kurgan are being taken to the Astrakhan State Museum, the statements said.

image.png
I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.
Posted in సైన్స్ | Tagged | Leave a comment

11-అత్తాను రామానుజా చార్యులు

1-అత్తాను రామానుజా చార్యులు

24శిధిల తాళపత్రాలలో ‘’రుక్మిణి కొర వంజిని’’ ద్విపదకావ్యం రచించిన అత్తాను రామానుజాచార్యులకాలాదులు తెలియవు .ఇది ప్రాచీన యక్షగానానికి చెందిన ప్రాచీన కొరవంజి .ఇస్ట దైవతాప్రార్ధన చేసి తర్వాత తనగురించి కవి చెప్పుకొన్నాడు .

‘’మునిగ్రామ వాసుడగు మూర్తిగలయట్టి – వనధి యగు పా౦డ్రాజు వంశపావనుడ

అత్తాను సంబంధమైనట్టి వాడ –అత్తాను రామానుజాచార్య సాహ్వయుడ

కరమొప్ప రుక్మిణీ కళ్యాణ సరళి –కరమర్ధితో యక్షగానంబు రీతి

కొరవంజి జేసెద కూర్మితో ననుచు –ధరణిపై మదిలోన దలచినయంత ‘’

శ్రీరంగనాధుడు మనసులో కనిపించి కృతి రచించ మనగా   ‘’గురుతుగా మదన గోపాలునకు –కొరవంజి జేసెద కుంభిని వెలయ ‘అని మొదలుపెట్టి రాశాడు .గుంటూరు ,మహబూబ్ నగర్ జిల్లా,లలో మునిపల్లె గ్రామం ఉన్నది .కవి తండ్రిపేరుకాని, తాతపేరుకాని’’ పాండ్రాజు’’ అయి ఉండాలని బిరుదరాజువారు ఊహించారు .కాలం మాత్రం 16 వ శాతాబ్దికాదు అన్నారు. కావ్యం చివరలో కృతిభర్త అయిన స్వామిని స్తుతించాడు .కురవంజిలో జంపె సువ్వాల మంగళహారతులు ద్విపదలు ధవళాలు ఉన్నట్లు రాజుగారన్నారు.

  రుక్మిణీ కృష్ణుల వివాహ సందర్భంగా కొట్నాలు దంచినప్పుడు’’ సువ్వాల ‘’రాశాడుకవి

‘’కూరిమితో బంగారు కుందనాలో కొలుచు నించి –గారవించి సతులు రోకళ్ళు దంపుచూ

సువ్వి రంగనాధ సువ్విసువ్వి  వేంకటేశ సువ్వి –సువ్వి కృష్ణరాయ సువ్విలాలె’’

ముత్తైదువులు కా౦తుడైన కృష్ణుని పాటలతో ఇలా స్తుతించారు –

‘’నాదా వినోది కృష్ణ నాధా కృష్ణా – వన్నె సన్న సూది పచ్చ  గన్నెరాలు క్రష్ణభోగి

సన్నరాజనాలు ,  జీలసర్లు దంపుచూ –ఉబ్బి నిక్కి జంగ జూచి ఉవిదలెల్ల చెమట జార

గబ్బి గుబ్బ లదరగాను కలయ దంచిరీ –ఎంచి పెండ్లి మోపు ఇంట –

పంచగతుల జేరి వాయించ దొణగిరీ’’.

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పుట్టివారి పురస్కారం

పుట్టివారి పురస్కారం

17-5-19శుక్రవారం సాయంత్రం గుడివాడ లైబ్రరీలో శ్రీమతి పుట్టినాగ లక్ష్మి అందజేసిన పురస్కారం

 

పుట్టి వారి పురస్కార ప్రదానోత్సవం

తలిదండ్రులమీద అమితమైన భక్తీ తాత్పర్యాలు ఉండవచ్చు ,వారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు కాని వారి ఆశయాలసాధనకు ఒక సంస్థ నెలకొల్పి ,,దాన్ని సామాజిక సేవా కేంద్రంగా మలచి ,ప్రతిసంవత్సరం వారిని స్మరించే విశిష్ట కార్యక్రమ౦ నిర్వహిస్తూ ,సమాజంలో లబ్ధప్రతిస్టు లైన వివిధ రంగాలకు చెందిన వారిని వడబోసి ఎన్నిక చేసి వారికి ఆ రోజు పురస్కారాలు అందజేయటం ఏ కొందరో చేస్తున్న విశేషమైన కార్యక్రమం .అలాంటి అరుదైన కార్యక్రమాన్ని చేబట్టి పోలీస్ ఆఫీసర్ అయిన తమ తండ్రి కీశే శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు గారి పేరిట ‘’సామాజిక సంస్థ ‘’ఏర్పరచి ప్రతి ఏడాది ఇలాంటి విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నగుడివాడకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని  శ్రీమతి పుట్టి నాగలక్ష్మి మిక్కిలి అభినందనీయురాలు .

తమ తండ్రిగారి 13వ వర్ధ౦తి నాడు 17-5-19 శుక్రవారం సాయంత్రం గుడివాడ ‘’షా గులాబ్ చాంద్ ఫాజ్మల్ జీనావాత్ ప్రధమ శ్రేణిశాఖా గ్రంధాలయం లో ‘’ప్రతిభా పురస్కార ప్రదాన సభ ‘’నిర్వహించి అందరి దృష్టినీ ఆకర్షించి అందరి మనసులలో స్థిర స్థానం సంపాదించుకొన్నారు .నాకు కూడా పురస్కారం ఇవ్వబోతున్నట్లు ,ఆమె సుమారు వారం క్రితం ఫోన్ చేసినా, నేను అందుబాటులో లేనందున ,ఆబాధ్యత శ్రీ పూర్ణచంద్ గారికి చెప్పటం, ఆయన ఫోన్ చేసినప్పుడూ నేను స్పందిచక పోవటం వలన నేనే ఆయనకు కారణం అడగటం ఆయన వివరంగా చెప్పటం నేను సరేననటం జరిగిపోయిది. ఆతర్వాత దాదాపు ప్రతిరోజూ నాగలక్ష్మి గారు నాకు ఫోన్ లో టచ్ లో ఉన్నారు . వాట్స్ అప్ లో పెట్టిన’’ ఎర్రక్షరాల ‘’ఆహ్వాన పత్రాన్ని శివ లక్ష్మి నాకు పంపితే ,ఆ అక్షరాలంటే భయపడే నేను ,అందులో చదవటానికీ ఇబ్బంది కూడాపడి నా పేరుమాత్రం చూసుకొని అందరికీ ఫార్వార్డ్ చేశాను .

శుక్రవారం సాయంత్రం 4-30కు ఉయ్యూరు నుంచి షేర్ ఆటోలో పామర్రు చేరి ,అక్కడ మరో ‘’షేరు’’లో ఎక్కి గుడివాడ చేరి సభాస్థలికి వెళ్లేసరికి సాయంత్రం 5-45అయింది .అప్పటికే కార్యక్రమం షురూ అయింది  .అదే -గుంటూరు కు చెందిన విశ్రాంత ప్రాచార్యులు ,’’పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశం ‘’గా రాసి దర్శకత్వం చేసి మహిళామణుల చే నిర్వహిస్తున్న ‘’ప్రకృతి విలాసం ‘’

ఇందులో శ్రీమతి భమిడి కమలాదేవి (తణుకు )శ్రీ లలితా పరమేశ్వరిగా ,ఆచార్య రాజ్యలక్ష్మి శ్యామలా మంత్రిణి గా ,వసంత ఋతువు పాత్రను శ్రీ మతి యెన్ కనకదుర్గ (నూజివీడు )గ్రీష్మర్తు ను శ్రీమతి సి హెచ్ కళ్యాణ లక్ష్మి (విజయవాడ ) వర్షఋతువు ను శ్రీమతి చల్లా సీతామహాలక్ష్మి (విజయవాడ )శరత్తుగా డా.  శ్రీమతి వేమూరి సత్యవతి (విజయవాడ )హేమంత రుతువుగా డా.శ్రీమతి మైలవరపు లలితకుమారి (గుంటూరు )శిశిరఋతువు ను డా .శ్రీమతి తాడేపల్లి వరలక్ష్మి (తణుకు ) చక్కగా పోషించి ,రుతుధర్మాలను వివరిస్తూ ,అందులో వచ్చే పండుగ పబ్బాలను ,వాటిలోని పరమార్ధాలను విశేషాలను చేతిలో స్క్రిప్ట్ లేకుండా చక్కగా వివరించి ఆకర్షణీయంగా వివరించి  అందరి మన్ననలనందుకొన్నారు.అందులో లలితా పరమేశ్వరి గా భమిడి కమలాదేవిగారు అద్భుతంగా ఉండటమేకాదుసాక్షాత్తు ఆ పరాభట్టారిక మన ఎదుట ఉన్నంత పవిత్రతను నిండు తనాన్ని చేతు లెత్తి నమస్కరించేట్లుగా పోషించారు .తర్వాత నాకు బాగా నచ్చినపాత్ర లలితకుమారిగారి హేమంతం .అద్భుతః అనిపించింది గొప్ప విదుషీమణి అవటం తో పాత్ర స్వరూప స్వభావాలతో బాగా రాణించారు  . ఈ సాహిత్యరూపకం రెండేళ్లలో 12 ప్రదర్శనలు పొంది దిగ్విజయం పొందింది .నేను అభినందిద్దామనుకొంటే సభ అంతా  అయాక  లలితకుమారిగారు  నా వద్దకు వచ్చి తాను రాసిన ‘’ఆంద్ర మహాభాగవతము –సఖ్యభక్తి ‘’పుస్తకాన్నిందించారు .నేను సరసభారతి ఆహ్వానిస్తే ఉయ్యూరు రావాలని కోరాను తప్పక వస్తానన్నారు . ఇవాళ అంటే శనివారం ఆమెకు బుక్ పోస్ట్ లో మన పుస్తకాలు 4పంపాను .

అందరూ శ్రమపడి వ్యయప్రయాసలకోర్చి ఈ వేసవిలో మన హృదయాలను రసప్లావితం చేయటానికి చాలా శ్రమపడ్డాడు .వీరి టీం నాయకు రాలు రాజ్యలక్ష్మి గారి పూనిక రచన దర్శకత్వం మార్గదర్శకం మిక్కిలి అభినందనీయం .కాని అసలే పైన అట్టలు ఊడిపోయి  ,ఎసిలున్నా పని చేయలేదో లేక వేయటం మర్చే పోయారో తెలీదు కాని  చమటలో తడిసి ముద్ద అయ్యాము అందరం .అన్ని రుతువులుకలిసి’’ గ్రీష్మరుతువై ‘’ప్రకృతి విలాసం బదులు ‘’విలాపం ‘’తెచ్చినట్లనిపించింది .కనుకఅక్కడ  ప్రకృతి సహకరించి ఉంటే రూపకం మరింత ఆకర్షణీయంగా ఉండేది .ఈ విషయాలను సభలో చెబుదామనుకోన్నాకాని  బాగుండదేమోనని సంకోచించి సభ అయిపోయి టిఫిన్లు కూడా తిన్నాక కేబి లక్ష్మి గారి దగ్గరకు వెళ్లి నెమ్మదిగా చెప్పగా ఆమె ,పగలబడి నవ్వి’’ ఎంత బాగా గమనించారు మీరు ‘’అన్నారు .ఏది ఏమైనా ఒక గొప్ప ప్రదర్శన గుడివాడలో ఏర్పాటు చేయి౦చిన ఘనత శ్రీమతి పుట్టినాగలక్ష్మి  గారిది.

సాయంత్రం 6-30 అయింది రూపకం పూర్తయ్యేసరికి .ఆతర్వాత డా జి వి పూర్ణ చ౦ద్ అధ్యక్షతన బిరుదప్రదాన ,పురస్కార సభ ప్రారంభమైంది .ముఖ్య అతిధిగా గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలకార్యదర్శి శ్రీ కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు ,ఆత్మీయ అతిధులుగా అదే కాలేజికి చెందిన విశ్రాంత గ్రంథాలయాదికారి శ్రీ పావులూరి శ్రీనివాసరావు ,బాల సాహితీవేత్త శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపురసుందరి ,మచిలీపట్నం అన్నపూర్ణ వృద్దాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి కరెడ్ల సుశీల పాల్గొని ఇచ్చిన సమయం లో తమ మనోభావాలను వివరించారు .ఎవరూ ‘’సమయపు సరిహద్దు ‘’దాటకుండా పూర్ణచంద్ గట్టిగా,నిక్కచ్చిగా సెంట్రీ డ్యూటీ చేశారు  .

తర్వాత ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి ‘’సాహితీ సేవా సేనాని ‘’బిరుదును ,శ్రీమతి డా కే బి లక్ష్మిగారికి ‘’తెలుగు కథా కల్పవల్లి ‘’బిరుదును అందజేస్తున్నట్లు ,ఎందుకు ఇస్తున్నారోకూడా తెలియజేసి పూర్ణచంద్ ప్రకటించగా అ౦దరూ హర్షధ్వానాలతో ఆమోదించారు .పిమ్మట ప్రతిభా పురస్కార ప్రదానం జరిగింది .ముందుగా గుడివాడకు చెందిన 92ఏళ్ళ సీనియర్ రంగస్థల నటులు శ్రీ బొడ్డపాటి సువిశ్వేశ్వరరావు ,,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,భావతరంగిణి మాసపత్రిక సంపాదకులు శ్రీ భవిష్య ,ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం అధ్యక్షులు శ్రీ వేములపల్లి కేశవరావు ,రచయిత్రి ,విప్లవవీరుడు అల్ల్లూరి సీతారామరాజు గారి వంశీకురాలు యెపిఐఐసి మేనేజర్ శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి ,స్థానిక పొట్టి శ్రీరాములు హైస్కూల్ వ్యాయామోపాధ్యాయులు శ్రీ మడకా వెంకట సత్య సాయి ప్రసాద్ గార్లకు గుత్తికొండ ,పూర్ణచంద్ ల చేతులమీదుగా పుట్టి వెంకటేశ్వరరావు స్మారక ప్రతిభా పురస్కారాలను అందజేయించారు తానూ, తమతల్లిగారు ,కుటుంబ సభ్యుల సమక్షంలోనాగలక్ష్మిగారు  . బిరుదు గ్రహీతలు,పురస్కారగ్రహీతల చేత ముందే మాట్లాడించి ఒక కొత్త ప్రక్రియ చేబట్టి తర్వాత సత్కార కార్యక్రమం నిర్వహించటం చాలాబాగుంది .పురస్కారంగా శాలువా జ్ఞాపిక ,శ్రీమతి పుట్టినాగలక్ష్మి అక్టోబర్ లో గాంధీ జయంతి నాడు వెలువరించిన ‘’స్టాంపుల్లో మహాత్ముడు ‘’పుస్తకం ,అతిదులందరికి రెండేసి బంగినపల్లి మామిడి పళ్ళు అందజేశారు .

ఈ సభలో కొన్ని తమాషాలు –కేబి లక్ష్మిగారు సభాముఖంగా ‘’దుర్గాప్రసాద్ గారు నన్ను ఉయ్యూరుకు పిల్చి సరసభారతి పురస్కారం ఇంతవరకు ఇవ్వలేదు అని అభియోగం మోపుతున్నాను ‘’అన్నారు నవ్వుతూ .వెంటనే నేను ఫ్లోరా స్కూల్ లో సరసభారతి కార్యక్రమం లో గుత్తికొండ వారి ఆధ్వర్యం లో సత్కరించాము ‘అనగా అలాకాదు ‘’నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి మీ చేతులతో సన్మానం చేయాల్సిందే ‘’అన్నారు బుంగమూతి పెట్టి అల్లరిపిల్లలా .సరే అలాగే చేస్తాం అన్నాను .లక్ష్మిగారు నాకు గొప్ప సాహితీ ఫాన్ .నాకు ఆమె అంటే విపరీతమైన సాహిత్యాభి భిమానం . అందుకే అంత చనువుగా మాట్లాడారు .

పూర్ణ చంద్ గారు నా గురించి చాల మంచి విషయాలు చెప్పారు .నిరంతర రచనా వ్యాసంగ శీలిగా  పేర్కొన్నారు .సంస్కృత కవులపై ఎవరూ చేయేనంత కృషి చేసి మూడు సంపుటాలు ప్రచురించారు .ఏదైనా విషయం ఇచ్చి రాయమంటే గడువుకు ముందే రాసి పంపటం ఆయన తీరు. మాటలోఎంత స్పీడో రచనలోనూ అంతకంటే ఎక్కువ స్పీడ్ అన్నారు .ఈ సారి  కృష్ణా జిల్లా రచయితల సంఘం సమావేశం ఉయ్యూరు లో దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యం లో జరిపించాలి అనగానే అందరూ చప్పట్లు కొట్టి నా గుండెలో రైళ్ళు పరిగెత్తించారు .సరసభారతి కార్యక్రమాలకోసం ఏ ఒక్కరినీ ఒక్క రూపాయి చందా అడగకుండా పదేళ్లుగా నిర్వహిస్తున్నాము . కృష్ణాజిల్లా రచయితల సంఘం సభలకు విరాళాలకోసం కెసీపి సహాయం అడగటానికి సుబ్బారావు ,పూర్ణచంద్ గార్లతో కలిసి  వెళ్ళటమేకాని ,ఎప్పుడూ మా సభలకు వారి ఆర్దిఅక సాయం కోరలేదు .అలా నడుపుకొస్తున్నాం .సరే ఎందుకొచ్చిందో పూర్ణచంద్ గారి నోటి వెంట ఆమాట . భవిష్యత్తు ,మాసువర్చలాన్జనేయ స్వామి తేల్చాలి .

నేను మాట్లాడుతూ ‘’శ్రీ లక్ష్మీ నృసింహ జయంతి నాడు, రేపు బుద్ధ ,అన్నమయ్య జయంతి సందర్భంగా ఇందరు ప్రతిభామూర్తుల సమక్షం లో పురస్కారంఅందుకోవటం ఆనందంగా ఉంది .నేను రాసినవన్నీ ఒక ఎత్తు అయితే ‘’కోన సీమ ఆహితాగ్నులు ‘’గురించి అంతర్జాలం లో రాసింది ఒకయెత్తు. దీన్ని దేశ విదేశాలలోని వారంతా స్వాగతించి అభినందించారు .అది నా అదృష్టం .నాగలక్ష్మిగారు ఎన్నో సార్లు తమ సభలకు రమ్మని ఫోన్ లో పిలిచేవారు  .ఎప్పుడూ రాలేదు .దాదాపు 15ఏళ్ల తర్వాత గుడివాడ సాహిత్య సభలో పాల్గొన్నాను .అంతకుముందు శ్రీ వసుధ చేసే సభలకు చాలాసార్లు వచ్చాను .కడిమిళ్ళ వారి జంట అవధానానికి వచ్చాను చివరిసారిగా మిత్రుడు శ్రీ తుమ్మోజు రాలక్ష్మణాచార్య్యులు గారికి  స్థానిక  ‘’అమ్మ సేవాసమితి’’ పురస్కారం ప్రదానం చేస్తున్నప్పుడు ఫోన్ చేసి నేను రావాలనికోరితే వచ్చాను .మళ్ళీ ఇప్పుడు గుడివాడలో కాలుపెట్టాను .తండ్రి పేరిట పురస్కారం నేను అందుకోవటం ఇది మూడవ సారి .మొదటిసారి 2012లో అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ లో మా అమ్మాయి శ్రీమతి విజ్జి అల్లుడు  అవధాని దంపతుల ఇంటిప్రక్కన ఉన్న శ్రీమతి గాయత్రి తన తండ్రి గారి తిథి రోజున నన్ను పిలిచి భోజనం పెట్టి శాలువాకప్పి 100డాలర్లు ఇచ్చి  సరసభారతికి వినియోగించమని కోరింది .రెండవది ఈ సంవత్సరం ఏప్రిల్ 2న  బెజవాడలో శారదా శ్రవంతి నిర్వాహకులు శ్రీ పంతుల వెంకటేశ్వరరావుతమ తండ్రిగారి స్మారక ఉగాది పురస్కారం అందజేశారు ,ఇప్పుడు శ్రీమతి పుట్టినాగలక్ష్మి గారు తమ  పితృ పాదుల జ్ఞాపకార్ధం సాహితీ పురస్కారం అందించారు  ఇది నాకు ‘’పోలీస్ అవార్డ్ ‘’లాగా అనిపించి హాయినిచ్చింది .ఈ మూడిట్లో రెండు కూతుళ్ళు ఇచ్చినవి .తండ్రిపై కూతుళ్ళ  కున్న మమకారానికి గౌరవాదరాభిమానాలకు ఇవి నిదర్శనలు .నాగలక్ష్మిగారు మరింత సాహితీ సేవ  చేస్తూ తలిదండ్రుల ఋణం తీర్చుకోవాలని కోరుతున్నాను .

మరోకమాట –శ్రీ బొడ్డపాటి చంద్ర[i]శేఖరరావు గారు గురువారం రాత్రి ఫోన్ చేసి గుడివాడలోశుక్రవారం జరిగే పురస్కార గ్రహీతలలో తమ తండ్రిగారు కూడా ఉన్నారని చెప్పేదాకా నాకు తెలియదు .రావు గారు సభకు వచ్చారు .92ఏళ్ళ వారి తండ్రిగారికి సరసభారతి తరఫున పురస్కారం 27,28,29లలో జరిగే శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమాలలో ఒకరోజు అందజేస్తామని ఇంతవరకు నాటకరంగం లో వారి ప్రతిభను గుర్తి౦చ లేకపోవటం సిగ్గుగా ఉందని చెప్పి ,సభాముఖంగా కూడా ప్రకటించి సంతృప్తి చెందాను .

ఇవాళ శనివారం  బొడ్డపాటివారికి  నెట్ లో ఆహ్వానం పంపి ఫోన్ చేసి చూడమని చెప్పగా ఆయన గుడివాడలోని తమ తండ్రిగారు సోదరులతో సంప్రదించి 27వ తేదీ సోమవారం ఉయ్యూరు వచ్చి పురస్కారం  తీసుకొంటారని  తెలియజేసి ఆనందం కలిగించారు .

ఈ సభలో నా అజ్ఞానం బయట పడిన సందర్భం .సభలోనేను కూర్చున్న సీటు వెనక సీటులో కూర్చున్న ఒక పెద్దాయన నన్ను చూసి నవ్వితే నవ్వానే కాని ఆయనెవరో గ్రహించలేకపోయాను. ఆయనే పలకరిస్తే ‘’నిస్సిగ్గుగా ‘’మిమ్మల్ని గుర్తు పట్టలేదు అన్నాను ఆయనే నేను కోట  సీతారామాంజ నేయులు , మిమ్మల్ని చూడటానికి వచ్చాను ‘’అనగా తలది౦చు కొన్నాను సిగ్గుతో .వారు మా గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రిగారి కుమారులు .విశ్రాంత కెమిస్ట్రీ లెక్చరర్ ,బేతవోలు వాస్తవవ్యులుల. శ్రీ కోట సీతారామాంజనేయులు గారు .సారీ సారీ అని చెప్పినా మనసుకు సమాధానం చెప్పుకోలేకపోయాను .ప్రతి సెప్టెంబర్ 5గురుపూజోత్సవానికి వారు ఉయ్యూరు వస్తూనే ఉన్నారు .ఎలా గుర్తించలేకలేకపోయానో ఆశ్చర్యం. అజ్ఞానమే అనుకొన్నాను .ఆయన నాకు ఒకసంచీలో రెండు భగవద్గీతలు ,ఒక స్వామివారి ఫోటో పెట్టి అందజేసి ,తము ఇంటికి వెళ్ళాక మెయిల్ రాస్తామన్నారు .

సభ అంతా అయ్యేసరికి రాత్రి 9 దాటింది .అందరికి ఇడ్లీ ,గారే ,స్వీటు పెట్టారు .తినేసి పామర్రుకు పరుగు లంకించుకొన్నాను .

నేనుఉయ్యూరు చేరే సరికి  రాత్రి 10-30అయింది .పామర్రుదాకా షేర్ ఆటోలో వచ్చి ఉయ్యూరుకు ఆటో కోసం ఎదురు చూస్తుంటే ,సుమారు 30ఏళ్లక్రితం ఉయ్యూరు హై స్కూల్ లో నాశిష్యుడు పోలినాయుడు వచ్చి ‘’సార్ నేను ఇప్పుడే  అవనిగడ్డ నుంచి వస్తూ మిమ్మల్ని చూసి కారు ఆపాను కార్లో వేద్దాం రండి ‘’అని సాదరంగా పిలిచి ఎసికారులో ఉయ్యూరులో మా ఇంటి దగ్గర దింపాడు .మజ్జిగాన్నం తిని, ఫోటోలు పెట్టి ,కోట సీతారామా౦జ నేయులు గారికి ‘’మన్నించండి ‘’అని మెయిల్ రాసి అర్ధరాత్రి నిద్రకు ఉపక్రమించాను .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-19-ఉయ్యూరు

 

— 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హనుమజ్జయంతి సందర్భంగా సరసభారతి 92ఏళ్ళ ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం

శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా సరసభారతి 92ఏళ్ళ ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి  ఆత్మీయ  సత్కారం

 27-5-19 సోమవారం ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయస్వామి దేవాలయం లో సాయంత్రం 6-30గం’లకు  డా  .వేదాంతం శ్రీధరచార్యులుగారి ‘’సుందరకాండ –శ్రీ హనుమ వీరవిక్రమ పరాక్రమాలు ప్రభు భక్తీ ‘’ధార్మిక ప్రసంగం అనంతరం-

రాత్రి 7-30గం.లకు గుడివాడకు చెందిన 92సంవత్సరాల ప్రముఖ  రంగస్థల నటులు ,అనేక అవార్డులగ్రహీత శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి స్వామి సమక్షం లో సరసభారతి 139వ కార్యక్రమ౦గా ఆత్మీయ సత్కారం నిర్వహిస్తోంది . సాహిత్యాభిమానులు ,కళాభిమానులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

                                              గబ్బిట దుర్గాప్రసాద్ – సరసభారతి అధ్యక్షులు

                                               ఆలయ ధర్మకర్త

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మానవుల ,నియాండర్తల్ ల ఆవిర్భవం ఒకే చోటుముండే -లైవ్ సైన్స్

Humans and Neanderthals Evolved from a Mystery Common Ancestor, Huge Analysis Suggests

Modern humans and Neanderthals may have diverged at least 800,000 years ago, according to an analysis of nearly 1,000 teeth from humans and our close relatives.

This new estimate is much older than previous estimates based on ancient DNA analyses, which put the split between humans and Neanderthals as happening between 500,000 and 300,000 years ago.

However, while outside researchers called the new dental analysis impressive, they note that it’s based on one big assumption: that tooth shape evolves in a steady fashion, especially in Neanderthals. If tooth shape doesn’t evolve at a steady rate, then “the construction of this paper collapses,” said Fernando Ramirez Rozzi, director of research specializing in human evolution at France’s National Center for Scientific Research in Toulouse, who was not involved in the study. [Photos: See the Ancient Faces of a Man-Bun Wearing Bloke and a Neanderthal Woman]

That said, it is quite possible that teeth (and Neanderthal teeth in particular) do evolve at a predictable rate, meaning the new study’s calculation might be on target. “At the moment, there is the idea of a steady evolutionary rate change in the shape of cheek-teeth,” Ramirez Rozzi said.

The researchers examined 931 teeth belonging to a minimum of 122 individuals from eight groups, including humans and our close relatives. Of those, 164 of the teeth were from the early Neanderthals from the Sima de los Huesos (“Pit of the Bones”) site in Spain, a sample that includes almost 30 individuals that lived about 430,000 years ago, during the middle Pleistocene epoch.

by comparing the differences in tooth shape between samples, study researcher Aida Gómez-Robles, a paleoanthropologist at University College London, was able to calculate the evolutionary rates for dental shape change and then estimate the divergence time from the last common ancestor between humans and Neanderthals.

The result — that Neanderthals and modern humans probably diverged more than 800,000 years ago — shows that the last common ancestor of these two groups is probably not Homo heidelbergensis, as some scientists think.

H. heidelbergensis cannot occupy that evolutionary position because it postdates the divergence between Neanderthals and modern humans,” Gómez-Robles told Live Science in an email. “That means that we need to look at older species when looking for this common ancestral species.”

The finding also “has profound implications for the way we interpret the fossil record and the evolutionary relationships between species,” Gómez-Robles said.

Pushing back the divergence between Neanderthals and modern humans “is opening a new door” because it suggests that the two groups were distinct for much longer than previously thought, Ramirez Rozzi said.

However, this raises a question, he said. Humans and Neanderthals interbredaround 60,000 years ago, when modern humans left Africa. (This interbreeding explains why the genomes of some modern humans contain nearly 3% Neanderthal DNA.) But if humans and Neanderthals broke apart at least 800,000 years ago, it’s surprising that they were still able to interbreed just 60,000 years ago, Ramirez Rozzi said.

“In other words, almost 1 million years of evolution was not enough to establish barriers (genetic, endocrinological, behavioral, etc.) to separate definitively these two species?” he asked.

The argument is laid out well by Gómez-Robles, who is “a well-known specialist of the Neanderthal lineage dental morphology,” said Bruno Maureille, director of research at the National Center for Scientific Research (CNRS), in Paris, who was not involved in the study.

But, it appears that the dental remains of Neanderthals from different pockets of Europe each have “their own particularities,” Maureille told Live Science. “Can we simply try to draw such global scenarios? [I’m] not so sure.”

image.png

The

image.pngr
Posted in సైన్స్ | Tagged | Leave a comment

రాళ్ళపల్లి మరణం

ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఈ రోజు తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కళాకారుడు ఎప్పుడూ నిత్యవిద్యార్థే అని చెప్పే రాళ్లపల్లి 1960లో ముఖానికి రంగులు వేసుకొని నటనా జీవితానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి.. శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్‌ 1 విడుదల, సూర్య ఐపీఎస్‌, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరకాండ, భలే భలే మగాడివోయ్‌ తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో జన్మించిన రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె మృతి చెందగా.. మరో అమ్మాయి అమెరికాలో ఉంటున్నారు. రాళ్లపల్లి భౌతికకాయాన్ని నిమ్స్‌లోని మార్చురీకి తరలించారు. అమెరికా నుంచి ఆయన కుమార్తె వచ్చేంత వరకు అక్కడే ఉంచనున్నారు.

‘బొంబాయి’లో హిజ్రాపాత్రతో ఔరా అన్పించారు!

తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన రాళ్లపల్లి.. సినీ ప్రస్థానంలో తన విలక్షణమైన నటనతో ఐదు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు ఆయన విశేష సేవలందించారు. మణిరత్నం దర్శకత్వంలోని ‘బొంబాయి’ చిత్రంలో హిజ్రాగా నటించి ఔరా అన్పించారు. రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1974లో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 8వేలకు పైగా  నాటకాల్లో నటించిన ఆయన చాలా భాగం నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. కేవలం హాస్య నటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాళ్లపల్లికి చిల్లరదేవుళ్లు, చలిచీమలు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. జంధ్యాల, వంశీ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రాళ్లపల్లి ఎంఫిల్‌ చేస్తున్నారు. రాళ్లపల్లి మృతిపట్ల తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు, సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

17-5-19శుక్రవారం సాయంత్రం గుడివాడ లైబ్రరీలో స్వర్గీయ పుట్టి వెంకటేశ్వరరావు స్మారక ప్రతిభా పురస్కారాలను కుమార్తె శ్రీమతి పుట్టినాగలక్ష్మి అందజేసిన చిత్రమాలిక

17-5-19శుక్రవారం సాయంత్రం గుడివాడ లైబ్రరీలో స్వర్గీయ పుట్టి వెంకటేశ్వరరావు స్మారక ప్రతిభా పురస్కారాలను కుమార్తె శ్రీమతి పుట్టినాగలక్ష్మి అందజేసిన చిత్రమాలిక

https://photos.google.com/share/AF1QipMYEqIodXrttLk3jjtV08OUux44exK_9-fnczxpuNEGXB8qbmJ5TLUiNPNitveWzg/photo/AF1QipOgnmfX_LzSuQc7BFEdYEiygubR7TBJB8PeKGyL?key=NXhmZTQ2N0puR0w0QkNSN2xQSE5BeWJWb3ZkLURR

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

బుద్ధజయంతి ,అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు

బుద్ధజయంతి ,అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు

image.png
image.png
image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు

10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు

 గద్వాల సంస్థానం లోని  రాజవోలు ను ఇప్పుడు రాజోళి అంటున్నారు ,ఇక్కడ తుంగభద్రానది తుంగ ,భద్ర అనే రెండు పాయలుగా ప్రవహిస్తుంది .రెండుపాయలమధ్య ఏర్పడిన లంకలో రాజవోలు కోటలు ,ప్రాసాదాలు శిధిలమై కన్పిస్తాయి .దుర్గమధ్యమం లో శ్రీ రామనారాయణ ఆలయం ,ఊరికి రెండుమైళ్ళ దూరం లో నది ఒడ్డున రామేశ్వరాలయం ,ఆలయం ముందు చాళుక్య భూలోకమల్లుని శాసనం ఉన్నట్లు శ్రీ మారేమండ శ్రీనివాసరావు తెలియజేశారు .రెడ్డిరాజులైన పాకనాటి ,మిడిమిళ్ళ గోత్రీకుల ఇంటిపేరు ఒకటే ‘’ముష్టిపల్లి ‘’.రాజవోలు రాజధానిగా ఈ రెండుప్రాంతాలను పాలించారు .కొంతకాలం స్వతంత్రంగా ఉండి తర్వాత గద్వాల సంస్థానం లో కలిసిపోయారు .

   రాజవోలు రాజు నాడగౌడు వెంకటభూపాలుడు అనేక గ్రంధాలు రాసిన భక్తకవి కూడా .ఈతడు రాసిన ‘’దివ్య దేశ మహాత్మ్య దీపిక ‘’అనే  ద్విపదకావ్యం 23తాళపత్రాలలో లభించింది .ఇందులో 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు వాటి మహాత్మ్యం వర్ణించబడి ఉంది .మొదట్లో కృతికర్త ,కృతిభర్త వంశ చరిత్రలు చెప్పాడు .ఈ కృతిని రాజవోలు కేశవస్వామికి అంకితమిచ్చాడు .ఈ రాజులకు ప్రోల్గంటి సోమేశ్వరుడు మరొక ఇలవేల్పు .గ్రంధకర్త మూలపురుషుడు ముష్టిపల్లిఇమ్మడి ఎల్లారెడ్డి సోదరుడు చినరెడ్ది.భార్య లక్ష్మాంబ.వీరికొడుకు పిన విభుడు కొడుకే మన వెంకట భూపాలుడు .

   సరళమైన తెలుగులో గ్రంథం నడిపించాడు .అడుగడుగునా భగవద్భక్తి ప్రవహిస్తుంది .ఈ రాజు దీనినేకాక ‘’రాజవోలి వెంకటేశ్వర శతకం ‘’కూడా రాశాడు కాని అది శిధిలంగా ఉందని రామరాజుగారన్నారు .ఇందులో 108పద్యాలు . రాజవోలి వెంకటేశ్వర స్వామికి  అంకితం  .

కం-శ్రీ రమణీ ప్రాణేశ్వర –వారిజ లోచన మురారి —నమ

స్కారమిదె,రాజవోలి వి-హారుని వలెకరుణ వేంకటాచల రమణా’’’

చివరిపద్య౦  –  ‘’నరహరి యెప్పుడు చాలా –నిరతము మదినమ్మినాడ,నీ దాసుని ననున్

మరువకుము రాజవోలీ –హరిలీలలను కరుణ వేంకటాచల రామణా’’

శతకం లో కొన్నిపద్యాలు ర ప్రాసతో కొన్ని న ప్రాసతో  కొన్ని ల ప్రాసతో ,మరికొన్ని బిందుపూర్వక ద కారప్రాసతో ఉన్నాయని రాజుగారు చెప్పారు .శతకం ముగియగానే ‘’రాజవోలి వెంకటేశ్వర కీర్తనలు ‘’రాశాడు .అందులో తోడిరాగం ఆటతాళంలో ఉన్న కీర్తన –

‘’భారంపు సంసార వలల మిమ్ము చేరనైతిగా ఓరంగా –ఏ రీతిగ నను దయజూచి రక్షించెదొ కారుణ్యము మీరగా ఓ రంగా .

ఈ కీర్తనలమధ్య కొన్ని ద్విపదలు కూడా ఉన్నాయట.అందులో ఒకటి –

‘’శ్రీరామ చంద్ర యాశ్రిత సన్మునీంద్ర-కారుణ్య సాంద్ర భాస్కర వంశ చంద్ర ‘’

ఒక కీర్తన శివపరంగా కూడా రాశాడు –

‘’మరచేవేలరా నన్నూ –కోరి చేరితి నిన్నూ

 ’మరచేవేలరా నన్నూ-మరువవద్దురనన్ను పరవతాల మల్లేశ్వరా ‘’

రజతాచల నివాసా ఎప్పుడు నిన్ను –భజియింతు చిద్విలాసా

భుజగే౦ద్రహార –సకలభువనాదార భక్తవరదా

గజచర్మా౦బర ధారా-సకలముని స్తోత్ర

నిజముగ వరము –—-ద్విజరాజ శేఖరా  ఎరా దిగ్విజయమీయరా

ఆనందకరమైన రాజవోలి హరి-పూనిక వేంకటేశుని మానుగ సఖుడైన మల్లేశ్వరా –దాసుని నన్నేలరా ‘’

ఇవన్నీ 17వ శతాబ్దపు రచనలై ఉండవచ్చునని ఆచార్య రాజుగారు భావించారు .

 ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

17-5-19శుక్రవారం వైశాఖ శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు 

17-5-19శుక్రవారం వైశాఖ శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు

image.png

 

శ్రీ మత్పయోనిధి  నికేతన చక్రపాణే -భోగీంద్ర భోగి మణి  రాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత -లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్ ”(శంకర  భగవత్పాదులు  )

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

9-లయగ్రాహి గరుడాచలకవి

9-లయగ్రాహి గరుడాచలకవి

‘’కౌసలేయ మహా ప్రబంధం ‘’అనే అయిదు ఆశ్వాసాల కావ్యరచన చేసిన లయగ్రాహి గరుడాచలకవి చరిత్రకెక్కని చరితార్ధుడు .పాకనాటి రెడ్ల బోరవెల్లి సంస్థానకవి .మిడమిళ్ళ గోత్రీకుడు .ఇంటిపేరు ముష్టిపల్లి ..ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం గాఉన్న బోరవల్లి తర్వాత గద్వాల సంస్థానం లో కలిసిపోయింది .బోరవల్లి రాజుల కులదైవం శ్రీకేశవస్వామికి కవి తన రచన అంకితం చేశాడు .సంస్థానాధీశ్వారుల చరిత్రకూడా ఇందులో రాసి ప్రభుభక్తి చాటుకున్నాడు ,గద్వాల పెద సోమభూపాలునికి మనకవి సమకాలీనుడు .

 మొదటిపద్యం –

ఉ-శ్రీ విలసిల్లు బోర్వెలి పురిన్ తెలిదీవిని నిల్చు వైఖరిన్ –భావము రంజిలన్ నిలిచి భాసిలు కేశవదేవు డాత్మ వ

క్షో వితతాలయంబునను కూర్మిన నిల్పిన రీతి నిల్పుతన్ –శ్రీవనితా శిరోమణిని,శ్రీ గిరియమ్మ గృహా౦తరంబునన్ ‘’

తర్వాత మిగిలిన దేవతల ,బోరవెల్లి రాజుల మరో ఇలవేల్పు పోల్గంటి సోమేశ్వరస్వామిని స్తుతించి ,తొమ్మిదవ పద్యం లో భారత,రామాయణాలు రాసినకవులకు  అంజలి చేర్చి,నాలుగోపాదం లో మురారి కవిని ‘’కవి సన్నుతేత జగన్నాటకో ద్వ్రుత్తి పేరెన్న నలరు మురారి గొలుతు ‘’అని స్పెషలైజ్ చేశాడు .అంటే మురారి అనర్ఘ రాఘవ నాటకమేకాక జగన్నాటక రూపకాన్ని కూడా రాసినట్లు కవి చెప్పాడు .శేషాచలుడు అనేకవి జగన్నాటకం అనే ప్రబంధం రాశాడని ,ఇది ప్రబోధ చంద్రోదయంలాగా వేదాంత పరమైనదని బిరుదురాజువారు పేర్కొన్నారు .గరుడాచలకవి రచనకూడా ఇలాంటిదేనేమో .

   11నుంచి 16వ పద్యం వరకు తనపూర్వులగురించి చెప్పాడు .అందులో మొదటివాడు మాధవకవి క్రష్ణదేవ రాయలచే సత్కరి౦పబడ్డాడు-

‘’మాధవ భక్తి యుక్తు డసమాన కవిత్వ గురుండు కృష్ణ-రాయాధిప దత్త సద్గజ వరాది మహాబలశాలి ,గం

గా ధర కీర్తి సాంద్రుడు జగత్కవి చంద్రుడు మత్కులే౦ద్రుడౌ-మాధవు డస్మదాదులకు మాన్యుడుగాడె తలంచి చూచినన్ ‘’.

రాయలచే సత్కరింపబడిన ఆమాధవకవి రచనలు ఏమయ్యాయో తెలీదు .మాధవకవికున్న ముగ్గురు కొడుకులలో రెండవవాడు రామభద్రుడి చిన్నకోడుకుకి తిమ్మయ్య ,కృష్ణయ్య రామన్నలు కొడుకులు  .రామన్నకు నారాయణ, సీతాపతులు కుమారులు మనకవికి తాతలు .లయగ్రాహి గరుడాద్రి అనే మనకవి తండ్రి నృసింహకవి .కనుక వంశం లో అందరూ కవులే .తర్వాత శార్దూలం లో తన గురువు యోగానంద కవీంద్రుడు అని చెప్పుకొన్నాడు .బహుశా మనకవికి అతడు అన్నయ్య అయి ఉంటాడని రాజుగారి ఊహ .కందంలో తన తండ్రులగూర్చి –

‘’సీతాపతి తనయుల వి-ఖ్యాతుల సంజీవి వెంకటాఖ్యుల సుకవి

వ్రాత స్తుత కవితాఘను –మా తండ్రి నృసి౦హ కవిని మాటికి దలతున్ ‘’

 తర్వాత కుకవి నిందా చేశాడు .ఒకరోజు కలలో కేశవస్వామి కనిపించి ‘’బాలక నా గృహంబెపుడుబాయక విద్యలు నేర్చినావు –భూపాల సభా౦తరాళముల పండితులౌనన’’సత్కవిత్వం రాశావని ,కౌసలేయ చరితం రాసి అంకితమివ్వమని కోరాడు .తనకు గుడికట్టిన గిరియమ్మ తనపై కృతి రచన కోరిందనీ చెప్పాడు

‘’కం –‘’గిరియమ్మ నాకు మెచ్చుగ-శరణము గట్టించి ,యొక్క సత్కృతి నాపై

విరచి౦ప జేయవలెనని –కరమరుదుగ దలచినది  జగద్ధితమిదియున్ ‘’అన్నాడు స్వామి  .ఆమెకుకూడా కలలో కన్పించి నువ్వు రాస్తున్నట్లు చెప్తాలే అనీ అన్నాడు ..నీ అభీష్టాలు తీర్చే నీ ఇలవేలుపు శ్రీ నరసింహ మూర్తిని నేనే ‘’అని అభయమూ  ఇచ్చాడు కేశవుడు .మర్నాడు ఉదయాన లేచి  కృష్ణ వేణికి వెళ్లి పుణ్య స్నాదులు చేసి  గిరియమ్మను సందర్శించగా ఆమె కృతి రాయమని కోరి సత్కరించి పంపింది .

  కవి గిరియమ్మ వంశ చరితను ని౦డుగా రాశాడు .గిరియమ్మ గద్వాలరాజు పెదసోముని కూతురు ,బోర్వెల్లి చినసోముని భార్య గద్వాల, బోర్వేల్లివారిది ఒకటే గోత్రం  .అంటే  సగోత్రీకులమధ్య  వివాహం అన్నమాట .అయోధ్యానగర  వర్ణన పద్యం –

‘’శ్రీ నిలయాగ్ర జస్థితి ధరించి గురూన్నత ఠీవిచే సుద-ర్మానగు భోగభాగ్యము లహర్నిశ మీయగనోపిసౌద శో

భానిరవద్య నిర్జర శుభక్రియ లూని యసాధ్యమై యయో –ధ్యానగరంబు పోల్చు వసుధన్ వసుధామ నియుక్తి స్వర్గమై ‘’

  గ్రంథం రాయబడిన లిపి ఒకరకంగా ,ఆశ్వాసాంత గద్యాల లిపి మరొక రక౦గా ఉందని ఆచార్య బిరుదరాజువారన్నారు .ఒకగద్యం లో’’అష్టవిధ భాషా కవిత్వ సంపన్న సారస్వ తాభినందిత  ‘’అనే విశేషణం అధికంగా కనిపించిందట .అదే కాలం లో గిరియమ్మ  దత్తపుత్రుడు వెంకటపతి కాలం లో చింతలపల్లి చాయాపతి అనేకవి రాఘవాభ్యుదయం అనే మహా ప్రబంధాన్ని రాశాడట .

  ఆధారం – ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

8-పూడూరి కృష్ణయామాత్యుడు

8-పూడూరి కృష్ణయామాత్యుడు

భగవద్గీతకు అనువాదం తెలుగులో చేసిన పూడూరి కృష్ణయామాత్యుడు 18వ శతాబ్దివాడు .యోగానంద గురువరుని శిష్యుడను అని చెప్పుకున్నాడు .తన అనువాదానికి  ‘’శ్రీ భగవద్గీతార్ధ దర్పణం ‘’అని పేరుపెట్టాడు  అయితే యోగానంద అవధూత ‘’గురు శిష్య సంవాదము ‘’,ఆత్మైక్య గీత’’ద్విపద గ్రంథాలురాశాడు .పూడూరు గద్వాలకు దగ్గరున్న చారిత్రిక ప్రదేశం. జైన శైవ వైష్ణవాలకు నెలవు .అవధూతగారి రచనలు తెలంగాణలో బాగా ప్రచారంగా ఉన్నాయి –

‘’——(శిధిలం )మహిన్ జిన్మాత్రమై నిత్య శో –భా సంపన్నత చే ,త్రిమూర్తికలనన్ భాసిల్లు బ్రహ్మబు  ,నెం

తే సమ్మోదమున౦ భజించి ,గురుభక్తిన్ నే కృతార్దు౦డనై-వ్యాసుం గొల్చి సరస్వతిన్  దలచెదన్ భవ్యార్ధ సంసిదికిన్’’అని మొదటిపద్యం రాశాడు .తర్వాత వచనం లో ‘’శ్రీభగవద్గీతా శాస్త్రంబ౦ధ్రభాష  రచియి౦ప౦బూని రెండవ అధ్యాయంబు మొదలుగా భగవంతుండు అర్జునునకు తత్వోపదేశంబొసంగె గావున సాంఖ్య యోగం’’ నుంచి ప్రారంభిస్తున్నానని చెప్పాడు  .ఒకేఒకపద్యము , చిన్నపీఠికతో ముగించటం ఆశ్చర్యంగా ఉందని వేదాంతం కవిని మింగేసిందని ఇంతటి విరాగి చరిత్రలో కనిపించడని  బిరుదరాజువారు అన్నారు .అంటే అర్జున విషాదయోగాన్ని వదిలేశాడు కవి ..కనుక కావ్యం 17అధ్యాయాలకే పరిమితం .

‘’ఉదితాశ్రు పూర్ణ నేత్రుడు –సదయ హృదయుడై గిరీటి సమ్మద మెదలో

వదలుచు శోకంబందగ-పదిలంబుగ శౌరి  పల్కె భాసుర ఫణితిన్’’

అనే కందపద్యం సాంఖ్య యోగం లోని ‘’తంతధా కృపయావిస్టు౦’’శ్లోకానికి అనువాదం .తర్వాత ఉన్న మూడు శ్లోకాలభావాన్ని ఒక్క సీసం లో కుది౦చాడుకవి .ఆ తర్వాత –

‘’భోగములర్ధ కామములు బొల్పగు రక్త విలేపనంబులౌ –నా గురుమిత్ర హంతనయి ,యట్టిది నే భుజియి౦ప నేరను-

ద్వేగమతిన్ విధర్మగతి విశ్రుతమౌ సమర ప్రకాశితో –ద్యోగము బూనగా జయము నోజ బరాజయ మెట్టు లుండునో’’అని సందేహించాడు కిరీటి .

 శ్రీ కృష్ణుడు అర్జునునికి చెప్పిన స్థిత ప్రజ్నుని లక్షణాలను తరువోజ లో చెప్పాడు .మరో తరువోజలో ‘’తగుని౦ద్రియముల చేతను  విషయాళి నాహరించుట( నిరా )హారియనగ’’అని చెప్పి కందం లో-

‘’స్థిరమగు ప్రజ్ఞ కలనం –బిరువొందుదు సాధనేచ్చ నెనయు నపుడ త

ద్గురుతర యత్నము జేయుట –పరమావశ్యకమ్ము సుమ్ము పాండవ వర్యా ‘’

ఇలాకొనసాగించి ఉపేంద్ర వజ్ర లో –

‘’ఈ సాంఖ్య యోగంబున నింద్ర సూనున్ –ధీ సంస్తుతిన్ బూన్చిన  దేవదేవున్

శ్రీ సక్త పాదాబ్జుని చిత్స్వరూపున్-   నే సంస్తుతిన్ జేసెద నిర్మలాత్మున్ ‘’అని పూర్తి చేసి గద్యం లో –శ్రీ మద్యోగానంద గురువర కరుణా పాత్ర వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రరాజ విద్యానుస్టాన పవిత్ర కౌండిన్యసగోత్ర పూడూరి కొదండయామాత్యపుత్ర, కృష్ణయ నామధేయ  ప్రణీత౦బైన శ్రీ భగవద్గీతార్ధ దర్పణంబు నందు సా౦ఖ్యయోగ౦బను ద్వితీయాధ్యాయంబు .శ్రీ యోగానంద గురవేనమః –శ్రీ వేద వ్యాసాయనమః  .

ఇది కేవలం గీతకు అనువాదమేకాక ‘’టీకాప్రాయమైన అనువాదం ‘’అన్నారు రామరాజుగారు .

ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

14వేల ఏళ్ళక్రితం గుహలో పాకిన మానవ పాద చిహ్నాలు-లైవ్ సైన్స్

14వేల ఏళ్ళక్రితం గుహలో పాకిన మానవ పాద చిహ్నాలు-లైవ్ సైన్స్

 

Humans Crawled Through a Cave 14,000 Years Ago. We Can Still See Their Perfectly Preserved Footprints.



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
8520805566

Land Line : 08676-232797

I’m protected online with Avast Free Antivirus. Get it here — it’s free forever.
Posted in సైన్స్ | Tagged | Leave a comment

ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి తరిగొండ వెంగమాంబ

నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి తరిగొండ వెంగమాంబ ”గురు సాయిస్తాన్ మే  సంచికలో పునర్ముద్రితం -దుర్గాప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

7-ఇనుగండ్ల కృష్ణ ప్రధాని

7-ఇనుగండ్ల కృష్ణ ప్రధాని

‘’ధర్మరాజాశ్వమేధం ‘’అనే అయిదు ఆశ్వాసాల ద్విపదకావ్యం రాసిన ఇనుగండ్ల కృష్ణ ప్రధాని ఏ కాలం వాడో తెలియదు. అతని కావ్యం వ్రాతప్రతికూడా శిధిలావస్థలో దొరికింది .దీన్ని శ్రీరంగపతికి అర్పితం చేశాడు కవి .ఆశ్వాసాంత గద్యం లో తండ్రి ఇనుగండ్ల సోమమంత్రి అని ,తిరుమల వేంకటేశ దేశికుని చరణ సేవకుడైన తాను  రాశానని చెప్పాడు .దీనినిబట్టి కవి ఆశ్వలాయనస గోత్రీకుడని,నందపురాగ్రహారవాసి అని తెలుస్తోంది .ఇనుగంటి వెంకన్న అగ్రహారం ,నందపురి వలస అనే గ్రామాలు విశాఖజిల్లా  గజపతినగరం తాలూకాలో ఉన్నాయని ,కవి ఇక్కడి వాడోకాడో చెప్పలేమని బిరుదరాజువారన్నారు .గద్వాలలో తిరుమలవంశీయులన్నారని రాజుగారన్నారు .

ద్విపదకావ్యాన్ని కవి శ్రీరంగనాయకస్వామి స్తోత్రం తో ప్రారంభించాడు .

‘’శ్రీలక్ష్మి యనుమించు చెలువు వహించు –నీలమేఘస్పూర్తి నెరమించు మూర్తి

కావేరి నడుమ భక్త జనావళి బ్రోవ –తావేరి కొనియున్న ధర్మానువర్తి

అనుపమ శంఖ చక్రాది సమస్త –ఘనసాధనంబుల గనుపట్టు దీరు

ప్రణవ మంత్రాస్పద సంధాయి సకల స౦స్థాయి – శ్రితపుణ్య ఫలదాయి శ్రీరంగశాయి

పాద సరోజముల్ భక్తి  సేవించి  -ఆ దేవదేవుని ఆత్మలో నుంచి ‘’

జైమిని భారతం లో ‘’ధర్మమర్మములకు దావలమైన ,ధర్మరాజేశ్వమేధ విదానమేను దేవకీ సుతు కృపద్విపదకావ్యంబు –గావింతు ‘’అని చెప్పి కథాక్రమమ వివరించాడు .సరళమైన కవిత్వం తో మనసుకు హత్తుకోనేట్లు రాశాడు .వ్యాసుడు ధర్మరాజుకు హయమేధ విధానం సవిస్తరంగా తెలియజేసి అంతర్హితుడయ్యాడు ..

ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-5-19-ఉయ్యూరు

 

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పుట్టి వారి పురస్కారం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

6-తురుమిళ్ళ రామన

6-తురుమిళ్ళ రామన

‘’ప్రబంధ యుగానికి చెందినవాడైనా  ,మరుగునపడ్డ మాణిక్యం –శేష ధర్మాలను ప్రబంధంగా రాసిన తురుమిళ్ళ రామన ‘’ అని వ్యధ చెందారు బిరుదరాజువారు .ప్రాచీనులలో తామరవల్లి తిమ్మయ్యావధాని ,వెణుతురుపల్లి విశ్వనాధకవి ,కొడిచర్ల శ్రీనివాసకవి ,కానాల నరసింహకవి,ఆధునికులలో చెదలువాడ సుందర రామ శాస్త్రి ,అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి ,నోరి గురు లింగ శాస్త్రి ,ఎస్ శఠకోపాచారి మొదలైనవారు శేషధర్మాలను ప్రబంధాలుగా కూర్చారు .వీరందరికీ ప్రాచీనుడు తురుమిళ్ళ రామన అని రామరాజుగారి అభిప్రాయం .కోడి చెర్ల ,కానాల వారి గ్రంధాలు ముద్రి౦ప బడలేదని మిగిలినవారివన్నీ ముద్రితాలేనని కానీ రామన గారి గ్రంథం అముద్రితం అనీ  రాజు గారు ఉవాచ .కాలం 16వ శతాబ్దం .వనపర్తి సంస్థానం వారు ఆంద్ర సారస్వత పరిషత్తుకు ఇచ్చిన వ్రాత ప్రతి ఉన్నది .

 మొదటిపద్యం –

‘’శ్రీమించన్ సరసోదయుండయి ,మహా సింహాసనా రూఢుడై-దామస్పూర్తి నెసంగి తమ్ములకు సత్యానంద సంధాయియై

ప్రేమన్ జక్రమునేలు శార్వర హరున్ శ్రీరామ ధాత్రీశ భా –వామేయ ప్రథ మానుడై యలరు పద్మాదీశ్వరు న్ గొల్చెదన్ ‘’

ఆశ్వాసాంత గద్యం లో ‘’నందవర వంశ సుదాంభోనిదాన సుధాధామ ,మనీషా నిర్జిత భోగిరాజ నాగారాజామాత్య తనూజ ,సకల విద్వజ్జన జేగీయమాన సద్గుణ సాంద్ర తురుమిళ్ళరామన కవీంద్ర ప్రణీతంబైన’’హరివంశోక్త శేష ధర్మబు ‘’నందు సర్వంబును అష్టమాశ్వాసము .’’అని తనగురించి చెప్పుకొని శ్రీరామునికి అంకితం చేశాడు కవి .రెండవపద్యం లో సీతాసాధ్వి వర్ణన చేశాడు .తర్వాత రామ సోదరులగురించి చెప్పాడు .తనగురువు రఘురామ భట్టా చార్యుడని అన్నాడు .కంచర్లగోపన్న అనే రామదాసు కూడా  ఒక రఘునాధ భట్టాచార్యులకు అంజలి ఘటించాడని బిరుదరాజు వారన్నారు .తర్వాత పూర్వకవులను, ఆ  తర్వాత తనకు తోడ్పడిన కవిమిత్రులను పేర్కొన్నాడు .అందులో ‘’అత్యుత్తముడు భద్రిరాజు తమ్మన సూరి ‘’అన్నాడు .ఈయనకావ్యం కూడా మరుగునపడి పోవటం దురదృష్టం .

  కలలో శ్రీరాముడు కన్పించిన వర్ణన పద్యం మొల్ల పద్యాన్ని పోలి ఉంటుంది .-

‘’వెడద కన్నులవాడు వేల్పురా రతనంబు నిద్దంపు మై నిగానిగలవాడు –మందహాసమువాడు,మందార శాఖి శాఖోప మాయత భుజాయుగమువాడు

మెరుగు చెక్కులవాడు   ,మేలి పున్నమ చందమామ గేరెడు ముద్దుమోమువాడు –మణి కిరీటమువాడు ,మహనీయ ముక్తాసర౦బులు గల పేరురంబువాడు

తళుకు బంగరు వ్రాత దువ్వలువవాడు –జనక నందన చెంగట దనరువాడు

రమ్య భక్తాను వర్తి శ్రీరామమూర్తి –యలర సాక్షాత్కారించి యిట్లనుచు బల్కె’’.

‘’తురుమిళ్ళ కులాబుధిపూ-ర్ణరాజన్యధిరాజ రామన సుధీంద్ర భళీ

హరివంశ శేష ధర్మము –లురుమతి తెనుగించు భాగ్యమొదవెన్నీకున్ ‘’

అని మెచ్చి ‘’శేష ధర్మపావన చరితంబు తన్మహిమ వాక్పతి కైన గణింప శక్యమే’’అని చెప్పాడు జగదభిరాముడు .రామనకవి కూడా పోతన కవి లాగే దీన్ని తనకు పూర్వం ఎవరూ రాయకపోవటం తన అదృష్టం అనుకొన్నాడు .గౌతమ గోత్రీకుడైనకవి గోత్రకర్త గౌతముడని,ఆవంశం లో తిమ్మన, రామన,పెద్దఎల్లయ వగైరాలతర్వాత 12వ వాడైన  లోకన్న గోపమ్మ దంపతులకు చిట్టెనమంత్రి ,పాపన  ,రామనమంత్రి జన్మించారని చెప్పాడు .తర్వాత ప్రభువుల వర్ణన వారి ఉదారత రాసి వేములపుర పాలకుడైన కూనపులి చిన్ననాయకుడు కార్యనిర్వాహకర్త అన్నాడు .ఈ గ్రామం కడపమండలం పులివెందుల  తాలూకాలో ఉంది ..కడప మండలం లోని కుమాళ్ళకాల్వ ,వేల్పుల పులివెందులమండలం లో పుణ్యకార్యాలు చేశాడుకవి .

 రామనమంత్రి చిత్ర బంధ కవిత్వం’’ పేనటం ‘’లోనూ దిట్ట .నాలుగవ ఆశ్వాసం చివర భుజంగ ప్రయాత గర్భిత స్రగ్విణి వృత్తం రాశాడు –

‘’రాజమానోదయా రమ్య తేజోహారీ –  యాజి భూ నిర్భయా ,యాత్మనానాహరీ

భ్రాజితార్యాశయా  మ్రద్రు వాటీ హరీ –రాజితార్కాన్వయా రావణారీహరీ’’

పంచమాశ్వాసం చివర ఖడ్గబంధంతో  ఒకపద్యం రాసి తన సత్తా ఏమిటో చాటాడు రామన కవి .-‘’ధీరవార సాహసార్క దివ్య సేవ్యభవ్యదా –దారితోగ్ర పంక్తికంఠదక్షజాభి వర్ణితా

తారహార తారకావదాతసద్గుణాస్పదా-దారుణాఘమేఘ  మారుతా వనవ్రతా ‘’

ఇలాంటి ప్రతిభ, వ్యుత్పత్తులున్నతురుమిళ్ళ రామకవి  ‘’హరివంశ శేషధర్మప్రబంధ  కావ్యం ‘’వెలుగు చూడకపోవటం తెలుగువారి దురదృస్టమే.

ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

5-బోయినపల్లి కుమార వేంకటరాయలు

5-బోయినపల్లి కుమార వేంకటరాయలు

‘’కవిరాజుల చరిత్రయేకాదు,రాజకవుల చరిత్ర కూడా కాలగర్భం లో కలసిపోయింది ‘’అని ఆచార్య బిరుదరాజు రామరాజుగారు బాధ పడ్డారు .బోయినపల్లి కుమార వెంకట రాయలు పానగల్లు దుర్గాధిపతి ఐన పద్మనాయక ప్రభువు .కవి పండితులను పోషించటమేకాకుండా సప్త సంతానాలను ప్రతిస్టించినవాడు .కాలం 17వ శతాబ్ది మధ్యభాగం .’’ద్రౌపదీ పరిణయం ‘’అనే అయిదు ఆశ్వాసాల ప్రబంధం రాసి, తిరుపతి వెంకన్నకు అంకితమిచ్చాడు .

ప్రారంభపద్యం –

‘’శ్రీ వత్సా౦కము  భూమి భామయను దృష్టిం జేస్టల౦ దత్సమీ –క్షా వృత్తిన్,దన దివ్య కౌస్తుభమణీ చ్చాయన్నిరోధించి లీ

లా వైముఖ్యము దోపకుండ నలమేల్మంగ౦ భరీ రంభ సౌ-ఖ్యావిర్భూతి నలర్చు వెంకట నగాధ్యక్షుండు మమ్మేలుతన్ ‘’

రెండవ పద్యం లో కవి ఇలవేల్పు నరసింహస్వామి స్తుతి చేశాడు .తర్వాత దైవప్రార్ధన 11వ పద్యం లో తన ఆచార్యుడై సముద్రాల తిరుమలాచార్య దౌహిత్రుడైన వేంకటాచార్యకుమారుడు కొనపాచార్య మొదలైన వారి   విశేషాలు చెప్పాడు.12వ పద్యం లో తండ్రి గురించి చెప్పి తర్వాత పూర్వకవుల్లాగా కుకవి నిందా చేశాడు .ఒకరోజు స్వప్నం లో ‘’కలుములీనెడు కేలు గల మేలు నెలమేలు నలమేలు మంగ ము౦గ లను బెనయగా’’  ఏడుకొండలవాడు కనిపించి  ,తనకు ఒక కృతితిరాసి అ౦కితమిమ్మని కోరాడు .

 మర్నాడు కొలువులో విషయం చెప్పి  బోరవెల్లి నరసింహకవి ని పిలిపించి గౌరవించగా .కవి రాజు గారి  ప్రతిభను ఇలామెచ్చాడు సీసం లో –

‘’గోపగోపక గోపగోపనల్ నలువొందు-నీ దయోదయ భోగ నియతికలన –రాజరాజవ రాజ రాజజుల్ జులుకన –నీనిదాన ధనారి నిధాన నిధులు

ధర్మ ధర్మజ ధర్మ ధర్మముల్ ములుసూప –వరయ నీ శమన సత్యరుతి గతుల –రామరామారామ రామమూర్తులతుల –నీబల ధర్మార్ధ నిశ్చయములు

గీ –గండ భేరుండ గండరగండ చండ-నమర నిశ్శంక బిరుదాంక సదకలంక

పద విశ౦కట వెంకట ప్రభు కులాధి – నాయక కుమార వెంకట రాయ ధీర’’అని పొగిడాడు .సంతోషపడినరాజు వెంకటరాయడు –

శా-‘’ఆర్వేలాన్వగేయ రాయసము మల్లామాత్య సూర్య న్వయా-యోర్వీదేవ మత స్వతంత్ర  కపి గోత్రోద్భూత  దత్తాహ్వయాం

తర్వాణి ప్రియ సూను కృష్ణ విదుషా త్మప్రోద్భవుం డైనయా –బోర్వెల్లీ పుర నారసింహ కవి సంబోధించి ఇట్లంటొగిన్’’అని కవిగారి వంశజుల ఘనతను పొగిడాడు రాజు –

‘’మీ తాతతాతకు భ్రాత్రుజ సూతి గ –దా రాయసము మల్లసూరి చంద్ర

భాను చరిత్ర మొప్పగ జెప్పె,మీ తాత –దత్తన్నశబ్దశాస్త్ర ప్రవీణు-డతని సుతుండు కృష్ణప యయాతి చరిత్ర –మిశ్రకావ్యమొనర్చె  మీ జనకుడు

చేసితివీవు దక్షిణకాశ్యలంపురి  -నృహరి దయోదయో మహిత కలిత

గీ-కృతి యతని కంకితముగ బండితుల మతుల –నెనయ సౌవర్ణ కాఖ్యాన మనగ నొకటి

యుభాయభాషా విశేషోక్తియు (శిధిలం )-సిద్ధముగ సాంప్రదాయ ప్రసిద్ధి గనుచు ‘’

  ఈపద్యాలలో బోరవెల్లి నరసింహకవి తండ్రి తాతలగురించి వారి రచనలగురించి మనకు తెలుస్తోంది .కాని మన దురదృష్టం ఆ ప్రబంధాలజాడ కనిపించనే లేదు .కుమారరాయ ప్రభువుకు బోరవెల్లి కవి ‘’గురుడే గురుడే వరుడే ‘’అయి పూజనీయ స్థానం పొందాడు .

రాజు కవికి తన స్వప్న వృత్తాంతం చెప్పగా కృతి చేయమని కవి ప్రోత్సహించగా గురుకవిని సన్మానింఛి రచన ప్రారంభించాడు కుమారరాయ ప్రభువు .ముందుగా ‘’పెన్ఫాల గోత్రం లో బోయినపల్లి పద్మనాయక కులం లో గండ భేరుండ బిరుదున్న రాక్షమనాయకుడు పుట్టాడు .ఇతని తర్వాత రామరాయలు తిమ్మరాయలు కోననాయకుడు రాజులయ్యారు .కోన కు అప్ప ,మాద ,తిమ్మ,వెంకట  అనే కొడుకులున్నారు .కుతుబ్ షాహీ చేత వీరు సత్కారం పొంది మెతుకు గిరి దుర్గాధిపతులయ్యారు .తిమ్మనాయకుడికి ‘’విభాళ సాళువ’’బిరుదు ఉంది .చివరివాడైన వేంకటరాయలు పానుగల్లు ప్రభువు .ఇతని పెద్దభార్యకొడుకు కోనరాయలు చిన్నభార్య నరసంబ కొడుకే ద్రౌపదీ కళ్యాణ ప్రబంధకర్త మన కవిరాజు వేంకటరాయలు గండభేరుండ బిరుదు పొందాడు .

  ప్రతి ఆశ్వాసం చివర గర్భ బంధకవిత్వాన్ని దట్టించాడు .చివరిదైన పంచమాశ్వాసం లోని ఒకమత్తేభ పద్య  స్వారస్యం చూద్దాం

‘’అతులంబై ఆకలంకమై ప్రభు సమాజాకర్ణ్యమై,వర్ణ్యమై-  యతి పాపావహమై ,శుభావహమునై ,యాచంద్ర తారార్క ,సు

స్థితమై యుండెడు గాక వెంకట నగాధిస్వామి యుష్మద్గుణా౦-కిత మేతత్కృతి యీ క్షితిన్ కవిజనా౦గీకార సారోన్నతిన్ ‘’

ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి కార్యదర్శి మాదిరాజు శివాలక్ష్మి శర్మ దంపతులు చేసిన మాతృ వందనం -ఈనాడు

సరసభారతి కార్యదర్శి మాదిరాజు శివాలక్ష్మి శర్మ దంపతులు చేసిన మాతృ వందనం -ఈనాడు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు

4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు

‘’నవీనం ద్రోణ పర్వం ‘’రాసిన కొటికలపూడివీర రాఘవాచార్యులు గద్వాల సోమనాధ భూపాలుని ఆస్థానకవి .17వ శతాబ్దం వాడు .కొటికలపూడి వీరరాఘవకవి సంస్కృతం లోశ్లోక తాత్పర్యాలతో సహా  రాసిన భారత౦ లోని ఉద్యోగ పర్వాన్ని 1821లో గద్వాలప్రభువులు ముద్రింపి౦చారు .దీన్ని పూడూరి చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు కవి  .ప్రతి ఆశ్వాసం లోనూ స్వామిని స్తుతించాడు . ఇందులో తనది శాండిల్య గోత్రం అని ,మూలపురుషుడు సూరకవి అని చెప్పి తర్వాత వంశ చరిత్ర చెప్పాడు .సోమభూపాలుడు ఉద్యోగ పర్వాన్నివిని  రచన తిక్కన సోమయాజి రచనలాగా ఉందనిమెచ్చి కవికి ‘’నూతన తిక్కన సోమయాజి ‘’అనే బిరుదునిచ్చి ,భీష్మాదిపర్వాలను కూడా రాయమని ప్రోత్సహించాడు .అలాగే భీష్మపర్వం రాసి ,రాజు కోరికపై అక్కడే ఉండిపోమ్మనికోరగా ,ఇంటికి  వెళ్లి వస్తానని చెప్పి, అనుజ్న పొంది స్వపురానికి వెళ్లి రాజు పిలుపుతో మళ్ళీ వచ్చాడు .రాజు తనగురువు ఆనతినిప్పించాడు .దేవుడుకూడా కలలో కన్పించి రాయమన్నాడు .

‘’కార్యము యుక్తమే నియు నగమ్యము మిక్కిలి వ్యాస వాక్య ,తా  -త్పర్యమటంటి  వేని సతతంబు మదీయ సభన్ వసియించు నా

చార్యులు దెల్పు వారది నిజంబుగ,సంశయమైన చోట చా–తుర్యము పేర్మి నీకయిన దోచు మదిన్బరికింప మత్క్రుపన్ ‘’అని వెన్ను తట్టాడు వెన్నుడు .ఉద్యోగపర్వమేకాక అనేక భారత పర్వాలు కవి రాసినట్లు అర్ధమౌతోంది .

అలాగే ద్రోణ పర్వం కూడా ఆ చెన్నకేశవుడికే అ౦కితంచేశాడు .మొదటిపద్యం –

కం-శ్రీ వర కౌస్తుభ రత్న –శ్రీ వక్షస్ఫురిత వక్షశ్రిత జనరక్షా

పావన వనమాలా౦చ ద్గ్రీవా –పూడూరి చెన్నకేశవ దేవా’’

తర్వాత పద్యం

కం-శ్రీమత్పరాశర్యకృ-పామహిమ రచింతు ద్రోణపర్వ ముభయభా

షామార్మిక సూరిజన –స్తోమము లుప్పొంగ నాంధ్ర సూక్తి నిపుణతన్  ‘’

దీనితర్వాత ద్రోణ పర్వకథ ప్రారంభం చేశాడు –

గీ-భావము చెలంగ సేనాధిపత్యమంది –బలము వ్యూహముగా బన్ని ప్రధన కాంక్ష

బలియులైనట్టి నీ తనూభవుల తోన-అమ్మహారధి యాచార్యుడపుడు వెడలె ‘’

గుడ్డిరాజుకు సంజయుడు యుద్ధ వార్తలు వినిపించటం తో కథ మొదలౌతుంది ‘

మనకు లభించిన ద్రోణపర్వం అసంపూర్ణం .ద్రోణపర్వం లో కవి నేర్పు తెలుసుకోవటానికి మరి రెండు పద్యాలు చూద్దాం –

కం-వననిధి ఇంకిన తెరగున –కనక మహీధరము పాదు గదలిన రీతిన్

దినమణి వ్రాలిన కైవడి –ధనురాచార్యుండు వడుట తాళుదు  నెటులన్ ‘’

గీ-గర్వ దుర్వార జనతిరస్కార శీలు-డతినిపుణ ధార్మికావన ప్రతత బుద్ధి

శత్రుసంతాపనుండగు చాపగురుడు –విడిచె రారాజు కొరకు జీవితము నకట ‘’

ఆ.వె.-మందభాగ్యులైన మనవారి విజయాశ –యే మహాత్ము నాశ్రయించి యుండె

బుద్ధిబలము చేత బుధగురుకవి సము-డతడు సమర నిహతు డౌట యెట్లు ‘’

అని నమ్మలేక పోయాడు. ద్రోణ మృతిని జీర్ణించుకోలేకపోయి పెద్దగా బాధ పడ్డాడు పెద్ద వృద్ధరాజు  .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

3-శేషభట్టరు శి౦గరాచార్యులు

3-శేషభట్టరు శి౦గరాచార్యులు

జటప్రోలు సంస్థానాదీశులైన సురభివారు మంచి కళాపోషకులు .కాకతీయ, విజయనగర ,గోల్కొండ రాజులకు సామంతులు గా ఉన్నారు .శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రి గారు ‘’జటప్రోలు సంస్థానాధీశ్వరుల చరిత్ర ‘’రాశారు .ఈ సంస్థాన రాజులలో 21వ తరానికి చెందిన చిన్నమాధవరావు భూపాలుని ఆస్థానకవి యే శేషభట్టరు శి౦గ రాచార్యులు ‘’శూద్ర ధర్మోత్పల ద్యోతినీ స్మృతి కౌముది ‘’అనే ధర్మశాస్త్ర గ్రంథం రాశాడు .దీనికి సంస్కృత మూలం 14వ శతాబ్దికి చెందిన శ్రీ రాయ మదనపాలుడు రాశాడు. చిన మాధవరాయలు’’చంద్రికా పరిణయం ‘’అనే ప్రౌఢ ప్రబంధాన్ని రాసిన నరసి౦గ రాయల కొడుకు .కనుక మన కవి 18వ శతాబ్దివాడు అని బిరుదు రాజువారు తేల్చి చెప్పారు .కవి రాసిన శిధిల  తాళపత్ర గ్రంధాన్ని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి గద్వాల సంస్థానాధీశులు కానుకగా అందజేశారు.శింగరాచార్యకవి సుదీర్ఘమైన పీఠిక రాశాడు .సురభిరాజుల వంశావళిని విపులంగా చర్చించాడు .

  ఈ గ్రంథం సంస్కృత శ్లోకంతో ప్రారంభమైంది .అదీ శిధిలంగా అసంపూర్ణం గానే ఉన్నది

శ్లోకం –‘’శ్రీ రాజ శేఖరః పాయాద —తమ భవాన్వితః  -శ్రీమన్మాధవ రాజేంద్రం పంటపల్లి పురాధిపం

శ్లోకం –శ్రీ రామా పరిరంభ జ్రు౦భణమునన్ జెన్నొందు వక్షంబునన్ –దారం బూనని ,తారహారము మహోద్యల్లీలలందాల్చి భో

గారూడిం దాగు సి౦గ పట్టణ నృసింహస్వామి బ్రోచు౦ దయన్  -సూరీ౦ద్రా వంశ వనశీలునిన్ సురభి వంశ్యున్ మాధవోర్వీశ్వరున్’’

 తర్వాత లక్ష్మి శివ పార్వతీ వృషాకపి (శ్లేష )వృషాకపాయి(శ్లేష )వినాయక ఆన్జనేయాది దేవతలను రాజుకు సకల సౌభాగ్యాలు ప్రసాదించమని ప్రార్ధించాడు .మాధవరాయలకు ఉనికి పట్టు అయిన ‘పంటవెల్లి ‘’పురవర్ణన విపులంగా చేశాడు .ఆగ్రామం ఇప్పుడు ‘’పెంట్లేల్లి ‘’గా మారింది .ఇది కొల్హాపురానికి అయిదు మైళ్ళ దూరం లో ఉన్నది.కావ్యం లో ప్రబంధ వర్ణనలన్నీ గుది గుచ్చాడు . రాజు గుణగానం పలురకాలుగా చేశాడు –

కం-‘’నరసింగ మాధవేంద్రుని-స్థిరతర సత్కీర్తి చెలగ దిశలన్

కరిభిద్దర గిరిభిచ్చర –కరిభిద్వర  శైలతుల్య కాంతి స్ఫురణన్ ‘’

అంటూ రాయల ఆస్థానకవి చెప్పిన  కరిభిద్గిరిభిద్ తరహాలో చెప్పాడు .బిజ్జల తిమ్మభూపాలుని రెండవభార్య పెద్దకొడుకు నరసింహరాయలు మాధవ రాయలకు స్నేహితుడై ఉంటాడని రామరాజుగారు ఊహించారు .మాధవరాయల తండ్రీ ,తాతకూడా కావ్యాలు రాశారు .శేషభట్టరుకవి  శ్రీకేశవ విలాసం వంటికావ్యాలు రాశాడు .బారిగడుపులనారసింహుడు కలలో కన్పించి శ్రీరాయ మదనపాలుడు రాసిన ధర్మశాస్త్రాన్ని తెలుగులో రాసితనకు అంకితమివ్వమని ఆదేశించాడు .తర్వాత 60పద్యాలలో సురభి వంశ వర్ణన చేశాడు .గ్రంథరచన 13-7-1760అని కవి చెప్పాడు .

  బ్రాహ్మీ ముహూర్తం లో చేయాల్సినపనులు ,దంతధావన విధి , శూద్ర ప్రాతఃకాల ,మాధ్యాహ్నిక స్నానవిది ,శూద్ర బ్రహ్మయజ్ఞ తర్పణ విధానం ,శ్రాద్ధపద్దతి ,భోజనపద్దతి వివరంగా రాశాడు .కావ్యంలోని వచనాలు ఆనాటి వ్యావహారిక భాషకు మంచి ఉదాహరణలు అని, పీఠిక ఆనాటి చారిత్రిక విషయాలకు దర్పణం అని అన్నారు బిరుదురాజువారు .

   ఆధారం –ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు

2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు

ఆరు ఆశ్వాసాల ‘’నృసింహ పురాణం ‘’రాసిన బారి గడ్పుల ధర్మయా మాత్యుడుకూడా విస్మృత కవి అయ్యాడు .దీని శిధిల తాళపత్ర గ్రంథం గద్వాల సంస్థానం నుంచి ఆచార్య బిరుదరాజు రామరాజు గారు సంపాదించి ఆ కవి, కృతి చరిత్రను లోకానికి అందించి పుణ్యం కట్టుకొన్నారు .ఇందులోని చివరి పత్రం వలన రాసిన తేదీ తెలిసింది .ఇది 250ఏళ్ళ నాటి గ్రంథంగా రాజు గారు పేర్కొన్నారు .మొదటి భాగం లో ఇస్టదేవతాస్తోత్రాలు ఉండి ఉండవచ్చు .రెండవ కమ్మ లో ఆంజనేయ స్తుతి ఉంది .తర్వాత మూడు పద్యాలలో పూర్వ గీర్వాణ, ఆంద్ర కవుల ప్రశంస ఉంది.

కం.’’మనమున నే భజియింపుదు-ననయము వాల్మీకి వ్యాసు ననిమిష మౌనిన్

ఘన సుర వందితులను స-న్ముని మాన్యుల హరికథాను మోదిత మతులన్ ‘’.

ఉ-‘’చారు మనః ప్రమోదమున సంస్కృత కావ్యమున౦ బ్రవీణులౌ –ధీర మయూరు, బాణు,జయదేవుని జోరుని  గాళిదాసునిన్

భారవి ,మాఘు,బిల్హణుని ,భైరవునిన్ ,శివభద్రునిన్ ,హరిన్ –గూరిమితో నుతింతు మదిగోరిన కోర్కి కనుగ్రహింప గన్’’

కం-తగ న౦ధ్ర భాష నేర్పరు-లగు  నన్నయ భట్టు తిక్కనాహ్వయు,భీమున్

సుగుణుని బమ్మెర పోతన –నొగి భాస్కరు రంగనాథు నొనర దలతున్ ‘’

ఇందులో నృసింహపురాణం రాసిన కవిత్రయం లోని ఎర్రన గురించి లేకపోవటం ఆశ్చర్యమే .తర్వాత రెండు పద్యాలలో కుకవి నిరాదరణ చేశాడు .తర్వాత తన ఇస్ట దైవం ‘’బారిగడుపుల నరసింహస్వామి ‘’ని ఒక పవిత్ర స్థల౦లో లో కూర్చుని ప్రార్ధించాడు కవి . బారిగడుపుల గ్రామం జటప్రోలు సంస్థానం లో ఉంది .ఊరు,ఇష్టదైవం ఒకటేకనుక ఇంటిపేరు కూడా బారి గడుపుల అయి ఉంటుంది .స్వామి ప్రత్యక్షమయ్యాడు రెండు ‘’సీసా’’లతో ఆస్వామిని నుతించాడు.తర్వాత వచనం లో ‘’పూర్వం ద్విపద రూపంగా నృసింహ పురాణం రాసి  నాకు అ౦కిత మిచ్చావు’’అన్నాడు స్వామి  .అది ఏమైందో తెలియదు .

తర్వాత ఉన్న రెండు కందపద్యాలు-

‘’విను మెరిగి౦చెద  నే నీ –జనకుని గరుణి౦చినాడసాక్షాత్కార౦

బున మిమ్ము బ్రోతునేని –ట్లనుదినము ను సంతసిల్లుమని కడిమి మెయిన్ ‘’’’

‘’ఒగి నరసింహ పురాణం -బగణితమది వచన కావ్యమై భువి బరగం

దగ రచియి౦పుమ ఈ కృతి-జగతి బ్రవర్తిల్లు చుండు శాశ్వత మగుచున్ ‘’

వచనకావ్యం అంటే ఇప్పుడు మనకున్న వచనకావ్యం కాదన్నారు బిరుదు రాజు వారు .భగవ దాజ్నను తండ్రికి తెలిపాడు .ఆయన కొడుకుతో –

కం-‘’పరగ మన భాగ్యమున శ్రీ –ధరుడార్త శరణ్యు డతిముదంబున మనలం

గరుణి౦ఛి ఇచట ప్రబలిన –తెరగేనెరిగింతు వినుము ధీర విచారా ‘’అని అనునయించి –

గీ-‘’ప్రబలముగ కశ్యపు బ్రహ్మ మౌని-  మహితుడై గౌతమీ మధ్యదేశ

మునను తపమతి నిష్టతో మొనసిచేయ –వరడుడై చక్రి వేడుము వరములనిన ‘’

ఉ-‘’సన్నుతులోలి జేయుచును సంయమి చంద్రుడు విన్నవించెనో –పన్నగతల్ప ,ఆర్తజన బాంధవ నన్గరుణి౦చితేని నీ

విన్నగభూమి నిల్వు మది ఇష్టము నాకనిన౦ ,బ్రియంబుతో –వెన్నుడు నిల్చి మౌనికిని వేడ్క జని౦ప బ్రసన్న చిత్తుడై’’అని పూర్వ విషయం తెలియజేసి తండ్రి కొడుకుతో ‘’ఈ ప్రదేశానికి పూర్వం చరణాద్రి అనే పెరున్నదని ,కలియుగం లో అది ‘’కాళ్ళకల్లు’’అయిందని ,ఆదేవుడిని నిశ్చలభక్తితో పూజించానని ,కలలో దేవుడు కన్పించి కశ్యపుడు తనను ఇక్కడ ఉండిపోమ్మన్నాడని  నువ్వుకూడా కాశ్యప గోత్రీకుడవు కనుక  ఈ గిరి గహ్వరం లో బారిగాడుపుల నరసింహ మూర్తిగా వెలుస్తాను తనకు ఒక కోవెల కట్టించమని  ఆనతిచ్చాడు .అలాగే చేశాడు కృతికర్త తండ్రి .కనుక నృసి౦హ పురాణ  ప్రబంథా ఆ దేవ దేవుడికే అంకితం చేయమని హితవు చెప్పాడు కవిగారి తండ్రి .

ఇది నృసిమ్హపురానమే అయినా జయ విజయుల మూడు జన్మల చరిత్ర కూడా ఉంది .మొదటి ఆశ్వాసం లో ‘’శ్రీ బారిగడుపుల నృసింహ వర ప్రసాద  కాశ్యపగోత్ర  పవిత్ర తిమ్మయామాత్య పుత్ర,రంగనాహ్వయ సహోదర ధర్మయ నామధేయ ప్రణీ౦తంబైన నృసింహ పురాణ౦బను మహా ప్రబంధంబునందు నైమిశారణ్య వర్ణనం బును శౌనకాదిమునుల మహత్వమును ,నారదాగామనంబును ,నారదుడు భక్తివిజ్ఞానబోధయును –‘’వగైరా వగైరా ఉన్నట్లు చెప్పుకొన్నాడు .

ఆధారం –ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అరవిందాశ్రమ ”మదర్ ”(మాత్రు దినోత్సవం సందర్భంగా )

నేను ఒక దేశానికి చెందిన దాన్ని కాను, నాకు ఒక సామాజికత అంటూ లేదు, నేనొక ప్రత్యేక నాగరికతకు చెందిన దాన్ని కాదు, నాకు ఒక జాతి అంటూ లేదు కానీ నాలో దివ్యత్వం నిండి ఉంది’… ఈ మాటలు చెప్పుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? ‘నేను ఏ యజ మాని ఆజ్ఞలకూ లోబడి పని చేయను. నాకు ఒక రాజు లేడు. ఒక చట్టం లేదు. ఒక మత సమ్మేళనమంటూ లేదు. అయినప్పటికీ నాలో దైవత్వం ఉంది’ అని బహిరంగంగా చెప్పడానికి ఎంత సాహసం కావాలి? సాధారణంగా ఇలా మాట్లాడే వారిని వారిని పిచ్చి వారిగానో, దేశద్రోహులుగానో పరిగ ణిస్తారు ప్రజలు.

అయితే ఈమెను మాత్రం యావద్భారత ప్రజలూ అమ్మగా ఆదరించారు. దేవతలా ఆరాధించారు. ఇంతకీ ఇలా మాట్లాడిందెవరంటారా? ఆమె ఒక విదేశీయురాలు. పుట్టింది, పెరిగింది ప్యారిస్‌లో అయినా, తన జ్ఞానఫలాన్ని, యోగబలాన్ని భారత దేశానికే అంకితం చేసిన సిసలైన ఆధ్యాత్మికవేత్త. ఆమే మిర్రా అల్ఫస్సా. అరవింద యోగిగా ప్రసిద్ధులైన ఆరబిందో ఘోష్ శిష్యురాలు. అరవిందుల ఆనంతరం దాదాపు యాభై ఏళ్లకు పైగా ఆయన నెలకొల్పిన ఆశ్రమాన్ని సజావుగా నిర్వహించారు. అరవిందులు వెలిగించిన ఆధ్యాత్మిక దీపాన్ని ఆరిపోకుండా కాపా డారు. ఆ వెలుగును అందరికీ అందిం చారు.

అందుకే భార తీయులు ఆమెను శక్తిస్వరూపిణి అయిన శ్రీ మాత అని పిలిచారు. ఆదిపరాశక్తిలా పూజించారు. ఆమె వెలిగించిన జ్ఞానజ్యోతులను తమ దేహాలయంలో వెలిగించుకున్నారు.  కర్మయోగి, జ్ఞానయోగి, ఆధ్యాత్మిక, తాత్విక చింతనకు ఆనవాలు శ్రీ అరవిందులు. అరవిందుల బోధలకు ప్రభావితురాలైన ఒక విదేశీ వనిత మిర్రా అల్ఫాస్సా. యోగవిద్యలో ఆమె నిష్ణాతు రాలు. జన్మతః విదేశీయురాలైనప్పటికీ భారతీయ తాత్విక చింతన పట్ల ఆకర్షితురాలైంది. బాల్యం నుంచి  యోగవిద్యను అభ్యాసం చేసింది. ఆధ్యాత్మిక జ్ఞానతృష్ణను తీర్చుకోవడం కోసం దేశవిదేశాలలోని ఎందరో యోగులను, బాబాలను కలిసింది.

కర్మభూమి, పుణ్యపుడమి అయిన భారతదేశంలో అయితే తనను పట్టి పీడి స్తున్న కొన్ని సందేహాలకు సరైన సమాధానం దొరుకుతుందన్న ఆశతో ఆమె పాండిచ్చేరిలోని శ్రీ అరవిందాశ్రమం చేరింది. ఎప్పుడైతే అరవిందులను చూసిందో, ఆమెలో గతజన్మలలోని వాసనలు విచ్చుకున్నాయి. అరవిందుడికి, తనకు పూర్వజన్మ బంధమేదో ఉన్నట్లుగా భావించింది. అంతకాలంగా తాను వెదుకుతున్న ఆధ్యాత్మిక గురువులు అరవిందులేన న్న భావనం ఆమెలో బలంగా ఏర్పడింది. అరవిందులను కృష్ణుడిగా, తనకు తాను యశోదగా ఊహించుకుంది. భారతదేశమే తన అసలైన మాతృభూమిగా భావించింది. తన తుదిశ్వాస వరకు ఇక్కడే ఉండిపోయింది.

పేరుకు శిష్యురాలైనప్పటికీ అరవిందులు ఆమెలోని ఆధ్యాత్మిక చైతన్యానికి మంత్రముగ్ధులయ్యారు. వెనువెంటనే ఆమెను శిష్యురాలిగా స్వీకరించారు. అయితే ఆమె ముందు తాను ఎంతో చిన్నపిల్లాడిగా భావించారు. అమ్మగా అభిమానించారు. తోబుట్టువులా ఆదరించారు.స్నేహితురాలిలా చూశారు. . నోరారా అమ్మా అని పిలిచేవారు. యోగి అరవిందులు ఆమెతో మెలుగుతున్న తీరును చూసి ఆశ్రమాన్ని సందర్శించడా నికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆమెను అమ్మగా గౌరవించేవారు. ఆమెను ఎంతో గౌరవంగా శ్రీ మాత అని సంబోధించే వారు. అనంతర కాలంలో ఆమె శ్రీ మాతగా సుప్రసిద్ధురాలయింది.

అరవిందులు జీవించి ఉన్నకాలంలోనే ఆశ్రమ నిర్వహణ బాధ్యతను ఆమెకు అప్పగించి, ఒక విధమైన తపస్సులో, యోగంలో మునిగిపోయేవారు. ఆమె అరవిందులకు అనేక లేఖలు రాసింది, లేఖాసాహిత్యంలో అవి ఎంతో ప్రసిద్ధిపొందాయి. ఆయన మహాసమాధి చెందిన తర్వాత కూడా ఆశ్రమాన్ని ఎంతో సమర్థంగా నిర్వహించింది. శిష్యులు అడిగే అనేక సందేహాలకు ఎంతో ఓపికగా, సూటిగా, స్పష్టంగా, వివరంగా సమాధానాలు చెప్పింది. అవన్నీ గ్రంథాలుగా వెలువడ్డాయి. అమితమైన ఆదరణ పొందాయి. ‘‘నా జీవితాన్ని, శక్తిని, ఆస్తిపాస్తులను, ఒకటేమిటి నా సర్వస్వాన్నీ అతనికే సమర్పించుకుంటాను. అతను నా రక్తమే కావాలని అడిగితే ఆఖరు బొట్టువరకు ఆనందంగా ధారపోస్తాను’’

ఇక్కడ అతను అనే పదం ఎవరికి వర్తిస్తుంది? అనడిగితే భగవంతుడు అని చెప్పుకోవచ్చు. ఆమె అమితంగా అభిమానించిన అరవిందులు అని కూడాచెప్పుకోవచ్చు. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి, మన దేశంలో జ్ఞానాన్ని సముపార్జించి, డాలర్లకోసం తమ ప్రతిభా సామర్థ్యాలన్నింటినీ విదేశాలకు ధారపోసే ప్రబుద్ధులెందరినో చూశాం మనం. కానీ, పొరుగు దేశంలో పుట్టి, మన దేశసంస్కృతీ సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, ఆధ్యాత్మికతకు ప్రభావితురాలై, తన తుదిశ్వాస వరకూ భారతదేశ ప్రజలకోసమే పరితపించిన సిసలైన శ్రీ మాత ఆమె. అందుకే ఈ దేశంలో శ్రీ మాతా ఎంటర్‌ప్రైజెస్, శ్రీ మాతా ఇంజినీరింగ్ వర్క్స్, శ్రీ మాతా టెక్స్‌టైల్స్.. ఇలా ఆమె పేరుతో ఎన్నో పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు వెలిశాయి. జనం గుండెల్లో కొలువుండిపోయింది.

– డి.వి.ఆర్.భాస్కర్

image.png
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాజా బహరీ పామనాయక భూపాలుడు

రాజా బహరీ  పామనాయక భూపాలుడు

18 వ శతాబ్దం మధ్యలో సురవరం సంస్థానాన్ని  వైభవంగా పాలించినవాడు రాజా బహారీ పామనాయక భూపాలుడు  .అసలుపేరు రాఘవ భూపాలుడు .పీతాంబర నాయకుని పౌత్రుడు .తండ్రి రమణ భూపాలుడు, తల్లి లక్ష్మమాంబ  .సురపురమే షోరాపురమైంది .దీన్ని బేడరు లేక’’ నిర్భయులు’’ అనే  తెలుగు నాయకులు  పాలించారు .వీరు అనాగరికులని ,మైసూరులోని దక్షిణ మహా రాష్ట్ర వీరి ఆదిమ నివాసమని తెలుస్తోంది .ఈ రాజులలో చివరివాడు బాలుడుగా ఉన్నప్పుడు కల్నల్ మెడోస్ సంస్థానాదికారి గా ఉండి, అతనికి యుక్తవయసు రాగానే 1853లో రాజ్యాన్ని అప్పగించాడు .1857ప్రధమ భారత స్వాతంత్ర్య సమరం లోపాల్గొనటం వలన  యితడు బంధింపబడి మరణ దండన విధించారు .కాని పునర్విచారణలో అయిదేళ్ళు కారాగార వాసం తో రాయవేలూరుకు పంపారు .కాని మార్గమధ్యమం లో ఆత్మహత్య చేసుకొన్న తొలితరం స్వాతంత్ర సమరయోధుడుగా వన్నె కెక్కిన త్యాగ శీలి అయ్యాడు .ఈ విప్లవ యుద్ధం లో నిజాం నవాబులు బ్రిటిష్ వారికి సాయం చేయటం వలన సుర పుర సంస్థానాన్ని బ్రిటిష్ వారు నవాబులకు  భక్షీస్ గా అప్ప చెప్పారు .

  ఇంతటి ఘన చరిత్రకాల వీర వంశం లో పుట్టిన పామ నాయక భూపాలుడు కూడా అరివీర భయంకరుడే .ఈయనకాలం లో శ్రీ బుక్కపట్టణం అణ్ణయ్య దీక్షితులు ,శ్రీమన్నిగమాంత దేశికులు గా భావింపబడిన శ్రీ బుక్కపట్టణం శ్రీనివాస దీక్షితులు సోదర కవులు ధర్మవరం నుంచి సురవరం వచ్చి రాజగురువులయ్యారు .రాజును ‘’పరమభాగవత భక్తి తాత్పర్యుడు ‘’అని మెచ్చారు .అణ్ణయ్య దీక్షితుల కుమారుడు కిరీటి వెంకటాచార్యులు .ఈ ముగ్గురు  భారత దేశమంతా పర్యటించి కవితా విజయ దుందుభులు మ్రోగించారు .

   పామనాయకుడు రాజుమాత్రమేకాక స్వయంగా కవికూడా .’’భార్గవ పురాణం ‘’అనే వైష్ణవ గ్రంథం రాశాడు .ఇందులో 8ఆశ్వాసాలున్నాయి.ఈ  రాజులకులదైవం వేణుగోపాలస్వామికి అంకితం.రాజు ఆస్థాన కవుల వర్ణన  ప్రకారం ఈ రాజవంశానికి మూల పురుషుడు  సీతా రామ లక్ష్మణులను  గంగను దాటించిన గుహుడు .ఈ వంశం లో ప్రసిద్ధులు  నరసింహ మహీపాలుడు,వడియర నాయకుడు పెదపామ ధరణీ నాధుడు ,పీతాంబరావనీ పాలుడు మొదలైన 15మంది .

  బేడరు నాయక రాజులు బిజాపూర్ గోలకొండ నవాబులకుసహాయపడి ఔరంగజేబుతో యుద్ధం చేశారు .పూర్వం వీళ్ళకు రాజధాని వాకిన్ ఖేడా .దీనినే ‘’వాగినగిరి’’ అంటారు .ఇక్కడి వేణుగోపాలస్వామి వీరికి ఆరాధ్య దైవం .ఈ దుర్గాన్ని ఔరంగజేబు 1704లో జయించాడు .జేబు చనిపోయాక వీరు మళ్ళీ దుర్గాన్ని స్వాధీన పరచుకున్నారట .పామభూపాలుడు ‘’దిగంత కీర్తికాంతా మనోహరుడు ‘’,’’సకల ధర్మ ప్రతిపాలకుడు ‘’అని కీర్తి పొందాడు .అతని ‘’భుజప్రతాప శిఖి శిఖా పరంపరలకు అహిత భూ భ్రున్నికాయంబు శలభ నిచయంబు మాడ్కి విలసిల్లె నట ‘’.

  రాజు రాసిన భార్గవ పురాణం అంటే పన్నిద్దరాళ్వారుల   చరిత్రమే .రాజుకు వేణుగోపాలుడు కలలో కన్పించి ఈ కృతి చేయమని ఇలా ఆనతిచ్చాడు –

‘’పరమ వివేక శీలుడవు ,బ్రాహ్మణ పోషణ తత్పరు౦డ వై-యరయుట ,యేను బ్రాహ్మణ మఖాభి వశాస్తి దనర్చు టున్కి ,నిన్

వరమతి బ్రోవ  నిచ్చటికి వచ్చినవాడను నొక్క సూక్తి భ –వ్య రచన జేతు నీ కిపుడు బాలక పామ ధరాధి పాలకా ‘’

‘’అస్మత్ప్రభావ మౌనట్టి శ్రీ విష్ణు పురాణ౦బు తెనుగున రసికు లెన్న –కృతి రచియి౦పి౦ఛి తత

భక్తి మా కంకితంబు చేయించిన ధన్యమతివి

యరయ పన్నిద్ద రైనట్టి మద్భక్తుల చరితంబు ,నాంధ్ర భాషా ప్రబంధ –మును జేసి మా కిస్టముగ సమర్పణము గావి౦చినచో పృధివీ స్థలమున

 సకల పుణ్య తరా (ఫలా )వాప్తి సంఘటించు-నీ కనుచు సురపుర వాసుడై కడంగు

దేవుడా కృష్ణమూర్తి  యద్రుశ్యు డౌట-మేలుకని మానసోత్సాహ లీల దనర .

    పామ భూపాల నాయకుని కవిత్వానికి మరొక మంచి  పద్యం చూద్దాం –

మత్తేభం –పర్వ తత్వార్ధ పరిష్క్రియాభిరతి ,శు౦భ త్పాండ్య భూమండలే  -శ్వర సద్వైష్ణవతా విధాయి ,కరుణా౦చద్భట్ట పాదార్య ,సా

దర లీలా చిద చిద్విశిస్ట మత సిద్ధాంత స్ఫురద్దర్పణా౦-తర విద్యోదిత దివ్య విగ్రహ నమద్భక్తాదరానుగ్రహా ‘’

ఇంతటి ఉత్తమ గ్రంథం మరుగున పడి పోయినందుకు ఆచార్య బిరుదరాజు రామరాజు గారు మిక్కిలిగా విచారించారు .

   ఆధారం –ఆచార్య బిరుదరాజు రామరాజు గారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

10-5-19శుక్రవారం మధ్యాహ్నం మా ఇంట్లో భవానిగారు,11-5-19 శనివారం సాయంత్రం మా ఇంట్లో గుండు నర్సయ్య కూతుళ్ళు

10-5-19శుక్రవారం మధ్యాహ్నం మా ఇంట్లో భవానిగారు,11-5-19 శనివారం సాయంత్రం మా ఇంట్లో గుండు నర్సయ్య కూతుళ్ళు

 

https://photos.google.com/share/AF1QipONiOoIu8E01CQZupLJliOT16snGN8tv_TwpvYPwKH2Y7pvA6t3vOAeJZY9JE-bmQ/photo/AF1QipMHLeJFdWFTJdIop9jkAHqTsG1AJyXSISTNjr1H?key=ZW8wYzVZaEE5bDRyNUNydlpiaklPMEY5QVdudXVR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

9-5-19 గురువారం ఉదయం మా అమ్మాయి విజ్జి, మేము శ్రీ ద్వారకాతిరుమల ,మా గబ్బిటవారి అగ్రహారం రామారావు గూడెం లోని శ్రీ భాక్తాన్జనేయస్వామి సందర్శనం చిత్రాలు

9-5-19 గురువారం ఉదయం మా అమ్మాయి విజ్జి, మేము శ్రీ ద్వారకాతిరుమల ,మా గబ్బిటవారి అగ్రహారం రామారావు గూడెం లోని శ్రీ భాక్తాన్జనేయస్వామి సందర్శనం చిత్రాలు

 

https://photos.google.com/share/AF1QipN_-KPOB35ljfoyeMQrlGSCc1Z4lf4xmJrDX5EMuS0YVkZki7SrUlG0A6SIeNH-Lg/photo/AF1QipN70LHDLrU2iowDDgHLZrysUGJ1LU9T9jVEllQA?key=NG81aDdwaDhnMnZXSXhGWTEzcmpVcVRob2xWNnVR

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సోమేపల్లి వారి నాలుగవ నానీల సంపుటి –చేను చెక్కిన శిల్పాలు

 సోమేపల్లి వారి నాలుగవ నానీల సంపుటి –చేను చెక్కిన శిల్పాలు

అందమైన శీర్షిక భావాన్ని ప్రతిబింబించే పచ్చని చేలు, అందులో పండిన బంగారు మొలకలు , ధాన్యం  తో అబ్బు ఆర్ట్స్ అలరించిన అలరించిన ముఖ చిత్రం తో ,లోపలి కవితా శీర్షికలకు  అంతే ప్రతిభతో గీసిన ‘’పాణి ‘’చిత్రాలతో ,చూడంగానే ‘’చేను చెక్కిన శిల్పాలు ‘’మనసును యిట్టె ఆకర్షిస్తుంది .ఇక్కడొక సంగతి గుర్తుకొచ్చింది .అప్పుడెప్పుడో ముళ్ళపూడి వెంకట ‘’రమణ ‘’ఒక కథ రాసి ,తన నెయ్యపుచెలికాడు’’ బాపు’’తో దానికి బొమ్మ గీయించి పత్రిక సంపాదకుడు విద్వాన్ విశ్వం దగ్గరకు తీసుకు వెళ్లి ఇస్తే ,క్షణాలలో చూసి ‘’ఇడ్లీ కంటే చట్నీ బాగుంది .అన్నట్లు నీ కథ కంటే నే స్నేహితుడి చిత్రం బాగుంది కనుక వెంటనే  ప్రింట్ చేస్తాను ‘’అని హామీ ఇచ్చి నిలబెట్టుకోన్నట్లు రమణ రాసుకొన్నాడు .ఈ సంపుటిలోనూ చిత్ర రచయిత సామర్ధ్యం అంత గొప్పగా ఉందని చెప్పటానికే పై ఉదాహరణ తప్ప వేరే పోలికా, వ్యంగ్యం లేదని మనవి చేస్తున్నాను .

  ఇది  ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు ,కవి నానీలలో నిండా నానినవారు  ,విమర్శకులు ,కవితా సేద్యం తో పాటు, సేద్యానికీ ప్రాముఖ్యమిచ్చే శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి నాలుగవ నానీల సంపుటి .ఇప్పటికే ‘’తదేక గీతం ‘’వచన కవితా సంపుటిని’’ నానీల తాతయ్య’’డా యెన్. గోపి కి అంకితమిచ్చి,’’పచ్చని వెన్నెల ‘’నానీల సంపుటిని డా సి నారాయణ రెడ్డి గారి చేతులమీదుగా ఆవిష్కరింప జేసిన ఘనత  శ్రీ వెంకట సుబ్బయ్యగారిది .నాకు సరస భారతికి ఆత్మీయులైన సోమేపల్లివారు ఆత్మీయంగా పంపిన ఈ పుస్తకం ఈ రోజే 11-5-19 శనివారం ఉదయం నాకు అందింది .వెంటనే చదివేశాను .మనసుకు హత్తుకొనే కవితా శిల్పాలని పించాయి నానీలు .చేను చేక్కేది బంగారం పంట .ఆ బంగారం పంటలాగున్నాయి ఈ నానీలు .శ్రీ గోపి అన్నట్లు ‘’నిబ్బరమైన వ్యక్తిత్వం ,నిరంతర కవిత చింతనం ,మానవీయ వైఖరి శ్రీ సోమేపల్లి వారి సంపద’’ .వాటిని అందరికీ పంచటం ఆయనకున్న అరుదైన సద్గుణం . ఈ సంపుటిలో వంద నానీలున్నాయి .అంటే వంద బంగారు నానీ రాశులను కవితా కేదారం లో పండించారు సుబ్బయ్యగారు .అయితే ఇందులోఎక్కువభాగం  చేను ,సేద్యానికి చెందినవి మాత్రమే నేను ఉదహరి౦చి, శీర్షికకు న్యాయం చేస్తాను ..

  మొదటి నాని –పల్లెకు ఫస్ట్ బస్సొచ్చింది –నిండా –వాటర్ ప్యాకెట్లు —కోలాలు ‘’

కవిత నేటి పల్లె కోల్పోయిన ప్రకృతి సౌందర్యాన్ని ,ఆధునికతపై మోజును తెలియజేస్తే ,దీనికి పాణి గీసిన  చిత్రం  భావాన్ని ద్విగుణీకృతం చేసిప్రాణం పోసింది .చేను చెక్కిన శిల్పం ‘’ఆటుపోట్లకు అదరను –బెదరను ‘’అని నిర్భయంగా చెబుతుంది ‘’అన్నదాత వెన్ను విరిగింది ‘’కానీ .’’ధరలదీ దళారులదీ-పంట పండింది ‘’అన్నారు .సాగులో సవ్య సాచే అతడు ‘’రాబడి పద్మ వ్యూహం లో మాత్రం –అభిమన్యుడు ‘’అని భారత పరంగా భారంగా విషాదాంతంగా   అందంగా చెప్పారు పర్యవసానాన్ని .పొలం ఒక పాఠ శాలగా కనిపించింది కవికి –‘’విత్తనమంత విమర్శ –చెట్టంత పరామర్శ’’ను చూసి .’’అప్పుడు ,ఎప్పుడూ- ఆకలికి ప్రత్యక్ష దీపం –అన్నదాతే’’అంటారు చేనుకు నీటి జవజీవాలనిచ్చే పిల్ల కాలువ ‘’నిత్యం పలకరిస్తూ ,పరవశిస్తుందట ‘’.

  చేనుగట్టు మీద విస్తరించిన చెట్టు ‘’నేలతల్లికి –గొడుగు పట్టి నట్టుంది ‘’ట భావుక కవికి .పల్లె సౌందర్యం అంటే నీరు చెట్టూ చేమ పచ్చని పొలాలే కదా.కనుక ‘’మట్టీ మనిషి –కలకాలం కలిసి ఉండాలి ‘’అని కోరుకొంటారు సేద్యంతోపాటు కవితా సేద్యమూ చేసే సోమేపల్లికవి  .రైతు జీవితం ఒక మహా భారతం కొంచెం ఘాటుగా చెప్పాలంటే ‘’మహా భరాటం’’.కనుక అతని ‘’కస్టాలు రాయాలంటే 18కాదు ఎన్ని పర్వాలైనా పడతాయంటారు .బోరుబావి విషాద౦  కళ్ళకు కట్టించిన నానీ –‘’నోరు తెరచింది-బోరుబావి –వాడ వాడంతా –విషాదపు దీవి ‘’అల్పాక్షరాల్లో అనల్పార్ధాలు అంటే ఇవే . ‘’చెట్టు చేమల -సయ్యాట –గుండె వాకిట –ఉల్లాసపు ఊగులాట ‘’అని ఉప్పొంగి పోతాడుకవి .ఇవాళ ‘’పొలం –కొందరికి పినతల్లి –కష్టం వోర్చుకోలేక –కౌలు కిచ్చేస్తూ ‘’అని బాధపడ్డారు .దీనికి ‘’పాణినీయం ‘’బాగుంది .ఒండ్రు నీరు చేలకు బలం .ఆ నీటి ప్రవాహం పాత నీటితోకలిసి కొత్త రంగు పులుముకోటం మనం చూస్తాం .దీన్ని కవితాత్మకంగా చెప్పారు సుబ్బయ్యాజీ ‘’నీళ్ళలోనూ –ఊసర వెల్లి ఉందా ?-కొత్తనీరుకలిస్తే –రంగు మారుతోంది ?’’అని బోల్డు ఆశ్చర్యపోయారు .రంగుమారటాన్ని ఊసరవెల్లి తత్వానికి సరిపోల్చారు .రైతుకీ ,చేనుకు ఉన్న అనుబంధాన్ని కమ్మని నానీలో బంధించారు –‘’నాన్ననీ ,చేనునీ –అనుసందానంచేసేది –పంటా –పగ్గమే కదా ‘’.

  వర్షం రైతన్నకు హర్షం .అది ‘’దూరపు బంధువు –అందుకే –ఎప్పుడో కాని రాదు ‘’అని కవితాత్మకంగా దిగులు చెందారు .పత్తి వేసి  మిత్తి వాత పడిన రైతు గురించి –‘’ఉరకలేస్తు౦దను కొన్నా-పత్తి-అతి వృష్టి రూపం లో –మిత్తి’’.చెట్టుకూ పండుగ తెస్తుంది వసంతం అంటారు మరో నానీలో .’’అచ్చమైన పల్లె –స్వచ్చంగా చూపే ప్రేమవల్ల ‘’మనసుకు హాయి .నాగటి చాలుకూ నడతకు చక్కని పోలిక చెప్పిననానీ –‘’నాగటి చాలు –నడకకిస్పూర్తి –జోడెద్దులు –నడతకి కీర్తి ‘’.

  రంగవల్లులగురించిన నానీ –‘’నేల నుదుట –నక్షత్రం –రంగురంగుల – రంగవల్లి చిత్రం ‘’.దీనికీ ‘’పాణినీయం ‘’ కేమిస్ట్రి బాగా కుదిరింది .కవికీ,కలానికి బంధం –మట్టికీ మనిషికీ –అనుబంధం ‘’అని తాత్వికంగా చెప్పారు .’’మా ఊరే –మాకు గొడుగు –పిల్లా జెల్లల్ని –నడిపించేది పెద్దలే ‘’అని మంచి సుద్ది చెప్పారు .’’నులక మంచం పై –కమ్మటికల –అల్లిక జిగిబిగి –అమ్మానాన్నదే ‘’అని కీర్తించారు .పిల్లగాలికి ఊగే చెట్టు కవికి ‘’ఒళ్ళంతా వయ్యారం ‘’గా అనిపించింది .రోడ్లమీద ఫ్లెక్సీలపై విసిరిన వ్యంగ్యాస్త్రం –‘’నడి రోడ్డుపై –నిరశన నాట్లు –ఆశ్చర్యం –విరగపండింది పంట ‘’.మబ్బులు రంగస్థలం పై రంగుల వేషాలు కట్టే వారు గా కనిపించారు .’’సెల్ ఫోన్ చెరలో -బాల్యం బందీ ‘’అయిపోయినందుకు విచారిస్తారు కవి .ముసలితనం లో కలిసిన బాల్యమిత్రుల ‘’తలరంగు మారిందికాని –మనసు మెరుస్తూనే ఉంది ‘’అన్నారు దీనికీ ‘’పాణినీయం’’ముచ్చటగా కుదిరింది .’’కృత్రిమ కొరత సృష్టించేవాడు కవిగారికి ‘’ఆధునిక బ్రహ్మ ‘’లా కనిపించాడు.పాణిగీసిన చిత్రం గాంధీ గారి మూడు కోతులను గుర్తుకు తెస్తుంది .కాలుష్యపు కాలువ ‘’నీళ్ళతోపాటు నిప్పుల్నీ మోసుకొస్తుంది ‘’అని సామాజిక స్పృహతో చెప్పారు .నల్లడబ్బును కొండ చిలువతో పోలుస్తూ ‘’ఒళ్ళు విరుచుకొంటే –ఓట్లను కూడా మింగుతుంది ‘’అనే నేటి వోటు -నోటు  కు దర్పణంగా చెప్పారు .బొమ్మా బాగా వేశారు పాణి.చివరి నానీ –‘’పల్లె మెడలో –పచ్చని మణిహారం –బారులు తీరిన – చెట్లదే సోయగం ‘’

  సోమేపల్లి వారి భావుకతకు ,సృజనకు ,సామాజిక స్పృహకు ,నానీలపై పట్టుకు ,మంచి కవితాదారకు ‘’చేను చెక్కిన శిల్పాలు ‘’నానీల సంపుటి అద్దం పడుతుంది .మరిన్ని కవితా  సంపుటులు వారి నుంచి ఆశిద్దాం .అందరు తప్పక చదివి ఆనది౦చమని మనవి .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 412-ఆకాశవాణి సంస్కృత ప్రసంగాలు చేసిన  వే.పండిత పెద్దమఠం రాచ వీర దేవర తీర్ధ

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

412-ఆకాశవాణి సంస్కృత ప్రసంగాలు చేసిన  వే.పండిత పెద్దమఠం రాచ వీర దేవర తీర్ధ

కావ్య తీర్ధ ,ధర్మనిరత ,వీర శైవ సాహిత్య సార్వభౌమ ,సాహిత్య భూషణ ,సాహిత్య విశారద ,వీర శైవ ఆగమ సాహిత్య చతుర,పుంభావ సరస్వతి వే.పండిత రాచ దేవర తీర్ధ తనజీవితాన్ని వీరశైవ మత వ్యాప్తికి అంకితం చేసిన మహానుభావుడు .సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు .రెండు భాషలలలో ఎం .వో. ఎల్ .తన స్వంత డబ్బు సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేసి వీర శైవ వ్యాప్తికి తీవ్ర కృషి చేశారు .వీర శైవ ,ధార్మిక గ్రంథాలను25 వరకు రచించారు .శివయోగి శివా చార్య రచించిన కన్నడ శతక త్రయాన్ని  తెలుగు లోకి అనువదించారు .వ్యాఖ్యానమూ రాశారు .’’యస్య కీర్తిః  సజీవతి ‘’అంటే సాహిత్య సేవ ,శాశ్వత కార్యాలు చేసినవారు మరణించినా చిర కీర్తి నార్జిస్తారు అని పూర్తిగానమ్మి అంకితభావంతో పని చేశారు .’’వైదికం కర్మ కురీహిత-జ్ఞానైక ఫల సాధనం –న కురత్ప్రాశనీవం కర్మ –వీరశైవ కదా చన’’అని ఒకమహా కవి చెప్పినట్లు వీరశైవ మతాభిమాని వైదిక కర్మలనే ఆచరి౦చాలి కాని పశుకర్మలను ఆచరి౦చ రాదు అని ప్రచారం చేశారు .

  రాచ దేవర గారు  వీర శైవ ప్రచారం కోసం దేశం లో తిరగని ప్రాంతం లేనేలేదు .పుంభావ సరస్వతి అయిన ఆయన అనేక సంస్కృత ఆంద్ర ప్రసంగాలు రేడియో లో చేసి మెప్పించారు .అందులో కొన్ని 1-కవేః కాళిదాసస్య దృశ్యకావ్య రచనా కౌశలం 2-బాణ కవేః కావ్యస్య ఔచిత్యం 3-రామాయణ మహా భారతయోః అన్యోన్య సంబంధః పరిణామః  4-క్రాంతి పురుష మహాత్మా శ్రీ బసవేశ్వరః 5-సంస్కృత సాహిత్యే మన్మధ స్య స్వరూప స్వభావః    6-కల్హణ కవేః రాజ తరంగిణి 7-సుప్రభేదాగమే వంటి మనవాళ్ళు ఎవరూ రాయని సంస్కృత వ్యాసాలూ రాసి ఆకాశవాణిని సుసంపన్నం చేశారు  .రెండుభాషలలో సుమారు వంద వ్యాసాలూ రాసి వినిపించిన మహా కవి ,విమర్శకులు దార్శనికులాయన

  రంగారెడ్డి జిల్లా నాగార్జున కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా పని చేశారు

  వారి సంస్కృత రచనా పాటవం రుచి చూద్దాం

1-న వీర శైవ సదృశం –మతమస్తిజగత్రయే-సర్వభోగ ప్రదం సర్వం –శివ సాయుజ్య సాధకం

2-నమో ఉగ్ర స్వరూపాయ –నమో జిష్ణ్వాది శాత్రవే –దక్షయజ్న వినాశాయ వీర భద్రాయ తే నమః ‘’

వచన రచనామృతాన్ని ఆస్వాదిద్దాం

‘’తతః సత్యవసరే గాన్ధర్వేణ విధినా శాకుంతలా ముద్వాహ్య ,కతిపయ వాసరా పగమే సతి రుషిభిరనుజ్ఞాతః దుష్యన్తః స్వనగరం ప్రతిజిగమిషణ్ తస్యై శకున్తలాయైఆత్మనః  అంగుళీయకం దత్వా ప్రియే –ఆత్రెకైకందివ సే దివసే మదీయం నామాక్షరం గణయః’’

  వీర దేవర తీర్ధ గారి సాహిత్య ఆధ్యాత్మిక ప్రతిభకు తగిన పురస్కారాలెన్నో అందుకొన్నారు .వీరి అమృతోత్సవ సందర్భంగా హైదరాబాద్ బాగ్ లింగం పల్లిలో కాశీనుంచి విచ్చేసిన మహా పండితులు మహదాశీర్వచనం అందించారు .7-2-1997నశ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం లో ఆచార్య బిరుదరాజు రామరాజు గారి అధ్యక్షతన ఘన సన్మానం చేశారు .శ్రీశ్రీ శివా చార్య చంద్ర శేఖర మహాస్వామిజీ  దేవరగారి స్వగృహానికి విచ్చేసి ఆశీర్వదించారు .మెదక్ జిల్లా తో పాటు అనేక శైవ మతాలవారు ఆహ్వానించి సత్కరించారు .తెలుగు విశ్వవిద్యాలయం పాల్కురికి సోమనాధుని అష్ట శతమాసోత్సవ సందర్భంగా సన్మానించింది  .కాచిగూడ వీరణ్ణ గుట్టపై జరిగిన బసవన జయంతి నాడు సన్మానించి ‘’వీర శైవ సాహిత్య సార్వభౌమ ‘’బిరుదప్రదానం చేశారు .

మనవి –దేవరగారి పుట్టు పూర్వోత్తరాలు నాకు లభ్యం కాలేదు ఎవరివద్దనైనా ఉంటె నాకు పంపితే వ్యాసాన్ని పరిపూర్ణం చేస్తాను .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-19-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 411-శ్రీ పైడితల్లి సుప్రభాత కర్త –ఆచార్య మానాప్రగడ శేషసాయి (1927-2019)

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

411-శ్రీ పైడితల్లి సుప్రభాత కర్త –ఆచార్య మానాప్రగడ శేషసాయి (1927-2019)

ప్రముఖ సాహితీవేత్త, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల పూర్వాచార్యులు మానాప్రగడ శేషసాయి (93) మంగళవారం ఉదయం 5.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. పట్టణంలోని పూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న ఆయన గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.1927 ఆగస్టు 14న పశ్చిమగోదావరి జిల్లా గునుపర్రులో మానాప్రగడ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూరమ్మ, బాపిరాజు. వారణాసిలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ (సంస్కృతం) విద్యాభ్యాసం చేశారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషల్లో ఆయన దిట్ట. విజయనగరం సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా 1966 నుంచి 79 వరకు 13 ఏళ్లు సమర్థవంతంగా పనిచేశారు. ఆయన హయాంలోనే కళాశాలలో పనిచేసిన అధ్యాపకులకు యూజీసీ స్కేళ్లు ఇప్పించారు. 1969లో కళాశాల శతజయంతి ఉత్సవాలు నిర్వహించిన ఘనత ఆయనకే దక్కింది. అప్పటి రాష్ట్ర గవర్నర్ ఖండుబాయ్ కె. దేశాయ్, విద్యాశాఖ మంత్రి పీవీ నర్సింహరావు కళాశాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన విజయనగరం సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులయ్యారు. ఆ విధంగా ఆయన హయాంలో కళాశాల స్వర్ణయుగంగా విరాజిల్లింది. ఆయన శిష్యులు ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఉత్తరాంధ్రలో ఎందరినో పండితులుగా, కవులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు శేషసాయి. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సుప్రభాతం రాశారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణస్వామి,సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి మీద శతకాలు రాశారు. ప్రతీ ఏటా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ఆయన రెండు దశాబ్దాలపాటు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2013లో విజయభావన సంస్థ వార్షికోత్సవంలో పద్యకళా ప్రవీణ బిరుదుతో ఆయనను సత్కరించారు. 2017లో ద్వానా శాస్ర్తీ సాహితీ కుటీర్, విజయభావన సంయుక్తంగా కలసి ఆయనకు జీవిత సాఫల్య బిరుదును అందజేశారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు కెవి రమణారెడ్డి,సీతారామారావు, డీఆర్వో వెంకటరావు తదితరులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల ఆయన శిష్యులు మీగడ రామలింగస్వామి, జక్కు రామకృష్ణ, సహోద్యోగి డాక్టర్ ఎ.గోపాలరావు, ఎంఎస్‌ఎస్ మూర్తి, భళ్లమూడి శంకరరావు, ఆర్‌ఎంఎస్ శాస్ర్తీ, బుడితి బలరాంనాయుడు (సీరపాణి), కథా రచయిత పివిజి శ్రీరామమూర్తి, విజయభారతి, రిటైర్డ్ ఈఈ టి.సూర్యప్రకాశరావు, ధవళ సర్వేశ్వరరావు, డాక్టర్ బిఎస్‌ఆర్ మూర్తి, కౌముదీ పరిషత్ అధ్యక్షులు దవళ సర్వేశ్వరరావు, కార్యదర్శి కె.శారదాప్రసాద్, అభినందన సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ పీవీఎల్ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఎ.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బి.విజయభారతి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
మానాప్రగడ శేషసాయి (ఫైల్)

శ్రీ పైడి తల్లి సుప్రభాతం

1వ శ్లోకం –ఉత్తిస్టోత్తిస్ట కళ్యాణీ –ఉత్తిష్ట భువనేశ్వరి –ఉత్తిష్టగుణ సామ్రాజ్నీ పూర్వా సంధ్యా ప్రవర్తతే ‘’

 మనవి –సుప్రభాతం స్క్రిప్ట్ దొరకలేదు .ఆడియో విని కొద్దిగా రాశాను .ఎవరివద్దనైనా స్క్రిప్ట్ ఉంటె పంపండి మంచి శ్లోకాలు ఎన్నుకొని రాస్తాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మానాప్రగడ శేషసాయి ఇక లేరు!

మానాప్రగడ శేషసాయి ఇక లేరు!

విజయనగరం, మే 7: ప్రముఖ సాహితీవేత్త, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల పూర్వాచార్యులు మానాప్రగడ శేషసాయి (93) మంగళవారం ఉదయం 5.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. పట్టణంలోని పూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న ఆయన గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1927 ఆగస్టు 14న పశ్చిమగోదావరి జిల్లా గునుపర్రులో మానాప్రగడ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూరమ్మ, బాపిరాజు. వారణాసిలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ (సంస్కృతం) విద్యాభ్యాసం చేశారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషల్లో ఆయన దిట్ట. విజయనగరం సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా 1966 నుంచి 79 వరకు 13 ఏళ్లు సమర్థవంతంగా పనిచేశారు. ఆయన హయాంలోనే కళాశాలలో పనిచేసిన అధ్యాపకులకు యూజీసీ స్కేళ్లు ఇప్పించారు. 1969లో కళాశాల శతజయంతి ఉత్సవాలు నిర్వహించిన ఘనత ఆయనకే దక్కింది. అప్పటి రాష్ట్ర గవర్నర్ ఖండుబాయ్ కె. దేశాయ్, విద్యాశాఖ మంత్రి పీవీ నర్సింహరావు కళాశాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన విజయనగరం సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులయ్యారు. ఆ విధంగా ఆయన హయాంలో కళాశాల స్వర్ణయుగంగా విరాజిల్లింది. ఆయన శిష్యులు ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఉత్తరాంధ్రలో ఎందరినో పండితులుగా, కవులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు శేషసాయి. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సుప్రభాతం రాశారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి మీద శతకాలు రాశారు. ప్రతీ ఏటా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ఆయన రెండు దశాబ్దాలపాటు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2013లో విజయభావన సంస్థ వార్షికోత్సవంలో పద్యకళా ప్రవీణ బిరుదుతో ఆయనను సత్కరించారు. 2017లో ద్వానా శాస్ర్తీ సాహితీ కుటీర్, విజయభావన సంయుక్తంగా కలసి ఆయనకు జీవిత సాఫల్య బిరుదును అందజేశారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు కెవి రమణారెడ్డి, సీతారామారావు, డీఆర్వో వెంకటరావు తదితరులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల ఆయన శిష్యులు మీగడ రామలింగస్వామి, జక్కు రామకృష్ణ, సహోద్యోగి డాక్టర్ ఎ.గోపాలరావు, ఎంఎస్‌ఎస్ మూర్తి, భళ్లమూడి శంకరరావు, ఆర్‌ఎంఎస్ శాస్ర్తీ, బుడితి బలరాంనాయుడు (సీరపాణి), కథా రచయిత పివిజి శ్రీరామమూర్తి, విజయభారతి, రిటైర్డ్ ఈఈ టి.సూర్యప్రకాశరావు, ధవళ సర్వేశ్వరరావు, డాక్టర్ బిఎస్‌ఆర్ మూర్తి, కౌముదీ పరిషత్ అధ్యక్షులు దవళ సర్వేశ్వరరావు, కార్యదర్శి కె.శారదాప్రసాద్, అభినందన సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ పీవీఎల్ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఎ.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బి.విజయభారతి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మా కుటుంబం 30-4-19 మంగళవారం నుండి 4-5-19శనివారం వరకు హైదరాబాద్ లో మా మేనల్లుడు వేలూరి అశోక్ ,మాబావగారు శ్రీ వివేకానంద్ గారి కుటుంబంతో ,మా అమ్మామాయి విజ్జి స్నేహితురాలు తులసి , మా తోడల్లుడిగారమ్మాయి మాధవి,మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం , మా బావమరది ఆనంద్ ,మాఅమ్మాయి స్నేహితురాలు ప్రమీల కుటుంబాల తోనూ ,మరియు శ్రీ శైల సందర్శన చిత్రమాలిక

మా కుటుంబం 30-4-19 మంగళవారం నుండి 4-5-19శనివారం వరకు హైదరాబాద్ లో మా మేనల్లుడు వేలూరి అశోక్ ,మాబావగారు శ్రీ వివేకానంద్ గారి కుటుంబంతో ,మా అమ్మామాయి విజ్జి స్నేహితురాలు తులసి , మా తోడల్లుడిగారమ్మాయి మాధవి,మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం , మా బావమరది ఆనంద్ ,మాఅమ్మాయి స్నేహితురాలు ప్రమీల కుటుంబాల తోనూ ,మరియు శ్రీ శైల సందర్శన చిత్రమాలిక

 

https://photos.google.com/share/AF1QipPrnQqYb1A75_mNjEKIgiGloMaGoC1UmNgFDE9zZcUyxeDJ3zC1UUz6rcKGbCf6aQ?key=Y05qeDJkaloxUkd1RjE4T2M5aXNobkZrRmlWTFln

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికా జాజ్ సంగీత రాణి–ఎల్లా ఫిట్జరాల్డ్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్

అమెరికా జాజ్ సంగీత రాణి–ఎల్లా ఫిట్జరాల్డ్ -గబ్బిట దుర్గా ప్రసాద్

సంగీత నృత్యాలపై అభిలాష పాటకు ప్రథమ మహిళగా ,జాజ్ సంగీత రాణి గా ,లేడీ ఎల్లా గా అందరూ ఆప్యాయంగా పిలిచే ఎల్లా ఫిట్జ రాల్డ్ 1917 ఏప్రిల్ 25 అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం లో న్యు పోర్ట్ న్యూస్ లో జన్మించింది .తండ్రి విలియం ఫిట్జరాల్డ్ .తల్లి టె౦పీ హెన్రి .ఆరవ ఏటనే స్కూల్ లో చేరి చదువులో అద్వితీయురాలైంది .1929లో బెంజమిన్ ఫ్రాన్సిస్ స్కూల్ లో చేరే లోపు చాలా స్కూళ్ళలో చదివింది .మూడవగ్రేడ్ లో ఉండగానే డాన్స్ పై విపరీతమైన మక్కువ ఏర్పడింది .మెథడిస్ట్ చర్చికి సంబందీక కుటుంబం కనుక తరచుగా చర్చికి వెళ్లి ప్రార్ధనలలో పాల్గొనేది .ఆమెలోని సంగీతాభిలాషకు చర్చి వారు మెచ్చి ఆర్ధిక సాయం తో ప్రోత్సహించారు .పియనోకూడా నేర్చుకొని విద్వత్తు సంపాదించింది .

జాజ్ సంగీత౦ లో ప్రవేశం:

 అప్పటి ప్రముఖ జాజ్ సంగీత గాయకులు లూయీ ఆర్మ్ స్ట్రాంగ్ ,బింగ్ క్రాస్బి, బాస్వేల్ సిస్టర్స్ రికార్డ్ లను అత్యంత శ్రద్ధగా వినేది .వీరిలో బాగా పేరుపొందిన’’ కొన్నీ బాస్వేల్ ‘’అనే ఆమె సంగీత రికార్డ్ లను తల్లి తీసుకొచ్చి కూతురి కిచ్చేది. అవి వింటూ అచ్చం బాస్వేల్ లాగా పాడటం ప్రాక్టీస్ చేసింది .1932లో ఆమెతల్లి కారు ప్రమాదం లో చనిపోయింది .తర్వాత హార్లెం వెళ్లి ఆంట్ ఇంట్లో ఉన్నది .చదువు పై శ్రద్ధతగ్గి , బడి ఎగగొట్టటం తో గ్రేడ్ లు తగ్గాయి .కొన్ని విచిత్ర పరిస్థితులలో ఆమె ను అధికారులు బ్రాంక్స్ లోని రివర్ డేల్ లో ఉన్న కలర్డ్ ఆర్ఫాన్ అసిలియం లో చేర్చారు .ఇక్కడ రద్దీ ఎక్కువ అవటం తో తర్వాత న్యు యార్క్ లోని హడ్సన్ లో ఉన్న గర్ల్స్ ట్రెయినింగ్ స్కూల్ లో చేర్చారు .ఇక్కడ కూడా ఉండలేక పారిపోయింది .చివరికి ఉండటానికి జానెడు చోటు కూడా లేకపోయింది ఆమెకు .

వరించి వచ్చిన అదృష్టం: 

1933-34కాలం లో హార్లెం వీధులలో పాటలు పాడుతూ వచ్చిన డబ్బుతో జీవించింది .1934 నవంబర్ 21న ఆమె 17వ ఏట అమెచ్యూర్ దియేటర్ లో అపోలో నైట్స్ లో పాడే అదృష్టం అనుకోకు౦డా వచ్చి తలుపు తట్టింది .స్టేజి మీద డాన్స్ చేయాలను కొన్న కల చెదిరి అక్కడి స్థానిక డాన్సర్లు ఎడ్వర్డ్ సిస్టర్స్ అభ్యంతరం చెప్పటం తో, పాడటానికి అవకాశం లభించింది .తన సత్తా చాటి, కొన్నీ బాస్వేల్ లాగా అద్భుతంగా ‘’జూడీ ‘’ ,’’ది ఆబ్జెక్ట్ ఆఫ్ మై ఎఫెక్షన్ ‘’ పాటలు పాడి ఫస్ట్ ప్రైజ్ పొందింది .ఒక వారం రోజులు పాడే అవకాశం ఉన్నా యాజమాన్యం ఆమెకు అవకాశం ఇవ్వలేదు .

జాజ్ సంగీత రాణి:

1935 ఫిబ్రవరి లో హార్లెం ఒపెరాహౌస్ లో టైనీ బ్రాడ్ షా బృందంతో ఒకవారం పాడే అవకాశం వచ్చి తన సమర్ధత రుజువు చేసుకొన్నది .తర్వాత ఏల్ యూని వర్సిటి లో పాడే అవకాశా మిస్తామన్నారు .బృందగానం లో పాల్గొంటూ సవాయ్ బాల్ రూమ్ లో అనేక హిట్ సాంగ్స్ పాడింది .కాని 1938లో నర్సరీ రైమ్ వంటి ‘’ఎ టిస్కేట్- ఎ టాస్కెట్’’పాటతో జనం లో విపరీతమైన క్రేజు పాప్యులారిటీ పొందింది .ఆపాటను ఇ౦కరితో కలిసి ఆమే రాసింది.రేడియో లో గొప్ప హిట్ సాంగ్ గా, ఆ దశాబ్దంలోనే అత్యధికంగా అమ్ముడైన రికార్డ్ గా రికార్డ్ సృష్టించింది ఆ పాట.

ఈ బృందం నాయకుడు వెబ్ మరణించటం తో ఎల్లా బృందంగా ప్రసిద్ధి చెంది ఆమెయే ఆ బాండ్ నాయకురాలైంది .1935-42మధ్య వెబ్ ఆర్కెస్ట్రా తో ఎల్లా ఫిట్జరాల్డ్ సుమారు 150 పాటలుపాడి రికార్డ్ చేసింది .’’ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎల్లా గాన సమ్మోహనాన్ని విపరీతంగా మెచ్చి, కొత్తదనం తో పరవశం కలిగిస్తోందన్నది .వెబ్ ఆర్కెస్ట్రా తోపాటు బెన్నీ గుడ్మన్ ఆర్కెస్ట్రా తోనూ పని చేస్తూ ,తనకంటూ ఒక ప్రత్యేకంగా ‘’ఎల్లా ఫిట్జరాల్డ్ అండ్ హర్ స వాయ్ ఎయిట్’’అనే బృందాన్ని ఏర్పాటు చేసుకొంది.

1942లో ఎల్లా బాండ్ ను వదిలేసి తానే ప్రత్యేకంగా సోలోలు పాడటం మొదలు పెట్టింది .’’డేక్కా రికార్డ్స్’’ కంపెనీకి పాడుతూ అనేక సూపర్ హిట్ పాటలకు ప్రాణం పోసింది .1940లో నార్మన్ గ్రా౦జ్ ఆమె మేనేజర్ గా ఉన్నాడు .అప్పుడు జాజ్ సంగీతం పాడటం మొదలుపెట్టింది .స్వింగ్ యుగం క్షీణించటం , బిగ్ బాండ్ ల టూరింగ్ లు తగ్గిపోవటం తో జాజ్ సంగీతం లో పెద్దమార్పు వచ్చింది .తన స్వరాన్నికూడా ఎల్లా తదనుగుణంగా మార్చుకొన్నది .తన కచేరీలలో స్కాట్ సింగింగ్ కూ అవకాశమిచ్చింది .బాండ్ వాద్యం లో హార్న్స్ ను అనుకరించి పాడటం మొదలుపెట్టింది .

1945లో విక్ స్కోహెన్ ఏర్పాటు చేసిన స్కాట్ రికార్డింగ్ తో ఎల్లా పాడిన ‘’ఫ్లైయింగ్ హోమ్’’ రికార్డ్ ‘’ ఆ దశాబ్దం లోనే అత్యంత ప్రేరణాత్మక జాజ్ రికార్డ్ .ఎల్లా ఫిట్జ రాల్డ్ జాజ్ గానం నభూతో గా ఉంది ‘’అని న్యూయార్క్ టైమ్స్ రాసింది .అప్పటికే ఆమె పేరు ప్రపంచం అంతా మారు మోగి పోతోంది .

విదేశీ పర్యటన:

1954 జులై లో తన బృందం తో కలిసి ఆస్ట్రేలియా దేశం లో పర్యటించి అనేకచోట్ల ప్రదర్శనలిచ్చింది .అక్కడ జాతి వివక్షతకు గురై ఇబ్బందిపడింది .దానిపై కోర్ట్ కు వెళ్లి విజయం సాధించింది .గ్రాన్జ్ తో జాజ్ సంగీతం పాడుతూనే ఉంది .1955లో డేక్కా , గ్రాన్జ్ కంపెనీలను వదిలేసి తనమేనేజర్ పెట్టిన ‘’వెర్వ్ రికార్డ్స్ ‘’కు పాడింది .వర్ణ, జాతి వివక్ష వలన తనకంటూ పాడటానికి స్థానమే లభించటం లేదని బాధపడి ,ఇంకేదైనా చేయాలని సంకల్పించి ‘’ఎల్లా ఫిట్జ రాల్డ్ సింగ్స్ ది కోల్ పోర్టర్ సాంగ్ బుక్ ‘’ఏర్పాటు చేయటం తో ఆమె జీవితం గొప్ప మలుపు తిరిగింది .

పాటకు ప్రాణం పోసిన నల్లజాతి వజ్రం:

1955మార్చి 15న హాలీ వుడ్ లోని ‘’మొకా౦బో నైట్ క్లబ్ ‘’లో ప్రదర్శన ఇచ్చింది .ప్రముఖ హాలీ వుడ్ నటి మార్లిన్ మన్రో టికెట్ బుకింగ్ కు బాగా తోడ్పడింది .రికార్డింగ్ కలెక్షన్స్ వచ్చాయి .మొకాంబో లో ఒక ఒక నల్లజాతి మహిళ పాడటం అదే మొదటిసారి .అదొక అరుదైన రికార్డ్ అయింది .ఆమె ‘’సాంగ్ బుక్ ‘’1956లో ఆవిష్కరింప బడింది .అందులోని ఎనిమిదిపాటలు సూపర్ డూపర్ హిట్ అయి ఆల్ టైం రికార్డ్ అయింది .ప్రేక్షకులే కాక విమర్శకులనుంచి కూడా ఆమెకు గొప్ప ప్రశంసలు లభించాయి .1972-83మధ్య అనేక ఆల్బమ్స్ పాడి విడుదల చేసింది .అన్నీ బాగా అమ్ముడుపోవటమేకాదు జన హృదయాలలో చిరస్థానం పొందాయి .

ఇంత బిజీగా ఉంటూనే ఎల్లా ఏడాదిలో సుమారు 40వారాలపాటు అమెరికా లోనూ , అంతర్జాతీయంగా నూ పర్యటిస్తూ జాజ్ సంగీత స్వరమాధురి అందించింది .ఆమె పాడిన వెర్వ్ రికార్డ్ లు ఎం. జి . ఎం. సంస్థకు 3మిలియన్ డాలర్లకు అమ్మారు .’’ఎల్లా ఇన్ లండన్ ‘’పేరుతొ 20 రికార్డ్ లు ఇచ్చింది .1972లో విడుదలైన ‘’జాజ్ అండ్ సాంటామోనికా ‘’ఆల్బం విపరీతమైన విజయం సాధించి అందర్నీ ఆశ్చర్య పరచింది .మూడు సార్లు పెళ్లి చేసుకొన్నది .

సినీ, టి.వి .నటన:

1955లో ‘’పీటర్ కెల్లీస్ బ్లూస్ ‘’అనే సినిమాలో జాజ్ గాయనిగా ఎల్లా నటించింది .కొన్ని సిని మాలలో పాడింది కొన్నిటిలో గెస్ట్ ఆర్టిస్ట్ గా నటించింది .అలాగే టెలివిజన్ లోనూ ఫ్రాంక్ సైనాట్రా షో మొదలైనవి చేసింది .టివి కమ్మర్షియల్స్ లోనూ ఉన్నది .కొందరు సహనిర్మాతలతో కొన్ని చేసి౦ది కూడా .ఫ్రాంక్ సైనాట్రా తో కలిసి పని చేయటం ఆమెకు ఎంతో నచ్చేది .ఇద్దరూ లాస్ వేగాస్ లో 1975లో చేసిన ప్రదర్శనకు 10లక్షల డాలర్లు వచ్చాయి .

బాధించిన డయాబెటేస్ –మరణం:

ఎల్లా చాలాకాలం డయాబెటేస్ వ్యాధితో బాధపడింది .దీనివలన అనేక ఇబ్బందులు పడింది .1985లో శ్వాసకోశ సంబంధమైన వ్యాధికి చికిత్సకోసం హాస్పిటల్ లో చేర్చగా నయమైంది .తర్వాత 1986లో గుండె జబ్బు తో బాధపడింది .1990లో ఊపిరి పీల్చటం కష్టమై మళ్ళీ ఆస్పత్రి లో చేరింది .త్వరగానే కోలుకోన్నది .1990మార్చిలో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జాజ్ ఎఫ్ ఎం .ఆవిష్కరణ లో పాల్గొన్నది .గ్రాస్ వేనార్ హౌస్ హోటల్ లో పాడింది డిన్నర్ లో పాల్గొంది .1993లో రెండు మోకాళ్ళు డయాబెటిస్ వలన వంకర పోయాయి .కంటి చూపు తగ్గింది. జాజ్ సంగీతంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆ సంగీత సన్నజాజి పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లిన జాజ్ సంగీత రాణి ఎల్లా ఫిట్జరాల్డ్ 15-6-1996న 79ఏళ్ళ వయసులో గుండె పోటుతో మరణించింది .ఆమె మరణించిన కొన్ని గంటలతర్వాత హాలీవుడ్ బౌల్ లో ‘’ప్లే బాయ్ జాజ్ ఫెస్టివల్ ‘’నిర్వహి౦చి ‘’ఎల్లా వుయ్ విల్ మిస్ యు ‘’గీతం ఆలాపించి అంజలి ఘటించారు లాస్ ఏంజెల్స్ లోని ఇంగిల్ వుడ్ పార్క్ సెమిటరి లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు .

పొందిన అవార్డ్ లు:

ఎల్లా ఫిట్జరాల్డ్ 13గ్రానీ అవార్డ్ లను ,1967లో ‘’గ్రానీ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ‘’ను అందుకొన్నది .1958 ఇనాగరాల్ షోలో పాడి మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా విజయం సాధించి రికార్డ్ సృష్టించింది .సింగర్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ,పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మెడల్ ,ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడం పురస్కారాలు పొందింది .అనేక యూనివర్సిటీలనుండి తన ప్రతిభకు తగిన ఎన్నో అవార్డ్ లు అందుకొన్నది .

గానానికి మచ్చు తునక:

ఆమెను ‘’క్విన్టె స్సిన్షియల్ స్వింగ్ సింగర్ ‘’అంటే తత్వ గాయని లేక గానానికి మచ్చు తునకగా భావిస్తారు .ఎక్కువ ఆల్బమ్స్ పియానో సహకారం తో చేసినా గిటార్ పై చేసినవి అత్యంత నిర్దుష్టం అని ,శ్రావ్యత ,స్వరమాదుర్యాలకు శిఖరాయమానమనీ సంగీత విశ్లేషకులు భావించారు .తన కెరీర్ లో ఎందరెందరో జాజ్ సంగీత విద్వాంసులకు సోలో గాయకులకు అవకాశమిచ్చి ప్రోత్సహించింది .ఫ్రాంక్ సైనట్రా తో పాడి చేసిన ఆల్బమ్స్ ను ఆల్ టైం రికార్డ్ ఆల్బమ్స్ గా గుర్తించారు .

అమెరికన్ సివిల్ రైట్స్ కృసేడర్:

ఎల్లా ఫిట్జరాల్డ్ నల్లజాతి వారి పౌరహక్కుల ఉద్యమకారిణి కూడా .అమెరికాలోని జాతి వివక్షకు , అడ్డుగోడలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది .ఈ పోరాటాలకు ఆమెకు ‘’నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ కలర్డ్ పీపుల్ ఈక్వల్ జస్టిస్ అవార్డ్ ‘’ను ‘’అమెరికన్ బ్లాక్ అచీవ్ మెంట్ అవార్డ్ ‘’ను పొందింది ఆమెను ‘’అమెరికన్ సివిల్ రైట్స్ కృసేడర్’’గా రచయిత బిల్ రీడ్ అభి వర్ణించాడు .

సాంస్కృతిక రాయబారి:

ఎల్లా జీవితమంతా వర్ణ వివక్షత పై పోరాటమే సాగింది .అనేక అడ్డంకులు వచ్చినా, అధిగమించి ప్రజా హృదయాలకు దగ్గరై సాంస్కృతిక రాయబారి (కల్చరల్ ఎంబాసడర్)గా గుర్తింపుపొంది ,అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారం ‘’నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ ‘’ను 1987లోను ,ప్రెసిడెన్షి యల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అవార్డ్ అందుకొన్నసాంఘిక సేవా తత్పరురాలు .

చారిటబుల్ ట్రస్ట్ స్థాపన- సేవా కార్యక్రమాలు:

1993లో ‘’ఎల్లా ఫిట్జరాల్డ్ చారిటబుల్ ఫౌండేషన్ ‘’స్థాపించి బాలబాలిక విద్యాభి వృద్ధికి ,విదిహీన జీవుల నిత్యావసరాలకు ,డయాబెటీస్ గుండె జబ్బు ,కంటి చూపు లపై రిసెర్చ్ ప్రాజెక్ట్ లకు ఆర్ధిక సాయం అందించిన దయామయి ఎల్లా .అదృష్ట హీనులకు ,నిత్యం ప్రమాదం అంచున ఉండేవారికి ఆసరాగా నిలబడటమే ధ్యేయంగా ట్రస్ట్ సేవలు నిర్వహించిన మానవీయ మూర్తి ఆమె .అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ,సిటి ఆఫ్ హాప్,రెటీనా ఫౌండేషన్ వంటి స్వచ్చంద సంస్థలకు వెన్నుదన్నుగా నిలబడి ఆర్ధిక సాయమందించిన వితరణశీలి ఎల్లా ఫిట్జరాల్డ్.

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

మా అన్నగారు కీ .శే .గబ్బిటలక్ష్మీనరసింహ శర్మగారి కుమారుడు గబ్బిట రామనాధబాబు ఉయ్యూరు వి.ఆర్ కె.ఎం.హైస్కూల్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ గా 35ఏళ్ళు పని చేసిపదవీ విరమణ చేసిన సందర్భంగా 23-4-19 మంగళవారం ఉదయం ఆ విద్యా కుటుంబం చేసిన ఘనసత్కారం ,వీడ్కోలు అభినందనసభ చిత్రాలు –

మా అన్నగారు కీ .శే .గబ్బిటలక్ష్మీనరసింహ శర్మగారి కుమారుడు గబ్బిట రామనాధబాబు ఉయ్యూరు వి.ఆర్ కె.ఎం.హైస్కూల్ లో ఫిజికల్ సైన్స్ టీచర్ గా 35ఏళ్ళు పని చేసిపదవీ విరమణ చేసిన సందర్భంగా 23-4-19 మంగళవారం ఉదయం ఆ విద్యా కుటుంబం చేసిన ఘనసత్కారం ,వీడ్కోలు అభినందనసభ చిత్రాలు –

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శతవసంతాల శ్రీ సూర్య రాయ నిత్యానంద గ్రంథాలయం-పిఠాపురం -ఏప్రిల్ రమ్యభారతిలో నా రచన

శతవసంతాల శ్రీ సూర్య రాయ నిత్యానంద గ్రంథాలయం-పిఠాపురం -ఏప్రిల్ రమ్యభారతిలో నా రచన

Posted in రచనలు | Tagged | Leave a comment

భూ అయస్కాంత క్షేత్రం లో అకస్మాత్తు గా కంపనాలు -లైవ్ సైన్స్

Turbulent Blobs in Earth’s Core May Explain Sudden Jerks in the Magnetic Field

Turbulent Blobs in Earth's Core May Explain Sudden Jerks in the Magnetic Field

This visualization of Earth’s core shows how turbulent waves (shown in red and blue) twist up the planet’s magnetic field lines (orange) into pockets of intense activity. This mysterious phenomenon is called a geomagnetic jerk.

Credit: Aubert et al./IPGP/CNRS Photo library

Earth’s magnetic shield defends our planet from the scourges of solar windand cosmic radiation, making life on our planet possible. But every 10 years or so, it can be a real jerk.

“Geomagnetic jerks” are abrupt changes in the strength of Earth’s magnetic field. While some variations in this field are expected to occur gradually, over hundreds to thousands of years, these sudden wobbles in intensity last only a few years at most, and may only alter the Earth’s magnetism over specific parts of the world at a time. One of the first jerks documented, for example, briefly warped the field over Western Europe in 1969.

Since then, a new jerk has been detected somewhere in the world every 10 years or so, and scientists still don’t know what’s causing them. While many geomagnetic phenomena, including the northern and southern lights, result from electrified solar wind bashing into Earth’s magnetosphere, the jerks are thought to originate from deep inside our planet’s core, where the magnetic field itself is generated by the constant churn of liquid-hot iron. The exact mechanism of action, however, remains a mystery. [The 8 Biggest Mysteries About Planet Earth]

Now, a new study published today (April 22) in the journal Nature Geoscienceoffers a potential explanation. According to a new computer model of the core’s physical behavior, geomagnetic jerks may be generated by buoyant blobs of molten matter released from deep inside the core.

In the new study, the researchers built a computer model that painstakingly recreates the physical conditions of Earth’s outer core, and shows its evolution over several decades. After the equivalent of 4 million hours of calculations (sped up thanks to a French supercomputer), the core simulation was able to generate geomagnetic jerks that closely aligned with actual jerks observed over the last few decades.

These simulated jerks jiggled the magnetosphere every 6 to 12 years in the model — however, the events seemed to originate from buoyant anomalies that formed in the planet’s core 25 years earlier. As those blobs of molten matter approached the outer surface of the core, they generated powerful waves that rushed along magnetic field lines near the core and created “sharp changes” in the flow of liquid that governs the planet’s magnetosphere, the authors wrote. Eventually, these sudden changes translate into underfoot manifested as jerky disturbances in the magnetic field high above the planet.

“[Jerks] represent a major obstacle to the prediction of geomagnetic field behavior for years to decades ahead,” the authors wrote in their new study. “The ability to numerically reproduce jerks offers a new way to probe the physical properties of Earth’s deep interior.”

While it’s impossible to confirm this simulation’s results with actual observations of the core (it’s too hot and high-pressured to get anywhere near our planet’s center), having a model that can recreate historical jerks with high accuracy could be helpful in predicting the many jerks yet to come, the researchers wrote.

Knowing when the jerks are comingto expect a jerk could also help monitor and understand how theyits eaffects on other geodynamic processes. For example, is it possible, as one 2013 study in Nature suggested, that the jerks are harbingers of longer days? According to that studythose researchers, sudden changes in the fluid flow at Earth’s core may also alter the planet’s spin by the slightest bitdegree, actually adding an extra millisecond to the day every six6 years or so. Periods where Earth’s day lengthened seemed to correlate with several established instances ofwell-known jerks, the researchers reported.

If that’s true, and geomagnetic jerks are responsible for a slightly longer workday every few years, at least we know we’ve given them the right name.

Turbulent Blobs in Earth’s Core May Explain Sudden Jerks in the Magnetic Field

Turbulent Blobs in Earth's Core May Explain Sudden Jerks in the Magnetic Field

This visualization of Earth’s core shows how turbulent waves (shown in red and blue) twist up the planet’s magnetic field lines (orange) into pockets of intense activity. This mysterious phenomenon is called a geomagnetic jerk.

Credit: Aubert et al./IPGP/CNRS Photo library

Earth’s magnetic shield defends our planet from the scourges of solar windand cosmic radiation, making life on our planet possible. But every 10 years or so, it can be a real jerk.

“Geomagnetic jerks” are abrupt changes in the strength of Earth’s magnetic field. While some variations in this field are expected to occur gradually, over hundreds to thousands of years, these sudden wobbles in intensity last only a few years at most, and may only alter the Earth’s magnetism over specific parts of the world at a time. One of the first jerks documented, for example, briefly warped the field over Western Europe in 1969.

Since then, a new jerk has been detected somewhere in the world every 10 years or so, and scientists still don’t know what’s causing them. While many geomagnetic phenomena, including the northern and southern lights, result from electrified solar wind bashing into Earth’s magnetosphere, the jerks are thought to originate from deep inside our planet’s core, where the magnetic field itself is generated by the constant churn of liquid-hot iron. The exact mechanism of action, however, remains a mystery. [The 8 Biggest Mysteries About Planet Earth]

Now, a new study published today (April 22) in the journal Nature Geoscienceoffers a potential explanation. According to a new computer model of the core’s physical behavior, geomagnetic jerks may be generated by buoyant blobs of molten matter released from deep inside the core.

In the new study, the researchers built a computer model that painstakingly recreates the physical conditions of Earth’s outer core, and shows its evolution over several decades. After the equivalent of 4 million hours of calculations (sped up thanks to a French supercomputer), the core simulation was able to generate geomagnetic jerks that closely aligned with actual jerks observed over the last few decades.

These simulated jerks jiggled the magnetosphere every 6 to 12 years in the model — however, the events seemed to originate from buoyant anomalies that formed in the planet’s core 25 years earlier. As those blobs of molten matter approached the outer surface of the core, they generated powerful waves that rushed along magnetic field lines near the core and created “sharp changes” in the flow of liquid that governs the planet’s magnetosphere, the authors wrote. Eventually, these sudden changes translate into underfoot manifested as jerky disturbances in the magnetic field high above the planet.

“[Jerks] represent a major obstacle to the prediction of geomagnetic field behavior for years to decades ahead,” the authors wrote in their new study. “The ability to numerically reproduce jerks offers a new way to probe the physical properties of Earth’s deep interior.”

While it’s impossible to confirm this simulation’s results with actual observations of the core (it’s too hot and high-pressured to get anywhere near our planet’s center), having a model that can recreate historical jerks with high accuracy could be helpful in predicting the many jerks yet to come, the researchers wrote.

Knowing when the jerks are comingto expect a jerk could also help monitor and understand how theyits eaffects on other geodynamic processes. For example, is it possible, as one 2013 study in Nature suggested, that the jerks are harbingers of longer days? According to that studythose researchers, sudden changes in the fluid flow at Earth’s core may also alter the planet’s spin by the slightest bitdegree, actually adding an extra millisecond to the day every six6 years or so. Periods where Earth’s day lengthened seemed to correlate with several established instances ofwell-known jerks, the researchers reported.

If that’s true, and geomagnetic jerks are responsible for a slightly longer workday every few years, at least we know we’ve given them the right name.

Originally published on Live Science.

, Senior Writer

Brandon Specktor writes about the science of everyday life for Live Science, and previously for Reader’s Digest magazine, where he served as an editor for five years. He grew up in the Sonoran Desert, but believes Sonoran hot dogs are trying way too hard.



గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in సైన్స్ | Tagged | Leave a comment