పండిట్ రవి శంకర్ కు మామ ,గురువు డా బాబా అల్లాయుద్దీన్ ఖాన్ -మూసి -జూన్

పండిట్ రవి శంకర్ కు మామ ,గురువు డా బాబా అల్లాయుద్దీన్ ఖాన్ -మూసి -జూన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితా కాంతులు వెదజల్లే స్పాటిక ‘’ పటిక పువ్వులు ‘’

కవితా కాంతులు వెదజల్లే స్పాటిక ‘’ పటిక పువ్వులు ‘’

హోసూర్ బస్తీ యువక బృందం తరఫున డా అగరం వసంత్ కూర్పరిగా వెలువడిన 13వఉగాది కవితల’’పొత్తం’’నాకు ఈరోజే 8వతేదీ శనివారం ఉదయం అందింది .మధ్యాహ్నం చదివి సాయంత్రం స్పందిస్తున్నాను .ముఖచిత్రంగా ‘’పటికపువ్వులు ‘’తమఅందాన్ని , వైభవాన్ని తెలియ జేశాయి .పటిక ఒక స్పటికం కూడా కనుక రంగులు వెదజల్లే లక్షణాలుంటాయి .ఇందులోని42 కవితలు అలాగే ఉన్నాయి .వివిధభావాలకు వేదికగా , వేర్వేరు  ప్రాంతాల కవులు రాసిన కవితలు సామాజిక  స్పృహకు దర్పణంలా ఉన్నాయి .అందరూ అభినందనీయులే .హోసూరులో తెలుగు బడులన్నీ నిర్బంధ తమిళ చట్టం కారణంగా తమిళ బడులైపోయి తెలుగు పై అభిమానమున్న అందరికీ ఆశనిపాతమై బాధించిందని ,కనీసం అయ్యవార్లు చొరవ తీసుకొని ఆప్షనల్ భాషగా తెలుగు బోధించమని డా వసంత్ చేసిన విజ్ఞప్తి సత్ఫలితాలనివ్వాలని తెలుగువారందరం మనస్పూర్తిగా కోరుకొందాం .దీనికి తెలుగు సంఘాలు అభిమానులు  నాయకులు, తలిదండ్రులు తమ వంతు కృషి చేయాలి .

‘’వివాహం చేసుకున్న వితంతువులా ,జాగృతి నొందిన జాతిలా ,,చైతన్యానికి ప్రతీకలా ,పతాకలా వాడిన మోడు వురుటాకులు తొడిగే నవ వసంతానికి ‘’నిరీక్షిస్తున్నట్లు డా రాధశ్రీ చెప్పారు .’’భూమ్మీద భాషలకు వ్యాకరణాలకు కొదవ లేదు –సంభాషణలే సాధ్యం కాదు ‘’తాను  భాషల వైఫల్యం ను౦చి పుట్టానని ,అందుకే తనకు దినవారాలుతప్ప జన్మదినం లేదని ,తానొక నిశ్శబ్దాన్ని ‘’అనీ రాణి శివ శంకర శర్మ ఉవాచ .డా.యెన్ గోపీ మాత్రం ‘శబ్దం శబ్దత్వాన్ని కోల్పోవచ్చు కాని పర్యవసానం వ్యర్ధం కాదు ‘’అంటూ క్రమ౦గా నిశ్శబ్దమే మాట్లాడుతుంది అని ప్రాఫెటిక్ గా    చెప్పారు .’’ఈ దేశం లో ప్రశ్నించి ప్రతిఘటించే –ప్రజల సమీకరణేతప్ప –మరో దారిలేదని –‘’కొనసాగుతున్న చరిత్ర చెబుతోందని నిఖిలేశ్వర్ భావన .

భావుకుడు పలమనేరు బాలాజీ ‘’కథ లాంటి మనిషి కవి –మనిషిని చూడటం అంటే జీవించటం –కళ్ళతో కళలతో కలలతో జీవించటం ‘’అని అర్ధం చెప్పి ‘’మనిషిలోపలి మనసుని ,మనిషిలోపలి శిశువునీ –కాపాడుకొనే వాడే –కవి ,మనిషి’’ అని నిర్వచించాడు .’’అవసర హడావిడి –అంతశ్చేతన ను తొక్కేస్తోంద ‘’ ని బాధపడ్డాడు డా టి.శ్రీరంగస్వామి .’’ఉగాది పచ్చని ప్రకృతిలోపరిఢవించే –తొలిపండుగ’’అని సంబరపడ్డాడు రానాశ్రీ .చెన్నై డా.ఉప్పలధడియం వెంకటేశ్వరకు ‘’చెట్టుకొమ్మలన్నీ రామ చిలుకలై ‘’మురిసిపోయాయట.చల్లని సంజెవేళ అతడి’’ హృదయం కాగితప్పడవవుతుంది ‘’

డా.మౌనికి ‘’తాను అంతఎత్తులో నిలబడినప్పుడు –అమ్మ ఒదిగిన పండ్ల చెట్టు లా ,నిలువెల్లా ఆన౦దాశ్రువయింది ‘’అందుకే ‘’అమ్మను మించి మూర్తీభవించిన కవిత్వం ‘’ఈ ధరణిపై లేనే లేదని పించింది మౌనికి .

ఈ పోత్తంలో పెన్నేటి పాటకవి విద్వాన్ విశ్వం ను గుర్తు చేసుకొని కృతజ్ఞత తెలిపాడు ‘’విశ్వం పాట’’లో ఆకుల రఘురామయ్య .అభినందనలు రఘూ ..’’పెన్నేటి పాట అంటే –కస్ట జీవుల బతుకాట –కరువు జీవి కన్నీటి గాధ –చిద్రమై పోయిన బతుకుల అద్దం.’’గంజికరువు చేసిన గాయాన్ని –హృదయవేదనగా మలచాడు ‘’విశ్వం అనే’’ మీసరగండ విశ్వరూపాచారి. ‘’సాహిత్య సృజనతో మానవ పరివర్తన కోరుకొన్న ‘’విద్వాన్ పట్టనే ఇంటిపేరుగా ఉన్న విద్వాన్ విశ్వం .’’చెలి సోయగాల పరిమళాలు –సౌందర్య కుసుమాలై విస్తరించిన వేళ’’డా విస్తాలి శంకరరావు ప్రేమగీతం ఆలపించాడు .ఎస్.శశికళకు ‘’అమ్మానాన్నలే అక్షరాలయం ‘’అనిపించారు –అదే తన జీవితాలయం ‘’అని పరవశించింది .’’గాడితప్పిన బుద్ధులపై దాడి చేసి-మానవుడిగా మార్చమని ‘’సందేశమిచ్చాడు డా యడవల్లి పాండురంగ .’’నాగలి నానీలతో దున్నేసి రైతు ప్రతాపం చూపించాడు ఎస్ ఆర్ ప్రతాపరెడ్డి –‘’గుండె మండితే –రైతు ఝలిపిస్తాడు –దగాకోర్లపై –ముల్లుగర్రా చెర్నాకోలా ‘’అని హెచ్చరించాడు .హోసూరు పెద్దాయన నంద్యాల నారాయణ రెడ్డికి ‘’కొండా కోనా యేరూ సెలయేరూ ‘’లలో తెలుగు భజనాలు హరి కధలు ,కీర్తనలు ప్రతిధ్వనింఛి ‘’ప్రాణవాయువై ,ఊపిరై రక్తమై ప్రాణమై మానమై మౌనమై –గుండెల గుడిలో ,నవనాడుల్లో –వెలుగొందుతూ కొలువైఉన్న ‘’అమ్మనుడి –తెలుగు ‘’ ఇప్పుడు సర్వం కోల్పోయి ‘’ప్రాణవాయువే లేని బొగ్గుపులుసు వాయువే నిండిన ‘’స్థితి చూస్తె కల చెదిరి కన్నీరే మిగిలింది ‘’అనేక యుద్దముల నారియు తేరిన యోద్ధ నారాయణ రెడ్డిగారికి .హోసూరు ప్రాంతం లో తెలుగు ఉన్నతిని అధోగతిని కళ్ళకు కట్టించి కర్తవ్య బోధ చేశారు .రెడ్డిగారూ జిందాబాద్ .

‘’మారుతున్నమనిషిగా  -పులుముకొన్న మతం రంగు దులుపుకొని –అంటుకున్న కులతత్వాన్ని వదులుకొని –రాజకీయ  రొ౦పిని దాటుకొని –మానవత్వం తోడుగా ‘’కొత్త అడుగు లేస్తున్నానని డా కాళియప్ప పాండు రంగం  హామీ ఇచ్చాడు .తెలుగు సిమ్లా, కాశ్మీరం అయిన ‘’లంబసింగి ‘’ ని అక్షర బద్ధం చేశాడు బి శంకరరాజు .సాహో  రాజా –‘’అక్కడి కొండపనస –తియ్యని బాసలు చెబుతుంది –మనుషులు పరమ బుద్ధులుగా మారిపోతారు ప్రకృతి తోట తేనీటినందిస్తుంది –జలపాతం ఊయలలూపుతుంది –లిమ్కాకు బదులు తేనే ధారల రుచి తెలుస్తుంది ‘’అంటూ ‘’లంబ సింగి యాత్రలో –కాలం విలంబనమౌతుందని –దృశ్యం ‘’థింసా’’నృత్యమై హృదయం లో పెనవేసుకు పోతుందని పరవశించి చెప్పాడు .

‘’మన ప్రతి ఉశఃషు యుగాధవుతుందట –అందుకే వచ్చే ఉగాదులకు నామకరణం చేయ’’మని పురోహితురాలిగా ‘’ఏం ఆర్ అరుణకుమారి చెప్పింది . ‘’బాధ్యత మరచి  బేకారౌతున్న యువత – పెద్దల్ని విస్మరించి పెడతోవలో వనితా ‘’ లను చూసి బాధపడ్డ పరా౦కుశ నాగరాజు ‘’విస్మరించిన బాధ్యత విషాదాన్ని మిగిలిస్తే –పోగొట్టుకొన్న బంధం అతుకుతుందా ?’’అని ప్రశ్నించాడు .కవిని ఆలూరికి ‘’నాగరకతలో అనాగరకత ‘’కనిపించి మానవ సమాజ ‘’లోతులను , జీవనాన్నీ వెలికి తీయాలి ‘’అనిపించింది .’’ఊతకర్ర ‘’కవితలో పఠాన్ ఖాదర్ వలీ ‘’అవసరం ఆవిష్కణకు తల్లిలాంటిది –ఇప్పుడు కట్టెనే అయినా –ఒకప్పటి వృక్షాన్ని –పస్తులున్నవారికి ఫలహారమయ్యాను –సుస్తుగా ఉన్నవారికి శక్తినయ్యాను –రోగులకు ఔషధమయ్యాను  –మాడు కాలే వారికి  నీడనయ్యాను ‘’అని గతవైభవాన్ని స్మరించి ‘’ఇప్పుడు ఎవ్వరి ఆదరణ లేక –ఎండి ఎండుకట్టె నయ్యాను –నిజంగా పనికిరాని కట్టె నే నేను’’అని వ్యధ చెంది ‘’రేపు నీ సంగతేంటి మహా వృక్షమా “’అని తాత్వికంగా ప్రశ్నించాడు .తెలుగు అక్షరాలు  అ ఆఇఈ మొదలైనవి ‘అమృత వర్షం ‘అన్నాడు ఫణీంద్ర విస్సాప్రగడ .’’వచ్చే ,రావలసినకాలం –తప్పకుండా రైతుదే’’అని వంగాల  సంపత్ రెడ్డి ’’ఆశాభావంగా అన్నాడు .’’నాట్లు కాలం లోనే –నలగర్ని చూసి మాటలు నేర్చుకొన్నాను-కోతలు కాలం లోనే తెగిన వేళ్ళ సాచ్చిగా-బతుకు కతలు ఎన్నో సదువుకున్నాను-పైరు వాసన తగిలినపుడల్లా  -పైరు కర్రనై మొలకెత్తుతుంటాను –కయ్యా, కాలవా కళకళ్ళాడితే కదా-ఊళ్లైనా దేశమైనా ఊపిరి తో తిరగాడేది ‘’అని సుద్ది మాటలు ,పొలం కబుర్లతో అత్యంత నేటివిటి తో చెప్పాడు తెలుగు టీచర్ పల్లి పట్టు నాగరాజు .

‘’వసంతం వచ్చేది ఏడాదికి ఒకసారే –కానీ ఆకలి పేగు నవ్వే ప్రతిసారీ నీకు వసంత రుతువే –కలతెరగని కన్నీటి బొట్టురాలే ప్రాతిసారీ నీకు ఉగాది పండుగే ‘’అని కర్తవ్య బోధ చేశాడు వేంపల్లి అబ్దుల్ ఖాదర్ .’’చిట్టిపోట్టికవితలు ‘’లో డా అగరం వసంత్ గట్టి సత్యాలనే ఆవిష్కరించాడు .1-’’ప్రజలరక్తం ఏరులైతే  రాజులైనారు –చెమట చుక్కలు నదులై పారితే –రారాజు లైనారు ‘’’2-’చెమటోడ్చి సంపాదిస్తే నోట్లు –చెమటల్ని పూడ్చి సంపాదిస్తే –కోట్లు ‘’3-యాసిడ్డు గాయంపై –ఎగసి పడిన ఆవిరి –యముడిలామారి –యెన్ కౌంటరై మాయమయింది .4’-’ఎన్నికల్లో కురిసిన నోట్ల వర్షానికి- కొట్టుకు పోయింది –ప్రజాస్వామ్యం –పౌరులసాక్షిగా ‘’

హోసూరు మట్టి సువాసన ,పటిక పూలపరీమళం,అచ్చమైన తెనుగుతనం ,భావుకత ,నేటివిటీ ,సమాజ దృక్పధం  నిశిత పరిశీలన ,కర్తవ్యం ,కాపాడుకోవటం మొదలైన రంగులు ప్రతిఫలించిన స్పాటిక పటిక పువ్వులు అభిరుచికీ ,నిబద్ధతకు ప్రతిబింబాలు .కవి సమ్మేళనం  నిర్వహించే వారు ,పాల్గొనే కవులు తప్పక వీటిని చదివి స్పూర్తి పొందాలని కోరుతున్నాను  ;కూర్పరి డా వసంత్ ను  ,కవులందరినీ మనసారా అభినదిస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-19-ఉయ్యూరు


 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 466- మధ్వాచార్య’’ కాలమాధవ’’కు వ్యాఖ్య కర్త –లక్ష్మీ దేవి (18వ శతాబ్దం)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

466- మధ్వాచార్య’’ కాలమాధవ’’కు వ్యాఖ్య కర్త –లక్ష్మీ దేవి (18వ శతాబ్దం)

మధ్వమత సంస్థాపనాచార్య శ్రీ మధ్వాచార్య రచించిన’’ కాలమాధవ’’ కు పాయగుండ వైద్యనాధ భార్య లక్ష్మీ దేవి వ్యాఖ్యానం రాసింది .  ఈయన తండ్రి మహాదేవ, తల్లి వేణి.ఆమె తండ్రి మహాదేవ దీక్షిత తల్లి ఉమా .దీక్షితుని తండ్రి కృష్ణ .తాత గణేశ .ఆమెతండ్రి గొప్ప విద్యావంతుడు .గౌరవనీయ స్థానం లో ఉన్నవాడు .ఈమె కుమారుడు బాల లేక బాలక లేక  బాలకృష్ణ .ఈమె వ్యాఖ్యాన ప్రారంభం లోను ,మితాక్షర వ్యాఖ్యానం లోని ఆచారఖండంలోను ఒక శ్లోకం కనిపిస్తుంది .-

‘’శ్రీమాధవం గురుం నత్వా లదీర్లద్మీ౦ శిశుప్రాసః –ఖేరడే ముహుత్మాపాత్య గనేషపత్యకృష్ణాకః’’

మహాదేవఃస్తుతస్తస్య దేవమూర్తిర్జటాదివిత్-శ్రౌత స్మార్ధస్య నిపుణో దీక్షితో రాజపూజితః

పత్నీ యస్య హ్యుమారూపా సాధ్యుమా  తస్య కన్యకా –కాలమాధవ సద్వ్యాఖ్యాయాంతనుతే సర్వ సంవిదే’’

లక్ష్మీదేవికి ఉమా అనే మరో పేరున్నట్లు ఎక్కడా ఆధారం లేదు .లక్ష్మీదేవికాలం 18వ శతాబ్దం .కొడుకు బాలకృష్ణ 1730లో పుట్టి ఉంటాడు .కనుక లక్ష్మీదేవి 18వ శతాబ్దం ప్రారంభంలో పుట్టి ఉంటుంది .

లక్ష్మి వ్యాఖ్యానం లో  ఉపొద్ఘాత, అబ్ద లేక వత్సర ,ప్రతిపత్ ,ద్వితీయాది ,నక్షత్రాది పేర్లతో అయిదు ప్రకరణలున్నాయి ,.దేనికది సంపూర్ణం .కాలమాధవ ,లక్ష్మీ వ్యాఖ్యలు అనేక పురాణ స్మృతి జ్యోతిష మొదలైనవాటినుండి ఉదాహరణలతో నిండి ఉంటాయి .కాలమాధవానికి విద్యారణ్యఅనే పేరుంది ‘

కాలమాధవ లో మొదటిశ్లోకం –‘’వాగౌ శాద్యాఃసుమనసః సర్వార్ధ నాముపక్రమే –యమ నత్వా కృతక్రుత్యాఃస్యుత్వం నమామి గజాననం ‘’

దీనికి లక్ష్మి వ్యాఖ్య –‘’శ్రీమాధవం గురుం నత్వా లక్ష్మీర్లక్ష్మీ  శిశు ప్రసూః’’అని పైఅన చెప్పిన శ్లోకం తర్వాత –అస్య గ్రంధస్య స్వేయత్వ ధోతనాయ స్వ ముద్రా రూప సనేకార్ధసకలస్వగ్రంధసాధారణం తావత్ ‘’—అంటూ రాసింది .ప్రతిశ్లోకానికి విపులవ్యాఖ్యానమే చేసి ఆచార్య హృదయావిష్కరణ చేసి ధన్యురాలైంది లక్ష్మీదేవి  

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 465-తంత్రరాజ తంత్ర కు సుదర్శన వ్యాఖ్య కర్త –ప్రాణ మంజరి (18వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

465-తంత్రరాజ తంత్ర కు సుదర్శన వ్యాఖ్య కర్త –ప్రాణ మంజరి (18వ శతాబ్దం )

ప్రాణమంజరి తంత్ర రాజ తంత్ర అనే తంత్రశాస్త్రం లో మొదటి పటలం కు సుదర్శన అనే వ్యాఖ్యానం రాసింది .దీనిలో 101శ్లోకాలున్నాయి .ఈమె కూరమాచాల రాజు  హర్షదేవ -హర్షమతిల కుమార్తె   . ప్రాణమంజరి ‘’శారదా తిలక టీకా’’అనే శబ్దార్ధ చంద్రిక రాసిన ప్రేమనిది కి మూడవభార్య .హైహయుల  ఏలిక  కార్త వీర్యుడు కు భక్తురాలు .భర్తకుఅత్యంత విదేయురాలు. భర్త అండదండలతోనే వ్యాఖ్యానం రాసింది తప్ప కార్తవీర్యుని సాయం కోరలేదు .ఈదంపతుల కొడుకు సుదర్శన అకస్మాత్తు మరణి౦చతమ్ తో దుఃఖ భారాన్ని తగ్గించుకోవటానికి  ఆమె ఈ వ్యాఖ్యానాన్ని ప్రారంభించి ఊరట చెందింది .సుదర్శన కుమారుడులేని వెలితిని అక్షర సుదర్శనం లో నింపుకొన్నది .దేవి త్రిపురసుందరి స్తోత్రం తో ప్రారంభించింది. అంతకు ముందే ఆమె రాజరాజేశ్వరుని ప్రీతికోసం ‘’దీపప్రకాశ ‘’మొదలైన రచనలు చేసింది .

  ఆమె రాసిన తంత్ర శాస్త్రం పై వ్యాఖ్యానం ‘’నిత్యా ఖండ ‘’కు సంబంధించింది .స్త్రీలు ఎవరూ చేయని సాహసాన్ని ప్రాణమంజరి తంత్రరాజ తంత్ర వ్యాఖ్యానం రాయటం లో చూపి ప్రశంసలు పొందింది .మొదటి పటలానికి వ్యాఖ్యరాసినతర్వాత మిగాతాపటలాలకు వ్యాఖ్యరాసినట్లు ఎక్కడా లేదు .ఆమె చెప్పిన దాని ప్రకారం తంత్రరాజ తంత్రకు ముందు 9తంత్రాలున్నాయి  అవి –సుందరీ హృదయ ,నిత్య షోడశికార్నవ, చంద్రజ్ఞాన , మాత్రికాతంత్ర ,సమ్మోహనతంత్ర  వామకేశ్వర ,బహురూపక ,ప్రస్తార చింతామణి ,మేరుప్రస్తార .ఇవన్నీ  ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని, వాటిలో ఏ ఒక్కటీ ప్రత్యేకించి లేదని చెప్పింది .

  సంస్కృత సాహిత్యం పై ప్రాణమంజరికి  అపార జ్ఞానం ,పట్టుఉన్నాయి  .ఆమె సులభశైలి ,అంతులేని విజ్ఞానానికి మురిసిపోవాల్సిందే .వ్యాఖ్యానం లో ఆమె ప్రయోగించిన ఏ శబ్దానికీ నిఘంటువులు వెతకనక్కరలేదు .అంతటి సులభశైలిలో తంత్ర శాస్త్ర వ్యాఖ్యానం రాయటం సాధారణ కవులకు  అసాధ్యమైన విషయం .దాన్ని సుసాధ్యం చేసింది .మొదటిశ్లోక వ్యాఖ్యానం లోనే ఆమె ప్రతిభకు అప్రతిభులమవుతాం .విషయాలను విడమర్చి చెప్పటం లో అందెవేసిన చేయి ఆమెది. నిష్కర్షగా నిర్ణయాలు చెబుతుంది .త౦త్ర రాజం పై పూర్వపు వ్యాఖ్యాతలు చేసిన వాటిలో లోపాలను నిర్భయంగా బయటపెట్టి తన తీర్పు చెప్పింది .తంత్రరాజం లో గురువుకు 9సద్గునణాలు౦డాలని ,అవే నవనాధులకుప్రతీకలనీ ఉన్నది ఈమె శిష్యునికి కూడా అందులోని మొదటి నాలుగు లక్షణాలు తప్పక ఉండాలని చెప్పింది .ఈ తంత్రాన్ని శిష్యులకు బోధించేముందు గురువు అందులోని 25దోషాలను తొలగించి చెప్పాలని ఉంది . ‘నిర్జితమంత్రం ‘’విషయం లో నిధికార చెప్పిన దాన్ని ఈమెతోసిపుచ్చింది .ఆమెకున్న విశేష పరిజ్ఞానం అడుగడుగునా ద్యోతకమై మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది .

  ప్రాణమంజరి కాలం ఆమె రచనబట్టి తెలియదు.  కాని భర్త రాసిన’’ ప్రేమనిధి పంథా’’లో కొన్ని వివరాలున్నాయి .కుమాన్ కు చెందిన ప్రేమనిధి భారద్వాజ గోత్రీకుడైన ఉమాపతి, ఉద్యోతమతి దంపతులకుమారుడు .ఇతని రాజపోషకుడు ఘనశ్యామకొడుకు మలైవమ్మ తాత ముక్తి క్షేత్రదగ్గరున్న తాకమాకు చెందిన కొండరాజు .మలైవమ్మ అందించిన ఆర్ధికసాయం తో కాశీ లో చదివి పట్టాపొందాడు .చాల గ్రంథాలురాశాడుకాని ముద్రణ పొందలేదు ..ఇతడురాసిన దీపప్రకాశ దానికి తానే వ్యాఖ్యానం రాసిన శబ్దప్రకాశ లలో రచనాకాలం 1726-27గా చెప్పాడు .కాని ఇతరరచన అయిన శబ్దార్ధ చింతామణి కాలం 1737అని రాశాడు కనుక ప్రేమనిధి , ,భార్య ప్రాణమంజరి 18వ శతాబ్ది పూర్వభాగం లోని వారని చెప్పవచ్చు .తంత్రరాజ తంత్రం పై ప్రాణమంజరి రాసిన సుదర్శన వ్యాఖ్యలో మొదటి శ్లోకం –

‘’శ్రీనీశోపిశ్రేశోవిభురగతి పుంసాం గతికరో –పవర్గద్యం యస్మాత్ ఫల మలసూతిపి విమలం

శ్రమహేతుర్నానా విమతిరపి మత్యార్ధ మతిదః-మన్హాయఃకోప్యే షోత్రతు భవతు మే హ్రైద్యః పతిః

శ్రీ కార్తవీర్యం పదగడిహృ గ రూద్యా –స్వీయేస్టం దేవమపి కేవలం యోగాయున్త్యా

తంత్రరాజతంత్రం –మొదటిశ్లోకం –

‘’అనాద్యంతో పరాధీనః స్వాధీన భువనత్రయః –జయత్యవిరతోవ్యాప్త విశ్వం కాలో వినాయకః ‘’

దీనికి సుదర్శన వ్యాఖ్య –అధ శ్రీపతి గణపతి దివాకర దేవీ మహేశ్వరాత్మాక పంచాయతన దేవతానాం తదవానంతర భేదానం చన౦తత్వే నోపాస్య దేవతా నైయత్యేపి ఖఖ ఖఖపూర్వపూర్వ  కర్మ వే భవభవ రుచి వైచిత్రీ పగా — ‘’గ సాగింది .ఆతంత్రం లో మనం మునగకుండా బయట పడదాం .

వ్యాఖ్య లో చవరి శ్లోకం –‘’భూమి తత్వమయో వ్యాప్తిరితి సమ్యక్ సమోరితా –అస్యా నిష్ఫల నాచ్చిత్తేతత్తత్వం ఖాత్మాసత్ కృతం ‘

ఇతి షోడషనిత్యాతత్వేశ్రౌకాదిమతేప్రథమః పటలః’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-19-ఉయ్యూరు

 

 

 

  

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 463-ద్వారకా పట్టాల కర్త –బీనాబాయ్ (12-15శతాబ్దాలమధ్య

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

463-ద్వారకా పట్టాల కర్త –బీనాబాయ్ (12-15శతాబ్దాలమధ్య )

ద్వారకా పట్టాల రచించిన బీనాబాయ్ 12నుంచి 15శతాబ్దాల మధ్యకాలం లో ఉన్న కవయిత్రి .తనతండ్రి యదువంశరాజు మండలీకుడని వీర సాహస సద్గుణ సమేతుడని చెప్పింది .ఈ రాజు కధియవార్ ను   పాలించిన గిర్నార్ చూదాసమ మండలీకరాజులలో ఒకడై ఉండవచ్చు .మొదటి మ౦డలిక 11వ శతాబ్దం మొదట్లోని వాడు ఈమె తండ్రికాదు.తర్వాత వాళ్ళలో  ఒకరై ఉండవచ్చు .పాటలీపురరాజు వీరసి౦హుని కొడుకు హరసింహ రాణి  బీనాబాయ్ .అతడు చాహువాన వంశ వారసుడు .కనుక ఆమెకాలం 12-15శతాబ్దాలమధ్య అని నిర్ణయించారు .

 మహారాణీ ,మహా విద్యావంతురాలైనా బీనాబాయ్ తన గురించి గొప్పగా ఎక్కడా చెప్పుకోలేదు అదీ ఆమె సౌజన్యం .శ్రుతి,స్మృతి,పురాణాలలో నిష్ణాతురాలు .కృష్ణభక్తురాలు.అందుకే తన జీవితమంతా  స్కాంద పురాణా౦ర్గత ‘’ప్రభాస ఖండం ‘’లోని ‘’ద్వారకా మాహాత్మ్యం ‘’  రచించటానికే వెచ్చించింది .ఆమె భారత దేశమంతా పర్యటించి వివిధ తీర్దాలు సేవించింది .

  ఈ కావ్యం లో నాలుగు అధ్యాయాలున్నాయి .మొదటి అధ్యాయం లో తనగురించి చెప్పి ,స్కాంద పురాణం లో ద్వారక విశిష్టతను చెప్పిన విషయాలను రాసి ,శ్రీ కృష్ణుని సేవ చేస్తే,ద్వారక సందర్శిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని రాసింది .రెండవ అధ్యాయం లో ద్వారకదారిలో వచ్చే క్షేత్రాలగురించి చెప్పి ,ద్వారకలో గోమతీ నది ,చక్రతీర్ధం ద్వారకా-గంగా  తీర్ధం, శంకోద్ధార   దర్శనం చివరికి గోమతీనది స్నానం తో సర్వపాప ప్రక్షాళనం .స్నానవిధి తర్పణవిధానం పూసగుచ్చినట్లు వివరించింది .గోమతీ తీరం లో పెట్టె శ్రాద్ధవిదానమూ బాగా రాసింది .చివరికి శ్రీకృష్ణునికి అభిషేకం వివిధసేవలు నైవేద్యాలు వివరించింది .ఇదంతా రామనుజాచార్యులవారి విశిష్టాద్వైత విధానం ఆధారంగా రాసిందే .ద్వారకా మాహాత్మ్యాన్ని అనుసరించినా స్వకపోల విధానం చేబట్టింది .సంప్రదాయ ఆచార పధ్ధతి పాటించటం ఆమెకు అత్యంత ఇష్టమైన విషయం .ఇది చదివితే భారతనారి మతాన్నే కాక మతాతీత సంప్రదాయాన్నీ ఏలగలదనిపిస్తుంది .ఒక అజ్ఞాత యాత్రికుడికి తానొక గైడ్ గా ఉండి ద్వారక యాత్ర చేయించినట్లు అనిపిస్తుంది .ఇప్పుడామె కవితా ప్రతిభ దర్శిద్దాం .

‘’శ్యాయం రామానుజం కాంతం కృతంతందేవా విద్విషాం-నమామి బ్రహ్మ గోపాలవేషం ప్రత్యూహ శాంతయే

‘’ఆశీద్ యాదవ వంశజః పరిలసన్ కీర్తిఃప్రతాపోన్నతో-మానీ మాండలికా భిధః క్షితి పతిఃసద్ద్రం విద్వాశ్రయః

ఆసీర్నిర్జిత వీరవైర నిచయ స్త్యాగార్ధకోశోద్యమో-యోర్ధిప్రార్దితదఃకళావిహ ర్యుగే గణ్యైర్గుపౌర న్న్వితః

తస్య కన్యా వదాన్యాసీ ద్బీనాబాయీతివిశ్రుతా –హరిసింహ  మహీపస్య  వల్లభా పుణ్య   వల్లభా’ప్రధమాధ్యాయం ప్రధమ శ్లోకం –‘’ఏవం సంపూజితస్తేన హరినా బ్రాహ్మణోత్తమా  -ఉవాచ పరి సంతుస్టే వరం బ్రూహీతి కేశవం ‘’

చివరగా –‘’మజ్జన సంసార పాదోనిధిస్వలజల ప్రోద్ భవత్ పాపవార్తా –వర్తేసద్వ్రుత్తపోతైఃధృఢ గుణయుతైర్ఘ్రుతఃపుణ్య కీర్త్యా

ధర్మః శ్రీ బీనాబాయ్యాకిలకలియుగే జాతయాయాదవే కిం –వంశే తత్రాతిచిత్రం  స హరి రుదధరద్ యన్న ధర్మం ప్రసూనయః  

‘శివమస్తు సర్వం –వర్షే భాద్రపద సుది సోమే లిఖితం –శుభం భవత్ శ్రీః’’

464-గంగావాక్యావళికర్త –విశ్వాస దేవి(15వ శతాబ్దం )

మిథిలరాజు శివ సి౦హు ని తమ్ముడు పద్మ సి౦హుని భార్య విశ్వాస దేవి ‘’గంగా వాక్యావళి ‘’రాసింది .భర్త మరణం తర్వాత రాజ్యాన్నిపాలించింది .ఈమె .తోడికోడలైన  శివసి౦హుని భార్య లక్ష్మీదేవి కూడా రచనలు చేసిన విద్యా వంతులు .15వ శాతాబ్దికవి విద్యాపతి వంటి కవులకుఆశ్రయమిచ్చినవారు .

గంగావాక్యాని సుదీర్ఘ స్మృతి అంటే కర్మకాండకు సంబంధించింది .గంగానదికి  సంబంధిన సకల విషయాలు ఇందులో చెప్పింది .అనేక పురాణ స్మృతులనుండి విషయ సేకరణ చేసి కూర్చిన గ్రంథం .ఇందులోని 29ప్రకరనలున్నాయి .అవే – శ్రవణ కీర్తన యాత్ర వీక్షణ నమస్కార ,స్పర్శన అభయ ,సర్వబంధు పరికృతిక్షేత్ర అవగాహన ,స్నాన తర్పణ మృత్తిక ,జప దాన పిండ ,జల తోయపాన ఆశ్రయ ప్రాయశ్సిత్త,కృతకృత్య మృత్యు అస్తిస్థితి విఘ్న ప్రతిసిద్ధ వగైరాలున్నాయి

గంగను నిత్యస్మరణ చేయాలని స్మరణమాత్రం చేత సద్గతికలిగిస్తుందని .ధనంలేకపోయినా గంగాయాత్ర సంకల్పం బలీయంగా ఉంటె అవరోధాలు తొలగి దర్శనం కలిగి పుణ్యలోకాలు సిద్ధిస్తాయని విశ్వాస దేవి అత్యంత విశ్వాసంగా తెలియ జేసింది .ఈమె కూడా తానొక గైడ్ లా యాత్రికులకు మార్గదర్శనం చేసి ఫలితం సిద్ధింప జేసింది .ప్రతి విషయాన్ని కూలంకషంగా మనముందుంచి మేలు చేసింది .యాత్రిక కరదీపికగా ఉంటుంది కావ్యం .

 కంబాల ఆశ్వవతార   అనే రెండు పాములు ప్రయాగ ,ప్రతిష్టాన పురం మధ్య ఉంటాయని ,ప్రజాపతి ప్రయాగ బాహుమూలక మధ్య ఉంటాడని ఇక్కడఆని గంగా ,యమునలలో కాని  స్నానిస్తే పునర్జన్మ ఉండదని చెప్పింది. ప్రజాపతి ప్రాంతం లో మరణిస్తే ముక్తి లభిస్తుంది .ఇదంతా గమనిస్తే స్మృతి పురాణాలపై రాణి విశ్వావతికి ఉన్న అవగాహన అనంతం అని అర్ధమౌతుంది .ఇన్ని ముఖ్యవిషయాలను గుదిగుచ్చి వరుసక్రమం లో అందించటం లో ఆమె అందెవేసిన చెయ్యి అనిపిస్తుంది .ఉపనిషత్కాలం లోని గార్గి, వాచక్నవిల వైదుష్యం విశ్వావసి లో దర్శనమిస్తుంది .ఆమె ధన్యయై మనలనూ ధన్యులను చేసింది .

మొదటిశ్లోకం –‘’స్వస్త్యస్తువస్తుహ్నిన రశ్మి భ్రుతః ప్రసాదా –దేకం వపుః శ్రితవతోర్హరిణా సమేత్య

తస్మాభి పంకజ సద్రోత్య మృణాలలీలా –మావిష్కరోతి హృది యస్య భుజన్గరాజః ‘’

‘’యావద్ గంగా విభాతి త్రిపురహర జటా మండలం మండయంతీ-మల్లీ మాలా సుమేరేః శిరసి సితమహా వైజయంతీ జయన్తో ‘’

చివరగా –‘’యావత్ స్వర్గ తరంగిణీ హర జటాజూటారంతలంబతే –యావాహ్దిక వికాసి విస్తృత కరః సూర్యే యముజ్జ్హృమ్భతే

యావ న్మండలమేన్దివం వితనుతేశంభో శిరోమండనం-తావత్ కల్పలతే యమస్తు సఫలాదేవ్యాఃసతాం శేయసే

కియన్నిబంధమాలోక్య శ్రీ విద్యాపతి సూరిణా-గంగాం వాక్యావలీ దేవ్యాఃప్రమాణోర్విమలీకృతా’’

‘’ఇతి సమస్త ప్రక్రియా విరాజమాన దానదలిత కల్పలతాభి మానభవభక్తి భావిత బహుమాన మర్హమర్హదేవీ శ్రోమాహిస్వాస దేవీ విరచితా గంగా వాక్యావలీసమాప్తః ‘’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-19-ఉయ్యూరు

 

 

 

   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృ భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం ) you

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

ప్రాకృ భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం )

459-రేవా

రేవా రాసిన రెండు శ్లోకాలు న్నాయి .ఒకటి ఖండిత నాయకి గురించి ,రెండవది కలహాంతరిత గురించి .గాథలుగా చెప్పబడే ఈ శ్లోకాలు కవయిత్రికవితా ప్రతిభకు జోహార్ అనాల్సిందే .

‘’కిం తావత్ కృతా అధవాకరోషికరిష్యసి సుభగేదానీం-అపరాధనా మలజ్జ శీల కధయ కతమే క్షమ్యతాం’’

‘’అవలంబితమాన పరాన్ముఖ్యాఆగచ్ఛతోమానిని ప్రియస్య –పుష్టపులకోద్దామస్తవ కధయతి స౦ముఖ  స్థితంహృదయం ‘’

460-రోహా

కలహాన్తరితపై రోహా రాసిన ఒక్కటే శ్లోకం లభించింది .

 ‘’యేన వినా న జీవ్యతే నునీయతే స కృతాపరాధోపి-ప్రాప్తేపి నగర దాహే భణకస్య న వల్లభోగ్నిః’’

461-శశిప్రభ

శశిప్రభ శ్లోకం  రోహా  కవితకు  భిన్నమైనది .ప్రియుడిని క్షమించే ఓర్పు నేర్పూఉన్నది .మగతోడు లేకుండా స్త్రీ ఉండలేదని ,లత వృక్షాలంబనం తోనే వర్ధిల్లుతుందని చెప్పింది .

‘’యధాయధావాదయతిప్రియస్తథా తథానృత్యామి చంచలేప్రేమ్ణా-వల్లీ వలయత్యన్గః స్వభావ స్తబ్ధోపి వృక్షే  ‘’

462-వద్ధావహి

పోషిత భర్త్రుక గురించి వద్ధావహి రాసిన శ్లోకం ప్రసిద్ధి చెందింది . వర్షరుతువులో నల్లని మేఘాలు వింధ్యపర్వతం శృంగాల్లాగా ఉన్నాయట .

‘’గ్రీష్మేదవాగ్ని మషీ మలినాని దృశ్యంతే వింధ్య శిఖరాణి-ఆశ్వాసిహి ప్రోషిత పతికే న భవాంతినవ ప్రవృడభ్రాణి’’’’

ఇంతటితో ప్రాకృత కవయిత్రులు సంపూర్ణం .

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-19-ఉయ్యూరు

 

 

 

  

 

 

 

 

 

 


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

Mysterious ‘Bridge’ of Radio Waves Between Galaxies Seems to Be Smashing the Laws of Physics

Mysterious ‘Bridge’ of Radio Waves Between Galaxies Seems to Be Smashing the Laws of Physics (But It’s Not)

— On the big roadmap of the universe, bustling clusters of galaxies are connected by long highways of plasma weaving around the wilderness of empty space. These interspace roadways are known as filaments, and they can stretch for hundreds of millions of light-years, populated only by dust, gas and busy electrons driving very close to the universal speed limit.Even when moving at near-light speed, particles should only be able to make it a fraction of the way down one of these filaments before running out of juice and breaking down. However, a team of astronomers patrolling a filament between two slowly colliding galaxy clusters has discovered a stream of electrons that isn’t abiding by these traffic rules. In the gassy filament between the galaxy clusters Abell 0399 and Abell 0401, the researchers have detected a vast bridge of radio-wave emissions, created by charged particles whizzing down a 10-million-light-year-long road for far longer than should be physically possible.

The source of this cosmic traffic violation, according to a new study published June 7 in the journal Science, may be a faint but turbulent magnetic field stretching from one galaxy cluster to the next, providing a mysterious particle accelerator that’s kicking electrons 10 times farther than they are ordinarily able to travel. [The 12 Strangest Objects in the Universe]

According to lead study author Federica Govoni, a researcher at the Italian National Institute for Astrophysics, this is the first time a magnetic field has been observed coursing through a galactic filament, and could call for some rethinking about how particles are accelerated over incredibly long distances.

“It is a very faint magnetic field, about 1 million times [weaker] than the Earth’s,” Govoni said in a video accompanying the study. However, she and her colleagues wrote in the paper, that may still be strong enough to emit shockwaves capable of re-accelerating fast-moving particles across incredible lengths as they slow down — effectively creating an electron superhighway.

Located about 1 billion light-years from Earth, Abell 0399 and Abell 0401 are neighboring galaxy clusters — groups of hundreds or thousands of galaxies all gravitationally bundled together, representing some of the most massive objects in the universe. In a few billion years, the two large clusters will probably collide; for now, they’re about 10 million light-years apart and linked by the aforementioned highway of plasma.

In a previous study, Govoni and her colleagues discovered that the two clusters were each creating a magnetic field bristling with radio waves. In their new work, the researchers wanted to find out whether that field was extending into space beyond the bounds of the two massive objects — and, in particular, whether it could be riding down the vast plasma filament between them.


Using a network of telescopes called the Low-Frequency Array (LOFAR), the researchers saw a long “ridge” of radio emissions clearly connecting one cluster to the next.

“This emission requires a population of relativistic [near light-speed] electronsand a magnetic field located in a filament between the two galaxy clusters,” the authors wrote in the study. Because there were no other obvious radio sources between the clusters, the team concluded that the ridge was most likely an extension of the magnetic fields and high-speed particle interactions occurring inside the clusters.

After running some computer simulations, the team found that even a relatively weak magnetic field (like this one) could create shockwaves strong enough to re-accelerate high-speed electrons that have slowed down and keep them whizzing down the length of the filament. However, that is only one possible explanation for a phenomenon that is, according to the researchers, still a pretty big mystery. Luckily, scientists still have a few billion years to solve it.

Posted in సైన్స్ | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృత భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

ప్రాకృత భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం )

సంస్కృత కవయిత్రులగురించి తెలుసుకొన్నాం .ప్రాకృత కవయిత్రుల గురించి తెలుసుకోకపోతే అసమగ్రమే అవుతుంది .వీరిలో తొమ్మిదిమంది ఉన్నారు .ఒక్క’’ అవంతీ సుందరి’’ని తప్ప మిగిలినవారిగురించి  శాతవాహనరాజు అంటే హాలుడు రాశాడు .7వ శతాబ్ది బాణుడుకూడా వీరిని ఉదాహరించాడు .ప్రాకృత కవయిత్రులు 7వ శతాబ్దికి ము౦దువారుగా భావించారు  .

454-అను లక్ష్మి

ప్రేమకు చెందిన అనులక్ష్మి శ్లోకాలు నాలుగున్నాయి .మొదటిదానిలో పొగడ్తలకు ఉప్పొంగి అగడ్త లో పడ్డ యువకుడి విషయం ,రెండవదానిలో అనుభవం లేని కుర్రాడు సాని బారినపడటం ,పురుషులను ఆడంబరం తో ఆకర్షించిన స్త్రీ ,నాలుగులో శిదిలవట వృక్షం పై ఆశ్రయం పొందిన పక్షుల వెతలు వర్ణించింది .మానవస్వభావాలను బలహీనతలను చక్కగా కవిత్వం లో ప్రతి బి౦బి౦ప జేసింది .దారితప్పినవారు పొందే అధోగతి నీ బాగా చెప్పింది .

‘’యత్తవ సతీ జాయా అసత్యేయచ్య సుభగ వయమపి-తత్ కిం స్ప్రుటతు బీజం తవ సమానో యువా నాస్తి ‘’

వట –‘’హసితం స హస్త తాళం శుష్కవట ముపగంతేః పథికైః-పసత్ర ఫలానాం  సద్రుశే ఉడ్డీనో శుక వృ౦దే’’   

455-అసులద్ధి

ప్రియులనుంచి ,భర్తలనుంచి వేరైనా స్త్రీల వ్యధలను రెండు శ్లోకాలో వర్ణించింది అసులద్ధి.మొదటిది పోషిత భర్త్రుక గురించి .రెండవది చతుర అయిన చేటి తన సఖి ప్రేమను ఆమె ప్రియుడికి తెలిపి సమాగమం కల్గించటం .

‘’సఖి వ్యధయంతి కదంవానియధా మాం తధా నశేష కుసుమాని –నూనమేషు దివసేషు వహతి గుటికాయా ధనుః కామః ‘’

‘’నాహం దూతీ త్వం ప్రియ ఇతి కోస్మాక మత్ర వ్యాపారః –సా మ్రియతే తవాయశాస్తేన చ ధర్మాక్షరం భణామః’’

456-అవంతీ సుందరి

రాజశేఖరుని భార్య అవంతీ సుందరి ధనదపాల సోదరి .చాహువాన్ వంశస్త్రీ .తన కర్పూరమంజరి నాటకాన్ని ఆమె కోరికపై ప్రదర్శించినట్లు రాజశేఖరుడు చెప్పాడు .కావ్యమీమాంస అలంకార శాస్త్రం లో ఆమె అభిప్రాయాలను పొందుపరచాడు .ఆమె రాసినవి మూడు శ్లోకాలు .మొదటిది విరహిని గురించి .రెండవది ప్రేయసి ప్రియుడిని అపార్ధం చేసుకోవటం .మూడవది దాంపత్య జీవితం లో ఆనందాను భూతి పొందిన జంట గురించి .ఈ మూడిటిలో అవంతి సుందరి కవితా ప్రతిభ గోచరమౌతుంది .ఆమె మాటలు సంగీతాన్ని వినిపిస్తాయి .

విరహిణి-‘’కిం తదపి హా విస్మ్రుతం నిష్క్రుప యద్గురు జనస్య మధ్యేపి –అభిదావ్య గృహీతస్త్వం స్రస్తోత్తరీయయా

పత్యుపహాస –‘’ఉపహసీతీన్ద్రాణీమింద్ర ఇందీవరాక్షీదనీయం –కౌమార ప్రేక్షితే తవముఖస్య శోభాం పశ్యన్ ‘’’’

457-మాధవి

మాధవి రాసిన ఒకే ఒక శ్లోకం హాస్యస్పోరకంగా ఉంటుంది .ఆడవారు తీవ్ర ప్రేమికులుకారని ,మనసు అర్పించి బానిసలలాగా ఉంటారని చెప్పింది

దుర్వీ దగ్ధ –గోపాయంతి యే ప్రభుత్వం కుపితా దాసా ఇవ యేప్రసాదయంతి-తయేవ మహిలానాంప్రియాః శేషాఃస్వామిని ఏవ వరాకాః’’

458-ప్రహత

స్వాదీనపతికపై ప్రహత చెప్పిన ఒకే ఒక్క శ్లోకం ఉన్నది

‘’ఏకం ప్రహరోద్విగ్నం హస్తం ముఖ మారుతేన వీజయన్-సోపి హసంత్యా మయా గృహీతో ద్వితీయేన కష్టే’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-19-ఉయ్యూరు

 

 

  

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 451-విద్యావతి

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

451-విద్యావతి

సుమీనాక్షి దేవతపై విద్యావతి అనుష్టుప్ లో రాసిన 12శ్లోకాల స్తోత్రం ఆమె భక్తీ తాత్పర్యాలకు ఉదాహరణగా నిలిచిపోయింది .ఇంతకంటే ఆమెవివరాలు తెలియవు

స్తుతి-‘’యా దేవీ జగత౦త్రీ శంకర శంకరస్యాపి శంకరో –నమస్తస్యై సుమీనాక్షై దేవ్యేమంగళ మూర్తయే ‘’

‘’సకృరారాధ్యయాం సర్వమభీస్టంలభతే జనః-నమస్తస్యై సుమీనాక్షై దేవ్యే మంగళమూర్తయే ‘’

‘’లక్ష్మీ సరస్వతీ ముఖ్య యస్తాస్తేజఃకరోద్భవాః – నమస్తస్యై సుమీనాక్షై దేవ్యే మంగళమూర్తయే’’

‘’ఇతి స్తుత్వా మహా దేవీ౦ ప్రణమ్యచ పునః పునః –అనుజ్ఞయా సుమీనాక్షయః ప్రార్ధయేహం సుకన్యయా

మాతస్త్వ వ పద ధ్యానే మనో నిశ్చల మస్తుతే’’

452-విజ్జా (7-9శతాబ్దాలమధ్య )

విజ్జా విజ్జిక  విజయ  బిజ్జక అని పిలువబడే ఈమె శ్లోకాలు ముకులభట్టరాసిన ‘’అభిదా వృత్తి మాత్రిక ‘’లోఉన్నాయి  ,కాశ్మీర్ రాజు అవంతివర్మ సమకాలికుడు భట్ట కల్లటునికొడుకే ముకులభట్టు.అవంతివర్మ రాజ్యపాలన క్రీ.శ.855-883.కనుక విజ్జిక ఇంతకంటే ముందుకాలం లో సుమారు 7-9వ శతాబ్దాల మధ్య  లో ఉండి ఉంటుంది.చంద్రాదిత్యుని రాణి విజయభాట్టారికా విజ్జికా ఒకరో కాదో చెప్పలేము .వివిధ గ్రంథాలలో విజ్జిక వి 29శ్లోకాలున్నాయి .మనుష్యులు వారిస్వభావాలు ,ముఖ సౌందర్యం ,మగవాని అందం వియోగిని మనసు ,ప్రేమకళ ,విధిరాత ,ప్రకృతి మొదలైన వైవిధ్య విషయాలపై కవిత్వం చెప్పింది .జీవించిన కాలంలో విజ్జిక గొప్ప సంస్కృత కవయిత్రిగా గుర్తింపు పొందింది .భాషపై ఆమెకున్న పట్టు అనితరసాధ్యమనిపిస్తుంది .పద్మావతికంటే శ్లేషను బాగా రాసింది .పర్యాయోక్త, అతిశయోక్తి ,తుల్యయోగిత విశేషోక్తి ,ఆక్షేప సంకర అలంకారాలను బాగా వాటంగా వాడి కవిత్వానికి జవజీవాలు కలిగించింది .

చాటు శ్లోకం –‘’భూపాలః శశి భాస్కరాన్వయ భువః కే నాంనాసాదితా

భర్తరం పునరేకమేవ  హి భువస్త్వాం దేవా మన్యామహే

ఏనాన్గః పరిముష్య కున్తలమథాకృష్యవ్యుదస్యా యతం –చోళం పాణ్యచ మధ్య దేశమధునా కామ్చయం కరః పాతితః ‘’

విశిష్ట కవి ప్రశంస ‘’నీలోత్పల దలశ్యామం విజ్జికాం మామ జానతా –వృధైవదరిండినా ప్రోక్తం సర్వ శుక్లా సరస్వతీ ‘’

సామాన్య కవి ప్రశంస –‘’కవేరభిప్రాయమశబ్ద గోచరం –స్పురంత మాద్రుషు పదేషు కేవలం ‘’

వాదద్భి రంగైః కృత రోమ విక్రియే –ర్జనస్య తూష్ణీంభవతోయమజ్జలః ‘’

గ్రామ్యా –‘’మంచే రోమాన్చితాంగీ రతి ముదితతనోః కర్కటీ వాటికాయాం

కాన్తస్యన్గే ప్రమోదముభయ భుజ  పరిష్వక్త కంఠే నిలీనా

పాదేన ప్రేఖ్యాంతీ ముఖరయతి ముహుః పామరీ పైరవాణాం

రాత్ర వృత్రాస హేతోర్వ్రుతిశిఖర లతా లంబినీం కంబు మాలాం ‘’

దృష్టి-‘’జనయతి జననాథ దృష్టి రేషా-తవనవ నీల సరోరుహాభిరామా

ప్రణయిషుసుసమాశ్రితేషు లక్ష్మీ –మారిషు చ మంగమన౦గ మంగ నాసు ‘’

సంభోగ –‘’ధన్యాసి యా కధయసిప్రియ మంగమేపి –నర్మోక్తి చాటుక శతాని రతాన్తరేషు

నీవీం ప్రతి ప్రణిహితేతు కరే ప్రియేణ సఖ్యః శపామియది కించిదపి స్మరామి ‘’

చంపక –‘’కేనాపి చంపక తరోవత్ శపి తోసి –కుగ్రామపామర జనాంతిక వాటికాయాం   

యత్ర ప్రరూఢనవశాఖ వివృ ద్వలోభాద్ –భో భగ్న వాటఘటనోచితపల్లవోసి ‘’

వసంతం –‘’కిమ్శుకం కలికాన్తర్గత మి౦దు కలాస్పర్ధి కేసారం భాతి-రక్త నిచోలక పిహితం ధనురివ జతుముద్రితం వితనోః’’

453-వికటనితంబ (9వ శతాబ్ది పూర్వార్ధం )

ధ్వన్యాలోకం లో ఆనందవర్ధనుడు వికటనితంబ శ్లోకం ఉదాహరించాడు .కనుక ఆమె కాలం 9వ శతాబ్ది పూర్వార్ధం .భోజుడు చెప్పినదాని బట్టి వికట నితంబ విధవరాలు .మళ్ళీ పెళ్లి చేసుకొన్నది .ఆమె మొదటి లేక రెండవభర్త ‘’మాష’’అని పలకటానికి బదులు ‘’మాస ‘’అని పలికినట్లు ,సకాషను సకాసగా పల్కినట్లు తెలుసుకొని తాను యెంత దయనీయ పరిస్థితిలో ఉన్నదో అర్ధం చేసుకొన్నది .అనేక కవుల చరిత్రలలో అలంకార శాస్త్రాలలో ఆమె కవితలున్నాయి .అందులో 11లభ్యం .గౌరీ పద్మావతి లలాగానే వివిధ విషయాలపై కవిత్వం చెప్పింది .

  ద్రుత విలబితం లో రాసిన  మొదటి శ్లోకం రాజుయొక్క శత్రు సైన్యవర్ణన.అందులో ఆ సైన్యాన్ని సిగ్గుపడే యువ కన్యగా  శ్లేషించింది .రథోద్దతిలో రాసిన రెండవ శ్లోకం లో రాజు కీర్తి వ్యాప్తిని వర్ణించింది .మూడవ శ్లోకం లో ప్రేయసి తన చెలికత్తెతో అర్ధరాత్రి అయినా ఒంటరిగాబయటకు పోవటానికి తనకు భయం లేదని కారణం పూవింటి విలుకాడు తనకు తోడుగా ఉంటాడని చెప్పింది .నాలుగో శ్లోకం లో సిగ్గుపడే భర్త సిగ్గు వదుల్చుకొని భర్తగా రుజువు చేసుకోమని హితవు చెప్పింది .ఆరవ శ్లోకం లో ధైర్యం లేని ప్రియుడు తనను చేర సాహసించలేక పోతున్నందుకు వ్యధ చెందుతూ ,తన ఆవేదన అరణ్య రోదనమే అంటుంది .7లో కన్యను సముద్రంతో చక్కగా పోల్చి చెప్పింది .8లో చేరువైన ప్రియునితో ప్రేయసిపొందే ఆనందం చెప్పింది .9లో అన్యోక్తి గా తుమ్మెదమీద రాసింది .10లోమకరందం లేని కేతకీ పుష్పాన్ని చేరలేని తుమ్మెద ను వర్ణించింది .11వ శ్లోకం లో  వసంత ఋతు వర్ణన చేస్తూ ,అన్ని ఋతువులలో ఆహ్లాదపరచే మామిడి చెట్టు ,ఇప్పుడు ఎడబాటులో ఉన్న ప్రియురాలికి మరణ శాపమే అయిందని ,కొద్దిగా చిగిర్చినా అది ఆమె చావుకే కారణమౌతోందని కవితాత్మకంగా చెప్పింది .

  ఆ కాలం లో బాగా పేరెన్నిక గన్న కవయిత్రిగా వికట నితంబ పేరు తెచ్చుకొన్నది .ఎందరో ఆమె కవిత్వాన్ని ఉల్లేఖించారు .విజ్జి కంటే సాధారణ కవిత్వం చెప్పింది .ఆమె శబ్దాలు అందం ఆనందం కలిగిస్తాయి .’’వికట నితంబ కవిత్వ౦ అనుభవించేవారు అందులోని తేనె పలుకులను మరచిపోలేరు ,తన హృదయ మకరందం కంటే అవి మిక్కిలి మధురంగా ఉంటాయని తెలుసుకొంటారు ‘’అన్నాడు రాజ శేఖరుడు .ఆధునిక కవితా సౌందర్యానికి ప్రతీక వికట నితంబ కవిత్వం .ఛందస్సును అద్భుతంగా సద్వినియోగం చేసుకొనే నేర్పు ఆమెది .మందాక్రాంతానని మన్మోహనంగా వాడింది. ‘’దోహాదికా ‘’అనే అరుదైన ఛందస్సును ఉపయోగించింది .

చాటువు –‘’అభిహితాప్యభియోగ పరాడంముఖీ –ప్రకటమంగం విలాస మకుర్వతీ

ఉపరితే పురుషాయితుమక్షమా నవ వధూరివ శత్రు పతాకినీ’’

మానిని –‘’అనాలోచ్య ప్రేమ్ణా పరిణతిమనాద్రుత్య సుహృద-సత్వయాకాండే మానః కిమితి సరలే ప్రేయసి కృతః

సమాకృ స్టాహ్యేతేవిరహ దహనోద్భాసుర శిఖాః-స్వహస్తే నగారాస్త దమలదునారణ్య రుదితైః’’

సంభోగం –‘’కాంతే తల్పముపాగతేవిగాలితా  నీవీ  స్వయం బంధనాద్

వాసశ్చ శ్లథ మేఖలా  గుణ ధృతం కిన్చిన్నితంబే స్థితం

ఎతావత్ సఖి వేద్మి కేవలమహో తస్యాంగం సంగే పునః –కోసౌ కస్మిరత౦ చకిమ్సఖి శపే స్వల్పాపి మేన స్మృతిః’’

మధుకరాన్యోక్తి –‘’అన్యాసు తావదృపమర్దసహాసు భ్రుంగం –లోలం వినోదయ మనః సుమనో లతాసు

ముగ్ధమజాత రజసం కాలికామకాలే –వ్యర్ధకదర్ధ యసి కిం నవమాలికాయాః’’

వసంత –‘’కిం దూరీ దైవ హతకే సహకార కేణా-సంవర్దితేనవిష వృక్షక ఏపమాపః

యస్మిన్ మనాగాపి వికాస వికార భాజి-ధోరా భవంతి మదనజ్వర సంనిపాతః ‘’

ఇంతటితో సంస్కృత కవయిత్రులు సమాప్తం –తర్వాత ప్రాకృత కవయిత్రులతో కలుద్దాం

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 441-పద్మావతి (17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

441-పద్మావతి (17వ శతాబ్దికి పూర్వం )

హరిభాస్కరుని ‘’పద్యామృత తరంగిణి ‘’లో పద్మావతి రాసిన రెండు శ్లోకాలున్నాయి .హరిభాస్కర  తండ్రి అప్పాజీ. తాత హరి .ముత్తాత 1676లో వృత్త రత్నాకరం వ్యాఖ్యరాసిన పురుషోత్తమ .1730లో పద్యామృతం వచ్చింది .వేణీదత్తుడు పద్యవేణిలో పద్మావతి వి 11శ్లోకాలు ఉదాహరించాడు .ఈమె గుజరాత్ కు చెందిన నాట్యకళాకారిణి .గౌరీ తోపాటు పద్మావతి కూడా ప్రతిభా సంపన్ను రాలు .పద్మావతి కవిత్వం రాజు ,పిసినారి ,దుష్టుడు లపై సాగింది .మనుష్యులు పశుపక్షాదులు ప్రకృతి పై కవితలల్లింది .తీసుకొన్న అంశాన్ని సానబెట్టి మెరుగులు తీర్చినట్లు రాసింది కనుక గొప్ప కవయిత్రిగా గుర్తింపు పొందింది. గౌరీ ,పద్మావతి లకవిత్వాలను తులనాత్మకంగా పరిశోధించారు .ఇద్దరూ సమానులే .కాని పద్మావతి శ్లేషకు పట్టాభిషేకం చేసింది  .అలంకార శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేసింది .జాతి మాత్రా ఛందస్సులను వాడింది .

రాజ వర్ణన –‘’హరిణ్యస్త్వరణ్యేగ్ర గణ్య౦-నృపాణా౦ యమాలోక్య లోలాక్షి గోలాః

కరే చారు చాపం గలే నీల చోలం-మృగానువ్రజంత౦ సమరం భావయంతి ‘’

కృపణ-‘’కాషే నిషణ్ణస్య చ బద్ర ముషే-ర్మిలంలుచా కార విభీషణస్య

ఆకారతః కేవలమస్తి భేదః –కృపాణకాస్యాపి దణానాకస్య ‘’

కచం –‘’కిం చారు చందన లతాకలితా భుజంగతః –కిం పత్ర పద్మ ముఖ సంవలితా ను భంగ్యః

కిం వానతేందు జిత రాకందు రుచో బిబాల్యః –కిం భాంతి గుర్జర వర ప్రమదా కచాల్యః ‘’

సింహం –‘’మన్యోసిమానమంజుల సింహ మృగేంద్ర ప్రచండ భుజదండ –యః ప్రేటదిగ్గజోద్వయ పల్ల రతో హింస నో హరిణాత్ ‘’’

ప్రభాత వేళ సంధ్యా –‘’ప్రభాత వేలా స్మరరాజపుత్రీ –నీరాజనా భాజనమర్క బింబం

ఆయాతి నీరాజితుమబ్ధి పుత్రీ – పాణౌ ’గృహీత్వాకిరతా౦సు బాలం ‘

442-ఫల్గు హస్తిని(8వ శతాబ్దికి పూర్వం )

8వ శతాబ్ది కాశ్మీరరాజు జయాపీడుని మంత్రి వామనుడి ‘’కావ్యాలంకార వృత్తి ‘’లోఫల్గు హస్తిని 2శ్లోకాలున్నాయి కనుక  ఆమె అంతకు పూర్వకాలానికి చెందినదే . మొదటిశ్లోకం చంద్రోదయ వర్ణన  .రెండవది వేదాన్తపరమైనది. సృష్టికర్త అందరినీ  సృష్టించటం బాగానే ఉందికాని తనచేతులతో వారినే నాశనం చేయటం బాగాలేదని రాసింది .అలంకార శాస్త్ర వేత్త వామనుడే ఆమె శ్లోకాలను ఉదాహరించాడంటే ఆమె కవిత్వం లో ఏదో గొప్పతనం  ఉందని అర్ధమౌతోంది.

‘చంద్రోదయం –‘’త్రినయనజటావల్లీ పుష్పం నిశావదన స్మితం –గ్రహకిసలయం సంధ్యానారీ నితంబనఖ క్షత౦

తిమిర భిదురం వ్యోమ్నః శృంగం మనోభవ కార్ముకం –ప్రతిపది నవస్యేందోర్బి౦బ౦ సుఖోదయమస్తునః ‘’

దేవ –‘’సృజతి తావదశేష గుణాకరం-పురుషరత్నమలంకరణం భువః

     తదను తత్క్షణభంగికరోతి చే దహహకష్ట మపండితతావిధేః

443-రాజకన్యా

సారంగధర పధ్ధతి మొదలైన అలంకార గ్రంధాలలో రాజకన్యా శ్లోకాలు ఉదాహరణగా ఉన్నాయి .రాకుమారుడికి అతని ప్రేయసికి మధ్యజరిగిన సంభాషణ .తన తండ్రి హృదయం సింహం లాంటిదని దానికి ఏనుగు రక్తమే ఆహారమని అన్యాపదేశంగా చెప్పింది .రెండవ శ్లోకం ను సరస్వతి కంఠాభరణం ,రసగంగాధారం సాహిత్య దర్పణం పేర్కొన్నాయి .చంద్రకాంతిని చూడని కలువ జీవితం వ్యర్ధం .కలువ సౌందర్యాన్ని చూడని చంద్రుని జీవితమూ వ్యర్ధమే అంటుంది .

‘’అంగణంతడిదమున్మదద్రిప –శ్రేణి శ్రోణితవిహారిణో హరేః-

ఉల్లసత్తరూపా కేలిపల్లవాం –రల్లకీం త్యజతి కిం మతంగజః

పూర్వార్ధం తచ్చిత్తపరీక్ష కాయా రాజకన్యాయ –ఉక్తిఃఉత్తరార్ధం తదనురక్తస్యబిహ్లణస్య ‘’  

444-రసవతి ప్రియంవద (16వ శతాబ్దం )

16వ శతాబ్దం లో బెంగాల్ లోని ఫరీద్ పూర్ లో రసవతి ప్రియం వద ఉన్నది .’’శ్యామ రహస్యం ‘’అనే అద్భుత భక్తికావ్యం శ్రీ కృష్ణునిపై  రాసింది .కాని ఒకేఒక్క శ్లోకం లభ్యం

‘’కాలిందీ పులినేషు కేలికలనం కంసాది దైత్యద్విషం –గోపాలీభి రభిస్టుత౦ వ్రజవధూ నేత్రోత్పలైర్యర్చితం

బాహార్లంకృతమస్తకం సులలితైరంగః స్త్రిమ్భఃభజే

గోవిందం వ్రజసుందరం భవ హరం వంశీధరం  శ్యామలం ‘’

445-సరస్వతి (10వ శతాబ్ది కి పూర్వం )

10వ శతాబ్ది భోజుని ‘’సరస్వతీ క౦ఠాభరణం ‘’లో పద్మావతి రాసిన రెండు శ్లోకాలున్నాయి .అనుష్టుప్ లో రాసిన మొదటిశ్లోకం లో ఉత్తమగుణసంపంనుడైన రాజు ముల్లోకాధిపతి కాదగినవాడు అన్నది .రెండవది వసంత తిలక వృత్తం లో మకరంద పేక్ష ఉన్న  తుమ్మెద పుష్పాలకున్న ముళ్ళు ,మురికి దుమ్ము మొదలైన దుర్గుణాలను లెక్కచేయకుండా ఒక్క మకరందాన్ని మాత్రమె ఆస్వాదించి తన ‘’మేజేస్టి’’కాపాడుకొంటు౦ది .అలాగే ఉత్తములు ఉన్నతులు ఇతరులలోని లోపాలను ఎంచకు౦డా,వారిలోని మంచినే గ్రహిస్తారు అని చెప్పింది .రాజస్తుతి-‘’దేవ త్వమేవ పాతాలమాశానం త్వం నిబంధనం –త్వం చామర మరుద్భ్రమిరేకో లోకత్రయాత్మకః

కేతకీ –భ్రమర ‘’పత్రాణి కంటకసహస్ర దురాసదాని –వార్తాపి నాస్తి మధునే రాజస్యన్ధకారః

ఆమోదమాత్ర రసికేన మధువ్రతేన  -నాలోకితాని తవ కేతకి దూషణాని’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 436-మధురవాణి (17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

436-మధురవాణి (17వ శతాబ్దికి పూర్వం )

17వ శతాబ్ది హరికవి రాసిన ‘’సుభాషిత హారావళి ‘’లో మధురవాణి శ్లోకం ఉదాహరి౦ప బడింది .కనుక ఆమెకాలం 17 వ శతాబ్దం పూర్వం అయిఉండాలి .1614లో త౦జావూరుపాలకుడు రఘునాధనాయకుని ఆస్థానకవి ,ఆయన రాసిన ‘’ఆంద్ర రామాయణం ‘’ను సంస్క్రుతీకరించిన  మధురవాణి ఈమె అవునో కాదో తెలీదు.సంస్కృత సాహిత్యం లో అన్ని శాఖలపై ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తుంది .కాలిదాస కుమార సంభవం హర్షుని నైషధం లను సంస్కృతం లో రాయటమేకాక స్వయంగా చంపు రాసిన ప్రతిభ మధురవాణి ది..ఉదాహరింపబడిన శ్లోకం లో భర్తను ఆరాదించని భార్య తర్వాత తప్పు తెలుసుకొని పశ్చాత్తాపత్తపపడటం ఉంది .స్త్రీ సహజ మనోభావాలను  అర్ధవంతమైన కవిత్వం లో బంధించింది .

కులటోక్తి-‘’ఆకా రేణ శశీ గిరా పరభ్రుతః పారావత శ్చుం వనే –హంసక్షం క్రమనణే సమం దయితయా రత్యాం విమర్డే గజః

ఇత్యం భర్తరి మే సస్తయువాని శ్లాఘ్యై ర్గుణైః కించన –న్యూనం నాస్తి పరం వివాహిత ఇతి స్యాన్నేక దోషో యది ‘’

437-మదిరేక్షిణి

సుభాషిత సార సముచ్చయం లో మదిరేక్షిణి ప్రకృతి వర్ణన శ్లోకం ఉటంకి౦చ బడింది  .ఇది వసంత శోభను తెలిపే శ్లోకం మిగిలిన అయిదు రుతువులపైనా రాసే ఉంటుంది .వికసిత తామరలు నీటిపైభాగానికి చేరటం సంరంభంగా భ్రమరాలు తేనెకోసం వాలటం కనిపిస్తుంది .కాలభారిణి లేక మాలభారిణి అనే అరుదైన వృత్తం లో రాసిన శ్లోకం ఇది .

వసంత సంధి –‘’అనుభూత చరేషు దీర్దికాణా ముపకంఠేషు గతగతైక తానాః

మధుపాః కథయంతి పద్మినీనా౦ సలిలే రంతరితాని కోరకాణి’’

438-మారులా (13వ శతాబ్దికి పూర్వం )

13వ శతాబ్దికి చెందిన కల్హణుని’’సూక్తి ముక్తావళి ‘’లో ఒకటి ,14వ శతాబ్దికి చెందిన ‘’సారంగధర పధ్ధతి ‘’లో మరొకటి మారులా రాసిన శ్లోకాలున్నాయి .కనుకకాలం 13శతాబ్దికి పూర్వం .ప్రేమగురించి రాసినవే ఈరెండూ .మొదటిదానిలో విరహంతో బాధపడే ప్రేయసి తలిదండ్రులకు తెలీకుండా ఒంటరిగా కూచుని ప్రియుడి ఎడబాటుకు విలపిస్తూ కడవలకొద్దీ కన్నీరు కారుస్తుంది .రాత్రివేళ పడుకున్న పక్కాంతా కన్నీటితో తడిసి ముద్ద అయిపోతుంది .కాని ఇంట్లో వాళ్ళు గుర్తించకుండా మర్నాడు ఉదయ౦ పక్కబట్టలను  ను  ఎండలో ఆరబెడుతుంది .రెండవ శ్లోకం లో ప్రేయసీ ప్రియులు మళ్ళీ కలిశాక ,ఆమె బక్క చిక్కి శాల్యావసిస్తాయై ,నీరసపడి అతనిపై శ్రద్ధ చూపలేకపోతుంది అతడు గమనించి ,అర్ధం చేసుకోగా ఆమె అతడి ఎదపై వాలి మళ్ళీ ఆనంద బాష్పాలు రాల్చి అతడి వస్త్రాలను తడిపేస్తుంది .కనుక మారులా గొప్ప భావుకత ఉన్న కవయిత్రి అనిపిస్తుంది .ధనద దేవ కవి ఈమె కవిత్వాన్ని మనసార మెచ్చుకున్నాడు .సంస్కృతం లో ఈ రెండు ప్రేమ శ్లోకాలను  అత్యున్నత విలువకలవిగా విశ్లేషకులు భావించారు .విషాదాన్ని అద్భుతంగా పలికించే మందాక్రాంత వృత్తం లో వీటిని రాసి తన కవితా పటిమ చాటింది .

విరహిణీంప్రతి సఖ్యు క్తిః-‘’గోపయంతీ విరహ జనిత దుఖమగ్రేగురూణాం-కిం త్వం ముగ్ధే నయన విస్తృతం  బాష్పపూరం రుణతాసి

నక్తం నక్తం నయన సలిలేరేషఆర్డ్రీ కృతస్తే-శయ్యోపాన్తః కథయంతి దశామాతపే శోష్యమాణః’’

విహరిణా౦ ప్రలాపః –‘’కృశా కేనాసి త్వం ప్రకృతిరియమంగస్య  ననుమే-మలాధూమ్రా కస్మత్ గురుజన గృహే పాచకతయా

స్మరస్యస్మాన్   కంచిన్నహి నహి నహీ త్యేవమగమత్ –స్మరోత్కంపాం బాల మమ హృది నిపత్య ప్రరూదితా ‘’

439-మోరిక

మోరిక రాసిన నాలుగు శ్లోకాలు సూక్తి ముక్తావళి, సారంగధర పధ్ధతి సుభాషితావలి మొదలైనవాటిలో దొరికాయి .ఇవికూడా ఎడబాటు ,సందేశం,ప్రేమను చెప్పుకోవటం , కలయికలో ఆనందం  అనే నాలుగు దశలలో ఉన్న ప్రేమగీతాలే . మారులా లాగా మోరిక కూడా అత్యున్నత ప్రమాణ కవిత్వమే రాసింది .ఈమెనూ ధనద దేవుడు మెచ్చుకున్నాడు .

వియోగిని అవస్త –‘’లిఖతిన గణయతి రేఖాం నిర్భార బాష్పా౦బు ధౌత గండతటా

అవధి దివసావసాన0 మా భూదితిశంకితా బాలా ‘’

శృంగార పధ్ధతి –‘’యామీత్యాధ్యవసాయ ఏవ హృదయేబంధాతునామాస్పదం –వక్తుం ప్రాణసమా సమాక్షమ ఘ్రుణేత్ధం కధంపార్యతే

ఉక్తం నామ తథాపి నిర్భర గలద్ బాష్పం ప్రియాయా ముఖం – హృస్ట్వాపి ప్రవ సంత్యహో ధనలవ ప్రాప్తి స్పృహా మాద్రుశం ‘’

440-నాగమ్మ

దక్షిణభారత దేశానికి చెందిన నాగమ్మ  సూర్య స్తుతిశ్లోకం సారంగధర పద్ధతిలో ఉన్నది .అంతకు మించి వివరాలు తెలీవు .,

‘’శుక తుండచ్ఛవి సవిత్రు శ్చండరుచః పుండరీక వన బంధోః-మండల ముదితం వందే కుండల మాఖండ లాశాయాః’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-19-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కుమార ధూర్జటి చమత్కారపద్యం -జూన్ తెలుగువెలుగు

కుమార ధూర్జటి చమత్కారపద్యం -జూన్ తెలుగువెలుగు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 429-ఇందులేఖ (14వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

429-ఇందులేఖ (14వ శతాబ్దం )

15వ శతాబ్దికి చెందిన వల్లభ దేవుడు తన ‘’శుభాషితావలి ‘’లో ఇందులేఖ రాసిన ఒకే ఒక్క శ్లోకాన్నిమాత్రమే ఉదాహరించాడు .మంచికళాత్మకంగా ఉన్న శ్లోకం ఇది .విభావన అలంకారాన్ని తగినట్లుగా వాడింది .సూర్యాస్తమయాన్ని చూసి సూర్యుడురాత్రివేళ  ఎక్కడ దాక్కుంటాడు అనే సమస్య  వస్తుంది .దీనికి చాలామంది చాలారకాలుగా సమాధానాలు చెబుతారు .కానీ ఇందులేఖ మాత్రం ‘’సూర్యుడు ప్రేమతో తపించే వారి హృదయాలలో ఉండి,రాత్రింతా ఇంకా జ్వలిస్తూ ఉంటాడని ‘’చమత్కారంగా సమాధానం చెప్పింది .

‘’ఏకవారీనిధౌ ప్రవేశమపరే లోకాన్తరాలోకనం –కేచిత్ పావక యోగితాం నిజ గదృఃక్షీణోహ్ని చండార్చిషః

మిధ్యాచై తద సాక్షికం ప్రియ –సఖి ప్రత్యక్ష తీవ్రాతపం

మన్యేహం పునరధ్వనీన రమణీ చేతో ధీ శోతే రవిః’’

430-జఘన చపాల

భర్త దూరంగా ఉన్న భార్య కృతఘ్నత ను గురించి జఘన చపాల తనపేరుకూడా కలిసివచ్చేట్లు చెప్పిన శ్లోకం ‘’కవీన్ద్రవచన సముచ్చయ ‘’లో చోటు చేసుకొన్నది .

‘’దుర్దిన నిశీధ పవనే నిః సంచారాసు నగర వీధీషు

పాత్యౌ విదేశయాతే పరం సుఖం జఘన చపాలాయాః’’

431-కేరళి

వాణీ దత్తుని పద్యవాణిలో కేరళి ఆర్యా వృత్తం లో రాసిన శ్లోకం ఒకటి ఉంది .ఈ శ్లోకంలో సరస్వతీ దేవికి ఉన్న రెండురకాల స్వభావాలను వర్ణించింది .ఆమె బాగా చదువుకున్నవారికి ,కవులకు సమీపంగా ఉంటుంది  వారి ప్రతిభకు ప్రేరకురాలౌతుంది .

1-‘’యస్యాఃస్వరూప మఖిలం జ్ఞాతుం బ్రహ్మాదయోపి న స్పస్టాః

కామగావీ సుకవీనాం స జయతి సరస్వతీ దేవీ ‘’

432-కుటల (17శతాబ్దికి పూర్వం )

ఆర్యా వృత్తం లో ‘’కులటోక్తి’’గా కుటల రాసిన ఒక శ్లోకం 17వ శతాబ్దిలో హరికవి రాసిన ‘’శుభాషిత హారావళి ‘’లో కనిపించింది .అపవిత్రురాలి పై రాసిన శ్లోకం ఇది .

‘’సుఖ శయ్యా తాంబూలం విశ్రబ్ధాశ్లేష చు౦బనాదీని – తుల్యంతి న లక్షాంశంత్వరిత క్షణా చౌర్య సురతస్య ‘’

433-లక్ష్మి(14వ శతాబ్దికి పూర్వం )

14వ శతాబ్దిలోని సారంగధరపద్దతి లో లక్ష్మి శ్లోకం కనిపిస్తుంది .లయ,మధురశబ్ద , శృతి సుభగంగా ఉంటు౦ది కవిత్వం .భగద్విలాసమే సృష్టిలో మానవులలో ఉంటుంది.

‘’భ్రమన్ వనాంతే నవమంజరీషు  న షట్పదో గంధ ఫలీ మజిఘ్రత్

సా కిం న రమ్య స చ కిం న గంతా –బలీయసీ కేవలమీశ్వరేచ్ఛ’’

434-లక్ష్మీ దేవీ ఠాకూరాణి(15వ శతాబ్ది )

15వ శతాబ్ది మిధిలానగర రాజు శివ సి౦హుని భార్య రాణి లక్ష్మీదేవి .తోటక వృత్తం లో ఆమె రాసినకవితలో నాటి సామాజిక వర్ణన ,ఆమె సోదరిలు వివాహసమయం లో అమ్ముడుపోవటం ఇదంతా రాణికి నచ్చకపోవటం బాగా వర్ణించింది .

-ధనలోభి –‘’చపలం తురగం పరిణర్తయతః-పథి పౌర జనాన్ పరిమర్దయతః

నహి తే భుజ భాగ్యభవో విభావో –భగినీ భగ భాగ్యభావో  విభవః ‘’

435-మదాలస (14వ శతాబ్దం )

14వ శతాబ్దికి చెందిన మదాలస రాసిన రెండు శ్లోకాలు  సారంగధర పద్ధతిలో చోటు చేసుకొన్నాయి .వీటిలో ఒకదానిలో భక్తీ రెండవదానిలో ప్రకృతివర్ణన ఉన్నాయి .మొదటిదానిలో విత్తును బట్టే ఫలితం అని  మనం చేసే మంచీ చెడు మన జీవితాలను ప్రభావితం చేస్తాయని  చెప్పింది .రెండవదానిలో జోరుగా కురిసే వర్షం వియోగంలో ఉన్న వారిని ఎలా బాధిస్తాయో తెలియ జేసింది .మానవ ఆలోచనలను భగవంతునిపైకి మరల్చటానికి మదాలస బాగా ప్రయత్నించింది .

1-‘’ధర్మ వివృతి –‘’పరలోక హితం తాతప్రాత రుత్దాయ చిన్తయ –ఇహ తేకర్మణాభేవ విపాకశ్చింతార్యప్యతి’’

2-మేఘ గర్జన –‘’సాంద్ర చంద్ర విరూతైఃస్థిత వాణౌ నర్జితం జగదిదం మదనేన

అ౦బుదో దిశదిశ ప్రధమానో గర్జితైరితి నివేదయతీవ ‘’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలా రచయిత్రి హార్రియట్ బీచెర్ స్టవ్-గబ్బిట దుర్గా ప్రసాద్-జూన్ విహంగ

హార్రియట్ ఎలిసబెత్ బీచెర్ 14-6-1811 న అమెరికాలోని కనెక్టికట్ లో 13మంది సంతానం లో ఏడవ పిల్లగా జన్మించింది .తండ్రిలిమాన్ బీచేర్ కాల్వేనిస్ట్ ప్రీచర్ .తల్లి రొక్సానా .తల్లి తండ్రి అమెరికన్ రివల్యూషనరీ యుద్ధం లో జనరల్ ఆండ్రూవార్డ్ .ఒకసోదరి కేధరిన్ విద్యావేత్త ,రచయిత్రి .సోదరులు మినిస్టర్ లుగా ప్రీచర్ లుగా ప్రసిద్ధి చెందారు .పెద్దక్క నడిపే బడిలో చదివింది హార్రియట్ .మగపిల్లలకు మాత్రమే ప్రవేశమున్న స్కూల్ లో క్లాసిక్స్ ,భాషలు నేర్చింది . 1832లో21 ఏళ్ళ వయసులో ఒహాయ్ లోని సిన్సినాటి కి లేన్ థియోలాజికల్ సేమెటరి ప్రెసిడెంట్ అయిన తండ్రి దగ్గరకు చేరింది .అక్కడ సోషల్ క్లబ్ లో కూడా చేరి క్రియా శీలంగా పని చేసింది .ఒహాయో నదిపై ఉన్న సిన్సిన్నాటి నగరం ఓడలపై వ్యాపారానికి కేంద్రమై దేశం లోని అన్ని ప్రాంతాల నల్లజాతివారు ,ఐరిష్ ప్రవాసీయులు అక్కడికొచ్చి స్థిరపడ్డారు .1829లో అల్లర్ల వలన రోడ్లు భవనాలు దెబ్బతిన్నాయి .ఐరిష్ ప్రజలు నల్లవారిపై దాడులు చేశారు. పోటీతత్వం పెరిగింది .గాయపడిన నల్లజాతి వారికి హార్రియట్ అన్ని విధాల సాయం

.1836,1841లో కూడా ఇలాంటి దాడులు పునరా వృత్తయ్యాయి .దీనిపై స్పందించి బానిస విధానికి వ్యతిరేకంగా రచనలు చేసింది .కోపమొచ్చిన ప్రజలు ఆమెను తరిమికోట్టారుకూడా . ఇక్కడే ఆమెకు కాల్విన్ ఎల్లిస్ స్టవ్ అనే ప్రొఫెసర్ తో పరిచయమేర్పడి 1-6-1836న పెళ్ళాడింది .ఈయనకూడా బానిసత్వ వ్యతిరేకి .పారిపోయే బానిసలకు తమ ఇంట్లో ఈ దంపతులు ఆశ్రయమిచ్చేవారు .చాలామంది బానిసలు కెనడాలో స్వాతంత్ర్యం కోసం ఉత్తరాదికి వెళ్ళేవారు .ఈ దంపతులకు ఏడుగురు సంతానం. అందులో కవల ఆడ పిల్లలున్నారు .1850లో అమెరికా కాంగ్రెస్ ‘’ఫ్యుజిటివ్ స్లేవ్ లా ‘’ఆమోదించింది .దీనివలన బానిసలకు ఆశ్రయమిచ్చినవారికి తీవ్ర శిక్ష ఉండేది .ఈ పరిస్థితులలో బీచర్ కుటుంబం మైన్ లోని బ్రన్స్ విక్స్ కు చేరింది .భర్త కాలేజి లెక్చరర్ గా పని చేశాడు .ఇప్పుడు వీరి గృహం ‘’నేషనల్ హిస్టారిక్ లాండ్ మార్క్ ‘’గా గౌరవం, గుర్తింపు పొందింది .ఒకసారి ప్రార్ధన సమావేశం లో చనిపోతున్న ఒక బానిస దయనీయ స్థితి చూసి చలించి ,అతని కథ రాయాలనే గాఢమైన కోరికకలిగింది .అదే సమయం లో 18నెలల కొడుకు సామ్యుల్ చార్లెస్ చనిపోయాడు .ఈ సందర్భంగా ఆమె ‘’నాకు అత్యంత ఆప్తుడైన కొడుకు మరణించటం తో బానిసల అక్రమ విక్రయాలతో అన్యాయంగా ,దౌష్ట్యానికి చనిపోయిన బానిసల పై నాకు సానుభూతి పెరిగింది ‘’అని రాసుకొన్నది . 9-3-1850న నేషనల్ ఎరా అనే పత్రిక సంపాదకుడికి ‘’బానిసల కస్టాలు కన్నీటి గాధలు,సమస్యలు స్వేచ్చ ,మానవత్వం గురించి రాయటానికి పూనుకోన్నాను .ప్రతి తల్లీ నిశ్శబ్దంగా ఇంట్లో కూర్చోకుండా బానిస సమస్యలపై నాలాగే స్పందించాలని కోరుతున్నాను ‘’అని ఉత్తరం రాసింది .అదే ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలగా ఆమె 40వ ఏట నేషనల్ ఎరా ప్రచురించింది .ఆమె పెట్టినపేరు ‘’ది మాన్ దట్ వజ్ ఎ థింగ్’’.ఈ వీక్లీలో5 జూన్1851నుంచి ధారావాహికగా 1-4-1852వరకు నడిచి ,నవలగా వెలువడింది .5వేల కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడై ఆతర్వాత 3లక్షలకాపీలు అమ్ముడయ్యాయి .ఆమెకు 400 డాలర్లు పారితోషికంగా పత్రిక అందజేసింది .దక్షిణ రాష్ట్రాలలో బానిసలపై జరుగున్న దారుణాలు ఉత్తర రాస్ట్రాలవారికి తెలియ జెప్పటమే ఆమె ధ్యేయం . ఈ నవలలో వ్యక్తులపై బానిసత్వ విధానం ఎంతటి దారుణంగా ఉంటుందో అమెరికా దేశప్రజలకు చాలా ఎమోషనల్ గా చెప్పింది రచయిత్రి .బానిసత్వం బానిసల ,యజమానుల, బానిస వ్యాపారులనందర్నీ ప్రభావితం చేసింది .దేశమంతా దీనిపై చర్చోప చర్చలు జరిగాయి బానిసత్వ నిర్మూలన జరగాల్సిందే అనే అభిప్రాయం బలపడింది దక్షణ రాష్ట్రాలలో .ఒక్క ఏడాదిలో బోస్టన్ లో 300మంది పిల్లలకు ఆమె నవలలోని ఒకపాత్ర’’ ఈవా’’పేరు పెట్టుకొన్నారు ప్రజలు .తర్వాత చాలామంది రచయితలు బానిసత్వ సమస్యలపై రాసినా ఈమె నవలకొచ్చిన ప్రాచుర్యం రాలేదు .దక్షిణ రాష్ట్రాల సమాజాన్ని అత్యంత సహజంగా చిత్రించింది . సివిల్ వార్ అయ్యాక ఆమె వాషింగ్టన్ వెళ్లి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ను 25-11-1862న కలిసి మాట్లాడింది .లింకన్ ‘’అయితే ఇంత పెద్ద యుద్ధం రావటానికి కారణ మైన చిన్న స్త్రీవి నువ్వేనన్నమాట ‘’అని అభినందించాడు .యుద్ధం అయ్యాక ఫ్లారిడా కు వెళ్లి ఇల్లు స్థలం కొనుక్కొన్నది.అక్కడ తనకు ఎవరూ హక్కులభంగం కలిగించలేదని చెప్పింది .కాని తర్వాత కొన్ని చిక్కుల్లోపడి కొ౦పా గోడూ వదిలేసి కెనడా చేరింది .స్కాట్లాండ్ లోని దురాగతాలను ఎదిరించింది .1868లో ‘’హార్త్ అండ్ హోమ్’’మేగజైన్ కు మొదటి ఎడిటర్ అయింది .పెళ్లి అయిన స్త్రీలహక్కులకోసం పోరాటం చేసింది .1870లో ఆమె సోదరుడు హెన్రి వార్డ్ బీచెర్ వ్యభిచారం కేసులో జాతీయ అభియోగాన్ని ఎదుర్కున్నాడు .జనాలు దాడి చేయటం తో ఆమె అక్కడినుంచి మళ్ళీ ఫ్లారిడా వెళ్ళిపోయింది .సోదరుని తప్పులేదని నమ్మింది సమర్ధించింది . మళ్ళీ కనెక్టికట్ చేరి ‘’హార్ట్ ఫోర్డ్ ఆర్ట్ స్కూల్ ‘’స్థాపించి౦ది ఇది తర్వాత యూనివర్సిటి ఆఫ్ హార్ట్ ఫోర్డ్ గా మారింది .1886లో భర్త కాల్విన్ స్టవ్ మరణం తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించటం మొదలైంది.1888లో 77 ఏళ్ళ వయసులో ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలను మళ్ళీ రాయటం మొదలుపెట్టిందని ,రోజూ ఎన్నో గంటలు రాసేదని ,ఇదంతా ఆమెకు తెలియకుండానే చేసేదని దీనినే ‘’డేమెన్షియా’’అంటారని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసింది .ఈ జబ్బునే ఇప్పుడు ‘’ఆల్జిమీర్స్ వ్యాధి ‘’అంటున్నారు వాజ్ పాయ్ , ఫెర్నాండెజ్ వంటి వాళ్ళు కూడా ఈ వ్యాధి బారినపడ్డారు .దెబ్బతిన్న ఆమె మెదడుకు ఇప్పుడు ఆమె రాసేదంతా కొత్తగా అనిపించేది అదొక భ్రమ .హార్ట్ ఫోర్డ్ లో ఆమె నివాసానికి దగ్గరలౌన్న అమెరికా ప్రముఖ నవలాకారుడు మార్క్ ట్వేన్ తన స్వీయ చరిత్రలో ‘’ఆమె మెదడు క్షీణించి ,దయనీయంగా ఉండేది .రోజంతా ఐరిష్ అమ్మాయి వొళ్ళు అంతా మర్దన చేసేది .ఇంటి తలుపులు ఎప్పుడూ తెరచే ఉండేవి .డ్రాయింగ్ రూమ్ నుండి వచ్చే సుగమ సంగీత౦ విషాద గీతాలు ఆస్వాదించేది .’’ ప్రపంచ ప్రసిద్ధ ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’నవలా రచయిత్రి హార్రియట్ బీచేర్ స్టవ్ 1-7-1896న 85వ ఏట కనెక్టికట్ లోని హార్ట్ ఫోర్డ్ లో మరణించింది .మాసాచూసేట్స్ లోని ఫిలిప్స్ అకాడెమి సెమిటరిలో ఆమెను ఖననం చేశారు. ఒహాయు ,మైన్ ,ఫ్లారిడా కనెక్టికట్ లలో ఆమెస్మారక చిహ్నాలు నెలకొల్పారు .జులై1న అమెరికాలో ఎపిస్కోపల్ చర్చ్ఆమె గౌరవార్ధం విందు ఇస్తుంది. 1986లో ‘’నేషనల్ ఉమెన్స్ హాల్ ‘’లో ఆమె పేరు రాసి గౌరవించారు 13-6-2007న అమెరికా ప్రభుత్వం 75 సెంట్ల పోస్టల్ స్టాంప్ ప్రచురించి గౌరవించింది .సెయింట్ లూయీ లోని ‘’హార్రిస్ స్టవ్ స్టేట్ యూని వర్సిటి ‘’పేరును ‘’స్టవ్ అండ్ విలియం టోర్రీ హార్రిస్ ‘’గా మార్చారు .ఒహాయు హిస్టారికల్ సొసైటీ ఆమె పేరును అమెరికా రాజధాని లోని స్టాట్యూటరి హాల్ లో చేర్చమని సిఫార్స్ చేసింది . అంకుల్ టామ్స్ నవల అనేకభాషలలో వెలువడింది .,ఇదికాక ‘’ Dred’’ ఏ టేల్ఆఫ్ దిగ్రేట్ డిస్మల్ స్వా౦ప్ ,అవర్ చార్లీ వాట్ టుడు విత్ హిం ,లిటిల్ పుస్సి విల్లో ,సిక్స్ ఆఫ్ వన్బై హాఫ్ ఏ డజన్ ఆఫ్ ది ఆదర్,ఉయ్అండ్ అవర్ నైబర్స్ మొదలైన నవలలలు,’’ది క్రిస్టియన్ స్లేవ్ ‘’డ్రామా ,రెలిజియస్ పోయెమ్స్ ,రాసింది. నాన్ ఫిక్షన్ గా ‘’న్యు ఇంగ్లాండ్ స్కెచ్ బుక్ ,ఎర్త్లి కేర్ ,ఎ హెవేన్లి డిసిప్లిన్ ,ఏ కీ టు అంకుల్ టామ్స్ కాబిన్ ,లైవ్స్ అండ్ డీడ్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మేడ్ మెన్ ,ఎ డాగ్స్ మిషన్ వగైరా చాలారాసింది .కధలు వ్యాసాలుగా –కజిన్ విలియం ,ఓల్డ్ ఫాదర్ మారిస్ ఒలి౦పియాన ది డ్రంకర్డ్ రిక్లైమ్డ్ ,మోరలిస్ట్ అండ్ మిస్సునలిస్ట్ ,విచ్ ఈజ్ ది లిబరల్ మాన్ ,ది టుఆల్టార్స్ మొదలైనవి చాలాఉన్నాయి .                                                                                                                      -గబ్బిట దుర్గాప్రసాద్~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

image.png
Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 426-చిన్నమ్మ (10వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

426-చిన్నమ్మ (10వ శతాబ్దికి పూర్వం )

భోజుని ‘’సరస్వతీ కంఠా భరణం ‘’లో చిన్నమ్మ  శార్దూల విక్రీడితం లో రాసిన ఒక్క శ్లోకం ఉదాహరి౦ప బడింది .10వ శతాబ్దికి ముందున్న కవయిత్రి ఆమె  .సారంగధర పద్ధతిలోనూ ఇదే శ్లోకం ఉంది .శివుడు తన మనోభావాన్ని దేబ్బతీశాడని నింద చేసే శ్లోకం .ఆయన తీవ్రస్వభావంకలవాడని అహంకారి అనీ ,మహాభైరవాకృతిలో ఆయన అయిదు అవతారాలెత్తిన విష్ణువును  తిరస్కరించాడని,మించిపోయాడని  చెప్పింది .గంభీరమైన శైలీ విన్యాసం ,సమ్మేళన పదార్భాటం ఆమె విధానం .ఆమెకు స్మృతి,శ్రుతులపై లోతన అవగాహన ఉన్నట్లు అర్ధమౌతుంది .

‘’కల్పాన్తే శమిత త్రివిక్రమ మహాకంకాళ దండో స్ఫురచ్-ఛేషస్యత్  నృసింహ పాణి నఖర ప్రోతాది కోలామిషః

విశ్వైకార్ణవతా  నితాంత ముదితౌ తౌ మాతృస్య కర్మా బుభౌ –కర్షన్ ధీవరతాం గాతోస్యతు మహా మోహం మహా భైరవః ‘’

427-గంధ దీపిక

సారంగధరపద్ధతిలో గంధ దీపిక ఆర్యా వృత్తం లో రాసిన ఒకే ఒక శ్లోకం ఉదాహరి౦ప బడింది .ఇందులో ఆమె గృహిణి ధర్మాలను విధులను  వస్త్రాలునేసే పద్ధతిని ,ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటాన్నీ తెలిపింది .

‘’శశి నరవ గిరిమదమా౦సీ జాతు భాగో మలయలోహమో ర్భాగ్యౌ –మిలితైర్గుణపరి మృదితై వస్త్ర ర్గుహాదీని ధూపయే శ్చతురః’’

428-గౌరి (17వ శతాబ్ది )

సుందరదేవుని సూక్తి సుందర లో గౌరీ షాజహాన్ ను పొగుడుతూ రాసిన శ్లోకం ఉదాహరించాడు .పంచతత్వ ప్రకాశిక రాసిన వేణీ దత్తకూడా తన పద్య వేణి లో గౌరీ రాసినశ్లోకాలు పేర్కొన్నాడు .శివుడు కల్ప వృక్షం ,రాజు ,స్త్రీ,ప్రకృతి రాజకీయం శృంగారం మొదలైన వాటిపై ఆమె కవనం  ధారతో అమృతతుల్యంగా ఉంటుంది  .శివుడిని భయంకరంగా లయకారుడుగా కాక ,అభయ దాతగా సంరక్షకునిగా వర్ణించింది .శివపార్వతులు లోకకల్యాణ కారకులని చెప్పింది .తనరాజుపౌరుషపరాక్రమాలను ఆరు శ్లోకాలలో వర్ణించింది  భ్రస్టుపట్టిన సనాతన ధర్మాన్ని రాజుమాత్రమే పునరుజ్జీవి౦ప చేయగలడలని చెప్పింది .భుశండి ఆయుధ వర్ణన  చేసింది .యుద్ధాన్ని బాగా చిత్రించింది .చివరి శ్లోకం లో లొంగిపోయిన వీరుని భార్యపడే కస్టాలు ఆశ్రయం ఆదరణ  దొరకకపోవటం ,విజేతరాజును ఆశ్రయం కొరలేని దైన్యస్థితి బాగా వర్ణించింది గౌరి .స్త్రీసౌన్దర్యాన్ని అద్భుతంగా వర్ణించింది .నీటిలో స్నానం చేసి బయటకు వచ్చిన స్త్రీ రతీ దేవిని మించిన సౌందర్యం తో కనిపించింది ఆమెకు .స్త్రీ సర్వాంగ సౌందర్యం ఆమె కవిత్వం లో పోతపోసుకోన్నది .ఆమె కోరికల కల్పవృక్షంగా కనిపిస్తుంది .సృజన ,భావుకత మేధావితనం ఆమె సొమ్ము .కృత్రిమతకు దూరం సహజత్వానికి అతి సమీపం ఆమె కవిత్వం .అలంకార శోభతో కవిత్వాన్ని మైమరపించే నేర్పు గౌరికి ఉన్నది .

శివుడు-‘’అనుఫుల్ల  గల్ల పరిఫుల్ల  ముఖారవింద –సౌగంధ్యలుబ్ధమధుపాకులయ రతాం

భుగ్న పీనకుచ చూచుకాయాతిగాఢ-మాలింగితౌగిరిజయా గిరిశః పునాతు ‘’

రాజు – ‘’ప్రభ్రశ్స౦గ తిమస్తకః ప్రవిగలత్ సద్వర్ణ విప్రస్థితి –ర్నశ్యత్ స్వాన్గబలః  ప్రణస్టవచన ప్రాగ్భార పూర్ణ స్మృతిః

వృద్ధో త్సంతమయం స్వయం కాలి మహా మ్లేచ్చేన నిర్మాలితౌ –ధర్మః సంప్రతి చాల్యతే తవ కరాలంబేన భూమీపతే’’

భుశండి –‘’మహా చండీయ సంభాతి భుజండీ భవతఃకరే –ప్రతాపజ్వర సంభ్రాంత గోలికా జీవ హారిణీ’’

అరినారి –‘’చంద్రాననా చంద్రక చారు గాయత్రీ –సా కోప విత్రస్తచకోర నేత్రా

శైలే య మృగాభిః స్మరభావ వద్భిః-సంసేవ్యతే ద్రావారి భామినీ తే ‘’

నేత్రం –‘’ముఖే శృంగార సరసి లావణ్యామృత పూరితే –కామక్రీడా హితం భాతి నయనం శఫరీ యుగం ‘’

కల్పతరు – సంత్యేవ నందనవనే శతశః సువృక్షాః-కాలేన పుష్ప ఫలతర్పిత నాకి దక్షాః

తేత్వేక ఏవ సురరాజ మనోభిలాష –తాత్కాల దాన పటురస్తి స కల్ప వృక్షీ’’

ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

12 Questions For Arun Shourie That We Wish He Answers

12 Questions For Arun Shourie That We Wish He Answers

Posted in రాజకీయం | Tagged | Leave a comment

గారుడీ మంత్రం ”తో పాముకాటు నుంచి ప్రాణాలు రక్షించిన ప్రాణదాత పాములనరసయ్య-రామకృష్ణ ప్రభ -జూన్

గారుడీ మంత్రం ”తో పాముకాటు నుంచి ప్రాణాలు రక్షించిన ప్రాణదాత పాములనరసయ్య-రామకృష్ణ ప్రభ -జూన్ 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 422-అజ్ఞాత కవయిత్రి –(17వ శతాబ్దికి పూర్వం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

422-అజ్ఞాత కవయిత్రి –(17వ శతాబ్దికి పూర్వం )

పేరు ఊరు తెలియని 17వ శతాబ్దికి ముందున్నట్లుగా భావింపబడే ఒక అజ్ఞాత కవయిత్రి ఒకే ఒక్క శ్లోకం ఒకటి ‘’శుభాషిత హారావళి ‘’లో బయటపడింది .ఇది ప్రేమ సందేశం .కాని చాలకవితాపరంగా అల్లింది .క్షోభించిన హృదయం పడే వేదనకు ఈ శ్లోకం ప్రతిబింబం .-

‘’పురుష వదోషి తోషి కవీ భవేయుః  -సంస్కారో హృగత్మని సమవైతి న స్త్రైరపం పౌరుషం వా విభాగ మపేక్షతే –శ్రూయంతే హృశ్యంతే చ రాజ పుణ్యో మహామాత్య దుహితరో గణికాః కైతుకి భార్యంచ శస్త్ర ప్రహత బుద్ధయః కవయంచ ‘’

423-భావదేవి (10వ శతాబ్దం )

 భావదేవి లేక భావకాదేవి కి చెందిన మూడు  శ్లోకాలు  మాత్రమే దొరికాయి.అందులో ఒకటి  హారావళి లో మరోటి   ‘’కవీంద్ర వచన సముచ్చయం ‘’లో  మిగిలినది ‘’సదుక్తి కర్ణామృతం ‘’లో ఉన్నాయి.వీటికాలాన్నిబట్టి భావదేవి 10వ శతాబ్దికి  చెంది ఉండవచ్చు.కవీన్ద్రవచన సముచ్చయం లోని శ్లోకం స్త్రీ వక్షోజం పై శ్లేషగా చెప్పబడింది .రెండవది ప్రియునితో జరిగిన ఎడబాటు ,మళ్ళీ కలయిక వర్ణించబడింది .ఒకరకంగా జీవేశ్వరుల ఎడబాటు కలయిక గా అన్వయించుకోవచ్చు .మూడవది భార్యదగ్గరకు భర్తవచ్చి కాళ్ళపై పడటం ,కానీ ఆమెలో మార్పురాకపోవటం ,చివరకు భర్తమంచితనాన్ని అర్ధం చేసుకొని తనను క్షమించమని భార్యకోరటం.

  కవయిత్రి స్త్రీ సహజమైన మనోభావాలను అద్భుతంగా ఆవిష్కరించింది .మంచి శైలి ,మధుర అర్ధవంతమైన  సందర్భోచిత శబ్దాలతో కవిత్వం పరిమళించింది .శృంగార రసాన్ని అద్భుతంగా పోషించగలనేర్పు కనిపిస్తుంది  .మొదటిశ్లోకం లో శ్లిస్ట సమాసోక్తి, రెండవదానిలో అతిశయోక్తి మూడవశ్లోకం లో అర్ధాంతరన్యాసం ,ఆక్షేపం రంగరించింది ‘

1-రాజన్మానౌ తుల్యా విభజన భువా జన్మ చ సహ – ప్రవృద్ధౌనామ్నా చ స్తన్ఇతిసమానా వుదాయినౌ

మిధః సీమామాత్రే యదిదమనయో ర్మండల వతౌ-రపి స్పర్దాయుద్ధం తదిహహి నమస్యః కఠినిం.

424-చండాల విద్యా (4వ శతాబ్దం )

మహాకవి కాళిదాసుకు సమకాలికురాలైన చండాలవిద్యా విక్రమార్క మహారాజు కు అత్యంత  ఇష్టమైన ఆస్థానకవయిత్రి  .విక్రమాదిత్య చండాలవిద్యా కాళిదాసు కవిత్రయ శ్లోకం ‘’సదుక్తి కర్ణామృతం ‘’లో ఉంది.పున్నమి నాటిరాత్రి చంద్ర కాంతి పాలలాగా భూమిపై చేరి జనులకు అలసట తీరుస్తున్నట్లువర్ణించబడిన శ్లోకం అది

‘’శ్రీ రంభోసి మిజ్జతీవ దివాసవ్యాపార ఖిన్నం జగ-తత్ క్షోభా జ జల  బుద్ధబుద్ధా ఇవ భావన్యాలో హితాస్తారకాః

చంద్రం క్షీరమివ క్షరత్యవిరతం ధారా సహస్రోతు కరై-రుద్వగ్నీ వై స్త్రుతిశితై రివాద్య కుముదై ర్జోతుస్మాపాయః పీయతే

చండాల విద్యా-విక్రమాదిత్య –కాళిదాసానాం ‘’(శార్దూల విక్రీడితం )

425-చంద్రకాంత భిక్షూని(–)

బౌద్ధభిక్షుకి చంద్రకాంత భిక్షూని నేపాల్ కు చెంది ఉంటుంది .ఆమె రాసిన 8 శ్లోకాల అవలోకితేశ్వర స్తోత్రం మాత్రమె దొరికింది .దీనిలో అవలోకితెశ్వరుని శారీరక బౌద్ధికమానసిక పరిణతి వర్ణించింది .ఆయన పూర్ణ చంద్ర నిభాననుడు .తామరరేకులలాంటి కనులు .చేతులు కాళ్ళు తామర తూడులు .రాయ౦చనడక .విజ్ఞాన పయోనిధి .బాధితుల ఆర్తి తీర్చే కరుణామయుడు .గురువు మార్గదర్శి .

  చంద్రకాంత కవిత్వం హృదయపు లోతుల్లోంచి భక్తిభావంతో మహాయాన బోధిసత్వ అవలోకితేశ్వరునిపై పెల్లుబికి ప్రవహించింది .స్తోత్రం తోటక వృత్తం లో రాయబడింది –

‘’భువనత్రయ వందితలోక గురుం –అమరాధిపతి స్తుతి బ్రహ్మవరం –మునిరాజవరం యుతిసిద్ధకరం –ప్రణమాణ్యవలోకిత నామ ధరం ‘’

‘’సుగతాత్మజరూప సురూపధరం –బహులక్షణ భూషిత దేహధరం –అమితాత్మ తథాగత మౌలిదరం-కనకాబ్జ విభూషిత వామకరం ‘’

‘’కుటిలామల పింగల ధూమ్రజటం-శశి బింబ సముజ్జ్వల పూర్ణముఖం –కమలాయత లోచన చారుకరం –హిమఖండ విమండల పుండ పుటం ‘’

చివరి శ్లోకం –

‘’పరిపూర్ణ మహామృత లబ్ధ ధృతిం –క్షీరోద జలార్ణవ నిత్యగతిం –శ్రీ పోతలకాభి నివాస రతిం –కరుణా కరుణామయ నిర్మల చారు భ్రుశం ‘’

‘’ఇతి శ్రీ మదార్యావలోకితేశ్వర భట్టారకస్య చంద్రకాంతా –భిక్షుణీ స్తవ స్తోత్రం సమాప్తం ‘’

    ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 421-చమత్కార తరంగిణి వ్యాఖ్యాన కర్తలు -సుందరి ,కమల (1705)

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

421-చమత్కార తరంగిణి  వ్యాఖ్యాన కర్తలు -సుందరి ,కమల (1705)

ఉత్తర రామ చరిత వ్యాఖ్యానకర్త ఘనశ్యామ క్రీ.శ. 1700 లలో జన్మించి, తంజావూర్ పాలకుడు మొదటి తుక్కోజి వద్ద మంత్రిగా ఉన్నాడు .నీలకంఠ చంపు సంజీవనికూడా రాశాడు .18వ ఏటనుంచే రచనావ్యాసంగం సాగించాడు .మహారాష్ట్రకు చెందినవడైనా తంజావూర్ లోనే ఉండిపోయాడు .తండ్రి మహాదేవ .తల్లి కాశీ .పెద్దన్న ఈశా ‘’చిదంబర బ్రహ్మచారి ‘’గా గుర్తింపు పొందాడు .ఘనశ్యామా మొదటి భార్య సుందరి .కమలను రెండవ భార్యగా చేసుకోనేదాకా ,.తనరచనలలో ఆమెను సుందరిగానే పేర్కొన్నాడు .ఈ ఇద్దరితో ఆనుకూల్య దాంపత్యమే నెరిపాడు .ఈ ఇద్దరి పేర్లను తన రచనలలో తరచుగా పేర్కొని , తన అభిమానాన్ని చాటుకొన్నాడు .తన అభిజ్ఞాన శాకుంతల సంజీవనిలో వారిద్దరి మేధో విలసనాన్ని తెలిపాడు .ఘనశ్యామ ఇద్దరుకోడుకులు చంద్ర శేఖర ,గోవర్ధన .చంద్ర శేఖర తన తండ్రిరాసిన ‘’డమరుక ‘’కావ్యానికి వ్యాఖ్యానం రాశాడు .గుడ్డివాడైన గోవర్ధన తండ్రి రచన ‘’ఘట కర్పక ‘’కు వ్యాఖ్య రాశాడు .ఘనశ్యామ ‘’పంచాయతన దేవత’’కు పరమభక్తుడు .

  ఘనశ్యామ సంస్కృత ,ప్రాకృతాలలో అనేక రచనలు చేశాడు .తను 64రచనలు చేసినట్లు నీలకంఠ చంపులో చెప్పుకొన్నాడు .రచనలో తనవాటినే ఎక్కువగా ఉదాహరణలిచ్చేవాడు .సుందరీ కమలలు కూడా అలాగే చేశారు .రాజశేఖరుని విద్ధ సాలభంజికపై ‘’చమత్కార తరంగిణి వ్యాఖ్య’’ రాశారు ఇద్దరూ .ఘనశ్యామ రచనలలో చాలాభాగం శిధిలమయ్యాయి .ఘనశ్యామ ‘’ధాతు కోశం ‘’రాశాడు .అందులో అమరా సి౦హు ని రచనపై తీవ్రంగా విమర్శలు చేసిన ధీమంతుడు .18వ ఏటనే రామాయణ చంపు ,20వ ఏట మదన సంజీవన ,కుమార విజయ నాటకం రాసిన ప్రతిభావంతుడు ఘన శ్యామ .22వ ఏట డమరుక ను 8వ రచనగా రాశాడు .ఏడాదికి కనీసం మూడు లేక నాలుగు పుస్తకాలు రాసినఘనుడు ఘనశ్యామ .మొదట్లో సృజనాత్మక రచనలు చేసి ,తర్వాత ఇతరకావ్యాలపై వ్యాఖ్యానాలు చేశాడు .క్లిస్టభాషలో రాసినా రచనలో ఆకర్షణ ఉంటుంది .మేధావే కాని ఇతరకవులను మెచ్చుకొనే సహృదయతదయలేని వాడుగా గుర్తి౦పు పొందాడు .అనేక’’ కోశాలు’’ నిర్మించాడు కనుక ‘’కోశావలీ వల్లభ ‘’బిరుదు సార్ధకమే .

   ఘనశ్యామ సుందరిని పిన్నవయసులోనే పెళ్ళాడాడు .పెళ్ళికి ఇద్దరివయసు 16లోపే .సుందరి 1705లో పుట్టింది .అతనికి 30 కమలకు 13వయసులో కమలా ఘనశ్యామా వివాహం జరిగింది అప్పుడు అతడు తుక్కోజి రాజ్యం లో మంత్రి .అప్పటికే చాలా రచనలు చేశాడు .ఈ ఇద్దరి పెళ్ళాల ముద్దులమొగుడు తనరచనలలో వారిపై ప్రేమను వారి ఆరాధనాభావనను వీలైనప్పుడల్లా వర్ణించి సంబరపడ్డాడు .ఇద్దరు భర్తను పుంభావ సరస్వతి అని భావించి సేవించారు .చమత్కార మంజరిలో తమభర్త ఘనశ్యామ రచనలద్వారా అమరత్వం పొందాడని ఆనందించారు .రాజశేఖరుడు మూడు రచనలు మాత్రమే చేస్తే తమనాధుడు చాలారచనలను అనేకభాషలలోచేశాడని చెప్పుకొన్నారు .రాజశేఖరుడు ఉదయం మాత్రమే రచన చేస్తే, తమ భర్త రోజులో ఇరవైనాలుగు గంటలు  అదే దీక్షతో రచన చేసే  సామర్ధ్య మున్నవాడని చెప్పారు .ఘనశ్యాముని’’ ప్రచండ రాహూదయ’’ వంటి కావ్యం కాని ఆయన ఇతర రచనలతో సరిసమానమైన రచనకాని వేరెవ్వరూ చేయలేదని సవాలు విసిరారు .భర్త శేముషీ వైభవాన్ని చాటే అనేక శ్లోకాలను డమరుక, జాతి గుణోల్లాస ,భారత చంపు ,హరిశ్చంద్ర చంపు ,భోజచంపు ఉత్తరరామ చరిత వ్యాఖ్యానం,అభిజ్ఞాన శాకుంతలం ,యుద్ధకాండ చంపు ప్రబోధ చంద్రోదయ ,ఆనంద సుందరి  మొదలైన  వివిధ రచనలనుండి ఉదహరించారు.

  దీనిని బట్టి సుందరి కమలలు తమ భర్త ఘనశ్యామారచనలన్నిటిపై లోతైన పరిశీలన  సాధికారమైన అవగాహన ఉందని అర్ధమౌతోంది  .తమ మేధకు తామే అబ్బురపడే వారిద్దరూ .ప్రతి శబ్దానికి వంద అర్ధాలను చెప్పగల సామర్ధ్యం తమకు ఉందని నిర్భయంగా ప్రకటించిన ధీ శక్తి వారిది .తమ బావగారు అంటే ఘనశ్యాముని అన్నగారైన ‘’కల్పతరు ‘’కర్త చిదంబర స్వామి అంటే ఈ ఇద్దరికీ విపరీతమైన గౌరవం భక్తీ,ఆరాధనా. చమత్కార తరంగిణిలో ఈయన గురించి రెండుసార్లు చెప్పారు .కాని కల్పతరు కనిపించటంలేదు .

    ఆధారం –The Contribution Of Women To Sanskrit Lterature –Presidency College Of Calcuutta -1943

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 420-రాజేశ్వర విలాస మహాకావ్యకర్త –పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి (16వశతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

420-రాజేశ్వర విలాస మహాకావ్యకర్త –పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి (16వశతాబ్దం )

పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి రచించిన రాజేశ్వర విలాస మహాకావ్యం లో ఆచార్య బిరుదురాజు రామరాజుగారికి కేవలం 12తాళపత్రాలు మాత్రమె లభించాయని ,అందులో రెండువందల శ్లోకాలున్నాయని ,ఇది సాహిత్య శాస్త్ర గ్రంథంఅని ,ప్రతాపరుద్రీయం లాగా పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరికవి రాజేశ్వర భూపాలుని పేరుతొ రాసిన సాహిత్య శాస్త్ర గ్రంథంఅన్నారు .

  కౌశిక గోత్రజుడైనకవి తండ్రి నాగలింగ సోమయాజి .కవికాలం నివాసం తెలీదు .కృతి భర్త మహాజని నాగమాంబా ,లక్ష్మీ నారాయణ అనే బ్రాహ్మణ దంపతులకు వేములవాడ రాజరాజేశ్వరుని అనుగ్రహంతో జన్మించాడు .భాగాపురవాసి .గొప్ప వంశం .గౌతమస గోత్రం .మూల పురుషుడు కీర్తిమన్నృపాలుడు బదరికాశ్రమం లో శ్రీ లక్ష్మీ నారాయణుని సేవించి వరప్రసాదంగా పుత్రుని పొందాడు .ఈయన మునిమనవడు’’ఆసాకేతము ఆకాశి’’వరకున్న రాజ్యాన్ని పాలించాడు .ఈ వంశంలో ఆరవతరం వారైన కాశీనాధ ,జగన్నాధ ,ఉమానాద సోదరత్రయం సాకేతం పాలిస్తూ ,నిజాముల్క్ తో యుద్ధం చేసి గెలిచారు .ఉమానాధుని మనవడు లక్ష్మీనారాయణ ధిల్లీ పాలకుని చేత బెంగాల్ సుబేదారుగా నియమింపబడ్డాడు ఈయనమనవాడు చంద్ర చూడుడు పాండురంగని వరప్రసాదం తో విఠల,కృష్ణ దోడారాములు అనే ముగ్గురుకోడుకులను కన్నాడు .వీరికి ఢిల్లీ రాజు మహాజనీ ,దేశముఖీ ఇచ్చాడు .బహుశా అప్పటినుంచి ఇంటిపేరులో మహాజని  చేరి ఉంటుంది .విఠలుని మునిమనవడు గోపాలరాయుడు మత్సపురిఅంటే మచిలీపట్నం  పాలకుడయ్యాడు .ఇతని 8మంది సంతానం లో రెండవాడు లక్ష్మీనారాయణ స్తంభాద్రి అంటే ఖమ్మం మెట్టు అనగా ఖమ్మం ను జయించాడు .ఇతనికి నాగాంబ వెంకమాంబ ,రాజేశ్వరుడు సంతానం .ఈ రాజేశ్వరుడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి వరప్రసాది .ఈయన పేరుతోనే ‘’రాజేశ్వర విలాస కావ్యం ‘’రాశాడు కవి పిల్లలమఱ్ఱి వేంకటపతి సూరి .రాజేశ్వరుడు భాగాపురం అంటే భాగ్యనగర నివాసి .కృతి కర్త, భర్త ఇద్దరూ సమకాలికులేకనుక కాలం 16వ శతాబ్దం అయి ఉంటుంది .

  వంశావళి చివరలో కవి –

‘’బాలన్యగ్రోధ వంశోత్తమ విమలయో రాశిరాకాశశాం కః-సంపూర్ణ బ్రహ్మ తేజః స్పుట ముఖ కములోల్లాస విద్యా మరందః

నాగార్యో యన్య సాక్షా త్కృత నగతనయా కాంత మూర్తిఃపితాసీ –దేనం శ్రీ వేంకటార్యం ప్రమదయతుముదా సాదు కారుణ్యవాదః ‘’

‘’ఇతి కౌశిక గోత్ర బాలన్యగ్రోధ కుల కలశాబ్ది సుధాకర శ్రీనాగలింగ సోమయాజి తనూభవ ‘’శ్రీ  వేంకటపతి సూరి విరచితే రాజేశ్వర విలాసే మహాకావ్యే వంశావాళీప్రకరణం నామ ప్రధమోమ్కః ‘’నాటకం లోని అంకంలాగా  మొదటి అంకం అనటం ఆశ్చర్యం .మిగత రెండిటిని నాయక ప్రకరణం అని ,అలంకార ప్రకరణం అనీ అన్నాడు .

  నిజాముల్కును ఓడించిన సోదరత్రయం పై శ్లోకం –

‘’శూరాస్సాహసికా స్త్రయస్సమధిక ప్రావీణ్యవంతో ధను –ర్విద్యాయాంగజవాజి రాజి రథసంపత్తి ప్రసేనాశతాః

సాకేతే నగరే వినోదనకదాలాపై నిశాయాపనం –కుర్వంతః పరిపాలయంతి విషయానర్ధ్యా దితేయద్రుమః ‘’

‘’తదన్తరే తన్న్రుపవీర దేశానాక్రామ్య దోర్దండ జితారి వర్గాః –మ్లేచ్ఛానిజాముల్కు మఖా ప్రసైన్య యుతాబబందు ర్నగరం చ తేషాం’’

ఢిల్లీ శ్వరుడిచ్చిన ‘’దేశముఖి గురించిన శ్లోకం –

‘’నృపాస్త్రుయంతే బహుభాగ్యవంతః  అనేకమాతంగ రాదాశ్వవంతః –తత్రైవ ఢిల్లీనగరాదినాదాత్ మహాజనీ ,దేశముఖత్వ  మాపుః

మచిలీ బందరును పాలించిన గోపాల రాయని పై శ్లోకం –

‘’శ్రీ గోపాల మహేపతిః  కులకరోదాంత స్తపస్వీ వరం –ధర్మాత్మామిత విక్రమో ద్విజకులాలంకార రూపోపి సః

శ్రీమాన్ మత్స్యపురేవారిచ నివసన్ తద్రాజ్య కార్యస్యవై –తత్రస్థాన్విషయా న్వశాద్రఘుపతీ రంయానివాలాపయత్ .

ఉపమాలంకారం –

‘’శ్రీ రాజరాజేశ్వర భూపతి కంఠీరవమంగ జోపమాత్మానన్ – సంరక్షిత భూపాలం రక్షతు లక్ష్మీపతిః పరగ్హ్నం  తమ్ ‘’

అపహ్నుతి అలంకారం-

‘’శుద్దాపహ్నుతి రాన్యారపార్దో ధర్మ నిహ్నవో యత్ర –నామీ సురాజ నృపతే స్సుగుణాః కిం తర్హి రత్నజాలాని ‘’

సయుక్తికో యత్ర కా ధర్మ నిహ్నవో బుధా స్తమాహుః కిల హేత్వవహ్నవం –

అయం న చేందుఃకమలనుమోదకో హరి –ర్నసౌమ్య స్సహి చక్రపాలకః ‘’

ధీరోదాత్త నాయక లక్షణాలు చెప్పే శ్లోకాలలో చాలా శిధిలాలని ,9శ్లోకాలు ఒక దీర్ఘగద్యం మాత్రమె ఉన్నాయని రాజుగారువాచ

(బిరుదురాజువారి ఈ వ్యాసం వేములవాడ రాజరాజేశ్వర సంస్కృత కళాశాల వార్షిక సంచిక -1981-82లో ప్రచురితం )

ఆధారం –ఆచార్య బిరుదురాజు గారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు

ఇంతటితో ఆచార్య బిరుడదురాజురామరాజు వారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’లో సంస్కృత కవులు సమాప్తం .

సశేషం

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -3-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జూన్ తెలుగు వెలుగు మాసపత్రికలో పుచ్చా వారి పుస్తక పరిచయం ”కొండ అద్దంలో ‘

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 419-ఏక దిన ప్రబంధకర్త –ఆలూరి సూర్యనారాయణ వాజపేయ యాజీ

  • గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

419-ఏక దిన ప్రబంధకర్త –ఆలూరి సూర్యనారాయణ వాజపేయ యాజీ

విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ వేంకటపతి రాయలు పాలిస్తున్నకాలం (1586-1614)లో రాయవేలూరుకు సామంతరాజు లింగమనాయకుడు .తండ్రి చిన్నబొమ్మ నృపాలుడు (1549-1579)గొప్పకవి, గాయకుడు, కవిపండిత పోషకుడు .జయదేవుని గీత గోవిందం లాగా ఆరు కాండల రామాయణాన్నివివిధరాగ ,తాళాలతో, గేయాలతో, శ్లోకాలతో ‘’సంగీత రాఘవం ‘’కృతి రచించాడు .అప్పయ్యదీక్షితులవారికి చాలాకాలం పోషకరాజుకూడా.బొమ్మనాయకునికొడుకు లింగమనాయకుడు కూడా పరాక్రమశాలి, కవిపండిత పోషకుడు .విజయనగరరాజు రెండవ వేంకటపతి రాయలతో యుద్ధం చేసిన మేటి వీరుడు .రాయవేలూరుకోట రాయల వశంకాకపోతే దామెర్ల కరి చన్నమనాయకుడు అనే విజయనగర సామంత సైన్యాధికారి మోసం చేసి కోటను పట్టుకొన్నాడు .ఇంతటితో వేలూరులో ఈ నాయకులపాలన అంతమొందింది .

  లింగమనాయకుని ఆస్థానం లో కవిపండిత గాయక నర్తక,విద్యా గోస్టులు , ప్రదర్శనలు , చర్చలు ఎక్కువగా జరిగేవి .విద్యా గోష్టికి ఆలూరి సూర్యనారాయణ యజ్వ మూలస్థంభం .ఒకరోజు రాజాస్థానం లో కవులమధ్య పోటీవస్తే యజ్వగారు ఒక్క రోజులో ఒక ప్రబంథం  రాస్తానని సవాలు చేసి ‘’ఉలూచీ చిత్రాంగద సుభద్రాపరిణయం ‘’ రాసి మాట నిలబెట్టుకొని రాజును సంతోష పరచాడు  .ఇది అముద్రితం .

 మొదటిసర్గలో ఇంద్రప్రస్థ వర్ణన ,ధర్మరాజు ధర్మపాలన ,సమయభంగం చేసిన అర్జునుడు తీర్ధయాత్రలకు వెళ్ళటం ,గంగానదినుండి పాతాళానికి పోయి ఉలూచిని పెళ్ళాడి బభ్రువాహనుడికి జన్మనివ్వటం ,అక్కడినుంచి కావేరీ తీరం చేరటం ,పాండ్యరాజ వర్ణన కూతురు చిత్రంగదతో పరిణయం ,పంచహ్రద సేవనం ,ద్వారకకు చేరటం ఉన్నాయి .రెండవసర్గలో కృష్ణుని ప్రసన్నం చేసుకొని ద్వారక చేరి ,రైవతకాద్రిపై మాయా యతిగా  ఉంటూ సుభద్ర సేవలు అందుకొనటం ఇద్దరి విరహవేదన ఉంటాయి .మూడులో సుభద్ర చెలికత్తె ద్వారా మాయ యతి సుభాద్రమనో వేదన అర్ధం చేసుకోవటం ,సుభద్రతో తనగుట్టు చెప్పుకొని రహస్యక్రీడలాడటం ఉన్నాయి .నాలుగవ సర్గలో బలరాముడు యతిని సేవించి సముద్ర ద్వీపం లో జరిగే శివుని ఉత్సవాలకు వెళ్ళటం ,కృష్ణుడు సుభద్రార్జునుల వివాహ ప్రయత్నం చేయటం ,బలరాముడికి కోపంవస్తే తమ్ముడు శాం౦పచేయటం,నూతనదంపతులు ఇంద్రప్రస్థం చేరటం ,ధర్మరాజు సుభద్రార్జున వివాహాన్ని ఘనంగా జరిపించటం తో ప్రబంథం ముగుస్తుంది .

  ప్రార్ధన శ్లోకం –

‘’స్పురతుమే గురువరంఘ్రి నఖ ప్రభా దళిత సంతమసే హృదయా౦ తరే

ఆది కథా కరకంకణ కుండలీ క్వణిత శంకిత శంకర సంస్తుతః  ‘’

ధర్మరాజు ప్రాభవం –

‘’పుమభిలాష ఫలైర్ధ్రుత మూర్తి భిశ్చతనృణా౦ చ దిశాంవిజయైరివ

సహి చతుర్భిరశోభి సహోదరైర్హరిరివో చ్చ భుజై రాతి దుస్సహై ‘’

చిత్రాంగద –

‘’ముఖ రుచి ప్రవల్లహరీ స్తన క్షితి ధర ప్రతిఘాత వివర్తితా –ఝఠయుగీ పరిత స్పురతిధృవం

 భుజ యు గీతి భుజంగ శిశుభ్రువః ‘’

విజయుని విరహవేదనలోవసంతరుతు  శ్లేషరామణీయకత –

‘’స్వకామ భా జ్మాధవబద్ధ సఖ్య మప్యర్జునం హంతి ముహుర్వసంతః

పలాశ వర్గస్య వికాశ హేతోః క్వజాతి హీనస్య భవేద్వివేకః ‘’

  ఈశ్లోకం పండితరాజు చెప్పిన ‘’జాత్యావిహీనో నవివేక్తుమేస్టి’’శ్లోకాన్ని గుర్తుకు తెస్తు౦దన్నారు  రాజుగారు

సుభద్రార్జున రహః క్రీడ –

‘’వాతాహృత నవామ్భోజ సౌరభ్యేనసహార్జునః –సుభద్రా ముఖ సౌంగంధ్య తారతమ్యం పరీక్షితే ‘’లాక్షా లక్ష్మీం దదౌ పాదే కుంతలే  కుంకుమ శ్రియం –బాలతపః సుభాద్రాయాఃకర్ణే కమలపురాతం  ‘’

కావ్యం చివరలో తలిదంద్రులగురించి,రాజసభలో ప్రతిజ్ఞా గురించి చెప్పుకొన్నాడు –

‘’శ్రీ యజ్ఞేశ్వర యజ్వ న స్సితకరాదాలూరి వంశాంబుధే-జ్ఞానామ్బా సుషువేయమధ్వరివరం శ్రీ సూర్య నారాయణం

తస్య శ్రీమతి లింగయ ప్రభు సభా మధ్యే ప్రతిజ్ఞా కృత –శ్రీమానేక దిన ప్రబంద సుకృతౌ సర్గశ్చ   తుర్దోజని

నాడీభిర్దివసస్య నవ్యమచిరాదవ్యాహతో హాస్పదైః- శబ్డార్ధైఃప్రభు సత్య సమ్మత కదా వృత్త క్రమైర్యంత్రితం

యత్కావ్యం నిరమాయి సంప్రతి మయాతస్మిన్ హఠాత్కారతః –ప్రాప్తం దోషముపేక్ష్యకేవల గుణగ్రాహీ బుధస్తుష్యతు

స్వస్య గుణావిష్కరణ ప్రయోజనాత్స గౌరవాదపి వా-త్రింశద్ఘటిక నిబంధన సాహసతో వా సతాం ముదేస్తు మే కావ్యం ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు

మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -2-6-19-ఉయ్యూరు

‘’

— 



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 418-‘’బాలసరస్వతి ‘’తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసా చార్యులు(1869)

  • గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

418-‘’బాలసరస్వతి ‘’తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసా చార్యులు(1869)

వీరి వంశ మూలపురుషుడు శ్రీశైలపూర్ణులు .ఇందులో బుచ్చి వెంకటాచార్యులకుమారుడే మన బాలసరస్వతి బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు .వీరిది కడప మండలం  లోని బుక్కపట్టణం .సురపుర సంస్థానాధీశుడైన స్వామి నాయకుని (1752-1773)ఆహ్వానం మేరకు అణ్ణయాచార్యుల మూడవ కుమారుడు శ్రీనివాసాచార్యులు బుక్కపట్టణం వదలి సురవరం లోరాజగురువులై  స్థిర నివాసమున్నారు .శ్రీనాథునిలాగా ఈ వంశం లోని కిరీటి వెంకటాచార్యుల సాహితీ జైత్రయాత్ర విలువైనది .

 మన శ్రీనివాసాచార్యులు తండ్రి వద్దనే11వ ఏట  సాహిత్య ,అలంకార గ్రంథాలు గ్రహించారు .సంస్కృత ఆంధ్రాలలో కవనం అల్లటమూ ప్రారంభించారు .16వ ఏట మైసూరుకు వెళ్లి రాజగురు పరకాల స్వామి వద్ద తర్కం నేర్చి, మహారాజు చామరాజు ఒడియార్ ను మెప్పించి ‘’బాలసరస్వతి ‘’బిరుదుపొండాడరు .రాజుగారిచ్చిన ఉపకార వేతనం తో కాశీ వెళ్లి అద్వైత వేదాంతాన్ని స్వామి శాస్త్రిగారి వద్ద ,న్యాయశాస్త్ర క్రోడంను జగాధీశుని కైలాస చంద్ర శిరోమణి భట్టాచార్యులవద్దా ఆపోసనపట్టి ,నవద్వీపానికి వెళ్లి మీమాంసను అధ్యయనం చేసి ,అక్కడి పండితులు 1889లో అందజేసిన ‘’తర్క తీర్ధ ‘’బిరుదు నందుకొన్నాడు .సాహితీ ఉత్తర జైత్రయాత్ర దిగ్విజయంగా ముగించుకొని ,స్వరాస్ట్రానికి బయల్దేరి మార్గ మద్యం లో ఉత్తరాది సంస్థానాలు దర్భంగా ,జోధ్పూర్ ,బుందీ దత్తియా ,గ్వాలియర్ ,కోటా౦ జరీ ,ఇందూర్ ,దారానగరం ,జమ్మూ-కాశ్మీర్ లను  ,దర్శించి అక్కడిపండితులను వాదం లో జయించి ,వారు నతమస్తా కులై అభినందించగా ,ఆరాజులు విశేష గౌరవం తో సత్కరించిపంపగా స్వరాష్ట్రం చేరారు .

 గంటకు వంద శ్లోకాలు అవలీలగా  చెప్పగల నేర్పు మన శ్రీనివాసాచార్యులది .అందుకే వారికి ‘’ఘంటా శతశ్లోక కవి ‘’అనే బిరుదు సార్ధకమైనది .ఆంద్ర దేశం లో బళ్ళారి ,కడప ,పెనుగొండ తాడిపత్రి ,మద్రాసు ,బనగానపల్లి ,మొదలైన చోట్ల అవదానాలు చేసి పండిత శాస్త్రవేత్తల మెప్పు పొందారు .కీర్తి,కనకాలు ఆయన వె౦టపడ్డాయి .తర్వాత దేశమంతా సాహిత్య జైత్రయాత్ర దిగ్విజయంగా ముగించి అరుదైన సన్మానాలు అందుకొని చివరికి తన జన్మస్థలమైన  ఆత్మకూరులో సంస్థానాధీశుల ప్రధాన విద్వాంసులుగా స్థిరపడ్డారు.రాజు అనేక అగ్రహారాలు వారికి ఈనాముగా అందించి గౌరవించాడు .తాను సత్కారాలు అందుకోవటమే కాదు ,స్వయంగా ‘’బ్రహ్మామృత వర్షిణి’’అనే సంస్థ నేర్పాటు చేసి ,ప్రతిఏడాది ఘనంగా వేద సభలు నిర్వహించి  వేద, శాస్త్ర పండితులను సత్కరించారు .ఈ ఆస్థానానికి వచ్చిన తిరుపతి వేంకటకవులు శ్రీనివాసాచార్యులవారి చేతిలోశాస్త్ర  వాదం లో ఓడిపోయారు  .ఈ విషయాలు బాలసరస్వతిగారి మనవడు శ్రీమాన్ తార్కిక సిమ్హాచార్యులు ,తిరుపతి కవులకు గద్వాలలో ఆతిధ్యమిచ్చిన మహా పండితుడు గుండేరావు హర్కార్ తెలియజేశారని బిరుదురాజువారు రాశారు .

  ఆచార్యులవారి ముద్రితాముద్రితగ్ర౦థాలు చాలాఉన్నాయి .ఇందులో నంజరాజ చంపూః,దుర్మద నిర్మధనం ,జాంబవతీ పరిణయం ,తత్వ మార్తాండ ప్రభామండలం ,రాజశేఖర చరితం ,సురపుర వెంకట గురు చరితం ,శత ఘంటావధానం ,శ్రీనివాస విలాసః ,వీరశైవ శిరస్తాడనం ,దుర్విగ్రహ నిగ్రహ౦ ,కిరీటి వేంకటాచార్య విజయ వైజయంతి ,రాజవంశరత్నావళీ,లక్ష్మీ సరస్వతీ దండకం ,విష్ణుస్తుతి వ్యాఖ్యా ,రహస్య త్రయ సారార్ధః ,గంగాస్తుతిః,ఆంగ్లేయ ,జర్మనీ యుద్ధ వివరణం,ప్రపత్తి పదవీ , హయగ్రీవ పంచాశత్ నరకేసరి స్తుతిః ,దశావతార స్తోత్రం ,విజయ దశమీ నిర్ణయః అనే 22ఉద్గ్రందాలున్నాయి .

 ఇందులో శతఘంటావధానం లో కడప పోద్దుటూరు బళ్ళారి  మద్రాస్ లలో ఆచార్యులవారు చేసిన అవధాన శ్లోకాలున్నాయి .దీన్ని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు పండిత డి.గోపాలాచార్యులు ప్రచురించారు .దీనిలో ఏడవ ఎడ్వర్డ్  రాజు పట్టాభిషేక సమయం లో చెప్పిన 23శ్లోకాలు ,శివునిపై స్తోత్రం చెప్పమని కోరితే చెప్పిన ‘’భవానీ సంగమేశ్వర స్తుతి ‘’ వివిధ ప్రాకృత భాషలలో ఆశువుగా చెప్పిన శ్లోకాలు కూడా ఉన్నాయి .హయగ్రీవ పంచాశత్ ,నరకేసరి స్తుతి కూడా ప్రాకృతం లో చెప్పినవే.

సంగమేశ్వర స్తుతిలోని  మూడు శ్లోకాలు –

‘’స్రవ౦తీమాభ్యాం వలయిత నిశాంతం కిమపిత –త్ప్రశాంతంజ్యోతిర్నఃప్రథయతు శశాన్కార్ధ మకుటం ‘’

‘’నిదానం లోకానాం నిరవధి చిదానంద హరీం –దధానం భక్తానాం శమధన హృదానందనచణం’’

‘’సురాసుర శిరస్తటీ మకుట చుంబి పాదాంబుజం –చరాచర కుటుంబినం,శమధ నాశయా లంబనం

ధరాధర కుమారికా ,స్మరవిలాస లోలాశయం –జనాస్తుహిన భాస్వరం ,భజత సంగమాధీశ్వరం ‘’ఆరాళచలకున్తలం పరమరాళయనా౦ చితం – ప్రవాళ మృదులాధర౦ ,సితకరాధికాస్య ప్రభం

స్మరామి పురవైరిణః కమపి నిత్య నేత్రోత్సవం ‘’.

ఆచార్యులవారి రచనలలో ;;కిరీటి వేంకటాచార్య వైజయన్తినాటకం  ‘’అముద్రితం అన్నారు రాజుగారు .దీనిప్రతి తమవద్ద ఉందని ఇది 8అ౦కాలనాటకమని చెప్పారు .ఇందులో మూడవ అణ్ణ  యాచార్యుల కుమారుడు కిరీటి వెంకటాచార్యుల సాహిత్య జీవితం ఉన్నది .ఈయన సురపుర సంస్థానాదీశుడు వెంకటప్పయ్యనాయకుని రాజగురువైన ఆస్థానకవి .

నా౦దీ శ్లోకం –‘’-

‘’కారుణ్యేన  కిరీటినే ప్రవితరన్నధ్యాత్మ విద్యామృతం-ద్వారానేనవిరొధినోవిదళయన్  శాస్త్రేషుసాదధీయసా

తస్యై తస్య యశ శ్శశాంక  ధవళం తన్వన్ధరామండలే-శ్రీమాన్ శ్రీనిధి రచ్యుతః ప్రదిశతుశ్రేయాంసి భూయంసినః  ‘’

8వ చివరి అంకం లో తిరుమల తిరుపతి ధర్మాధికారి మహంతు హాథీరాం బాబా  వేంకటాచార్య గురువు పిత్రువ్యులు అయిన శ్రీనివాస దేశికుల మహత్వం తెలుసుకొని ఆచార్యులవారిని స్వయంగా సత్కరించటం తో నాటకం పూర్తి .భరతవాక్యం –

‘’నిర్దోష నిత్య మధురాణి నిరామయాని –శాస్త్రాణి నిత్య శుభగాని జయంతు లోకే

నిత్యాద్రుతా నృపతి భి స్సదృశా౦  సభాశ్చ-వాక్సౌరభీ చ సుభగా సతతం కవీనాం ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 417-భద్రగిరి చంపు కర్త –భారద్వాజ రామా చార్య (17-18శతాబ్ది )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

417-భద్రగిరి చంపు కర్త –భారద్వాజ రామా చార్య (17-18శతాబ్ది )

భద్రాచల క్షేత్రమహిమను, అక్కడ జరిగే చైత్రోత్సవాన్నీ విపులంగా ‘’భద్రగిరి చంపు ‘’కావ్యం లో  వర్ణించిన కవి భారద్వాజ రామాచార్య ..ఇతని ఇంటిపేరు ఊరు కాలమూ తెలియదు .కాని బిరుదురాజు వారు ఈ కవి 17-18శతాబ్దుల కాలం వాడై ఉంటాడని ,పాల్వంచ జమీన్ దారులైన ఆశ్వారావుల ఆస్థానం లో ఉండి ఉంటాడని ఊహించారు .కావ్యం లో తండ్రి తాతలగురించి తనగురించి చెప్పుకొన్నాడు –

‘’భారద్వాజస కులార్ణవామృతకర శ్రీరామ వర్యస్య యః-పౌత్రో వెంకట దేశికస్య మహాతః పుత్రస్య తే నాదరాత్

రామాఖ్యేన మనీషిణావిరచితే చంపూ ప్రబంథే మహాన్ – భద్రాదీశ మహోత్సవా మృతయుతే భాగో ద్వితీయో భవత్ ‘’.కావ్యం లో మొదటిభాగానికి ‘’ధ్వజారోహణం ‘’అని పేరు పెట్టాడు . రెండవ భాగానికి ఏ పేరు పెట్టాడో ఆభాగం శిధిలం అవటం వలన తెలియలేదు .ప్రారంభ శ్లోకం –‘’శ్రీమద్భద్ర  నగాధిరాజ విలసత్సౌధాగ్ర భాగోజ్వల –జ్జ్వాలాభీల మవక్ర విక్రమ మహం చక్రేశ్వరం నశ్వరం

ఛేత్తుం బంధ మలి౦ధనాగ్ని శమదం,దుర్వార గర్వాధిక –క్రవ్యద క్షరితా క్షతక్షత రుహైస్స్యః ప్రశస్యం స్తువే ‘’.మొదటిభాగం లో భద్రాచల మహాత్మ్యం అక్కడి ఉత్సవాలు వర్ణించబడ్డాయి .రెండవభాగంలో మర్నాడు అక్కడ జరిగే తిరునాళ్ళు వీధులు యాత్రికులు వగైరాలున్నాయి .కావ్యం లో’’ వీథీ’’ లక్షణాలు కూడా జోడించాడు  .పద్మాక్షుడు అనేవాడు ప్రియురాలు  బిబ్బోకవతికి వివరించి చెబుతాడు . ఈ రెండు పాత్రలగురించిన శ్లోకం –

‘’చైత్రోత్సవం దాశరధేర్విలోకితం –భద్రాద్రి నామ్నస్తరుణీ సమాగతౌ

పద్మాక్ష బిబ్బోకవతీ సమాఖ్యయా –ప్రఖ్యాం గతౌ కౌచన రంగ వాసినో ‘’

ఈ చంపు కాకతీయ కాలం నాటి’’ క్రీడాభిరామం ‘’ను గుర్తుకు తెస్తుంది .ఆలయ గోపురం దూరానికి ఎలాకనపడిందో చూడండి –

‘’కనక కలశరాజ శ్రీ పరీక్షాంవిధాతుం-విపులగగన శాణోల్లేఖనే నోన్న తేభ్యః

సతత తరతి సహానాం సాదు పారావతానాం –విహరణ శరణేభ్యో నమోస్తు ‘’

గోదావరి నది వర్ణన –

‘’పులిన జఘన రమ్యా చక్రవాక స్తనీయం-తరళతర తరంగ ప్రోచ్చలసన్మమధ్య రేఖా

సరిదిహ చపలాక్షీ స్వచ్ఛ డిండీర హాసా –విహగకుల  నినారైర్నౌ శుభం పృచ్ఛతీవ ‘’

భద్రగిరి వర్ణన –

‘’శ్రీ భద్ర శైలం సుకృతైకమూలం –భజేను వేలం ,జలదౌఘనీలం

శ్రేయో విశాలం విలసద్రసాలం –శ్రితానుకూలం శ్రిత దేవజాలం ‘’

శ్రీరామభద్ర వర్ణన –

‘’నమోస్త్వసుర వైరిణీ,జనక భూ మనో హారిణే-హృద౦తర విహారిణే,మతిమతాంసుధా హారిణే  శ్రితావన చారిణే ,శ్రుతి వనాంత సంచారిణే-సదా సుకృత కారిణే,దశరధాత్మజా కారిణే’’.

కల్యాణం ముందు అమ్మవారి, అయ్యవారి వర్ణన –

‘’కలశ జలధి కన్యాం,సర్వ లోకైక మాన్యాం-జనకయజన జన్యాం,వాంచఛితానాం వదాన్యం

హృతనతజనదైన్యాం,రాఘవే౦దోరనన్యా-మలమకురుత ధన్యా ,మాళివర్గౌఘ శూన్యాం’’

‘’కాంచీ గుణేన కలకి౦కిణి కేన సింధు –కాంచీనుతా కటి తటీ గ్రధితా కయాచిత్

పంచాస్త్ర కార్ముకగుణ ప్రవరేణ రామ –పంచాననన్య విజయోద్యమ శాలి నేవ ‘’

కళ్యాణ ఘట్టం లో పాల్వంచ జమీన్ దారులైన అశ్వారావు లవర్ణన ఉండటంతో ఈకవి ,వారి ఆస్థానకవి అయి ఉండాలి అని రాజుగారి నిర్ణయం –

‘’ఆశ్వినోజ్వలో హ్యశ్వరాయ ప్రభు –శ్శాశ్వతీ౦ సంపదం విశ్వతః పృస్టతః

ఆశ్వ వాప్తుం తదా విశ్వసన్ భూ సుతా –ధీశ్వరం చామరం శాశ్వదా దూనతే’’

తల౦బ్రాలఘట్టాన్నీ కమనీయంగా వర్ణించాడు –

‘’సువర్ణ శోభనాక్షతా ని మౌ నఖేల మక్షతాం-కరా౦బుజ ద్వయేన తౌ సదా శ్రితా వన్నోన్నతౌ

వధూ వరౌ  ప్రవర్షత స్తదా ముదా నమర్షతః –పరస్పరస్య మూర్ధని ప్రసూన గంధ వర్దినీ ‘’

‘’ముక్తా విదేహ తనయా౦జలి శుక్తి కాంత –ర్ముక్తా రఘు క్షితి వర్స్య తదుత్తమా౦గే

నక్తా సమస్త తనుషు ప్రబభుర్వికాసో –ద్యుక్తాఃప్రసూన నికరా ఇవ పారిజాతే’’

మనం చెప్పుకొనే ‘’జానక్యాః కమలాంజలి పుటే ‘’శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది .రధోత్సవ వర్ణన లో వివిధ ఛందస్సులను పపేర్కొంటాడుకవి –

‘’సోయం రాఘవ నందనో ఖిలజనా నాన౦దయన్ స్యన్దనే –భక్తైర్భాగవతతైర్నిషేవితతనుః క్ష్మాజానుజాభ్యాం యుతః

ఆస్తే నిస్తుల నూత్నరత్న రుచిర శ్రీమాలికా౦ డోలికాం-యశ్చక్రే సమరే పురాసుర మృగాన్ శార్దూల విక్రీడితం ‘’

‘’అనుపమ మణి భూషణా౦చితా భా –న్మనుకుల నాథ వధూ రధోపరిస్దా

దనుజ రిపుసుతా ను తాప కృఛ్ర-స్తనుతర కల్ప లతేవ పుష్పితాగ్రా  ‘’

ఇంతటి చక్కని కావ్యాన్ని,అందులోని కమ్మని శ్లోకాలను , భద్రాద్రి సీతారామకల్యాణం ప్రత్యక్ష ప్రసారం లోనిలయ విద్వాంసులైన  ఏ విశ్లేషక కవి అయినా భద్రాద్రి రామాచార్యకవి శ్లోకాలను ఉదహరిస్తున్నారోలేదో !రామరాజుగారు శ్రమపడి వెలికి తీయకపోతే ఈ కవీ, కావ్యమూ కాలగర్భం లో కలిసి పోవటం జరిగేది .

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 416-పార్వతీ పరిణయ చంపూ కావ్యకర్త –చంద్ర భట్ట ఈశ్వరప్ప (16వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

416-పార్వతీ పరిణయ చంపూ కావ్యకర్త –చంద్ర భట్ట ఈశ్వరప్ప (16వ శతాబ్దం )

16వ శతాబ్దికి చెందినాచంద్రభట్ట ఈశ్వరప్ప ‘’పార్వతీపరిణయం ‘’అనే చంపూకావ్యం రాశాడు .దీని వ్రాయసకాడు కూడా చంద్ర భట్ట వంశం వాడే .గురు స్తుతి –

‘’సదా శివగురుం భజే సకల ధీర నిత్యస్తుతం –ద్విజాధిపతి సేవితం వివిధ వేద వక్త్రా౦ బుజం

స్పుట స్పటిక మాలికా స్పురిత కంబుకంఠంసదా –శ్రిత ప్రకార వాంఛిత ప్రబల దివ్య వస్తు ప్రదర్శితం ‘’

తర్వాత వంశ చరిత్ర చెప్పాడు .కథలో హిమవంతుడు మేనకను పెళ్ళాడటం ,మైనాక ,పార్వతీ జననాలు ,నారదుడు రావటం ,శివుని గుణగణాలు పార్వతి విని పరవశం చెందటం శివుడి తపస్సు ,శివుని సేవకు పార్వతి వెళ్ళటం ,దేవతలు తారకాసురునిఆగడాలుఇంద్రునికి  వివరించటం ,అతడు మన్మధ సాయంకోరటం,అంగీకరించి శివునిమనసును పార్వతిపై లగ్నం చేయటానికి వెళ్ళటం ,ముక్కంటికంటిమంటకు మాడి మసి అవటం ,రతీ విలాపం ,శివుని అనుగ్రహం పార్వతి తపస్సు ,చివరికి  పార్వతీ పరమేశ్వరుల వివాహం .

ఈశ్వరప్ప కాళిదాసమహాకవిరాసిన కుమారసంభవం ప్రేరణతో దీన్ని రాశాడు .కొన్ని చోట్ల వ్యాకరణ విరుద్ధాలు ,యతి భంగాలున్నాయి .ఇవి వ్రాయసకాని దోషాలు కూడాకావచ్చు అంటారు ఆచర్యశ్రీ .పార్వతీ దేవి పాదాల వర్ణన –

‘’రాత్రౌ సుధాంశు రిపు రేత్యవిజ్రు౦భణ౦ మే- హన్తీతిపర్వత సుతాంప్రతి సాదు జప్త్వా

పద్మ౦ తదీయ చరణావతర౦ ప్రపద్య –తత్సంజ్ఞయా విజయతే కిము నిత్య భ్రుంగం ‘’

మాయావటువు వేషం లో వచ్చిన శివుడు  పార్వతి మనసు శివునిపైనుండి మరల్చే యత్నం –‘’జానామి జానామి తవానుభావం –జాగర్తి జాగర్తి తదస్టమూర్తౌ-భావంతదాపి ప్రచురాన్ గుణా౦ స్తాం-తత్సాన్ని విస్టాన్వికృతాన్ ప్రపద్యే ‘’.-కాలకూటాశనోవాయు భుగ్భూషణః-క్రూర శుండాల చర్మా౦శుకో యాచకః –ప్రేతకా౦తార  సంచారణే తత్పరః –కిం వృతస్సత్వయా భీకర శ్చే స్టయా ‘’

పెళ్లి కొడుకైన శివుని వర్ణన –

‘’జటాజూట శ్శంభో స్సపది హరితోష్ణీష వసనం –సుధాంశు స్తత్రతః ప్రభవతి మహా భాషికమపి

గలాలంబా ముక్తావళి శ్శిరురగరాజస్స మణిః-కరాద్దిస్సాసర్పాఃకటక ముఖ భూషామహితః  ‘’

చివరగా పార్వతీ  పరమేశ్వర రహః కేళి వర్ణ న –

‘’ కళ్యాణ ప్రదస్తయోస్త్రిజగతా మాస్వాదితా మూల్యత –త్తాంబూలాది పదార్ధయోః కృత బహిర్జాతవ్య వాయాస్ధయోః

పర్యాయాత్కుసుమేషు వస్య మనసో రంతర్వ్యయా స్ధయో –రాచ్ఛి  న్నాత్మ మదృశ్యత త్రిభువనం మోదం ప్రపేదే తదా ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

 

 

 

 

 



Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 415-హనుమద్రామాయణ కావ్యకర్త –దిట్టకవి లక్ష్మణ కవి (16వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

415-హనుమద్రామాయణ కావ్యకర్త –దిట్టకవి లక్ష్మణ కవి (16వ శతాబ్దం )

ఏక సర్గ హనుమద్రామాయణ కావ్యం రాసిన దిట్టకవి లక్ష్మణ 16వ శతాబ్దికవి .18వ శతాబ్దికి చెందిన ఇంకొక దిట్టకవి ఇంటిపేరున్న నారాయణకవి తెలుగులో రంగరాయ చరిత్ర రాశాడు .వీరిద్దరికీ బంధుత్వం ఉందొ లేదో తెలీదు .వీరికి దిట్టకవి అనేది ఇంటిపేరు లేక బిరుదుకూడా కావచ్చు .మనలక్ష్మణకవి  తన ఇంటి పేరును ‘’మండల వేముల ‘’అని కూడా తెలిపాడు .తండ్రికాలం లో ఉన్న ఇంటిపేరు ‘’మండలవేముల’’ ,కొడుకుకాలం లో కవిత్వం లోసాధించిన దిట్టతనం వల్ల’’ దిట్టకవి’’గా మారి ఉండచ్చు .కౌండిన్య గోత్రం .నియోగి బ్రాహ్మణుడు .

  దిట్టకవి లక్ష్మణకవి ‘’హనుమద్రామాయణం ‘’ను వ్యాఖ్యాన సమేతంగా రాశాడు .కవి తనగురించి వచనం లో –‘’ఇహ ఖలు సంస్కృతాంధ్ర భాషాకవన చాతుర్య దుర్యో దిట్టకవి లక్ష్మణార్యః ‘’’’కావ్యం యశసే ర్దకృతే—‘’అని మాత్రం ఉన్నది .కావ్యం చివర రెండు శ్లోకాలలో మళ్ళీ చెప్పుకొన్నాడు –

1-‘’శ్రీమద్రామ వరప్రసాద కలనా సంప్రాప్త సారస్వత –శ్రీ మద్దిట్ట కవీంద్ర లక్ష్మణ సుధీ వరేణ్య సంపూరితే

షట్కా౦డేరిత ,యావదర్ధ కలితే సంక్షిప్త రామాయణే-శ్రోతృశ్రోత్ర సుఖావహే సర్గో ద్వితీయ సర్గః ‘’

2-మండల వేముల కులజః కౌ౦డిన్యస గోత్ర కృష్ణ కవిపుత్రః –లక్ష్మణ సుకవిః కృతవాన్ సర్గే ణై  కేన రఘుపతేశ్చరితం ‘’

అనేక పరిశోధనల అనంతరం రామరాజుగారు దిట్టకవి లక్ష్మణ కాలం 16వ శతాబ్దం అని తేల్చి చెప్పారు .

ఆరుకాడల వాల్మీకి రామాయణాన్ని ఈ కవి ఒకే కాండలో 118శ్లోకాలో ఇమిడ్చాడు .ప్రారంభ శ్లోకాల సౌరు  చూద్దాం –

‘’వరదం భజామి శరదంబుద ప్రభం ,ద్విరదం ముఖే శుభరదం తనౌ నరం –గణనాథ మాత్మ గణనా పరేస్టదం శశి ఖండ మండిత శిఖండ మీశ్వరం ‘’

‘’ప్రమితాక్షరోక్తి మమితా సురా౦తకం ,స్మిత భూషణం ,వితత భాను తేజసం –

కలయామి చాపవలయాన్వితం ముదాశర ధారిణం దశరథాత్మజం భజే ‘’

మొదటిశ్లోకానికి విస్తృత వ్యాఖ్య రాశాడు కవి .మిగిలినవాటికి సంక్షిప్తంగా రాశాడు .కవి శైలీ విన్యాసానికి కొన్ని ఉదాహరణ శ్లోకాలు –

‘’దశ కన్ధరేణభ్రుశ కంపితైస్సురైరభి యాచితోధిక భియా సమన్వితైః

మిహిరాన్వయే జనిహి రామనామతః కమలాపతిస్స విమలాంబు జేక్షణః  ‘’

‘’నవనావనాయ పవనాస్త్ర మోజసా దధతా సుబాహురధ తటకాసుతః

జ్వలనాశుగం చ బలనాశనేన తౌ కృశతాం గతౌ దశ శతాంగసూనునా ‘’

వర్ష ,శరత్తులను ఒకే శ్లోకం లో వర్ణించి తనకవితా ప్రతిభ చాటుకొని ‘’ దిట్టమైన కవి ‘’అనిపించాడు –

‘’సతతా నవగ్రహతటాభ్రమ౦డలా భ్రుత  నీలకంఠ కృత నృత్తకా జగత్

స్వకులాయ యుక్ఖగ కులాధవార్షుకీ సమయాత్ ప్రదోష సమయో యధోర్గతిః’’

మరో శ్లోకం లో ‘’ఆగ్రహ ‘’శబ్దాన్ని తెలుగులో ప్రచారంగా ఉన్న కోపం అనే అర్ధం తో ప్రయోగించాడు .’’వ్యాఖ్యాన౦ లోకూడా ‘’తెలుగు సంస్కృతం ‘’తొంగి చూస్తూ కనిపిస్తుందని వ్యాఖ్యానించారు రాజుగారు .

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 414-సీతా విజయ చంపు కర్త –పరశురామపంతుల అనంత రామ పండితుడు (19వ శతాబ్దం )

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

414-సీతా విజయ చంపు కర్త –పరశురామపంతుల అనంత రామ పండితుడు (19వ శతాబ్దం )

19వ శతాబ్ది మధ్యకాలంవాడు పరశురామ పంతుల లింగమూర్తిగారికి అయిదవతరం వాడు సీతావిజయ చంపూ కావ్యకర్త పరశురామపంతుల అనంతమూర్తి పండితుడు .తండ్రి రామకృష్ణ సోమయాజులు .తల్లి వేణా౦బిక .ఈ అముద్రిత కావ్యం కాకినాడ ఆంద్ర సాహిత్యపరిషత్ కార్యాలయం ఉందని బిరుదురాజువారన్నారు .మూడు స్తబకాలు మాత్రమే లభ్యం కనుక అసమగ్రం .ప్రధమ స్తబకం చివర –‘’ఇతి శ్రీమత్సమస్త భువన ప్రసిద్ధ మేధ్యతర ,భరద్వాజస గోత్రా భరణాయ ,మాన పరశురామాన్వయ దుగ్దాబ్ది సుధా దీదితినా  ,శ్రీ లక్ష్మీ నారాయణ పాదారవింద మరందా స్వాదానంద తున్దిరే౦దిరాయ మాన నిజస్వాంతేన శ్రీరామకృష్ణ సోమయాజి కుటుంబినీ వేణా౦బికా శుక్తి ముక్తా ఫలాయితేన,అన౦తరామ పండితేన ,ప్రణీతే శ్రీ సీతా విజయాభిదాన  చంబూ  ప్రబంథే ప్రధమ స్తబక సమాప్తః’’.చంపూ ‘’ను ‘’చంబూ ‘’అని కూడా కవులు వాడారని తెలుస్తోంది .పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు జైమిని భారతం లో ఈపదాన్ని ప్రాస స్థానం లో వాడినట్లు రాజుగారు చెప్పారు .

   సీతావిజయం అంటే ‘’శత కంఠ రామాయణం ‘’.ఈపేర్లతో యక్షగానాలు చాలావచ్చాయి  .దీనికి ఆధారం ‘’వాసిష్ట రామాయణం ‘’అని ఆచార్య ఎస్వి జోగారావు గారు చెప్పారట .శతకంఠ రామాయణాల  గురించి శ్రీ సాళ్వ కృష్ణమూర్తి విపులంగా రాశారట.

 శ్రీరామ చంద్ర స్తోత్రంతో ప్రారంభించాడు కవి కావ్యాన్ని –

‘’శ్రీరామం సుర రాణ్ముఖామరవరై రారాధితాంఘ్రిద్వయం –రాకారాజ ముఖం ,సరోజ నయనం ,రాజాధిరాజం ముదా

శూరం శూర కులా౦బు  రాశి శశినం ,దైత్యాంధకారారుణం-ధీరం ,విరమరం  స్మరామి సుఖదం స్వాంతే ససీతం సదా ‘’.

తర్వాత దేవతా ,గురు స్తుతి ఉంది .ఇందులో వచ్చిన ‘’అంబాల ‘’గ్రామం వరంగల్ దగ్గరు౦దన్నారు రాజుగారు .ఇది కాకతి రుద్రా౦బ పేర నిర్మితం .అంబాల శ్రీ రామునికి అంకితంగా ఉద్దిమర్రి పాపయ్యకవి ‘’రాఘవాస్టకం’’రాశాడు .

   ఈ చంపూ కావ్యం లో కథను శంకరుడు పార్వతికి చెప్పాడని సూతుడు మునులకు వివరిస్తాడు .రాముడు అయోధ్యకు వచ్చి పట్టాభి షిక్తుడై రాజ్యపాలన చేయటాన్ని 20శ్లోకాలలో కమ్మగా వర్ణించాడు .అందులో శ్రీరామప్రాభవ శ్లోకం –

ధైర్యే నమ్రీకృతో మేరుర్జాడ్యవాన్ తుహి నాచలః-మందరాద్రి రపి భ్రాంతః కథ౦ సుర్యేనతేసమాః

శతముఖుడికి రక్తబి౦దుడుఅనే పేరుకూడా ఉంది .రెండవ స్తబకం లో 68గద్య, శ్లోకాలున్నాయి .శబ్దాలంకార ముక్తపద గ్రస్తాలతో కావ్యానికి ఇంపు సోంపు తెచ్చి చంపు కు విశేషాదరణ కలిగించాడు .వర్షర్తు వర్ణణ-

‘’నమకిర దసమం దిగంగనానాం-ధృట పటతుల్య పయోముచాం రజస్స్వం

సులలిత నవనీప వృక్షాలేఖా –పురు పటవాన  మివాభిరామ గంధం’’

శబ్దాలంకార మాధుర్య శ్లోకం-

‘’నీల తమాల కదంబ విలీనం ,నీల తమాలక శోభన వక్త్రే-మానవతీమణి వేత్సి నవాముం,మానవ తీర్ధ భవేక్షణ భాంతేన’’

మూడవ స్తబకంలో 67గద్యపద్యాలున్నాయి .ఇదంతా సీతారామ శృంగారానికే పరిమితం .మన్మధసామ్రాజ్య ప్రాభవాన్ని చెప్పే శ్లోకం –

‘’సీత్కారాణి కరాబ్జాత దూననం చాపి యోషితాం-నయమోర్ధనిమేషాస్తు ,మన్మధస్యాస్త్ర తాం యయుః’’

సాధారణంగా సంస్కృత చంపూ కావ్యాలలో ఒక్కో సర్గకు ఒకే రకమైన ఛందస్సు వాడతారు.కాని పరశురామపంతుల  అనతరామ పండిత కవి తెలుగు ప్రబంధాలలో  వాడినట్లు ,ఈ సంస్కృత చంపూ కావ్యం లో ప్రతి స్తబకం లోనూ వివిధ ఛందస్సులువాడి, తెలుగు వాడి ముద్రవేశాడని రామరాజుగారువాచ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-5-19-ఉయ్యూరు

— 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 413-హరి భక్తి సుదోదయ వ్యాఖ్య కర్త –సారంగు తమ్మయ (1580)

గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4

413-హరి భక్తి సుదోదయ వ్యాఖ్య కర్త –సారంగు తమ్మయ (1580)

తెలుగులో ‘’వైజయంతీ విలాసం ‘’కావ్యం రాసిన సారంగు తమ్మయ విశిస్టాద్వైత మతస్తుడు .’’వరిచిత భగవద్భాగావత కైంకర్య విధానుడు ‘’అని పించుకొన్నాడు .సంస్కృతం లో’’ హరి భక్తి సుధోదయ వ్యాఖ్య’’రాశాడు .దీనికే’’ భక్తిసంజీవని ‘’పేరున్నది .20 అధ్యాయాల గ్రంథం.

’’ఇతి సారంగ తమ్మప్రభునా విరచితాయాం హరిభక్తి సుదోదయ టీకాయాం భక్తి సంజీవనీ వ్యాఖ్యాయాంప్రథమోధ్యాయః ‘’అని చెప్ప్పుకొన్నాడు .వైజయంతీ విలాసం తర్వాతే దీన్ని రాశాడు .ఇలవేల్పు శ్రీరామ చంద్రునికి విలాసం అంకితం చేశాడు .సంజీవనిలోనూ ఆయనను ఇలాస్మరించాడు –

‘’శ్రీరామచంద్ర స్స తనోతు లక్ష్మీం  -శ్రీ లక్ష్మణాలంకృత  దివ్య మోర్తిః

యద్దర్శనాద్దుఃఖ మపాన్య సర్వం –సద్యః పరానంద ముపైతి లోకః ‘’

తర్వాత రెండు శ్లోకాలలో తనగురించి రచనగూర్చి చెప్పాడు –

యస్యౌదార్య మివాకలయ్య సతతం కుర్వన్తి వాసం దివి –స్వర్ధే ను ప్రముఖా వదాన్య మణయో ప్యద్యోపి నేహాగతా

శ్శ్లాఘ్య సాధు గుణాన్వితో బుధజనై ర్భాగీరథీ పట్టణే-సోయం మంత్రి దురంధరో  విజయతే సారంగు తమ్మప్రభో ‘’.

‘’తేనేయం క్రియతే టీకా హరిభక్తి సుధోదయే –భక్తీ సంజీవనీ నామ్నా విద్వాత్సంతోష కారిణీ’’

వీటిలో తమ్మయ మంత్రి దురంధరుడని ,  ప్రభువు అనీ తెలుస్తోంది .పట్టణం లోని పెద్దకరణాన్ని అలాపిలుస్తారనీ మన ‘’మేయర్’’లాంటి పదవి అనీ ఆచార్య బిరుదురాజు రామరాజుగారన్నారు .తమ్మయ గోల్కొండ పట్టణానికిపెద్దకరణం .అంటే మేయర్ లాంటివాడు

  తమ్మయ -కులీ కుతుబ్ షా కాలం 1580-1612 వాడు .భాగీరధీపట్టణం భాగ్యనగరమే  అయి ఉండచ్చు నని వారి ఊహ .కవి తన తండ్రి తాతలగూర్చి చెప్పుకోలేదు .సుల్తానుతో బాగా చనువు ఉన్నట్లు ఆయన ఈయనను ‘’రమ్ము ,పొమ్ము’’అని చనువుగా అనే వాడని తెలుస్తోంది ..ప్రజలు కవి వైభవానికి ‘’జయ జయ ధ్వానాలు చేసేవారు  .తెలుగువారికి సారంగు తమ్మయ అంటే తెలుగులో  వైజయంతీ విలాస కర్త అని మాత్రమే తెలుసు .సంస్కృత రచన చేశాడని రాజు గారు చరిత్ర ముసుగు తీసి చూపేదాక తెలియదు .

ఆధారం –ఆచార్య బిరుదురాజు రాజుగారి ‘’చరిత్రకెక్కని  చరితార్ధులు ‘’

సశేషం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో29-5-19 బుధవారం హనుమజ్జయంతి నాడు సాయంత్రం కాలనీ మహిళామండలి చే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,అందులో ఒకరికి సత్కారం ,,,స్వామికి 30 వేలరూపాయలు నగదును తమ కుటుంబం తరఫున సమర్పించిన శ్రీమతి కొండేటి వెంకటేశ్శ్వరమ్మ(22ఏళ్ళక్రితం మేడూరు హైస్కూల్ హెడ్మాస్టర్ గా ఉన్నప్పటి శిష్యురాలు ) గారికి అభిమానంగా చీర ,సారె సరసభారతి తరఫున అంద జేసినచిత్రాలు

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో29-5-19 బుధవారం హనుమజ్జయంతి నాడు సాయంత్రం కాలనీ మహిళామండలి చే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,అందులో ఒకరికి సత్కారం ,,,స్వామికి 30 వేలరూపాయలు నగదును తమ కుటుంబం తరఫున సమర్పించిన శ్రీమతి కొండేటి  వెంకటేశ్శ్వరమ్మ(22ఏళ్ళక్రితం మేడూరు హైస్కూల్ హెడ్మాస్టర్ గా ఉన్నప్పటి  శిష్యురాలు ) గారికి అభిమానంగా  చీర ,సారె సరసభారతి తరఫున అంద  జేసినచిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి 29-5-19బుధవారం ఉదయం స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి 29-5-19బుధవారం ఉదయం స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో 29-5-19హనుమజ్జయంతి నాడు ఉదయం తమలపాకులతో విశేష పూజ

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో 29-5-19హనుమజ్జయంతి నాడు ఉదయం తమలపాకులతో విశేష పూజ

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ఉయ్యూరుశ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా 28-5-19 మంగళవారం సాయంత్రం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్యగారిచే ”హనుమ గానమహిమ ”ప్రసంగం ,శ్రీమతి టేకుమళ్ళ చిద0బరీ ,శ్యామలాదేవి విజయ ,ఐ స్పెషలిస్ట్ డా జయశ్రీగారి అబ్బాయి అక్కకూతురు లచే ”భక్తి సంగీత విభావరి ” చి కూచిభొట్ల పవన్ కుమార్ చే వేద పఠనం ,అందరికి ఉచితరీతిన సత్కారం చిత్రాలు

ఉయ్యూరుశ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా 28-5-19 మంగళవారం సాయంత్రం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్యగారిచే ”హనుమ గానమహిమ ”ప్రసంగం ,శ్రీమతి టేకుమళ్ళ చిద0బరీ ,శ్యామలాదేవి విజయ ,ఐ స్పెషలిస్ట్ డా జయశ్రీగారి అబ్బాయి అక్కకూతురు లచే ”భక్తి సంగీత విభావరి ” చి కూచిభొట్ల పవన్ కుమార్ చే వేద పఠనం ,అందరికి ఉచితరీతిన సత్కారం చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రేపటి కార్యక్రమాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భం గా రెండవరోజు 28-5-18మంగళ వారం ఉదయం 500 చిన్నరసాలు 4 గెలల అరటిపళ్ళతో విశేష పూజ

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భం గా రెండవరోజు 28-5-18మంగళ వారం ఉదయం 500 చిన్నరసాలు 4 గెలల  అరటిపళ్ళతో విశేష పూజ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్బ్హం గా 27-5-19సోమవారం సాయంత్రం డా .వేదాంతం శ్రీధరాచార్యుల ధార్మిక ప్రసంగం ,అనంతరం గుడివాడకు చెందిన 92ఏళ్ళ పౌరాణిక నాటక నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం చిత్రాలు

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్బ్హం గా 27-5-19సోమవారం సాయంత్రం డా .వేదాంతం శ్రీధరాచార్యుల ధార్మిక ప్రసంగం ,అనంతరం గుడివాడకు చెందిన 92ఏళ్ళ పౌరాణిక నాటక నటులు శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం చిత్రాలు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా మొదటిరోజు 27-5-19 సోమవారం ఉదయం స్వామివార్లకు అభిషేకం తర్వాత మల్లెపూలు మొదలైన పుష్పాలతో విశేష అర్చన

ఉయ్యూరు శ్రీ సువర్చాలాంజనేయస్వామి దేవాలయం లో హనుమజ్జయంతి సందర్భంగా మొదటిరోజు 27-5-19 సోమవారం ఉదయం స్వామివార్లకు అభిషేకం తర్వాత మల్లెపూలు మొదలైన పుష్పాలతో విశేష అర్చన

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

22-శివరామ లింగరాజు (చివరిభాగం )

22-శివరామ లింగరాజు (చివరిభాగం )

మూడు ఆశ్వాసాల ‘’శైవాచార సంగ్రహం ‘’రాసిన శివరామలింగరాజు భారద్వాజ గోత్రీకుడైన క్షత్రియకవి .తండ్ర్రి హరిరాజు తల్లిసీతమ్మ  .గురువు గోకర్ణ మటాధిపతి సోమశేఖరుడు ..కాకతి ,చాళుక్య సీమలలో క్షత్రియ వీర శైవులులేరని,తెలంగాణా లేక  రాయలసీమవాడు అయి ఉంటాడని రాజుగారన్నారు .వంశక్రమంలో బర్బర దేశాదీశ్వరుడు శంఖాన్వయుడు మూలపురుషుడు అతడికి అయిదవతర౦ వాడు మనకవి .ఇతనికావ్యం స్కాందపురాణం లోని’’ శంకర సంహిత’’కు ఆంధ్రానువాదం .ధారాశుద్ధిఉన్నకవిత్వ౦ రాశాడు .ఇది చదివితే 18వ శతాబ్దికి కావ్యభాష ఎలా రూపు దాల్చిందో తెలుస్తుందన్నారు బిరుడురాజువారు .కల్హారపుష్పం -కలుహార పుష్పం , -అరహము –అర్హము ,సుదర్శన -సుదరిసేన – ,పిత్రుతోషణము –పితరు తోషణము,శ్రీ రుద్రీయము –శ్రీ రుద్రియము గా మారాయి ‘

 మొదటి ఆశ్వాసం లో  శివుడు కుమారస్వామికి చెప్పినదాన్ని సూతుడు మునులకు చెప్పాడు .ఒక సారి శివలోకం లో కుమారస్వామి అందరి  సమక్షం లో సంశయాలు తీర్చమని అడిగితె శివుడు చెప్పినవిషయాలివి .మొదటి ఆశ్వాసం లో లింగార్చన ,లింగాదారణ వగైరాలున్నాయి. రెండవ ఆశ్వాసం లో  షట్ స్థలాల నిర్ణయం ,స్థలధర్మాలు ,త్ర్రివిధ ఉపాసనలు భక్తిమార్గాలు ,మహేశ్వరుల ప్రవర్తన మొదలైనవి ఉన్నాయి .మూడులో శివయోగులకు  చేసే దానాలు ,గోప్యార్పణం ,తండ్రీకోడుకులైన శ్వేత ,పింగళ కథ,శ్రీశైలమహాత్య్మం,స్వధర్మ నిష్ట వగైరాలున్నాయి .ప్రారంభ కందపద్యం-

‘’శ్రీ పార్వతీ వదూధవ –తాపస హృదయాబ్జ  భ్రుంగ  భగ ధనదార్చిత వి

ద్యోపాయనిలయ నిర్మల –శ్రీపతి చి౦తా౦గ తరంగ శ్రీ గురులింగా ‘’

తర్వాత గ్రంధ ప్రాముఖ్యాన్ని చెప్పాడు .వీరశైవులకు కుల వివక్ష  ఉండదుకనుక వంశ చరిత్ర చెప్పుకోలేదు’’అంగ త్రివిధ విలక్షణ –లింగా౦గికి నొక్క కులము లేదని మదిలో

నంగాభిమాని కేర్పడ-పొ౦గుచు నెరిగింతు తనువు పుట్టిన కులమున్ ‘’

గ్రంథంచివరలో కూడా దాని ప్రాశస్త్యాన్ని మళ్ళీ చెప్పాడు .రచనాకాలం గురించిపద్యం –

‘’చనినట్టి శాలివాహన శాతాబ్దంబులు పాటింప వేయు నూర్నూటిమీద –నిరవదగా నేబదేను ప్రమాదీచ విమల వత్సరము నాశ్వీజమందు

బహుళ తృతీయలో భానువాసరమున రచియి౦చి నట్టి నిర్ణయ చరిత్ర  ‘’అన్నాడు .ఇది 14-10-1733కు సరిపోయిందని రాజుగారువాచ .

కృతి సమర్పణపద్యం –

‘’కరణములు మూటి సాక్షగా-గని విలక్ష భావమున నిష్ట లింగ ౦బు, ప్రాణ లింగ,

భావలింగ౦బులై యున్న బ్రహ్మమునకు –భక్తి  తోడుత కృతి  సమర్పణము చేతు ‘’.

మూడవ ఆశ్వాసం చివరి గద్య రాశాడు .దీని ప్రతి రాసిన విధానం –‘’పరీధావి సంవత్సర ఆశ్వీజ బహుళ దశమి శెనివారం మూడు ఝాములవరకు వీరశైవాచార సంగ్రహం ప్రెతి లో ఉన్న ప్రకారం సున్నపు సోమయ్యకు పాటోజు బైరాగి వ్రాశి ఇచ్చెను .’’ఇది 6-11-1852కు సరిపోతుందని ,వ్రాయసకాని వాక్యాలు గతశతాబ్దం తెలుగు వ్యావహారిక భాషకూ ,లేఖన సంప్రదాయానికి ఉదాహరణ గా ఉన్నాయని ఆచార్య బిరుదురాజు రామరాజు గారు చెప్పారు .

సమాప్తం

ఆధారం-ఆచార్య బిరుదురాజు రామరాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’.

మనవి –‘’చరిత్రకెక్కని చరితార్దు’’లైన 22మంది తెలుగు కవులను ,వారి రచనలను, విశేషాలను రాసే అదృష్టం దక్కిందని ,ఈ వ్యాసాలు  రాజుగారు’’ గోలకొండ  ‘’మొదలైన పత్రికలలో 1960-నుంచి 1971వరకు రాసిన పరిశోధనా వ్యాసాలని ,వీటిని పై శీర్షికతో 1985లో ముద్రించారని ,ఇందులో రెండవవిభాగం లో 12మంది చరిత్రకెక్కని ‘’సంస్కృత కవులు ‘’ఉన్నారని ,వారి గురించి నేను రాసిన’’ గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ ‘’మూడుభాగాలలో చోటు పొందకపోతే వారి గురించికూడా ‘’గీర్వాణకవులు’’లో త్వరలో రాస్తానని మనవి చేస్తున్నాను .ఈ పుస్తకం వచ్చాక అనేకమంది పైకవులపై పరిశోధన చేసి ఉంటారని,  వారు మరిన్ని నూతన విషయాలు ఆవిష్కరించి ఉంటారని భావిస్తున్నాను . సరసభారతి బ్లాగ్ అభిమానులైన సాహితీ బంధువులకు  ఈ కవులను పరిచయం చేయటమే నా ముఖ్యోద్దేశం .

  ఈ ధారావాహికను చక్కగా  చదువుతూ , తెలియని విషయాలు తెలియజేస్తూ నన్ను ప్రోత్సహించిన డా .శ్రీ టి.శ్రీరంగ స్వామి (వరంగల్ ),డా శ్రీ ఉప్పలధడియం వెంకటేశ్వర (చెన్నై )గార్లకు ,అభిమానించిన సాహితీ బంధువులకు ధన్యవాదాలు .

  మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

-21 కుందావఝల గోపాలసూరి

21-కుందావఝల గోపాలసూరి

కరీం నగర్ జిల్లా ములకనూరుకి చెందిన కుందావఝల గోపాలసూరి ‘’సంవరణ చరిత్రము ‘’రాశాడు .సుమారు 1850కాలం .బ్రహ్మ వైవర్తపురాణ౦ లోని ‘’శ్రీక్రష్ణజన్మఖండం ‘’కావ్యం కూడారాశాడు కాని  అముద్రితం  .ములకనూరు హనుమకొండకు దగ్గర .అక్కడ మోతుకూరివారి౦టశ్రీక్రష్ణజన్మఖండం కావ్యాన్ని తానూ చూశానని బిరుదురాజువారువాచ .గోపాలసూరి పండరినాధుడు అనేకవికి సమకాలికుడు .

సంవరణ చరిత్ర అంటే తపతీ –సంవరుణుల ‘’కథ .అద్దంకి గంగాధరకవి ‘’తపతీ సంవరణఉపాఖ్యానం ‘’ప్రబంధవిధానం లో రాశాడు .రాజుగారివద్ద 233పద్యాల  ప్రధమ ఆశ్వాసం మాత్రమె ఉందట .కవి కౌండిన్య గోత్రీకుడు   .తాత నాగశాస్త్రి .తండ్రి వెంకటశాస్త్రి .పెద్ద ప్రబంధంగా రచించే ప్రణాళిక తో ఉన్నట్లు కనిపిస్తుంది .ఇష్టదేవతాస్తుతి ,పూర్వకవి స్తుతి కుకవినింద ,శ్రీ వెంకటేశ్వరునికి అంకితముగా షష్ట్యంతాలు ,సూతర్షి మహర్షులకు ఈ కథ వివరించటం ,హస్తినాపురం అక్కడి విశేషాలు హస్తినరాజైన సంవరుణుడి కీర్తిప్రాభవాలు, తపతీ సౌందర్యమ  .ఇద్దరిమధ్యప్రేమ ,నారద రాయబారం ,తల్లి చాయాదేవి దగ్గర తపతి భజన. వేటకై వచ్చిన సంవరుణుడు  చూడటం ,ఆమె సఖి కీరవాణి భూలోకపు వింతలు  తల్లికి చెప్పటం ,విరహం ,సంవరుణుడిని తెచ్చి తపతికి అప్పగిస్తానని కీరవాణి చెప్పటం మొదటి ఆశ్వాసం కథ.

  విష్ణుస్తుతి –

‘’శ్రీ రంజిల్లమనోజ్ఞ సౌధమున లక్ష్మీ భూవదూటుల్ ప్రియో-దార స్వానురతానురాగగరిమల్ తర్కి౦పగా గూఢసం

చారు౦డై  చని ,భూమి దేవి నాయనాబ్జాతంబులన్ మూసి శ్రీ –నారిన్ చుంబన కేళి దేల్చు విభునిన్ భావింతు భావంబునన్ ‘’

శివపార్వతుల వర్ణన –

‘’యెక్క కోడెలమిన్న మెక్కగా విసమెన్న జడముడిపై పాలకడలి వెన్న –యొడలునిండ విభూతి ,ఎడమ దిక్కున నాతి,కడకంట నమృతంబు వెడలు రీతి

మెడను పాములజోడు ,మేటి గుబ్బలవీడు మొనసి కరంబున  ముద్దు లేడు-ఎదను పున్కల చెన్ను ,నుదుట చిచ్చులకన్ను ,సరిలేని కేశపు౦జములు మిన్ను

సకల దేశస్దు ,డఖిల యోగీంద్ర హృదయ –జలజమదధుపాయ మానుండు శ౦కరు౦డు

భూరికారుణ్య రస ఝరీ పూర్ణ దృష్టి-మించి మత్కావ్య మరసి పోషించుగాత’’

‘’తొడలపై నిషణ్ణు డయితోరపు వేడ్క మనంబు నిండ చ –న్గుడుచుచు కుమారు నాస్యమున కోమలనీల నిజేక్షణ౦బులన్

బొడగని కప్పు కాటుకను ,బుద్ధి కరంబున మాటిమాటికిన్ –దుడుచు గిరీ౦ద్ర కన్య దయతోడుత మత్క్కృతి పెంపు జేయుతన్’’

ఇతర కవుల సానుభూతికోసం –‘’కడుపుని౦డా కాన్పు కన్నవారికి ఇతరులకాన్పు పై కరుణ కలిగినట్లు ,తానూ కావ్యకర్త ఐనవాడు ఇతరకవులకావ్యాలపై సానుభూతి చూపిస్తాడు ‘’అన్నాడు .

తపతిపై మనసుపారేసుకొన్న సంవరుణుడు –

‘’   ప్రణుతింప లోకేశ్వరత్వ మాత్రమెకాదు ,కమలాసనత్వము కలిగి యుండు –శ్రీ మోహనత్వ సంసిద్ధి మాత్రమె కాదు,ఘనసంభవ దశత్వ మెనయు చుండు

సరవి రాజావతంసత్వ మాత్రమెకాదు,ధవళ దేహత్వంబు దనరు చుండు –కనుగొన జైవాతృత్వమెకాదు ,రామాతను ప్రీతి ప్రబలియుండు

నహహ రాజన్యవరుడు దుస్సహవియోగ –భారపరిభూతుడై ,బ్రహ్మ శౌరి శర్వ

కైరవాప్తుల కెనయయ్యె చారులీల –ధూర్జటికిని క౦ఠ నైర్మల్యంబు తొడవుగాదె’’

సరస్సు వర్ణన –

‘’నిఖిల యువజన జనకలా నిరత సరసి –జాశుగా దీర్ణసింహనాదానుకారి

బర్హి నినదంబు  తత్సరః పరిసరంబు –జగధదీశుండు సూచి యుత్సవము బొందె’’

మంఛి కావ్య  రచన చేసిన కుందా వఝల గోపాలసూరి కావ్యమంతా లభించి ఉంటె బాగుండేది .మొదటి ఆశ్వాసపు మెతుకును బట్టి మిగిలినకావ్యాన్నపచనం గురించి చెప్పాల్సి వచ్చింది .

ఆధారం –ఆచార్య బిరుదురాజు రామరాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

హనుమజ్జయంతి సందర్భంగా వేద,శాస్త్ర విద్యార్థికి పురస్కార ప్రదానం

వేద,శాస్త్ర విద్యార్థికి పురస్కార ప్రదానం

 శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సరసభారతి 141వ కార్యక్రంగా 28-5-19 మంగళవారం సాయంత్రం 6-30గం లకు శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య (విజయవాడ )గారిచే ”హనుమ గానమహిమ ”ధార్మిక ప్రసంగం(అరగంట ) ,తర్వాత శ్రీమతి వీటూరి భాస్కరమ్మ (చెన్నై )రచించి,పంపిన” శ్రీ హనుమవైభవ0 ”పద్యాలపఠనం ,అనంతరం శ్రీమతి టేకుమళ్ళ చిద0బరి ( రేడియో టివి ఆర్టిస్ట్ విజయవాడ)మరియు శ్రీమతి గూఢమాధవి ,కుమారుడు మొదలైన స్థానిక గాయనీ గాయకులచే ”భక్తి సంగీత విభావరి ”జరుగును
  తదనంతరం వేద ,శాస్త్ర విద్యార్థి చి . కూచి భొట్ల పవన్ కుమార్ (ఉయ్యూరు )కు నగదు  పురస్కారం  తో సత్కారం జరుగును .
 అందరూపాల్గొని జయప్రదం చేయప్రార్ధన
        గబ్బిట  దుర్గాప్రసాద్ -26-5-19
Posted in సమయం - సందర్భం | Leave a comment

29-5-19బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ హనుమపై స్తుతి పద్యం

పద్యాన్నిపింగళి సూరన తరువాతికాలంవాడైన ” ఏదుట్ల  శేషాచాలుడు” అనేకవి ”జగన్నాటకం ”అనే కావ్యం లో రాశాడు –

సీ-‘’ఏ మహాసత్వుండు రామకార్యంబున గిరులెల్ల నచ్చన గిల్ల లాడె-ఏ బలప్రఖ్యాతు డేడు వారాసులు  కాల్వల రీతి లంఘనము జేసె

ఏ సింహ విక్రము౦ డెలమి రక్షః కు౦జరాలి నీగల రీతి  నణచి పుచ్చె-

ఏమహా సమకాయు డింద్రారి ఖండించు వేళతారలు కటి వ్రేల బెరగె

దారగిరి చాలన క్రియా దక్ష శక్తి –పాత సౌమిత్రి జీవమే ప్రభుడొసంగె

నట్టి గుణవంతు ధీమంతు ,నదిక శాంతు –ప్రకట జయవంతు హనుమంతు బ్రస్తుతింతు’’

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు

  1. — go
Posted in సమయం - సందర్భం | Leave a comment

29-5-19బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శుభాకాంక్షలు

29-5-19బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శుభాకాంక్షలు 

సీ-‘’ఏ మహాసత్వుండు రామకార్యంబున గిరులెల్ల నచ్చన గిల్ల లాడె-ఏ బలప్రఖ్యాతు డేడు వారాసులు  కాల్వల రీతి లంఘనము జేసె

ఏ సింహ విక్రము౦ డెలమి రక్షః కు౦జరాలి నీగల రీతి  నణచి పుచ్చె-

ఏమహా సమకాయు డింద్రారి ఖండించు వేళతారలు కటి వ్రేల బెరగె

దారగిరి చాలన క్రియా దక్ష శక్తి –పాత సౌమిత్రి జీవమే ప్రభుడొసంగె

నట్టి గుణవంతు ధీమంతు ,నదిక శాంతు –ప్రకట జయవంతు హనుమంతు బ్రస్తుతింతు’’

ఈ పద్యాన్నిపింగళి సూరన తరువాతికాలంవాడైన ” ఏదుట్ల  శేషాచాలుడు” అనేకవి ”జగన్నాటకం ”అనే కావ్యం లో రాశాడు –

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-5-19-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

20-వేముల రామభట్టు

0-వేముల రామభట్టు

మహబూబ్ నగర్ మండలం ‘’మానవతీపురం ‘’అనే మానాజీ పేట ను ‘’తూము ‘’వంశపు రెడ్లు పాలించారు .వీరు స్వయంగా కవులు కావ్యకర్తలేకాక కవి పండితులకు ఆశ్రయమిచ్చారు తూము రామ చంద్రా రెడ్డి  మహీపాలుడు ‘’అలమేలు మంగా పరిణయం ‘’కావ్యం రాశాడు .ఇతనికొడుకు పరాశురామ రెడ్ది ‘ఆస్థానంలోని వేముల రామభట్టు ’గౌరీ విలాస ‘’కావ్యం రాశాడు .19వ శతాబ్ది వారు .ఇది దళసరి కాగితాలపై రాయబడి ఆంద్ర సారస్వత పరిషత్తులో ఉన్నది .మొదటి రెండుకాగితాలుపోయాయి మూడవదానిలో కృతికి ప్రోత్సహించిన పరశురామ రెడ్డి అతని వంశ వర్ణన ఉన్నది .అతడు భూరి మేధాధరుడని ,శివాచారుడు సత్య సంకల్పుడు ,అనేక ధర్మశాస్స్త్ర కోవిదుడు ‘’అని  వర్ణించాడు కవి .ఒకసారి ఆయనకవిని పిలిపించాడు –

‘’శ్రీ లక్ష్మీ నరసింహ మంత్ర ఫలసంసిద్ధి ప్రకాశుండు స –చ్చీలు౦ డాశ్రిత చందనుండు విలసత్ క్షేపాల గోత్రా౦బుధి

ప్రాలేయా౦శు౦డురుప్రతాప  పరిజిత్ప్రౌఢుండు సత్కీర్తి –కళా యుక్తుడు ,రామ చంద్ర ధరణీ పాలాత్మజుమ్దోగి౦ డొగిన్ ‘’

అతని కొలువులో ఒకప్రక్క సకల కళా ప్రఘటికులు ,మరోప్రక్క నిఖిల శాస్త్రిక చయము ,ఇంకొకవైపు సుకవీంద్ర నికరం ,మరోవైపు సిద్ధాంత ,జాతక విదులు ,వేరోకవైపు మకరాంక శశాంక సుకుమార మహీపాలుడు  వేరేవైపున పురాణక సమూహము ,గాయక జనము ,సకల సైనికగణము  ,చతురోపాయ విషయ శక్తి యుక్తులైన అమాత్యగణ౦,,వారితో ఆదికావ్య చర్చ చేస్తున్న రాజు కనిపించారు కవికి .కవి కౌండిన్య గోత్రుడు ,లక్షీనరసింహ వెంకమాబల పుత్రుడు .కవిని రాజు –

‘’క్షేపాల గోత్ర జలధి ,ని –శాపతి మా తండ్రి రామ చంద్ర కవీ౦ ద్ర

క్ష్మాపాలు౦ డలమేల్మం-గా పరిణయ మనగ విష్ణు కథ రచియి౦చెన్’’

అని చెప్పి కవిని శైవ ప్రబంధం ఒకటి రాసి కీర్తి పొందమని కోరాడు .సరే అని రాశాడు ‘’గౌరీ విలాస ‘’కావ్యాన్ని .  పరశురామ రెడ్డి  వంశ వర్ణన చేశాడు ముందుగా –

‘’ఆచలేశ్వరులుగాని ,యచలేశ్వరులుగారు భూరి దర్పోద్య  ద్విభూతి  గతుల –గోప గాని సింహులుగాని ,గోపసి౦హులుగారు చటులబాహాబల  శౌర్యగతుల

నారా బిడౌజులుగాని ,నారా బిడౌజులుగారు వినతారి జయ దశా విభవ గతుల –రాజా౦గ జులు గాని రాజాంగజులుగారు తగ కళారూప సౌ౦దర్యగతుల ‘’అంటూ జనం జయ ధ్వానాలు చేసే వంశం తూము వంశం అన్నాడు .అయ్యపురెడ్డి కి నాలుగవతరం లో రామ చంద్రా రెడ్డి రంగమ్మలకు పరశురామ రెడ్డి జన్మించాడు .స్వప్నం లో శివుడుకన్పించి కావ్యాన్ని తనకు అ౦కితమివ్వమన్నాడు –ఆ శివుని వర్ణన –

‘’వలనొప్ప నెమ్మేని నలడిన పలుబూది కనుగొన చలువ చందనముగాగ-కుడి దెస జారంగ విడిచిన పల్ పాపగమి  పైడి తీవె జ౦దెములుగాగ

జిముక వాల్ నాగ బెత్తేము  డమరుకము  ముమ్మొననవాలు కై యాయుధములుగాగా-చలిమిరి కొండ ముద్దులకూతు రెల్లపు డర మేనవదలని యతుకుగాగ

నొక్క తెలియాలబోతు బాల్ జిక్కినెక్కి-కనులపండువుగా నొద్ద గానబడుచు

తొలి మెయిళ్ల రొదోయ దోచ బిలిచి –గట్టు విలుకాడు కలలోన నిట్టులనియె’’

దీనితార్వత శివ స్తోత్రం దండకం రాశాడు .తర్వాత తాను కోనయార్యుని,కొండమా౦బల కు జన్మించిన రామయ్యకు పుట్టిన లక్ష్మీ బృసింహ వెంకమ్మల పుత్రుడనని చెప్పాడు గోత్రం కౌండిన్య .

 గౌరీ విలాసం 6ఆశ్వాసాల ప్రౌఢప్రబంధం .పార్వతీ శివుల ప్రణయకలహం ,శివుడుఅలకతో  వెండికొండ విడిచి  రామచంద్రా రెడ్డి కట్టిన శివాలయం లో ఉండటం ,పార్వతీ,శివ  విరహం ,చిలుకరాయబారం  మళ్ళీ ఇద్దరూ కలుసుకొని మానవతీపుర దేవాలయం లో ఉండిపోవటం కధ.ఆరవ ఆశ్వాసం లో పరశురామ రెడ్డి తండ్రి అతనికి రాజ్యం అప్పగించటం రాజ్యపాలన వేట ఉంటాయి .పూర్వ ప్రబంధాలలోని భావాలు ,పద్యాల అనుకరణ బాగా ఉంటుంది .మేడలమీద హంసల వర్ణన బాగుంది –

‘’ఒంటిపాదమూని యొక్కచిత్తము నిల్పి –యూపిరదిమి పట్టి ,చూపు దాచి

గోపురములమీద కొన్ని రాయ౦చలు –తపము సేయు మునుల తాల్మి బూని ‘’

తెలంగాణలో భోజనాలకు కూర్చునే విధానాన్ని ‘’చకిలం మొకిలం ‘’అంటారని రాజుగారు చెప్పారు .వీణ వాయించే స్త్రీ వర్ణనలో కవి ఈమాటను ప్రయోగించాడు –

‘’కనులరమోడ్పు చేసియు ,’’చకల్ మొకలంబుగ’’ గోరుచుండి’అని చెప్పాడు .

పట్టణ స్త్రీలు కవిగారికి దశావతారాలుగా దర్శనమిచ్చారట –

‘’ఝషకనేత్ర ,కమఠ చరణాబ్జగోల హ –ర్యక్ష మధ్యబాల రామరాజ

వదన కృష్ణవేణి ,వర బుద్ధి కల్కి నా-తరుణులలదిరి పది యవతార గతుల ‘’

ఇంతభావ స్పోరకంగా రాసిన తెలుగు కవి ఉన్నాడా ?అనిపిస్తుంది. తటాక వర్ణన  శ్రీనాధుని నైషధం లోని  ‘’శేష పుచ్చచ్చాయ చెలువారు బిసములు ‘’పద్యాన్ని పోలి రాశాడు –

‘’అహిరాజ పుచ్చ ప్రభానల ద్విసపాళి య౦తరస్థాభ్రము పద౦తములు గ-సంఫుల్ల సితపద్మ సత్ప్రభల్  యామినీ హస్తి రాడ్గమన రేఖా౦కురములుగ

ప్రతి ఫలితోపాంత వితత భూజాతముల్ కుక్షి నిక్షిప్త సత్కుధరములుగ-కమలినీ మకరంద కాంక్షా చలద్భ్రుంగజాలముల్ గరళాతి కీలలును గ

లలితశైవా జాలికా లతికలరయ –  భీమ బడబానలోద్భవ దూమములుగ

క్షీర కలశధిబోలె గంభీరమైన –యత్తటాకంబు గాంచె దైవోత్తముండు’’

శివుని వెతకటానికి పార్వతి సఖులతో బయల్దేరిన సందర్భంలో చెలులమాటలు –

‘’ఘనసారమా శరద్ఘన సారవర్ణుని ,ఘనసార గ౦ధితో గలవు మనవె-మదన భూజాతమా మదనాపకారు నీ మదనాగ గతి వెతల్ మాన్పమనవె

కాంచన దుగ్ధమా కాంచనాచల ధర్ముకా౦చననాసరక్షించుమనవె-కాదంబమా   భూత కాదంబపతి నీలి కాదంబికా దేవి ,గల్వుమనవె

కల్ప భూజమ భక్త సంకల్ప దువిద-గల్ప గదెమోహవారధి గల్పకయును

ఏలకీ భూజమా సద్దయాలవాలు – నీ లతా౦గిని దయతోడ నేలు మనవె’’

మన్మధుని జైత్రయాత్రావర్ణన తమాషాగా చేశాడు –

‘’పచ్చపిట్ట పఠాన్ సిపాయీల్ సవారి ,భేష్షాబాషు వహవా పసందనంగ-మొకము లెత్తుకొని శారిక వంది మాగధుల్ బహుపరాగ్పొర  భళాభళి యనంగ

రభసంపు నెమ్మివీర భటాళిఝళిపించు ఉక్కు కత్తులును తళుక్కనంగ-శీతువు పిట్ట బంట్రోతు తుపాకి చప్పుళ్ళు ఢెమి ల్లుఢెమిల్లుమనగ

అంచలిరువంక చోపుదార్లై గడంగి –జరగకుడు ఖబడ్దార్బరాబరి యన౦గ

మారుడవ్వేళ ననికై స్వారి వెడల –తనబల౦బుతో శృంగారవనము జేరె’’

 వసుచరిత్ర అనుకరణ పద్యాలు ఎక్కువగా ఉన్నాయి. అంతమాత్రం చేత కవి ప్రతిభ తక్కువ ఏమీ కాదనిపిస్తుంది .పరశురామ రెడ్డికి  దాక్షాయణి కలలో అద్భుతంగా కనిపించింది –

‘’వర నీల కంధర స్ఫురదాభ లిరుప్రక్క కమలభాసుర కరంబు –ఘన పుండరీక శోభన చేల మిరువంక నిరువంక ననల బంధుర దృశంబు

నవ సుధా ధరబింబ సవిభవం బిరుఠేవసిత పయోధర విభాతి –తారకాస్థిర సత్ప్రదానంబు లిరుదెస నిరుదెస నాహీనకాభరణ కాంతి

పలుకు భేదంబుగా బల్కు వలవకయును –వలచి ఇచ్చిన నరమేనగలసి శౌరి

చెలువుడు ను దాను గలియుట దెలుపవచ్చి –కలను భూపాలకునిమ్రోల నిలువబడియె’’

ఆరవ ఆశ్వాసం లోని శివునిపై చెప్పినపద్యం –

‘’అమితాహి కులేశ్వర హారధరా –హిమభాను జితా రేణ కరా

కమలా౦బక చేత సగర్వహరా –విమలాభ్ర ధునీ దృత విష్ణుశరా ‘’

ఆధారం –ఆచార్య బిరుదురాజు రామరాజుగారి ‘’చరిత్రకెక్కని చరితార్ధులు ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’

’చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’’

తోడికోడళ్ళు సినిమాలో ఆత్రేయ ‘’కారులో షికారుకెళ్ళేపాలబుగ్గలపసిడీ చాన ‘’పాట చివర్లో  ‘’చాకిరొకరిది ,సౌఖ్య మొకరిది సాగదింకా తెలుసుకో ‘’అని రాశాడు . కాని ఇది రివర్స్ అయి చంద్రబాబు విషయం లో  ‘’చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగునెప్పుడు తెలుసుకో’’గా మారిందేమో అనిపిస్తోంది .నిజమే ఉమ్మడిరాష్ట్రంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ నగరాన్ని’’ హైటెక్ సిటీ ‘’గా మార్చటానికి ఎన్నేళ్ళు ఎంతకస్ట పడ్డాడో శత్రువులుకూడా ఘనంగా మెచ్చుకొన్నారు .ఆంద్ర యువకులకు ఐటి రంగం లో క్రేజ్ క లిగించాడు .ఎన్నో కంపెనీలు విదేశీ ఉద్యోగాలతో ఆంద్ర యువత ఆడర్శప్రాయులయ్యేట్లు చేశాడు .ఎన్నో ఫారిన్ కంపెనీలు భాగ్యనగరం లో కొలువుతీరి వేలాది ఉద్యోగాలకు ఆస్కారం కలిపించాయి .ఇదంతా బాబు ఆలోచన ,ఆచరణ, మొండి ధైర్యం . అప్పుడు రైతులను ,వ్యవసాయాన్ని మర్చిపొయాడని ఊదరకొట్టి దించేశారు .వైఎస్ అధికారం లోకి వచ్చి చంద్రబాబు చేసిన చాకిరీ ఫలితాలను సౌఖ్యాలను హాయిగా అనుభవించి తండ్రి  కొడుకులు  లక్షకోట్లు మూటకట్టారని జనం గగ్గోలు పెట్టారు  .దాదాపు పదేళ్ళు అధికారం కోల్పోయినా ,మామను ముంచాడు అనే అభియోగాన్ని భారంగా మోస్తూ పార్టీ కి ప్రజలకు సన్నిహితమై మళ్ళీ శ్రమించి ,పార్టీ స్థాయి కాపాడి వెన్నుదన్నుగా ఉండి ప్రజాభిమానం పొందాడు .

    రాష్ట్ర విభజన జరిగి ఎన్నికలలో కొత్త రాష్ట్రారనికి చంద్రబాబే బెటర్ అని నమ్మి ప్రజలు గెలిపించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిని చేశారు .చేతిలో చిల్లిగవ్వలేని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ,కొత్తరాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం కలిగింది .ఈ ఆలోచన లేకుండా హైదరాబాద్ లోనే నోరూ వాయి మూసుకొని ఉండిపోవచ్చు అవమానాలు భరిస్తూ .కాని ఆంధ్రుల సంకల్పం బలమైనదని  వాళ్ళు ప్రపంచం లో కాలరెత్తుకు స్వాభిమానం తో  తిరగాలని భావించి రాజధాని అమరావతి నిర్మాణం ,అనేక మైన ప్రభుత్వభవననిర్మాణ౦ పరిశ్రమల రూపకల్పన అవసరం వాటి ఏర్పాట్లకోసం దేశదేశాల చుట్టూ తిరిగి సాధించటం దీనికి తోడూ పోలవరం నీళ్ళు రాకపోతే కోస్తా జిల్లాలు అన్నమో రామ చంద్రా అని నీరు లేక సాగులేక అల్లాడిపోతారని సంకల్పించి పూనుకోవటం ,పట్టిసీమ నుంచి ఈలోపు గోదావరి  నీరు వచ్చే ఏర్పాట్లు చేసి అపరాభగీరదుడుగా సాధించటం ,సస్య శ్యామల ఆంద్ర దేశాన్ని తయారు చేయటం అలుపులేని కృషి చేశాడు. విశ్రాంతి లేని జీవితం బాబుది. సునామీలు తుఫాన్లలో అతలాకుతలమైన రాష్ట్రం .దానికి సాయంకోసం కేంద్రం సాయం కోరటం పైసా కూడా చేపకపోవటం ,పోలవరం అమరావతి మిధ్య అని తీవ్రప్రచారాలు ,కియా మోటారుకారు కంచికే పోయిందని  బూటకమని ప్రచారం .సెల్ ఫోన్ ల తయారీలో ఆంద్ర అగ్రగామికావటం కిట్టనివాళ్ళు ఆడిపోసుకోవటం ,ఆదినుంచీ ఎవరూ సహకరించకపోవటం చివరికి విసుగెత్తి యెన్ డి ఏ కు గుడ్ బై చెప్పి ,సాధనలో తీవ్రంగా అలసిపోయాడు .మళ్ళీ కథమొదటికే వచ్చింది .అయిదేళ్ళ తర్వాత 2019ఎన్నికలలో ఘోరంగా పార్టీ ఓడిపోవటం బాబు ను కలచి వేసే సమస్య .సినిమానటులు, రామారావు కుటుంబం నుంచి సహకారం కరువు .లేక తీసుకోలేకపోయాడో అదొక సమస్య అయింది .

 ద్వాక్రాగ్రూపులకు ఇతోధికంగా సాయం ,ముస్లిం లకు పెద్దపీట,బిసిలకు కాపులకు కాపు కాసినా ,విద్యార్ధులకు చేరువైనా ,రైతులకు దగ్గరైనా ,’’ఎన్నారైలు’’  వందలసంఖ్యలో వాలి ప్రచారం చేసినా ,ఎన్నికలకమిషన్ ఉచ్చుబిగించి ,ఐఎస్ ఐపిఎస్ లు ముసుగులో మోసంచేసి ,పైనున్నద్వయం బాబు సర్వనాశనమే ధ్యేయంగా పని చేయటం తో అంతా ఉల్టా అయింది .అధికారం జగన్ చేతిలో పెట్టి ,సౌఖ్యమా నుబహ్విన్చాతానికి రాచబాట వేశాడు .జయలలితగతి పట్తిస్తారేమో ననే భయమూ వేసింది .జైల్లో పెట్టిస్తారేమోనని ఆంధ్రజనం కలవరపడ్డారు .అందరూ నమ్మి ఓట్లు వేస్తారనుకొంటే అంతా నమ్మించి మోసమే చేశారని అర్ధమయింది .కనుక పాపం బాబు విషయం లో  ‘’చాకిరొకరిదీ,సౌఖ్యమొకరిదీ సాగునెప్పుడు తెలిసికో ‘’అన్నది మళ్ళీ నిజమైందికదా .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-5-19-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆంధ్రా లో త్వరలో బిజెపి ప్రభుత్వం వస్తుందా ?

ఆంధ్రా లో త్వరలో బిజెపి ప్రభుత్వం వస్తుందా ?

అవును వస్తుందనే అనిపిస్తోంది .కర్ణాటకలో బిజెపి చేయని మాయప్రయత్నాలు లేవు అప్పుడు .అప్పుడే నేను చెప్పాను చంద్రబాబుపై పడతారని అస్థిరతకల్గించి పరాజయానికి పావులు కలుపుతారని .కాషాయం’’ కషాయం’’ ఆంధ్రాలో పని చేయదని పూర్తిగా అర్ధమైన షా మోడీలు జగన్ ను దువ్వి ,పవన్ ను ప్రేరేపించి బాబుపై దాడి చేయించారు .వేలాది కోట్లరూపాయలు మంచినీళ్ళుగా ప్రవహించాయని చేతులు మారాయని  మీడియా కొడైకూసింది .  ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది .జగన్ పై    ఉన్న కేసులు బాగా కలిసివచ్చాయి ద్వయానికి .కాళ్ళమీద పడేట్లు చేసుకొన్నారు .అభయ హస్తమిచ్చారు .       ప్రత్యేకహోదాఇస్తామని శపథం చేసి ఎన్నో సార్లు దేవుడిగుడి వద్ద చెప్పి చివరికి పాకేజీ ఇస్తాం తీసుకో లేకపోతె మానుకో మని భీష్మించి దొంగ దెబ్బతీశారు .బాబు ఒప్పుకోక ఎదురుతిరిగితే ‘’యు టర్న్ ‘’అని పేరుపెట్టి గేలి చేశారు .వీధిపోరాటం శరణ్యమైంది బాబుకు .దీనితో సంస్థాగత వ్యవహారాలపై శ్రద్ధపెట్ట నీకుండా చేయగలిగారు .జగన్ తో లోక సభ సభ్యులతో రాజీనామా చేయించి  సానుభూతి పొందేట్లు చేశారు . బాబు పోలవరం నిర్మించటం కంటగింపుగా మారింది గుజరాత్ లో సాధ్యంకానిది ఆంధ్రాలో బాబు ఎలా చేశాడా అని అసూయపడ్డారు .అన్నిరకాల ఆర్దిక సాయాన్ని  బంద్చేశారు  లేకపొతే ఏదో విదిల్చినట్లు రాల్చారు .ఇదికాక ‘’సన్ స్ట్రోక్ ‘’అని కొడుకు గురించి ఎద్దీవా ఒకటి .ఇన్ని తట్టుకొని తన 25 ఏళ్ళ విజన్ సార్ధకం చేయటానికి అవిశ్రాంత కృషి చేశాడు .కానీ కాలమూ కలిసిరాలేదు .

  బాబు మంచోడే మంత్రులుఅవినీతిపరులు ,బడుద్ధాయిలు అనే అభియోగామూ పెరిగింది .పార్లమెంట్ లలో అరచినా గొంతు చి౦చుకొన్నా ,కనికారమే లేకపోయింది ఆంధ్రాపై .ఒంటరిపోరాటమే అయింది .ప్రతిపక్షాలు ఏదో మద్దతు ఇచ్చినా ,ఎప్పుడు ఎవరు ఎవరికి జైకోడతారో తెలీని  వింతస్థితి. పాపం రాహుల్ సోనియా పాతవైరాలకు స్వస్తి చెప్పి బాసటగా నిలిచారు .ఇదికొంత ఊరట .కానీ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తుఅసలుకే మోసం అని తెలిసి ,పవన్ ని కోరినా చెయ్యిచ్చాడు .కమ్మీలు ఆత్మార్పణ లో పడి బెంగాల్ను కమలానికి ధారాదత్తం చేశారు .దాక్షిణాన తమిళనాడులో స్టాలిన్ ముందు పప్పులుడకలేదు .కేరళలో పినరాయ్ ముందూ అదే పరిస్థితి .ఆంధ్రాలో కన్నా అండ్ పార్టీలు స్వాహా స్వాములేకానీ వోట్ కాచర్స్ కాదు అని తెలిసినా  వాళ్ళనే నమ్మాల్సి వచ్చింది కమల దళం .

  ఆంధ్రాలో బాబు ఉండగా ఏమీ చేయలేము కనుక జగన్ ను కేసుల విషయం లో బెరిరించి అదలించి అంటకాగేట్లు చేసుకొన్నారు .బలహీనమైన  కాండి డేట్లను పెట్టి జగన్ కు సాయపడ్డారు .జగన్ తప్ప ఆంధ్రాలో వేరెవరికీ అవకాశం లేదని తేల్చుకొన్నారు .కనుక పదేళ్ళ జగన్ కోరిక తీర్చటానికి తెరవెనుక చెయ్యాల్సింది అంతా పకడ్బందీ గా చేశారు .తెలుగు దేశం నాయకులపై ఐటి ,ఇడిదాడులు చేయించి డబ్బు ఆడని పరి స్థితి కల్పించి గిలగిలా గిజగిజా కొట్టుకోనేట్లుచేశారు .ఆంద్ర దేశ చరిత్రలో జగన్ కు చారిత్రాత్మక విజయం చేకూర్చిపెట్టారు .ఇందులో తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు పవన్ ఉడతసాయం చేశాడు .ఓట్లు చీల్చి జగన్ గెలుపుకు కారణమయ్యాడు .జగన్ పార్టీ కొచ్చిన మెజారిటి కంటే పవన్ కొచ్చిన వోట్లు ఎక్కువని ఇవాళ పేపర్లు రాశాయి .ఇలా కసితీర్చుకొన్నాడు గడ్డమాయన  బాబుపై .

  నాలుగు రోజుల్లో జగన్ ప్రభుత్వం ఏర్పడుతుంది .హామీ ఇచ్చిన నవ రత్నాలకు నిధులు కేంద్రం ఇస్తుందా ?కేసులున్న జగన్ ధైర్యంగా అడిగి సాధించగాలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న .బాబును అప్పుడు ఊరిన్చినట్లే ఇప్పుడు జగన్ నుకూడా ఊపుతారు .బాబు మొండివాడుకనుక లొంగలేదు .ఇక్కడ అన్నీ లొసుగులే .అడగలేడు అడక్కుండా ఉండనూ లేడు.ఎన్నికలము౦దు లాగా లొంగి ఉండాల్సిందే .తప్పదు .లేదంటే ‘’కేసులబూచి ‘’చూపి అడక్కుండా చేస్తారు ద్వయం .చివరికి శాసన సభ్యులను ప్రలోభాలతో ,ప్రమోదాలతో భారీసంఖ్యలో చీల్చి ,ఆంధ్రాలో బిజెపి ప్రభుత్వం ఏర్పరచి పంతం నేరవేర్చుకొంటారు .ఆంధ్రా వశమైతే హార్ట్ ఆఫ్ దిలాండ్ చేతికిచిక్కినట్లే .ఇప్పటికే భారత దేశం లో కేరళ ఆంధ్రా తమిళనాడులో తప్ప అన్ని చోట్లా కాషాయం రెపరెపలాడుతోంది .ఆంధ్రాలో నూ ఎగరేస్తే ఇక ఎదురుండదు . ఆ మజాయే వేరు .దీనికి జగన్ సాయమూ చేయచ్చు లేకపోతె సామ దాన భేద దండోపాయాలు ఉండనే ఉన్నాయికదా మారాజా . షా తలచుకొంటే అపర చణక్యుడౌతాడు .ఎదిరించినవాడిని మట్టి కరిపిస్తాడు .అప్పుడు జగన్ కు అండగా ఉన్న’’ పీకే ‘’కూడా ఏమీ పీకలేడు .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-19-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Leave a comment

19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’

19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’

పాల్కురికి సోమనాధుడు ‘’ఉదాహరణ యుగ్మం ‘’రచించాడని పిడుపర్తి సోమనాథుడు చెప్పాడు .సోమన ఉదాహరణ కావ్యం అంటే ‘’బసవ ఉదాహరణ కావ్యమే’’ అని అందరికి తెలుసు .కానీ బిరుదురాజు వారికి కరీం నగర మండలం లో ఒక తాళపత్ర గ్రంథం లభించిందని ,దానిలో సోమనాథ భాష్యం తోపాటు చాలా లఘు కృతులున్నాయని అందులో పండితా రాధ్య ఉదాహరణం ఒకటని రాజు గారు చెప్పారు .రాజుగారు చెప్పేదాకా అలంటి ఉదాహరణ కావ్యం ఉందని ఎవరూ చెప్పలేదట .వ్రాయసకాడు రాసిన తేది 3-5-532అని తేల్చారు .

శ్లోకం –అద్వైతోద్ధత కుంభి  కుంభ దళనోద్యద్రౌద్ర పంచాననో –గర్వోదంచిత పాంచరాత్ర నిబిడ ప్రాలేయ చండ ద్యుతిః

పాషండాబ్జ మహాగజో విజయతే బౌద్ధాద్రి ఘొరాశనిః-శ్రీమత్పండిత మల్లికార్జున గురుర్వి ద్వాత్సదాపూజితః’’

‘’పండితారాధ్య నామేతి పంచాక్షర సముద్భవం –సకృత్ స్మర౦తి ఏ భక్తా స్తేజనాః పుణ్య కారిణాః’’

మాలిని –‘’శివకర శివ సౌఖ్యా శిష్ట భక్త్యైక ముఖ్యాః-వివిధ పరమ శీలా ,వేద శాస్త్రానుపాలాః

ప్రవిమల పరభావా ,పండితారాధ్య దేవా –తవిలి మిము భజింతున్ దద్దయు౦ బ్రస్తుతింతు ‘’

ప్రధమా విభక్తి పద్యం –శా –శ్రీమత్పండిత మల్లికార్జునుడు వైశిస్ట్యోల్ల సచ్చర్యుడు –డుద్దామ ప్రోద్ధత వీరభక్తి నిధి ,నిత్యశ్లోకు డుద్యన్ముని

స్తోమ స్తోత్రుడ గణ్యపుణ్యుడతి తేజో రాశి ,సంయగ్దయా –దాముం డీవుతమాకు భక్తియు ,ప్రసాదార్ధక్రియా సక్తియున్ .

కళిక – ‘’మరి శుద్ధమార్గమందు ,శైవమార్గ మండనుండు –తురువణి౦చు భవ దుర్గ ఖండనుండు

చిరతర ప్రణవసిద్ధమా౦త్రికుండు –పరమభక్తివిని బద్ధ తా౦త్రి కుండు-మునిగణప్రచయ ముఖ్య వందితుడు

జనిత చిన్మయ సుసౌఖ్య వందితుడు –అలఘు సంచిత శివైక్య భావనుండు –ఎలమి సర్వ జగదేకపావనుడు .’’

ఉత్కళిక –‘’తనవిభుత్వమును –ఘనమహత్వమును –ధరణి ని౦పుమని –హరుడు పంప బని

వడసి చెన్నమఠ-నొడలు గొన్న పర –మము దయా తనుడు –దమిత యాతనుడు

ఇలాగేసప్తమీ విభక్తిదాకా పద్యాలు చెప్పి సంబోధన ప్రధామావిభక్తిలోనూ చెప్పాడు చివరగా రాసిన ,సార్వవిభక్తికం లోని  రెండు శార్దూల పద్యాలు-

, — 

ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-5-19-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment