కృష్ణం వన్డే జగద్గురు0

నిన్న 15-8-17 మంగళవారం శ్రీ కృష్ణాష్టమి  71 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం .ఉదయం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ ముద్దుపాదాలను ముగ్గుతో మా శ్రీమతి చిత్రించి బాలకృష్ణుడిని ఆహ్వానించింది .నేను శ్రీకృష్ణఅష్టోత్తరం విష్ణుసామ్ తో సహస్రనామ0 తో కన్నయ్యకు పూజచేసి మా ఆవిడ చేసిన అటుకులు ,కట్టెకారం తో పాలు పెరుగు వెన్న మామూలు నైవేద్యానికి అదనంగా నైవేద్యం పెట్టాను . సాయంత్రం మా అమ్మాయి భజన ఏర్పాటు చేసింది . సాయి సెంటర్ వాళ్ళందరూ దాదాపు 75 మంది వచ్చి భజనలు చేశారు .అందులో కృష్ణభజనలూ ఉన్నాయి . మా అమ్మాయి నన్ను మాట్లాడమంటే 9 నిమిషాలు కృష్ణతత్వాన్ని గురించి చెప్పాను .చాలా  బాగుంది  ఇంకా చెబితే బాగుండేది అని చాలామంది ముఖ్యంగా శ్రీమతి లక్ష్మి ,ఉష ,రాధా అడిగారు .సరే నని భోజనాలయ్యాక రాత్రి 9-30 నుండి 9 50దాకా మళ్ళీ హోలిక విశేషాలు చెప్పాను .అందరూ సంతోషంగా ఆనందం తో రాత్రి 10 గంటలకు ఇళ్లకు బయల్దేరి వెళ్లారు . నేను మాట్లాడిన దాని సారాంశం తోపాటు మరికొంత సమాచారం తో దీన్ని ”కృష్ణం వ0దే  జగద్గురుమ్ ”గా అందజేస్తున్నాను .

” రాధనురా ప్రభూ ,నిరపరాధనురా ,అనురాగ భావనారాధన మాగ్న మానసనురా ”’
  ”ఏది మరొక్కమారు హృదయేశ్వర గుండెలు పుల్కరించగా ఊదగదోయి  యుష్మదీయ వేణు నాద  రసోదయ  రాగ డోలికలతో  జగమ్ము విస్మయమ్ముగ నిదురించే -కాంక్ష ”మర్రాకయి తేలేరా ప్రభూ ,రమ్ము ఒక్క క్షణమ్మేని  నిదురింతువుగానిరమ్ము  తెరచి యుంచితి నా హృదయ కుటీరమ్ము తలుపు ”అని రాధ ఆనందమయ గాధను కళ్ళకు కట్టించారు కరుణశ్రీ కవి .
  అసలు కృష్ణ అని అనగానే మనముందు నీలమేఘచ్చాయ తో ముగ్ధ మోహన రూపం తో” వ్యస్తష్టపాదం ” తో పెదాలవద్ద వేణువు తలలో నెమలి పించం మెడలో తులసిమాల  ,ప్రక్కన గోమాత ఉన్న నందనందన యదునందనుఁడు గోపాల కృష్ణుని దివ్య మంగళ రూపం కళ్ళ ముందు దర్శనమవుతుంది .ఆ రూపానికి జగత్తు అంతా పరవశించింది . ఆయన దేహచ్చాయ నీలవర్ణం .అనంతమైన ఆకాశం సముద్రం రంగు కూడా నీలమే .కనుక అది అనంతత్వానికి ప్రతీక -సింబల్ .అంతేకాదు అన్ని రంగులూ నీలం లో లయమవుతాయి .నిరాకార పరబ్రహ్మ తత్వానికి అదేప్రత్యేకత ..భాగవత రచన ప్రారంభిస్తూ వ్యాసమహర్షి కృష్ణుడు దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ కోసం మాత్రమే అవతరించలేదు -అజ్ఞానం ,విషయం వాంఛలతో ,సుఖ భోగ లాలసత్వం సంసారం లో మునిగితేలేవారికి తనలీలలద్వారా తరించే మార్గం చెప్పటానికి అవతరించాడు అంటే స్మరణ మాత్రం తో మొక్షాన్నిస్తాడని అర్ధం .అంతేకాదు ఇన్ని అవతారాలున్నాయి ఏ అవతర0 లో లేని లీలలు కృష్ణావతారం లో కనిపించి ఆ కృష్ణ లీలలకు సమ్మోహితులమవుతాం మన మనసు శరీరం అంతా ఆయన వశమైపోయే తాదాత్మ్య స్థితి అనుభవిస్తుంటాం .అదీ కృష్ణావతార పరమార్ధం . మేనమామకు  గండం ఉన్న రోహిణీ నక్షత్రం లో  ఆదివారం నాడు అడ్డ కాళ్లతో పుట్టాడు .పుట్టగానే తనను చంపటానికి సిద్ధపడిన ఏడుగురు దాసీలను చంపేశాడు . పూతన చనుబాలుతాగి దాని ప్రాణాలు తోడేశాడు దాని చనుబాలలో ఉన్న విషయాన్ని కూడా తాగేసి ,అంటే పాపాలన్నీ తాగేసి దాని శరీరానికికి పుణ్యమే మిగిల్చాడు పూతన దేహాన్ని తగలబడుతుంటే ”అగరువత్తుల సుగంధం వచ్చిందట . ”పునాతి దేహం పూతన ”అంటే దేహాన్ని పవిత్రం చేసేది అని అర్ధం . ఆమె విషం ఈయనకు అమృతం అయింది అందుకే ఏ పదార్ధమైనా భగవంతుడికి ”అమృతమస్తు ”అంటూ నైవేద్యం చేసి తింటాం అది అమృత స్వరూపంగా మారుతుంది అదే ప్రసాదం అంటే ప్రకృష్టమైన సాదం అంటే భోజనం పవిత్ర భోజనం శకటాసుర తృణాసుర ,కాళీయుల ను సంహరించాడు .అహంకారం తో ప్రకృతిపూజను అవహేళన చేసిన ఇంద్రుడికి గోవర్ధనపర్వతం కొనగోటిపై నిలబెట్టి వరుణుడి గర్వాన్ని అణచి గోవులకు గోపాలురకు రక్ష కల్పించాడు . గోపాలకులతో కలిసి చద్దన్నాలు తిన్నాడు . దీన్ని చూసిన నారదుడు ”మహా మునీశ్వరులు కూడా దర్శించలేని కృష్ణపరమాత్మతో ఈ గోపీగోపాలురు హాయిగా ఆటలాడుకొంటున్నారు కలిసి ఎంగిలి కూడు తింటున్నారు వాళ్ళ అదృష్టం యెంత గొప్పదో ”అన్నాడు .పోతన్నగారైతే ఏకంగా కృష్ణుడితో  ఆవకాయ మాగాయ పచ్చళ్ళుతినిపించాడు  దీన్ని చూసిన వ్యాసభగవానుడు కృష్ణుడితో ”కన్నయ్యా  నువ్వుమరీ తెలుగుకృష్ణుడివి అయిపోయావు ”అని అన్నాడని కరుణశ్రీ ”భాగవతః వయజన్తిక”లో సరదాగా రాశారు . ఏ ప్రాంతం వారికీ ఆ ప్రాంతపు కృష్ణుడుగా కనపడటం ఆయన ప్రత్యేకత . ఎంత ఆకర్షణ లేకపోతే భక్తమీరాలాయి సూరదాసు వంటి మహా భక్తులు తమహృదయాలలో ఆయనకు గుడికట్టి పూజించారు .అంతటి ఆకర్షణ ఉన్న అవతార పురుష్ఘుడు లేదు రామావతారం లో రాముడు నీలమేఘ శ్యాముడే .ఆయన మర్యాదా పురుషోత్తముడు .తానూ ఎలా ధర్మాన్ని పాలిస్తూప్రవర్తించాడో జనం అలా నడవాలని ఒక ఆదర్శ మూర్తిగా మార్గదర్శిగా నిలిచాడు కృష్ణుడు ఆచరింపజేశాడు . ధర్మ చ్యుతి కలిగితే నిర్దాక్షిణ్యంగా బంధువైనా సరే సంహరించాడు .అలా సంహరింపబడినవారిలో మేనమామ కంసుడు  మేన బావ శిశుపాలుడు లను చంపాడు .  బావలవరుస అయినసమస్త కౌరవులు అర్జునుంచేత భీమునిచేతసంహరింపజేశాడు .చివరికి ధర్మ భ్రష్ఠులైన యాదవుల ప్రవర్తన సహించలేక యాదవ కులం లో ముసలం (రోకలి )పుట్టించి వారందరి నాశనానికి కారకుడయ్యాడు ఆయన ధర్మ పక్షపాతం అంతటి విశిష్టమైనది అందుకే ”ధర్మ సంస్థాపనార్ధం సంభవాయై యుగే యుగే ”అని అభయమిచ్చాడు . ఇంతటి ఆకర్షణీయ పురుషునికి అంతటి పాగా ద్వేషమా అని అని అని పిస్తుంది అది ధర్మ సంస్థానార్ధమే అని గ్రహించాలి .
  నంద వంశ పురోహితుడు గర్గ మహర్షి నంద బాలుడికి ”కృష్ణ ”అని నామకరణం చేశాడు  .”కృష్ అంటే శాశ్వతత్వం ఉన్నవాడు” ణ ” అంటే చిదానందమైనవాడు అంటే శాశ్వత చిదానంద రూపుడైనవాడు అని అర్ధం .. ఇంకో అర్ధం సర్వాన్ని ఆకర్షించేవాడు .కృష్ -ఆకర్షణీయే.అధవా ఆకర్షయేత్ సర్వం జగత్ స్థావరం జంగమం -కృష్ణం ”అని గర్గముని తెలియజేశాడు .ఆయనే ”నామ్నా0 భగవతో నందః కోటీనాం స్మరణేచ యత్ ”అని వివరించాడు స్మరణ మాత్రం చేత తరింపజేసేవాడు .కృష్ణ అంటే సమస్త  సమ్మోహ పరచేవాడు ,ఆకర్షించేవాడు .సకాలానికి ఆత్మా అయినవాడు -ఆయనే ఆదిపురుషుడు . ..కృష్ణంధర్మం సనాతనం ” అంటే కృష్ణుడే  ధర్మం .మనకు రాముడుకాని కృష్ణుడు కానీ వాళ్ళ ధర్మాన్ని ఏదీ కొత్తగా బోధించలేదు సనాతన వైదిక ధర్మాన్నే వాళ్ళమాటలలో చెప్పారు అని మనం తప్పకుండా గ్రహించాలి ..వ్యాసుడు ”నిష్కల్మషులైన గోపా గోపీ జనాలకు ఆయన అతి దగ్గరవాడయ్యాడు ”అన్నాడు  .
  శ్రీ కృష్ణుడు తాను పుట్టిన దగ్గర్నుంచి ప్రతి సందర్భం లో తన పరమేశ్వరతత్వాన్ని ,సర్వ సాక్షిత్వాన్ని ,సర్వజ్ఞత్వాన్ని ,సర్వ కారణత్వాన్ని ప్రదర్శించిన సంపూర్ణ అవతారం .అందుకే కృష్ణం వన్డే జగద్గురుమ్ అన్నారు .జగద్గురుత్వం అంటే ఎవరు ఎలా పూజిస్తే ,వాళ్ళను ఆ ప్రకారం అనుగ్రహిస్తాడని అర్ధం . ఎవరు ఏ మార్గం లో సేవించినా  ,ఆ దారి తననే చేరుతుంది అని స్పష్టంగా చెప్పాడు .అందుకే అన్ని ధర్మాలను అన్నిమార్గాలను సమన్వయము చేస్తూ ”భగవద్గీత ”అర్జునిద్వారా మనకు బోధించి తన అవుతార తత్వాన్ని తెలియజేశాడు. పూర్ణ కళలతో భగవంతుడు కృష్ణావతారం దాల్చాడు  .
  జరాసంధుడు 18 సార్లు ప్రతిసారీ 23 అక్షౌహిణుల సైన్యం తో మధురపై దాడి చేశాడు . ఆసైన్యాన్ని అంతటినీకృష్ణ బలరాములు ఇద్దరే సంహరించారు .ఒక అక్షౌహిణి అంటే 10 వేల  రథాలు ,20 వేల  గుర్రాలు 40 వేల  కాల్బలం  . అంటే23 x 18=414 అక్షౌహిణుల సైన్యాన్ని బలరామకృష్ణులిద్దరే సంహరించారు .దేనికోసం ధర్మ సంస్థాపనకోసమే . అంటే కర్తవ్య దీక్ష మూర్తీభవించిన అవతారం కృష్ణావతారం …
  స్వామి త్యాగీశానంద గొప్ప వేదాంతి  మహా గొప్ప సన్యాసి . ప్రాక్ పశ్చిమ వేదాంతాలను క్షుణ్ణంగా చదివి లోతులు తరచినవారు .ఆయన కృష్ణుని గురించి చెబుతూ ”The lord of the autumn moon ”శరత్ చంద్ర ప్రభువు అన్నారు అంటే శరత్కాలం పౌర్ణమి వెన్నెల మనోహరంగా హృదయాహ్లాదంగా పరవశంగా ఉంటుంది అలాంటి పున్నమిచంద్రుడు కృష్ణుడు అని అర్ధం . ఆయనే శ్రీ కృష్ణుడు గొప్ప రాజకీయ నిపుణుడు – స్టేట్స్ మన్ అన్నారు ఆయనే ఆయన జగదురుత్వాన్ని గురించి చెబుతూ ”Krishna is the first teacher in the  history of the world to discover and proclaim the grand truth of love for love’s sake    and duty for duty’s sake ”అని గొప్పగా కృష్ణ గురుత్వాన్ని ఆవిష్కరించారు .అందుకే కృష్ణం వ0దే  జగద్గురుమ్ .               గోలోకం
మనలో చాలామందికి భాగవత భారతాలగురించి తెలుసు .కానీ కృష్ణుడికి ప్రత్యేకంగా ఒక లోకమే ఉందని తెలియక పోవచ్చు .బ్రహ్మ వైవర్త  పురాణం ”లో శ్రీ కృష్ణ ఖండం ”లో ఆ వివరాలన్నీ ఉన్నాయి .కొద్దిగా ఆ వివరాలు తెలుసుకొందాం .గోలోకం అన్ని లోకాలకంటే పైన ఉన్నది .అందుకనే ఆశీర్వదించేటప్పుడు ”గోలోకే నిత్యనివాస శాశ్వత సిద్ధి రస్తు ”అని దీవిస్తారు .వైకుంఠ లోకానికి 500 మిలియన్ యోజనాల దూరం లో అంటే 4,00000,0000మైళ్ళు .దాని విస్తీర్ణం(ఏరియా ) 30మిలియన్ యోజనాలు అంటే 24,00000,0000 మైళ్ళు .
  గో లోకం లోరాధా కృష్ణులు ఉంటారు . వీరిద్దరితో సహా గోప గోపికల   అందరి వయసు 16 సంవత్సరాలే దీనికి ”కిశోర ప్రాయం ”అంటారు .అదీ ఈలోగా ప్రత్యేకత ..చేతిలో మురళి వక్షస్థలంపై కౌస్తుభ మణి  ధరించి గోప వేషం లో శ్రీ కృష్ణుడు గోపీ జనం తో సదా రాసమండల విహారిగా సర్వ సిద్ధి స్వరూప ,సర్వసిద్ధి ప్రదాత ,ఆదిపురుష అవ్యక్త స్వరూపంగా ఉంటాడు అని బ్రహ్మ వైవర్త పురాణం చెప్పింది ..రాస లీలలు అంటేవిశృంఖల శృంగారం(రిబాల్డ్రీ  ) కాదు ,అది జీవాత్మపరమాత్మల సంధానమే అని నిరూపిస్తూ ఒక పుస్తకం రాసి అందరి కళ్ళు తెరిపించింది  అనీబిసెంట్  .  శ్రీ కృష్ణుని కుడి భాగం నుండి సత్వ ,రజస్ ,తమో గుణాలు  వాటి నుంచి అహంకారం ,పంచభూతాలు ,పంచ జ్ఞానాలు ఏర్పడ్డాయి. తరువాతా నారాయణుడు   జన్మించాడు .ఆయన ఎడమభాగం నుంచి లక్ష్మీదేవి పుట్టి భార్య అయింది ..కృష్ణుని ఎడమభాగం నుంచి ”సదాశివుడు ”అయిదు ముఖాలతో దిక్కులే వస్త్రాలుగా (దిగంబరం )సకల సిద్ధేశ్వరునిగా ,గురువుకే గురువుగా ఉద్భవించాడు ఆయన మృత్యుంజయుడు ,మృత్యు స్వరూపుడు ..నాభి నుంచి చతుర్ముఖ బ్రహ్మ కమండలం ,జపమాలతో పుట్టి  జీవుల ప్రాణదాత అయ్యాడు .శ్రీ కృష్ణ వక్షస్థలం నుంచి ”ధర్మ దేవత ” ఈయన ఎడమభాగం నుంచి ”మూర్తి ”పుట్టి ఆయన భార్య అయింది ..కృష్ణుని ముఖం నుంచి వీణా,పుస్తక ధారని సరస్వతి షోడశ వర్ష కన్యగా జన్మించి బ్రహ్మ భార్య అయింది .మనసునుంచి మహా లక్ష్మి  బుద్ధినుంచి ”మూలప్రకృతి -ఈశ్వరి ”జన్మించి వెయ్యి భుజాలతో దుర్గతి నాశిని దుర్గగా భాసించింది .ఈమె సర్వ శక్తులకు మూలం శ్రీ కృష్ణుని శక్తి స్వరూపమే దుర్గ .
  శ్రీ కృష్ణుని నాలుక చివర వేదమాత గాయత్రి జన్మించింది .మనసునుంచి మన్మధుడు ,అతని ఎడమభాగం నుంచి రతీదేవి పుట్టి భార్య అయింది .శ్రీ కృష్ణ వామభాగం నుంచి రాధ జన్మించింది .ఈమె కిశోర వయస్క .కృష్ణుని రోమాలనుంచి గోపాలుడు రాధ రోమాలనుంచి గోపికలు పుట్టారు .కృష్ణుని మనసునుంచి నారదుడు పుట్టి పుట్టగానే నారం అంటే నీటిని ఇచ్చాడు నారం అంటే జ్ఞానం కూడా .జ్ఞానప్రదాత నారదుడు ..బ్రహ్మ కంఠం నుంచి ”నరదులు ”అంటే మానవులు పుట్టారు .ఈ విధం గా అఖిల ప్రపంచాన్నీ సృష్టించి పాలించి ,తనలో లయం చేసుకొంటాడు శ్రీ కృష్ణ పర బ్రహ్మ . ఇంతటి అఖండ పరమానంద స్వరూపమైన శ్రీ కృష్ణుని మనసారా పూజించి గుణగానం చేసి ఎందరో మహాత్ములు పునీతులయ్యారు .
   చింతామణి అనే వేశ్య వలయం లో చిక్కిన బిల్వ మంగళుడు చివరికి తన తప్పు తెలుసుకొని సన్యాసియై ”లీలా శుక” నామం ;;తో ”శ్రీ కృష్ణ కర్ణామృతం ”రాసి ధన్యుడయ్యాడు .మనకు పరిచయమైన”కస్తూరీ తిలకం లలాట ఫలకె ”శ్లోకం అందులోనిదే .ఆయనే తిరువనంతపురం (త్రివేండ్రం )లో శ్రీ అనంత పద్మనాభ స్వామి దివ్య దర్శనం పొంది మొదటగా పూజించిన పుణ్యశాలి ,అనంత పద్మనాభునిలో త్రిమూర్త్యాత్మకం రూపం మూడు తెరలనుండి దర్శిస్తాం . శ్రీ కృష్ణుడు ద్వారక మునిగిపోయేటప్పుడు సోమనాధ్ లో ఒక అడవిలో నేలపై పడుకోగా ఆయన కాళ్ళను లేడికళ్ళు అని భ్రమించిన వేటగాడిబాణం తో ప్రాణాలు విడిచాడు . ఆ వేటగాడు పూర్వ జన్మలో వాలి .కృష్ణుడు తన భక్తుడు ఉద్ధవుడికి తన రూపాన్ని విగ్రహం గా చేసి ,మునిగిపోయే ద్వారకను వదిలి ఎక్కడైకైనా వెళ్ళిపోయి అనువైన చోట ప్రతిష్టించమని చెప్పాడు .ఆయన తిరిగి తిరిగి పరశురాముని సాయం తో శివుని అనుజ్ఞతో కేరళలోని ”గురువాయూర్ ”లో ఆ విగ్రహం ప్రతిష్టించాడు ..ఇది గొప్ప కృష్ణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది .ఇక్కడి నారాయణ భట్టు కవి ”నారాణీ యం ”రాశాడు

లీలాశుకుని శ్లోకం తో సమాప్తి చేస్తా –

హి గోపాలక హే  కృపా జలనిధే  హే  సింధు కన్యాపతే -హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే  మాధవ-హే  రామానుజ హే” జగత్రయ గురో ”హే పుండరీకాక్ష మామ్ -హే  గోపీ జననాధ పాలయ పరం జానామి న త్వామ్ పరం ”

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-16-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా


Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జాతీయ పతాక పిత పింగళి వెంకయ్య

clip
Posted in వార్తా పత్రికలో | Leave a comment

 సంసారంలో రిగమపదనిసలు 

సంసారంలో రిగమపదనిసలు

ఒక కాలనీలో ఆటగాళ్ల ,సంగీత వాద్యకారుల సంతానం నోచుకోని  భార్యలంతా చిన్న బోయిన ముఖాలతో ఆ కాలనీకి పెద్ద బాలమ్మగారి ఎదుట  ఒక రోజు సమావేశమై తమ సంసార గోడు వెళ్ళ  బుచ్చుకొని ఏదైనా సలహా చెప్పమని కోరారు .  .

 ముందుగా క్రికెట్ లో బౌలర్ భార్య ”బామ్మా !ఏం చెప్పను నా గోడు .ఆటలో వికెట్లు తీస్తాడుకాని మా అయన పెళ్లయి నాలుగేళ్లయినా ఇంట్లో ఇంతవరకు ఒక్క ”వికెట్ ”కూడా తీయలేదు ”అంది . వెంటనే బాట్స్ మన్ పెళ్ళాం ”నా బాధ ఏం చెప్పుకొను ? ఆటలో సెంచరీలపై సెంచరీలు చేస్తున్నాడు .మూడేళ్లయింది కాపరానికొచ్చి ఎప్పుడూ ”డకౌటే ”నా ఖర్మకాలి అని ముక్కు చీదుకొన్నది . వెంటనే వికెట్ కీపర్ భార్యఅందుకొని ”గ్రౌండ్ లో ఏ బాలూ మిస్ కాకుండా కాచ్ పడతాడు . ఒంట్లో బాల్స్ సంగతి పట్టించుకోడు నేనెవరికీ చెప్పుకోను ”?అంది బొటబొటా కన్నీళ్లు కారుస్తూ . అంపైర్  పెళ్ళాం రంగం లోకి దూకి ”ఫోర్ కి ,సిక్స్ కి వైడ్ కి  అవుట్ కి చేతులు చాపే  మాఆయన మంచం మీద మాత్రం చేతులు  చెప్పనే  చాపడు .ఇంకపిల్లలేం పుడతారు మామ్మా “‘అంది గోడు గోడు మంటూ .

  ఆటగాళ్ల పెళ్ళాల వంతు అయ్యాక వాద్య  కారుల  భార్యలు బాధా ఆరోణ అవరోహణాలు మొదలుపెట్టారు .ముందుగా  తబలా ఆయన భార్య ”సంగీతం అంటే పరిగెత్తుతాడు .మృదంగం రెండు కాళ్ళమధ్యా పెట్టుకొని ఎడా పెడా వాయిస్తూ, పాడేవాడికి చక్కని సహకారం అందిస్తాడు మాఆయన .కానీ సంసారం లో నేను సహకరిస్తున్నా దులభరిస్తూ  దూరం జరుగుతాడు .ఇక వాయింపుకేం నోచుకోను ”అని గోడుగోడుమంది . వయోలిన్ కళాకారుడి భార్య ”బామ్మా !తీగలు మీటటం లో ఉన్న ఆనందాన్ని తనువు  తీగ మీటటం లో చూపించటం లేదు .ఇక శ్రుతికలీసే దెప్పుడు  సంతానం కలిగేదేప్పుడే బామ్మో బామ్మ ”అని కన్నీరు కార్చింది . వెంటనే గాప్ లేకుండా వీణ ఆయన పెళ్ళాం అందుకొని ”కిందోబుర్ర ,పైనో బుర్రా ఉన్న తీగలపై టింగ్ టింగ్ మని గోళ్ళతో మీటు  తాడేకాని రెండు బుర్రలూ పక్కపక్కనే ఉన్నా తాకనైనా తాకేదే బామ్మా ఇక మీటుడు  సంగతే0 చెప్పను  .చెప్పుకొంటే సిగ్గుచేటు ”అని కన్నీరొలికించింది . .తర్వాత విరామం లేకుండా ఘటం –సారీ  ,సారీ  ఘటం వాయించే ఆయన పెళ్ళాం ”ప్రాణం లేని మట్టి కుండఒళ్ళో పెట్టుకొని .తలకాయ అటూ ఇటూ తిప్పుతూ సంగీతానికి తగినట్లు వాయించే మా ఆయన ,కళ్లెదుట సజీవ  బాండాలున్నా తకధిమి తో0 అనటంలేదు మామ్మో ”అన్నది .
  ”ఒసే పిల్లల్లారా !మీ బాధ విన్నాను .గుండె కరిగి పోతోందే .. నేను ఒక సలహా చెబుతా .పట్టు వదలకుండా సాధన చేయాలి ”అన్నది బామ్మ బాలమ్మ . ”చెప్పు బామ్మా -తూచా తప్పకుండా పాటిస్తాం ”అన్నారు అందరూ ఏక కంఠం తో .అయితే వినండి ”మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ మొగుళ్ళు చాలా మంచి వాళ్ళుగానే కనిపిస్తున్నారు .మీరూ ఇంకా మంచి వాళ్ళుగానే అనిపించారు .కానీ ఒత్తి వాజమ్మలు అనిపించింది నాకు . ఆట అవతలివాడు మొదలు పెట్టక పోతే మనమే ముందు మొదలు పెట్టాలి అంతే  కానీ నంగ నాచి  తుంగ బుర్రల్లాగా ఉంటె ఫలితం ఉండదు ”అన్నది . అప్పుడు అందులో ఒకావిడ ”బామ్మా !ఇందులో నీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటె చెప్పు .ప్రాక్టికల్ ఫిలాసఫీ మంచిదికదా ”అంది .దానికి బామ్మ ”నిజమేనర్రా .నేనే దీనికి ఉదాహరణ .మీభాషలోరోల్ మోడల్ అనుకోండి . మా ఆయన కుస్తీ ఫహిల్వాన్ .ఎప్పుడు ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా వెళ్లి పోయేవాడు అక్కడే తయారు తిండి తిని పోటీలో పాల్గొని గెలిఛీ ఓడీ వస్తూ ఇంటికొచ్చి గుర్రుపెట్టేవాడు .రెండేళ్లు ఓపికపట్టా . ఒక రోజు అనుకోకుండా మా బామ్మ వచ్చింది .ఆవిడ దగ్గర మీలాగానే నా బతుకు వెళ్ళ  బోసుకొన్నా .ఆవిడ తేలిగ్గా తీసుకొని ఉపాయం చెప్పింది .దాన్ని బెసగ కుండా  మా ఆయనపై ప్రయోగించా .ఏడాది తిరిగేటప్పటికీ కోడి రామమూర్తిలాంటి కొడుకు పుట్టాడు .ఆ కిటుకే ఇప్పుడు మీకు చెబుతా విని ఆచరించండి . మీ మొగుళ్ళు అటాక్ ఇవ్వకపోతే మీరే అడ్వాంస్ అవ్వాలి .నయానా భయానా కాలం దాటి పోయింది .ఇక వీర విజృంభణమే చెయ్యాలి మీరు . ఇంట్లో విజయం లేకపోతె బయటి విజయానికి సహకరించమని భీష్మించండి బెసఁగఁ నీయకండి . ఉడుం పట్టుపట్టండి . అనుకొన్నది సాధించండి మొహమాట పడద్దు . వాళ్ళ అభ్యంతరాలన్నీ తోసిపారేయండి . ముందుకు దూకండి .ఆతర్వాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు బోలెడు సినిమా సీరియళ్ల అనుభవాలున్నమీరు ఏడాది తిరిగే లోపు పండంటి బిడ్డలతో నాకు కనబడాలి .ఈ లోపు మీ మొహాలు కూడా నేను చూడను ”అన్నది .అందరికి బల్బ్ వెలిగింది .దూకుడుగా ఇళ్లకు వెళ్లిపోయారు బామ్మకు తాంక్స్ చెప్పి .
  సరిగ్గా ఏడాదికి మళ్ళీ వాళ్లంతా  చంకలో  పిల్లనో ,పిల్లాడినో ఎత్తుకొని బామ్మ తో సమావేశమయ్యారు .అందరి ముఖాలలో నవ్వు వరదలై ప్రవహిస్తోంది .అందరూ ముక్త కంఠం తో ”బామ్మా !నీకు  థాంక్స్ . నువ్వు చెప్పినట్లే చేసి పిల్లల్ని సాధించాం ”అన్నారుఆనందంగా . ‘ఒసే బానే ఉంది కానీ పిల్లలకు ఏం పేరు పెట్టారే ”అని అడిగింది .వాళ్ళు బామ్మ పేరుమీదుగా ఆడపిల్లకు బాలమ్మ అని మగపిల్లాడికి బాలయ్య అని పేరు పెట్టినట్లు ఉత్సాహంగా చెప్పారు  .పాపం ఇప్పుడు బాలమ్మబామ్మ కళ్ళ వెంట ఆనంద  బాష్పాలు  కారిపోయాయి .ఇందరు మనవాళ్ళు మనవరాండ్రను చూసే సరికి . వాళ్లందరికీ మర్నాడు భర్తలతో సహా తన ఇంట భోజనాలు ఏర్పాటు చేసి కడుపు నిండా తినిపించారు బాలమ్మ దంపతులు. పిల్లలందరికీ కొత్త చొక్కాలాగు లంగా లు కొని వాళ్లకు ఇచ్చి తొడిగించారు .  . వీళ్ళు ఊరుకుంటారా అందరూ ఆ దంపతులకు తమ శక్తికొద్దీ కొత్తబట్టలు పెట్టి ఆశీర్వాదం పొందారు
   శ్రీ కృష్ణాష్టమి, భారత 71 వ స్వాతంత్య్ర  దినోత్సవ శుభా కాంక్షలతో .

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-17 -కాంప్ -షార్లెట్-అమెరికా . 

— Image result for krishnam vande jagadgurum sri krishnaPakistan hoists biggest flag on border with India to mark independence day

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భారత స్వాతంతత్య్ర దినోత్సవం శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

50+ Adorable India Independence Day 2017 Wish Pictures And Images


Happy sri krishnashtami 2016 wishes in telugu latest whatsapp messages, greetings, below 10 MBGokulashtami
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పోతుకూచికి నివాళి

clip

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -20(-7-8-17నుండి 13-8-17 )వరకు -కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం

వీక్లీ అమెరికా -20-(7-8-17నుండి 13-8-17 )వరకు

-కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం

శీర్షిక కంఫ్యూజింగ్ గా ఉందా? కిందకి వస్తే అదే తేటతెల్లమవుతుంది .

-7-8-17 సోమవారం -అమెరికా వచ్చి నాలుగు నెలలయింది – మార్చి 30 న సీజన్ లో మామిడిపళ్ళు తినటం మొదలుపెట్టి ఈ రోజువరకు అంటే నాలుగునెలలపై 15 రోజులవరకు మామిడిపళ్ళు తింటూనే ఉన్నాం . మా జీవితం లో ఇంత లాంగెస్ట్ మామిడి సీజన్ ఇదే . మా అమ్మాయి పటేల్ బ్రదర్స్ లో పండ్లు కనబడటం ఆలస్యం కొని తెచ్చి తినిపిస్తోంది ..గీర్వాణం -3 లో 394 వరకు రాశా ..ఇవాళ శ్రావణ పౌర్ణమి జంధ్యాలపౌర్ణమి .నూతన యజ్నోపవీతం  ధరించాను

మంగళవారం -..మచిలీపట్నం హిందూకాలెజ్ హిస్టరీ హెడ్ శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఆధునిక ప్రపంచానిర్మాతలు కు ముందుమాట రాయమని కోరగా వెంటనే అంగీకరించటం వారికి ఫైల్ ను ఫార్వార్డ్ చేయటం జరిగిపోయింది అవధాన సరస్వతి .శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి గీర్వాణం -3 కు ముందుమాటరాయమని  మెయిల్ పెట్టిన వెంటనే జవాబు ఇస్తూ తప్పక రాస్తానని తెలియజేశారు . వారు ఆగస్టు 27 అమెరికావచ్చి సెప్టెంబర్ 27 మళ్ళీ ఇండియా చేరుతారు . కనుక ఆతర్వాత ఆపని చేస్తానంటే సరే అన్నాను .
  91 ఏళ్ళ శ్రీ పోతుకూచి సాంబశివరావు గారు మరణించిన వార్త చూశాను .ఆయన ఆంద్ర పత్రిక లేక ప్రభ వీక్లీ లో సీరియల్ గా  రాసిన ”ఏడు రోజుల మజిలీ ”నవల బాగా నచ్చింది .10 ఏళ్ళక్రితం ఒకసారి ఆయనకు ఫోన్ చేసి హైదరాబాద్ లో వారింటికి వెళ్లి ఒక అరగంట సేపు మాట్లాడాను .మంచి సంభాషణా చతురులు ఆయన .ఒక మాసపత్రిక కూడా నడిపేవారు .
 బుధవారం -గీర్వాణం -3 ను 410 వరకు లాగించా .
  గురువారం -”కస్తూరిసేవా పరిమళ వ్యాప్తి ”రెండుభాగాలు రాశా .ఇంద్రజ ,నారా రోహిత్ ,లవకుశ నాగరాజు ల ఇంటర్వ్యూలు చూశా .నాగరాజు తన స్నేహితుడు హైదరాబాద్ ఝాన్సినగర్ లో కట్టించిన శ్రీ షిరిడీ సాయిబాబామందిరం లో భార్యతో  సేవలో  ఉంటున్నాడట .ఇంద్రజ కూ  ఇద్దరుబాబాలు పూజనీయులేట .”గొట్టం” లో  నారా నటించిన రౌడీ ఫెలో చూశా కొల్లేరు సరస్సు ,ఆక్రమణపై కథ  బాగా చేశాడనిపించింది .
11-8-17 శుక్రవారం -వెంకయ్య 15 వ ఉపరాష్ట్ర పతిగా ప్రమాణ స్వికారం   చేశాడు .అఖిల భారతీయవిద్యార్థి పరిషత్ లో క్రియా శీలకం గా  పని చేసినవాడు అత్యున్నత పదవిని అలంకరించటం మనకు గర్వకారణం . అత్యున్నత పదవులలో ఈనాడున్న అత్యంత సామాన్యులు ప్రధాని మోడీ  ,రాష్ట్రపతి కోవింద్ ,ఉపరాష్ట్రపతి ఉషాపతి వెంకయ్య . స్పీకర్ సుమిత్రా మహాజన్ తో కూడా కలిపితే బిజె పి నాయకులు నలుగురు అత్యున్నత పీఠాలపై ఉండటం ఆపార్టీకి గర్వకారణం  మోడీ ,షా ల చాకచక్యం .చాణక్యం
  సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు శ్రీ కోట గురుదేవుల గురు పూజోత్సవ కార్యక్రమం తయారు చేసిపంపాను. కస్తూరి 3,4 రాశా .
                 అరంగేట్రం
12-8-17 శనివారం – కస్తూరి 5 రాసి ముగించా .
  ఇక్కడ మా కమ్యూనిటీ లోనే ఉన్న గుజరాతీ దంపతులు ప్రేరా ,అనుపమ పటేల్ లకుమార్తె కుమారి త్విషా పటేల్ భరతనాట్యం శ్రీమతి రాధికా ఉన్నితన్ వద్ద నేర్చి ఈ రోజు హాల్టన్  ధియేటర్ లో అరంగేట్రం చేసింది .అందరం వెళ్లాం 4-45 కు బయల్దేరి చూడటానికి  .సరిగ్గా 5గంటలకు ప్రారంభమైనది . షణ్ముఖ ప్రియ రాగం లో గణేశఅంజలి ముందుగా చేసింది .తర్వాత నాటరాగం లో అలరిపు (అలరింపు ),రసాళిరాగం లో జతిస్వరం ,రాగమాలికలో శబ్దం, ధన్యాసిరాగం లో వర్ణం లను కృతులు కీ ర్తనలకు తగినట్లుఒక గంట సేపు  అభినయించింది .
  తర్వాత ఒక 20 నిమిషాలు విశ్రాంతి-అందరికి సమోసా మాంగో జ్యుస్ , టీ  ఇచ్చారు .
  విరామానంతరం  హిందోళ  రాగంలో మైసూర్ వాసుదేవాచార్య కృతి”మామవతు”  సరస్వతీ దేవీ స్తుతి ,తర్వాత శివ తాండవానికి శివా అంటే పార్వతీదేవి చేసే ”లాస్యం ” చివరగా తిల్లాన కు నాట్యం చేసి , ఆతర్వాత  తండ్రికోసం గుజరాతీ పాటకు, తల్లికోసం హిందీ పాటకు నృత్యాభినయం, చేసి చివరకు నా ట రాగం లో మంగళం లో దేవుడికి గురువుకు ప్రేక్షక దేవుళ్ళకు విన యాంజలి ఘటించి  ఒక గంటలో ముగించింది .గురువు శ్రీమతి రాధికగారు నట్టువాంగం చేస్తూ ప్రోత్సహించింది . హావ భావాలు బాగానే ఉన్నాయి .కానీ ప్రతి అంశం  7లేక 8 నిమిషాలకంటే లేకపోవటం ,ఏదో చేసేసి వెళ్ళిపోదాం అన్నట్లు చేయటం గా నాకు అనిపించింది.  భరతనాట్యం పధ్ధతి ఇంతేనేమో నాకు తెలియదు   తర్వాత అందరికి డిన్నర్ . రోటీ ,రెండునాకుకూరల పులుసులు సువీత్ ,పులిహోర ,బిర్యానీలాంటిది ,అప్పడం .కావాల్సినవాళ్లకు కోకాకోలా .  రోటీ ఒకటిన్నరముక్క స్వీట్ అప్పడం తో లాగించా అంతే .      .
  ఇంతకు ముందు మేము చూసిన కుమారి రచిత కూచిపూడి రంగ ప్రవేశమే  నాకు బాగా నచ్చిందేమో అనిపించింది . మనకు నచ్చటం నచ్చకపోవడం అటుంచి ఇంగ్లిష్ లో చదువుతూ ,క్షణం ఖాళీ లేని విద్యా జీవితం గడుపుతూ ఇ0త  ఉత్సాహంగా అంకితభావం తో తమదికాని భాషలో ,తమభాష కాని  గురువువద్ద క్రమశిక్షణతో నృత్యం నేర్వటం ఆ చిన్నారుల పట్టుదల క్రమశిక్షణ ,అకుంఠిత దీక్ష కు జోహార్లు .మన సంస్కృతిని ఇక్కడ ఇంత గొప్పగా ప్రదర్శిస్తూ మన్ననలు అందుకోవటం సామాన్యమైన విషయంకాదు .ఆ పిల్లల తలిదండ్రులకున్న అభిరుచి గురువుపై నమ్మకం , ఎన్నో వేలడాలర్లు ఖర్చుపెట్టి నేర్పించటం ,రంగప్రవేశ అరంగేట్రాలకు కూడా సంకోచంలేకుండా డబ్బు ఖర్చు చేయటం చూస్తుంటే వీరందరికి ఉన్న ఉత్తమాభి రుచికి మనస్ఫూర్తిగా తప్పక అభినందనలు తెలియ జేయాల్సిందే . మేరా  భారత్ మహాన్ .
  13-8-17 ఆదివారం -ప్రొద్దున ,మధ్యాహ్నం ”శంకరాభరణం పాలెస్ ”కిట్టుగాడున్నా డు జాగ్రత్త” యు ట్యూబ్ లో చూశా . సరదాగా ఉన్నాయి . రమణ ఫోన్ చేసి ఉయ్యూరులో సేవింగ్స్ ఏజెంట్  మండా  ప్రసాద్ భార్య శ్రీమతి పావని చనిపోయినట్లు తెలిపాడు.పాపం ఆమె రెండేళ్లనుంచి కేన్సర్ తో బాధ పడుతోంది . వైద్య లోపం ఏమీలేదు .ఖరీదైన వైద్యమే చేయించారు . నేను మార్చి చివర్లో ఆమెకు రీకరింగ్ డిపాజిట్ కట్టాను కూడా ..అలాగే ఈవారం లోనే మా పెద్దకోడలు అమ్మక్కయ్యగారు శ్రీమతి భవానిగారు కూడా చనిపోయినట్లు తెలిసింది  .ఈ ఇద్దరి ఆత్మలకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను . ఆకుటుంబాలకు మా సానుభూతి తెలియ జేస్తున్నాను
  వాగ్గేయకారుడు మైసూర్ వాసుదేవాచార్య సంస్కృతం లో కృతులు రాశాడని తెలుసుకొని గీర్వాణం 3 లో 411 వ కవిగా ఇప్పుడే ఆయన గురించి రాశాను.. ఈ వీక్లీ సమాప్తం .
   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-17-కాంప్-షార్లెట్-అమెరికా


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961)

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3

311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961)

28-5-1865 న కర్ణాటకలో లోమధ్వ  బ్రాహ్మణకుటుంబం లో జన్మించిన సుప్రసిద్ధ కర్ణాటకసంగీత  విద్వా0సుడు ,త్యాగరాజస్వామి శిష్యుడు మైసూర్ వసుదేవాచార్య పద్మ భూషణ పురస్కార గ్రహీత . మైసూర్ మహారాజా ఆస్థాన వైణిక విద్వా0సుడు వీణ పద్మనాభయ్య వద్ద సంగీతం అభ్యసించాడు .సంస్కృతం వ్యాకరణ కావ్య అలంకార ,తర్క పురాణ ,ఇతిహాసాదులను మహారాజా సంస్కృత  కళాశాలలో విడిగా సంగీతం నేర్చుకొంటూనే  అభ్యసించాడు . మహారాజూ అందజేసిన పారితోషికం తో ప్రసిధ్ధ సంగీత విద్వా0సుడు పట్నం సుబ్రహ్మణ్య పిళ్ళై దగ్గర ,కావేరి డెల్టా లోని అనేక ప్రసిద్ధ సంగీత విద్వా 0సులవద్ద సంగీతపు లోతులు తరచి తెలుసుకొన్నాడు  .

 వాసుదేవాచార్య సంగీత విద్వత్తుని గుర్తించిన మహారాజు ఆస్థాన సంగీత విద్వా0సుని చేసి గౌరవించాడు . గురువు వద్ద నేర్చిన మాధ్యమకాల తానం లో మహా నిష్ణాతుడయ్యాడు .గురువు పట్నం ,శిష్యుడు మైసూర్ ను కీర్తనల రచనల విషయం లో  సలహాలు తీసుకునేవాడు. ఇది శిష్యుడికి బాగా ఉపయోగపడి వాగ్గేయకారుడవటానికి తోడ్పడింది . వాసుదేవాచార్య కర్ణాటక సంగీతం లోని రాగం ,తానం ,ఆలాపన ,పల్లవి  ,కల్పనస్వరాలలో సాటిలేనివాడయ్యాడు

 వాసుదేవాచార్య తాను  రచించిన సంస్కృత ,తెలుగు కృతులు 200 లను ‘’వాసుదేవ కృతి మంజరి ‘’గా ప్రచురించాడు .ఈ రెండుభాషలలో ఆయనరాసినవి సుమధురంగా  భాషా పరిజ్ఞానంతో భాసిస్తాయి .తెలుగు  హృదయం లోకి ప్రవేశించటం త్యాగరాజ గురు భిక్ష అని వినయంగా చెప్పుకొనేవాడు .ఇతర దాస కూట ద్వైత గీతాలలాగా కాకుండా ఈయన గీతాలు  ‘’పరమపురుష వాసుదేవ ‘’లేక ‘’వాసు దేవ’’అనే విష్ణు నామం తో విరాజిల్లటం విశేషం . అదే ఆయన ‘’ముద్ర ‘’కూడా .త్యాగరాజ శిష్యపరంపర లోని వారిలాగే ఈయనా శ్రీ రామునిపైనే ఎక్కువ కృతులు ,కీర్తనలు  రాశాడు.వర్ణాలు ,తిల్లాన శ్లోకాలు కూడా రాశాడు .కర్ణాటక సంగీత త్రిమూర్తులలో అద్వితీయుడైన త్యాగ బ్రహ్మం గారిని కళ్యాణిరాగ కీర్తనలో ‘’శ్రీ మదాది త్యాగరాజ గురువారం ‘’అంటూ స్తుతించాడు .ఒక రాగమాలికలో శ్రీరామ చంద్రుని మరి రెండు రాగమాలికలో ముత్తుస్వామి దీక్షితులు ,శ్యామశాస్త్రి ని కీర్తించాడు .వాసుదేవాచార్య కృతులు చక్కర పాకం లాగా మధు మధురంగా ఉండటం విశేషం .

 కన్నడం లో తన జీవిత చరిత్ర ‘’నేనపు గలు ‘’(జ్జ్ఞాపకాలు )పుస్తకం ,తనకు తెలిసిన సంగీత విద్వా 0సుల జీవిత చరిత్రలను ‘’నా కంద కలవిదరు ‘’గ్రంథం గా రాశాడు .వృద్ధాప్యం పైనబడినా శ్రీమతి రుక్మిణీదేవి అభ్యర్థనపై ఆమె కళాక్షేత్రం లో ముఖ్య సంగీత విద్వా 0సుడిగా సంగీతం బోధించాడు .సంస్కృత రామాయణానికి సంగీతం కూర్చాడు. ఆయన మరణం తర్వాత మనవడు రాజారామ్ బాధ్యతలు తీసుకొని తాతగారు మొదటినాలుగుకాండలకు సంగీతం కూర్చితే మిగిలినవాటికి సమకూర్చాడు . మరోమనవడు కృష్ణ మూర్తి ఆకాశవాణిలో పనిచేస్తూ తాతగారు రాసిన స్మృతులను ఆంగ్లం లోకి అనువదించాడు . వాసుదేవాచార్య  సంగీత విద్వత్తుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ పురస్కారం అందించి గౌరవించింది . కమాస్ రాగం లో ‘’బ్రోచే వారెవరురా ‘’,సునాద వినోదిని రాగం లో ‘’’దేవాధిదేవ ‘’,హిందోళం లో ’మామవతు సరస్వతీ’’,అభేరీరాగం లో ‘’భజరే రే మానస ‘’అనే ఆయన కృతులు  ఆనంద పులకితు లను చేస్తాయి  .ఆయన భాషా పాండిత్యానికి కైమోడ్పులు సమర్పించేట్లు చేస్తాయి .  96 ఏళ్ళ నిండు జీవనం గడిపిన ఆ సంగీత సాహిత్య సరస్వతి మైసూర్ వసుదేవాచార్య 17-5-1961న తానునమ్మిన వాసుదేవ పదం చేరుకొన్నాడు .

సంస్కృతం లో మైసూర్ వాసుదేవాచార్య కీర్తన సొబగులు చూద్దాం –

1-గంభీర నాట రాగం లో -’’గిరిజా రమణా నటరాజ న శరణ -కరుణారస పూర్ణ స్మరహర నాగాభరణా-

పరవాసుదేవ రధనా ధురీణ కార ధృత హరిణా కలిమల హరణా -మహా పంచాక్షరీ మంత్ర మూర్తే మహాభక్త కౌంతేయ నుత కీర్తే

మహాగణపతి గుహ సేవిత మూర్తే -మహాదేవ  పరిహృత దీనజన ఆర్తే -మహానంది భృంగాది నాట్య ప్రదర్శక కైలాసపతే ‘’.

2-అభేరీరాగం లో -’’గోకుల నిలయ ‘’

3-హిందోళయం లో -’’మామవతు సరస్వతీ ‘’

4-గౌరీమనోహరిరాగం లో -’’వరలక్ష్మి నమోస్తుతే ‘’

5-బిళహరి రాగం లో -శ్రీ చాముండేశ్వరి

6-గరుడ ధ్వని రాగం లో -దేవి కమలాలయే   మొదలైనవి .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

— mysore vasudevacharya 1865 1961 mysore vasudevacharya was a great ...

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )

గోపాలస్వామి మరీ బలవంతం చేస్తే కస్తూరి రేడియో స్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు .. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం . శత్రు సైన్యం మలేషియా దాకా దూసుకు  వచ్చింది ..కనుక ప్రతి వార్తా చాలా జాగ్రత్తగా ప్రసారం చేయాలి . ఇంటి దగ్గర దీనికోసం చాలా చదవాల్సి వచ్చేది . ఢిల్లీ వార్తలు విని అందులోని ముఖ్య విషయాలను కన్నడం లోకిమార్చి చేతితోరాసి ఒక విద్యార్థి చేతికిచ్చి సైకిల్ పై స్టేషన్ కు పంపేవాడు . అక్కడ చదివేవారు ..కావేరి డాం చూడటానికి బృందావన్ గార్డెన్స్ కు జనరల్ వావెల్ వచ్చాడు .ఈవార్తను చదివే అనౌన్సర్ ‘’శ్రోతృగళ్ ‘’అనటానికి బదులు ‘’శతృగళ్ ‘’అని తప్పుగా చదివాడు …దీనికి కస్తూరి పర్యవేక్షణ సరిగా లేదని నెపం వేశారు . 1942 ఆగస్టు 9 ఉదయం ఇంగ్లిష్ న్యూస్  బులెటిన్ కస్తూరి విన్నాడు .అది గాంధీగారి అరెస్ట్ వార్త.వెంటనే కన్నడా నువాదం చేసి సైకిల్ కుర్రాడికిచ్చి స్టేషన్  కు పంపాడు . ఈ వార్తలు విన్న జనం అప్పటికే బజార్లలోకి వచ్చి ముర్దాబాద్  నినాదాలు  ఇచ్చారు .కంగారుపడ్డాడు కస్తూరి . తాను  విన్న ఇంగ్లిష్ న్యూస్ కరెక్టేనా అని అనుమానమొచ్చింది .ఇంతలో మరాఠీ న్యూస్ లో కూడా గాంధీగారి అరెస్ట్ వార్త రావటం తో ఊపిరిపీల్చుకున్నాడు  .అంతగా అప్డేట్ గా ఉండేవాడు . ఇలాంటి టెన్షన్ లు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది .

  వార్తా బులెటిన్ ల క్వాలిటీ పెంపు కోసం మిగిలిన విషయాల కోసం తలలు పట్టుకోవాల్సివచ్చింది ..గోపాలస్వామి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాడు .ఇందులో ఆయన స్వార్ధమూ ఉంది .కస్తూరితో సంప్రదించేవాడు సలహాలు తీసుకొని అమలు చేసేవాడు ..సమాజం లో బిగ్ బిగ్ లగురించి రాసి ప్రసారం చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకొంటారో అని కంగారుఆడేవాడు స్వామి .ఒక సారి ‘’ఫెయిరీ టేల్ ఆఫ్ సిండరెల్లా ‘’ప్రసారం చేస్తుంటే అరిస్టోక్రాట్ ల మనోభావాలకు దెబ్బతగులుతుందేమో నని బాధ పడ్డాడు కూడా …దసరా ఉత్సవాల సందర్భం గా ప్రతి రోజు ఉదయం ప్రసారం చేయటానికి 9 రోజుల సంగీత కార్యక్రమం బాగా ప్రచారం చేసి మంచి రిహార్సల్స్ తో నిర్దుష్టంగా సిద్ధం చేశాడు కస్తూరి .   నాలుగు రోజుల ప్రసార0 అవగానే ప్రజాస్పందన అద్భుతం అని తెలిసింది .ఐదవరోజు అమ్మవారిపేరు తన భార్య పేరు ఒకటే అయిందని ఒక వి ఐ పి వ్యతిరేకించాడని స్వామి చెప్పాడు .మిగిలిన రోజు ల కార్యక్రమాలను కాన్సిల్ చేయమని ఒత్తిడి చేశాడు .తిరస్కరించి ప్రసారం చేయాలనే నిర్ణయించాడు కస్తూరి .దీనితో అహం దెబ్బతిన్న డైరెక్టర్ స్వామి కస్తూరిస్థానం లో మరొకరిని నియమిస్తున్నానని చెప్పాడు .ఇలా   అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ పదవి ఊడి మళ్ళీ యుని వర్సిటీ లెక్చరర్ గా చేరాడు ..శ్రోతల నుండి అనూహ్యమైన మద్దతు కస్తూరికి లభించింది . దీన్ని ఓర్వలేక పోయాడు డైరెక్టర్ ..కోపం తీరక మలేరియా విస్తృతంగా ఉన్న ,200 మైళ్ళ దూరంలో ఉన్న షిమోగాలోని ఇంటర్ కాలేజీకి కస్తూరి ని తన్నాడు ..ఆ ప్రాంతం లో ఉద్యోగులకు ప్రతినెలా మలేరియా చికిత్సకోసం జీతం తోపాటు ఒక నెలజీతం ఎక్ట్రా గ్గా  ఇస్తారు .

 కస్తూరి అనే ఫుట్ బాల్ మైసూర్ నుంచి తన్నబడి షిమోగాకు చేరింది .ఇదీ మంచిదేనని పించింది అక్కడి ప్రజల భాష సంస్కృతుల అధ్యయనం చేశాడు .ఇక్కడున్న రెండేళ్ళూ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు యధా ప్రకారం నిర్వహించాడు .వసంతోత్సవాలు జరిపాడు .షిమోగా బాగా ఎత్తైన ప్రదేశం.  విపరీతమైన వర్షాలు పడతాయి .రుతుపవన వర్షాలతో కావేరితుంగభద్ర నదులు పొంగి ప్రవహిస్తాయి .కొండలన్నీ పచ్చ తివాచీ పరచినట్లు ఆహ్లాదంగా కనిపిస్తాయి . నిప్పు సెగలవద్ద ప్రజలు  వెచ్చ దనాన్ని అనుభవిస్తారు . యువ కవి పరమేశ్వరభట్ ,షిమోగా  కర్ణాటక సంఘ కన్వీనర్ విష్ణుభట్ ,కస్తూరి అనే’’ బ్రహ్మ భట్ ‘’బ్రహ్మ విష్ణు పరమేశ్వర త్రిమూర్తులై షిల్లాంగ్ లో ఇది వరకు ఎప్పుడూ ఎవ్వరూ చేయని ‘’వర్షాగమ మహోత్సవం ‘’జరిపారు .దీనికి గుర్తింపు వచ్చి ఆ తేదీని కర్ణాటక లోని షిమోగా కాలెండర్ లో చేర్చి సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది .అదీ వర్షం లోనూ  మట్టివాసనలతోకలిసి సాగిన కస్తూరి పరిమళం .

 మరో విషయం లోనూ కస్తూరి షిమోగాలో విజయం సాధించాడు . ఆశువు (ఇం ప్రాం టు )నాటకాల పోటీ ఔత్సాహిక యువ నాటక నటీ నటులకు  కోసం నిర్వహించాలని ఆలోచించాడు . ఒక గంట ముందుమాత్రమే అయిదు విషయాలు ,సందర్భాలు ఇచ్చి అందులో ఏదో ఒకదానిపై  తయారవటానికి  ఆ గంట ఉపయోగించుకొని ముప్పావు గంట నాటకం వాళ్ళు ఆశువుగా ఆడాలి .వీటిలో గెల్చిన వారికి బహుమతులు ఇస్తారు ..గ్రామీణాభి వృద్ధి కార్యక్రమం లో ఇలాంటివాటిపై బాగా అనుభవం ఉండటం వలన కస్తూరి దీన్ని హాయిగా నిర్వహించాడు .ఈ ఐడియా బాగా క్లిక్ అయి యువజనం లో ఉత్సాహం ఉరకలు వేసి పాల్గొని బహుమతులు పొందారు . మరొక పోటీ ‘’జోక్ క్రాకర్స్ డే ‘’’(నవ్వుల టపాసుల రోజు )ని దీపావళినాడు జరిపాడు . దీనికి కస్తూరి ‘’హాస్య చటాకి ‘’అనే చక్కనిఅర్ధవంతమైన  కన్నడ పేరు పెట్టాడు .. టపాకాయల కోసం డబ్బు తగలేసి కాల్చిపారేయకుండా ఈ హాస్య టపాకాయలు పేలుస్తూ హాయిగా ఆనంద0 అనుభవించాలని కస్తూరి ఆలోచన . ఇదీ ఘన విజయమే సాధించింది . హాస్య కదంబానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ప్రొఫెసర్ ,ఒక డాక్టర్ ,,ఒక లాయర్ ,ఒక వ్యాపారి ,,ఒక బిల్ కలెక్టర్ ,ఒక రైతు లను ఆహ్వానించి వారికి పదేసి నిముషాల టైం ఇచ్చివాళ్లతో జో కులు హాస్య విషయాలు చెప్పించేవాడు .ఇది దీపావళికంటే పెద్ద శబ్దం తో పేలి ,నవ్వుల తారాజువ్వలు హాస్యపు మతాబులు , చెణుకుల కాకర పువ్వొత్తులు ,రిపార్టీల ఆటంబాంబులు తో ఆనంద హాస్యానంద దీపావళి అయి మానసిక సంతోషాన్నిచ్చింది .. ఇది కర్ణాటక అంతా పాకి మెట్రోలలోనూ ప్రవేశించి నవ్వుల దీపావళిగా మారిపోయింది .కన్నడ లిటరరీ అకాడెమి దీన్ని ఘనంగా నిర్వహించటం ప్రారంభించింది .కస్తూరిహాస్య  ప్రయత్నం గంధకం వాసనతో మరింత పరిమళించింది . 1946 లో కస్తూరి  బెంగుళూర్ లోని ఇంటర్ కాలేజీకి బదిలీ అయి కాన్స్టి ట్యూషనల్ అండ్ సోషల్ హిస్టరీ ఆఫ్ బ్రిటన్  సబ్జెక్ట్ ను సెంట్రల్ కాలేజీ  ఇంగ్లిష్ లిటరేచర్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థులకు బోధించాడు .మైసూర్ లోని ఇల్లు అమ్మేసి బెంగుళూర్ లో కొన్నాడు .మైసూర్ కాలేజీకి ,కొరవంజి ,శంకర్ వీక్లీ లకు స్వస్తి పలికాడు కస్తూరి ..

 సమాప్తం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా



Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణాష్టమి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో 14-8-17  సోమవారం రాత్రి 7 గంటలకు సరసభారతి ఆధ్వర్యం లో బాలబాలికలకు శ్రీ కృష్ణ ,రాధా ,గోపిక వేష ధారణపోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయబడును . ఉత్సాహ వంతులైన తలిదండ్రులను తమ పిల్లలను దీనిలో పాల్గొనేట్లు చేయవలసినదిగా కోరుతున్నాము . కార్యక్రమాన్ని సరసభారతి కోశాధికారి శ్రీ గబ్బిట వెంకటరమణ ,కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి,అర్చకస్వామి శ్రీ వేదాంతం మురళీ కృష్ణ నిర్వహిస్తారు .
                                                         గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
                                                       మరియు ఆలయ ధర్మకర్త

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4

1940 జనాభా లెక్కల సేకరణ (సెన్సస్ )కు కస్తూరి  మిత్రుడు కృష్ణ మూర్తి ‘’ఆదికర్ణాటక పురం ‘’ను ఎన్నుకొన్నారు . 12 మంది యువకులను కార్యకర్తలుగా తీసుకొన్నారు .అందులో ఒకడు బ్రాహ్మణ యువకుడు .అతడు’’ ఆ మాల మాదిగ వాటిక ‘’కు రానని భీష్మించాడు .. అతని భయం ,అనుమానం పోగొట్టటానికి కస్తూరి అతనిని ముందుగా అక్కడి హరిజనుల శ్రీ రామ దేవాలయానికి తీసుకు వెళ్ళాడు . అక్కడి హరిజనులు గుండె నిండుగా హరిభక్తి తో చేస్తున్న రామభజన చూసి ఆశ్చర్యపోయాడు .వారికి  హిందూ ధర్మం పై ఉన్న నమ్మక విశ్వసాలకు భక్తికి అతడికళ్లవెంట ఆనంద బాష్పవాలు ధారాపాతంగా కారిపోయాయి . .సెన్సస్ పూర్తిఅయినతర్వాత తన బాచ్ వారికి హరిజనవాడలో నే కస్తూరి విందు ఏర్పాటు చేశాడు .ఆ బ్రాహ్మణ కుర్రాడు ఆనందంగా వారితోపాటు కూర్చుని హాయిగా భోజనం చేశాడు .చివరికి కస్తూరితో ‘’సార్ !ఈ చిన్నవాడిని మీరు ఓడించేశారుసార్ ‘’అన్నాడు కృతజ్ఞతగా ..

 గ్రామీణ సేవా కార్యక్రమ నిర్వాహకుడుగా కస్తూరి తనబృందం తో యూనియన్ తరఫున ప్రతి శనివారం పూర్తిగా ఒక రోజు ప్రోగ్రామ్ మైసూర్ పడమటి భాగం లోని కూర్గ్ హళ్లి గ్రామం లో లో నిర్వహించాడు .బస్సులో   ఆ వూరు వెళ్లి అక్కడి పిల్లలను ఒక చోటికి చేర్చి ఆటలాడించి కథలు చెప్పేవాడు .ఇద్దరు ముగ్గురుకలిసి ఆ పిల్లల ఇళ్లకు వెళ్లి మామూలుగా మాట్లాడుతూ వాళ్ళ ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకొంటూ ఉండేవారు .డాక్టర్లను తమతోపాటు తీసుకు వెళ్లి వారిజబ్బులను పరీక్షింపజేసి మందులు ఉచితంగా ఇచ్చేవారు . వారి వినోదం కోసం నాటకాలుఆడే వారు . ఆధ్యాత్మిక గ్రంథాలు  ఉత్తమ వ్యక్తుల జీవిత గాథలు గ్రామం లోని స్త్రీ పురుషులకు చదివి వినిపించేవారు . కూర్గ్ హళ్లి ప్రజలను బాచీలు బాచీలుగా మైసూర్ తీసుకువెళ్లి మైసూర్ మహారాజు అంతఃపురం  రాయల్ కాటిల్ ఫారం ,రేడియో స్టేషన్ కాలేజ్ క్వాడ్రాంగిల్ మొదలైనవి చూపించేవారు .ఇవన్నీ వారి జీవిత లో ఎప్పుడూ చూడనివి చూడలేనివికూడా ..కస్తూరి బృందం వారికి ఆత్మీయ మిత్రులు సోదరులైపోయారు .వార0దరికి వీరిపై గొప్ప విశ్వాసమేర్పడి స్నేహితులనిపించారు . ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటే ఇదే .. ఇన్ని పనుల్లో మునిగిఉన్నా కస్తూరికి ‘’దక్షిణేశ్వర్ ‘’సందర్శన మనసులో మెదులుతూనే ఉంది . ,ఆటగాళ్ల కాళ్ల మధ్య అటూ ఇటూ తన్నులు తింటూ లక్ష్యం కోసం  గాలికొట్టిన ఫుట్ బాల్  తాను అని అనుకునేవాడు  .

 యుని వర్సిటీ మేగజైన్ లో సరదా కబుర్లుకన్నడం లో  రాసేవాడు కస్తూరి . మాండ్యా  కు చెందిన యువకుడొకడు వీటిని సేకరించి ‘’యద్వా -తద్వా ‘’సంపుటిగా డబ్బు ఖర్చుపెట్టి ముద్రించాడు ..ముఖ చిత్రం లో ఒక రైలు పట్టాలుతప్పినా, పొగ వదులుకొంటూ ముందుకు కదిలే బొమ్మ వేయించి ,పుస్తకం లోపలి తనభావాలు’’ pricking bubbles ,pulling legs ,drawing carpets ,from under feet ,minimising mountains into mole-hills ,holding mirrors to the face ,explosing clay feet ,buldozing castles built in the air ,letting lying ‘’dogs ‘’ snore and forcing sleeping ‘’dogs ‘’bark this was the hobby I loved ‘’అని చెప్పుకొన్నాడుకస్తూరి .. కస్తూరిరాసిన కన్నడ పుస్తకాలు ‘’అల్లోలకల్లోల’’,ఉపాయ వేదాంత ,అంకు మంకు ,నవలలు గాలిగోపురం ,శ0ఖ వాద్యం ‘’,గృహ’’దారణ్యకం ,రంగ నాయకి ,చారిత్రిక రచనలు ,చెంగోళి చెలువ అనే గుమాస్తా జీవితం లోని కన్నీళ్లు ఆనందపు వేణ్ణీళ్ళు .ప్రతిపేరాలో సస్పెన్స్ ,నవ్వాలా ఏడవాలా ,చావాలా బతకాలా అనే సందిగ్ధం .ఇవికాక ‘’అనర్ధ కోశం ‘’అనే ఫిక్షన్ లో పాతమాటలకు కొత్తపదాలు సమకాలీనమైన సరికొత్తపదాల సృష్టి ,పాత సామెతలకు కొత్త రూపాలు తో దీన్ని సమృద్ధం చేశాడు .యూనివర్సిటీ ఫాకల్టీ స్టేటస్ నుపయోగించి కన్నడం లో ‘’అశోక చక్రవర్తి, ‘’సోషల్ ఆంత్రోపాలజీ ,కన్నడం లో ‘’వివాహ వ్యవస్థ ‘’లను మోనోగ్రాఫ్ లుగా రాసి ప్రచురించాడు .ఇంగ్లిష్ లో రీసెర్చ్ పేపర్ గా ‘’కేరళ ఇన్ కర్ణాటక ‘’’’లాస్ట్ రాజాస్ ఆఫ్ కూర్గ్ ‘’రాశాడు .వీటన్నిటిలో కస్తూరి పరిశోధక సృజన పరిమళం వ్యాపించింది ..

‘’కొరవంజి ‘’అనే హాస్య మాస పత్రిక సంపాదకుడు   డా.శివరాం అనే హాస్య రచయిత పరిచయమయ్యాడు .కొరవంజి అంటే పల్లెలలో సోది చెప్పే అమ్మాయి అని అర్ధం . కస్తూరిని తన పత్రికలో రాయమని కోరుతూ ‘’your sense of humour is the golden mean -it can hit without hurting ‘’అని ఆహ్వానించాడు . అంగీకరించి కస్తూరి  10 ఏళ్ళు తన రచనలతో కొరవంజి కి పులకింతలు కలిగించి గిలిగింతలు పెట్టాడు .హాస్య ‘’అపరంజి ‘’ని చేశాడు . ప్రతినెలా పత్రికలో సగం పైగా పేజీలు ‘’కస్తూరి ‘’గుబాళింపు తో ఉండేవి.  .కస్తూరి దీనిలో ‘’రుద్రమ్మ ‘ పాటలి,నాకా ,తారక మొదలైన  ’కలం పేరుతోరాసేవాడు . .ఈ మేగజైన్ లో ఆర్ కె  లక్ష్మణ్  కార్టూన్లు గీసేవాడు .నాదిగ్ అనే మరో కార్టూనిస్ట్ కూడా వేసేవాడు .

 .శంకర్ అనే హాస్య రచయితపూర్తిగా హాస్యం తో తనపేర’’శంకర్స్ వీక్లీ ‘’తె స్తున్నాడని  దాన్ని ప్రధాని నెహ్రు ఆవిష్కరిస్తున్నాడని తెలిసి అందులో తాను ‘’చారివారియా ‘’పద్ధతిలో పంచ్ రాస్తానననీ తెలియజేసి కావాలంటే సాంపిల్ గా  కొన్ని పంపగలనని రాశాడు  కస్తూరి . దానికి శంకర్ జవాబిస్తూ దాన్ని సంపాదక వర్గమే నిర్వహిస్తుందని  కనుక అవకాశం ఉండకపోవచ్చునని తెలియజేస్తే ‘’కొరవి0జి ‘’లో తాను  కన్నడం లో రాసిన ‘’ఊరిగలు ‘’లాంటివి రాసిపంపాడు .శంకర్స్ వీక్లీ విడుదలై మొదటిసంచిక ను శంకర్  పోస్టులో పంపాడు.  అందులో ఒకే పేజీలో ఒకదానికింద ఒకటిగా ‘’ మియర్ ప్రాటిల్ ‘’(కేవలం తడబాటు )శీర్షికలో కస్తూరి రచనలు కనిపించి ఆశ్చర్యం కలిగించాయి . అప్పటినుంచి ఏడేళ్లు శంకర్స్ వీక్లీ లో ప్రతివారం మూడవ పేజీలో  శంకర్ వేసిన కార్టూన్ క్రింద కస్తూరి హాస్యం చెమక్కులూ గుబాళించాయి . కస్తూరి ఎక్కడున్నా దాని సుగంధం వ్యాపిస్తుంది ,మురిపిస్తుంది .

  మహారాజాకాలేజి సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గోపాలస్వామి కస్తూరి చేసే బహువిధ కార్యక్రమాలను దగ్గరగా గమనిస్తూ ప్రిన్సిపాల్ జె సి రోల్లో వార్షికోత్సవం నాడు కస్తూరిని ప్రశంసించటం వేదికమీదనే ఉన్న ఆయన చూసి కస్తూరిని ‘’కామెల్  ఆఫ్ ది కాలేజ్ ‘’ (కాలేజీ ఒంటె )అన్నాడు .అంటే అంతబరువు కస్తూరి మోస్తున్నాడని అర్ధం .ఎన్నిబాధ్యతలు తలకు ఎత్తినా కాదు అనకుండా మోయటం కస్తూరి ప్రత్యేకత .గోపాలస్వామి హాలండ్ కు కాన్ఫరెన్స్ కోసం వెళ్లి తిరిగి వస్తూ ఒక చిన్న ఫిలిప్స్ ట్రాన్సిమిటర్  తెచ్చాడు .  ..దీన్ని మునిసిపాలిటీ వాళ్ళ డబ్బుతో విద్యాకార్యక్రమాలు రోజుకు ఒకగంటసేపు గ్రామీణప్రజలకోసం ప్రసారం చేయాలని భావించి ఈ బాధ్యత కస్తూరికి అప్పగించాడు  . ఏ కొత్తదైనా నిస్సంకోచంగా ముందుకొచ్చి చేసే కస్తూరి గాలిలో కూడా కస్తూరి పరిమళాలను వెదజల్లే అవకాశంరాగా ఒప్పుకున్నాడు ..దీనిలో ప్రసంగించేవారికి ‘’టాంగా ‘’ఖర్చులు మాత్రమే ఇచ్చి సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయ,తాంబూలం ఇస్తానని చెప్పాడు గోపాలస్వామి .కొన్నేళ్ల ప్రయత్న ఫలితంగా షార్ట్ వేవ్ ప్రసారానికి అనుమతి తెచ్చాడు ..దీనితో సుదూర ప్రాంతాలవారికి  వినే  సౌకర్యం కలిగింది .ఒక రోజు స్టాఫ్ రూమ్ అనే ‘’థింక్ బాంక్ ‘’కు వచ్చిస్వామి తన తలనొప్పిని అందరికి అంటించి పరిష్కారం చెప్పమన్నాడు .అదే ఆలిండియా రేడియోకు సమానమైన పదం చెప్పమనిభావం . కస్తూరి క్షణం ఆలోచించకుండా ‘’ఆకాశ వాణి ‘’అన్నాడు .స్వామితో సహా అందరికీ ఆపదం  నచ్చి అలాఇండియా రేడియోకి ‘’ఆకాశవాణి ‘’పర్యాయ పదమైంది కస్తూరి చలువవలన   .ఈవిషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు .నాకు మాత్రం కస్తూరి  జీవిత చరిత్ర చదివాకే  తెలిసిందని నిజాయితీ గా ఒప్పుకొంటున్నాను .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

–              shankar

–   First content item page

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోట మాస్టారి గురుపూజోత్సవం 

కోట మాస్టారి గురుపూజోత్సవం

గురుపుత్రులకు నమస్కారములు -మా గురుదేవులు మీ పితృదేవులు కీశే శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రిగారి గురుపూజోత్సవంఉయ్యూరులో  5-9-17 మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు మధ్యాహ్నం 3 గం లకు సరసభారతి ,శ్రీ అమరవాణీ తెలుగు ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ సంయుక్త ఆధ్వర్యం లో ఆ పాఠశాల ఆవరణలోముఖ్య అతిధి  శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్   ,లయన్స్  క్లబ్ అధ్యక్షులు సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గార్ల ఆధ్వర్యం లో జరుగుతుంది . కనుక తాము తమ కుటుంబ సభ్యులతో ఆత్మీయ అతిథులు గా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయప్రార్ధన .

             కార్యక్రమం
1-గురు దేవుల చిత్ర పటానికి పుష్పమాలాంకరణ ,అతిథులు ,గురుపుత్రులచే చిత్రపటానికి పుష్ప సమర్పణ .
 2-. అతిథుల చే గురుపూజోత్సవ ,ఉపాధ్యాయ దినోత్సవ సందేశాలు
 3- .శ్రీ కోట గురుదేవుల ప్రియతమ  శిష్యులు  శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన ”శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి కోట సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారాలు  సరసభారతి ద్వారా   ప్రదానం
   1- అమరవాణి  పాఠశాలలో  10   వతరగతి చదువుతున్నఎంపిక చేసిన  పేద, ప్రతిభకల   విద్యార్థికి -కీశే .కోట సూర్యనారాయణ శాస్త్రిగారి స్మారక నగదు బహుమతి 10 వేల  రూపాయలు ప్రదానం
2- శాంతినికేతన్ పాఠశాల లో 10 వ తరగతి చదువుతున్న ఎంపిక చేయబడిన పేద ప్రతిభకల విద్యార్థినికి  కీశే .కోట సీతమ్మ గారి స్మారక నగదు బహుమతి 10 వేల  రూపాయలు ప్రదానం .
4-కోట గురుదేవుల పుత్రులు  శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి గారు ,శ్రీకోట  గాయత్రీ ప్రసాద్ గారు, శ్రీకోట సీతారామాంజనేయులుగారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన తమ మాతా పితల స్మారక నగదు బహుమతి10 వేల  రూపాయలు  వారి చేతులమీదుగా -ఇంటర్ మీడియట్ చదువుతున్న ఎంపిక చేయబడిన పేద ప్రతిభకల విద్యార్థి /విద్యార్థిని కి  బహూకరణ .
5–కోట  గురుపుత్రులకు   సత్కారం
6-ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం
  1-శ్రీ పి . నాగరాజు- ప్రిన్సిపాల్ అమరవాణి పాఠశాల
   2- శ్రీనాగరాజుగారి సతీమణి -సైన్స్ టీచర్ -అమరవాణి  పాఠశాల
    3 తెలుగు పండితులు  –అమరవాణి పాఠశాల
    4-శ్రీ ఏ .త్రినాథ శర్మ -గణిత ఉపాధ్యాయులు -జిల్లాపరిషత్ పాఠశాల
     5-శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి – సరసభారతి కార్య దర్శి –సాహిత్య సేవ
                                                                 ఇట్లు
                                                      గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
                                                       పి .నాగరాజు -ప్రిన్సిపాల్ -అమరవాణి పాఠశాల
    వీలును బట్టి మరిన్ని వివరాలతో ఆహ్వానపత్రిక ఆగస్టు 20 నాటికి అందజేయ బడుతుంది
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3

1937 లో దక్షిణేశ్వర్ కు చెందిన స్వామి శివానంద అనే ‘’మహాపురుష్ జీ ‘’,తారక మహారాజ్ మైసూర్ వచ్చారు.. పరమహంస లీలా ప్రసంగాలలో ‘’1887 శివరాత్రి  నాడు ఉదయం  9 గంటలకు భారంగ పూర్ మఠానికి మహేంద్రనాధ్ గుప్తా (ఏం )వచ్చేసరికి మహాపురుషాజీ ,బ్రహ్మానంద లు వివేకానందులు రాసిన శివ గీతాన్ని పాడుతూ తన్మయంగా నృత్యం చేయటం చూశాడు ‘’అని కస్తూరి ఎప్పుడో చదివింది గుర్తుకొచ్చింది .మహా పురుషుల సందర్శనభాగ్యం తో పులకించిపోయారు .ఆయన కస్తూరికి ‘’శ్రీ రామ కృష్ణ మంత్రోపదేశం ‘’చేశాడు .కానీ కొద్దికాలానికే కుదురుగా ఆసనం వేసి జప0  చేయటం  తనవల్ల కాదని గ్రహించాడు .కర్మయోగమే తనకు నచ్చిన పని అనుకొన్నాడు .రామ కృష్ణ పరమహంస దిండుకింద ఎప్పుడూ అష్టావక్ర గీత పుస్తకం ఉండేదనిదాన్ని తీసి వివేకానంద కు ఇచ్చి చదవమని చెప్పేవారని సుబ్రహ్మణ్య అయ్యర్ పాల్ బ్ర0ట న్ కు చెప్పాడట .. విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చి ఒకఏడాది పియుసి ,మూడేళ్ళ డిగ్రీ ,రెండేళ్ల మాస్టర్ డిగ్రీ వచ్చింది .దీనివలన కస్తూరిని మైసూర్ యుని వర్సిటీ కి స్కూల్ యాజమాన్యం 1928 జూన్ లో అప్పగించింది .తర్వాత మహారాజా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కు బదిలీచేసింది . 17  ఏళ్ళు ఎంతో సంతృప్తి జీవితం ఇక్కడ గడిపానని కస్తూరి రాసుకున్నాడు .స్టాఫ్ వాళ్లకు కస్తూరి ఒక  సాహసుడనిపించాడు .అతని ఇన్నోవేషన్ కు ఫ్లాట్ అయ్యారు .

 కస్తూరి స్టాఫ్ మెంబర్లనందర్నీ ఒప్పించి డ్రెస్ ,మాట లపై కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు పరచాడు .అందులో డ్రెస్ విషయం లో నేక్ టై కట్టుకోకూడదని  కోట్ పై గుండీ లను పెట్టుకోకూడదని 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు నిర్ణయించుకొన్నారు ..ప్రతిసోమవారం ఆరంజ్ తినాలి .అవతలివారితో కన్నడం లో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్ పదం ఉచ్చరిస్తే మాటకు ఒక పైసా ఫైన్ కట్టాలి .కన్నడ భాష వాడకాన్ని వేగంగా పెంచే చర్యలు తీసుకొన్నారు కస్తూరి బృందం .షెల్లీ కవి రాసిన ‘’డిఫెన్స్ ఆఫ్ పోయెట్రీ ‘’,కార్లైల్ ‘’ఆన్ హిస్టరీ ‘’రస్సెల్ ‘’ఫ్రీమాన్స్ వర్షిప్ ‘’మొదలైనవి కన్నడం లోకి అనువదించారు .పిక్నిక్ లకు వెళ్ళినప్పుడు ,లేక భోజనాళత్రవాత్ వీటిని చదివి వినిపించేవారు .అందరూకలిసి ‘’యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ‘’ఏర్పరచి కస్తూరిని సెక్రెటరీ చేశారు

  .’’ఎక్స్టెన్షన్ లెక్చర్ వీక్స్ ‘’ను జరపాలని నిర్ణయించి దూరపు పట్టణాలలో ఉన్న లైబ్రరీ సొసైటీలద్వారా ప్రచారం ప్రారంభించారు .దీనిలో మంచి ప్రోత్సాహంకలిగి చాలా వేగంగా అనుకొన్నది సాధించగలిగారు .సామాన్యమానవునికి సమాచారం అందించాలని ,ప్రభావితం చేయాలని వీళ్ళ సంకల్పం .కాలేజీలో సోషల్ ఆంత్రోపాలజీ బోధిస్తున్న కస్తూరి వివాహ పద్ధతులు ,కులాలు ,అవినీతి ,నేరాలు ఘోరాలు ,దెయ్యాలపై నమ్మకం , అంత్యక్రియల ఆర్భాటాలు మొదలైనవాటిపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి మెప్పించాడు హిస్టరీ లెక్చర ర్ కూడా కనుక అశోకుడు అక్బర్ ,చైనా యాత్రికులు ,చైనాలో భారతీయ బౌద్ధ గురువులు భారతీయ సంస్కృతి  చైనా బయట వ్యాప్తి చెందిన విధానం వగైరాలపై ఉపన్యసించి మనసులను గెలిచాడు ..

  ఆ కాలం లో కన్నడిగులు మరాఠా  ,ఉర్దూ ,తెలుగు ,తమిళ రాజుల నవాబుల వారి పాలనలో ఉండేవారు . తమిళుల దాస్టికం ఏక్కువగా ఉండేది .పాలకులను సంబోధించటం లో డాబు దర్పం అతి విధేయత చూపాల్సి వచ్చేది . .నైజాం నవాబ్ తనను ‘’హిజ్ హై నెస్ ‘’అనికాక ‘’హిజ్ ఎక్సాల్టెడ్  హై నెస్ ‘’అని పిలవాలని ,తర్వాత మరింత గౌరవంగా ‘’హిజ్ మెజెస్టి ‘’అనాలని బలవంతం గా అనిపించేవాడు .. దీన్ని వ్యతిరేకించాలనే ఉద్యమం చేబట్టారు కస్తూరి అండ్ పార్టీ అంటే యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ..బానిసత్వ భావనకు వ్యతిరేకత అందరినుంచి వచ్చి సైనికులతోసహా అందరూ దీన్ని ఆహ్వానించారు .

 గ్రామాలలో సంఘాలు కస్తూరిని ఆహ్వానించి రామ కృష్ణ వివేకానందులపైప్రసంగాలు చేయించేవారు .రోవర్స్ క్లబ్ వాళ్ళు ,కోచింగ్ క్లాస్ వాళ్ళు వాళ్ళవాళ్ళ ఊళ్ళల్లో కస్తూరిని వచ్చిమాట్లాడమని కోరేవారు . కస్తూరికి మరొక గొప్ప ఆలోచన ‘’గ్రామ పునరుద్ధరణ ‘’వచ్చి వాలంటీర్లను తయారు చేశాడు .యూనివర్సిటీ యూనియన్ ను ఆషామాషీ గా కాకుండా ఆ క్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి యూనియన్ ల స్థాయిలో ఒక ఎన్నికైన స్తూడెంట్ సెక్రెటరీ ,,ప్రిన్సిపాల్ నియమించిన స్టాఫ్ సెక్రెటరీ లతో ఏర్పాటు చేశాడు  . లెక్కల లెక్చరర్ టి కృష్ణమూర్తి వయోజన విద్య కార్యక్రమాలు చేసేవాడు .కస్తూరి కొత్తగా విద్య నేర్చుకొనేవారికి ఉపయుక్తంగా కన్నడ ప్రాధమిక విద్యా పుస్తకాలను రాశాడు .వీటిని నగరం లోని చాముండిపుర లో వారికి నేర్పేవాడు . విద్య ద్వారా జాగృతం చేయటానికి ఎన్నిప్రయత్నాలు చేసినా గ్రామీణులను ఆకర్షించటం కష్టం అని గ్రహించి వారికి ఇష్టమైన నాటకం సంగీతం ద్వారా వారికీ దగ్గరవ్వాలని ఆలోచించాడుకస్తూరి . .

 శని ఆదివారాలశెలవులలో కస్తూరి తనకొడుకుతోసహా కొందరు ప్రతిభా సంపన్నులైన విద్యార్ధులతోకలసి గ్రామాలకు వెళ్లి అస్పృశ్యత ,ను భక్త నందనార్  తిరుప్పాణాళ్వార్ చరిత్రతో.మూఢనమ్మకాలను పోగొట్టటానికి మంకాసుర వధ  కథ  ,విద్యాప్రోత్సాహానికి ‘’సాంబు ‘’కథ లను వీధుల్లో నాటకాలుగా ఆడి వారిని చైతన్యం చేశాడూకస్తూరి .ఇవన్నీ పౌరాణిక చారిత్రాత్మక విషయాలు కనుక జానపద నాటక ,గేయాలతో ,సంప్రదాయబద్ధమైన వేష ధారణతో ప్రదర్శించి మనసులను దోచేశాడు కస్తూరి .వీటిలోని సంభాషణలు ముందుగా రాసి పెట్టుకొన్నవికావు సమయం సందర్భాన్నిబట్టి అప్పటికప్పుడు  వేదికమీద అలవోకగా చెప్పినవే .స్పాంటేనిటీ ఉండటం తో బాగా ఆకర్షవంతమైనాయి . అనుకొన్నది సాధించగలిగారు .వీటిలో దేవతలు మునులు అకస్మాత్తుగా రంగం పైకి రావటం పోవటం ,హాస్యం వ్యంగ్యం చెమక్కులూ దట్టించటం తో బాగా పేలాయి .

 ఇంతటితో ఆగితే కస్తూరి గొప్పేముంది .ఆ రోజుల్లో హరికథకు మంచి ఆదరణ ఉండేది . దాన్నీ వదల్లేదు కస్తూరి .మహర్షుల జీవితాలు వారిప్రబోధలు ,పురాణ నాయకులు ,అవతారపురుషుల విషయాలను పాటలు చక్కని మాటలు తో హరికథ గా చెప్పేవాడు కస్తూరి .తన గొంతు సంగీతానికి సహకరించిందని గ్రహించి సంగీతం పాడటానికి కొందరు విద్యార్థులను తయారు చేసివాళ్లతో పాడించేవాడు .వీటన్నిటితో గ్రామీణులను మూవర్స్ అండ్  షేకర్స్ గా  మార్చానకి చెప్పాడూకస్తూరి .బుద్ధ ,రామకృష్ణ పరమహంస ,గీత ,తిరుప్పాణాళ్వార్ ,నందనార్, వివేకానంద ,మీరాబాయి ,అక్కమహాదేవి వేషాలు వేసి వారిపై మాట్లాడి అద్భుత ఛైతన్య స్ఫూర్తి కలిగించాడు  పల్లె టూళ్ల లో ..బెంగుళూరు  దావనాగిరె పట్టణాలలోనూ సిటీ ప్రేక్షకుల మనసు దోచాడు కస్తూరి .కస్తూరి సుగంధానికి పరవశులు కానీ వారెవరుంటారు?వీటి విజయాలకు తనకొడుకుతోసహా తనతోఉన్న సంగీత బృందమే కారణం అంటాడుకస్తూరి .రాజాస్థాన పండితుల వద్ద నుంచి తీసుకొన్న జిగ్ జిగేల్ మనే కాశ్మీ ర్ శాలువా ,యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్ బహూకరించిన వెండి చిడతలు తో తనవేషం  మహాబాగా  ఆకర్షణీయంగా ఉండేదని పల్లెప్రజలు వీటితో  రంజిల్లి ఫ్లాటై పోయేవారని అంటాడు కస్తూరి .

 ప్రజల నుంచి ఏమాత్రం వ్యతిరేకత రాకుండా అమ్మవార్లకు జంతుబలి నివ్వరాదని అట్టడుగు వర్గాలవారిని సమాజానికి దూరంగా ఉంచరాదని ,అధికసంతానం తో జనాభా  విస్ఫోటనం   కలిగించవద్దని  ,పురాణాలనుండి వేద,ఉపనిషత్తుల నుండి మహాత్ముల జీవితాలనుండి వారి బోధలనుండి విషయసేకరణ చేసి అందరికి మనసులకు నచ్చేవిధంగా చెప్పటం వలన తాను విజయం సాధించగలిగానని కస్తూరిరాశాడు ..యుని వర్సిటీ లెక్చరర్ ఒకరు మొట్టమొదటిసారిగా వీధుల్లో హరికథ చెప్పటం కస్తూరికే సాధ్యమైంది .దీన్ని కొందరు తప్పుపట్టి ఉన్నత విద్య భోధించేవాడు ఇలా బజార్లలో వేషాలేయటమేమిటి పరువు తక్కువ అని ఆక్షేపించారు .ఇదంతా ప్రచారంకోసం మెప్పూ మెహర్బానీ కోసమే అన్నారు .మరికొందరు తనను పల్లెటూరి బైతులన్నారు .చాలామందిమాత్రం హరికథను యూనివర్సిటీ గౌరవ కలిగించాడు కస్తూరి అని హృదయ పూర్వకంగా మెచ్చుకొన్నారు .ఇన్ని రంగాలతో  జన జాగృతి కలిగించి మానవ సేవే  మాధవ సేవగా భావించి చేశాడు కనుకనే కస్తూరి గురించి ఆయన సేవా పరిమళం  గూర్చి  రాయాలనిపించి రాస్తున్నాను .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

మహారాజా కాలేజీ లో రెండేళ్ల ప్రి  యూనివర్సిటీ కోర్స్ పూర్తిచేసి కస్తూరి మద్రాస్ లో పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్ లో పాసై ,మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లో చేరాడు .కస్తూరి స్నేహితుడికి మద్రాస్ యుని వర్సిటీ స్కాలర్ షిప్ కూడా కొచ్చిన్ ప్రభుత్వ స్కాలర్షిప్ తోపాటు వస్తే అతడు కొచ్చిన్ స్కాలర్షిప్ ఉంచుకొని యూనివర్సిటీ దాన్ని వదిలేశాడు  ఇది కస్తూరి ఆశలపై నీళ్లు చల్లింది ..త్రివేండ్రం చేరి మహారాజా కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీలో చేరి ,సత్రం లో తింటూ సుబ్బయ్యర్ హితోపదేశం పై ఇండియన్ హిస్టరీ ని స్పెషలైజ్ చేసి అక్కడ రామ కృష్ణ వివేకానంద బృందం తో పరిచయమేర్పడి అక్కడి సంస్కృత పండిట్  హిస్టరీ హెడ్ కె వి రంగస్వామి అయ్యంగార్ దృష్టిలో పడ్డాడు .. 1916 లో తానుఉంటున్న త్రిపుత్త రకు త్రివేండ్రం 150 మైళ్ళు 32 గంటల ప్రయాణం అయితే,మద్రాస్ మూడు రె ట్ల దూరం అయినా రైల్ లో 26 గంటలప్రయాణం అనిపించింది ..అదృష్టవశాత్తు మద్రాస్ యూనివర్సిటీ త్రివేండ్రం లో హిస్టరీ ఆనర్స్ కోర్స్ ప్రవేశపెట్టింది .ప్రొఫెసర్ రంగస్వామి క్షణం ఆలస్యం చేయకుండా కస్తూరిని అక్కున చేర్చుకొన్నాడు .ప్రిన్సిపాల్ కస్తూరికి గ్రిగ్ మెమోరియల్ స్కాలర్షిప్ నెలకు 12 రూపాయలు మూడేళ్లకు మంజూరు చేశాడు . అక్కడే మేనమామ కూడా టీచర్ గా  ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చింది . ప్రొఫెసర్ గారి ఇంటి లైబ్రరీ కస్తూరికి బాగా ఉపయోగపడింది ..ఇక్కడే బెనర్జీ అనే రామకృష్ణా మిషన్ వ్యక్తితో పరిచయమై ,అందులో సభ్యులను చేర్పించి నిధి సేకరణకు తోడ్పడ్డాడు .. ప్రొఫెసర్ గారి రెండెడ్ల బండిలో ఆయనతోపాటు అనంతపద్మనాభ దర్శనం ,బీచ్ లకు వెళ్ళేవాడు .ప్రొఫెసర్ సంప్రదాయాలను తప్పక పాటించేవాడు . అది కస్తూరి మనసుపై గొప్ప ప్రభావం చూపింది .ప్రొఫెసర్ స్కోల్లోస్ రినైసెన్స్ ను ,ప్రో సహస్రనామం ట్రాజి, కామెడీలను బోధించారు ..మూడవ ఏడాది టైఫాయిడ్ వచ్చి మేనమామ ఇంట్లో వాళ్లకు భారమే అయినా ఉండాల్సి వచ్చింది . తాత చనిపోగా తల్లి ఇక అక్కడ ఉండలేక పోయింది .ఇప్పుడు తల్లిని కూడా తెచ్చి మేనమామకు మరింత బరువు నెత్తికెత్తాడు .

 21 వ ఏటా హిస్టరీ ఆనర్స్ డిగ్రీ చేతబట్టి తల్లిని పెళ్ళాన్ని పోషించుకోవటానికి త్రివేండ్రం హై స్కూల్ టీచర్ అయ్యాడు . 1919లో కుటుంబం పెట్టాడు . మద్రాస్ ప్రెసిడెన్సీమొత్తం లో  ఆనర్స్ లో రెండవ స్థానం  పొంది ఇక్కడ బతకలేక బడిపంతులయ్యాను అనుకొన్నాడు  .ప్రొఫెసర్ గారు ఐ ఏ ఎస్ పరీక్షలు రాయమన్నాడుకాని ‘’విత్తులు ‘’లేక  లా కాలేజీలో ఉదయం సాయంత్రం క్లాసులకు హాజరై చదివాడు . అదృష్టం తలుపుతట్టి మాస్టర్ ఉద్యోగ జీతం యాభై శాతం పెరిగింది ..అక్కడ దామోదరన్ పొట్టి అనే ‘’డబ్బులావు ‘’  మనిషి పరిచయమై  తానూ సంపాదకుడుగా ఉన్న ‘’పీపుల్స్ ఫ్రెండ్ ‘’పత్రికకు ’’ ఘోస్ట్ రైటర్’’గా ఉండమని కోరాడు ..తనతరఫున తెచ్చే ప్రతిపత్రికకు 15 రూపాయలు ముట్ట చెబుతానని ఆశ చూపించాడు .సరే నని హాస్య వ్యంగ్య రచనలు పంచ్ డైలాగులూ రాసి పత్రికకు వన్నె తెచ్చాడు ..సంఘ వ్యతిరేకులమీద అవినీతిపరులు దేశ ద్రోహులపైనా తీవ్రంగా రాయమని కోరేవాడు ఆ ‘’దేశభక్తపొట్టి  . ‘’అలాగే  రెచ్చి పోయి రాసేవాడు .’’దీనితో వందేమాతర భావం వైరస్ లాగా నాకు సోకింది ‘’అంటాడుకస్తూరి .పొట్టి కోరికపై సేలం ఆయనతో వెళ్లి మహమ్మదాలీ షౌకత్ ఆలీ ల భుజాలపై చేతులు వేసి నడఁడుస్తున్న గాంధీని ,రాజాజీ ఏర్పాటు చేసిన స్వదేశీ ఎక్సి బిషన్ ,చూశాడు .

ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లికి మసూచికం సోకి కోలుకొన్నది .. టీచర్ ఉద్యోగం చేస్తూ లా చదువుతూ ,స్కూల్ లో విద్యార్థుల చేత తాను రాసిన ‘’షాజహాన్ ‘’నాటకం తనదర్శకత్వం లో వేయించటం వంటి సాంఘికకార్య క్రమాలతో గడిపాడు ..లా కాలేజీ లో చదువుతున్నప్పుడే మామగారిమామ గారు ఎప్పుడూ  ‘’లాయర్ కా వద్దు చీట్ చేయద్దు . టీచ్ చేయి  . గురువుజీవితం ఈ లోకం లోను ,పైలోకం లోను హాయిని సంతృప్తిని ఇస్తుంది ‘’అని చెవిలో జోరీగలాగా రొదపెట్టేవాడు..కనుక దేశం లో చాలా ప్రాంతాలనుండి ఆహ్వానాలు వచ్చినా వదిలేసి మైసూర్ డి బి హెచ్ .హై స్కూల్ లో హిస్టరీ  లెక్చరర్ గా చేరాడు . ఇప్పటివరకు ఎందరెందరిపైనో ఆధారపడ్డాడు కనుక ఇప్పుడు ఎవరికైనా ఆశ్రయం కలిగించాలని అనుకోగానే వాళ్ళ అమ్మ పల్లెటూళ్ళో నీళ్లుకారే రేకుల షెడ్ లో దరిద్ర జీవితం గడుపుతున్న తన అమ్మ అంటే కస్తూరి అమ్మమ్మ ను తమతో ఉంచుకుందామనగానే సరేనన్నాడు ..

 మైసూర్ వెళ్లి ధర్మ భానుమయ్య హై  స్కూల్ కు హెడ్మాస్టర్ ను కలవగానే ఆయనే రెండు చేతులతో నమస్కరిస్తూ ‘’వారుంగొ వారుంగొ ‘’అన్నాడు .మంచి  ఇల్లు తీసుకొని భార్య ,తల్లీ అమ్మమ్మలతో కాపురం పెట్టాడు .హిస్టరీ భోధించేవాడు .అక్కడి గోపాలకృష్ణయ్యర్ ,కృష్ణయ్యర్ తన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దారని కస్తూరి కృతజ్ఞతగా చెప్పాడు .ఉదయం అసెంబ్లీలో పా డాల్సిన ‘’ప్రార్ధన జీతం ‘’రాసి పిల్లతో రోజూ పాడించేవాడు .చంద్ర హాస ‘’నాటకం రాసి తాను క్రూర మంత్రిగా నటిస్తూ పిల్లలతో ఇంగ్లిష్ నాటకం వేయించి డైరెక్ట్ చేశాడు .వైస్ ఛాన్సలర్ చూసి చాలామెచ్చాడు .స్తూడెంట్ పార్లమెంట్ ,స్కూల్ మేగజైన్  నిర్వహించాడు ..స్నేహితుడు శంకరరావు తోకలిసి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పిల్లల చదువు వారికివ్వాల్సిన ప్రోత్సాహం గురించి చెప్పేవాడు మైసూర్ లో యుని వర్సిటీకాలేజిలో చేరే విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులను సర్వే  చేశాడు ..కుటుంబం తో చాముండి అమ్మవారి దర్శనం  చేసేవాడు . 1923లోమొదటిపుత్ర సంతానం కలిగింది .స్కూల్ వ్యవస్థాపకుడు మునిసిపల్ ఎన్నికలలో నిలబడి టీచర్లను తనకు ప్రచారం చేయమనటం అసహ్యంగా ఇబ్బందిగా ఉంది  . ప్రచారం కోసం సెలవు ఇమ్మనేవాడు .గదులన్నీ వాళ్ళకే కేటాయించమనేవాడు

 దీనిలో నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకొంటుంటే స్నేహితుడొకడు గాంధేయ వాది  ,మైసూర్ మహారాజా  కాలేజీ లాజిక్ లెక్చరర్ డా సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రియశిష్యుడు న్యాయవాద వృత్తి చేబట్టమని సలహా ఇచ్చాడు . అతని తండ్రి మైసూర్ రాష్ట్రం లో 50 గ్రామాలకు గురువు .కాదనలేక 350 మైళ్ళ దూరం లో ఉన్న సిద్దనహళ్లి వెళ్ళాడు  ,తనకు కన్నడం రానందువలన ,సివిల్ ప్రొసీజర్ కోడ్ పాసవనందువలన ఇప్పటిదాకా లా ప్రాక్టీస్  పెట్టలేదు .ఇప్పుడు లాయర్ గా  నమోదు చేయమని కోరాడు ..కానీ ఈగండం నుంచికూడా బయటపడ్డాడు .

 ఒక రోజుడిసెంబరునెల  ఉదయానే శంకరరావు గోపాల మారారు ను వవెంటపెట్టుకొని వచ్చాడు  ఆత ను తన సహాధ్యాయి  రాజా వంశీకుడు . మద్రాస్ లో చదివి డిగ్రీ పొందాడు .సన్యసించి రామకృష్ణా మిషన్ లో చేరి సిద్ధేశ్వరానంద గా వచ్చాడు .బేలూర్ మఠం  ఈయన్ను మైసూర్ లో రామకృష్ణ మఠం ఏర్పాటు చేయమని పంపింది ..బెంగుళూర్ లో అందర్నీ అడిగి కస్తూరి గురించి వాకబు చేసి ఇక్కడికి  వచ్చాడు .సిటీ టౌన్ హాల్  లో ఒక సమావేశమేర్పాటు చేసి ఆయనతో ప్రసంగం చేయించాడు .కొన్ని నెలలో  ఆశ్రమం  తగిన వసతులతో  ఏర్పడి వర్ధిల్లింది .కాలేజీ విద్యార్థులకు ,తలిదండ్రులకు పరిచయం చేశాడు .మొదటి విస్తృత సమావేశం లో కస్తూరి ముందుగా కన్నడం లో తర్వాత సిద్దేశ్వ రానంద ఆంగ్ల0 లో అందరికి నచ్చేట్లు మాట్లాడారు . ఎందరో ప్రముఖులు హాజరయ్యారు .

 తర్వాత యువత ను ఆకర్షించే ప్రయత్నం చేశారు .వివేకానంద రోవర్స్ స్కౌట్ ఏర్పరచి ట్రెయినింగ్ ఇచ్చాడుకస్తూరి .నిధి సేకరణ చేశారు .ఒక రోజు అకస్మాత్తుగా దగ్గరున్న స్పిన్నింగ్ మిల్ లో అగ్నిప్రమాదం జరిగింది .కస్తూరి యువ బృందం వెంటనే రంగ ప్రవేశం చేసి మంటలనార్పి పెద్ద ప్రమాదం తప్పించారు .మిల్లు డైరెక్టర్ తో సహా ఎందరో కస్తూరికి అభినందనలు తెలిపారు .మైసూర్ లో జరిగిన స్టేట్ రాలీ ఆఫ్ స్కౌట్స్ లో కస్తూరి యువజన రోవర్ బృందం పోలి కిట్టి ‘’నాటకం ప్రదర్శించి మహారాజు జయచామరాజ ఒడియార్ మన్నన పొందారు .కస్తూరి రాసి,డైరెక్ట్ చేసిన మరోనాటకం ‘’ది హెడ్ మాస్టర్స్ డాటర్ ‘’కూడా ప్రదర్శించారు . ఈ విధంగా రోవర్స్ క్లబ్ అటు జనానికి ,ఇటు ఆశ్రమానికి రాజకుటుంబాలకు బాగా దగ్గరైంది .గోపాల్ మహారాజ్ ప్రెసిడెంట్ గా కస్తూరి సెక్రటరీగా సేవ లందిస్తున్నారు .కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు .రెగ్యులర్ గా రాని  వారిని గుర్తించి కారణాలను కనుక్కొని కావాల్సిన సదుపాయాలూ కల్పించి వచ్చేట్లు చేస్తున్నారు .కె వి పుట్టప్ప అనే కవి కొన్ని సమావేశాలకు రాలేదని గ్రహించి ఆయన ఉండే చోటును వెతుక్కొని వెళ్లి చూస్తే టైఫాయిడ్ తో బాధ పడుతున్నాడని గ్రహించి డాక్టర్ ను సంప్రదించి కృష్ణరాజేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు . వారం తర్వాత తగ్గిపోయింది . తాను  ఆశ్రమం లోనే విశ్రాంతి తీసుకొంటానని ఆయన అన్నాడు .పుట్టప్ప భారతీయ సంస్కృతికి  ప్రతినిధి .ఆయనకవిత్వం ఆశ్రమ వాతావరణం లో పుష్పించి వికసించి ఫలించి లబ్ధ ప్రతిష్ఠుతుని చేసింది .సిద్ధేశ్వరానంద మైసూర్ ప్తజల హృదయం లో శాశ్వత స్థానం సంపాదించాడు ..ఇద్దరూకలిసి వైస్ ఛాన్సలర్ వీరాజేంద్రనాధ్ ను గీతపై ప్రసంగించవలసిందిగా కోరగా వచ్చి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు .యుని వర్సిటీ ,కాలేజీ లలో  సంస్కృత విద్యాలయాలలో ఉన్నసై కాలజి ఫిలాసఫీ ప్రొఫెసర్లు లెక్చరర్లు వచ్చి ఆశ్రమం లో ప్రసంగించి ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కల్గించేవారు .యుని వర్సిటీ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్య అయ్యర్ సిద్ధేశ్వరానంద శిష్యుడయ్యాడు .తాను  సెక్రెటరీ గా ఇలాంటి ఉన్నతులమధ్య గడపటం తన అ దృష్టం అన్నాడు కస్తూరి . తూర్పు పడమటి తత్వ శాస్త్ర రహస్యాలు ,ఉపనిషత్ సందేశాలు ,గీతారహస్యాలు ,అద్వైత ద్వైత వాదాలు మానసిక శాస్త్రం అన్నింటిపైనా విలువైన ప్రసంగాలు చేయించాడు కస్తూరి స్వామీజీతోకలిసి .సన్యాసులకు రెండేళ్ల శిక్షణ ప్రారంభించారు .మైసూర్ మహారాజా సుబ్బరామయ్యర్ ను ఘనంగా సన్మానించి ఆశ్రమానికి భూరి ధన సహాయమందించాడు … అనుకొన్న విధంగా సిద్ధేశ్వరానంద కస్తూరి సహాయం తో ఆశ్రమాన్ని సర్వతో ముఖాభి వృద్ధి చేయగలిగాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -1

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -1

కేరళలో పుట్టి ,మద్రాస్ ,మైసూర్ లలో చదువు ఉద్యోగ0 చేసి ,పుట్టపర్తి చేరి శ్రీ సత్యసాయి బాబా ఆంతరంగికుడై ,మొట్టమొదటి బాబా జీవిత చరిత్రను ఆయన ప్రేరణతోనే రచించి ఆయనతో దేశమంతా పర్యటించి ఆయన ఆదేశం తో దేశాలు తిరిగి సాయి ప్రేమామృతాన్ని ప్రజలకు పంచి ,’’సనాతనసారధి ‘’కి రధ  సారధియై  ఆలిండియా రేడియోకి ‘’ఆకాశవాణి ‘’సార్ధక నామధేయాన్ని అందించి , ఉద్యోగకాలం లో ఎవరికీ తట్టని ఎన్నో సేవా కార్యక్రమ  కస్తూరికా పరీమళాన్ని వెదజల్లిన పుణ్యమూర్తి ప్రొఫెసర్ నారాయణ కస్తూరి  బహుభాషా కోవిదుడు .

 అందరి చేతా  ఆప్యాయంగా ‘’కస్తూరి ‘’అని పిలువబడే నారాయణ కస్తూరి కేరళలో కస్తూరి రంగనాథ శర్మగా నారాయణ శర్మ పుత్రుడిగా 25-12-1897న ఉత్తర తిరువాన్కూర్ లో ని త్రిపునిత్తూర లో జన్మించాడు.  పుట్టిన11 వ రోజున తల్లి అర్జునుడు ప్రతిష్టించిన స్థానిక పార్ధసారధి  దేవాలయానికి తీసుకువెళ్లి స్వామికి ఎదురుగా నేల మీద పడుకో బెట్టింది .ఆమెకు స్వామి ఏదో సందేశం ఇచ్చినట్లు భావన కలిగింది ..అలాగే రోజూ ఎత్తుకొని వెళ్లి స్వామి దర్శనం చేయించేది .అమ్మతండ్రి అంటే తాత దేవాలయ ఎక్సి క్యూటివ్ ఆఫిసర్ ..పెళ్లినాటికి  తండ్రివయసు 18 ,తల్లికి 12 . .నామకరణం నాడు తండ్రి అకస్మాత్తుగా కొడుకుకు ‘’కస్తూరి రంగనాధ ‘’అని పేరుపెట్టారు .ఇంతవరకు కస్తూరి పేరు ఆ ఇంట ఎవరికీ లేదు . సంప్రదాయం ప్రకారం కస్తూరి రంగనాధ శర్మ అయ్యాడు . కేరళ ,తమిళనాడులలో తండ్రిపేరు ఇంటిపేరు అవుతుందికనుక తర్వాత నారాయణ కస్తూరి అని షార్ట్ నేమ్ పెట్టుకొన్నాడు . శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి నుదుట ఉండే నిలువు బొట్టు కస్తూరితో పెడతారు .దాని సుగంధం ఎంతో దూరానికి వ్యాపిస్తుంది .అలాగే ఈ కస్తూరి సేవా పరిమళం కూడా బాగా వ్యాప్తి చెంది సార్ధక నామం అయింది ..

 చిన్నప్పుడే తండ్రికి మసూచికం సోకి మరణించాడు .. మాతామహుడి ఇంటనే తల్లీ కొడుకు ఉండేవారు . తాత చండ  శాసనుడు .ఆంగ్ల చదువులు ఇష్టం లేనివాడు . కానీ తల్లిప్రోత్సాహం తో అదే చదివాడు .ఆకాలం లో కొచ్చిన్ రాజు తమరాజ్యం లో బ్రాహ్మణులెవరూ తిండిలేకుండా ఉండరాదని రాజధానిని కొచ్చిన్ నుంచి త్రిపునిత్తురకు మార్చి అక్కడ అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు .తల్లి ,కస్తూరిని అక్కడ  హై స్కూల్ లో చేర్పించింది .చదువుకు తిండికి ఇబ్బంది లేకుండాపోయింది .ఫిఫ్త్ ఫారం లో ఉండగా కుమార్ అనే విద్యార్థి నాయకుడి ఆధ్వర్యం లోఒక డిబేట్ ‘’శ్రమ లేకుండా ఉచిత భోజనం అందించరాదు ‘’ను నిర్వహించి రిజల్యూషన్ రాజుకు పంపారు .కానీ ఆయన దీన్ని ‘’లైట్ తీసుకొని ‘’అన్నసత్రాన్ని కొనసాగించాడు  . 1903 లో చేరి 1914 వరకు కస్తూరి చదివిన స్కూల్ రాష్ట్రం లోనే నంబర్ వన్ .ఉపాధ్యాయలనుప్రతిభ ప్రాతిపదికపై ఎంపిక చేసేవారు .రాజుగారి పిల్లలు గుర్రబ్బండిలో స్కూల్ కు వచ్చేవారు .వాళ్లకు కుర్చీలు డెస్క్ లు ఉండేవి . మిగిలినవారికి’’ తొడలే’’  డెస్క్ లు ..యువరాజు గోపాల మారార్ కస్తూరి క్లాస్ మేట్ .అప్పుడప్పుడు అతనితో రాజ అంతఃపురానికి వెళ్ళేవాడు ..అప్పుడు క్లాసుకు 30 మందిమాత్రమే విద్యార్థులు  .ఉపాధ్యాయులు నిష్ఠగా బోధించేవారు ..హెడ్ మాస్టర్ గోపాలకృష్ణ అయ్యర్ రాజావారి పిల్లలకు  ట్యూషన్ చెప్పేవాడు ..యెన్ ఆర్ సుబ్బ అయ్యర్ బ్రిటిష్ హిస్టరీ చెప్పేవాడు . అప్పుడు ‘’రూల్ ఆఫ్ బ్రిటాన్నియా ‘’అందరు తప్పక నేర్వాల్సి వచ్చేది . అప్పుడే  అన్నన్  రాసిన   ‘’పార్లమెంటరీ ప్రాక్టీస్’’  అనే పుస్తకాన్ని ప్రచురింపబడగా కస్తూరి కొని చదివేశాడు . 1921  లో మైసూర్ కాలేజియేట్ హై  స్కూల్ లో హిస్టరీ బోధిస్తూ కస్తూరి విద్యార్థుల చేత ‘’స్తూడెంట్ పార్లమెంట్ ‘’అంటే మోడల్ పార్లమెంట్ నిర్వహింప జేశాడు .స్పీకర్ ప్రధాని,ప్రతిక్షానాయకుడు బిల్లు ప్రవేశ పెట్టటటం  చర్చ పాసవటం సవరణల ప్రతిపాదన వంటి తంతు అంతా  విద్యార్థుల చేత చేయించి శెభాష్ అనిపించుకున్నాడు కస్తూరి .ఇలా అక్కడ పని చేసిన కాలం అంటే 1928 వరకు ఏడేళ్లు ప్రతిఏడాది 20 ఆదివారాలలో ఈ కార్యక్రమం చేయించాడు ..సుబ్బ అయ్యర్ ‘’వారన్  హేస్టింగ్ ఇంపీచ్ మెంట్ ‘’ను విద్యార్థులతో చేయిస్తే కస్తూరి ,ఎడ్మ0డ్  బర్క్ ఆంగ్ల ప్రసంగాలు విద్యార్థులచే చేయించేవాడు  . వాగ్ధాటికి బర్క్ నే ముందు పేర్కొంటారని మనకు తెలుసు  .

స్టూడెంట్ అసోసియేషన్ లో వక్తృత్వ పోటీలు ,నిర్వహించేవాడు . వచ్చేవారం చర్చించబోయే అంశాన్ని ముందే తెలియజేసి విద్యార్థుల అవగాహనకు  అవకాశమిచ్చేవాడు ..ఒక విద్యార్థి ని 1913 లో తరువాతవారానికి విషయం ఏమిటి  అని అడిగితె ‘’The dippressed classes and the supression of the oppression practised on them ‘’అని చెప్పగానే అందరూ అందరూ అభినందనగా చప్పట్లు కొట్టారు .డిబేటింగ్ రసవత్తరంగా అర్ధవంతంగా జరిగి మంచి ఫలితాన్నిచ్చింది అని కస్తూరి గుర్తు చేసుకొన్నాడు  .

 పాఠశాల  గ్రంథా లయం లోని విలువైన పుస్తకాలు చదివాడు . స్కాట్ రాసిన ‘’టాలిస్మన్ ‘’బాగా ఇష్టం .తనతోపాటు స్కాట్ మనల్నీ తీసుకు వెడతాడు అంటాడు . 1913లో ఇన్స్పెక్షన్ లో అధికారి ఏ పుస్తకం చదువుతున్నావని అడిగితె ‘’లెస్ మిజరబుల్స్ ‘’అని చెబితే దాన్ని ‘’లా మిజరబుల్స్ ‘’అని పలకాలని సరిదిద్దాడని .నిజాయితీగా చెప్పాడు . ఇంటిదగ్గర తాతగారు కూడా కథల పోగు .రోజూ ఏదోఒకటి చెప్పేవాడు .. ఈ తాత మామూలోడు కాదు బలే ముదురు .ఇంట్లో పిల్లి లేవటానికి ఎన్నో ఉపాయాలు పన్నేవాడు .పెద్ద సంసారం .ఎంతవచ్చినా చాలేదికాదు .అందుకని  తీర్ధయాత్రలు అని చెప్పి డబ్బున్నవాళ్ళదగ్గర డబ్బు దండుకొని ,యాత్ర చేసివచ్చి మిగిలిన డబ్బును రెండు మూడు నెలలు కొంప గడవటానికి ఉపయోగించేవారు ..

 కొచ్చిన్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త పరీక్ష పెట్టి అందులో కస్తూరితోపాటు అయిదుగురిని సెలెక్ట్ చేసి నెలకు 5 రూపాయల స్కాలర్షిప్ మూడేళ్లు  ఇచ్చింది .దీనితో అతని నాలుగు అయిదు ఆరు ఫారం ల చదువు గట్టెక్కింది .మూడు నెలలకొకసారి హెడ్ మాస్టర్ పిలిచి పారితోషికం గా విక్టోరియా రాణి బంగారునాణెం అంటే 15 రూపాయల విలువకలది ఇచ్చేవాడు .దీన్ని తాత కిస్తే వెండి  నికెల్ రాగి నాణాలు గా మార్చి నాకి పారేసేవాడు అని చమత్కరించాడు కస్తూరి . పెద్ద కుటుంబాన్ని మోయటానికి తాత కు మరో గొప్ప ఆలోచనవచ్చి 7 వ ఏటఉపనయనం చేశాడు .ఒక  రోజు  పూర్ణా నదిలో కస్తూరి ఈదటం చూసి బాలశంకరులను మొసలి పట్టుకున్నట్లు మనవడిని పట్టుకొని సన్యాసం తీసుకొంటాడేమోనని భయపడి గీసి గీసి బేరమాడి  600 రూపాయల కట్నం తో పెళ్లి కుదిర్చి నాలుగు రోజులు పెళ్లి చేయించాడు ..ఈ డబ్బు నొక్కేద్దామని ముసలాడి ముదురుఆలోచన . కస్తూరి తల్లి బ్రేకే వేసి  ఆడబ్బు జాగ్రత్త చేసి తన చదువుకు ఉపయోగించిందని చెప్పాడూకస్తూరి .ఎర్నాకుల0 లో స్కూల్ ఫైనల్ పరీక్షరాసి మలయాళం సాహిత్యం హిస్టరీలలో రాష్ట్రం లో మొదటిమార్కు మొత్తం మీద 5 వ రాంకు  సాధించి కాలేజీ చదువుకు నెలకు 10 రూపాయల  రెండేళ్ల  స్కాలర్ షిప్ కు అర్హత పొందాడు . ఎర్నాకుల0 లో  లో ఇంటర్ కు చేరి సత్ర భోజనం చేస్తూ గడపచ్చుఅనుకొన్నాడు .కానీ సమయాలు కుదరక  ఒక విధవరాలింట్లో చిన్నగది తీసుకొని ఆమె వండిపెట్టింది తింటూ చదువుకున్నాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 408-ఋగ్వేద భాష్యా భాష్యం కర్త-ఓ .యం .సి. నారాయణన్ నంబూద్రి (1910-1989 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

408-ఋగ్వేద భాష్యా భాష్యం కర్త-ఓ .యం .సి. నారాయణన్ నంబూద్రి (1910-1989 )

కేరళలోని ఓలాపమన్న మన్న  వంశీకుడైన నారాయణన్ నంబూద్రి పండిత వంశ సంజాతుడు . 1910 లో జన్మించి 1989 లో చనిపోయాడు .ఋగ్వేదం లో మహా నిష్ణాతుడు .త్రిచూర్ బ్రాహ్మణ సర్వస్వ0 అధ్యక్షుడు .ఋగ్వేదాన్ని కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా నేర్పిన ప్రయోగ శీలి . ‘’ఋగ్వేద లక్షణార్చన ‘’ప్రారంభకుడు .ఆయన సంస్కృత రచన ‘’ఋగ్వేద భాష్యా భాష్యం ‘’ను ఆయన మేధోసర్వస్వము గా భావిస్తారు .ఆయన పేరిట ‘’దేవీ ప్రసాదం ట్రస్ట్ ‘’ఏర్పరచి ప్రతి యేటా వేద ,సంస్కృత ,సంగీత ,కథాకళీ లలో నిష్ణాతులకు పురస్కార సమ్మానాలు అందజేస్తున్నారు .

409-భారతీయ శాస్త్ర దర్శనకర్త -జి .విశ్వనాథ శర్మ (1912-1998 )

కేరళ లోని మంగుళూరు లో 1912 లో జన్మించిన విశ్వనాథ శర్మ సంస్కృతం శాస్త్రాలను విద్వా0సు లైన గొప్ప పండితులవద్ద అభ్యసించాడు .కాలడిలోని ఆశ్రమ విద్యాలయం  తీపిని తూర సంస్కృత విద్యాలయాలలో  రామాపురం టీచర్స్ ట్రెయింగ్ సెంటర్ లో సంస్కృత ఉపాధ్యాయుడుగా పనిచేశాడు .  వేదాంతం లో స్వర్ణపతకం పొందిన మేధావి .విద్యాభూషణ ,పండిత రత్న బిరుదాంకితుడు .ఆయన సంస్కృత రచనలు -భారతీయ శాస్త్ర దర్శనం ,సంస్కృతాధ్యాపనం .

410-సామవేద ఘనాపాటీ – త్రోత్తం  ఆర్యన్ నంబూద్రి (1930

కేరళలోని పంజాల్ లో జన్మించిన ఆర్యన్ నంబూద్రి సంప్రదాయ బద్ధంగా సామవేదం నేర్చి వేద పండిత బిరుదుపొంది ,కాలడిలోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వ విద్యాలయం లో పనిచేసి ,సామవేదాన్ని పఠించటానికి ఇంగ్లా0డ్ నుండి ఆహ్వానం అందుకొని ,అక్కడ పఠించి మన్ననలు పొంది తిరిగివచ్చాడు .కంచి శ్రీ జయేంద్ర సరస్వతి నంబూద్రికి ;;కీర్తి ముద్ర ‘’బంగారు పతకం ప్రదానం చేశారు .కాలడి శ్రీ శంకరాచార్య సంస్కృత విద్యాలయం కోసం సామవేదాన్ని పఠించి రికార్డ్ చేశాడు . కేరళ దేశాన్ని ఈ మహానుభావులందరూ వేద వేదాంగ శాస్త్ర సారం తో పునీత0 చేసిన పుణ్య మూర్తులు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 406-చిత్రోదయమణి  కర్త -సాంబశివ శాస్త్రి (1912-1991)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

406-చిత్రోదయమణి  కర్త -సాంబశివ శాస్త్రి (1912-1991)

కేరళకు చెందిన సాంబశివ శాస్త్రి ‘’చిత్రోదయమణి ‘’కావ్యం రాశాడు .తిరువనంతపురం మహారాజు చిత్ర తిరుణాల్ ,ఆయన వంశ పురుషుల గురించి రెండు సర్గలలో వర్ణింపబడిన కావ్యం .చేర రాజులలో చెంగుత్తవన్ ప్రస్తావన చేసి ఆయనను చేరమాన్ పెరుమాళ్ అన్నాడుకవి .తర్వాత ముకుందమాల కర్త కులశేఖర ఆళ్వార్ ను ప్రస్తుతించారు .మిగిలిన రాజులైన స్తాను రవి ,భాస్కరరవి ,గోవర్ధన మార్తా0డ  ,సంగమాది రవివర్మ ,కేరళవర్మ ,మార్తా0డ వర్మ ,శ్రీమూలం తిరుణాల్ ,చిత్ర తిరుమాళ్ మహారాజుల జీవిత వర్ణన చేశాడు

407-మార్తా0డ శతక  కర్త -మార్తా0డ వర్మ (1705-1758 )

111 శ్లోకాలున్న మార్తా0డ  శతక  కర్త రాజా వీర మార్తా0డ వర్మ .ఇది తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ మార్తా0డ వర్మ చరిత్ర .మొదటిశ్లోకం లోనే అయన వంశం వర్ధిల్లుగాక అని మొదలు పెట్టాడు .కార్తీక మాసం అశ్వినీ నక్షత్రం లో పుట్టాడని చెప్పి నాలుగవ శ్లోకం లో భారత దేశ రాజులలో గ్రాడ్యుయేట్ అయినమొట్టమొదటి  రాజు ఆయనేనని ,8 వ శ్లోకం లో ఆయన అన్నగారు కేరళవర్మ గురించి ,తర్వాత రాజమాతమరణం  పిమ్మట రాజు దేశాటనం లో హిమాలయ సందర్శనం రాసి మిగతాదానిలో ఆయన గుణగణాలను ప్రజాహితపాలనను వర్ణించాడు .మంత్రులు హితైషులు ఎందరు ఉన్నా నిర్ణయాలు స్వయంగానే తీసుకొనేవాడని ,అబద్ధాన్ని సహించేవాడుకాదని కవి తెలియజేశాడు .

408- పద్మనాభోదయ కావ్య కర్త -శంకుకవి (18 వ శతాబ్దం )

శంకర లేక శంకుకవి కేరళకు చెందిన 18 వశాతాబ్దిపూర్వభాగపు కవి ..తిరువనంతపురం లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి క్షేత్ర మహాత్మ్యంగా ‘’పద్మనాభోదయ ‘’కావ్యంయువరాజు రామవర్మ అభ్యర్థనపై  రాశాడు.కవి తమిళనాడు బ్రాహ్మణుడు . కావ్యం నాలుగుపద్ధతులు అంటే  భాగాలలో  142 శ్లోకాలలో ఉంది .దివాకర యతి అనుగ్రహం తో అనంత పద్మనాభ స్వామి అనంత వైభవాన్ని ఆనంద పారవశ్యంగా రాశాడు .రామవర్మ మాట తనకు దైవ శాసనమే అన్నాడు .రామవర్మ రాజు మూర్తీభవించిన ధర్మస్వరూపం అని ,ధర్మాన్ని నిత్యజీవితం లో ఆచరించి మార్గ దర్శకుడవటం వలన ఆయన శీల  ప్రవర్తనాదులవల్ల ఆయనను రామవర్మ అనికాకుండా ధర్మరాజు అనే ప్రజలు పిలిచేవారని చెప్పాడు

409-కేరళ విల్లాస  కావ్యాలు

కేరళకు చెందిన 19 వ శతాబ్ది మనవిక్రమకవి కేరళపై కేరళవిలాస కావ్యం రాశాడు.ఈయన కాలికట్ వాడు .కేరళోల్పత్తి ఆధారంగా దీన్ని 105 శ్లోకాలలో రాశాడు .ఏళత్తూర్ కు చెందిన రామస్వామి శాస్త్రి 1882లో వైశాఖం తిరుణాల్ మహారాజా కాశీ యాత్రను వర్ణిస్తూ ‘120 శ్లోకాల కాశీయాత్ర వర్ణన రాశాడు .సుబ్బరామ పట్టారు ‘’ఆ పద్దీప  ‘’అనే 33 శ్లోకాల కావ్యాన్ని జమోరిన్ రాజ్యాన్ని విడిచి వెళ్లిన ఒక దీన బ్రాహ్మణకుటుంబ గాధను వారు కొచ్చిన్ మహారాజు ఆశ్రయం పొందటానికి సహకరించిన అద్భుత అదృశ్య శక్తి గురించి చెప్పాడు .తిరువాన్కూర్ రాజవంశ చరిత్రను గణపతి శాస్త్రి లఘుకావ్యంగా ‘’శ్రీమూల చరిత్ర ‘’రాశాడు .అనంతగిరి ‘’గురు దిగ్విజయ ‘’పేరిట ఆది శంకరాచార్య చరిత్రను ,తుళు బ్రాహ్మణులు తుళునాడు వదలి కొళత్తూర్ ఉదయవర్మ రాజ్యానికి చేరే కథను ‘’బ్రాహ్మణ ప్రతిష్ట ‘’కావ్యంగా ,కొళత్తూనాడు ఉదయవర్మపై 8 శ్లోకాల ‘’దేశ్యాస్ట కం ‘’,కొచ్చిన్ కు చెందిన పరీక్షిత్ తంపురాన్ రాసిన చిన్నకావ్యం ‘’మాల ‘’,వైశాఖం తిరుణాల్ మహారాజాపై కేశవన్ వైద్యం రాసిన ‘’విశాఖ విలాసం ‘’మద్రాస్ గవర్నర్ లార్డ్ నేపియర్ 1883 లో త్రివేండ్రం సందర్శనను ఏళత్తూర్ రామస్వామి శాస్త్రి ;;గౌణ సమాగమం ‘’కావ్యంగా ,కడ త్తనాడు రాజు నిర్వహించిన మహా మృత్యుంజయ యాగాన్ని వర్ణిస్తూ మీథలే మాదం కు చెందిన శంకరవారియర్ రచించిన ‘’మహా మృత్యుంజయ చరిత్ర ‘’,కొచ్చిన్ మహారాజు మహా వాగ్ధోరణిని ,షష్టిపూర్తి ఉత్సవాన్నీ వర్ణిస్తూ నెల్లూరుకాండీ కి చెందిన కృష్ణన్ నంబూద్రి రాసిన ‘’మాతామహిషా షష్టి పూర్తి దశకం ,తిరువాన్కూర్ వైశాఖం తిరుణాల్ మహారాజు చేసిన సేతుయాత్రపై టి. గణపతి శాస్త్రి రాసిన ‘’సేతుయాత్రావర్ణన ‘’మొదలైనవి కేరళలో ఉద్భవించిన సంస్కృత లఘు విలాస కావ్యాలుగా చరిత్ర ప్రసిద్ధి చెందాయి .

సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

King Of Travancore sct.jpg
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ముందుమాటలు

సాహితీ బంధువులకు శుభకామనలు-నేను రాసిన1- ”ఆధునిక ప్రపంచనిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”గ్రంథానికి   మచిలీ పట్నం హిందూకళాశాల చారిత్రిక శాఖాధ్యక్షులు డా. శ్రీ ఎస్ .వెంకటేశ్వరరావు గారు 2-గీర్వాణకవుల కవితగీర్వాణం -3 మూడవ భాగం  గ్రంథానికి  అవధాన సరస్వతి డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ముందుమాటలు రాయటానికి దయతో అంగీకరించారని తెలియ జేయటానికి సంతోషిస్తూ వారిద్దరి సౌజన్యానికి సరసభారతిపై ఉన్న ఆదరణ,అభిమానాలకు  కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను . ఇవి సరసభారతి ప్రచురించ బోతున్న 26 27 పుస్తకాలని తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాహితీభీష్ముడు -పోతుకూచి సాంబశివరావు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితాగీర్వాణం -3 401-కామ సందేశ కర్త -మాతృ దత్త (16వ శతాబ్దం

గీర్వాణ కవులకవితాగీర్వాణం -3

401-కామ సందేశ కర్త -మాతృ దత్త  (16వ శతాబ్దం

 కేరళకు చెందిన మాతృ  దత్త కవి ‘’కామ సందేశం ‘’కావ్యం రాశాడు .మేల్పత్తూర్ కు చెందిన ఈ కవి వ్యాకరణ వేత్త .నారాయణ భట్ కుటుంబానికి చెందినవాడు .కావ్యం మొదటిభాగం లో 66 ,రెండవభాగం లో 69 శ్లోకాలున్నాయి .భార్యతో ఆనందంగా గడుపుతున్న అతనిని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయి చిదంబరం లో ఉంచుతాడు .అక్కడ కామ దేవుని కలిసి తిరునావయ లో తన భార్య చంద్ర లక్ష్మికి  అతనిద్వారా సందేశం పంపటం ఇతి వృత్తం . అందరు  సందేశకర్తలలాగానే ఈ కవీ రూట్ మాప్ ఇచ్చి పంపిస్తాడు .దారిలో రెండు సార్లు కొచ్చిన్ రాజు రామవర్మప్రస్తావన ఉంది .కావేరి నదికి ఉపనదిని  కొల్లిదం  అంటారు  .కొచ్చిన్ రాజుకు పోర్చుగీసు వారికి మధ్య జరిగిన టోల్ ఒప్పందం కూడా ఇందులో ఉంది . 16వ శతాబ్దం లో త్రిచూర్ లో కొచ్చిన్  రాజభవన్ నిర్మాణాలు ,పాత రాజభవనాల విషయమూ ఉంది .రామవర్మ అంటే 1764 నుంచి 1801వరకు పాలించిన కేశవ రామ వర్మ అని గుర్తించారు . 1774లో కోట గోడలు మట్టితో నిర్మించటం అగడ్తలు త్రవ్వటం కూడా కవి రాశాడు . ఈయనకాలం లోనే పోర్చుగీసులతో ఒప్పందం కుదిరింది . రాజు ముసలితనం లో కాశీ యాత్ర కు వెళ్లి అక్కడే కైలాసం పొందాడు .ఈ సందేశం లో కాలికట్ నాయకరాజుల ,జమెరియన్ రాజుల వర్ణన ఉన్నది .కావేరి నాదీ తీర బ్రాహ్మణులూ ,వివిధ వృత్తులవారు అచ్యుతప్పనాయకుని ప్రశస్తి ఉన్నాయి .

402-శుభగ సందేశ కర్త -నారాయణ (16 వశతాబ్దం )

కేరళ త్రిసూర్ కు చెందిన నారాయణకవి శుభగ సందేశం రాశాడు .అంతకంటే జీవిత విశేషాలు తెలియవు .ఏవోకొన్ని అనివార్య కారణాలవల్ల దెయ్యంబారిన పడి   కన్యాకుమారిలో ఉండవలసి వచ్చి త్రిసూర్ లో ఉన్న భార్యకు దూరమయ్యాడు .విరహవేదన తట్టుకోలేక పోతున్నాడు కన్యాకుమారి అమ్మవారి పూజారి స్నాతక బ్రాహ్మణుడైన సుభగ పరిచయమవగా భార్యకు అతనితో సందేశం పంపటమే కథ .కవి జయసింహనాడు పాలకుడు రామవర్మ ఆశ్రితుడు .రాజు ఆశ్రిత పోషణ గురించి వర్ణించాడు . పరిశోధకుడు ఉల్లూర్ ఈ రామవర్మ అంటే విజయనగర రాజులతో యుద్ధం చేసిన ఉదయ మార్తా0డ  వర్మ సోదరుడు అని చెప్పాడు .కొట్టాయం లోని  చంపకా స్సేరి దేవాల0 , దాని కోశాధికారి యజ్ఞనారాయణను రాజా రామవర్మ నియమించటం ఉన్నాయి …

403-చాతక సందేశ కర్త – ఒక బ్రాహ్మణకవి

కేరళ  మలబార్ ప్రాంత తిరువంతం కుంజు లోని నంబూద్రి  బ్రాహ్మణకవి తిరువాన్కూర్ మహా రాజ రామవర్మకు ఒక చాతకపక్షి ద్వారా తనకు ఆర్థికసాయం చేయమని పంపిన సందేశం . 1787లో టిప్పూ సుల్తాన్ మలబారును ఆక్రమించినపుడు ఈబ్రాహ్మణుడు తిరువాన్కూర్ మహారాజు కార్తీక తిరుణాల్ ఆశ్రయం పొందాడు .కొంతకాలానికి అకస్మాత్తుగా జబ్బు చేసి రాజుకు తెలియ బరచకుండా తన స్వగ్రామం చేరాడు .అక్కడ కాళికాదేవి పూజలో గడిపాడు .అక్కడ ఒక వనం లో చాతకపక్షికనిపిస్తే దానికి తన గోడు చెప్పి రాజుగారికి వెళ్ళగక్కమని  సందేశానికిపంపటం ఇతి వృత్తం .ఇందులోనూ దారిలోఉన్నపట్టణాలు ప్రజాసమూహాలు రాజులవర్ణన యధాప్రకారం కవి దట్టించాడు .ఇందులో కొచ్చిన్ మంత్రి రాజ గోపాల్ ప్రస్తావన ఉంది  .ఈయన పి .రాజగోపాలాచారి అని కొచ్చిన్ దివాన్ గా 1896-1901వరకు ఉన్నాడు అన్నది  చారిత్రిక సత్యం .ఎడ ప్పల్లి బ్రాహ్మణ రాజుల వర్ణనా ఉంది .వాళ్ళు దాంతాలి నాయకులు కావచ్చు .

404-నీలకంఠ సందేశకర్త -శ్రీధరన్ నంబి (1774-1830 )

నెమలి సందేశం అనే సందేశకావ్యాన్ని శ్రీధరన్ నంబి రాశాడు . కేరళ పట్టాంబి వంశం వాడు .భారత పిశరాట్టి  శిష్యుడై గొప్ప జ్యోతిశ్శా స్త్ర   వేత్త అయ్యాడు ,. ఈ వంశం వారు కాలికట్ రాజుల ఆస్థాన కవులు జ్యోతిష శాస్త్ర వేత్తలుఅయ్యారు .ఈ కవి  విక్రమాదిత్య చరిత్ర కూడా రాశాడు .నాయకుడు నాయకికి నీలకంఠం అంటే నెమలి ద్వారా  పంపిన సందేశం .జామోరీ రాజులకు హైదర్ జంగ్ కు జరిగిన యుద్ధం ,యూరోపియన్ జంటలు వాహనాలమీద తిరగటం ,బ్రాహ్మణులు వేద వేదాంత శాస్త్రాలు నేర్వటం వగైరా వర్ణనలన్నీ ఉన్నాయి .

405-మరికొన్ని సందేశ కావ్యాలు

కవి సార్వ భౌమ కొకుణ్ణి తంపురన్ కోటు నల్లూర్  (1858-1926 )’’విప్రసందేశం ‘’,18 వ శతాబ్దికి చెందిన రామపనివాద ‘’122 శ్లోకాల శారికాసందేశం ‘’1858-1926 కాలపు కవి సార్వ భౌమ కొకుణ్ణి తాంపురన్ కోటు నల్లూర్ ‘’విప్ర సందేశం ‘’అజ్ఞాతకవి విరచిత ‘’చకోర సందేశం ,పులియనల్లూర్ తెక్కపట్టు అనే నంబూద్రి బ్రాహ్మణకవి ‘’సంపాతి సందేశం ‘’,వాయస్కర  కు చెందిన   ఆర్యన్ నారాయణ మసాటు ‘’స్యేన  సందేశం ‘’కేరళలో సందేశకావ్యాలుగా చరిత్రకెక్కి సంస్కృత వాజ్మయం లో స్థానం పొందాయి.  ఇవన్నీ మూస కావ్యాలుగా కనిపించినా వాటిలో చారిత్రిక నేపధ్యం ఉన్నది.  ఆకాలపు రాజుల, ప్రజల జీవిత విధానాలకు అవి అద్దం పట్టాయి . వీటిపై ప్రత్యేక పరిశోధనలు జరిగి వాటిలోని చారిత్రిక  విషయాల నిగ్గు తేల్చారు పరిశోధకులు .. ఆరకంగా ఇవి చారిత్రిక సందేశ కావ్యాలుగా రాణ కెక్కాయి .

    సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8–8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 399-హంస సందేశ కావ్య కర్త-పూర్ణ సరస్వతి (14 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

399-హంస సందేశ కావ్య కర్త-పూర్ణ సరస్వతి (14 వ శతాబ్దం )

కేరళకు చెందిన 14 వ శతాబ్దపు కవి పూర్ణ సరస్వతి -పూర్ణ జ్యోతిష్యుని శిష్యుడు .ఉత్తర మలబార్ లోని కాట్టుమటం ఇళ్లాం  కు చెందినవాడు .పూ ర్ణ సరస్వతి వంశాన్ని పరశురాముడు ఆశీర్వదించి నట్లు ఐతిహ్యం .అనేక శాస్త్రాలలో విస్తృతపాండిత్యం కవిత్వ రచనలో మేటి అవటం వలన ఆయనకు పూర్ణ సరస్వతి అనేది బిరుదుగా లభించిన పేరు .కావ్యం లో పూర్వభాగం ,ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి .మొత్తం 102 శ్లోకాలు .కాంచీపురం లో ఒక కన్య ఒక ఉత్సవం లో శ్రీ కృష్ణుని మోహన రూపం చూసి మనసు పారేసుకొన్నది . ఒక హంసతో తనమనోభావాలను బృందావన కృష్ణునికి సందేశంగా పంపటం ఇతి వృత్తం .రాయబారి హంస చేర  ,పాండ్య దేశాలు చూస్తూ కావేరి ,కాళింది ,తామ్రపర్ణి లను దాటి తిరువనంతపురం వగైరాలను చూస్తూ బృందావనం చేరింది వీటి నన్నిటిని కవి చక్కగా అందంగా వర్ణించాడు .తిరువాన్కూర్ రాజు సర్వకళా  వల్లభ వంశీష. ఆయన బలపరాక్రమాలు వర్ణించాడు . బహుశా ఈ రాజు స్వాతి తిరుణాల్ రామవర్మ కావచ్చును .ఆయన రాజరికానికి వచ్చిన 1829-46 కాలం లో ఈ కావ్య రచన చేసి ఉండాలి .ఇందులో సుచీన్ద్రం లోని ప్రసిద్ధ ‘’కై ముక్కు ‘’అంటే వేడి నేతిలో చేయిపెట్టటం కూడా వర్ణితం . దోషి ఎవడైనా శుచీన్ద్రాలయం లో వేడి నే తిలో చేయి పెట్టించి దోషి అవునోకాదో నిర్ణయిస్తారు .దోషి అయితే చేయి కాలిపోతుంది .లేకపోతె ఏమీ కాదు

 కావ్యం లో దేవదాసి వ్యవస్థ వర్ణన కూడా ఉన్నది .తామ్రపర్ణి నదీతీర బ్రాహ్మణ అగ్రహారాలు స్నానఘట్టాలు ప్రకృ తి సౌందర్యం వర్ణన కూడా కనిపిస్తుంది ,.బ్రాహ్మణులను భూదేవతలు అని వర్ణించాడుకవి .

400-మయూర సందేశ కర్త -ఉదయ (16 వ శతాబ్దం )

కేరళ సందేశకావ్యాలలో మయూర సందేశం తలమాని కమైనది . దీనికర్త ఉదయ 16 వశతాబ్ది రాజకవి.ధ్వన్యాలోకానికి అభినవ గుప్తుడు రాసిన లోచన వ్యాఖ్యానికి ఈయన ‘’కౌముది ‘’వ్యాఖ్య రాశాడు .ఉదయ మానాకులం రాజా వంశీకుడు .వీరిపూర్వీకుడు శ్రీకంఠ మహాకవి .శ్రీకంఠుడు అనే నాయకుడు అంటే కవే  కున్నాం కులం వద్ద అన్నకార లో ఉన్నతనప్రేయసి మార చేమంతి కి మయూరంద్వారా తనమనసులోమాటను రాయబారంగా పంపటం .త్రివేండ్రం నుండిఅన్నకారకు మాప్ వేసి దారి చూపించడు కవి .సముద్ర  తీరం వెంబడి వర్కాలనుంచి క్విలన్ కు వెళ్లి ,అక్కడినుంచి తూర్పు కు తిరిగి కంటియూర్ మీదుగా కాయముకులం రాజుల రాజధాని కొట్టాయం చేరి , పుల్లా నదిదాటి కొచ్చిన్ రాజులువుండే త్రిపునీతురావెళ్లి .అల్వాయ్ నదిదాటి చిన్నమంగళం క్రన్ననూర్ మీదుగా బ్రహ్మమక్కాలకు తన ప్రేయసిని చేరుకోవాలి అని రూట్ మాప్ ఇచ్చిపంపాడు .ఇందులో చెప్పబడిన రాజులు మహాకవులు వ్యాఖ్యానాలు రాసినవారు .కోళంబ  అనేది కూపకులుల నగరం .

  సశేషం

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-17-కాంప్-షార్ల్లెట్- అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 397-దర్శన మాల కర్త -నారాయణ గురు (1885-1928 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

397-దర్శన మాల కర్త -నారాయణ గురు (1885-1928 )

కేరళలో తిరువనంత పురం లోని చెంపల0తి లో  1885 లో నారాయణ గురు జన్మించాడు .తండ్రి మదన్ ఆసన్  ,తల్లి కుట్టిఅమ్మ .గురుకుల పద్ధతిలో ప్రాధమిక విద్య  ఉన్నత విద్య 1887 వరకు నేర్చాడు .ఈకాలం లోనే తర్క ,వ్యాకరణ కావ్య నాటక వేదాంతాలు క్షుణ్ణంగా అభ్యసించాడు . సకల సద్గుణ రాశి గా పేరు పొందాడు .మంత్ర వేత్తగా ఉపన్యాసకుడుగా గురువుగా బోధకుడుగా సన్యాసిగా ప్రముఖుడయ్యాడు .కేరళలో హిందూ మత ,పునరుద్ధరణకు ,అందులోని మూఢ ఆ ఛారాలను తొలగించి సంస్కరణ చేసినందుకు నారాయణ గురు ను సదా స0స్మరించుకొంటారు .

 సంఘం లో అట్టడుగున ఉన్న అణగారిన కిందికి తొక్కబడిన జాతులవారిని కులమత భేదాలు లేకుండా చేరదీసి వారినీ సమాజం లో సమాన హోదాగలవారినిగా చేయటానికి చైతన్య వంతులను చేశాడు .తోటివారిని మానవులుగా గుర్తించాలే తప్ప హిందూ ముస్లిం క్రైస్తవాదులుగా గుర్తించరాదని బోధించాడు .వేద ,ఉపనిషత్తులు సర్వశాస్త్రాలు బాగా ఆకళింపు చేసుకున్నవాడుకా నుక వాటిలోని పరమ రహస్యాలను అర్ధం చేసుకొని ఆచరణ సాధ్యం చేశాడు .మనిషి వ్యక్తిత్వ వికాసానికి తోడు పడ్డాడు . దేశసంచారం చేస్తూ కట్టాంబి స్వామిని కలిసి ఆయన శిష్యుడై ఇద్దరూకలిసి సంఘ దురాచార నిర్మూలనకు నడుం కట్టారు .యోగ విద్యనూ సాధించాడు .వివాహమైందికాని సఫలం కాలేదు .

  నారాయణ గురు అరివిప్పురం లో ఒక శివ లింగ ప్రతిష్ఠచేసి గుడికట్టించి దాన్ని గొప్ప యాత్రాస్థలంగా మార్చాడు . 1895 లో డా.పల్పు ను కలుసుకోవటం తో సాంఘిక సేవకు మంచి ఊపు లభించింది .1903 లో ‘’శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన యోగం ‘’స్థాపించి అదో జగత్ సహోదరుల ను ఆదుకున్నాడు .నారాయణ గురు యజ్వ కులంలో పుట్టాడు ఆకులం వారికి అప్పుడు విద్యాలయాలలో  ఉద్యోగాలలో దేవాలయాలలో ప్రవేశం లేదు . ప్రముఖ మలయాళ వి కుమార  ఆసన్ ఈయన శిష్యుడే .ఆ సంస్థకు సెక్రెటరీ గా ఉన్నాడు . సంస్థ ‘’వివేకోదయం ‘’దిన పత్రిక ను ఆసన్ సంపాదకుడుగా ప్రారంభించింది .వీరి కులాలలో కెట్టు కళ్యాణం అనే శాస్త్ర బద్ధమైన ఖర్చుతోకూడిన తంతు  చేసుకొన్నవారికే  వివాహ యోగ్యత ఉండేది .ఈ పద్ధతిని మానిపించి సూటిగా తక్కువ ఖర్చుతో ఆదర్శ వివాహ పద్ధతిని జరిపించి సఫలుడయ్యాడు నారాయణ గురు .శివ గిరిలో శారదా మఠం  అలివిప్పురం మొదలైన చోట్ల ఆశ్రమాలు కట్టించి ,తాలస్సేరిలో జగన్నాధ దేవాలయం నిర్మించి అందరికి దేవాలయ ప్రవేశం కల్పించి గాంధీ ,ఠాగూర్ ల ను ఆహ్వానించి మన్ననలు పొందాడు .

 వేదాంత సంబంధమైన గ్రంథాలెన్నో నారాయణ గురు రాశాడు .కొన్ని సమాజ ఉద్ధరణకు రాశాడు .ఆయన సంస్కృత రచనలలో దర్శన మాల ,ఆత్మోపదేశ శతకం ,దైవ దశకం ,అనుకంప దశకం ,జటిలాక్షణం , చిచ్ఛ దా చింతనం ,శివశతకం,అద్వైత దీపికా ,జనని నవారత్న మంజరి ,నిర్వృతి పంచకం ,వినాయకాష్టకం ,జ్ఞాన దర్శనం ,చిదంబర శతకం ,ఇంద్రియ వైరాగ్యం  శ్రీ కృష్ణ దర్శనం కలినాటకం  మొదలైనవి ఉన్నాయి . 1928 లో ఈ ఆధ్యాత్మిక పుణ్య పురుషుడు నారాయణ గురు 43 ఏళ్లకే నారాయణ సన్నిధానం చేరాడు .

398-కేరళలో వివిధ రూపాలలో వర్ధిల్లిన సంస్కృత నాటకాలు

సంప్రదాయ ,జానపద పద్ధతులలో సంస్కృత నాటకాలు కేరళలో బహుళ వ్యాప్తి పొందాయి .అభినయ శైలి అద్భుతం .ఈ ప్రదర్శనా రూపకాలు -కుట్టియాట్టం ,ఛాక్యార్ కుట్టు ,నంగ్యార్ కుట్టు ,కృష్ణాట్టం అని వేర్వేరురకాలు ..

1-కుట్టి యా ట్టమ్ – కేరళలో సంస్కృత నాటకాలు ఆడటం ప్రారంభమైనది దీనితోనే .ఇది దేశంలో మిగిలిన చోట్లకంటే కొంచెం భిన్నంగా ఉంటుంది .అతి ప్రాచీన కళ  ఇది .కుట్టి అంటే కూడి అంటే కలిసి అని ,అట్టం అంటే నటించటం .అంటే కలిసి నటించటం అన్నమాట .నృత్యనాటకం లో ఉపరూపక విధానం . భరతముని చెప్పిన అన్ని సిద్ధాంతాలను దీనిలోపాటిస్తారు .ఈ కళ 10 వ శతాబ్దికి బాగా వ్యాప్తి చెందిన అతి ప్రాచీన ప్రదర్శన విధాన0 .కులశేఖర వర్మ కేరళలో దీన్ని మొదటిసారిగా ప్రదర్శించారు . దీనిలో ఆంగిక, వాచిక, సాత్విక ,ఆహార్య అభినయాలుంటాయి .ముద్ర ,చారి పద్ధతులను వాడతారు .తాళానికి మిలవు ,ఇడక్క ,కూడంకుల ,కూళితాళం  ఉపయోగిస్తారు . కుట్టియాట్టోమ్ లో ప్రదర్శించే సంస్కృత నాటకాలు -శక్తి భద్రుని ఆశ్చర్య చూడామణి నాటకం ,సుభద్రా ధనుంజయం ,కులశేఖరుని తపతీ  స్వయంవరం  హర్షుని నాగానందం ,నీలకంఠుని కళ్యాణ సౌగంధికం ,బోధాయనకవి రాసిన భగవదజ్జుక ,భాసుని అభిషేక, స్వప్న వాసవ దత్త , దూత వాక్య నాటకాలు

2-చాక్వార్  కుట్టు -ఇందులో న0జి యార్ ,నంబియార్ లు ఉంటారు .కుట్టియాట్టోమ్ లో ఇది విదూషక భాగం .ముఖ్యకథను హాస్యపద్ధతిలో అప్పటికాలానికి అన్వయిస్తూ విదూషకుడు చెబుతాడు .ఇది సంఘ దురాచారాలను ఖండించే రూపక విధానం .

3-నగరికుట్టు -ఇందులో ఆడవారే స్త్రీపాత్రలను ధరించటం ప్రత్యేకత .నంబియార్ కుటుంబాలకు చెందిన నంగియార్ లు నటిస్తారు .శ్రీ కృష్ణ కథలనే ప్రదర్శిస్తారు .వీటిలో ఏకాంకికలూ ఉంటాయి .చేటి నిర్వహణ బాధ్యత తీసుకొని కదా వృత్తాన్తమ్ తెలియ జేస్తుంది

4-కృష్ణాట్టం -ఇది అతిప్రాచీన సంప్రదాయ నృత్యనాటక ప్రదర్శన విధానం. దీనిని  1654లో గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం లో మొట్టమొదట ప్రదర్శించారు  .ఇందులో శ్రీకృష్ణుని జన్మ వృత్తాన్తమ్ దగ్గరనుంచి స్వర్గారోహణ వరకు 8 కధలను 8 రాత్రులు  ప్రదర్శిస్తారు.ఇందులో నృత్య సంగీతాలకే అధిక ప్రాధాన్యం .సంస్కృత సంగీత నాటకాలకు కేరళ ప్రజలు ఇస్తున్న ఆదరణకు ఇవన్నీ అద్దం పడుతూ వారి సాంస్కృతిక అభిరుచికి జోహార్లు అందుకొంటున్నాయి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Narayana Guru.jpg

— నారాయణ గురు


   కూడియాట్టం


  కృష్ణాట్టం 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 395-చంద్రికా వీధి నాటక కర్త -రామ పనివాద (18 వ శతాబ్దం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

395-చంద్రికా వీధి నాటక కర్త -రామ పనివాద (18 వ శతాబ్దం

కేరళకు చెందిన 18 వ శతాబ్ది సంస్కృతకవి రామపనివాద గొప్ప సంస్కృత  విద్వా0సుడు .ఆ కాలపు ఎందరో రాజుల సంస్థానాలలో మన్ననల  నందుకున్నవాడు .ప్రాకృతభాషలోనూ అసామాన్య పాండిత్యం ఉన్నవాడు సంస్కృత ,ప్రాకృతాలలో చాలా రచనలు చేశాడు .వెత్తట్టు నాడు ప్రభువు వీర రాయల కోరికపై ‘’చంద్రికా వీధి ‘’ని ,అమలప్పుళ రాజు దేవనారాయణ కోరికపై ‘’లీలావతి వీధి ‘’ని ,తిరువనంతపురం సామ్రాజ్య స్థాపకుడు మార్తా0డ  వర్మ కోరగా ‘’సీతారాఘవ నాటకం ‘’చెన్నమగళం సైన్యాధియతి  కుబేర బిరుదాంకితుడు పలియాత్ అచ్చన్  అడగగా ‘’విష్ణు విలాసకావ్యం ‘’,కున్నమకులం లో మానాకులం కుటుంబం లో  ప్రసిద్ధుడైన ఆర్య శ్రీకంఠ రామవర్మ కోరికపై ‘’ముకుంద శతకం ‘’రాసి ప్రభువుల సైన్యాధికారులు ,ఉన్నత కుటుంబీకుల గౌరవ మన్ననలు పొందాడు . రామ ‘’పని వాద ‘’మంచి పనివాడు’’ అనిపించుకున్నాడు . పనివాద పేరును బట్టి ఆయన నంబియార్ కుటుంబం వాడని భావించారు . ఈ వంశం వారు ఛాక్యార్ లకు సంస్కృత నాటక ప్రదర్శనలో ‘’మిలవు ‘’అనే డ్రమ్ ను వాయిస్తూ సహాయపడేవారు .రామపని వాద నారాయణీయం రాసిన  నారాయణ భట్టు శిష్యుడు .తన రచనలన్నిటిలో గురుపాదుని సంస్మరించాడు .

 ఆయన రాసిన రాఘవీయ మహా కావ్యం లో 20కాండలు ,1572 శ్లోకాలున్నాయి .ఇవికాక మదన కేతు చరిత ప్రహసనం ,ముకుంద ,శివ ,సూర్య శతకాలు ,అంబర నాధీశ  స్తోత్రం  భాగవత చంపు ,వృత్త వార్తిక ,తాళ ప్రస్తార కావ్యం ,రాసక్రీడ తోపాటు కొన్ని సంస్కృత వ్యాఖ్యానాలు శాస్త్రీయ రచనలు చేశాడు .ఆయన రాసిన రాఘవీయానికి విష్ణువిలాసం మేలత్తూర్ దాతుకావ్యం గా భావిస్తారు .సుకుమార రాసిన కృష్ణ విలాసం పై విలాసిని ,వివరణ అనే వ్యాఖ్యలు రాశాడు .వరరుచి రాసిన ప్రాకృత ప్రకాశకు వ్యాఖ్యానం ,కంస వధ  ,ఉషానిరుద్ధ లఘుకావ్యాలు .లలితా రాఘవ ,పాదుకా పట్టాభిషేక నాటకాలు  లీలాశుకుని ‘’గోవిందాభిషేకం ‘’కు వ్యాఖ్యానం కూడా కూడా ఈయన రచించాడని ఏం కృష్ణమాచారియార్ తెలిపాడు .ఇవికాక పంచపాది అనే సంగీత రూపకం ,ముక్కొల్లు దేవాలయదైవం పై 20 శృంగార శ్లోకాల శృంగార వింశతి  జ్యోతిషం పై కొన్ని గ్రంథాలు కూడా రాశాడని అంటారు .బహుముఖ ప్రజ్ఞాశాలి ,అన్ని ప్రక్రియలలో సమానమైనపాండిత్యం తో కవిత్వం చెప్పి మహాభిరామంగా రామ పనివాద ప్రశస్తి చెందాడు .

396-కట్టాంబి స్వామి  (1853-1924 )

కేరళకు చెందిన కట్ఠంబి స్వామి హిందూ వేదాంతి గొప్ప సంఘ సంస్కర్త .భారతీయ తత్వ శాస్త్రానికి యోగం జ్ఞానం ఉచ్చావ నిస్వాసాలు అని చెప్పాడు .అద్వైత బ్రహ్మ స్వరూప దర్శనానికి ఇవే  మార్గ దర్శకాలు .కేరళలో రాజకీయ ,మత, సాంఘిక ,సాహిత్యాలలో సంస్కరణలు చేయాలని భావించాడు . 1853 ఆగస్టు లో కేరళలో తిరువనంతపురం దగ్గర కొల్లూర్ లో జన్మించాడు .తండ్రి వాసుదేవ శర్మ .తల్లి నాగమ్మ .చిన్నప్పుడు అందరూ కుంజు అని ముద్దుగా పిలిచేవారు అదే తర్వాత కుంజుపిళ్ల గా  మారింది .తలిదండ్రులకు చదువుచెప్పించే స్తొమత లేకపోవటం తో పెట్టియిల్ రామం పిళ్ల  ఆసన్ నడిపే గురుకులం లో చేరాడు .క్లాస్ లీడర్ అయినందున ‘’కట్టాంబి ‘’అనే పేరు వచ్చి అదే స్థిరమైంది .స్వామినాధ దేశికులవద్ద తమిళం ,సుందరం పిళ్ల వద్ద తత్వ శాస్త్రం ,టిక్కట్టు అయ్యావు వద్ద యోగా నేర్చాడు . ఒక సంచారస్వామి ఆఊరి కి వచ్చి బాల సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశాడు .దీన్ని నిత్యం జపం చేసి గొప్ప అనుభూతిపొంది ‘’షణ్ముఖ దాస ‘’బిరుదుపొందాడు .కుటుంబ భారం మీద పడగా చిన్నచిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించి పోషించాడు .త్రివేండ్రం ప్ర భుత్వ సెక్రెటేరియట్ లో గుమాస్తాగా చేయాడు .

 తమిళనాడువెళ్లి శుభా జట పాటిక అనే శాస్త్ర కోవిదుని శిష్యుడై చాలా కాలం ఉండి సంస్కృతం శాస్త్రాలు ,సిద్ధ వైద్యం ,సంగీతం  మార్షల్ ఆర్ట్ వగైరా నేర్చాడు .హిందూ, క్రిస్టియన్ ,ముస్లిం మత పెద్దలవద్ద, అవధూతల వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొన్నాడు .ఒక గొప్ప విద్యావేత్తగా ,మహర్షిగా మారి కేరళకు తిరిగిరాగా  నారాయణ గురు1882 లో ఈయన్ను కలిసి  , ఆయన కొట్టాంబి శిష్యుడైపోయాడు  .ఇద్దరూకలిసి హిందూమతం లోని మూడాఛారాలను సంస్కరించాలని నిర్ణయించారు .ముందుగా మహిళా విమోచన ఉద్యమం చేబట్టి వారికి అన్నిటా సమాన ప్రా తినిధ్యమివ్వాలని ఉద్యమించారు .మత  మార్పిడులను ఎదిరించారు .

 కిట్టాంబి స్వామి రచనలు ఆయన మేధో శక్తిని వివరిస్తాయి .సంస్కృతం లో ఎన్నో ముక్తకాలు  భజన గీతాలు ,వ్యాసాలూ రాశాడు .ఆయన రచనలో ‘’వేదాధికార మిరూపణ ‘’ప్రసిద్ధ గ్రంథం .అద్వైత పధ్ధతి ,ఆదిభాష  ,క్రీస్తు మత నిరూపణం ,దేవీ మానస స్తోత్ర వ్యాఖ్యానం ,నిజానంద విలాసం ,సర్వమత సామరస్యం లు కూడా బహుళ ప్రచారం లో ఉన్నవే .ఆయనను ‘’కవి వస్త్రం లేని సన్యాసి’’ అంటారు . 1924 లో పన్మన వద్ద కిట్టా0బి స్వామి 71 వ ఏటమహా సమాధి చెందాడు .ఆయనను విద్యాధిరాజా అని ,విద్యారాజరాజతీర్ధ పరామభట్టార అని కేరళ ప్రజలు  గౌరవంగా సంబోధిస్తారు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -19-2(31-7-17 నుండి 6-8-17 వరకు ) సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

వీక్లీ  అమెరికా -19-2(31-7-17 నుండి 6-8-17 వరకు )

సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

సరసభారతి 106 వ సమావేశం గా మహర్షి బులుసు సాంబమూర్తి గారి131 జయంతి

 ఈ శ్రావణ శుక్రవారం షార్లెట్ లోని మహిళలందరు సంప్రదాయ పద్ధతిలో పట్టు చీర జాకెట్ తలలో పూలు కళ్ళకు కాటుక ,చేతులకు గాజులతో సాక్షాత్తు అపర లక్ష్మీ దేవి స్వరూపంగా కనిపిస్తుంటే ఎంతో ముచ్చట వేసింది . మన సంప్రదాయ సంస్కృతులను ఇంత గొప్పగా పాటిస్తూ మనందరికి కీర్తి తెస్తూ ,ఆదర్శ ప్రాయమవటం అభినందించదగిన విషయం .భారతీయ మహిళలూ మీకు జోహార్లు .

శ్రీ మతి బులుసు పద్మ తమ ఇంటికి శనివారం రాత్రి టిఫిన్ కు రమ్మనమని చెప్పినప్పటినుంచి  ఆ రోజు ఎలా దాన్ని సరసభారతి కార్యక్రమంగా నిర్వహించాలా అనే ఆలోచన లో మధనపడ్డాను . శ్రీ బులుసు సాంబ మూర్తి గారింట్లో కలుస్తున్నాం కనుక మనమందరం మర్చిపోయిన స్వాతంత్య్ర సమార యోధులు ఆంద్ర రాష్ట్ర అవతారాణానికి శ్రీ పొట్టి శ్రీరాములుగారితో ఉద్యమించిన మహర్షి బులుసు సాంబ మూర్తిగారు జ్ఞాపకం వచ్చి ,బులుసు వారింట బులుసు వారిని జ్ఞాపక0  చేసుకుందామనిపించి ,దానితోపాటు ‘’నవ్వులతో ఆట నవ్వులాట ‘’ను కలిపి అందరూ పాల్గొనేట్లు చేద్దామని అనుకొన్నాను .

5-8-17 శనివారం – .మేము వాళ్ళఇంటికి రాత్రి 7 గంటలకే చేరాం .మిగతావాళ్ళు రావటం ఆలస్యమైంది .వాళ్ళు వచ్చాక ముందు ‘’టిఫిన్ కోర్ట్ ‘’లో ‘’బ్యాటింగ్ ‘’ప్రారంభించాం . పూరీ కూర ,ఇడ్లీ చట్నీ సాంబార్ ,మిర్చిబజ్జీ ,వెజిటబుల్ బిర్యానీ ,జున్ను లపై పడి  వీరంగం చేసాం ..అంతా అయేసరికి రాత్రి 10 అయింది .అప్పుడు అందరం ఒక చోట చేరి సరసభారతి 106 వ కార్యక్రమంగా మహర్షి బులుసు సాంబమూర్తిగారి 131 వ జయంతి ని నవ్వులతో ఆట నవ్వులాట కార్యక్రమం ప్రారంభించాం .అందరూ ఎంతో ఆశ్చర్య పోయారు . బులుసువారింట బులుసువారిపై కార్యక్రమం అనగానే . .యాక్సి డెంటల్ కో ఇన్సి డేన్స్ అంటే ఇదేనేమో కదా . నేను ముందుగా సరస భారతి  సాహితీ ప్రస్థానాన్ని వివరించి బులుసు వారి జీవిత విశేషాలను తెలియ జేశాను .. నేను ఈమాట చెప్పే దాకా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాను అందరూ ఎంతో ఆశ్చర్యానందాలు పొందారు .అలా ఉండాలనే సస్పెన్న్స్ క్రియేట్ చేశా . నా మాటల సారాంశ0-

‘’శ్రీ బులుసు సాంబ మూర్తిగారు తూర్పు గోదావరిజిల్లా కాకినాడ దగ్గర దూళ్ల గ్రామంలో 4-3-1886న జన్మించారు . తండ్రిగారు సుబ్బావధానులుగారు ప్రసిద్ధ వేద పండితులు .సాంబమూర్తిగారు ప్రాధమిక విద్య స్వగ్రామం లో నేర్చి  విజయనగరం మహా రాజాకాలేజి లో ఫిజిక్స్ చదివి డిగ్రీ పొందారు . కొద్దికాలం గుమాస్తాగా లెక్చరర్ గా పనిచేశారు . తర్వాత న్యాయ శాస్త్రం చదివి 1911 లో పాసై కాకినాడ బార్ కౌన్సిల్ లో చేరి  న్యాయవాది అయ్యారు .

 1920 లో దేశమంతటా ఉధృతంగా సాగిన సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్నారు .దేశ భక్త కొండా వెంకటప్పయ్య  పంతులుగారి ఉపన్యాసాలకు ప్రభావితులై న్యాయవాద వృత్తి వదిలేసి స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమం లో పాల్గొన్నారు మహాత్మా గాంధీ జీవిత విధానం నచ్చి 1923 లో కాకినాడ లో జరిగిన కాంగ్రెస్ సభలో సభ్యత్వం తీసుకున్నారు . భారత దేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలని డిమాండ్ చేసిన తొలికొద్దీ మంది నాయకులలో సాంబమూర్తిగారూ ఒకరు . 1930 లో కాకినాడలో ఉప్పు సత్యాగ్రహానికి నేతృత్వం వహించారు .. 18-4-1930  లో అరెస్టయి వెల్లూర్ జైలు లో నిర్బంధం లో ఉన్నారు . 1937 మద్రాస్ అసెంబ్లీ కి  జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు . అసెంబ్లీలో  అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి సాంబమూర్తిగారిని లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ను చేసింది .ఈ పదవిలో అయిదేళ్ళున్నారు .

 1942 లో క్విట్ ఇండియాఉద్యమం ఊపందుకొన్నప్పుడు గాంధీ ఆదేశం పై రాజకీయనాయకులందరు పదవులను త్యాగం చేయగా సాంబమూర్తిగారు లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పదవికి రాజయినామా చేసి ఉత్సాహంగా ఉద్యమం నిర్వహించారు .గాంధీగారిలాగానే సాంబమూర్తిగారుకూడా పంచె పై చొక్కాలేకుండా ఉత్తరీయం మాత్రమే ధరించి ఆదర్శ జీవితం గడిపారు .. భారత దేశం 1947 ఆగస్టు 15 న  స్వతంత్రం పొందింది సాంబమూర్తివంటి త్యాగ ధనుల నిస్వార్ధ సేవకు ప్రతిఫలంగా దాన్ని మనం హాయిగా అనుభవిస్తున్నాం .

 అప్పటికి మనం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో ఉన్నాం .ఇప్పుడు ఆంధ్రులకూ స్వతంత్రం కావాలని మద్రాస్ రాష్ట్రం నుండి వేరు చేసి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు శ్రీ పొట్టి శ్రీరాములు శ్రీ బులుసు సాంబమూర్తి శ్రీ ప్రకాశం పంతులు మొదలైన నాయకులు .. ప్రధాని నెహ్రు ఊగిసలాటకు ఆగ్రహించిన పొట్టి శ్రీరాములుగారు ఆమరణ నిరాహార దీక్ష కు సంకల్పించారు .అప్పటిదాకా ఆయనవలన లబ్ది పొందిన కాంగ్రెస్ నాయకులు మొహం చాటేయటం ప్రారంభించారు .శ్రీ రాములు గారి దీక్షకు  స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు .అప్పుడు బులుసుసాంబమూర్తిగారు తమ ఇంట్లో సత్యాగ్రహం చేయమని కోరగా ,చేశారు ఆ ఆతర్వాత సంగతులు మనకు తెలిసినవే .. ఆంద్ర రాష్ట్రం మహనీయుల త్యాగ ఫలితంగా ఏర్పడింది .కానీ ఆ మహానీయులను తర్వాత ఎవరూ పట్టించుకోలేదు ఉపేక్షకు గురి చేశారు .

  సాంబమూర్తిగారు కాకినాడ చేరి జీవిత చరమాంకం అక్కడే గడిపారు . చేతిలో చిల్లి గవ్వ లేని దీన స్థితి వారిది .కేంద్ర మంత్రి గోవింద వల్లభ పంతుకు  ఈ విషయం తెలిసి ఆర్ధిక సాయం చేశారు .అంతకు మించి ఆదరించిన వారెవ్వరూ లేకపోవటం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం .మహర్షి గా అందరి మన్నన పొందిన బులుసు సాంబ మూర్తిగారూ 2–2-1958 న 72 వ ఏట పరమ పదించారు . ఆతర్వాత ఎప్పుడో ఆయన కుమార్తె ప్రభుత్వానికి ఆర్ధిక సాయం కోసం విన్నపం పంపిస్తే ‘’సాంబ మూర్తి ఎవరు ?”’అని అడిగారట .అదీ మన జాతీయ నాయకులకిచ్చిన గౌరవం . అందుకే సాంబ మూర్తిగారిని ‘’నెగ్లెక్టెడ్ పేట్రియట్  ‘’అన్నారు … ఈ నెల15 న మనం భారత స్వాతంత్య్ర  దినోత్సవంజరుపుకో బోతున్నాం . ఆ సందర్భం గా మహనీయ త్యాగమూర్తి మహర్షి బులుసు సాంబమూర్తి గారిని సంస్మరించి ధన్యులమవుదాం .శ్రీ బులుసు సాంబ మూర్తిగారింట్లో స్వర్గీయ బులుసు సాంబమూర్తిగారి ని స్మరించుకొని అవకాశం మనకు కలిగినందుకు ధన్యులం దీనికి బులుసు దంపతులను అభినందిస్తున్నాను ‘’అని చెప్పాను . బులుసువారి త్యాగనిరతిని అందరు మొదటి సారి తెలుకొని తరించామని భావించారు  .

          నవ్వులతో ఆట నవ్వులాట

 తర్వాత నవ్వులతో ఆట నవ్వులాట ప్రారంభించాం .ఇందులో అందరూ పాల్గొని తమ అనుభవాలను ,తాము విన్న కన్నా హాస్యపు పనస తొనలను ,జోకులకేకులు తినిపించారు . శ్రీమతి సుబ్బలక్ష్మిగారు ఆమె భర్త కామేశ్వరరావుగారు రాకీ దంపతులు పద్మ దంపతులు  మా అమ్మాయి విజ్జి తమ అనుభవాలను తెలిపారు .బాధ్యత నాదే  దీనికీ ఫినిషింగ్ టచ్ ఇస్తూ

‘’మన హాస్య రచయితలైన చిలకమర్తి వారి గణపతి ,ప్రహసనాలు ,పానుగంటి సాక్షివ్యాసాలు ,వీరేశలింగంగారి ప్రహసనాలు , మొక్కపాటి నరసింహ శాస్త్రిగారి బారిస్టర్ పార్వతీశం  మునిమాణిక్యంగారి కాంత0  కథలు ,భమిడిపాటివారి హాస్య నాటికలు ,శ్రీశ్రీ రిమరిక్కులు ఆరుద్ర కూనలమ్మపాదాలు పఠాభి పంచాంగం జలసూత్రం పేరడీలు  బాపు రమణల హాస్యకథామృతం కార్టూన్లు ,శ్రీరమణ పేరడీలు హాస్యపు చెణుకులు ,రావికొండలరావు హాస్య నాటికలు సినీకవి పింగళి సినీమేటి  హాస్యం  తెలుగు హాస్యం పండించిన శివరావు రేలంగి రమణారెడ్డి ,హాస్యరాజా బాబు ,బ్రహ్మానందం ఏం ఎస్, ధర్మవరపు ,ఏ వి ఎస్  ఆంగ్ల హాస్యం పండించిన చార్లీ చాప్లిన్ లారెల్ ,హార్దీ  .రచయితలు  మార్క్ ట్వైన్  డికెన్స్ అమెరికా కార్టూనిస్ట్ జాన్ ధర్బర్  కోటి కి పడగలెత్తిన కార్టూనిస్ట్ ?తెలుగు హాస్యం అమెరికాలో చిందించిన వంగూరి చిట్టెన్ రాజు లను ఒకసారి గుర్తు చేసుకొందాం . అలాగే ఆవకాయ అత్తగారు తో సంసార ధర్మహాస్యం ఘాటు చూపించిన భానుమతి ,సురేకార హాస్య టపాకాయ్ సూర్యకాంతం  కె ఆర్కే మోహన్ మొదలైనవారు గురించి యెంత చెప్పినా అతక్కువే ..

 శ్రీనాధుడు పల్నాటిపై రాసిన చాటువులు తెనాలి పాండురంగనిపై ప్రచారం లో ఉన్న కధలు అన్నీ హాస్యపు తేనే తుట్టెలే . తాగే ఓపికవుంటే మధురమేకాదు అద్భుతః .

పల్నాడులో నీరు  దొరక్క ‘’తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా !గంగ విడువు పార్వతి చాలున్  ‘’అని ‘’కుళ్ళా  యుంచితి కోకచుట్టితి మహా కూర్పాము న్ గట్టితిన్ ,చల్లా యంబలి  ద్రావితి  విశ్వస్తవడ్డి0పగా -తల్లీ కన్నడ రాజ్య  లక్ష్మీ దయలేదా నేను శ్రీనాధుడన్ ;;’ ‘’జొన్నకలి జొన్నన్నము జొన్నపిసరు జొన్నలే తప్పన్ సన్నన్నము సున్నసుమీ పదునుగ పల్నాటిసీమ ప్రజలందరికిన్ ‘’

అలాగే తెనాలి రాముడు తాతా ఊతునా అంటే సరే నంటే తాంబూలం ముఖాన ఉమ్మేస్తే  పాంకోడు పెట్టి పన్ను రాలగొడితే  దుప్పికొమ్ము పెట్టుకొని రాయల సభకి వస్తే రాయలు రవి గానని చో  కవిగాఅంచునే కదా అని సమస్య ఇస్తే -’’ఆ రవి వీరభద్రు చరణాహతి కిన్ డుళ్ళిన బోసి నోటికిన్  కొక్కెర పంటికిం దుప్పి కొమ్ము పల్గా రచియించె నౌరా -రవిగానని చో  కవి గాంచునే కదా ‘’చాటువు -విజయనగరమహారాజు పూసపాటి  ఆనంద  గజపతి రాజు తన ఆస్థాన వైణిక  విద్వాన్ నడిమింటి సంగమేశ్వర  శాస్త్ర గారిని ‘’శాస్త్రి గారూ ఇంకా నడిమిల్లేనా ‘’అని హాస్యమాడితే ‘’ప్రభూ మా నడిమిల్లు మీ’’ పూసపాటి ‘’‘’చేయదా  ?అని ఇచ్చిన రిపార్టీ ,కాంతం ,మునిమాణిక్యం ప్రణయ కోపం తో కొంతకాలం మాట్లాడుకోపోతే ఒక రోజు ఆయన మేడ మెట్లు ఎక్కుతూంటే ఆమె దిగుతుండగా ఎదురుపడితే మునిమాణిక్యం ‘’నేను మూర్ఖులకు దారి ఇవ్వను ‘’అంటే ‘’నేను ఇస్తాను ‘’అని చాచి చెంపమీదకొట్టినట్లు రిపార్టీ ఇవ్వటం ,ఫన్ బకెట్ ఫన్ బకెట్ జూనియర్స్ ,ఫన్నీ ఫెల్లోస్ ,ఫ్రాస్త్రేటేడ్ వుమన్ మొదలైనవన్నీ ఒక్క సారి జ్ఞాపకం జేసుకొని హాయిగా 45 నిమిషాలు నవ్వుకున్నాం ,.  తర్వాత ఉషా పద్మ విజ్జి అంతా కలిసి పాడ  వోయి భారతీయుడా ,మా తెలుగు తల్లికి పాటలు పాడి ముగింపుకు వన్నె తెచ్చారు .అనుకోకుండా కార్యక్రమం అద్భుతంగా ఆనందంగా హాయిగా జరిగినందుకు ‘’ఆల్ హాపీస్’’ .

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-17-కాంప్ -షార్లెట్-అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -19-1(31-7-17 నుండి 6-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -19-1(31-7-17 నుండి 6-8-17 వరకు )

సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

31-7-17 సోమవారం -ఉదయం సంధ్యావందనం ,నిత్యపూజ ,ఆంజనేయ అష్టోత్తర,సహస్ర నామ ,సువర్చలాఅష్టోత్తరపూజ తర్వాత  తొమ్మిదిరోజుల సుందరకాండ  శ్రీ సువర్చ లాన్జనేయ శతక పారాయణలో 5 వ రోజు పారాయణ ఉదయం పూర్తి చేశాను .. మా అమ్మాయి కొత్త ఉద్యోగం లో చేరింది .. మధ్యాహ్నం యు ట్యూబ్ జయ టివి లో మార్గశిర సంగీత ఉత్సవం చూశాను . చాలా అద్భుతంగా ఉంది . తమిళ తెలుగు కన్నడ మళయాళ హిందీ భాషలో గొప్ప సంగీత కచేరీలు కర్ణానందంగా ఉన్నాయి .. అలంకారిక ఆనంద నందనం -8 ,9 ఎపిసోడ్స్ రాశాను . రాత్రి ‘’గొట్టం ‘’లో  విశ్వనాధ్  సినిమా ‘’స్వరాభి షేకం ‘’చూశాము . ఆనందం తో గుండె కరిగి ఆనంద  బాష్పాలు  అడుగడుక్కీ కారి మహదానందమేసింది . ధన్యుడు  విశ్వనాధ్  .మనల్నీ ధన్యులను చేశాడు . అందులో రైల్వే కంపార్ట్ మెంట్ లో శివాజీ రాజా భార్యప్రసవం సీను సెంటిమెంట్ కు ,మానవత్వానికి ,సంగీత ప్రభావానికి ,హోమియో మందు ప్రయోజనానికి అద్దం పట్టింది . గుండెలు కరిగి ఆనంద తాండవమే చేయిస్తుంది . మొత్తం సినిమాలో ఒక పావుగంట సినిమా ఎడిటింగ్ లో తీసేసి ఉంటె శిఖరాగ్రాన నిలిచేది అని పించింది .

 ట్యూబ్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ -లక్ష్మణ్ కవల సోదరుల  ఇంటర్వ్యూ చాలా ఇంటరెస్టింగ్ గా రియలిస్టిక్ గా వాళ్ళ నిజాయితీకి నిదర్శనంగా ఉంది . పల్లె టూరు నుంచి సినీ పరిశ్రమకు వచ్చి ఎన్నో కస్టాలు పడి  ,ఏ దశలోనూ తమ నాయనమ్మ కు సిగరెట్ మద్యం జోలికి వెళ్ళమని చేతిలో చెయ్యేసి పెట్టిన ఒట్టును ,ఇచ్చిన మాట జవదాటకుండా ,అంచెలంచెలుగా ఎదిగి ఫైట్ మాస్టర్లు అయి సిగరెట్ ,మద్యం లేకుండా పైకొచ్చిన సోదరద్వయం వీరు .హీరోలుగానూ చేసి శెభాష్ అనిపించారు .అందులో వాళ్ళు ‘’మేము మంచివాళ్ళం అని అనుకునేవాళ్లం .ఇది కూడా గర్వానికి దారి తీస్తుందని మేమె గ్రహించి ఆ మాట చెప్పుకోవటం మానేసాం .ప్రతి స్టేజ్ లోనూ మా అంతటికీ మేము చెక్ చేసుకొని చేసిన తప్పులు తెలుసుకొని పురోగమించాం ‘’అని వారిద్దరూ ఏకకంఠం తో చెప్పట0  నాకు బాగా నచ్చింది ..

1-8-17 మంగళవారం -పారాయణ ఆరవ రోజు బాగానే జరిగింది ..ఆలంకారికులు 10 ,11 రాసి పూర్తి చేశా .

బుధవారం -7 వ రోజు పారాయణ . .గీర్వాణ కవుల  కవితా గీర్వాణం -3 లో 382,383 ఎపిసోడ్ లు రాశాను .

గురువారం -పారాయణ 8 వ రోజు ..గీర్వాణం -3 లో 384 నుండి 387వరకు కవుల గురించి   రాశాను .రాత్రి యు ట్యూబ్ లో హాస్య  చిత్ర దర్శకుడు రాజా వన్నేం రెడ్డి ఇంటర్వ్యూ చూశాను .’’క్షేమంగా వెళ్లి లాభంగా రండి ‘’ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా సూపర్ సక్సెస్  .ఆయనే డైరెక్ట్ చేసిన ఒక కుక్క పై తీసిన ‘’టామీ ‘’సినిమా అవార్డు లను పొందింది .రాజేంద్ర ప్రసాద్ అందులో హీరో .ఎక్కడో దారిలో ఒక కుక్క ఆయన వెంటపడి ఇంటికి వస్తే దాన్ని అల్లారుముద్దుగా పెంచుకొంటూ అదే సర్వస్వ0 గా గడుపుతాడు .రోజూ  అతను  రైల్ లో వేరే చోటుకు వెళ్లి ఉద్యోగం చేసి ,సాయంత్రం ఇంటికి వస్తాడు.  కుక్క ఆయనతో స్టేషన్ కు వెళ్లి మళ్ళీ సాయంత్రం ఆ ట్రెయిన్ వచ్చేసమయానికి అక్కడికి వెళ్లి వెంట తీసుకు వస్తుంది .అంత బాంధవ్యం ఏర్పడుతుంది వాళ్ళిద్దరికీ .ఒక రోజు యధా ప్రకారం ఆయన వెళ్ళాడు కానీ ,తిరిగి రాలేదు .ఆ విశ్వాసపు కుక్క ఏళ్ళ తరబడిరైల్వే స్టేషన్ దగ్గర అలాగే ఎదురు చూస్తూ తిండీ నీరు లేక చనిపోయింది  అతను  కూడా ఎక్కడో చనిపోయాడన్నమాట .విశ్వసానికి ప్రతీక గా టామీ కుక్క నిలిచి పోయింది .ఈకథ జపాన్ లో యదార్ధంగా జరిగింది .ఆ కుక్క విగ్రహం  స్థాపించి దాన్ని చిరస్మరణీయం చేశారట .ఆ కధకు ప్రేరణ పొందిన వన్నేం రెడ్డి మనవాతావరాణానికి తగిన మార్పులు చేసి తీశానని చెప్పాడు .అందులో రాజేంద్ర ప్రసాద్ నటన అద్వితీయమని ,కుక్క నాలుకను తన నాలుకతో తాకటం తన నాలుకను కుక్క తాకి నాలుకపై ఉన్నది తినటం దృశ్యాలలో ఏ మాత్రం సంకోచం ,అసహ్యం పడకుండా రాజేంద్ర చేయటం అతని నిబద్ధతకు నిదర్శనం అన్నాడు .అలా చేసిన నటుడు ఎవరూ ఉన్నట్లు తనకు తెలియదనీ రాజేంద్రను మెచ్చాడు . హాట్స్ ఆఫ్ రాజేంద్ర .

మదర్స్ డే సందర్భంగా ఎప్పటిదో -రాజీవ్ కనకాల ,వాళ్ళ అమ్మగారి తో ఇంటర్వ్యూ అతని చెల్లెలు శ్రీ లక్ష్మితో ముఖాముఖీ బాగున్నాయి అందరికీ ఆదర్శంగా కనకాల కుటుంబం నిలిచింది .సుమారు 20 ఏళ్ళక్రితం వేటూరి సుందర రామ మూర్తిగారి స్వగ్రామం కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి లో ఆయన తన ఇంట్లో ఆతిధ్యమిచ్చి జరిపించిన రెండు రోజుల సభలో కనకాల దేవదాస్ ద0పతులను ,విశ్వనాధ్ , బాలు, సప్తపది సినీ హీరోయిన్ సబితా వగైరాలను మేమిద్దరం చూసి మాట్లాడిన విషయాలు గుర్తుకొచ్చాయి .

4-8-17 శుక్రవారం -సుందర కాండ పారాయణం పూర్తి వరలక్ష్మీ వ్రతం

 శ్రావణ మాసం రెండవ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం .ఉదయం 4 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకొని 5 గంటలకు నిత్యపూజా ,శ్రీ సువర్చలాన్జనేయ అష్టోత్తర ,శతనామ పూజ చేసేసరికి ఉదయం 6-30 అయింది .రాత్రి తల్లీ కూతుళ్లు అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి గొప్ప శోభ చేకూర్చారు . అమ్మవారికి కట్టిన చీర చాలా శోభస్కరంగా ఉంది . అప్పటికే మా అమ్మాయి  వాళ్ళమ్మ లేచి వంట సగం పైనే చేసేశారు . 6-30 నుండి 7-45 వరకు వాళ్ళిద్దరికీ వరలక్ష్మీ వ్రతం యధా ప్రకారం చేయించి తోరపూజ తోరాధారణ మంత్రాలు చెప్పి కథ  చెప్పి వాయినాలు ఇప్పించేశాను .మా అమ్మాయి 8 గంటలకు బయల్దేరి ఆఫీస్ కు వెళ్ళింది .నేను తొమ్మది రోజులలో చివరి రోజు సుందరకాండ ,శ్రీ సువర్చలాన్జనేయ శతక పారాయణ పూర్తి చేసేసరికి .ఉదయం -8-45 అయింది .నైవేద్యంగా పూర్ణం బూరెలు గారెలు పులిహోర ,పాయసం ,పప్పు వంకాయ కూర కొబ్బరి చట్నీ . ఇంతలో శ్రీమతి ప్రక్కి అరుణ దంపతులు వచ్చారు . నైవేద్య హారతి మంత్రపుష్పం పూర్తయ్యేసరికి 9-15 అయింది . అరుణ దంపతులు మా దంపతులకు వస్త్రాలు అందజేసి వాయనం ఇచ్చుకున్నారు . ఆమెకూ మా వాళ్ళు కొత్త చీర జాకెట్ పేటి వాయనం ఇచ్చారు .

తర్వాత టిఫిన్  చేశాను .

 సుమారు 11 గంటలకు ప్రముఖ మృదంగ విద్వాన్ శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారి అల్లుడు వచ్చి వాళ్ళ ఇంటికి కారులో తీసుకువెళ్లాడు .ఎల్లా వారమ్మాయి 5 ఏళ్ళ క్రితం ఇక్కడే పరిచయం అప్పుడే వాళ్ళనాన్నగారితో ఫోన్ లో మాట్లాడుతుంటే మేమూ ఆయనకు నమస్కారాలు చెప్పాం . అయిదేళ్ల క్రితం వారు మా అమ్మాయిగారింటికి రావటం ఆయనను నేను ‘’టోరీ రేడియో ‘’కు ఇంటర్వ్యూ చేయటం ఆయన మా ఇంట్లో భోజనం చేయటం జ్ఞాపకం వచ్చాయి .ఆయన మర్చి పోలేదు . ఏడాది క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నాతో ఉయ్యూరుకు ఫోన్ లో మాట్లాడారు . విజయ మా ఇద్దరికీ బట్టలు పెట్టి వాయనమిచ్చి  టిఫిన్ పెట్టింది.మేము వాళ్ళఇంటికి వెళ్ళటం ఆమె ఆనందానికి అవధులు లేవని పించింది . .

 ఇంటికి రాగానే శ్రీమతి గోసుకోండ అరుణ  కారులో వాళ్ళింటికి తీసుకు వెళ్లి ఆదంపతులు మాకు బట్టలు పెట్టారు . వాయనం ఇచ్చారు . ఈ రెండు ఇళ్లకు మాతోపాటు మా ప్రక్కనున్న శ్రీ మతి సుగుణ కామాక్షిగారు కూడా వచ్చారు . ఇంటికి వచ్చి భోజనం చేసి సరికి మధ్యాహ్నం 1-30 అయింది .. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ భార్య శ్రీమతి రాధ మా ఆవిడను కారులో ఇంటికి తీసుకు వెళ్లి వాయనం ఇచ్చి ,చీర జాకెట్ పెట్టింది .

    సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మా అమ్మాయి ,వాళ్ళమ్మ కలిసి పిలిచిన వాళ్ళ ఇంటికి పేరంటానికి వెళ్లి వచ్చారు ఇంటికి వచ్చిన వారికి వాయనమిచ్చారు . రాత్రి 9 గంటలకు రాంకీ తమ్ముడు పవన్ భార్య శ్రీమతి పద్మశ్రీ వచ్చారు . పద్మశ్రీ అమ్మవారిపై శ్రావ్యంగా పాట  పాడింది . తర్వాత రాంకీ భార్య శ్రీమతిఉషా ,వాళ్ళ పెద్దమ్మ దంపతులు శ్రీమతి బులుసు పద్మజ వచ్చి పాటలుపాడి వాయనం తీసుకొన్నారు .పద్మ శనివారం సాయంత్రం వాళ్ళ ఇంట్లో టిఫిన్ కు రమ్మని ఆహ్వానించింది . ఆతర్వాత డా శ్రీమతి ఉపాధ్యాయుల శ్రావ్య ,వాళ్ళ అమ్మగారు వచ్చారు . ఆమె తలిదండ్రుల షష్ఠిపూర్తికి మమ్మల్ని పిలిస్తే వెళ్లాం . ఆమె అమ్మమ్మ మా గురువుగారు స్వర్గీయ  మహం కాళి  సుబ్బరామయ్యగారి తమ్ముడి భార్య అని అప్పుడు తెలిసింది .మళ్ళీ ఒక సారి జ్ఞాపకం చేసుకున్నాం . డా శ్రావ్య ఎంతో సాదా సీదాగా ఉంటారు . మంచి సంస్కారి .మళ్ళీ మనం కలుద్దాం అండీ అన్నారు . వీళ్ళ0దరికి మా అమ్మాయి వాయినాలు ఇచ్చింది అందరికి సరసభారతి పుస్తకాలు ఇచ్చాను చాలా సంతోషించారు  .

శనివారం -విజ్జీ వాళ్ళు తెలిసిన అమ్మాయి సీమంతానికి వెళ్లారు .మధ్యాహ్నం సాయి సెంటర్ నిరాహాహకురాలు శ్రీమతి జయ్ వాళ్ళ అత్తగారు ,లక్ష్మి పిల్లల డాక్టర్ నృత్య కళాకారిణి శ్రీమతి సాయి లక్ష్మి మొదలైనవారు వస్తే అందరికీ వాయినాలు ఇచ్చింది మా అమ్మాయి . డాక్టర్ గారికి మహిళా మాణిక్యాలు ఇచ్చాను ఆమె పొంగి పోయారు

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 393-  ఆంగ్ల సామ్రాజ్యం మహాకావ్య కర్త -ఏ.ఆర్. రాజరాజ వర్మ( 1863-1918 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

393-  ఆంగ్ల సామ్రాజ్యం మహాకావ్య కర్త -ఏ.ఆర్. రాజరాజ వర్మ( 1863-1918 )

      ఆంగ్ల సామ్రాజ్య సంస్కృత మహా కావ్యం రాసిన ఏ .ఆర్. రాజరాజ వర్మ కోయి తంపురన్ కేరళ దేశీయుడు .తల్లి కుంజి కావు తంబురాట్టి ,తండ్రి వాసుదేవన్ నంబూద్రి .  ఆయన రాసిన 30 గ్రంధాలలో దీనికి అత్యధిక ప్రాధాన్యం ఉంది .ఇది 23 సర్గలలో 1910శ్లోకాల కావ్యం .లండన్ నగర వైభవ వర్ణన తో కావ్యం ప్రారంభమై క్రమంగా ఆంగ్ల సామ్రాజ్య చరిత్ర ను ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు ను  రాశాడు కవి . ప్రతిశ్లోకం కావ్య గౌరవాన్ని పెంచేట్లు గా రాయటం కవి ప్రతిభకు నిదర్శనం .దీనిని 1901 లో టి గణపతి శాస్త్రి సంక్షిప్తంగా ముందుమాట రాసి ప్రచురించాడు .ఈ కవి ఇతర రచనలో విటవిభావరి లేక రాధా మాధవం నాలుగు భాగాలైన ‘’యమ’’లతో అలరారే చిన్నకావ్యం . తిరువనంత పురం లో సంస్కృత బోధపై ‘’గైర్వాణి విజయం ‘’రాశాడు .ఉద్దాలక చరిత వచన రచన ,తులాభారం ప్రబంధం ,ఋగ్వేదకారిక .పాణిని  అష్టాధ్యాయికి దీటుగా సంస్కృత వ్యాకరణం ‘’లఘుపాణినీయం ‘’. ఈ గ్రంథం  ఆయనను ‘’కేరళ పాణిని ‘’చేసింది .

294-కేరళోదయకర్త -డా .కె యెన్ .ఎళుత్తచ్చన్ (1911-1981)

సంస్కృత ,మళయాళ భాషలలో విస్తృత రచనలు చేసిన కేరళ పండితుడు డా .కె యెన్ ఎళుత్తచ్చన్ .పాలకాడు  జిల్లా చెరుపుల సెఱి లో 21-5-1911 న జన్మించాడు .విద్వాన్ పరీక్ష పాసై ,రెండు పాఠశాలలో పని చేసి బొంబాయి వెళ్లి తిరిగొచ్చి సంస్కృత ,మళయాళ ,ఇంగ్లిష్ లలో మాస్టర్స్ డిగ్రీ 1953 లో పొందాడు .మద్రాస్ యూనివర్సిటీలో లెక్చరర్ గాచేరి ‘’భాషా కౌతళీయం ‘’లో పరిశోధన చేసి పిహెచ్ డి పొంది ,కాలికట్ యూనివర్సిటీ లెక్చరర్ అయ్యాడు .కేరళ స్టేట్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ లో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అయ్యాడు .ద్రవిడియన్ లింగ్విస్టిక్ అసోసియేషన్ ఫెలోషిప్ పొంది ,కాలికట్ యుని వర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ చేశాడు .మళయాళ వ్యాకరణం పై విస్తృత పరిశోధన చేసి మళయాళ వ్యాకరణ చరిత్ర రాశాడు .మూడు చిన్నకథా సంపుటాలు ,మూడు కవితా సంపుటాలు ప్రచురించాడు మళయాళ భాషా సేవకు సాహిత్య అకాడెమి అవార్డు పొందాడు .

  సంస్కృతం లో రాసిన కేరళోదయాచారిత్రిక కావ్యం 21 సర్గలలో 2,500శ్లోకాలతో ఉన్నది .ఇది 1977 లో ప్రచురితమైంది .చరిత్రకావ్యాలలో ఇది అగ్రభాగాన నిలిచింది .కవి సృజన శక్తికి ,కవితాప్రతిభకు, శైలికి ఇది గొప్ప నిదర్శనంగా నిలిచింది .ఈ మహాకావ్యం లో జాతీయ సమైక్యతను చక్కగా చాటి చెప్పాడు .కావ్యాన్ని  స్వప్నమంజరి స్మృతిమంజరి ,ఐతిహ్య మంజరి ,బోధామంజరి చిత్ర మంజరి అనే అయిదు గుచ్చాలుగా విభజించాడు .కేరళ దేశం పరశురామ మహర్షి వలన ఏర్పడిందనే ఐతిహ్యం తో మొదలు పెట్టి  చేర  రాజుల ,జామోరీ రాజుల పాలన పోర్చుగీసుల రాక ,ఆధునిక కేరళ చరిత్ర అంతా సవివరంగా వర్ణనాత్మకముగా రాశాడు .మహాత్మా గాంధీ ,బాలగంగాధర తిలక్ వంటి జాతీయ నాయకుల చరిత్రనూ కలిపాడు .ఆధునిక భావాలను కూడా హాయిగా సుందరంగా సరళమైన సంస్కృతం లో రాయవచ్చునని కవి రుజువు చేసి చూపాడు . 28–10-1981 న 70 వ ఏట మరణించాడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 

A.R. Raja Raja Varma.jpg

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 391-శ్రీ వెంకటేశ్వర సుప్రభాత కవి -ప్రతివాది భయంకర శ్రీ అనంతాచార్య -(1430)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

391-శ్రీ వెంకటేశ్వర సుప్రభాత కవి -ప్రతివాది భయంకర శ్రీ అనంతాచార్య -(1430)

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య సన్నిధిలో ప్రతి రోజు తెల్లవారుఝామున స్వామిని మేల్కొల్పటానికి ఆలపించే  శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం  సుప్రభాతాలలో తలమానిక మైనది .దీన్ని రాసే అదృష్ట0 పొందినవాడు ప్రతి వాది  భయంకర శ్రీ అనంతాచార్య .ఈయననే అన్నాచార్య అంటారు .ఇదిక్రీశ.  1430 లో రాయబడిందిగా భావిస్తారు .అనంతాచార్య శ్రీ మనవాల మాముని  స్వామి శిష్యుడు . మనవాల  స్వామి శ్రీరంగం లో శ్రీరంగ నాధ సుప్రభాతం రాసిన శ్రీ వైష్ణవ మహా భక్త శిఖామణి .

 శ్రీ వేం కటేశ్వర సుప్రభాతం లో నాలుగు భాగాలుంటాయి -1- శ్రీ  వేంకటేశ  సుప్రభాతం -29 శ్లోకాలు 2-శ్రీ  శ్రీ వేంకటేశ స్తోత్రం -10 శ్లోకాలు -3- ప్రపత్తి-16 శ్లోకాలు  4-మంగళాశాసనం .-14 శ్లోకాలు  సుప్రభాతం లో మొదటి శ్లోకం వాల్మీకి మహర్షి రచించిన శ్రీ మద్రామాయణం లోని విశ్వామిత్ర మహర్షి శ్రీ రాముని నిద్ర మేల్కొల్పుతూ చెప్పిన ‘’కౌసల్యా సుప్రజా రామా ‘’శ్లోకం తో ప్రారంభమవుతుంది . అనంతా చార్యులు  నిత్యం అర్చించిన శ్రీ లక్ష్మీ నారాయణ ,శ్రీ భూదేవీ సమే త పద్మనాభ స్వామి విగ్రహాలతోపాటు 12 దివ్య సాలగ్రామ శిలలు ప్రస్తుతం ఆయనకు 15 వ తరం వారైన ప్రతివాది భయంకర రాఘవాచార్యులవారి వద్ద ఉన్నాయి .ఇప్పటికీ అవి ఆంద్ర ప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న దివ్య సాలగ్రామ క్షేత్రం లో నిత్యం పూజలందుకొనటం గొప్ప విశేషం .

1-సుప్రభాతం .

1-కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే -ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవ మాహ్నికం .

24-ఇత్ధమ్  వృషాచలపతే రిహసుప్రభాతం –  ఏ మానవాః ప్రతిదినం పఠితుమ్  ప్రవృత్తాహ్

   తేషామ్ ప్రభాత సమయే స్మ్రుతి రంగ భాజాం -ప్రజ్ఞాన్ పరార్ధ సులభ0  పరమాం ప్రసూతే . 2- స్తోత్రం

1-కమలాకుచ చూచుక కుంకుమతో -నియతారణ  తాతుల నీల తనో

  కమలాయత లోచన లోకపతే – విజయీభవ  వేంకట శైలపతే  .

10-అజ్ఞానినా మయాదోషా న శేషాన్నిహితాన్ హరే -క్షమస్వత్వం క్షమస్వత్వం శేష శైల శిఖా మనే  .

3-ప్రపత్తి

1-  ఈశాన్యాం  జగతోస్య  వేంకట  పతే ర్విష్ణో పరాం ప్రేయసీ0-తద్వక్షస్థల నిత్య వాస రసికాం  తత్  క్షాన్తి  సంవర్ధినీం

పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనే స్థితం -వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీమ్ వన్డే జగన్మాతరం .

4-మంగళాశాసనం

1-శ్రియహ్ కాంతాయ నిధయే నిధయేర్థినాం -శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం .

14-మంగళా శాసన పరై ర్ మదాచార్య పురోగమైహ్  – సర్వైశ్చ పూర్వై రాచార్యైహ్   సత్కృతాయాస్తు మంగళం .

యాభై అరవై ఏళ్ళ క్రితం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పుస్తకం లేని ఇల్లు ఆంద్ర దేశం లో ఉండేదికాదు . నోటికిరాని వారు ఉండేవారుకాదు .శ్రీమతి ఏం ఎస్ సుబ్బలక్ష్మి తన అమరాగాణంతో దానికి మరింత వైభవం తెచ్చింది . ఆమె సుప్రభాతం వినకపోతే శ్రీ వేంకటేశ్వరుడు నిద్ర లేచేవాడుకాదు అన్నంతగా ప్రచారమైంది

392- యతిరాజ వింశతి కర్త -మనవాల మాముని (1370-1450 )

తమిళనాడు ఆళ్వార్ తిరుమంఝీరిలో 1370 లో మనవాల మాముని జన్మించాడు .అసలుపేరుఅళగియమనవాల పెరుమాళ్ నాయనారు .అంటే శ్రీ రంగనాధస్వామిలాగా ఉన్న అందమైన పెళ్లి కొడుకు అని అర్ధం .. తండ్రి తిరునైదయ అన్నారు .తల్లి శ్రీరంగ నాచ్చియార్.తండ్రీ ,మాతామహులవద్ద వేదం  వేదాంతం దివ్య ప్రబంధాలు అభ్యసించి , 16 వ ఏట సిక్కి కేదారం నుంచి  తిరువై మోళి పిళ్ళై వెళ్ళాడు . ఇక్కడే రామానుజుల విగ్రహం ఉంది .ఇక్కడే ‘’యతిరాజ వింశతి’’రాశాడు .శ్రీ భాష్యం చదివి రామానుజ ఆదేశం పై దివ్య ప్రబంధ ప్రచారం చేస్తూ శ్రీరంగం చేరి తన పూర్వీకులులాగానే రంగనాధ సేవలో పునీతుడయ్యాడు .ఇక్కడే శ్రీ రంగనాధ సుప్రభాతం ,స్తోత్రం రాశాడు . అక్కడినుంచికనుంచి తిరుమల  మొద లైన పుణ్య క్షేత్ర దర్శనం చేసి  మళ్ళీ శ్రీరంగం చేరాడు

 పిళ్ళై లోకాచార్య రహస్య  గ్రంధాలైన ముముక్షుపది  శ్రీ వచన భూషణం ,తత్వరహస్యం లపై  వ్యాఖ్యానాలు రాశాడు . జ్ఞాన సారం ,ప్రమేయం సారాలపై కూడా వ్యాఖ్యలు రాశాడు .మళ్ళీ తిరునగరిచేరి ఆచార్య హృదయం పై వ్యాఖ్య రాశాడు . 1430 లో రంగనాధ స్వామి మనవాల  మామునిని శ్రీరంగం కు వచ్చి నమ్మాళ్వార్ రాసిన తిరుమొళి పై ఉపన్యాసాలు ఇమ్మని ఆదేశిస్తే వచ్చి అందరికి అర్ధమయేట్లు ఆయన హృదయాన్ని ఆవిష్కరించి చెప్పాడు .ఈయన ప్రసంగాలకు మురిసిపోయిన రంగనాధుడు చివరి రోజు బాల పూజారిగా వచ్చి అభినందిస్తూ ‘’తనియన్ ‘’చెప్పి  అదృశ్యమయ్యాడు . ఆ శ్లోకం అన్ని వైష్ణవ దివ్య క్షేత్రాలలో దివ్య ప్రబంధ గానం కు ముందు పఠిస్తారు ,-ఆ శ్లోకం –

‘’శ్రీ శైలేశ దయాపరం  ధీ భక్యాది గుణార్ణవమ్ యతీంద్ర ప్రవణం రామానుజ మతారం మునిమ్ . దివ్య ప్రబంధ పఠనం -’’శ్రీమతే  రమ్యాజ మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వాసినే భూయాత్ శ్రీ నిత్య శ్రీనిత్య మంగళం ‘’అని పూర్తి చేస్తారు అంత   గౌరవం ఇస్తారు మాముని స్వామికి .ఆయన 19 గ్రందాలరాస్తే అందులో మూడు సంస్కృతం ,మిగిలినవి తమిళం లో ఉన్నాయి .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-5-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 389-బాహుబలి విజయ నాటక కర్త -యెన్.రంగ నాధ శర్మ (1916-2014 )

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3

389-బాహుబలి విజయ నాటక కర్త -యెన్.రంగ నాధ శర్మ (1916-2014 )

సంస్కృత కన్నడ వ్యాకరణా ల లోతులు తెరచిన యెన్ రంగనాధ శర్మ 7-1-1916న కర్ణాటకలో నాడహళ్లి లో జన్మించాడు .బెంగుళూరు చామరాజేంద్ర సంస్కృత కళాశాలలో 1948 నుండి 1976 వరకు నాలుగు దశాబ్దాలు సంస్కృత కన్నడాలు బోధించాడు .ప్రముఖరచయితాజి వి గుండప్పకు సహాధ్యాయి .సంస్కృతం లో బాహుబలి విజయం  ,ఏక చక్రం ,అనే చారిత్రిక ,పౌరాణిక నాటకాలు ,గురు పరే మిత చరితం ,గోమఠేశ్వర సుప్రభాతం ,గుమ్మటేశ పంచకం రాశాడు .కన్నడం లో చాలా విస్తృత రచనలు చేశాడు ఎన్నో అనువాదాలు రచించాడు

కర్ణాటక రాష్ట్ర బహుమతి రాష్ట్రపతి ప్రశంసాపత్రం ,రాజ్యోత్సవ పురస్కారం ఉత్తమ అధ్యాపక అవార్డు ,మొట్టమొదటి డి వి జి మెడల్ ,మహామహోపాధ్యాయ ,గౌరవ డాక్టరేట్ ,సంస్కృత గ్రంథ రచన పురస్కారం వంటివి ఎన్నో అందుకున్నాడు . 25-1-2014 న 98 ఏళ్ళ నిండువయసులో రంగనాధ శర్మ శ్రీరంగ ధామం చేరాడు .

390-మహాయాన బౌద్ధ ప్రజ్ఞా పారమిత్ర  గ్రంథం  (క్రీపూ 100  )

మహాయాన బౌద్ధ ఉద్గ్రంధం ప్రజ్ఞా పారమిత్ర అంటే సర్వతోముఖ జ్ఞానం పొందే సాధన మార్గం .ఇందులో బోధిసత్వుని మాతృ దేవతగా భావించారు .ఇది మహాయానం లోని మూల సిద్ధాంతం .ఇందులోని  సూత్రాలు అనుత్పాద  మైనవి గా విశ్వసిస్తారు .ఒకరకం గా అపౌరుషేయాలు .ఇందులో 8 వేల  సూత్రాలున్నాయి .వీటిని ‘’అష్ట సాహస్రిక ప్రజ్ఞా పార మిత్ర సూత్రాలు ‘’అంటారు .. ఇవన్నీ క్రీపూ ఒకటవ శతాబ్ది కి చెందినవి అని పరిశోధకుడు ఎడ్వర్డ్ కాంజ్  రాశాడు . ఇందులోని సంస్కృతం నిర్దుష్టమైనది కాదని భావిస్తారు .. వీటి చైనీ అనువాదం క్రీశ 2 వ శతాబ్దిలో లభించాయి  .ఇవే రత్న గుణ సముచ్ఛయగా పిలువబడుతున్నాయి  . మహాయానం లోని భాగమైన ‘’చాటిక ‘’లవారు అభి వృద్ధి చేశారని అనుకొంటారు .ఇవన్నీ ఆంద్ర దేశం లో కృష్ణా నదీ తీరాన అమరావతీ ధాన్యకటకం  మహాయాన సంఘాలలో ఏర్పడినవిగా ఊహిస్తారు  .వీటిలోని శాఖలను పూర్వశైల ,అపర శైల అంటారు .వీటిలో ఒక్కొక్కవ్రాత ప్రతి   ప్రాకృత భాషలో ఉన్నాయి. వీటిలో బుద్ధుని బోధలున్నాయని హుయాన్ సాంగ్ ధృవీకరించాడు . 2012 లో హ్యారీపాక్ ,శేషి కరసీమ లు శిధిలమైన దీని వ్రాతప్రతిని ముద్రించారు .రేడియోకార్బన్ డేటా ప్రకారం ఇది క్రీశ . 75 కు చెందినదిగా గుర్తించారు .బౌద్ధ గ్రంధాలలో అతిప్రాచీనమైనదిగా దీన్ని భావిస్తున్నారు .చైనా భాషలోకి అనువదించిన లోకేశేన- గాంధారీ భాష వ్రాతప్రతిని ఆధారంగా  చేసుకొని చేశాడు .జపాన్ భౌద్ధులుమాత్రం దీనికంటే ‘’వజ్రచ్చేదిక’’ప్రాచీనమైనది అంటారు .చివరికి దీనికి వజ్రచేదికా ప్రజ్ఞా పారమిత్ర అని పిలుస్తున్నారు .దీనికి ఆచార్య నాగార్జునుడు ,మైత్రేయ అసంగ ,వసుభద్ర దిఙ్నాగాదులు వ్యాఖ్యానాలు రాశారు .

  సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -3 388-సుధాపరిమళ  వ్యాఖ్య కర్త -శ్రీ రాఘవేంద్ర స్వామి (1595-1671 )

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -3

388-సుధాపరిమళ  వ్యాఖ్య కర్త -శ్రీ రాఘవేంద్ర స్వామి (1595-1671 )

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వెంకట నాధుడుగా  తమిళనాడు భువనగిరిలో 1597లో కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో తిమన్నభట్ట  గోపికాంబ దంపతులకు జన్మించారు .మధురై లో బావ లక్ష్మీ నరసింహాచార్యులవద్ద  శాస్త్రాధ్యనం చేసి ,కుంభకోణం శ్రీమఠం లో చేరి ,సరస్వతీబాయిని వివాహమాడి ,లక్ష్మీనారాయణ ఆచార్య అనే కుమారుని కి తండ్రిఅయ్యారు.

 సుధీంద్ర తీర్థులవద్ద శిష్యరికం చేసి ఆయన అనుజ్ఞతో 1614 లో సన్యాసాశ్రమం స్వీకరించి  తమ శ్రీరామ భక్తికి నిదర్శనంగా ‘’రాఘలేంద్ర తీర్ధ ‘’అయ్యారు .సంస్కృతంలో నిష్ణాతులై వేద ,వేదాంత ,శాస్త్రాలను బోధించారు .గొప్ప సంగీతజ్ఞులేకాక వీణా వాదనలో గొప్ప నిపుణులుకూడా . 1621 లో  సుచీన్ద్రుల  తర్వాత శ్రీమఠం పీఠాధిపతి అయి 1671 వరకు ఉన్నారు  . దక్షిణ భారతం అంతా విస్తృతంగా పర్యటించి ద్వైతమత ప్రచారం ఉధృతంగా చేశారు .అనేక అద్భుతాలు చేసి ఆశ్చర్య పరచారు .1801 లో బళ్లారికలెక్టర్  గా ఉన్న థామస్ మన్రో రాఘవేంద్రస్వామి వారి అద్భుతాలను స్వయంగా చూసి అబ్బురపడి కైఫీయత్ లో  రికార్డ్ చేశాడు .

  రాఘవేంద్ర స్వామి ద్వైత మత గ్రంధం శ్రీమాన్ న్యాయ సుధకు సంస్కృతం లో .‘’సుధాపరిమళ వ్యాఖ్య ‘’రాశారు. మాధవా చార్యుల  పది ప్రకారణ గ్రంధాలలో ఆరింటిపై స్వామి దశప్రాకారణ వ్యాఖ్యానం రాశారు  .బ్రహ్మ సూత్రాలకు ‘’సూత్ర ప్రస్తానం ;; ఋగ్వేద ఉపనిషత్ ప్రస్థానాలు కూడా రాశారు .గీతా ప్రస్తానం శ్రీ రామ చరిత మంజరి ,శ్రీ కృష్ణ చరిత మంజరి ,ప్రతాః సంకల్ప గద్య ,సర్వ సమర్పణ గద్య కూడా రాఘవేంద్ర స్వామి రచించారు  .రాఘవేంద్ర స్వామిపై శ్రీ రాఘవేంద్ర విజయం ను వారి మేనల్లుడు ,నారాయణాచార్య రాశాడు .అప్పనా చార్య స్వామిపై 32 శ్లోకాల స్తోత్ర0 రాశాడు .ఇది  మఠం లో నిత్యా స్తోత్రమైంది . రాఘవేంద్ర స్వామి జీవితం పై ,మహాత్మ్యాలపై తెలుగు తమిళభాషలో చాలా సినిమాలు టివి సీరియల్స్ వచ్చాయి . తమిళనటుడు రజనీకాంత్ స్వామిగా నటించాడు . తెలుగు సీరియల్ లో ప్రసాద్ బాబు చేసినట్లుజ్ఞాపకం .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

–    శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

Varalakshmi vratham pooja procedureAadi 18 recipesAadi 18 celebration procedure


 

సాహితీ బంధువులకు ,సోదరీమణులకు రేపు 4-8-17 రెండవ శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 386-మధ్వ  విజయ కర్త -నారాయణ పండితాచార్య -(1240-1310)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

386-మధ్వ  విజయ కర్త -నారాయణ పండితాచార్య -(1240-1310)

ద్వైతమత స్థాపనాచార్యులపై మధ్వ  విజయం రాసిన నారాయణ పండితాచార్య శ్రీ మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడు త్రివిక్రమ పండితా చార్య కుమారుడు .మధ్వ విజయం 16 సర్గల మహాకావ్యం . మధ్వాచార్యులు సమకాలీకులవటం వలన ఈ గ్రంధం మన విద్యారణ్యులవారి శంకర విజయంలాగా సాధికారమైనది . దీనికి ఆయనే ‘’సుమధ్వ విజయ ‘’వ్యాఖ్యానం రాశాడు  ప్రకాశిక అనే పేరు కూడా ఉంది .నారాయణ పండితాచార్య శివస్తుతి ,3 వేల  శ్లోకాలతో సంగ్రహ రామాయణం ,ప్రమేయ నవ మాలిక  అనే ‘’అనుమాధవ విజయం’’ కూడా రాశాడు .ఇది 32 శ్లోకాల మధ్వ సంగ్రహ చరిత్ర .దీనికి రాఘవేంద్ర స్వామి తమ పూర్వాశ్రమం లో వ్యాఖ్యానం రాశారు .

 మణి మంజరి ,శుభోదయకావ్యాలు కూడా ఈ కవి రాశాడు .మణి మంజరిలో మధ్వాచార్యులు ముందున్న వైష్ణవాచార్యుల చరిత్ర అంతా  ఎనిమిది సర్గలలో సరళ సుందరంగా రాశాడు . ఈయన రచనన్నిటిపై విపులమైన వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి .మధ్వాచార్యులు దశ ప్రకాశం పై నారాయణ పండితాచార్య ప్రసిద్ధ వ్యాఖ్యానం ‘’విష్ణు తత్వ నిర్ణయ సారం ‘’రాశాడు . ఈ టీక నే ‘’తత్వ మంజరి ‘’అంటారు .అందుకనే ఈయనకు  ‘’ప్రాచీన టీకాకారుడు ‘’అని పేరు .   కేరళలోని కాసార్ గోడ్ లో ఇప్పటికీ ఆయన స్వగృహాన్ని చూడవచ్చు . దీనిని  గౌరవంగా ‘’కవి మఠం ‘’అంటారు  .

387-భ్రమర గీత కర్త -శ్రీ పాద రాజ(1404-1502)

కర్ణాటకలో హరిదాస ఉద్యమ పిత  . విజయనగర సామ్రాజ్య రాజగురువుకూడా .లక్ష్మీ నారాయణ తీర్ధ అనీ అంటారు ..కర్ణాటక చెన్నపట్న తాలూకా అబ్బూరులో జన్మిచాడు . ఆయనను ధ్రువుని అవతారంగా భావిస్తారు .. ద్వైత ,హరిదాసు సాహిత్యానికి ,రాజకీయ సాంస్కృతిక మార్పులకు ఆయన  అసమాన  కృషి చేశాడు . ఒకసారి స్వర్ణ వర్ణ తీర్ధ స్వామి అబ్బూరు వచ్చి బాల లక్ష్మీ నారాయణ ను అబ్బూరు ఎంత దూరం అని అడిగితె ,తెలివిగా ‘’అస్తమయ సూర్యుని చూస్తున్నారుకదా .మేము ఇక్కడ ఆడుతున్నాం కదా .యెంత దూరమో మీరే ఊహించండి ‘’అన్నాడు .అంటే చీకటిపడుతుంటే ఇంటికి వెళ్ళటానికి మాకు ఎక్కువ సమయం పట్టదు కదా అంతతక్కువ దూరం అనే భావం తో చెప్పాడన్నమాట . స్వాములవారు ఈ బాలుడు గడుసు పిండమే నని గ్రహించి ,తన శిష్యుడిని చేసుకొని  సన్యాసమిప్పించి ఉత్తరాధికారిని చేశాడు .

శ్రీపాద రాజ తీర్ధ పీఠాధిపతి అయి విజయ నగర రాజులుచేసిన బ్రాహ్మహత్యా  దోషాలను ఇవారించాడు సంస్కృత ,కన్నడ భాషలలో గొప్ప పండితుడై చాలా  గ్రంథాలు రాశాడు .భ్రమర గీత ,వేణుగీత ,గోపీ గీత ,మాధవ నామ సంస్కృత రచనలు బహుళ వ్యాప్తి పొందాయి .ఆయనతన భక్తి గీతాలను ‘’దేవర నామాలు ‘’అని చెప్పి పాడేవాడు .తన సంతకాన్ని ‘’రంగ విఠల ‘’అని చేసేవాడు . ఆయన రాసిన భక్తిగీతం ;;భూషణకే భూషణ ‘’అందరి నాలుకలపై నర్తిస్తుంది.  కోలార్ జిల్లా ముల్ బగాయ్ తాలూకా నరసింహ తీర్ధలో  ఆయన ‘’బృందావనం ‘’ను లక్షలాది భక్తులు దర్శిస్తారు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 384-కుంభాభిషేక చంపు కర్త-కడూర్ కృష్ణ జాయిస్ (1912

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

384-కుంభాభిషేక చంపు కర్త-కడూర్ కృష్ణ జాయిస్ (1912

1-8-1912 న కడూర్ కృష్ణ జాయిస్ కర్ణాటక శృంగేరిలో శేషమ్మ ,సుబ్బా జాయిస్ దంపతులకు జన్మించాడు .అలంకార ,అద్వైతాలలో విద్వాన్ డిగ్రీ పొంది హోల్ నరసాపూర్ ,ఆధ్యాత్మ ప్రకాశం కార్యాలయం లో పని చేశాడు .తర్వాత బెంగుళూర్ శృంగేరి శంకర మఠం  లోఆధ్యాత్మ వేదాంత ప్రొఫెసర్ అయ్యాడు .కన్నడ సంస్కృతాలలో విశేష పాండిత్యం పొంది ఆ రెండుభాషల పత్రికాధిపత్య0వహించాడు . శృంగేరి స్వాములు పండితవర బిరుదు నిచ్చి సత్కరించారు .సంస్కృతం లో కృషికి రాష్ట్ర పతి ప్రశంసాపత్రం ,కన్నడ సేవకు రాష్ట్ర అవార్డు అందుకున్నాడు .సంస్కృతం లో కుంభాభిషేక చంపు ,శారదన్నవరాత్ర చంపు ,మూల విద్యా భాష్య  వార్తిక సమ్మతం ,శంకర దర్శనామ ప్రకాశం ,రాశాడు .సంస్కృత దశ శ్లోకి కి సంపాదకత్వం వహించాడు .కన్నడం లో సంబంధ వార్తిక ,ధర్మ శాస్త్ర రాశాడు .దశ శ్లోకిని ,వివేకచూడామణిని చంద్ర శేఖర భారతీతీర్థ వ్హయాఖ్యానం తో సహా కన్నడాను వాదం చేశాడు .శారదా నవ రాత్రి చంపు ను 1976 లో ముద్రించాడు అందులో శారదా అభిషేక ఉత్సవం ,నవరాత్రి ఉత్సవాలను వర్ణించాడు .ఆధునిక సంస్కృత కవులలో చంపు కు మళ్ళీ వైభవం తెచ్చినవాడు కృష్ణ జాయిస్

385-గాంధీ పై మోహనాయన కావ్యం రాసిన -బొమ్మలాపుర వెంకట రామ భట్ట (1915

బొమ్మలాపుర వెంకట రామభట్ట కర్ణాటక లోని బొమ్మలాపురం లో 1-1-1915 న జన్మించాడు .సరోబాలో సంస్కృత టీచర్ .సంస్కృత కన్నడ హిందీలలో కవిత్వం చెప్పాడు రాశాడు .సంస్కృతం లో మహాత్మాగాంధీ జీవితంపై ‘’మోహన యాన0 ‘’కావ్య0 ,శంకర చరితం ,భామినీ మాధవ కావ్యం ,సతీ మహా స్వేత ,విశ్వ రూప దర్శనం ,సత్యవిషయం నాటకాలు ,అంగద సంవాదం ,ఏకం నా ద్వితీయం ,నాధయ సంస్కృత భేరి ,భార్గవ శతకం ,యాజ్ఞ వల్క్య  బోధాయన ,భువనేశ్వరీ సుప్రభాతాలు ,శంకరాలోకం భావతరంగిణి సంస్కృత వచన రచనలు ,సత్యనీయ రీతి  అనే స్వీయ చరిత్ర ,మంత్రం వేదాంత శాస్త్రాలనాధారంగా వెయ్యిఆర్యా వృత్త  శ్లోకాల  ‘’ఆర్యా సహస్రి ‘’ రాశాడు .

 సంస్కృత కావ్యాలను కన్నడం లోకి కన్నడ రచనలు సంస్కృతం లోకి అనువదించి ప్రజ్ఞ ఆయనది .కన్నడ సంస్కృత నిఘంటు నిర్మాణము చేశాడు .కన్నడ భాషకే ప్రత్యేకమైన షట్పది ని సంస్కృతం లో ప్రవేశపెట్టిన ఘనత వెంకట రామ భట్టు ది .మోహనయానం లో భామినీ షట్పది ని నేర్పుగా ప్రయోగించాడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 383-శ్రీ కృష్ణ కంఠాభరణ  మహాకావ్య నిర్మాత-గలగరి పండరీనాథాచార్య (1922-2015)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

383-శ్రీ కృష్ణ కంఠాభరణ  మహాకావ్య నిర్మాత-గలగరి పండరీనాథాచార్య  (1922-2015)

గలగరి పండరీనాథాచార్య 22-7-1922 న కర్ణాటకలోని గలగరి అనే కుగ్రామం లో జన్మించాడు . తండ్రి కూర్మా చార్యులు . చిన్నతనం లో చదువు ఒకటవ తరగతి తో ఆగిపోయింది .వెంటనే వేదాధ్యనం తండ్రివద్ద ప్రారంభించాడు . 1944  నుంచి 1960 వరకు బాగల్ కోట్ లోని శంకరప్ప సంస్కృత హై స్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయ్డుగా పని చేశాడు . 1961లో గడగ్ వెళ్లి వీరనారాయణ సంస్కృత పాఠశాల ప్రారంభించాడు  . 1971లో వేద  సాహిత్య  మాల సంస్థ స్థాపించి అష్టాదశ మహా పురాణాలను నలభయి  ఏళ్ళు కృషి చేసి కన్నడం లోకి అనువదించాడు .మధురవాణి ,వైజయంతి సంస్కృత పత్రికలకు ,శ్రీ సుధా ,పంచామృత కన్నడ పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు . ఆయన సంస్కృత వచన రచన శైలి బాణభట్టును పోలి ఉంటుంది .కవిత్వ శై లి కాళిదాసుకు సమానం గా ఉంటుంది .  సృజన సాహిత్యం లో  ఆయన అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు అన్ని ప్రక్రియలూ స్పృశించాడు .సంస్కృతం లో 22 సృజన రచనలు చేశాడు . అవి వేదాంత తుండ స్తవం ,రామరసాయన మహాకావ్యం ,శ్రీ కృష్ణ కంఠాభరణ మహాకావ్యం ,పవన పావన చంపు ,శ్రీ పాండురంగ  విఠల  చంపు ,శ్రీ రాఘవేంద్ర అశ్వ ధాటి ,తాత్యా తోపితా హ గాంధీ టోపీ పర్యంతం ,విప్లవ వీరుడు సుభాష చంద్ర బోసు పై ‘’క్రాంతి స్ఫు లింగ మొదలైనవి . కన్నడం లో రాసిన 21 రచనలలో -మహా భారత కోశ ,రాగ విరాగ ,భామతి ,కర్ణాటక కోశకారు ,కల్హణ రాజ తరంగిణి మొదలైనవి ఉన్నాయి .ఇవికాక ముందే చెప్పినట్లు 18 పురాణాలనకు కన్నడా నువాదం చేశాడు .

 పండరీనాధాచార్యులు తన ప్రతిభకు తగిన పురస్కారాలు ఎన్నో అందుకొన్నాడు .అందులో సాహిత్య అకాడెమి పురస్కారం ,రామకృష్ణ దాల్మియా ,రాష్ట్రపతి అవార్డు ,కన్నడ కాళిదాస బిరుదు ,రాజ్య ప్రశస్తి ,మహామహోపాధ్యాయ ,విద్వత్కవి తిలక  ,సచ్చాస్త్ర ప్రవచన విచక్షణ ,సంస్కృతివాహక ,విద్యా రాజా మొదలైనవి ఎన్నో బిరుదులూ ,పురస్కారాలు అందుకొన్న మహా   సంస్కృత విద్వా0సుడు గలగరి పండరినాధ ఆచార్య .. సాహిత్య వ్యాసంగం తో పండిపోయిన పండరినాథాచార్య 93 వ ఏటపండిన వయసులో 29-8-2015 లో పండరినాధుని చేరుకొన్నాడు ..

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 382-సంస్కృత అంతర్జాలం ప్రవేశపెట్టిన -వి.ఆర్.పంచముఖి (1936

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

382-సంస్కృత అంతర్జాలం ప్రవేశపెట్టిన -వి.ఆర్.పంచముఖి (1936

వాడిరాజాచార్య రాఘవాచార్య పంచముఖి లేక వాచస్పతి పంచముఖి 17-9-1936 న కర్ణాటకలోని ధార్వార్ లో జన్మించాడు . తండ్రి వైద్య రత్న ఆర్ ఎస్ .పంచముఖి .తల్లి కమలాబాయి .తండ్రి ప్రసిద్ధ ఎపిగ్రఫిస్ట్ ,ఆర్కియాలజిస్ట్ ఇండాలజిస్ట్ చారిత్రాత్మక పరిశోధనలో జీవితమంతా గడిపినవాడు .దాస సాహిత్య పరిశోధనలో పండిపోయినవాడు .తండ్రివద్దనే వాడిరాజు సంస్కృతం తత్వ శాస్త్రం అభ్యసించాడు . 1956 లో కర్ణాటక యుని వర్సిటీ నుండి సంస్కృతం గణితం లలో 82. 5 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ రాంక్ సాధించాడు .రెండేళ్ళతర్వాత  బాంబే యుని వర్సిటీనుండి ఎకనామిక్స్ లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రాంక్ తోపాటు గోల్డ్ మెడల్ పొందాడు . 1963లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో  ‘’అప్లికేషన్ ఆఫ్ గేమ్ ధీరీ ఆఫ్ ఎకనామిక్స్ పాలిసీ పై దిసీస్ రాసి పిహెచ్.డి .అందుకొన్నాడు .

 ఆర్ధిక రంగం  లో పంచముఖి సేవలు నిరుపమానమైనవి .నోబెల్ లారయట్ జాన్ టిన్ బెర్జిన్ తో ను జెనీవాలో టా0జానియా  మాజీ ప్రెసిడెంట్ జూలియస్ నైరేరీ తోను కలిసి పనిచేశాడు .అలీన దేశాల అభివృద్ధి చెందుతున్న దేశాలకు రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టం తయారు చేసిన ఘనత సాధించాడు .ఇండియా ప్లాంయింగ్ కమిటీ సెక్రెటరీగా 1977లో పనిచేశాడు .దీనివలన ఆర్ధిక సరళీకరణ విధానం ధ్రువ పడటానికి సహకరించాడు .

ఆర్థికరంగం లో దూసుకు పోతున్నా సంప్రదాయంగా వచ్చిన సంస్కృతం లోనూ అద్వితీయ ప్రతిభ ప్రదర్శించి అనేక పుస్తకాలు కవితలు సంస్కృతం లో రచించాడు పంచముఖి .తిరుపతి సంస్కృత విద్యాపీఠానికి 1998 నుండి 2008 వరకు రెండుసార్లు ఛాన్సలర్ అయ్యాడు .శ్రీ వెంకటేశ్వర వేదం విశ్వ విద్యాలయ  రాజ్యాంగ  నిర్మాణం లో స్థాపనలో విశేష కృషి చేశాడు .సంస్కృత -సైన్స్ ఎక్సిబిషన్ నిర్వహణలో ,సంస్కృత నెట్ ఏర్పాటులో ,ప్రాచీన సంస్కృత గ్రంధాల డిజిటలీకరణలో ఆయన సేవ అపారం .భగవద్గీత పైనా మేనేజ్ మెంట్ పైనా విశేష కృషి చేశాడు .సంస్కృతాన్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో బోధించే ఆలోచన చేసి అమలులోకి తెచ్చాడు .

  పంచముఖి సంస్కృతం లో  -1-భారతీయ ఆర్ధిక సర్వేక్షణ 2-కావ్య కుసుమాకర 3-బ్రహ్మ సూత్ర దీపికా 4-విచార వైభవం 5-భారతీయ అర్ధ శాస్త్ర మొదలైనవి 12రాశాడు .

ఎకనామిక్స్ లో -ట్రేడ్  పాలిసీస్ ఆఫ్ ఇండియా ,ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ ,టీచింగ్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా ,ఫిస్కల్ మేనేజ్ మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ టు వార్డ్స్ యాన్ ఏషియన్ ఎకనామిక్ ఎరా మొదలైన 15 గ్రంధాలురాశాడు .ఆయన ప్రతిభకు తగిన పదవులు వరించాయి -ఇండియన్ కౌన్సిలాఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ చైర్మన్ గా ,ఇండియన్ ఎకనామిక్స్ జర్నల్ మేనేజర్ గా ,8 వ వరల్డ్ ఎకనామిక్స్ కాంగ్రెస్ కన్వీనర్ గా ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కు ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా  అఖిలభారత మధ్వ సమ్మేళనం ప్రెసిడెంట్ గా ఇవికాక మరో 30సంస్థలలో సభ్యుడుగా సలహాదారుగా గౌరవాధ్యక్షుడుగా  ఉన్నాడు .

 2003 లో భారత రాష్ట్ర పతి నుంచి సంస్కృతం లో ప్రతిభా పురస్కారం ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ -ఢిల్లీ నుంచి విశిష్ట సంస్కృత సేవా వ్రతి ,ఢిల్లీ లాల్ బహదూర్ యుని వర్సిటీనుండి వాచస్పతి పురస్కారం ,విశ్వేశ్వ రయ్య ప్రశస్తిపురస్కారం ,కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం ,గురుసార్వ భౌమ రాఘవేంద్ర అనుగ్రహపురస్కారం ,విశాఖ లోని గీతం యుని వర్సిటీ పురస్కారం వంటివి ఎన్నో  బహుముఖ సేవకు పంచముఖిని  వరించాయి .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

— V R Panchamukhi.jpg

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -11(చివరిభాగం )

అలంకారిక ఆనంద నందనం -11(చివరిభాగం )

భోజ రాజు -నా గ్రంథ ప్రారంభం లోని పది పద్యాలలో నా సిద్ధాంత సారాంశాన్ని వివరించాను . తర్వాత అధ్యాయం లో అర్ధనారీశ్వర వర్ణన చేసి నా శృంగారవాదానికి ఎంత సందర్భోచితమో చెప్పాను . పార్వతీ పరమేశ్వరులకలయిక స్త్రీ పురుషత్వాల సమైక్య స్వరూపం .దాని ఫలితంగా కలిగే హాస్య పూరిత అనుభవాలు సాంకేతికంగా వర్ణించా .అందులోని ప్రతిపదం సంభోగ ,విప్రలంభ శృంగారాల వివిధ రూపాలను ధ్వనింప జేస్తుందన్నాను ..ప్రాచీనులు 10 రసాలు చెప్పినా నేను శృంగారమే రసం అన్నాను .అదే ఆనంద స్వరూపం .భరతముని చెప్పిన 49 భావాలు సమానమైనవే .అందులో ఏదైనా ఉచ్ఛ  స్థితికి చేరి ఆనందంగా మారచ్చు . ఆనందాన్ని  కేవలం రసం అనకుండా శృంగారరసం అన్నాను .దీన్ని ‘’యేన శృంగారం రియతే స శృంగారహః ‘’అని నిర్వచించా .అంటే శిఖరాన్ని చేరటం అన్నమాట ..అంటే ఆన0దా ధిరోహణం చేయటమే .శృంగారం నుంచే 49 రసాలు జన్మించాయి ..దానికి అవి సహాయకాలు .ప్రేమ అంటే అనురాగానికి పర్యాయ పదం కాదు .సౌందర్య తత్వ సాధనమైన ఆనందమే ప్రేమ .అందుకే ఆనంద రసం అన్నాను ..అభిమానం వీటిని కలిపి ఉంచే లక్షణం .అభిమానమే రసాను భూతికి మూలం . రసాను భూతి అనే సోపానానికి ఉన్న మూడు మెట్లలో అది అట్టడుగు మెట్టు ..దీనినే అహంకారం అన్నాను .నా పేర్లలో సాంఖ్య సిద్ధాంత చాయలున్నాయి ..ఈ అభిమాన శబ్దానికే అహంకార ,శృంగార ,రస శబ్దాలు పర్యాయ పదాలు .అహంకారం అంటే స్పందించాగలిగే సహృదయుని భావోద్వేగ స్థితి నుంచి బహిర్గతమయ్యే అహంకారమే అభిమానం .అహంకారం అంటే లౌకికార్ధం లో ఉన్న గర్వం కాదు.  నేను అనే భావం అన్నమాట ..రసాను భూతిగా మారే ప్రతి దశలో అహంకార ఛాయకనిపిస్తుంది ..అలంకార శాస్త్ర ప్రయోజనాలకోసం సాంఖ్యుల భావాల్ని పునర్నిర్మించి ,తత్వ వేత్తల  అహంకారాన్ని ,అలంకార శాస్త్రజ్ఞుల భావయిత్రీ ప్రతిభను సమ్మిళితం చేసి కొత్త రూపాన్నిచ్చాను . మిత్రులారా తర్వాత మీ వంతు .

మహిమా భట్టు -రసము అంటే స్థాయి యొక్క ప్రతిబింబమే .కళాత్మకంగా ఉన్న కారణం నుంచి అనుమాన ప్రమాణం చేత సాధింపబడుతుంది .రసికుడిలో విభావాదుల జ్ఞానం వలన స్థాయీ భావం ఉద్దీన మవుతుంది . దాని నుంచి వచ్చిన అనుమాన స్ఫురణ యే రసాను భూతి . రసికుడు రసాన్ని భావ రూపంగా మాత్రమే అనుభవిస్తాడుకాని యదార్ధంగా కాదు .వ్యంజకా వ్యంజనాలను గ్రహించినప్పుడే కాక ,విభావాదుల నుంచి వచ్చే స్థాయీ భావాన్ని అనుభవించటం లో కూడా కాలక్రమం ఉంటుంది .దీనికి కారణం -వీటిమధ్య కారణం ,కార్య సంబంధం ఉంటుందికనుక . నా గ్రంథం రెండవ అధ్యాయం అంతా అనౌచిత్యాన్నే చర్చించాను .అనౌచిత్యం -అంతరంగ ,బహిరంగ అని రెండురకాలు .మొదటిది రసాన్ని అభివ్యక్తి చేయటంలో రెండవది శబ్దార్ధాల ప్రయోగాలతో కనిపిస్తుంది . ఈ రెండిటినీ మళ్ళీ 5 రకాలుగా విభజించా .ఇవన్నీ రసావిష్కారానికి అవరోధాలు .ధ్వనికారుని ‘’కావ్యమస్యాత్మా ధ్వని రీతి ‘’అని మొదలు పెట్టిన మొదటి కారిక లోనే ఈ దోషాలను చాలా ఉదాహరించి చూపించా ..ఆనంద వర్ధన శ్లోకాలే వాడి దోషాలకు ఉదాహరణలుగా చెప్పాను .ఈ దోషాలు పరిహరించి ఎలా రాస్తే బాగుంటుందో సూచించాను .భారతీయ సాహిత్య విమర్శనా చరిత్రలో నేను చేసి చూపింది అపూర్వం అసదృశం ..దీనికొక ఉదాహరణ ఇచ్చా ‘’వైద్యుడు ఇతరులను అయోగ్యమైన ఆహారం తినకుండా నివారిస్తాడు-తానూ దానికి అలవాటు పడిఉన్నా  సరే ‘’అని చెప్పాను .ఇక చెప్పాల్సింది లేదు .సెలవ్ .

విశ్వనాథుడు -నేను చెప్పాల్సింది అంతా  చెప్పేశాను ..పండితరాయలు ప్రసంగిస్తారు .సెలవ్

జగన్నాథుడు -రస ప్రాధాన్యాన్ని నేను అంగీకరిస్తా.కానీ రసం ప్రముఖంగా లేదనో ,రసధ్వని కనపడలేదనో కావ్యాన్ని కావ్యం కాదు అనకూడదు .అలంకార చమత్కారమున్నా ,చమత్కారాన్ని సూటిగా లేక వాచ్యార్థం గా చెప్పినా కావ్యం ఆనందాన్నిస్తుంది . చమత్కార గుణానికి జేజే లుపలికాను .రస ,అలంకార వస్తువులనుంచి ఇది నిష్పన్నమవుతుంది.  ధ్వని ,లేక వాచ్యం ద్వారా అభి వ్యక్తమవుతోంది .ఈ రకంగా కావ్య భావానికి కొత్త సమగ్ర స్వరూప నిర్ణయం చేశాను ..నా వాదనాపటిమ ఘనిస్టం .సహజ ఉన్నత కవిత్వం అని నా కవిత్వాన్ని కీర్తించారు ..తేడా వస్తే చమడా ఒలుస్తా ..నాది ఆత్మ విశ్వాసం .అద్వైతినైనా నాకు శివ కేశవ భేదం లేదు .లోకాన్ని నిశితంగా పరిశీలించి రాశాను .భోగ లాలసత కు ,శృంగార క్రీడలకు నిలయమైన మొఘల్ సామ్రాజ్య రాజధానిలో ఉండటం వలన శృంగారం నా అంగాంగానా అలముకొన్నట్లు కనిపిస్తుందికదూ ..ఇంతకంటే నాకూ చెప్పటానికేమీ మిగలలేదు సెలవ్ .

భోజరాజు -సాహిత్య రసానుభూతి మూడు మెట్ల సోపానం అని ఇందాకే చెప్పాను .అడుగుమెట్టును పూర్వ కోటి అని ,అభిమానం అనే మధ్యమెట్టు మాధ్యమావస్థ  భావన.ఇది మనో వృత్తులన్నీ అణగిపోయిన తర్వాత సాగే చింతన యొక్క ఉన్నత దశ .ఈ దశలో వివిధ మనోద్వేగాల  బహుళత్వం అను భూతమవుతుంది .ఇవే భరతముని చెప్పిన అష్ట రసాలు .నిజానికి ఇవి 49 .. భావనా పరిధిని అధిగమించి న శుద్ధానందం ఇది .ఈ  చరమ స్థితినే శృంగారం లేక ప్రేమ అన్నాను .ఇదే ఉత్తర కోటి . ఆనంద వర్ధనుని ధ్వనిని అంగీకరిస్తూ మీమాంసకుల ‘’తాత్పర్యం ‘’తో దానికి సామరస్యం కలిపించాను ..అంటే ధ్వనికి తాత్పర్యం అనే కొత్త పేరు పెట్టానన్నమాట .వర్ధనుడి అనువాద ధ్వనికి ప్రతివాదంగా ‘’శబ్ద ధ్వని ‘’అనే కొత్త రూపాన్ని ప్రవేశపెట్టాను ..అలంకార పరామర్శలో కొత్తదనాన్ని తెచ్చాను .గుణాలు ,రసాలు భావాలు అన్నీ అందులోకి వస్తాయని దాని విస్తృతి పెంచాను . సూక్ష్మ అర్ధ పరిమాణాలు గుర్తించా ..అలంకార సమ్మేళనంలో 6 ప్రమాణాల భావన సమర్ధించా ..అలంకారాలలోచమత్కారం పరాకాష్టకు చేరేది వాటిని నేర్పుగా కలిపినప్పుడే . ఇదే నాకున్న అలంకార శాస్త్రం పై శ్రద్ధ అన్నారు  . మీ కృష్ణా జిల్లా పెనమకూరు కవి అనంతామాత్యుడు ‘’భోజ రాజీయం ‘’రాసి నన్ను చరితార్థుడిని చేశాడు ..అందులో ఆవు -పులి కథ చిరస్మరణీయంగా రాశాడు .ఆ కథ  నాకు చాలా ఇష్టం . సత్య నిష్ఠకు అది గొప్ప ప్రతీక ఆయనకు అభినందన చందనాలు  .అభిమానంతో నన్ను ఆహ్వానించి నిర్వహణ బాధ్యతనూ అప్పగించినందుకు సరసభారతి కి కృతజ్ఞతలు .నేను నా రాజ్యం లోనే ఉన్నట్లు అనిపించింది .నా సాహిత్య సభనే నడిపిన అనుభూతికలిగింది .శ్రోతృ మహాశయులు ఓపికకు ధన్యవాదాలు .

 సాహితీ బంధువులారా !అలంకారిక ఆనంద నందనం చివరిభాగ0లో మన కోరికమన్నించి విచ్చేసి తమ సిద్ధాంత సారా మృతధారలతో తనియింపజేసిన అలంకారిక పరమేశ్వరులకు కృతజ్ఞతాభి వందనాలు . మీకూ శతకోటి అభినందనలు .ఒక్క సారి పునశ్చరణ చేసుకొందాం .

భోజమహారాజుగారి నిశిత పరిశీలనకు జోహార్లు .. వారిని ధారానగర ప్రభువు అంటారు ..భోపాల్ లో వారు నిర్మించిన ‘’భోజేశ్వర దేవాలయం ‘’సుప్రసిద్ధమైనది .భోజేశ్వర పట్టణం గొప్ప విద్యా కేంద్రం ..అతి పురాతన తాళపత్ర గ్రంధాలను సేకరించి భాప్రాపరచారు భోజరాజు .ఈ నాటి థార్ నగరం లో వారు నిర్మించిన సరస్వతీ దేవాలయం ఉంది .సరస్వతీ పుత్రలేకాక సమరాంగ ణ సార్వభౌములైన వారు .మన కృష్ణ దేవరాయలు గుర్తుకు వస్తారు . పతంజలి యోగ సూత్రాలకు భాష్యం రాశారు .సివిల్ ఇంజనీరింగ్ పై ‘’సమరాంగణ సూత్ర దారి ‘’రాసి దేవాలయ ,కోటల ,విగ్రహ, గృహ నిర్మాణ వివరాలు తెలిపారు .తంత్ర శాస్త్రంగా ‘’తత్వ ప్రకాశం ‘’,లోహ శాస్త్రంగా ‘’రస రాజమృగాంకమ్ ,నౌకా నిర్మాణ శాస్త్రంగా ‘’యుక్తి కల్పతరు ‘’న్యాయ శాస్త్రం పై ‘’ధర్మ శాస్త్ర వృత్తి ‘’రామాయణంపై రామాయణ చంపు రాశారు దీనికే ‘’భోజ చంపు’’ అనే సార్ధకనామమేర్పడింది .మొత్తం 84 గ్రంధాలు రాసిన బహుశాస్త్ర కోవిదులు .కాళిదాసాది కవులకు నిలయం భోజరాజాస్థానం .ఆంద్ర దేశం లో పూర్వం గురుకుల విద్య భోజ రాజ  చంపు తోనే ప్రారంభమయ్యేది ..అంతటి ప్రశస్తి పొందిన చంపు అది .. రాజుకనుక ప్రతి విషయాన్నీ చెప్పాలనే చాపల్యం ఉందనిపిస్తుంది . సర్వజ్ఞుడికి అందర్నీ తనలాగే చేయాలనే కోర్కె ఉంటుంది . అందుకే ఈతపన . కృతజ్ఞతలు భోజరాజేంద్రా .

  మహిమాబట్టు లవారు అనుమాన సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం కంటే మరింత సమ గ్రమైనది .రసాధిక్యతను నొక్కి చెప్పింది .గుణీ భూత వ్యంగ్యాన్ని  వివరించింది .కవితా సృష్టికి రసమే  ఆనంద  కారణం కనుక మరే  ఇతర పదార్ధానికీ కూడా దాన్ని లోబరచకూడదని స్పష్టంగా చెప్పారు ..అనుమాన సిద్ధాంతం లో గుణీ భూత వ్యంగ్యానికి అగ్రాసనమిచ్చారు .దీనిలో వక్రోక్తి తాత్పర్యాలను కూడా భాగం చేశారు.  మౌలిక ఆలోచనకలిగిన ధైర్య శాలి .అలంకార చరిత్రలో పాండిత్య స్ఫోరకమైన వాగ్వాదాలకు ,విస్తృతమైన విద్వత్తుకు ,విస్పష్ట విశదీకరణకు ,లోతైన గ్రహణ శక్తికి మహిమా భట్టు లవారికి సాటి వేరెవరూలేరు అన్న శ్రీ ఆర్ .పి .ద్వివేదీ పలుకులు అక్షర సత్యాలు ..వారు అవతరించిన అసమాన ‘’అనుమాన మహిమాభట్టు ‘’.

 విశ్వనాథకవిరాజుల  వారి సాహిత్య దర్పణం గురించి వారికుమారుడు అనంతదాసు ‘’శ్రవ్యా భి  నే యాలంకార తత్త్వం సత్కవి సమ్మతం -యదిహాస్తి యదన్యత్ర యాన్నే హస్తి తత్క్వచిత్ ‘’అని గొప్పగా చెప్పాడు -అలంకారాల ముఖ్య ధర్మాలన్నీ ఇందులో ఉన్నాయి .ఇందులో ఉన్నది ఇతర గ్రంథాలలో ఉండవచ్చు .కానీ ఇందులో లేనిది మాత్రం ఇంకెక్కడా ఉండదు ‘’అదీ అలంకార విశ్వ నాధీయ0 .  ‘’విశ్వ నాదీయం ‘’కూడా ..విశ్వనాధులవారు సాహిత్య దర్పణాన్ని సంక్షిప్తంగా ,అర్ధ స్పష్టత తో ,సర్వ దోషరహితంగా రచించారు దీనికి  ఆయన కుమారుడుఅనంతదాసు చెప్పిన శ్లోకమే సాక్షి -’’స్వల్పాక్షరాహ్ సుబోధార్దాహ్ ప్రధ్వస్త శేష దూషణాః –సాహిత్య దర్పణో నామ గ్రంథ స్తేన వినిర్మితాహ్ ‘’. ధ్వని సిద్ధాంత ప్రవర్తకులలో పరిపక్వమైన చింతనగల వారిలో విశ్వనాథ కవిరాజ స్థానం అత్యున్నతమైనది –

‘’ధ్వన్యాధ్వని  ప్రౌఢాధియం పురోగాహ్ శ్రీ విశ్వనాధాహ్ కవి చక్రవర్తీ ‘’..ఈ సభ మీ రాకతో ధన్యమైందికవి చక్రవర్తీ ,

మనవాడైన జగన్నాథ పండితరాయల వారి కవిత్వం కోన సీమ కొబ్బరికున్న తీపిదనం లేతతనంతో కోనసీమ అందాలవంటి శబ్దార్ధాల సుందర మేళవింపుతో  ఆ సీమ ప్రత్యేకమైన పక్వమైనపనసపండు తొనలవంటి మాధుర్యవంతమైన  ప్రయాస లేని యమకాల ఇంపు సొంపులతో అలరిస్తుంది .. రామణీయార్ద ప్రతిపాదనమైన శబ్దమే కావ్యం అనగలిగిన చేవ ఉన్న అలంకారిక కవి .సౌందర్యం మూర్తీభవించిన వ్యక్తి .ఐహిక భోగాలకు పర లోక చింతనకు సమ విలువనిచ్చినవారు .అపార విద్వత్తుతో ప్రకాశించే ఆపర సాహత్య  జగన్నాధులే .మీరాక తో మేము పావనమయ్యాము పండితరాయా నమోవాకాలు . అలంకారిక చతుష్టయం అందరికీ మరోమారు వందనం .ఆల0కారకులైన  మీ రాకవలన ఈ ప్రత్యేక కార్యక్రమం నిజంగానే ఆనంద నందనమై కను విందు, వీనుల విందూ చేకూర్చింది .

దీనిని ప్రశ్నోత్తర రూపం లో నిర్వహించి అలంకార పరిణామాన్ని తెలియ జేస్తే బాగుంటుంది అనే సూచన వచ్చింది .అసలు అలంకార  శాస్త్రం  డ్రై  సబ్జెక్ట్ .మళ్ళీ దీనిలో ప్రశ్నలు , సమాధానాలు ,చర్చలూ ఉపచర్చలు పెడితే బుర్ర వేడెక్కి మైండ్ బ్లాకై పోతుందని భయపడి ఈ విధానాన్ని ఎంచుకున్నాను .సరదాగా వినేందుకు ,కావాలంటే ఆరుద్ర రాసిన ‘’సమగ్రాంధ్ర సాహిత్యం ‘’లాగా హాయిగా చదువుకొనేట్లు రీడబిలిటీ ఉండాలని అనుకొని ,ఆలంకారికుల గురించి  తెలియని విషయాలెన్నో తెలియ జేసే వీలు ఇది కలిగిస్తుందని భావించాను .  . ఇది ఒక భూమిక మాత్రమే . కావలసినవారు దీనిపై సౌధాలు నిర్మించుకో వచ్చు . నేను తీసుకున్నది 13 మంది ఆలంకారికులను మాత్రమే . ఇంకా ఎందరో లబ్ధ ప్రతిష్టులైన వారున్నారు . ఎందరో ఆలంకారికులు అందరికీ ఆనంద నందన వందనములు . ఈ కార్యక్రమాన్ని సమాదరించి జయప్రద0 చేసిన అందరికీ మరొక్క మారు కృతజ్ఞతాభి వందనాలు .

ఆధారం -ఈఆలం కారిక ఆనంద నందనం ధారా వాహికకు  ఆధారం 1–నేను రాసిన గీర్వాణ కవుల కవితా గీర్వాణం -1 మొదటిభాగం 2- పబ్లికేషన్స్ డివిజన్ వారి ‘’భారతీయ సంస్కృతీ వైతాళికులు -ఆలంకారికులు .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -10

అలంకారిక ఆనంద నందనం -10

భోజ రాజు -సర్వ జన సంక్షేమం నా ధ్యేయం .సమైక్య భారతావని న దృష్టి .కేదారేశ్వర ,రామేశ్వర ,సోమనాధ ,సుందర ,కాల అనలా ,రుద్రాదులకు దేవాలయాలు నిర్మించాను కాశ్మీర్ లో ఇప్పటి కోధర్ వద్ద పాప సూడాన్  తీర్ధానికి మట్టికట్టలు పోయించటానికి ధనసహాయం చేశాను . ఈ విషయం కల్హణుడు రాజతరంగిణిలో రాశాడు ..భోజపురం అంటే ఈ నాటి భోపాల్ లో బెట్వానది ఉపనదితోకలిసే సన్నని కనుమద్వారా ప్రవహించే చోట మైలున్నర పొడవున్న ఆనకట్ట వేసి విశాల సరోవరాన్ని నిర్మించాను .ఇది అద్భుత సాంకేతిక పరిజ్ఞానానికి  నా సాహస కృత్యానికి ప్రతీక అని అంటున్నారు ..కవి ,పండిత ,కళాకారులకు భూరి విరాళాలిచ్చి పోషించాను ..వారి కవితా శక్తికి అక్షర లక్షలిచ్చాను ..దేశం లోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కవి పండితులూ నా ఆస్థానం లో ఉండటం నా అదృష్టం .నా సంస్థానం సరస్వతీ నిలయమై వర్ధిల్లింది .తిలక మంజరికర్త జైనమతాచార్యుడు ధనపాలుడు ,శుక్ల యజుర్వేద భాష్యకర్త కాశ్మీర పండితుడు ఊవటుడు,చిత్తకవి ,ఇంకా ఎందరెందరో నా కొలువు కూటానికి ప్రకాశం తెచ్చారు . నేను వారిని పోషించానని గర్వంగా చెప్పను .వారి వలన నా భోజ సభ భాజమానమైంది అంటాను ..నేను శివ భక్తుడనే కానీ అన్నిమతాలు నాకు ఆదరణీయమైనవే . జైన గ్రంధాలను కాపాడాను .కర్ణాటకలోనిశ్రావణ బెళగొళ లో  ఉన్నజైన గురువు ప్రభ చంద్రునికి భూరి దక్షిణ సమర్పించాను . దీనికి సంబంధించిన శాసనం అక్కడ వేయించాను .నా రాజ్య పాలన 40 ఏళ్ళు సాగింది ..

 నేను 84 రచనలు చేశాను. 84 దేవాలయాలు నిర్మించాను ..సరస్వతీ కంఠా భరణం ,శృంగార ప్రకాశం అనే అలంకార శాస్త్ర గ్రంధాలు నాకు మంచి పేరు తెచ్చాయి … మిగతా వివరాలు తర్వాత తెలియ జేస్తాను ఇప్పుడు మిగిలిన వారు మాట్లాడుతారు .

మహిమా భట్టు -భట్ట గోపాలుడు నా అనుమాన సిద్ధాంతాన్ని ఆరాధించాడు -’’రసామృత నదీ మగ్నే ,ధ్వనికారే మహా గురౌ అనుమానాయాహి కావ్యం గోష్టిమ్ న ముంచతి ‘’-మా గురువైన ధ్వనికార్టరసామృతం లో మునిగిపోయినా ,అనుమానం మాత్రం సాహిత్య విమర్శకుల గోష్ఠి ని వదిలి వెళ్ళలేదు ..నాతర్వాత వారైనా రుయ్యక మమ్మట విద్యాధర ,విశ్వనాథ  జగన్నాథా దులు నా సిద్ధాంతాన్ని పరిశీలించారు .నేను కళ వాస్తవాన్ని అనుకరిస్తుంది అని నమ్మాను .విభావానికి స్థాయికి మధ్య సంబంధం ,కారణానికి కార్యానికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే .రస సాక్షాత్కారం అనుమానాయిక గ్రాహకత్వాన్ని దాటి పోదు .అన్న నాసిద్ధాంతానికి తగిన నిర్మాణం దృఢంగానే చేశాను .భావ ప్రకటనకు భాష సహేతుక సాధనం . భావాలు అర్ధవంతమైతేనే ఇతరుల మనస్సులను ఆకర్షించుకో గలవు ..మీమాంసకులలాగానే నేనుకూడా కర్మను చేయించే ప్రవ్రుత్తి ,కర్మకు విముఖం చేసే నివృత్తి సిద్ధాంతమే భాషా లక్షణాన్ని శాసిస్తుంది అని నమ్మాను . వాక్యం లో సాధ్యం అంటే అనుమానం చేత సిద్ధించేది ,సాధన అంటే తర్కం అనే అంశాలుంటాయి .కనుక దీని స్వభావం అనుమానం చేతనే గ్రాహ్యం .కనుక వాక్యం ద్వారా అందజేసేభావాలు సాధ్య ,సాధనాల సంబంధం తో ముడిపడి ఉండటం వలన అనుమేయ స్వభావం కలిగి ఉంటాయి .. కావ్యార్ధం మూడురకాలు  -వస్తువు ,అలంకారం, రసం .మొదటి రెండిటినీ ప్రత్యక్షంగా చూపించవచ్చు .కానీ మూడవదైన రసం అనుమానం వలననే సిద్ధిస్తుంది .అక్షరాలచేత ప్రభావితమయ్యే పదాల అర్ధం ద్వారానే రతి మొదలైన స్థాయీ భావాలను అనుమానించటం జరుగుతుంది .అక్షరాలూ సూచించే గమకం అంటే గుణం పరోక్షంగా నే గ్రాహ్యమవుతుంది అభిదా శక్తినే గుర్తించాను .లక్షణ ,తాత్పర్య ,అర్దాపత్తి ఉపమానం వక్రోక్తి అన్నీ అనుమానం కిందికే వస్తాయి .

విశ్వనాథుడు -నా సాహిత్య దర్పణం భారత దేశమంతా ప్రచారమైంది .కావ్య ప్రకాశం పధ్ధతి ననుసరించి రాశాను .ఇందులో కారకాలు ,వృత్తులు నేనే రాశాను .ఉదాహరణలు నా గ్రంథా లనుండి ఇతర గ్రంథాలనుంచి ఇచ్చాను .నా ప్రసిద్ధ సిద్ధాంతం ‘’వాక్యం రసాత్మకం కావ్యం ‘’..వ్యంజన ను ప్రత్యేక వృత్తిగా చెప్పాను .పురాణకావ్యాలను కథ ,చంపు ,బిరుదు ,కరండ గా విభజించి నిర్వచించాను ..నాకు మార్గ దర్శి ధనుంజయుడు ..నేను అలంకార దోషాన్ని అంగీకరించలేదు ..సాహిత్యాన్ని శ్రవ్యం (కావ్యాలు )అని దృశ్యం (నాటకాలు )అని వర్గీకరించాను . ఆనంద వర్ధన ,మమ్మట ,జగన్నాధా దులు శ్రవ్య కావ్యాలనే చర్చిస్తే భారత ,ధనుంజయులు దృశ్య సాహిత్యాన్ని మాత్రమే చర్చిస్తే నేను మాత్రమే మొట్ట మొదటి సారిగా శ్రవ్య దృశ్య సాహిత్యాన్ని చర్చించాను . నాటకకళ కూయక ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించాను .  నా వంటి వారి వలననే ధ్వని సిద్ధాంతం సుస్థిరమైంది .నేనే ధ్వనిసిద్ధాంత ప్రతిస్థాపకుడనని -’’ప్రస్థాపనా పరమాచార్య ‘’అని నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పుకొన్నాను .. జగన్నాథుడు -షాజహాన్ చక్రవర్తి మామ నూర్జహాన్ సోదరుడు అసఫ్ ఖాన్ ప్రశంసిస్తూ ‘’ఆసఫ  విలాసం ‘’కావ్యం రాశాను జగదాభరణ ,ప్రాణాభరణ కూడా నావే .నా విడి విడి పద్య సంకలనమే ‘’భామినీ విలాసం ‘’..రస గంగాధర విషయాలను సంక్షిప్తం చేసి ‘’చిత్ర మీమాంస ఖండన ‘’రాశాను ..నా గురుదేవులు శేష కృష్ణులను భట్టోజీ దీక్షితుడు విమర్శిస్తే ,దీక్షితుల ‘’ప్రౌఢ మనోరమ ‘’పైనా  అక్కసు అంతా కక్కుతూ ‘’మనోరమా కుచమర్దనం ‘’రాశాను ..నా అలంకార గ్రంధం రస గంగాధరం నన్ను మహా పండితునిగా ,విమర్శకునిగా పేరు ప్రతిష్టలు తెచ్చింది .ధ్వన్యాలోకం కావ్య ప్రకాశిక ల తో సమాన స్థాయి పొందింది .నా తర్క శాస్త్ర పాండిత్యానికి ,ఆలోచనాపటిమకు ,సుబోధక శైలికి  అలంకార శాస్త్ర ప్రతిభకు ఇది నిలువెత్తు దర్పణం . ఇందులో రెండు అధ్యాయాలున్నాయి అధ్యాయాలను ‘’ఆనానాలు ‘’అని వినూత్నంగా పేరు పెట్టాను .మధుర కవిత్వం లో నాకు సాటి ఎవరూ లేరని సవాలు విసిరాను ..శృంగార0 రాసేటప్పుడూ ఔచిత్యాన్ని దాటకుండా రాశా .ముక్తకాలలో కూడా రస పోషణ చేసి సెబాస్ అనిపించుకొన్నాను .నా రచనలన్నీ ప్రసాద గుణానికి ఉదాహరణలే .’’.రమణీయార్ధక ప్రతిపాదక  శబ్దహః కావ్యం ‘’అన్న కావ్య జగజ్జెట్టీని నేను .

 భోజరాజు -సరస్వతీ కంఠాభరణం నా మొదటి రచన .చిన్నదికూడా . .శృంగార ప్రకాశం రెండవది .రెండిట కొన్ని సమాన విషయాలున్నాయి .నేను చెప్పాల్సిందంతా దీనిలోనే చెప్పాను .శృంగార విషయాల నిగ్గు తేల్చే గ్రంధం .లలితా కళారహస్యాలను ,కావ్యరచనా మర్మాలు ఉన్నాయి .కంఠాభరణం అయిదు పరిచ్చేదాలు .అలంకార శాస్త్ర విషయాలన్నీ ఉన్నాయి .అలంకారాలను శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు  ఉభయాలంకారాలుగా విభజించాను . 6 గుణాలు 16 దోషాలు చెప్పాను .ఒక్కోదానిలో 24 అలంకారాలు చెప్పాను .చివరి అధ్యాయం ముఖ్యమైంది ఇందులో రసం పై చర్చ ఉంది .ఇందులోకారికల సమాఖ్య ఉదాహరణలో ఎక్కువే .

‘’శృంగార ఏవ ఏకో రసః ‘’శృంగారం ఒక్కటే రసం అన్నాను .అంటే శృంగారం సంపూర్ణమైన రసం అని సిద్ధాంతం చేశాను ఇది వినూత్న సిద్ధాంతమే .

శృంగార ప్రకాశం లో 36 ప్రకాశాలున్నాయి .అధ్యాయాలను ప్రకాశానాలు అన్నాను శబ్దార్ధ సంబంధాల అభి వ్యక్తియే సాహిత్యం అని నిర్వచించాను ఈ సంబంధం 12 రకాలు .. 9వ అధ్యాయం లో సాహిత్య విమర్శ చేశాను . 13 వ అధ్యాయం ‘’రతి ‘’ కి కేటాయించాము ..ధర్మార్ధ కామ మోక్షాలకు సంబంధించిన నాలుగు శృంగార రూపాలతో కొత్త సిద్ధాంతాన్ని విస్తృత ప్రాతిపదికపై నిర్మించాను . 15 అధ్యాయాలలో సంప్రదాయ శృంగార రస లక్షణాలు చర్చించాను ..  22 వ అధ్యాయం ‘’అనురాగం ‘’కు కేటాయించాను .దీనిలో 64 రకాలున్నాయని చెప్పాను అందులో ఒక్కొక్కొటి 8 విధాలు .వీటిలో ఒక్కొక్కదానిలో మళ్ళీ 8 రకాలు .ఇవి మళ్ళీ ఒక్కోటి 3 రకాలు .కనుక మొత్తం 64x8x 24=12228రకాలు .ఇన్నిటికి పేర్లు పెట్టటం ఆషామాషీ కాదు కానీ అన్నిటికీ పేర్లు పెట్టాను ..అన్నిటికీ ఉదాహరణలివ్వగలిగాను .

మహిమా భట్టు -భోజమహా రాజుల వారిది ఎంతటి సూక్షం పరిశీలనా అర్ధమయిందికదా ..ఒక వస్తువు ను చూడటం వలన అది అనుభవం లోకి  వచ్చి సంస్కార రూపంగా మనసులో దాగి ఉంటుంది .దీనికి సంబంధించిన మరో వస్తువును విన్నప్పుడో చూసినప్పుడో పూర్వ సంస్కారం వలన క్రొత్తదాన్ని గ్రహించగలం ఈ మూడు రకాల అభి వ్యక్తీకరణలో ఒక్కటికూడా ధ్వనికి వర్తించదు .అందుకే రసధ్వనికి నిర్వచనంగా అభి వ్యక్తిని చూపటం జరిగింది ..వాచ్యార్థ రచనలన్నీ కవిత్వం అవుతాయి .ధ్వనికావ్యం దాని వెలుపలే మిగిలిపోతుంది ధ్వనిని రెండవ రకమైన వ్యంజకంగా భావిస్తే అప్పుడు వ్యంజకానికి అనుమాన సంజ్ఞ లేకుండా పోతుంది .ధ్వని సిద్ధాంతాన్ని వదిలి అనుమాన సిద్ధాంతాన్ని అంగీకరించాల్సి వస్తుంది .

విశ్వనాథుడు -నేను ధ్వనిని అంగీకరించి ,దాని ఉనికిని నిరూపిస్తూ -’’కావ్యస్యాత్మా సాయి వార్ధాహ్  కావ్యస్యాత్మా ధ్వని రీతిహ్ ‘’రస ప్రాధాన్యతపై నేను -’’ఏకో రసో అంగీకర్తన్యాహ్ ‘’అని ధ్వని వస్తు, అలంకార రసధ్వనులన్నాను ..మొదటి రెండు కావ్యాత్మ కానేరవు .రసధ్వనిమాత్రమే కావ్యాత్మ .ఈ ఒక్కమాటతో నా సాహిత్య దర్పణం అలంకార శాస్త్ర వికాసం లో అసదృశ స్థానం పొందింది .ధ్వని సిద్ధాంత ప్రవర్తకులలో నన్ను అగ్రగణ్యుని చేసింది .రస సిద్ధాంతాన్ని సుదృఢం చేసిన వానిగా కీర్తి గడించాను .

 జగన్నాథుడు -నా అన్యోక్తులలో కూడా ధ్వని ఉంది .సాహిత్య సేవలో ప0డిపోయాను .ఎన్నో స్వతంత్ర భావాలు చెప్పాను .ప్రతిభకు సర్వోన్నత స్థానమిచ్చాను .కావ్యాలను నాలుగు రకాలుగా విభజించాము .కొత్త రస సిద్ధాంతం చెప్పటం ,రెండురకాల గుణాలు అంగీకరించటం ,శబ్ద మూల శక్తి ధ్వనిని తర్క సమ్మతంగా రుజువు చేయటం ,అభిద లక్షణ శక్తులపై చర్చ ,అనేక అల0కారాలకు రూపాన్ని ,పరిధిని నిర్ణయించటం లో నా మౌలిక ప్రతిభ వ్యక్తమైనదని అంటారు.  నిజమేనేమో లేక పొతే ఎందుకంటారు ?

 సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -9-

అలంకారిక ఆనంద నందనం -9-

సరసభారతి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ‘’అలంకారిక ఆనంద నందనం ‘’నాల్గవదైన చివరిభాగానికి సాహితీ పిపాసులకు స్వాగతం . ఈ రోజు నలుగురు సుప్రసిద్ధ ఆలంకారికులు మనకు తమ సిద్ధాంత వివరణ చేస్తారు .శ్రీ భోజ మహారాజులవారిని సభాధ్యక్షం వహించి తమ పాలనా వైభవాన్ని తెలియజేస్తూ సిద్ధాంత వివరణ నిస్తూ సభను నిర్వహించవలసినదిగా కోరుతున్నాను .నవరత్నకవులతో వారు నిర్వహించిన కవితా దర్బారు మనకు సుపరితమే .వారికిది నల్లేరు పై బండి … ఈ నాటి భోజాస్థానం లో స్థానం పొంది తమ తమ సిద్ధాంత ప్రతిపాదనలను వివరించవలసినదిగా రాజానక మహిమా భట్టు ,విశ్వ నాథ కవిరాజు ,మన ఆంద్ర దేశ జగన్నాథపండిత రాయలను వేదిక నలంకరించవలసినదిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను ..

భోజమహారాజు -నేను క్రీశ. 1010 నుంచి 1050 వరకు మాళవ రాజ్య  పాలన చేశాను . మా తండ్రి సింధురాజు ఐదేళ్లు లోపే రాజ్యపాలన చేశారు ./పెదనాన్న ముంజు పరమార వంశ మొదటి గొప్పరాజు . 20ఏళ్లకు పైగా పాలించారు .ఆయన మహాసేనాని కవి .కళాసాహిత్యాలను పోషించారు పారమారరాజులలో నా పాలన స్వర్ణయుగం గా భావిస్తారు .వారసత్వంగా విస్తారమైన సామ్రాజ్యం నాకు లభించినా రాజ్య విస్తరణకు కృషిచేసి ఒరిస్సా ,శాకాంబరీ ,లాట,కొంకణాదేశాలు జయించి మాళవ రాజ్యం లో కలిపాను .గజనీ మహమ్మద్ దండయాత్రలు యె దుర్కోవటానికి  ఆనంద  పాలుడికి, ఆయన తర్వాత కుమారుడు త్రిలోచన పాలునికి నా సైన్యాన్ని పంపి సహాయం చేశాను ..ఉత్తర భారతం లో ఘజనీకి ఎదురులేక పోయినా ,నా నాయకత్వం లో హిందూరాజులను  సంఘటిత పరచి అతని దురాక్రమణలకు అడ్డుతగలగా 1025 లో గజినీ సోమనాధ దేవాలయాన్ని దోచి ధ్వంసం చేశాక ,మమ్మల్ని తప్పించుకోవటానికి దారిమళ్లి  కచ్ ,సింధు ప్రాంతాలనుండి వెనక్కి పారిపోయాడు  .పశ్చిమ ప్రాంతం లో మా విజయానికిది నిదర్శనం ఒరిస్సా పాలకుడు రాజేంద్ర చోళుడితో మైత్రి కుదుర్చుకొని రాజ్యాన్ని సుస్థిరం చేశాను .. సుదీర్ఘంగా నా చరిత్ర చెప్పానేమో !ఇప్పుడు వరుసగా మహిమా భట్టు ,విశ్వనాథుడు జగన్నాథుడు ప్రసంగిస్తారు .

మహిమా భట్టు -నేను కాశ్మీర బ్రాహ్మణుడను .మాతండ్రి శ్రీ ధైర్యుడు .గురువు మహాకవి శ్యామల .అలంకార శాస్త్రంగా ‘’వ్యక్తి వివేకం ‘’రాశాను .ఇది ఆనంద వర్ధన ధ్వని సిదాంతానికి వ్యతిరేకం .నేను రాసిన మరో గ్రంధం ‘’తత్వోక్తి కోశం ‘’లో భావన యొక్క స్వభావాన్ని నిరూపించా .అయితే ఇది ప్రస్తుతం అలభ్యం అంటున్నారు ..నేను ‘’అనుమాన సిద్ధాంతం ‘’ప్రతిపాదించాను .పాండిత్యం అరుదైన రసాస్వాదం కలిపి దీన్ని రాశాను ..రుయ్యకుడు వ్యక్తివివేకానికి వ్యాఖ్య రాశాడు .ఇందులో రెండవ అధ్యాయమే లభించింది . అందులో నా సిద్ధాంతంపై విమర్శ ఉంది . వివేకం లో మొదటి అధ్యాయం లో ధ్వని నిర్వచనాన్ని విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి ,అది అనుమానమే తప్ప వేరే  కాదని నిరూపించాను .కుంతకుని వక్రోక్తి కూడా అనుమాన పరిధిలోనిదే .రెండవ అధ్యాయం లో నా విమర్శనా ప్రాగల్భ్యం కనిపిస్తుంది ..చివరి అధ్యాయం లో అనుమాన సిద్ధాంతాన్ని వివరించాను .ఆనంద వర్ధనుడు ధ్వనికిచ్చిన ఉదాహరణలనే తీసుకొని అలంకార శాస్త్రం లో కొత్త మార్గం స్థాపించాను . విశ్వనాథుడు -ఒరిస్సా రాష్ట్రం లో పండిత కుటుంబం లో నేను పుట్టాను.  కపింజల గోత్రీకుడిని . తండ్రి చంద్ర శేఖరుడు కవి ,ఛ0దోవేత్త .14 భాషలలో దిట్ట . ఒరిస్సా గజపతి రాజుల ఆస్థానం లో మా తాత జయదేవుని అష్టపదులకు సర్వాంగ సుందరి వ్యాఖ్య రాసిన నారాయణ దాసు,   తండ్రీ  చంద్ర శేఖరుడు ,నేను కూడా ఉన్నవాళ్ళమే .నేను 18 భాషలలో ప్రావీణ్యం ఉన్నవాడిని .’’సాహిత్య దర్పణం ‘’అనే అలంకార  గ్రంథం  రాశాను .నాకుమారుడు అనంత దాసు నా సాహిత్య దర్పణానికి ‘’లోచన ‘’వ్యాఖ్య రాశాడు ..నేను త్రికళింగ  అమాత్యుడను ..నా రచనలు -చంద్రకళా  నాటిక ,ప్రభావతీ పరిణయ నాటకం ,రాఘవ విలాస కావ్యం ,కువలయాశ్వ చరిత్ర -ప్రాకృత కావ్యం ,ప్రశస్తి రత్నావళి ,నరసింహ విజయం ,కంస వధ  కావ్యం ,కావ్య ప్రకాశ దర్పణం , లక్ష్మీ స్తవం మొదలైనవి సాహిత్య దర్పణం తోపాటు రాశాను .

జగన్నాథుడు -ఆంధ్రదేశం లో కోనసీమలో ముంగండ గ్రామ లో ఉపద్రష్ట వారింట క్రీశ 1600 లో జన్మించాను .ఉపద్రష్ట అంటే యజ్ఞ పరివేక్షకుడు అని అర్ధం .తండ్రి  భట్టు సకల విద్యా ప్రవీణుడైన పండితుడు .  తల్లి లక్ష్మి. నేనుప్రసిద ఖండూర దేవుని వద్ద విద్యలు నేర్చాను .తండ్రిగారివద్దనే వ్యాకరణం తప్ప సకల శాస్త్రాలు అభ్యసించాను .శేష నీరీశ్వరులవద్ద వ్యాకరణం నేర్చాను . నా తండ్రిని నేను ‘’మహా గురువు ‘’ అని సంబోధించాను .నాకు తండ్రీ ,గురువూ ఒక్కటే ..నేను ఉత్తరభారతం చేరి మొగల్ చక్రవర్తి షాజహాన్ ఆస్థానకవినై పండిత రాయలు బిరుదుపొందాను.  ఆయనకుమారులూ నా శిష్యులే .చక్రవర్తి అనుమతిపొంది లవంగిని పెళ్లి చేసుకొన్నాను ..నా శిష్యులలో శ్రీకులపతి మిశ్రా ఆగ్రా మధుర చతుర్వేది వంశస్తుడైన మధురకవి . జయపూర్ రాజు మొదటి శ్రీరామ సింహాజీ ఆస్థానకవి .మరొక శిష్యుడు నారాయణ భట్టు ..నేను ‘’రస గంగాధర0 ‘’అనే అలంకార  గ్రంథం  రాశాను ఎందుకో కానీ నాకూ అప్పయ్య దీక్షితులుకు పడేదికాదు . ఎడ్డెమంటే తడ్డెం అనుకొనే వాళ్ళం  .గంగా లహరి యమునా లహరి అనే అమృత లహరి ,కరుణా లహరి ,లక్ష్మీ  లహరి ,సుధాలహరి రస గంగాధరం తోపాటు రాశాను .అందుకని నన్ను లహరికవి అన్నారు ..

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -8

అలంకారిక ఆనంద నందనం -8

అభినవ గుప్తుడు -నాటక కళా సృష్టిని సజీవంగా భావించాను ..భరత ముని మార్గాన్నే అనుసరించి దాన్ని కార్యావస్థలు ,అర్ధ ప్రకృతులు గా విశ్లేషించా .ఈ రెండిటినీ 64 సంధ్యారాగాలుగా విభజించి ,నాటక కర్త అవసరాన్ని బట్టి వీటిలో ఎన్నైనా వాడుకొనే వీలు కల్పించా .నాటకం లో రసమే ఆత్మ అని నేనూ అంగీకరించా ..రంగస్థలం పై ప్రదర్శించే ఒక వస్తువుగా రసాన్ని విశ్లేషించా .విభావ అనుభావ వ్యభిచార స్థాయీ భావాలు దాని అంగాలు అన్నాను ‘’స్థాయీ విలక్షణో రసాహ్ ‘’.సన్నివేశం మొదలైన వాటితోకలిసి పానకం లా స్థాయీ భావానికి భిన్నంగా ఉండేదే రసం ..రసానుభవం వేర్వేరు స్థాయిలలో ఉంటుందని చెప్పా .ఇంద్రియాలు బుద్ధి ,భావోద్వేగం ,ఉద్వేగ అభి వృద్ధి ,అలోకికం అనేవి ప్రతి ఒక్కటీ తర్వాత వచ్చే స్థాయికి తీసుకొని వెడతాయి . రసానుభవం యొక్క వివిధ భావాలను ఒక్కొక్కదాన్ని ఒక ప్రత్యేక స్థాయికి కేటాయిస్తుంది . మొదట ఇంద్రియ స్థాయిలో విశ్లేషణ ప్రారంభమౌతుంది .కళకు సంతోషమే ప్రయోజనం అన్నాను ..నిజమైన రసాత్మక వస్తువు కేవలం ఇంద్రియాలను ఉత్తేజపరచేదికాదు.  భావనశక్తిని ఇంద్రియాలద్వారా పురిగొల్పుతుంది .అంటే ఒక చిత్రానికి స్థూల రేఖలు మాత్రమే గీసినట్లు అన్నమాట .ప్రేక్షకుడు తన భావనా  శక్తితో  అవసరమైన వాటితోనింపి చిత్రాన్ని పూర్తి చేస్తాడు .కనుక నేను రసానుభూతికి రెండవ స్థాయి భావన అన్నాను ..ప్రేక్షకుడు నటుని అభినయం తో తాదాత్మ్యం చెంది ఉద్వేగానికి గురౌతాడు .కళ  ఉద్వేగాన్ని ప్రదర్శిస్తుంది ,ప్రేరేపిస్తుంది .ఉద్వేగానికి గురైతే తనను తాను  మర్చిపోతాడు అప్పుడు వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు .నా దృష్టిలో గాఢమైన అంతర్లీనత  వలన ,స్థాయీ భావాన్ని నిరాదరరించటం వలన కర్త ,వస్తువు అనే ద్వైవీ భావం  తొలగిపోవటమే చివరిది అత్యున్నత మైనది అయిన రసానుభవం .ఈ దశలో స్థాయీ భావం అంతశ్చేతన  లో మునిగిపోగా సాధారణీకరణం చెందిన వ్యక్తిలోని ఆనంద పార్శ్వ్0 ప్రకాశిస్తుంది . యోగి అనుభావించే తురీయానందం వంటిది పొందుతాడు .ఆత్మ ఒక్కటే ప్రకాశించగా వస్తువుకు సంబంధించిందంతా అంతశ్చేతనలో లయమై పోతుంది . సోదరులూ ఇక కానీండి . మమ్మటుడు -అన్నగారు సమాధి సిద్ధి మనందరికీ కల్గించారు . .నేను నా గ్రంధం 5 వ అధ్యాయం లో మధ్యమ తరగతి కవిత్వాన్ని చర్చించాను .ఇలాంటికవిత్వం లో వాచ్యార్థమే ప్రధానం . వ్యంగ్యార్థం అప్రధానం . దీనినే ‘’గుణీ భూత వ్యంగ్యం ‘’ అన్నాను  . శాస్త్ర తార్కిక వాదంతో పరిపుష్టి చేశాను . 6 వ అధ్యాయం అధమకవితను గూర్చి చెప్పాను .ముఖ్యమైన 7 వ ధ్యాయం లో కావ్య దోషాలు చర్చించి నా విమర్శనా శక్తికి పదును పెట్టాను ..కాళిదాసు కుమార సంభవం లో వర్ణించిన పార్వతీ పరమేశ్వరుల శృంగార క్రీడను తప్పు పట్టాను .తప్పు ఎవరు చేసినా తప్పే . ఆనాడే వర్ధనులు అంగీకరించినా నేను మాత్రం ఒప్పుకోలేదు . నాకు ఉన్నది ఉన్నట్లు చెప్పే ధైర్యం ఉంది . నేను ఎవరికీ జంకను .స్వంత  తలిదండ్రుల రతి క్రీడ వర్ణించటం ఎలా తప్పో, ఆది దంపతుల రతికేళి వర్ణించటం కూడా అంతే తప్పు మొహమాటం లేదు ..పద్యం లో రస విరోధం ‘’విషయం లో ఆనంద వర్ధనుని నిలదీశాను అలాగే వామన రుయ్యక ఉద్భటులతో కూడా విభేదించా ,చివరికి నా వాదమే సరైనది అని అందరూ అన్నారు .వేదాంతులలో నిష్ణాతులైన ముకుళభట్టు ,మండన మిశ్రులతోకూడా ఢీ అంటే ఢీ  అన్నా ..

కుంతకుడు -సృజనాత్మక భావన కవిత సామ్రాజ్యపు అయిదు వేర్వేరు క్షేత్రాలలో ప్రవర్తిస్తుంది .ఇవే  అక్షరాలా కూర్పు ,పద పూర్వార్ధ ,పద పరార్ధ ,వాక్య ,ప్రకరణ ప్రబంధం . వక్రత ఈ ఐదింటిలోనే ప్రదర్శనమిస్తుంది..కవిత్వం లో రస ప్రాధాన్యం గుర్తించి అది ప్రకరణ వక్రత ,ప్రబంధ వక్రత పరిధిలోకి వస్తుందని చెప్పా .మొత్తం కావ్యం లో కనిపించే వక్రత లేక ప్రబంధ వక్రతను ఆహ్లాదకరమైన రసాల సాయం తో సాధించాలి .పదాల కు జీవకళ వచ్చేది ఆసాంతం రసాన్ని కొనసాగించి ,ఆహ్లాదం కలిగించినప్పుడే .ఆనంద వర్ధనుల మతమూ ఇదే .ఈ భావమే నన్ను ఉత్కృష్ట అలంకారిక జాబితాలో చేర్చింది ..కావ్యం లో అంగీభూతంగా రసం ఉంటె దాన్ని ధ్వనిగా గుర్తించాలని ఆనంద వర్ధనులన్నారు .కానీ నేను ‘’రసానుతుల్యం వర్తమానం ‘’అని చెప్పి ,నేను చెప్పిన రసవాదాలంకారానికి ,రసానికి సమాన హోదా ఇవ్వాలని వాదించాను  . వర్ధనులు రెండవ తరగతి కావ్యం లో దీన్ని చేర్చగా నేను వక్రతతతో సమాన హోదా నిచ్చాను . రసవదాలంకారం అంటే రసమే ప్రధాన ఆకర్షణగా గల ఒక రకమైన వక్రోక్తి .

అభినవ గుప్తుడు -ఉద్వేగ అభి వ్యక్తి స్థాయిలో అనుభవించే రసానికీ ,అలౌకిక స్థాయిలో అనుభవించే పరమానంద సమానమైన రసానికి భేదం ఉంటుంది .సూక్ష్మఅంశాలను సైతం అధిగమించగలవారు మాత్రమే ఇలాంటి రసానందాన్ని పొందగలరు .విశేషణం విశేష్య భావ ముఖేన యో వ్యవహారాః సా ఆత్మాణి నోప పద్యతే ‘’. రసానుభవం నిశ్చలం కాదు .గతి శీలమైనది . ఇది ఆత్మ తన విశ్వ జనీనత ను భావించి అనుభవించటమే .ఆనందం అంటే స్వాత్మ పరామర్శమాత్రమే వేరే ఏమీ కాదు .దీన్ని అద్వైత వేదాంత దృ ష్టి తో వివరించలేము కారణం ఆత్మకు లేక బ్రహ్మ0 కు స్వప్రకాశమే కానీ స్వాత్మ పరామర్శ ఉండదు …

 అర్ధ నిర్ణయం లో ఉన్న సమస్యలనూ మనో వైజ్ఞానిక దృ ష్టి నుంచి అధ్యయనం చేసి వాటిలో అభిదా ,లక్షణా ,తాత్పర్య ,వ్యంజనా అనే నాలుగు భేదాలున్నాయని చెప్పాను  .నా అల్మాకార సిద్ధాంతం శైవ తత్వ శాస్త్రాలు జ్ఞాన సిద్ధాంతాలపై ఆధార పడిఉంది . నా సిద్ధాంతాన్ని అందుకే రహస్య యోగం అన్నారు .పరమ సత్యం  అఖండమైనది .జ్ఞానం జ్ఞేయం జ్ఞాత అంతా ఆభాసమే .ఈ ఆభాస పూరిత ప్రపంచమంతా సమస్తాన్నీ తనలో ఇముడ్చుకొన్న విశ్వ చేతన.లేక ఆత్మ యొక్క వ్యక్తరూపం .దీన్ని స్వాతంత్య్ర  వాదం అనీ అనచ్చు నిర్ణయం స్వేచ్ఛ పరమ తాత్విక సిద్ధాంతంగా అది విశ్వ శిస్తుంది ..జీవాత్మ ,పరమాత్మ ఒకే పోలికకలవి .జీవాత్మకు మూడుకల్మషాలు -అణవ,కర్మ ,మాయ ఉండటం వలన పరమాత్మకంటే వేరుగా కనిపిస్తాడు .వీటిని తొలగించుకోవటానికి తంత్ర లోకం అనే గ్రంధం లో దేశధ్వ ,తత్వధ్వమొదలైన అధ్యాయాలలో చర్చించాను .అనుభవ స్థాయిలో గ్రహించేవాడి వ్యక్తిత్వం రుచి ,కోరిక ,గ్రహణ శక్తి ని బట్టి ఉంటుంది .సాధారణ భావ స్థాయిలో రసికుడు ,రసకారుడు విశ్వ జనీనతను సాధిస్తారు .దీనికి నాటక ప్రదర్శన విధానమమే  తోడ్పడుతుంది . .. ఇంతటితో నేను చెప్పాల్సింది ముగిస్తూ ,మిత్రులకు కొనసాగించమని కోరుతున్నాను .

మమ్మటుడు-పదం ,పదాంశం ,మూలం ,ధాతువు ,ప్రత్యయం ,విభక్తి ,పాదాంతం ,క్రియాకాలం ,చివరికి వచన  సంఖ్య లో కూడా  సూక్ష్మా0శాలలో  వ్యంగ్యార్థం తొంగి చూడచ్చు . ధ్వనికి అనంత రూపాలున్నాయి వీణాన్నిటిని నాల్గవ అధ్యాయం లో వివరంగా రాశాను . దోషాలను ఎట్టి చూపే రంధ్రాన్వేషకులు చాలామందే ఉంటారు .నేను దోష నివారణ పద్ధతులు చెప్పి దారి చూపించాను  ..ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నాను .

కు0త కుడు -నేను రీతి కి మార్గం అని పేరుపెట్టాను .కాళిదాసు సుకుమారమార్గానికి ,బాణ భవభూతులు విచిత్రమార్గానికి ,మయూరుడు మార్గ మార్గానికి ,మిగిలినవారు  మాధ్యమమార్గానికి చెందినవారు .ప్రతికవికి భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది .కవి వ్యక్తిత్వం శైలిలో ప్రతి బింబిస్తుంది . వక్రోక్తి కి అసాధారణ ఆకర్షణ ఉండాలి రసికులు రంజింపజేయాలి ..ధ్వని రస విషయాలలో నాకు అభిప్రాయం భేదం లేదు . కావ్య నిర్వచనం లో నేను రసికులు ప్రాధాన్యమిచ్చాను ‘’శబ్దార్ధౌ  సహితం కావ్యం ‘’-శబ్దం అర్ధం కలిసే కావ్యమౌతుంది .శబ్దార్ధాలుకలిసి ‘’సాహిత్యాన్ని ‘’కలిగి,వక్రోక్తిలో అమరి అభిరుచి ఉన్న రసికులు ఆనందింప జేసినపుడే అది కవిత్వం అవుతుంది .ఈ సాహిత్య భావన కల్పించినవాడిని నేనే ..నేనే స్వయంగా కవితా గుణాలను రెండు సముదాయాలుగా గుర్తించాను .మొదటిది సాధారణ ఇది అన్నిరకాల కవిత్వం లోనూ ఉంటుంది .రెండవది అసాధారణ .ఇందులోని గుణాలు ప్రత్యేక మార్గాలు లేక శైలి కి సంబంధించినవి . మొదటి సముదాయం లో సౌభాగ్య ,లావణ్య ,ఔచిత్యా లు ఉంటాయి రెండవదానిలో మాధుర్య ,ప్రసాద ,లావణ్య ,ఆభిజాత్యాలుంటాయి ఈ నాలుగు గుణాలు సుకుమార మార్గ ,విచిత్ర మార్గాలకు చెందినవి .సౌభాగ్యగుణం శబ్దానికి అర్ధానికీ కూడా చెందుతుంది . గుణం చేరటం వలన సందర్భాన్ని బట్టి రసం నిష్పన్నమై రసికులు ఆనందం కలిగిస్తుంది . శబ్దార్దాల సౌందర్యమే లావణ్యం .కవితా మర్యాద ఔచిత్యం .భావాలలో ,పద ప్రయోగం లో కూడా ఔచిత్యం ఉండాలి . ఔచిత్యం ద్వారానే కవిత భావనలు జీవం పోసుకొంటాయి .. ఔచిత్యానికి నేనే మార్గదర్శినని చెబుతూ సెలవ్ .

   చాలా సంతోషంగా ఈ మూడవ కార్యక్రమం పూర్తి అయింది .ఒక్కసారి వారి భావనలను పునశ్చరణ చేసుకొందాం  . ‘

 ‘’రసానుభవం లో సాధారణ భావ స్థాయిలో రసికుడు ,రసకారుడు కూడా విశ్వ జనీనత ను సాధిస్తారని అభినవ గుప్తులవారి భావం .కావ్యభాషకు భావకత్వ  భోజకత్వ శక్తులు ఉంటాయి అన్న భట్టనాయక మతాన్ని గుప్తులవారు తిరస్కరించారు . ఈ రెండు శక్తులవలననే రసానుభవం లో సాధారణీకరణ జరుగుతుందని భట్టనాయకుడు భావిస్తే ,అభినవ గుప్తులు రసానుభవాన్ని అలౌకిక స్థాయిలో కూడా వివరించి అది ఆనందానుభవం తప్ప మరొకటి కాదన్నారు ..భట్ట తౌతుడు రాసిన ‘’కావ్య కౌతుకం ‘’కు గుప్తులవారు ‘’వివరణ ‘’రాశారు ..అభినవ గుప్తుల అన్నగారు ధ్వన్యాలోకానికి ‘’చంద్రిక ‘’వ్యాఖ్యానం రాశారు . దాన్ని ఆ వంశం వారందరూ అధ్యయనం చేశారు .చంద్రిక చాలక తాను  ‘’లోచన ‘’వ్యాఖ్య రాశానని గుప్తులవారే చెప్పుకొన్నారు . వేదికపై ఉన్న మమ్మటు లవారు అభినవ గుప్తులను ‘’ఆచార్య పాదులు ‘’అని సంబోధించటం వలన అయన శిష్యుడే అయి ఉంటారు .క్షేమేంద్రుడూ గుప్తులను తనగురువుగా చెప్పుకొన్నాడు . అలంకార శాస్త్రం లో ‘’గుప్తం’’గా ఉన్న ఎన్నో విషయాలను వెలికి తీసి ‘’అభినవం’’గా చెప్పిన అభినవ గుప్తులవారికి అభినందన చందనం .

 రాజానక మమ్మట  పండితుల సమైక్యబుద్ధి అభినందనీయం .తన వ్యక్తిత్వాన్ని బహుముఖ పాండిత్యాన్ని కావ్య ప్రకాశం లో ప్రకాశమానంచేశారు స్వతంత్ర భావాలు ,నిర్భీకత ,న్యాయ ద్దృ ష్టి ,విశాల దృక్పధం ,సమన్వయ దృష్టి ,సాహిత్య సృష్టిలో అంద  చందాలు  .దోషాలు గ్రహించే ప్రతిభ ,రసికత వారి వ్యక్తిత్వ ముఖ్య లక్షణాలు .ఇన్ని గుణాలు ఒక చోట కలిసిఉండటం అరుదైన విషయం .అందుకే కావ్యప్రకాశానికి వ్యాఖ్యానం రాసిన ఒకాయన ఆయనను సరస్వతీ దేవి అపర అవతారమని  స్తుతించాడు ‘’వాగ్దేవతావతార’’అని మళ్ళీ స్తుతించేదాకా ఉండలేక పోయాడు . ఆయన మాటకు తిరుగు లేదు .ధ్వని సిద్ధాంత లక్షణాలకు నిర్దిష్ట రూపాన్నీ ,ఆచరణాత్మక నిర్వచనాన్ని ఇచ్చిన ఘనత రాజానక మమ్మట పండితులకే చెందుతుంది .వీరికి ముందు ధ్వన్యాలోకం లో లోచన0 లో సిద్ధాంతాలుగా రూపు దాల్చని భావాలుగా ఉన్న  ధ్వని సిద్ధాంతానికి సంపూర్ణమైన తుది స్వరూపమిచ్చి ఆనంద వర్ధనులకే కాక అలంకార శాస్త్రానికి విలువైన కానుక నిచ్చిన మమ్మట పండితులకు కాశ్మీరమేకాదు యావద్భారతం  రుణ పడి  ఉంది .వారి కావ్యప్రయోజన ,కావ్య హేతు చర్చ అందర్నీ ఆకర్షించింది .శబ్ద శక్తి వివరణ అనితరసాధ్యమనిపిస్తుంది .కావ్యప్రకాశికకు జైన మతాచార్యులు మాణిక్య చంద్రుడు మొదటి వ్యాఖ్యానం రాస్తే ,ఆతర్వాత 50 కి పైగా టీకలు  వచ్చి  భగవద్గీత తర్వాత ఇన్ని టీకలు వచ్చిన గ్రంధంగా రికార్డ్ సాధించింది . టీకాలు వివరణలు వివరణలు మళ్ళీ టీకలూ శర  పరంపరగా సాగుతూనే ఉన్నాయి .ప్రతి ఇంట్లో కావ్య ప్రకాశం ఆవరించి ఉంది అనే శ్లోకం ఒకటి బాగా ప్రచారం లో ఉంది  -’’కావ్య ప్రకాశస్య కృతా గృహే గృహే టీకా తదాప్యేష తథైవ దుర్గమః ‘’.ధన్యులు మీరు మమ్మట పండితా!  మమ్మల్నీ ధన్యులను చేసినందుకు కృతజ్ఞతలు .  మమ్మట మతం సర్వ సమ్మతం అని పించారు .

  రాజానక కు0తకుల వారి   వక్రోక్తిలో ధ్వని సంప్రదాయం కలిసే ఉంది . కానీ కొత్తదారిపట్టి ముసుగేసుకొన్న ధ్వని వక్రోక్తియే అనిపించారు .అందరూ కావ్యాత్మ అంటే కావ్య జీవితం అన్నారు . సోమేశ్వర మాణిక్య చంద్రులు వీరిని సమర్ధించారు . వీరిభావాలు పాశ్చాత్య ఆలంకారికుల భావాలకు దగ్గరగా ఉంటాయి .కావ్య నిర్వచనం ,అలంకార నిర్ణయం రీతి వివరణలో ఆధునిక మార్గమే తొక్కారు .ఔచిత్యం ద్వారానే కవితా భావనలు జీవం పోసుకొంటాయి అన్న వారి భావనలను క్షేమేంద్రుడు ఔచిత్యాన్ని గురించి ఒక బృహద్గ్రంధమే రాశాడు .ఔచిత్యం రసం తోకలిసి స్థిరమై కావ్య శరీరాన్ని జీవం తో నింపుతుందన్నాడు .ఔచిత్య ,రసాల ఆధిక్యతను  అంగీకరించి తమ కొత్త సిద్ధాంతమైన ‘’వక్రోక్తి ‘’కూడా అలంకార శాస్త్రం లో ముఖ్యమైన విలువలను సమర్థిస్తుంది అని నిరూపించారు . వక్రోక్తి కుంతక ధరులైన కుంతకులకు అభినందనం .

 ఈ మూడవ సమావేశం అర్ద వంతంగా సమాప్తి చెందినందుకు ఇందులో పాల్గొన్న అలంకారిక మహాశయులకు శ్రోతృ మహాశయులకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను . నాల్గవ చివరి ప్రత్యేక సమావేశం లో మళ్ళీ కలుద్దాం .

 సశేషం

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -7

అలంకారిక ఆనంద నందనం -7

సాహితీ బంధువులకు సరసభారతి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ‘’అలంకారిక ఆనంద నందనం ‘’మూడవ భాగానికి స్వాగతం . ఈ రోజు శారదా దేశ0 కాశ్మీర్ కే చెందిన ముగ్గురు ఆలంకారికులు మనమధ్య ఉండటం మరొక వినూత్న విషయం .. వారిలో ‘’అభి వ్యక్తి సిద్ధాంతకర్త ‘’శ్రీ అభినవ గుప్తులవారిని అధ్యక్ష స్థానం వహించి సభా సంచా లనం చేస్తూ తమ సిద్ధాంతవిషయాలను తెలియ జేయవలసినదిగా  వేదిక నలంకరించవలసినదిగా అగౌరవంగా ఆహ్వానిస్తున్నాను ..వ్యంజనా వృత్తికారులు రాజానక మమ్మట పండితులను ,వక్రోక్తి విన్యాసి రాజానక కుంతకులవారినీ తమ సిద్ధాంత వివరణ చేయవలసినదిగా ఆత్మీయం గా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను . ఇద్దరు రాజానకులు వేదికపై ఉండటమూ మన అదృష్టమే .

అభినవ గుప్తుడు -నా మాతృభూమి భారత దేశ శిరోలంకారమైన కాశ్మీరం అవటం నా అదృష్టం ..నేను క్రీశ 960 ప్రాంతం వాడిని . నా రచనలలో నా జీవితాన్ని రేఖా మాత్రంగా తెలియజేశాను .మొదటి గ్రంధం క్రమ స్తోత్రం మార్గ శిర బహుళ నవమి క్రీశ. 990 లో ను ,భైరవాష్టకం పుష్య బహుళ దశమి క్రీశ. 992 లో ,ఈశ్వ ప్రత్యభీఙ్ఞ వివృతి విమర్శ మార్గశిరమాస చివరి దినాన 1014 లో రాశాను .నేను 30 వ ఏటనే సాహిత్య వ్యాసంగం ప్రారంభించాను ..మా పూర్వీకులలో అత్రి గుప్తుడు అతి ప్రాచీనుడు ..కనౌజ్ పాలకుడు లలతా దిత్యుని శైవ వాజ్మయ పాండిత్యానికి ముగ్ధుడై తనతో కాశ్మీరానికి ఆహ్వానించి తీసుకు వెళ్ళాడు .రెండు శతాబ్దాల తర్వాత  నేను కాశ్మీరం లో జన్మించానన్నమాట ..మాతండ్రిగారు నరసింహ గుప్తులు ..తల్లిగారు విమలమ్మ .ధార్మిక వాతావరణం లో ధన్యమైన కుటుంబం లో నేను పుట్టానని గర్వం గా చెప్పుకొంటాను .నా వాగ్ధాటి ,మేధో శక్తికి ఉపాధ్యాయులు నివ్వెర పోయేవారు . ఇదంతా శారదా దేవి కటాక్షం .చిన్నప్పుడే తల్లి చనిపోవటం ,మా తండ్రిగారు సర్వం త్యజించి సన్యాసం స్వీకరించటం తో నేను వివాహం చేసుకో కూడదని నిర్ణయించుకున్నాను  . కాశ్మీర్ లోను బయటా మహా పండితుల వద్ద క్రమ ,త్రిక ,కులపద్దతి సిద్ధాంతానే  కాక ,ఆచరణాత్మక యోగ పద్ధతులూ నేర్చాను ..యోగాభ్యాసం తో ఆత్మ శక్తులు సాధించాను . ఇప్పుడు వరుసగా మమ్మట ,కు0తక మహాశయులను తమ ప్రసంగాలను వరుసక్రంగా చేయవలసినదిగా కోరుతున్నాను .

మమ్మటుడు -అన్నగారు గుప్తుల వారివలెనే నేనూ కాశ్మీరమ్మ ఒడిలో పుట్టాను .నా గురించి నేను ఎక్కడా చెప్పుకోలేదు .కానీ పరిశోధకులు ఊరుకొంటారా ? ఎంతో శోధించి నేను 11 వ శతాబ్ది ఉత్తరార్ధం వాడినని సిద్ధాంతం చేశారు ..నేను రాసిన ‘’కావ్యప్రకాశం ‘’అనే అలంకార గ్రంధం బహు ప్రశస్తి పొందింది .అది భారతీయ ఆత్మపై చెరగని ముద్ర వేసింది అంటారు విజ్ఞులు . దీనిపై  ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చి నన్ను మరవనివ్వలేదు .సంస్కృతం లో కావ్య ప్రకాశానికి వచ్చినన్ని వ్యాఖ్యానాలు ఇంకా దేనికీ రాలేదని నిర్ధారించారు .నాకు రాజానక బిరుదునిచ్చారు  ..సంస్కృత ,ప్రాకృతాలలో అశేష పాండిత్యమూ ,వ్యాకరణం లో విద్వత్తునూ సాధించాను ..మాతండ్రి గారు జయ్యట పండితులు .నా తమ్ముళ్లు కైయట ,ఊవట లు .తమ్ముళ్ళిద్దరూ వేదాలకు వ్యాకరణానికి వ్యాఖ్యానం రాసిన పండితులు . పెద్ద తమ్ముడు కైయట మహాభాష్యానికి ,చిన్నతమ్ముడు ఊవట శుక్ల యజుర్వేద సంహితకు వ్యాఖ్యలు రాశారు .తమ్ములిద్దరూ నా వద్దే చదివారు .నేను కాశీలో విద్య నేర్చాను ..భోజమహారాజు దాతృత్వాన్ని గురించి ఒక శ్లోకాన్ని కావ్యప్రకాశంలో ఉదాహరించాను .మాతమ్ముడు  మాళవ దేశం లో ఉండటం వలన అది అక్కడినుంచి కాశ్మీరానికి చేరింది .

కుంత కుడు-నేనూ తల్లి కాశ్మీరు బిడ్డనే ..నాకాలం నేనూ చెప్పుకోలేదు .కానీ నన్ను క్రీశ 950-1050 ల మధ్య కూర్చోపెట్టారు .సంతోషం . కాశీతర్వాత గొప్ప సంస్కృత సాహిత్య కేంద్రం కాశ్మీర0 అవటం మాకు గౌరవం ..నా రచనలలో కాళిదాస ,భవభూతి ,హాలా ,బాణ మాఘ ,అమరు  ,మయూర ,శ్రీ హర్ష ,భట్టనారాయణ ,రాజశేఖర ,భామహా రుద్రత ఆనంద వర్ధనాదులను పేర్కొన్నాను ఆనాడే వర్ధనులవారిని ‘’ధ్వనికారులు ‘’అన్నాను .ఉదాత్తరాఘవాన్నీ ప్రస్తావించాను .నేను ‘’వక్రోక్తిజీవితం ‘’రాశాను .అధ్యాయాలను ఉన్మేషా లు అన్నాను . ప్రధాన సిద్ధాంతాలను కారికలుగా శ్లోకాలలో రాశాను . వాటికే వచనం లో వృత్తి అనే వ్యాఖ్యానం రాశాను . వృత్తి లో అనేక పద్యాలు ఉదాహారించాను . నా వక్రోక్తి సిద్ధాంతాన్ని వృత్తి సంపూర్ణంగా వివరిస్తుంది .వక్రత అంటే వైచిత్య్రం .ఉక్తి వైచిత్రమే వక్రోక్తి .వక్రోక్తి అల0కా రాలతో శోభించి హృదయాలను రంజి0పజేస్తుంది. ఇదొక అసాధారణ భావ ప్రకటన అన్నమాట .కావ్యలోకం లోనే ఇది కనిపిస్తుంది .దీన్ని వివిధ సిద్ధాంత కర్తలు వేర్వేరుగా నిర్వ చించారు .కొందరు అలంకారం లో భాగం అంటే మరికొందరు అలంకారాలు వక్రోక్తియే ఆధారం అన్నారు కావ్యానికి వక్రోక్తి ప్రాణం అన్నాను .కవిత్వా నికిది జీవం పోస్తుంది .కావ్యానికి జీవితమే వక్రోక్తి . అందుకే నా రచనకు వక్రోక్తి జీవితం అనే ప్రత్యేక మైన పేరు పెట్టాను .

అభినవ గుప్తుడు -మా కాశ్మీరు సోదరులం ఇలా ఒక చోట కలుసుకొనే మహద్భాగ్యం కలిపించిన సరసభారతి కి కృతజ్ఞతలు . 50 పైగా రచనలు చేశానునేను.  శైవాగమాలపై పంచికలు రాశాను శ్రీ పూర్వ శాస్త్రం ,స్తోత్రాలూ రాశాను ..నా రచనలు మూడు రకాలు .తాంత్రికం ఆలంకారికం ,తాత్వికం . నేను ముఖ్యంగా ఆల0కారి కుడను .అలంకారిక సమస్యలను చారిత్రిక ,విశ్లేషణాత్మక ,మనో వైజ్ఞానిక  తార్కిక ,తాత్విక దృక్పధాలనుంచి పరిశీలించాను .కళాప్రయోజనాలు ఆర్ష సిద్ధా0తమూ  చర్చించాను .నాటక ,కావ్య రచనలో వచ్చే అలంకార సమస్యలకే నేను పరిమితమయ్యాను .నాటక ప్రదర్శనలో సాక్షాత్కరించేది ,అనుభవించేది ఐన రసం ను పురస్కరించుకొని వచ్చే అలంకార సమస్యలను చారిత్రిక దృక్పధం నుంచి ప్రత్యేకించి పరిశీలించి నాకు ముందువారైనభట్ట లొల్లట  ,శ్రీశంకువు  ,భట్టనాయక రసం పై చెప్పిన ప్రసిద్ధ అభిప్రాయాలను ఉటంకించాను . లొల్లటు నిది ఆచరణాత్మకమైనా ,ప్రేక్షకుడిలో రసాను భూతి ఎలా కలుగుతుందో  చెప్పలేదు .కానీ తర్వాత వాళ్ళు ఆయనది భ్రమన్త సిద్ధాంతం అన్నారు . శ్రీ శంకుడు సిద్ధాంత దృక్పథ0 నుంచి అలంకార సమస్యను పరిశీలించాడు .ప్రధాన రసం గమ్యం అయితే మిగిలినవి గమకాలు .రసం పరోక్ష అనుకరణ అయితే మిగిలినవి ప్రత్యక్ష అనుకరణ -’’అనుకరణ రూపత్వదేవచ నామాంతరేణ వ్యాపదిష్టో రసాహ్ ‘’. అన్నాడు అభినవ భారతిలో శ్రీశ0కుడు  .

నేను అలంకార సమస్యను శాస్త్రీయ దృక్పధం తో పరిశీలించి నాటక ప్రదర్శనలో రసాను భూతికలిగించే వస్తువులను విశ్లేషించి ,దానిలో అంశీ భూతంగా ఉన్న అంశాలను బయటికి తీశాను ..రసాత్మక వస్తువు లోని భాగాలు ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయో నిరూపించాను . రసికుని వ్యక్తిత్వం సామాన్యునిలో ఎలా భేదిస్తుందో కూడా చెప్పను . రసాత్మక వస్తువుకు ,అనుభవం లో ఉన్న వస్తువుకు మధ్య తేడాను అంతరాన్ని విడమర్చి చెప్పాను .రసికుని వ్యక్తిత్వం అతని మానసిక ,భౌతిక పరిస్థితుల కారణంగా రసాను భూతికలుగుతుందని స్పష్టం చేశాను .ఈ విషయం లో భట్టనాయకుని అభిప్రాయాన్ని కాదన్నాను . సోదరులారా మీరు కొన సాగించండి .

మమ్మటుడు -నా కావ్య ప్రకాశం లో మొదటి అధ్యాయం ఉపోద్ఘాతం .కావ్య నిర్వ చనం చెప్పి కావ్యభేదాలు తెలియజేసి కావ్య ప్రయోజనాలు ,కవి యోగ్యతలు స్పృశించాను సహజ సిద్ధ ప్రతిభ లేకపోతె కవిత్వం వెక్కిరింపుకు గురి అవుతుందని హెచ్చరించాను.  అలంకారాలతో నిండి గుణాలు కలిగి దోష రహితమైన శబ్దార్ధాల కూర్పుతో కవిత్వం రాయాలి అన్నాను .అలంకారాలు తప్పని సరికాదు . శబ్దార్ధాలు చక్కని పొందిక కలిగి ఉండాలి . స్వచ్ఛమైన కవిత్వానికి అలంకార బంధనాలనుంచి విముక్తికల్గించాను.  శబ్దార్ధ విచారణ తాత్విక చర్చగా చేశాను . అలంకార శాస్త్రం లో ఇలాంటి తాత్విక చర్చ కొత్త వ్యంజనానికి దారితీసింది .కవితాత్మ ధ్వని వ్యంజనమ్ పై ఆధారపడి ఉంటుంది .శబ్దానికి అభిదా ,లక్షణా ,వ్యంజనా అని మూడు రకాల శక్తులుంటాయి .

కుంతకుడు -వక్రోక్తి పై నావి మౌలిక భావనలు .శబ్దార్ధాల పోహళింపు ,కవి సృజనాత్మక భావన  కవితాయోగ్యతలు  కవిత్వ మర్యాద అంటే సాహిత్య ,కవి వ్యాపార ,గుణ ,ఔచిత్యాల ను  సుసంపన్నం చేశాను . భామహుడే  నా ప్రేరణ .వక్రోక్తి కావ్యానికి జీవితం అనే సిద్ధా0తం ప్రతిపాదించాను .వక్రోక్తి విచిత్రమైన భావ వ్యక్తీకరణ . ఈ వైచిత్రియే ఉచ్చస్తితికి తీసుకు వెడుతుంది .పదాలకు ,భావాలకు మరొక అభిప్రాయం కలిగించేది వక్రోక్తి . వైదగ్ధ్య  ఫణితి  లాగా అన్నమాట ..

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-17 కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా-18(24-7-17 నుండి 30-7-17 వరకు )

వీక్లీ అమెరికా-18(24-7-17 నుండి 30-7-17 వరకు )

సుందరకాండ లలితాసహస్ర పారాయణ ,గృహప్రవేశ ,కూచిపూడి రంగప్రవేశ వారం

24-7-17 సోమవారం -శ్రావణ మాసం ప్రారంభం .. న్యాయవాది నాటక సినీ నటుడు ,ప్రజాన్యాయ ఉద్యమ నిర్మాత సి వి ఎల్ నరసింహారావు తో యు ట్యూబ్ లో ఇంటర్వ్వ్యూ చూశాను ..ఆయన ఉద్దేశ్యం లో కొత్త చట్టాలు తేవక్కరలేదు . ఇంకో వంద యేళ్ళ వరకుకావలసిన చట్టాలు ఉన్నాయి వాటిని అమలు పరచటం లోనే సమస్య . ఆ చొరవ ప్రభుత్వం తీసుకొంటే చాలు .. అమలు అతి వేగవంతంగా జరగాలి . చట్టం పై భయం తో పాటు భక్తీ ఉండాలి . ప్రజలకు అవగాహన కల్పించాలి .లేబర్ కు ప్రభుత్వం ఎన్నో సదుపాయాలూ కలిపించింది లాయర్లను వారికి ఏర్పాటు చేస్తోంది .. ఇది తెలియని చాలామంది సామాన్యులున్నారు .మా దగ్గర కొచ్చేవారికి ఈ విషయం చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసే న్యాయ వాదుల దగ్గరకు మేమె పంపుతున్నాము .మా దంపతులం కౌన్సిలింగ్ చేసి ఎన్నో కుటుంబాలను ఎందరో దంపతులను కాపాడాం .అన్నాడాయన .అందరూ చూడాల్సిన ఇంటర్వ్యూ . 20 వ శతాబ్ది అరుదైన మహా సంస్కృత విద్వా0సుడు  కపాలి శాస్త్రి గురించి గీర్వాణం -3 లో 381 వ కవిగా రాశాను .

 మంగళవారం ‘’అలంకారిక ఆనంద నందనం ‘’సీరియల్ రాయటం మొదలు పెట్టాను .అవధాన సరస్వతి శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్   మెచ్చి చదువుతూ సలహాలతో మార్గ దర్శనం చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది .

బుధవారం -కాకినాడలో ఉన్న మా శిష్యుడు చిలుకూరి కొడుకుకు ఏం బి బి ఎస్ కౌన్సెలింగ్  లో శ్రీకాకుళం ప్రయివేట్ మెడికల్ కాలేజ్ లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చిందని ఫోన్ చేసి చెప్పాడు .మా కుటుంబం అంతా చాలా సంతోషించాం .. ఆలంకారికులు 2 ,3 భాగాలు రాశాను .

 బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అకస్మాత్తుగా రాజీ నామా చేసి లాలూ ముఠాను వదిలించుకొని ‘’కమలాన్ని’’ చేత ధరించి మళ్ళీ 6 వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు .చాణక్యానికి మించిన ఉదాహరణ .

27-7-17 గురువారం -శ్రీ సుందరకాండ 56 వ 9 రోజుల పారాయణ మొదటి రోజు ఉదయం 7-30 కు మొదలు పెట్టి 9-30 కి పూర్తి చేశాను రోజుకు ఒక శ్రీ సువర్చలాన్జనేయ శతకం కూడా చదవటం  మొదలు పెట్టాను . ఆలంకారికులు 4,5 భాగాలు రాశాను ..

28-7-17 శుక్రవారం -పారాయణ రెండవ రోజు పూర్తి చేశాను . మా అల్లుడి వద్ద వేదం నేర్చుకున్న శ్రీ నూకల రాంబాబు గారింట్లో నూతన గృహప్రవేశానికి వెళ్లాం . పురోహితుడు మా మంటాడ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో సుమారు 30 ఏళ్ళక్రిందట  ఉన్న పూజారి శ్రీ బలరామా  చార్యులే . ఇక్కడికి వచ్చి 27 ఏళ్ళు అయిందట . శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,వాస్తుహోమం కూడా చేశారు .మా ఇద్దరికీ నూతన వస్త్రాలు పెట్టి ఆశీస్సులు పొందారు రాంబాబు ఉషా దంపతులు . తర్వాత భోజనాలు -పూర్ణాలు ,గారెలు పులిహోర వంకాయ కూర పప్పు సాంబారు పెరుగు తో భోజనం . నేనుస్వీ టు పెరుగన్నం తో సరిపుచ్చుకున్నాను .

  సరసభారతి 105 వ సమావేశంగా లలితా సహస్రనామ పారాయణ

 రాంకీ దంపతులు ఈ మొదటి శుక్రవారం  రాత్రి 7 గంటలకు వాళ్ళ ఇంట్లో లలితా సహస్ర నామ పారాయణ చేస్తూ మా శ్రీమతిని మా అమ్మాయినీ పిలుస్తూ ‘’పోతు పేరంటాలు ‘’గా  నన్నూ రమ్మన్నారు .ముగ్గురం వెళ్లాం .భక్తిగా చేశారు .దీన్ని సరసభారతి 105 వ కార్యక్రమంగా అందరి అనుమతితో నిర్వహించాం . అనుకోకుండా ఇక్కడ కొందరు పరిచయమయ్యారు నామిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రిగారి బంధువు లు శ్రీ దూర్వాసుల కామేశ్వరరావు దంపతులు శాస్త్రిగారి స్వ గ్రామం కృష్ణాజిల్లా కూడేరు లో వారి శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం లో నవగ్రహ ప్రతిష్ట చేశారట .కామేశ్వరరావుగారి భార్య రాంకీ భార్య శ్రీమతి ఉష కు అమ్మక్కయ్యే . ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న శాస్త్రి గారి రెండవ అబ్బాయి సుబ్రహ్మణ్యం కు ఆఫీస్ బాస్ . వీరుకాక  గండి గుంటవారైనా మహిళ ఉయ్యూరు శాసన సభ్యులు స్వర్గీయ శ్రీ అన్నే బాబూ రావు గారి మేనకోడలు .మరొకామె కెసిపి లో ఉద్యోగి కుమార్తె .ఇంకోరు చల్లపల్లి వారు .మరొకామె నాదెళ్ల అంజయ్యగారి మనవరాలు .తమాషాగా ఎలా కలిశారో ఆశ్చర్యమేసింది అందరం ఆనందించాం . పారాయణ తర్వాత అందరికి ఉపాహారం.  మహా రుచిగా ఉన్న పనస తొనలు  ప్రత్యేకం

 నేను సరస భారతి గురించి రెండుమాటలు చెప్పి షార్లెట్ లో రెండవ సమావేశమూ రాంకీ వాళ్ళఇంట్లో జరగటం దానికి ఆ దంపతుల తోడ్పాటుకు ధన్యవాదాలు చెప్పి ,,ఇందులో పాల్గొన్నవారంతా సరసభారతి సభ్యులే అని తెలియ జేశాను . తర్వాత లలితా సహస్రనామ విశేషాలు ,శ్రావణమాస ప్రాముఖ్యత క్లుప్తంగా 8 నిమిషాలలో చెప్పాను -దాని సారాంశం తెలియ జేస్తున్నాను -’

‘’లలితా సహస్ర నామాలలో శాస్త్రీయ దృక్పధం ఉంది .మహామేధావి శాస్త్రజ్ఞుడు అయిన్ స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధా0తం ఇందులో ఉంది ..పదార్ధం దాని శక్తి యొక్క ప్రతిక్రియవలన ఈ ప్రపంచం నడుస్తుంది . పదార్దానికి ,శక్తికీ భేదం లేదు .పదార్ధం శక్తిగా శక్తి పదార్థంగా మారుతుంది .శక్తి యొక్క స్థూల రూపమే పదార్ధం .పదార్ధం పరమశివుడైతే శక్తి పరమేశ్వరి .శివుడు శక్తి ఒకే  శక్తికి రెండు రూపాలు .ప్రతి పదార్ధం లోను శక్తి నిగూఢంగా ఉంటుంది .ఆ శక్తియే శ్రీ లలితా పరమేశ్వరి -’’యస్య యస్య పదార్ధస్య యాయా శక్తి రుదాహృతా -సా సా  సర్వేశ్వరీ దేవీ ,శక్తిమంతో మహేశ్వరః ‘’అన్నారు .భండాసురుడు  మొదలైన రాక్షసులు జడత్వానికి అజ్ఞానానికి ,బద్ధకానికి ప్రతీకలు .జడత్వం వదిలే దాకా వాళ్లకి వాళ్లలో ఉన్న శక్తి తెలియదు ఆ శకినీ శ్రీ మాత అంటాం .జడత్వాన్ని సంహరించి చైతన్య జ్ఞాన ప్రకాశం కలిగిస్తుంది ..లోపలి శక్తి మేల్కొనాలి అంటే సాధన చేయాలి .. లలితా సహస్ర పారాయణ చేస్తే అమ్మవారు మనల్ని చెయ్యిపట్టుకొని ముందుకు నడిపిస్తుంది .చైతన్య యాత్ర చేయిస్తుంది .ఈ సహస్ర నామాలలో చివర పరమేశ్వరి శివుని అభిన్న  రూపంగా తాదాత్మ్యం చెందుతుంది .లలితా రూపం లోజగదాంబ దర్శన  మిస్తుంది ..ప్రతినామం ఒక మజిలీ . .లలితా స్తోత్రం అంటే శ్రీదేవి దివ్య విభూతి ,విజ్ఞాన సర్వస్వము .ఈ భావాలు అర్ధం చేసుకొని పారాయణ చేస్తే అలౌకిక ఆనందం కలిగి మోక్షం కలుగుతుంది .

   ‘’ఇప్పుడు శ్రావణ మాసం విశేషాలు తెలుసుకొందాం .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్ననెల  శ్రావణ మాసం విష్ణు మాసం .ఈ నెలలోనే విష్ణువుఉద్భవించాడు .ఈ మాసం లోనే బ్రహ్మ మొదటిసారి విష్ణు సందర్శనం చేశాడు .తిరుమలలోని గోవిందుడూ ఈ నెలలోనే వెలుగు చూశాడు .శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమి లేక గరుడ పంచమి అంటారు . గరుత్మంతుడు తన తల్లి వినతాదేవి బానిసత్వాన్ని పోగొట్టిన రోజు .తానూ విష్ణువుకు వాహనమైన రోజు .గరుడ పురాణం ఆవిర్భవించిన రోజు కూడా పంచమి తిథినాడే .

 శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రాది ఏకాదశి .మొగ  సంతానం కోసం నోములు నో స్తారు . గొడుగులుదానం ఇస్తారు ..ద్వాదశి దామోదర ద్వాదశి .విష్ణువుకు ప్రీతికరం .త్రయోదశి చతుర్దశి శివ పార్వతుల పూజ చేస్తారు .శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి రాఖీ పున్నమికూడా .హయగ్రీవుడు వైఖానస ముని జన్మించిన రోజు . .సంతోషిమాత అవతరించిన రోజుకూడా .ఈ రోజుననే అగస్త్య మహర్షికి హయగ్రీవుడు లలితా సహస్రనామం బోధించాడు .

 శ్రావణ బహుళ చవితి సంకష్ట హరణ  చతుర్థి .అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి . .శ్రావణ అమావాస్య పో లాల అమావాస్య .

 కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలూ శ్రావణ గౌరీవ్రతం ప్రతి మంగళవారం చేసి వాయినాలు ఇస్తారు .తమకు దీర్ఘ సుమంగళీత్వం లభించాలని చేసే వ్రతం ఇది . పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం . ఇన్ని విశిష్టతలున్న మాసం శ్రావణమాసం .అందరికి శుభాలు కలిగించాలని ఆ జగదేక మాత ను ప్రార్ధిద్దాం .

29-7-17 శనివారం -కుమారి రచిత కూచిపూడి రంగ ప్రవేశం

సాయంత్రం 5 గంటలనుండి 8-45 వరకు కమ్యూనిటీ హా ల్ లో కుమారి రచిత కూచిపూడి రంగ ప్రవేశానికి వెళ్లాం .. ఈమె గురువు శ్రీమతి మాడభూషి పల్లవి . 7వ ఏటనుంచే నాట్యం అభ్యసించింది . గణపతి  ప్రార్ధన ,వాణీ పరాకు లతో ప్రారంభించి కొలువైతివా రంగ సాయి అనే స్వర్గీయ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి విప్రనారాయణ సంగీత నాటకం లో రాసిన దాన్ని అభినయించింది .తర్వాత గోవర్ధన గిరిధార చేసింది .6 గంటలకు విరామం -బిస్కట్లు శ్వీట్లు వగైరాలు టీ .మళ్ళీ 6-15 కు ప్రారంభం .అంబాష్టకం ,తర్వాత కొలువై ఉన్నాడే ,చేసింది అన్నీ రాగమాలికలే  కురవంజి రాగం లో ముద్దుగారే యశోదా అన్నమయ్య కీర్తన చేసింది .చివరికి కుంతలవరాలి రాగం లో మంగళం పల్లి బాలమురళీ కృష్ణ  తిల్లానాతో రాత్రి 8-45 కు పూర్తి చేసింది . తర్వాత రెండు స్వీ ట్లు పప్పు కూర చపాతీ  బిర్యానీ వగైరాలతో మంచి విందు హాజరైన దాదాపు 300 పై జనాలకు ఆత్మీయంగా ఏర్పాటు చేశారు నేను రెండు  స్వీట్లు  ‘’కరుడన్నం’’ తో సరిపెట్టుకున్నా .

 బాగానే చేసింది కానీ నృత్యం ఆత్మ కనిపించలేదు .అన్నమయ్య గీతం లో రతికేళీ రుక్మిణి దగ్గర మంచి హావ భావాలు చూపించింది .పెద్ద వెలితి ఏమిటి అంటే కాలికి గజ్జలు కట్టలేదు ఆ సవ్వడి లేకపోవటం తో మొత్తం ప్రోగ్రామ్ తేలిపోయింది అనిపించింది . అమెరికాలో మేము చూసిన రెండవ  రంగ ప్రవేశమిది .2002 లో మొదటి సారి అమెరికాకు హూస్టన్ కు వచ్చినప్పుడు మా బంధువు శ్రీమతి వావిలాల లక్ష్మిగారు మా ఇద్దరినీ  రైస్ యూనివర్సీటీలో  నాసాలో పని చేసే ఆంధ్రా దంపతుల అమ్మాయి  రంగ ప్రవేశానికి తీసుకు వెడితే చూసాం .చాలా బాగా చేసింది . .అక్కడే జానప ద గాయని శ్రీమతి అనసూయ (కృష్ణ శాస్త్రిగారి మేనకోడలు )గారమ్మాయి శ్రీమతి రత్నపాప గారిని అనసూయగారినీ మొదటి సారి చూసి మాట్లాడాం . ఒక రకం గా బంధుత్వం ఉంది . మా అమెరికా మేనల్లుడు శాస్త్రి అనే జె వేలూరి కూతురు వీణ రెండేళ్లక్రితం కాలిఫోర్నియాలో ఇలాగే కూచిపూడి రంగ ప్రవేశం చేసింది . మా అమ్మాయి షార్లెట్ నుంచి వెళ్లి చూసి వచ్చింది . ఈ వారం వీక్లీ కి సమాప్తం పలుకుతూ సెలవ్

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఆలంకారిక ఆనంద నందనం -6

ఆలంకారిక ఆనంద నందనం -6

ఆనంద వర్ధనుడు -రామాయణ ,భారతాలలో ,కాళిదాస శకుంతల వంటి నాటకాలలో సౌందర్యం ఉన్నా ,అందులోని లక్షణాలను విశ్లేషించి చెప్పే ప్రయత్నం చేసినవారు లేరు .సిద్ధాంతకర్తలు తమ పద్యాలనే సౌందర్యానికి ఉత్తమ ఉదాహరణలుగా తెలుపు కొన్నారు .నేను దీన్ని తిరస్కరించి నా  గ్రంథం అ0తా  కవితా సౌందర్య లక్షణాలను ,ఎన్నో సంస్కృత మహా కావ్యాల ను విశ్లేషించి నిరూపించే ప్రయత్నం చేశాను .సౌందర్య తత్వ మూల సూత్రాన్ని సహృదయులే గ్రహించ గలరనేది నా ప్రగాఢ విశ్వాసం ..

  నేను ఈ విధంగా గ్రహించిన మూల సూత్రమే ‘’ధ్వని ‘’దీన్ని మహా కావ్యానికైనా  చిన్నదైనా గీతానికైనా సమాన బలం తో వర్తింప చేయవచ్చు అపరిమితమైన వివరాలకు అందులో ఆస్కారం ఉంది . కవిత్వ విలువలకు అంచనా కట్టటానికి ధ్వని బాగా ఉపయోగ పడుతుంది .పోలికలు భేదాలుచూపించటం ద్వారా కవిత్వాన్ని ఇతర ప్రక్రియలనుంచి వేరు చేసి చూపిస్తుంది.  తర్కం ,శబ్దార్ధ సంబంధ శాస్త్రం  భాషా శాస్త్రాలలో నిష్ణాతులనుకూడా సంతృప్తిపరచచే సమగ్రమైన శాస్త్రం అయింది విజ్ఞాన శాస్త్ర తర్క శాస్త్ర మూలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో దానికి సమానమైన స్థానం కళకూ ,కవిత్వానికీ ఉందని నిరూపించటం లో ధ్వని సిద్ధాంతం విజయం సాధించింది . ఇంతకు  పూర్వమే ఉన్నసౌందర్య లక్షణాలుగా వర్గీక రింప బడిన అలంకారాలు ,గుణాలు ,మొదలైన వాటిని తోసి రాజు అనకుండా వాటినీ ఈ సిద్ధాంతం ఆకళింపు చేసుకొన్నది .విమర్శకుడు మాత్రం తన విశ్లేషణలో వాటిని విడదీసి చూడటం అనివార్యం . వామన విష్ణు స్వరూపా వామనా ,,చందోలంకార రాజాశేఖరా  వరుసగా మీ మాటలు వినిపించండి .

వామనుడు -నేను ప్రస్తావించిన రీతి గురించి ‘’తగురీతి’’గా తెలియ జేస్తాను .రీతిరాత్మా కావ్యస్య ‘’అని ఘంటాపధంగా చెప్పాను .కావ్య శరీరానికి ఆత్మరీతి మాత్రమే  .రీతులు మూడు రకాలు వైదర్భి కోమలమైంది .గౌడీ సమాసాలతో పరుషాక్షరాలతో ఉంటుంది .పాంచాలీ రీతి ఈ రెండిటి మిశ్రమ రూపం .ఆ కాలం లో ఆ ప్రదేశాలలో శైలిని బట్టే రీతులకు ఆ పేర్లు  వచ్చాయి . వైదర్భీ రీతిలో కావ్య దోషం కొంచెం కూడా ఉండదు .మాధుర్య ,ప్రసాద మొదలైన 10 గుణాలు ఉంటాయి వైదర్భీ రీతి కాళిదాసుని శైలి ఉత్తమ ఉదాహరణ ..గౌడీ రీతిలో దీర్ఘ సమాసాలు  శబ్దా డంబరం ఎక్కువ .దీనికి కాంతి ,ఓజస్సు అనే రెండు గుణాలుంటాయి  భవభూతిశైలి దీనికి ఉదాహరణ .భవభూతి ఒకే పద్యం లో శ్రీరాముడు శివుని విల్లు విరవడం ,దాని ఫలితంగా చెవులు బ్రద్దలయ్యే ధ్వని రావటం వర్ణించాడు పదాలు విల్లు విరిగే ట ప్పుడు వచ్చే శబ్దాన్ని ప్రతిధ్వనిస్తాయి దీర్ఘ సమాసాలు వాడటం ఆయనకిష్టం .మూడు సమాసాలతో మూడున్నర వాక్యాలు రాశాడు . 19 మాత్రలతో ‘’శార్దూలం ‘’పై ‘’క్రీడిం’’చాడు .పాంచాలీ రీతిలో మాధుర్య ,మృదుత్వ గుణాలతో పై రెండిటికి మధ్యస్తంగా ఉంటుంది .పటం  పై రేఖలు ముందుగీసి తర్వాత చిత్రం తయారు చేసినట్లు ఉంటుంది .కవిత్వం ఈ మూడింటిలో దేనికో ఒక దానికి చెంది ఉంటుంది .. కవికి వ్యాకరణ నిఘంటు ఛందస్సు కళలు ,శృంగార రాజనీతులలో పాండిత్యం తో  కూడిన లోకజ్ఞానం ఉండాలి . వీటినే కవితా సామాగ్రి అన్నాను . ఇతర మహాకవుల రచనలతో పరిచయం ఉండాలి .పద్యరచన నిష్ట తో చేయాలి . జ్ణాసంపన్నులను సేవించాలి పదాలను చేర్చేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచనతో చేయాలి . ఏకాగ్రత అన్నిటికన్నా ముఖ్యం భావనా  శక్తి  పుష్కలంగా ఉండాలి . స్వయం సిద్ధమైన శక్తివంతమైన లోపల దాగి ఉన్న ప్రతిభయే భావనా శక్తి .

రాజశేఖరుడు-వాత్సాయన కామ శాస్త్రం కౌటిల్యుని అర్థశాస్త్రం ఆదర్శంగా కావ్య మీమాంస రాశాను ఇతర రచయితల అభిప్రాయాలను క్రోడీ కరించి చేర్చాను .కవులకు సమాచార దర్శిని గా కావ్య మీమాంస ఉండాలన్నదే నా అభిప్రాయం ..తమాషాగా నేను కావ్య పురుషుడిని వర్ణించి ఆయనకు సాహిత్య విద్య అనే కన్యనిచ్చి విదర్భలో వత్స గుల్మ లో పాణిగ్రహణం చేశానని చెప్పాను .కవికి కావాల్సిన అర్హతలు ,ప్రతిభా పాండిత్యాలు ,వృత్తుల ,రీతుల స్వభావం,కవిత్వానికి ఆధార సామగ్రి ,ప్రాచీన గ్రంథాలనుండి ఎలా విషయం సేకరణ చేయాలో ,అది అనుకరణగా ఎప్పుడు దిగజారుతుందో ,కవి సంప్రదాయాలు ఎలా ఉంటాయో ,దేశం లోని పర్వత నదీనదాలు వాటి ప్రత్యేకతలు ,ఋతువులను ఎలా వర్ణించాలి ,చెట్లను లతలను పక్షులను ఏయే రుతువులలో ఎలా వర్ణించాలో అన్నీ రాసి కరతలామలంగా చేతిలో పెట్టాను .ఇప్పుడు మీరు గైడ్ అంటారే అలా రాశాను . ఒక రకంగా మార్గదర్శి యైన గైడ్ ను కూడా అయ్యానేమో .

 ఆనంద వర్ధనుడు -సౌందర్యం అనేక కోశాల చేత కప్పబడి ఉంటుంది .బయటికి కనిపించేది తక్కువ ప్రాధాన్యం కలది పైకి స్పష్టంగా కనిపించే బాహ్య సౌందర్యం లోపలి సౌందర్య సారమైనసారం అయిన రసానికి సరైన మాధ్యమం అయితేనే దానికి విలువ ఉంటుంది లయాత్మక ప్రక్రియ వలన రూపానికి ,భావ చిత్రం వలన వస్తువుకు శోభకలగవు .సౌందర్యాన్ని పెంచేది అలంకారం ,గుణం ,రీతి ,వృత్తి . అంతరాంతరాలలోకి దూసుకు వెళ్లి రసాత్మను స్పృశించాలి .బాహ్య అందాలను ఏ పండితుడైనా గ్రహించగలరు .కానీ కవిత్వాన్ని .సాహిత్య రూపాల నుంచి వేరు చేసి ప్రత్యేక లక్షణమైన రసాన్ని అర్ధం చేసుకోవాలన్నా ,వివరించాలన్నా రసికుడికే సాధ్యం ..మిగిలిన విషయాలు తరువాత చెబుతాను .లేకపోతె మోతాదు మించిపోవచ్చు .సోదరులారా ఇక మీ వంతు –

వామనుడు -విజ్ఞులైన విమర్శకులకు ఆహ్లాదం కలిగించే ఉత్తమ కవిత్వానికి లక్షణాలు చెప్పాను ..కవులు దోషాలు,అవి  లేకపోవటం ,గుణాలు అలంకారాలు ఉండటం  .కవులు గుణాలు  స్వీ  కరించి దోషాలు పరిత్యజించాలి .దోషాలు చాలా ఉంటాయికనుక గుణాలతోపాటు దోషాలనూ ఎక్కువగానే చర్చించాను . సూక్ష్మ దోషాలనూ తెలియజేశాను .గుణాలు  అలంకారాలు కావ్యగుణాన్ని పెంచుతాయి .అనటాన్ని నేను ఒప్పుకోను .రెండూ వేర్వేరు .’కావ్య శోభయాహ్  కర్తారో గణాః తదతిశయ హేతవ స్త వాలంకారః పూర్వే నిత్యా ‘’అంటే గుణాలు కవిత్వానికి స్వాభావిక సౌందర్యానికి కారణాలు .అవి అందుకే అనివార్యంగా నిత్యముగా ఉండాలి అల0 కా రాలు కావ్య సౌందర్యాన్ని వృద్ధి చేస్తాయన్నమాట నిజమే .అంతమాత్రం చేత తప్పని సరికాదు .గుణాలతో సహజ సౌందర్యం ఉన్న కన్నెపిల్ల ఆభరణాలతో  మరింత  అందంగా ఉన్నట్లు అన్నమాట ..

రాజశేఖరుడు -నా కావ్య మీమాంస సాధారణ ఛందో శాస్త్ర గ్రంధాలవంటిదికాదు ఛందో శాస్త్రం లో చాలా అరుదుగా కనిపించే అనేక విషయాలు రాశాను .అలంకార శాస్త్రం పై నాకు ఎక్కువ గౌరవం ఉంది .అది వేదాలలో 7 వ అంగం .దాని సహాయం లేకపోతె వేదపాఠాల పూర్తి అర్ధం తెలియదు నా ఉద్దేశ్యం లో సాహిత్య విద్య 5 వ విద్య .మనకు సాంప్రదాయంగా వచ్చే విద్యలు నాలుగు -వేదాలు వ్యవసాయ వాణిజ్యాలు ,రాజనీతి ,తత్వ శాస్త్రం .ఇవి ఎంతముఖ్యమో అలంకార శాస్త్రమూ అంతముఖ్యమే .అందుకే 5 వ విద్య అన్నాను .నేను రాజా దర్బారులో జరిగే సాహిత్య గోష్ఠులు ,కవి దిన చర్య ,అతని పఠన మందిరం ,రాత సామాగ్రీ గురించి ఆసక్తికరంగా చెప్పాను .కవయిత్రుల ప్రతిభను కూడా నిర్ణయించి వారికీ గౌరవం కల్పించాలని చెప్పాను .సాహిత్య పరీక్షలు నిర్వహించి ఉత్తములను ఎంపిక చేసి బ్రహ్మ రధంగా ఊరేగించాలని రాజులకు హితవు చెప్పాను .మహాకవులైన కాళిదాసు ,మెంధ ,అమర ,భారవి మొదలైన వారిని పరీక్షించి సన్మానించారు .అలాగే శాస్త్ర కారులైన ఉపవర్ష ,వర్ష ,పాణిని ,పింగళ ,వ్యాడి ,పతంజలి వంటివారిని పాటలీ పుత్రం లో పరీక్షించి నిగ్గు తేల్చారు ..నా అభిప్రాయాలను ,ఇతర అభిప్రాయాలను బలపరచటానికి విస్తారంగా పద్యాలు ఉదాహరించాను .. ఇంతకంటే నేను చెప్పాల్సింది లేదు .సెలవు .

ఆనంద వర్ధనుడు -రాజా శేఖరులవారు తమ అమూల్యాభిప్రాయాలను స్పష్టంగా క్లుప్తంగా తెలియ జేసినందుకు ధన్యవాదాలు .. రస స్వభావం దాని అంతరాత్మ తప్ప వేరేదీ కాదు కానేరదు . రసం మనసుకు కలి గించే ఆనందాను భూతి . అది కవి సృజనను ప్రేరేపిస్తూ ,భావనా శక్తి కల విమర్శకుడి మనసును రంజింప .కవితా సౌందర్యానికి కారణం ఫలితం కూడా అదే .రసికుడు భావించి అనుభవించేవరకు రసం అనేది ఉండదు .

  నేను చెప్పిన ముఖ్య విషయం ధ్వని .అది మెరుపులా వచ్చే స్ఫూర్తి .’’అక్షరం ,పదం ,సర్వనామం ,సమాసం ,వాక్యం  కావ్యం లలో దేనిలోనైనా రసం యొక్క సౌందర్యం మెరుపులా తటిల్లున వ్యక్తమైనది ధ్వని అని నేను నిర్వచించాను .ధ్వని ఉవ్వెత్తున పైకి లేచినపుడు రసాన్ని ప్రత్యక్షం చేయటానికి ఉపయోగించే ఆధారభూమి సామాన్య భాష ,సామాన్య అర్ధం .రసధ్వని గుణాలను అలంకారాలను త్రోసిపుచ్చదు .శబ్దార్ధాల సొగసుల్ని తనలో విలీనం చేసుకొంటుంది . రస స్పందన లేకపోతె మిగితావేవీ రాణించవు . ప్రతి భాణా 0శమూ వ్యంజకమే అంటే రసాన్ని అభి వ్యక్తం చేసేదే . వ్యంజకం అంటే వెల్లడించేది అని అర్ధం కనుక ఇది శ్రేష్ఠమైన వ్యంజకం అవుతుంది ..భాషకు అతీతంగా వెల్లడి అయ్యే క్రియ ధ్వని .ఇప్పుడు వామనుల వారి అభిప్రాయం విందాం .

వామనుడు-శబ్ద ,అర్ధ అలమాకారాలను నేను చర్చించాను .యమక ,అనుప్రాస లనే నేను చర్చించాను .వీటిని అతిగా వాడద్దు అని చెప్పాను ఉపమా ప్రపంచం రాశాను రూపక వక్రోక్తిలను వివరించాను .రూప చిత్రణను నిదర్శనాలంకారం అన్నాను .అయిదవ అధికరణ లో కవి ప్రయోగాలు  చెప్పే ప్రాయోగిక రాశా .ఒకే పదాన్ని రెండు సార్లు వాడరాదని సంధినియమాల జాగ్రత్త ,పద్యపాదం మొదట్లో ‘’ఖలు ‘’వంటి పదాలు వాడొద్దని హితవు చెప్పాను ..కవిత్వం లో ముఖ్యాంశం సౌందర్యమేనని మొదట చెప్పింది నేనే . ఇంతకంటే చెప్పాల్సినది లేదని తెలియజేస్తూ సెలవు .

 ఆనంద వర్ధనుడు -సోదరులిద్దరూ కాడి నాపై పడేసి భారం దించుకొన్నారు ..రస ధ్వని ఉంటేనే కావ్యం అన్నాను .కానీ తర్వాత కొంత సడలించి .బహురూపి అయినా రసమే ధ్వనికి ఆత్మఅనే నేను నమ్మాను .ధ్వని ప్రధాన వ్యంగ్యంగా ,గుణీ భూత వ్యంగ్యంగా రెండురకాలుగా ఉంటుంది .అంటే కవితా చిత్రణలో ధ్వని అందానికి సహాయ భూతంగా ఉంటుంది . వాల్మీకి కాళిదాసులు మొదటి దానికి ప్రతినిధులు .బాణుడు మాఘుడు రెండవ దానికి ప్రతినిధులు ..సౌందర్యోన్మీ లన స్వభావం రసం యొక్క సృజనాత్మక స్పందన మాత్రమే అని మరొక్క సారి తెలియ జేస్తూ మా ముగ్గురకు మీతో ముచ్చటించి మా హృదయకవాటాలు విప్పి మా సిద్ధాంతాలు తెలియజేయటానికి అవకాశం కలిగించిన సరసభారతి శ్రద్ధగా విని జయ ప్రదం చేసిన శ్రోతృ మహాశయులకు ధన్యవాదాలు తెలియ జేస్తూ సెలవ్ .

 వేదిక ను సుసంపన్నం చేసిన పెద్దలారా సోదరులారా .గొప్ప అదృష్టవంతులం మనం .ఇంతటి ఉత్కృష్ట సిద్ధాంత కర్తలు మన మాట మన్నించి ఈ ప్రత్యేక కార్యక్రమ0 లో పాల్గిని అమూల్య విషయాలు చెప్పినందుకు విన్న మీకు కృతజ్ఞతలు .ఒక్కసారి ఈ ముగ్గురు చెప్పిన విషయసారాంశం మీ ముందు ఉంచుతాను –

 విమర్శనాత్మక పరిశీలన చేసి విలువ కట్టటానికి కావలసిన ప్రమాణాలు మొట్ట మొదటి సారిగా చెప్పిన వాడు ఆనంద వర్ధనుడు .కవిత్వ విమర్శలో రసానికి సంబంధిన విధానం ఔచిత్యం ఒక్కటే అన్నాడు స్పష్టంగా .సౌందర్య శాస్త్రానికి సంబంధం లేని ప్రమాణాలనుంచి ఆయన అలంకార శాస్త్రానికి విముక్తి కలిగించాడు .అలంకారిక ఔచిత్యం అనే ప్రమాణానికి కట్టుబడి ఉంటె ,నైతిక ప్రమాణాలను ఉల్లంఘించిన రసాభాసం కూడా సుందరంగా ఉంటుంది అంటూ నైతిక నిర్ణయాలను దాటి ఆమోదం తెలియ జేశాడు ..ఆనంద వర్ధనుడు మౌలిక ప్రతిభకల మేధావి సౌందర్య భావనలో అన్ని ముఖ్యాంశాలను లోకం దృష్టికి తెచ్చిన మొదటి ఆలంకారికుడాయన .ఆయన సృజనాత్మక ఆలోచనా విధానం నేటికీ ఆసక్తి కలిగిస్తోంది ..తార్కిక ,వ్యాకరణ ,వాక్య నిర్మాణ రీతులను అధిగమించి కవిత్వం సంతరించుకొని ధ్వనిని ,దాని ఉవ్వెత్తున లేచే శక్తిని ఆనాడే వర్ధనుడు గ్రహించాడు అభినవ గుప్తుడు మరింత స్పష్ట పరచాడు .భామహా దండి ల అలంకారవాదం వామనుని రీతి వాదం లను కూడా సమన్వయ పరచిన సహృదయ ఆలంకారికుడు ఆనంద వర్ధనుడు . ధ్వని ధ్వని అని చెవుల్లో మార్మోగేట్లు చెప్పి అందులోని అలోకిక ఆనందాన్ని  బ్రహ్మానంద  సహోదరత్వాన్ని  చెప్పిన మౌలిక సిద్ధాంతకర్త పేరుకు సార్ధకత తెచ్చినవాడు ఆనంద వర్ధనుడు .

 వామనుడు అలంకార గ్రంథ కర్తలలో సూత్ర శైలిని ఆశ్రయించిన మొట్టమొదటివాడు . భావాలను సూటిగా సుత్తిలేకుండా చెబుతాడు . వృధా చర్చల జోలికి వెళ్ళలేదు సాంకేతిక విషయాలనూ సులభ సుందర శైలిలో చెప్పి హృదయానికి దగ్గరకు చేర్చాడు .కవులు రెండురకాలని మొదటివారు ‘’అరోచ కినాః ‘’అంటే ఎక్కువ శ్రద్ధ లేనివారు అంటే తృప్తి చెందని అభిరుచికలవారు అని రెండవవాడు ‘’సత్ర నాభ్యవహా రినా ‘’అంటే దేనినైనా తినగలిగేవారు అంటే ఏ రకమైన రచనయైనా చేయగలిగే వారు ..మొదటి రకం వారు వివేకులు విచక్షణా జ్ఞానమున్నవారు కానుక వారికి బోధించవచ్చు రెండవవారు అవివేకులు విచక్షణా జ్ఞానం లేనివారు .వీరికి చెప్పటం వ్యర్థం .కవికి ఏ కాగ్గతకావాలని మనసును అంతర్ముఖం చేసినప్పుడే వాస్తవమైన అంతరార్ధాన్ని గ్రహించగలడ ని వామన ఉవాచ .చిత్రకళాభిమానికనుక కవిత్వ లక్షణాలను చిత్ర కళతో పోల్చి అందంగా చెప్పాడు .. సాహిత్య వ్యక్తీకరణలో అనేక అంశాలు లక్షణాలు విశ్లేషించి విమర్శించి తనకున్న ఉత్తమ కళాభి రుచిని వ్యక్తం చేశాడు వామనుడు . కవిత్వ నిర్మాణం అనే సమైక్య సత్యం యొక్క లక్షణాలను అధ్యనానం చేసిన వాడు వామనుడు .కావ్యం యొక్క ఆత్మను గురించి మొదట చెప్పినవాడు వామనుడే . .కావ్యానికి గుణాలవల్ల సౌందర్యం కలుగుతుందన్న సౌందర్య వాది . ‘’కావ్యం గ్రాహ్య మాలంకారాత్ ‘’అంటూ గ్రంధం ప్రారంభించి సౌందర్య విశ్వరూపాన్ని చూపినవాడు వామనుడు

  రాజా శేఖరుడు ఉదహరించిన పద్యాలలో విలువైన సమాచారం ఉంది.  ఒక పద్యం ద్వారా పైశాచి అనే ప్రాకృత భాష అవంతీ అబూ పర్వత  ప్రాంతం ,మాండ్ శోర్ ప్రాంతాలలో మాట్లాడే వారని  తెలుస్తోంది .అలాగే గుప్త చరిత్రలో రామ గుప్తుని వృత్తా0త  విషయాలు తెలియ జెప్పే పద్యం ఒకటి ఉంది ఇంకెక్కడా రామ గుప్తుని ప్రస్తావన లేదు ..ఆయన రాసిన కావ్యమీమాంస లో కొద్దిభాగమే దొరికినా ప్రాచీన భారతీయ సంస్కృతికి చెందిన సాధారణ జ్ఞానం ,అలంకార శాస్త్రానికి చెందిన విశేష జ్ఞానం దీనివలన గొప్ప సంపదగా మనకు లభించింది . భార్య అవంతీ సుందరి చెప్పిన’’ రసోచిత శబ్దార్ధ సూక్తులను కావ్యంగా పరిగణించాలి ‘’అన్నమాటను సమర్ధించి ‘’రసకవియే ఉత్తమకవి ‘’అని నిర్ధారణ చేసి తానూ రాశావాదినే అని పించుకొన్నవాడు రస ట్రాజ శేఖరుడు .

 మరొక్కమారు ఈ ముగ్గురు మేధావులకు కృతజ్ఞత తెలుపుతూ రెండవ సమావేశాన్ని ముగిస్తున్నాము . మూడవ ప్రత్యేక సమా వేశం లో మరికొందరు ఆలంకారికులతో ముచ్చటింపజేద్దాం అంతవరకూ సెలవ్ .

 సశేషం

 మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లలితా సహస్రనామ పారాయణ

సరసభారతి 105 వ సమావేశం గా 28-7-17 శుక్రవారం రాంకీ గృహం లో లలితా సహస్రనామ పారాయణ

-దుర్గాప్రసాద్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఆలంకారిక ఆనంద నందనం -5

ఆలంకారిక ఆనంద నందనం -5

సరసభారతి సాహితీ బంధువులకు ‘’అలంకారిక ఆనంద నందనం ‘’రెండవ ప్రత్యేక సమావేశానికి స్వాగతం . మొదటి సమావేశం అర్ధవంతంగా మీ అందరి సహకారం తో రస సిద్ధాంతకర్త  భరత ముని ,అలంకార ఆవిష్కర్త భామహా ,గుణా విష్కర్త వచన వాచో విధేయుడు దండి మహాశయులు తమ హృదయాలను విప్పి మనకు ఆనందనందన అనుభూతిని కలిగించారు .ఈ రెండవ సమావేశానికి ధ్వని సిద్ధాంతకర్త ఆనంద వర్ధనాచార్యులవారిని ఆధ్యక్షం వహించి తమ సిద్ధాంత వివరణ చేయవలసినది గా ,వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తూ  రీతి సిదాంతకర్త వామనులను ,ఛందశ్శాస్త్ర వేత్త రాజశేఖరులను తమతమ సిద్ధాంతావిష్కరణ చేయవలసినదిగా వేదిక నలంకరించవలసినదిగా  ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాను .

ఆనంద వర్ధనుడు -చాలా మంచి కార్యక్రమం సరసభారతి నిర్వహిస్తున్నందుకు అభినందనలు . నా ధ్వని .సిద్ధాంతాన్ని ఏమాత్రం సవ్వడి అంటే ధ్వని చేయకుండా సావధాన చిత్తులై ఆలకించమనవి ..నేను కశ్యప మహర్షి ప్రదేశం ,శారద దేశం .అయినకాశ్మీర దేశ వాసిని .క్రీశ. 9వ శతాబ్ది ప్రథమార్ధం వాడిని కవితా సౌందర్య రహస్యాన్ని ఆకళింపు చేసుకోవటానికి ఉపయోగపడే ధ్వన్యాలోకం అనే గ్రంధం రాశాను .రసజ్ఞుడనని సాహిత్య విమర్శకులలో ప్రజ్ఞావంతుడనని అంటారు అది అభిమానం తో అనేమాట ..నేను శ్లోక రూపం లో రాసిన వాటిని కా రిక లు అన్నాను  .వీటికి వచనం లో ఇచ్చిన వ్యాఖ్యానాన్ని వృత్తి అంటారు .ఈ రెండిటినీ నేనే రాశాను సందేహం లేదు .బుద్ధి కుశలతో విమర్శించటం ,కవిత్వాన్ని సరిగా అవగాహన చేసుకోవటం కొద్దీ మందికే సాధ్యమైన విద్య అన్నాను ..వ్యాకరణ పాండిత్యం నిఘంటు పరిచయం ఆ సామర్ద్యాన్నివ్వదు . విమర్శ సృజనాత్మక విద్య .విమర్శించే నేర్పు అసాధారణమైనది .నిజానికి ఈ రెండూ ఒకే శక్తికున్న రెండు రూపాలు . ఆదర్శ విమర్శకుడికి భావనాశక్తి అంటే ప్రతిభ ,రసజ్ఞత సామాన్య లక్షణం అందుకనే ఆదర్శ విమర్శకుడిని సహృదయుడు ,రసికుడు అంటారు .కవి కావ్యాన్ని సృష్టిస్తే ,విమర్శకుడు తన భావనా శక్తితో దాన్ని పునర్నిర్మిస్తాడు .కనుక అభిరుచి ఉన్న సహృదయులు మాత్రమే కావ్యాత్మను అవగాహన చేసుకొని దాని అందాన్ని విశ్లేషించగలుగుతారు ..కవితా సౌందర్య చర్చలో వేదాంతులకు స్థానం ,వాదించే అర్హత ఉండదు… అందుకే నా ధ్వన్యాలోకానికి ‘’సహృదయ లోకం ‘’అనే పేరు . .నా తర్వాత ప్రసంగాలు వరుసగా చేయవలసిందిగా వామన ,రాజశేఖర సోదరులను కోరుతున్నాను .

వామనుడు – ఆనంద వర్ధనులు అదక్షతన జరిగే ఈ అలంకారిక సభలో పాల్గొనటం నా అదృష్టం .నేనుకూడా కాశ్మీర శారదా దేవి అనుగ్రహ పాత్రుడనే .7  వ శతాబ్ది వాడిని .ఆయనకంటే సుమారు రెండు శతాబ్దాలు ముందువాడిని . .కావ్యాలంకారం అనే గ్రంధం సూత్ర శైలిలో రాశాను .నేనే దీనికి ;;కవి ప్రియ’’వ్యాఖ్యానమూ రాశాను ఇతరకవులపద్యాలు నా పద్యాలు ఉదాహరణగా ఇచ్చాను గ్రంధాన్ని సంప్రదాయ పద్ధతిలో అధికారణాలుగా విభజించాను ..దీనిలో అయిదు అధికారణాలున్నాయి అధికారణాలను 12అధ్యాయాలుగా విభజన చేశాను .మొత్తం 317 శ్లోకాలున్నాయి ..నేను ‘’రీతి ;;కి ప్రాధాన్యమిచ్చాను .కావ్య శరీరాన్ని గురించి స్థూలంగా చెప్పి అలంకార శాస్త్రాధ్యయనం అవసరాన్ని  దాన్ని చదివి అర్ధం చేసుకోవటానికి కావాల్సిన అర్హతను,సహాయకాల గురించి  చర్చించాను .మొదటి సూత్రం లోనే కవిత్వాన్ని నిర్వచించాను కావ్యం గద్య ,పద్య రూపక భేదంగా ఉంటుంది .కావ్యం అలంకార శోభితమైనప్పుడే రాణిస్తుంది దోషాలు లేకుండా గుణ అలంకారాలు చేరిస్తే కావ్య శోభ పెరోగి సౌందర్య వికసనమవుతుంది .అలంకార శాస్త్ర పఠనం ద్వారానే ఉత్తమ కవిత్వం రాయగలరు .ఉత్తమ కావ్య రచన వలన ఆనందం కీర్తి లభించి ,ప్రత్యక్ష ,పరోక్ష ఫలితాలు లభిస్తాయి .

రాజశేఖరుడు –నేను  ఆలంకారి కుడనే కాక  కవి , నాటక కర్తనూ కూడా . 9వ శతాబ్ది చివరివాడిని ..మా తండ్రిపేరు దుర్దకుడు .కాలచూరి రాజుల మహా మంత్రి . అమ్మపేరు శీలవతి .మాది యాయవారాబ్రాహ్మణ వంశం .అవంతీ సుందరి అనే  విద్యావతి అనేకళ ల లో ఆరితేరిన క్షత్రియ కన్యను పెళ్లి చేసుకొన్నాను .నేను రాసిన కావ్య మీమాంసలో ఆమె అభిప్రాయాలనూ చేర్చాను .కనౌజ్ ప్రతీహార రాజు మహేంద్ర పాలుని ఆస్థానకవిని .రాజు నా శిష్యుడే.  ఆ రాజు కొడుకు మహీపాలుని కాలం లో కవి రాజు నయ్యాను బాల రామాయణం బాల భారతం కర్పూర మంజరి అనే మూడు నాటకాలు రాశాను .కనౌజ్ లో కర్పూర మంజరి ప్రదర్శించాం .కాలకూట రాజు మూడవ ఇంద్రుడు కనౌజ్ ను ధ్వసం చేస్తే త్రిపురి  పాలించే కాల చూరిరాజు మొదటి యువరాజ దేవుడి ఆస్థానానికి తిరిగొచ్చాను  మా  రాజు  రాష్ట్ర కూటు లను ఓడించినప్పుడు నా నాల్గవ నాటకంప్రాకృత0  లో రాసిన  ‘’విద్ధ శాల భంజిక ‘’(కదలని బొమ్మ )ప్రదర్శించారు .నేను అలంకార శాస్త్ర ,ఛందో శాస్త్ర విషయాలపై కూడా ఒక గ్రంధం  ‘’కావ్య మీమాంస ‘’రాశాను కవిత్వానికి సంబంధించిన సకల విషయాలు ఉన్న విజ్ఞాన సర్వస్వము అది .కానీ దురదృష్ట వశాత్తు ఇందులో ‘’కవి రహస్య ‘’అనే మొదటిభాగమే ప్రచురింపబడింది ఇందులో 18 ఖండాలున్నాయి ..

సశేషం

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆలంకారిక ఆనంద నందనం -4

ఆలంకారిక ఆనంద నందనం -4

భరత ముని-రసాలు సౌందర్యం తో ఉన్న వస్తువు ,సన్నివేశాన్ని ఆశ్రయించి ఉంటాయి .స్థాయీ భావాల ,వ్యభిచారీ భావాల సమ్మిళిత స్వరూపమే వస్తువు లేక సన్నివేశం .వ్యభిచారీ భావాలంటే 33 తాత్కాలిక మానసిక ఉద్వేగాలు .-నిర్వేదం ,దైన్యం ,గ్లాని గర్వం మోహం  భ్రమ మొదలైనవి . భావం నుంచి ద్రష్ట లో ఉండాల్సిన ఊహా శక్తియొక్క ప్రాధాన్యత తెలియ జేయటానికే ఈ పదాలను సృష్టించాను చూసేవాడిలో సౌందర్య రసాస్వాదన అనే శక్తి లేకపోతె ఒక అందమైన అమ్మాయిని చూసినా ,రమణీయ సుందర ఉద్యానవనం చూసినా వాడిలో ఏ రకమైన భావోద్వేగం కలగదు .రంగ స్థలం పై వీటిని ప్రదర్శించేటప్పుడు సామరస్యం ,ఔచిత్యం చూపిస్తే అభిరుచి ఉన్న ప్రేక్షకుడికి రసానందం కలుగుతుంది . ఇవి లేకపోతె రస భంగమవుతుంది అనిగ్రహించాలి .నాటకం విజయం కావటానికి ప్రధాన సూత్రం ఏమిటి అంటే వివిధ రసాలమధ్య ఏదో ఒకటి సర్వత్రా ఆవరించి శాసించే విధంగా ఉండాలి .మానసిక స్థితుల వైవిధ్యం మధ్యలో ,అన్నీ ఊహలవలన రూపాంతరం చెందితే ,గాఢమైన భావా వేశం  ఒకటి వాటినన్నిటిని సూత్రం లో బంధించినట్లు గా ఐక్యం చేస్తుంది . దీన్ని ఆ కళాకృతి యొక్క అంగిరసం గా భావించాలి . మిగిలినవన్నీ కేవలం క్షణికాలే .నాటకం లో ఒకే రసం అంటూ ఉండదు …ఇంతకంటే నేను చెప్పాల్సింది లేదని మనవి చేస్తూ  సోదరులు భామహా ,దండి లు కొనసాగి0చమని కోరుతున్నాను . మా ముగ్గరినీ ఆహ్వానించి మా ముఖ్తతహా  మా సిద్ధాంతాలను తెలియ జెప్పే అవకాశం కలిగించిన సరసభారతివారికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను సెలవ్ .

భామహుడు -నేను వక్రోక్తికే పట్టం కట్టాను .సౌందర్య భావోద్దీపకమైన విభావాలుగా పరిణామ చెందాలి అంటే వక్రోక్తి వల్లనే సాధ్యం ..అన్నగారు భరతులవారు చెప్పిన రసాలన్నిటిని అలంకారాలుగా స్వీకరించటానికి నాకేమీ అభ్యంతరం లేదు ..శబ్దార్ధాలను మించి మరేదో జ్ఞానం కావ్యం ఉపదేశిస్తుంది .అందుకే నేను పర్యాయోక్తి విశేషోక్తి వ్యాజస్తుతి అలంకారాలను ఆదరించాను ప్రధాన కథ లో ఔన్నత్యం అద్భుతం దృశ్య రామణీయకత తోపాటు ,నాటకీ య గుణం ,శైలీ వైభవం కూడా ఉండాలి .గుణాలు కూడా అలంకారాలు అన్నాను కవిత్వ విలువలను నాశనం చేసే 12 దోషాలను గుర్తించి వివరించానునేను ..వస్తుజ్ఞానాన్ని పొందేవిధానం ,త్రైపాక్షిక తర్క సాధ్యమైన హేతువు ,నాదం యొక్క అమృతత్వం ,తార్కికమైన భ్రమలు చర్చించటానికి ఒక అధ్యాయం అంతా ఉపయోగించాను .కవిత్వానికి తనదైన తర్కం ఒకటి ఉంటుంది .అలాగే తనదైన అపోహలూ ఉంటాయి ..కావ్యనాయకుని శపథం ధార్మిక లౌకిక ,శృంగార ,ప్రతీకార బద్ధంగా ఉంటుంది మహాకావ్యాలలో ఇవి నెరవేరాలి .దీనికి విరుద్ధంగా వైఫల్యం చెందటం పెద్దపొరబాటే .ఉదాహరణకు-పురువు తండ్రి ముసలితనానికి బదులు తన యవ్వనం ఇవ్వటం ,వత్సరాజు వాసవదత్తను అపహరించటం భీముడు దుస్సాశాసనుడి రక్తాన్ని పానం  చేయటం  భీష్ముని బ్రహ్మచర్య ప్రతిజ్ఞ వంటివి . నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో సెలవు .

దండి-సాంకేతిక నైపుణ్యం  శైలీ వైభవం  నాకు బాగా ఇష్టం .వీటిలో నన్ను మించినవారు లేరని విశ్లేషకులు భావించారు మంత్ర  గుప్తుని  వృత్తా0తం లో 200 కు పైగా వాక్యాలను ఓస్ట్య ములు లేకుండా రాశాను ఇదొక పెద్ద ఫీట్ ..ఇలా రాయటానికి ఒక విచిత్ర కారణం ఉంది .తన కథ చెబుతున్నప్పుడు మంత్ర గుప్తుడి పెదిమలు అతని ప్రియురాలి ముద్దులతో గాయపడ్డాయి .అందుకని దంత క్షతాలు కనిపించకుండా చెయ్యి నోటికి అడ్డం పెట్టుకొని పెదవులు కలిపితే వచ్చే అక్షరాలైన ఓస్ట్య ములు రాకుండా చెప్పించాను ..వర్ణించటం చిత్రించటమే నాపని చర్చించటం నా పనికాదు .నేను చిత్రించిన స్త్రీలలో స్వభావ విరుద్ధ దౌర్జన్య పోకడలు  కామ తృష్ణ ,మోహావేశం రతికేళిలో పురుషుల్ని మించిపోవటం కనిపిస్తుంది .ఇవి నేను చూసి రాసినవే .అందుకే నా వర్ణనలు రాజస్థానీ సంక్షిప్త చిత్ర కళ తో  ,  మాటిస్ చిత్రాలతో పోలుస్తారు . ఇంతటి నిశిత పరిశీలన చేసినవారికి అభినందన చందనం . సెలవు

 సాహితాభిమానులకు వందనం .ఈ ప్రత్యేక కార్యక్రమం లో పాల్గొని శ్రద్ధగా విని విషయం సంగ్రహణం చేసిన శ్రోతలకు కృతజ్ఞతలు .మీరు లేనిదే దీనికి విజయం చేకూరదు .మనం ఆహ్వానించగానే మన్నించి తమ అమూల్య సందేశాలను సిద్ధాంతాలను సవివరంగా తెలియజెప్పిన భరత ముని  భామహా ,దండి పండితులకు మనఃపూర్వక కృతజ్ఞతాంజలి .సోదరులారా ఒక్కసారి నేను వీరు ముగ్గురు చెప్పినదాన్ని సమీక్ష చేస్తున్నాను ,జాగ్రత్తగా వినండి .

భరత ముని రస సిద్ధాంతం లోని సముచిత భావనలు ఆంగ్లకవి విమర్శకుడు  టి ఎస్ ఇలియట్  వస్తుసామ్య భావనకు సన్నిహిత సంబంధం ఉందని అంటున్నారట . ఉత్తమ భావాలు దేశకాలాతీతాలు కదా  .. రస సిద్ధాంతం పై అనేక వ్యాఖ్యా గ్రంధాలూ రావటం దానిలో ఉన్న విషయం గరిమకు సాక్ష్యం .బట్టలొల్లటుడు -జీవితం లోనూ కళ లోను  వచ్చే భావోద్వేగానికి మధ్య తేడాలేదని ,రసాలు రంగస్థలపాత్రలనుండే ఏర్పడతాయని ,చూసేవారు పాత్రలలో తాదాత్మ్యం చెంది ఆనందాన్ని అనుభవిస్తాడని చెప్పాడు .శంకుకుడు నటులలో విభావ అనుభవాదులను చూసి ప్రేక్షకుడు తనదైన జ్ఞానం లేక తార్కిక భావనతో కళకున్న ప్రత్యేక ఆకర్షణవలన రసాన్ని అనుభవిస్తాడని అన్నాడు .భట్టనాయకుడు సౌందర్య సాధనలో వచ్చే అన్ని అంశాలను సార్వ జనీనం చేయటం వలన కలిగే అలౌకిక ఆనందమే రసం అని పేర్కొన్నాడు .కాశ్మీర శైవ దార్శనికుడు అభినవ గుప్తుడు రసం కళ లోనుంచే స్వయంగా పుడుతుందని  ,అది అద్వితీయమైనదని తేల్చాడు ..భాష యొక్క సౌందర్యోద్దీపనా శక్తికి సమగ్ర వివరణగా ఆనంద వర్ధనునిధ్వని సిద్ధాంతాన్ని అన్వయించటం ద్వారా రసం మానవునికిఅత్యు కృష్ట మైన ఆత్మాశ్రయ ఆధ్యాత్మ్తికానందం కలిగిస్తుందని మరింత విస్పష్టంగా తెలియజేశాడు .సాహిత్యం లో అర్ధానికి ఉన్న బహుళ వ్యాప్తిని ,కవిత్వ భాషకు గల ప్ర త్యేక విశిష్టత గురించి ఆధునికులు చేసిన భావనలు మన ప్రాచీన ఆలంకారికులు ముందుగానే ఊహించి చెప్పినవే అని ఘంటా పదంగా చెప్పవచ్చు . భరత శాస్త్రాన్ని డ్రమాటిక్ ఆర్ట్ ,పెర్ఫార్మన్స్ ఆర్ట్ ధీరీ అన్నారు ఇది నాట్య నృత్య సంగీత త్రివేణీ సంగమం .అరిస్టాటిల్ రాసిన పొయెటిక్స్  ఇలాగే ఉంటుంది .సంగీతాన్ని గురించి విపులంగా  చర్చించిన  తొలి గ్రంధం నాట్య శాస్త్రమే . 13 వ శతాబ్ది వరకు సంగీతానికి ఇదే ఉపయుక్త గ్రంధం .ఆతర్వాతే దక్షిణాది ఉత్తరాది సంప్రదాయాలేర్పడ్డాయి .శృతుల మధ్య సామరస్యమే సంగీ తమన్నాడు భరతముని .ఈ నాట్య శాస్త్రాన్ని అయిదవ వేదంగా గుర్తించారు  భరత ముని నాటిన రసం అనే బీజం మొలకెత్తి మహావృక్షమై ,శాఖోపశాఖలై విస్తరించి పుష్పఫల సంభరితమై సార్ధక్యాన్ని పొందింది .

 భామహుడు పురాణ కావ్య ,శృంగార ప్రబంధాలను వెలకట్టి విలువలను నిర్ణయించటం లో ఆయన కవిత్వ విమర్శ పరాకాష్టకు చేరింది .ఆయన సిద్ధాంతం లోసూత్రాలను తర్వాత వచ్చ్చిన వ్యాఖ్యాతలు శ్రద్ధగా పరిశీలించి ఉంటె కావ్య విమర్శ కొత్త పుంతలు తొక్కి ఉండేది తన అపార విద్వత్తు ద్వారా గ్రహించిన సత్యాలను కవిత్వ సేవకు మళ్లించి తన సామర్ధ్యాన్ని అంతటినీ సద్వినియోగం చేసుకొన్నాడు .భరతుని రస సిద్ధాంతాన్ని భామహుడు చర్చించలేదు . అగ్ని పురాణం లో ఉన్న రసమే కావ్యానికి జీవం అన్నదీ ఆయన స్పృశించలేదు .రసాన్ని ‘’రసదలంకారం .’’అన్నాడు .’’శబ్దార్ధౌ సహితౌ కావ్యం ‘’అనేది భామహా సిద్ధాంతం .

 ఇక దండి లక్ష్య పూరిత నిండైన జీవితం గడిపి ఆచార్యుడనే బిరుదు పొంది ,శిష్య ప్రశిష్యులతో ప్రక్రుతి ఒడిలో జీవించి అద్భుత సాహిత్యనిధిని మనకు అందజేశాడు వకాహనానికి గౌరవం తెచ్చాడు వచనాన్ని సంస్కృతం ప్రాకృత ,అపభ్రంశ మొదలైన స్థానిక భాషలలో కూడా రాయవచ్చు నేనే భరోసా కలిగించాడు  కానీసంస్కృతం విశ్వవ్యాప్త గౌరవమున్న భాష -’’దండినః పదలాలిత్యం ‘’అని పేరు పొందాడు .గుణ ప్రస్థాన భావాన్ని దండి వ్యాపింప జేశాడు .కవిత్వం లో శ్లేష ,ప్రసాద గుణం సమతాగుణం ,మాధుర్యం అర్ధ వ్యక్తీ ఓజస్సు అనే గుణాలు ఉంటేనే మహాకావ్యమౌతుందని దండిభావన .

‘’సంస్కృతం నామ దైవీ వాన న్యర వ్యాతా మహర్షిభిః ‘’అంటే సంస్కృతం నిజంగా దేవా భాష అని మహర్షులు సిద్ధాంతీకరించారు .సామాన్య మాండలీకాలు అనేకం దానినుండి పుట్టాయి స్థానిక ప్రజలు వాటిని పోషించారు .అని గొప్ప భాషా విశ్లేషణ చేసిన దండి మాండలిక మార్గ దర్శిఅనిపించాడు

విశ్వ సాహిత్యం లో భరతుని రస సిద్ధాంత ప్రకటన అత్య0త  సమ గ్రమైనది మానవుడిలో సహజ స్వాభావికంగా స్పంధించే గుణం ,నాటకీయ సమర్పణలో వివిధ ప్రేరకాల కూర్పు ద్వారా క్రియాత్మకం చేయటం ,దానివలన ప్రేక్షకునిలో వచ్చే స్పందన ,చివరికి స్వచ్ఛమైన రసానుభూతికలగటం భరతముని రస సిద్ధాంతం లో ముఖ్యాంశాలు .కవిత్వ భాషలో విడదీయ రాని అఖండత్వం లోకి శబ్దార్ధాలు పరిణామం చెందటం లోని భామహుడు విడమర్చి చెప్పాడు .కావ్యాన్ని సౌందర్యం తో నింపేది అలంకారాలేన్ని వచనము కూడా శిరోభూషణమే నని దండి మహాశయుని భావం భరతుడు కావ్యాత్మ రసం అంటే  ,భామహుడు అలంకారం అంటే దండి కావ్యాత్మ గుణం అని ప్రతిపాదించారని  అర్ధం చేసుకోవాలి .సరసభారతి నిర్వహించిన ఈ ప్రత్యేక ‘’అలంకారిక ఆనంద నందనం ‘’మొదటి సమావేశం సమాప్తం . మరి కొందరు ఆల0 కారికులతో రెండవ సమావేశం లో కలుద్దాం .అంతవరకూ సెలవు .

  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -2

అలంకారిక ఆనంద నందనం -2

భరత ముని -ఉత్తమ ఉదాహరణాత్మక నాటకం అంటే ధీరోదాత్తుడు నాయకుడుగాకలది లేక శృంగార ప్రధానమైనది .ప్రకరణం అంటే  హాస్య రూపకం .జీవితం లో కస్టాలు బాధలతో సతమతమయే  సామాన్యులకు వినోదం చేకూర్చటమే నాటక లక్ష్యం . అనుకరణ ,అనుకీర్తనద్వారా నటులు వేషాలు వేసి వినోదాన్నిస్తారు .పాత్రలు పౌరాణికం కావచ్చు ఇతిహాసానికి సంబంధినవి కావచ్చు .లేక నాటక కర్త సృష్టించిన పాత్రలైనా కావచ్చు .మీరందరూ అనుకొంటున్నట్లు అనుకరణ అంటే వెక్కిరింత కాదు .ఉన్నది ఉన్నట్లు చేసి చూపటమూకాదు .ఊహా కల్పనా ద్వారా పాత్రను పునర్నిర్మించి ప్రదర్శించాలి ..దీనినే పునః సమర్పణ అంటారు .కథ లేక ఇతివృత్తం ఉదాత్తం మహిమాన్వితం గా ఉండాలి .నాయికా నాయకులు ఉన్నత కులం లో పుట్టి  ధీరగుణం కలిగి ఉండాలి .అప్పుడే గంభీరమైన నాటకం చూడగలరు .నిత్య జీవిత పాత్రలతో ఇతివృత్తం ఉంటె అది ప్రకరణం అవుతుంది .దీన్నే సామాన్య హాస్య నాటకం అన్నాను .నాటకం మాత్రం ప్రకల్పనలో ,ప్రదర్శనం లో మహోన్నతంగా ఉంటుంది . అసాధారణం ,అద్భుతం ,అలౌకికం కూడా చూపటానికి ఇతి వృత్తం లో స్థానం ఉంటుంది .ఏ రూపం లో ఉన్నా నాటకం చివరికి పరిష్కారం లభించే సంఘర్షణ ముఖ్యఅంగం కావాలి .నాటక ప్రారంభం లో అనుకూల ప్రతికూల శక్తులు సమంగా మోహరించి ఉంటాయి ..మధ్యలో ఒక క్లిష్ట దశ ఏర్పడుతుంది ..అప్పుడు నాటకం ఏ ఉద్దేశ్యంతో ప్రారంభమైందో అది చేరటం అసాధ్యమని పిస్తుంది .కానీ చివరికి ఉపసంహారం లో నాయకుడి శ్రమ ఫలి0చి ,విజయం చేకూరుతుంది . నాటక కథా  వస్తువును సంధులుగా ,సంధ్యాంగాలు గా సూక్ష్మ0 గా విశ్లేషించి చెప్పాను . చాలా దూరం వచ్చానేమో ?ఇప్పుడు భామహా , దండి మహాశయులు తమ విశ్లేషణ వరుస క్రమంలో చేస్తారు ..

భామహుడు-కావ్యానికి కవితా సామగ్రి ఎలా ఉండాలో నేను స్పష్టంగా చెప్పాను .అవి  -వ్యాకరణం ,ఛందస్సు ,నిఘంటువు ,సంప్రదాయంగా వస్తున్న కధలు ,గాథలు ,లౌకిక జ్ఞానం ,తర్కం లలితకళలు . కవి కావ్య నిర్మాణం చేయటానికి ముందే వస్తు నిపుణుల మార్గ దర్శకత్వం లో తన కళకు కావలసిన విషయాలలో ప్రాధమిక జ్ఞానాన్ని అయినా సమ కూర్చుకోవాలి తప్పదు ..కవిత్వం లో ఒక్క దోషం ఉన్నా నేను సహించను .కవిత్వ నియమాలు ఉల్లంఘిస్తే ,తండ్రికి అపఖ్యాతి తెచ్చే కొడుకు లాంటి వాడు అన్నాను నిర్మోహమాటంగా .అధమ కవిత్వ రచన మరణం తో సమానం ..నాది శాస్త్రీయ దృష్టి .మొహమాటం లేనే లేదు .

దండి-వాక్కు అభి వ్యక్తీకరణ అనేక మార్గాలలో జరుగుతుంది . కృతి నిర్మాణ శైలులు సూక్ష్మ భేదాలతో అసంఖ్యాకంగా ఉంటాయి .వైదర్భీ ,గౌడీ రీతులు పూర్తిగా భిన్నమైనవి .-

‘’అస్త్య నేకో  గిరాం మామః సూక్ష్మ భేదః పరస్పరం -తత్ర వైదర్భీ గౌడీయో వద్యతే ప్రస్ఫుటాం తరౌ ‘’ వైదర్భీ శైలి ఉత్కృష్టమైనది .దీనిలో దశ గుణాలు ఉన్నందున సుస్పష్టంగా ,మనోహరంగా ఉంటుంది .గౌడీ దీనికి విరుద్ధమైన గుణాలు కలిగి ఉంటుంది . రెండిటిలో వైదర్భీ శైలి ఉత్కృష్టమైంది .నా  తర్వాతవాడైన వామనుడు కూడా రీతి యే కవిత్వానికి ఆత్మ -రీతి రాత్మ కావ్యస్య ‘’అని సమర్ధించాడు  . ఆ చిన్నారికి నా ఆశీసులు .

భరత ముని -నటుల దృష్టిననుసరించి నాటకాలను అంకాలుగా విభజించాలి . తీవ్ర మార్పులు ,నమ్మశక్యం కానంత సుదూర ప్రాంతాలకు సన్నీ వేశాలు మారటం ఒకే అంకం లో జరగకూడదు . నాటకాన్ని అంతా  ఒకే సారి చూస్తుంటే ఈ నియమం పాటించక్కరలేదు ప్రతాప ,శృంగారాలలో నాయికా నాయకులు ఎలా ఉండాలో చెప్పాను . దీని వెనుక వైవిధ్యం అనే కీలక సత్యం దాగి ఉందని గ్రహించాలి .చివరికి దుర్మార్గం పై మంచితనానికి విజయం కలగాలి తప్పదు .. ప్రేక్షకులలో భారతీయ ధార్మిక వాతావరణం కలిగించాలి  . నీతి  ఐశ్వర్యం మనో వాంఛా పరిపూర్తి ఉత్తమ పాత్రలను నడిపించే శక్తులుగా ఉండాలి . పాత్రలద్వారా చూసేవారు ప్రేరణపొంది ఆదర్శ వంతమై తమ జీవితాలను తీర్చి దిద్దుకోవాలి . అందుకే నేను విషాదాంత నాటకాల జోలికి పోలేదు … ఇప్పుడు భామహా దండి లు తమ అనుభవాలను చెబుతారు .

భామహుడు –భరతన్న గారి చూపు యెంత ధార్మికమైనదో యెంత ప్రయోజనకరమైనదో తెలిసిందికదా ..నేనుకూడా కవిత్వ శాఖలలో మహాకావ్యమే ఉత్తమోత్తమ మైనది అని గంట కొట్టి చెప్పాను ..రూపం లో ,వస్తువులో మహాకావ్యం ఉత్కృష్టమైంది . దానిలో పాత్రలు ఉదాత్తమైనవి ఉన్నతమైనవి .శైలి సుందరంగా ఉంటుంది . నాయకుని చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలు మహా కావ్యం లో ఉంటాయి .రాజనీతి ,దండ  యాత్రలు ,విజయాలు ధర్మోపదేశాలు అన్నీ సులభ శై లిలో వ్యక్తీకరింపబడతాయి ..కథ సుఖాంతమవటం  భరతన్నయ్య లా నాకూ ఇష్టం .కావ్యం చతుర్విధ పురుషార్ధాలను ఎంతోకొంత ఉద్బోధిస్తుంది .కానీ ద్వితీయ పురుషార్ధమైన అర్ధానికి కావ్యం ప్రాధాన్య మిస్తుంది .మానవ స్వభావాలలో సత్యానికి కావ్యం ప్రతిబింబమవుతుంది .అన్ని రసాలకు కావ్యం లో చోటు ఉంటుంది .

దండి-నా అవంతీ సుందరి కథ ఆఖ్యాయిక వర్గానికి చెందింది .ఇందులోని సంఘటనలు యదార్ధ జీవిత సత్యాలపై ఆధారపడి ఉన్నాయి .వచనం అంటే’’ ఛందో బద్దమై న పాదాలుగా విభజించటానికి వీలు లేని పదాల కూర్పు’’అని నా నిర్వచనం . మనో వృత్తులు ,భావోద్వేగాలు తో నిండిన కవిత్వం  వచనాన్ని పూర్తిగా భిన్నమైంది .మీమాంస శాస్త్ర కర్త శబరుడు అలంకార రహితంగా దర్శన శాస్త్రాలురాసి శంకర భగవతపాదులనే  ఆకర్షించాడు .కనుక కవిత్వమే ఆకర్షిస్తుంది అనటానికి వీలు లేదు .వచనము సమర్ధంగా రాయగలిగితే అదే ఫలితాలను ఇస్తుంది అని మర్చిపోరాదు .

భరత ముని -సంతోషం .కావ్య  ప్రాధాన్యం  సోదరుడు భామహుడు వివరిస్తే ,వచన మనో వికాసాన్ని దండి తమ్ముడు చక్కగా చెప్పాడు .ఎందులో రాశా మనికాదు ఎంతబాగా రాశామనేది ముఖ్యం . ఈ రెండూ రెండు కళ్ళ వంటివే .. ఇప్పుడు నేను నాటకం లో నాందీ ప్రస్తావన గూర్చి చెబుతాను .నాటకానికి నాంది చాలా ముఖ్యం .నాందిలో పాత్రధారులు సుదీర్ఘంగా ఆరాధన చేయాలి అది అయ్యాక నే నిజంగా నాటకం ప్రారంభమవుతుంది .పాత్రలు వాటి హోదాలనుబట్టి . ఎలా సంబోధించాలి ,ప్రాకృత భాషా మాండలికాలను ఎలావాడాలి ,ఏయే భాగాలను ఎలా సముచితమైన సంజ్ఞలు నాట్య ,సంగీత రీతులతో ప్రదర్హించాలి అనే విషయాలను అతి సూక్షంగా పరిశీలించి చెప్పాను .అందుకే ఇప్పటికీ మీరు నన్ను మరచిపోలేక పోతున్నారు .. సోదరులారా ఇక మీరు ఉపక్రమించండి .

భామహుడు -అన్నగారు భరత మునీశ్వరులు ఒక విజ్ఞాన సర్వస్వము వారి నాట్య శాస్త్రం అంతే విలువకలిగింది .మాఅందరికి వారే మార్గ దర్శి ..ఇతర కవిత్వ శాఖలలో దశ విధ రూపకం ,గద్యం లో శృంగార గాథ ,అనిబద్ధ కవితలు ఉన్నాయి శృంగార గాథ లు ఆఖ్యాయిక ,కథ అని రెండురకాలు .ప్రకృతిని ,శృంగారాన్నీ వర్ణించే ఖండకావ్యాలు అని బద్ధ కవిత్వం కిందకు వస్తాయి .ఖండకావ్యం తో ప్రారంభించినా మహాకవి లక్ష్యం ఉత్తమ మహాకావ్య రచనమే .పురాణ ,ఇతిహాస కథలు ,కల్పిత కథలు కావ్య వస్తువులుకావచ్చు .కల్పిత కథలని తేలికగా తీసిపారేయ రాదు . కవి వాటిని తన అనన్య సామాన్యమైన ప్రతిభతో మలిచి మహాకావ్యం చేయవచ్చు .

దండి-కథ  ఎలా ఉండాలి అన్న విషయం లో అన్నగారు భామహుడు ,పెద్దన్న భరతముని గారి అభిప్రాయాలు నాకూ నచ్చాయి .. ఇప్పుడు ప్రపంచమంతా వచన కవిత్వం తో పరవళ్లు తొక్కుతోంది .నేను వేసినదారి సవ్యమైనదే అని నమ్మకం కుదిరింది .కావ్యం లో ఆశ్వాసాలు కాండాలు ఉంటాయి కానీ వచన రచనను నేను ఉచ్చ్వాసాలుగా విభజించాము .ఉపోద్ఘాతం ఛందస్సులోపద్య రూపం లో ఉండచ్చు ..శృంగార ఇతివృత్తం ,రాజులమధ్య యుద్ధం ,ప్రేమికుల విరహం  జైత్ర యాత్రలు  మహత్తర సంఘటనలు చక్కగా వచనం లోనే చిత్రించవచ్చు .కథ ,ఆఖ్యాయిక మధ్య భేదాన్ని పాటించక్కరలేదు . పేర్లు వేరేకానీ రెండూ ఒకటే రకానికి చెందినవని నేను అభిప్రాయపడ్డాను .ఇక్కడమాత్రం అన్న భామహులను కాదంటున్నాను  .నా అవంతీ సుందరి కథ  భట్ట బాణుని కాదంబరి వచనానికి దగ్గరలో ఉంటుంది .ఈ కథ  ద్వారా నా జీవిత కథను తెలుసుకొనే ప్రయత్నం చేశారు పరిశోధకులు .నా యదార్ధ జీవిత కథ చుట్టూ కల్పనా చమత్కృతి తో అల్లిన అనేక  కథ లున్నాయని వారు భావించారు .నాకూ మహా కవి కాళిదాసు కూ మధ్య ఎవరుగొప్ప అనే సమస్య వచ్చి మేమిద్దరం సరస్వతీ దేవి దగ్గరకు వెళ్లి అభిప్రాయం అడిగితె ఆమె ‘’కవిర్ద 0డి కవిర్థం డి కవిర్ద0డి న సంశయహ్ ‘’అని బదులు చెప్పగా ,కాళిదాసుకు కోపం వచ్చి –కోహం ముండే ‘’-నేనెవరినీ దద్దమ్మా అని అడిగినట్లు ఆమె నిస్సంకోచంగా ‘’త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం ‘’అని మూడుసార్లు అన్నదని  తీగంతా లాగి  డొంకంతా కదిల్చి వదిలి సంబరం చేసుకొన్నారు జనం . అయినా మా ఇద్దరి మధ్యా స్పర్ధ ఏమిటి ?ఇదంతా కాలక్షేపం బటానీలు . ఎంత గొప్పగా అల్లా రో ఈ కథను .మహాకవులకు  తీసిపోరు ఈ పుకారు మనుష్యులు .ఇంతటితో ఆగారా /లేదే -మరో చమత్కారకవి ‘’వాల్మీకితో  కవి అనే పదం పుట్టింది .వ్యాసునితో కవిద్వయం ఏర్పడింది డండి రాకతో కవిత్రయం అని లోకంలో వ్యవహారం లోకి వచ్చింది అన్నాడట .. భజన పరులు ఆనాడూ ఉన్నారు స్వామీ ..మరీ చెక్క భజన పనికి రా’’దండీ’’ .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -3

అలంకారిక ఆనంద నందనం -3

భరత ముని -నాటకం లోని ప్రతి అంశానికీ అంటే పాత్రీకరణ ,నాటక ప్రణాళిక ,శైలి ,దుస్తులు ,సంగీతం నృత్యం వంటివి ఏదైనా రసం ప్రధానం అని నా అభిప్రాయం . అదే ప్రాణప్రదమైన ఊపిరి .అదిలేకపోతే కళ  నిర్జీవమే .రసం భావంతో విడదీయరాన0తగా పెనవేసుకొని ఉండటం వలన ఒకటి లేకుండా రెండవదానిని అర్ధం చేసుకో లేం .వాడుకలో రసభావాలు ఒకే అర్ధం లో పర్యాయ పదా లయ్యాయి .మనిషికి ఉన్న మానసిక ప్రపంచం ,అనుభూతులు ,ఆవేశాలు ,అభిమానాలతో అతడిని ఏదో పనికి పురికొల్పుతాయి . జీవతానికీ ,కళ కూ ఇదే మూల పదార్ధం .దీన్ని తీర్చి దిద్దటానికే కళలు ప్రయత్నిస్తాయి .జీవితాలలో సుఖ దుఃఖాలు కలిసి ఉంటాయి .కానీ కళాకారుడు వాటిని గ్రహించి నప్పుడు తన ఊహలో వాటిని కల్పించుకొని ఒక క్రమ పద్ధతిలో పెడతాడు .ఇలాంటి పధ్ధతి భూమిపై ఉండదు .ప్రతిభా వంతుడైన కవి కల్పించిన దానికి లోబడి ఉన్నప్పుడు వాటిని భావాలు అంటారు ; భావన అంటే సృజనాత్మకమైన కల్పనా విధానమే .ఇదే సౌందర్య రసజ్ఞత .ఇది నాటక కర్తకు ,రసిక ప్రేక్షకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం ..ఇలా రస ,సౌందర్య సిద్ధాంతానికి నేనే ఊపిరి పోశాను . నా తర్వాత భామహా దండి తమ్ములు తమ భావావేశాలు వివరిస్తారు .

భామహుడు -అన్న గారి రస  సౌందర్య సిద్ధాంతానికి జోహార్లు .అన్నిటా వారు మార్గ దర్శి యే .నా దృష్టిలో కవిత్వం అంటే మహా పురుషులకు కవి అర్పించే ఘన  నివాళి .విద్వా0సు డైన కవి ఉన్నత భావ వ్యక్తీకరణ ద్వారా సౌందర్యాన్ని   ఉన్మీలనం  చేస్తూ  తన లక్ష్యాన్ని సాధిస్తాడు .ఉత్తమ కథా నాయకుని చుట్టూ ఉత్తమ శిల్పం తో అల్లిన ఉత్తమకథ మహాకావ్యానికి వస్తువవ్వాలి ..అన్నగారు భరత ముని చెప్పినట్లు పంచ సందుల సిద్ధాంత సారా0శ మైన క్రియకు సంబంధించిన ఏకత,వస్తువులో అంతర్వాహినిగా ఉండాలి .కావ్యం పాఠకుని ఆనంద పరచి నర్మ గర్భంగా ధర్మోపదేశం చేయాలి .ఉద్వేగ భరితమైన కథలను చెబుతూనే లౌకిక జ్ఞానాన్ని ,సాంఘిక ధర్మాలు ఉపదేశించాలి .మొదటినుంచి కావ్య నాయకుని ప్రశంసించటం లో కవి ఔచిత్యం పాటించాలి .ఈ మంచి మాటలు చెప్పానుకనుకనే  నా ప్రవచనాలు ప్రాచీన సంస్కృత సాహిత్య లక్షణ సారం అన్నారు విజ్ఞులు ..నాకాలం లో రసాలు కావ్య వస్తువులో భావోద్వేగం కలిగించే అంశాలు మాత్రమే . శబ్దాలంకారం రసం ఎలా అవుతుందని ఆ తర్వాత ఆనంద వర్ధనుడు ప్రశ్నించాడు .నేను ఈ విషయాలు పట్టించుకోలేదు అంతే …

  కావ్య సౌందర్యా రాధన శీలురకు నా అలంకార సిద్ధాంతం రస గుళికగా భాసించింది . సౌందర్యం అనే విషయాన్ని అన్న భరతుల వారితర్వాత నేనూ ఆ మార్గమే పట్టాను ..సౌందర్యం రెండురకాల .ఒకటి స్వాభావికమైనది రెండవది కళ ద్వారాసృష్టించేది ..ఆభరణాలవలన సుందరి మరింత సౌందర్యంగా ఎలా  భాసిస్తుందో అలాగే రమణీయమైన శబ్దాలవలన సౌందర్యం అభివ్యక్తమౌతుంది .అలంకారాలు కూడా కావ్య సౌందర్యాన్ని ఇనుమడి0ప జేస్తాయి అనటం లో సందేహం లేదు.కావ్య విశిష్టతను శబ్దం అలంకారాలూ  రెండూ ఇనుమడింప జేస్తాయి  ..కానీ కావ్య సౌందర్యానికి వక్రోక్తి అనేది ప్రాణం అని నేను గట్టిగా నమ్ముతాను .వక్రోక్తి లేకపోతె ఉత్తమ కావ్యరచన సాధ్యంకాదు అని నిర్మొహమాటంగా అన్నాను ..

 దండి-దండం చేతిలో ఉన్నవాడు దండి కనుక నా పేరు అదికాదని వేరే ఏదో ఉందని అనుకొన్నారు . దక్షిణాదివాడినని కర్ణాటక వాడినని ,మహారాష్ట్ర భాషను వైదర్భీ రీతిని మెచ్చుకున్నానని సంతోషించారు . దశకుమా ర చరిత్రలో గోమిని వృత్తా0తం  బట్టి  సంసారాన్ని పొదుపుగా నడుపుకునే అలవాట్లను చెప్పాను . మరొక చోట కోడిపందాలు కూడా వర్ణించాను .  వీటన్నిటిబట్టి దాక్షిణాత్యుడను అనే బలమైన భావన కలిగింది . అంతే కాదు నా కావ్యాదర్శం రాసిన వందేళ్లకే కన్నడం లోకి అనువాదం పొందింది .క్రీశ 1250 లో తెలుగు అనువాదము వచ్చింది .కావేరీ తీరపట్టణం ,కళింగాంధ్రాల ప్రస్తావన కూడా దీన్ని బలీయం చేసి ఉంటుంది.  అందుకే నన్ను ప్రామాణిక సృజనాత్మక సంస్కృత రచయితలలో ఒకనిగా విశేష స్థానం కల్పించారు . సమాజం లో ఉన్న ఉన్నత బీద వర్గాలు దొంగలు కుట్రలు కుతంత్రాలు అంతఃపుర కేళీ విలాసాలు వేశ్యా పొందు సౌఖ్యాలు ,జూద గృహాలు  కోడిపందాలు ఒకటేమిటి జనజీవన స్రవంతిలో ఉన్న ప్రతి  విషయాన్ని బొమ్మకట్టి నట్లు కట్టించి చూపాను నా రచనలో .కనుక నేను సామాజిక కవిని అన్నా ఇబ్బందిలేదు.  క్రీశ 500 కాలం నాటి శూద్రకమహాకవి మృచ్ఛకటికం నాటకం వర్ణించిన సాంఘిక పరిస్థితులే నాకాలం నాటికీ ఉన్నాయి . అన్నలిద్దరూ రసం సౌందర్యం అంటూ ఆకాశాన విహరిస్తే నేను నేలమీదనే ఉంటూ నా కళ్ళతో చూసిన దృశ్య ప్రపంచాన్నే వర్ణించి సహజ కవిని అయ్యాను . ఇప్పటికే స్వ –మర్దనం చాలా చేశానేమో ..

భరత ముని -లేదు తమ్ముడూ .నేల విడిచి సాము చేయని నిన్ను చూస్తే మా ఇద్దరికీ అభిమానమే .చెప్పాల్సిన విషయాలే చెప్పావు .నీగురించి తెలియనివారికందరికి ఇవి అమూల్యమైన ఊటలు .మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెప్పు తప్పు లేదు .. ఇందాక రస ప్రస్తావన చేశాను ..భావం వస్తు స్వభావం గా ఉంటె సౌందర్య రసజ్ఞత అధమస్థాయి లో ఉంటుంది .చిత్రకళలో దీనికి స్థానం ఉంది .కానీ రంగస్థలం పై కళాకారుడు మానవ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చిత్రీ కరించటం లో తృప్తిపడకుండా వాటిని మరింత జటిలం చేస్తాడు .ఈ విధంగా జయప్రదంగా భావ జటిలతమాత్రమే రసం అనిపించుకునే అర్హత పొందుతుంది .కారణం అది ఇచ్చేరుచి ఆనందానుభూతి అనంతమైనది .నా దృష్టిలో భావం లేని రసం లేదు .అలాగే రసం లేకుండా ఏ భావమూ ఉండదు . వీటి పరస్పర సమన్వయము వలననే రంగ స్థల విజయం  ఆధార పడి  ఉంటుంది . వస్తువు ,లేక భావం సూటిగా ప్రేక్షకుడికి తాకితే అతడిలో వెంటనే ప్రతిస్పందన కలిగితే అది అక్కడికక్కడే రసంగా పరిణామ0 చెందుతుంది ..అప్పుడు అతని శరీరం అంతా ఎండు  టాకుకు నిప్పు పెట్టినట్లుగా ప్రజ్వ లిస్తుంది . రసం అంటే సౌందర్య భావ జనిత ఆనందం అని ఏక వచనం లో అర్ధం .బహువచనం లో రసాలు  ఉఛ్చ స్థితికి చేరిన స్థాయీ భావాలు అని నా నిర్వచనం .భావోద్రేకాలు ఎనిమిది .రతి ఉత్సాహం మొదలైనవి .వీటినే శృంగార వీర రసాదులు అన్నాను ‘’శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకా -భీభత్సాద్భుత సంజ్నౌ చేత్య స్టౌ నాట్యే రసాహ్ స్మృతాః ‘’

‘’రతి ర్హాసశ్చశోకశ్చ క్రోధో త్సాహో భయం తథా -జుగు ప్సావిస్మయ శ్చేతి స్థాయీ భావాః ప్రకీర్తితాః ‘’

 అంటే -శృంగారం హాస్యం ,కరుణ ,రౌద్రం  వీరం భయానకం ,భీభత్సం ,అద్భుతం అనేవి 8 రసాలు  వీటికి ఉన్న 8 స్థాయీ భావాలూ వరుసగా -రతి ,హాసం ,శోకం ,క్రోధం ,ఉత్సాహం ,భయం ,జుగుప్స ,విస్మయం .చూసేవాడిలో బాధను రగుల్గొల్పే కరుణ , భీభత్సం కూడా నా దృష్టిలో రసాలే  .రస సౌందర్య చర్చ అంటే నాకు ఒళ్ళు తెలియదు .చాలా చెప్పి విసిగించానా ? తమ్ముళ్లూ ఇప్పుడు మీ వంతు .

భామహుడు- అన్నగారు భరతులవారు రస వాహినిలో ముంచి తేల్చారు .సౌందర్య దర్శనం తో అప్రతిభులను చేశారు . అన్నగారూ శతకోటి వందనాలు . కావ్య భాషలో సౌందర్యం వెనక ఉన్న రహస్యాలను భేదించటానికి అనుస్యూతం గా  ప్రయత్నాలు జరుగు తూనే ఉన్నాయి .అయితే నా  భావాలు ఆలోచనాత్మకమైనవి  ,అతి నిగూఢమైనవి అంటారు విశ్లేషకులు .కుంతక  ,ఉద్భటులు నా భావాలపై గొప్ప వ్యాఖ్యానాలు రాసి మంచి ప్రచారం తెచ్చారు .నా నిశిత దృష్టికి  ,భావ వైశాల్యానికి వారి రచననలు అద్ధం పట్టాయి . అది నా అదృష్టం . నా భావ వ్యాప్తికి చేయూతనిచ్చినవారికి హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులు . నాకు అనిపించేదేమిటంటే శబ్దార్ధాలు ,కథా వస్తువు ,భావోద్వేగాల సమ్మేళనం వలననే సంపూర్ణ సౌందర్యాను భూతి కలుగుతుంది ..కనుక ఇవన్నీ అలంకారం లోని అంశాలే అంటాను నేను ఈ  దృష్టితో చూస్తే కేవలం వాస్తవికత ,కవిత్వం పరస్పరంగా విరుద్ధమైనవి గా కనిపిస్తాయి .కనుక నేను స్వభావోక్తిని ఒక అలంకారంగా గుర్తించలేదు . నేను అలంకారానికి ప్రాధాన్య మిచ్చాను .గుణాలు రీతి అవసరం  .వైదర్భీ  గౌడీ భేదాలు ఉండాలి . వైదర్భీలో ప్రసాద ,ఋజుత్వ ,కోమలత్వ గుణాలు నాకు ఇష్టం లేదు పురుషార్థం వక్రోక్తి లేకపోతె కావ్యమే కాదు పొమ్మన్నాను . గౌడీయ రీతిలో అలంకారానికి ,భావ ఔచిత్యానికి యుక్తి యుక్తం గా చోటు కలిపిస్తే ఉత్తమ కావ్యమవుతుంది.  కేవలం మాటల గారడీ లో అందం లేదు ఉండదు .ద్వివిదాత్మక సౌందర్యం వక్ర శబ్దం అర్ధం వల్లనే ఏర్పడుతుంది అని ఘంటాపధంగా చెప్పాను .సమాస ప్రయోగం ధారాళంగా ఉండచ్చు సమాస బాహుళ్యం వలన ఓజస్సు ఏర్పడుతుంది .కొద్దిగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ప్రాసాద గుణం రాణిస్తుంది .సమాసాలు కర్ణ పేయంగా ఉంటె మాధుర్య గుణం వికసిస్తుంది .

దండి-అన్న లిద్దరూ సౌందర్య పిపాసలో చాలా దూరం కొట్టుకు పోయారు .  .పెద్దన్న భరతుడు ముందే అనుజ్ఞ ఇచ్చాడన్న ధీమాతో  నేను మాత్రం నా స్వంతగోడు వినిపిస్తున్నాను .అవంతీ సుందరికథ  ను నేను  కంచిలో రాశాను .పుస్తకాలంటే నాకు వల్లమాలిన అభిమానం.మా అమ్మా నాన్న పోయాక సరస్వతి ,శ్రుతులే నాకు దిక్కు అయ్యాయి ..దేశాటనం చేస్తూ బ్రాహ్మణ క్షత్రియ విద్వద్గోష్ఠిలో పాల్గొన్నాను . వైద్యం పశువైద్యం ,జ్యోతిషం ఖగోళం వాస్తు శిల్పకళతో నైపుణ్యం సాధించాను .కౌటిల్యం కామసూత్రాలు చదివి నిష్ణాతుడనయ్యాను వాస్తు శిల్పం లో నా పరిజ్ఞానాన్ని మిత్ర శిల్పి లలితాదిత్యుడు ఎంతో మెచ్చాడు ..మహాబలి పురం లో త్రివిక్రమ విష్ణు మూర్తి రాతి విగ్రహం చేయి విరిగిపోతే దానికి మలాం పూసి మరమ్మతు చేసిన లలితాదిత్యుడు  నన్ను దానిపై అభిప్రాయం కోరాడు అంటేశిల్పకాలపై నాకున్న పరిజ్ఞానం అతనికి నచ్చినట్లేకదా . .ఎన్నో పుస్తకాలు చదవాలని పిస్తుంది కానీ వయస్సు మీదపడిపోతోంది అని నాకు బాధగా ఉంది . నాకుతెలిసిన సాహిత్యకారులు వ్యాస సుబాహు గుణాడ్య  మూలదేవ శూద్రక భాస  ,సర్వజన ప్రవర సేన కాళిదాస ,నారాయణ భారవి   ,బాణ మయూరాదులను నేను స్మరించాను .బహుశా వారికాలాలు కూడా అదే వరుసలో ఉంటాయి .విజ్జిక లేక విజ్జి అనే కవయిత్రినీ గుర్తు చేసుకున్నాను .ఆమె నల్లగా ఉంటుందికనుక నేను సరస్వతీ దేవిని శుక్లాంబరధరం స్వేతవర్ణం గా వర్ణిస్తే ఆమె శ్యామలవర్ణం గల విజ్జికయే సరస్వతి అని భావిస్తే దండి అలా వర్ణించి ఉండేవాడు కాదు అని జవాబు ఇచ్చింది .గంగాదేవి అనే కవయిత్రి ఆచార్య దండి వాక్కు అనే తేజస్సు అద్ధం  లో మెరిసిన సరస్వతీ దేవి ఆభరణాల సోయగమే ‘’అని చక్కగా చమత్కరించింది –

‘’ఆచార్య దండి నో వాచ మాచాన్నామృత సంపదాం -వికాసో వేధసః పరన్యా విలాస మణి దర్పణం ‘’.

 భరతముని -దండి సోదరా నీ కథ ను దండిగా చెప్పి మాకు కొత్త విషయాలు తెలియజేశావు .సోదరులారా మన కార్యక్రమాన్ని రేపటితో ముగిద్దాం. .తయారుగా రావల సిందిగా కోరుతున్నాను .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment