నా దారి తీరు -104 మేడూరు నుండి అద్దాడకు బదిలీ

నా దారి తీరు -104

మేడూరు నుండి అద్దాడకు బదిలీ
 మేడూరు వదలాలననే కోరికకు మరో బలమైన కారణం ఒకటి ఉంది ఇది నూజి వీడు  డివిజన్ పరిధిలో ఉంది .కానీ డివిజన్ లో ఎక్కడా భాష సైన్స్ విషయాలలో అభి వృద్ధి  స్కూల్  కాంప్లెక్స్  ఓరియెంటేషన్ మొదలైనవి ఎక్కడా జరగలేదు .ఒక్కసారి మాత్రం బాలానందం మేష్టారు అని పిలువబడే డా ముసునూరు వెంకటేశ్వరరావు అనే హెడ్మాష్టర్ ఇంగిలీషు లెక్చరర్ ,ప్రిన్సిపాల్ గారి మేనల్లుడు శ్రీ విష్ణుదాసు గారు తాడంకి హై స్కూల్  లో  ఇంగ్లీష్   టీచింగ్ పై ట్రెయినింగ్ క్లాస్ నిర్వహించారు ఆయనతో అదే మొదటి పరిచయం తరువాత ఆయన నూజివీడు స్కూల్ లో సోషల్ మే స్టర్ అవటం మంచి బాడ్ మింటన్ ,వాలీ బాల్  ప్లేయర్ అవటం తో గ్రిగ్ స్పోర్ట్స్ లో కలిసేవాళ్ళం .
  కానీ  గుడివాడ డివిజన్ లో శ్రీమతి ఇందీవరం గారనే ఆమె ఉపవిద్యా శాఖాధికారి గా చాలా మంచి పనులు చేస్తున్నారని ,ఎన్నో విషయాలలో ఆ డివిజన్ ను ముందుకు తీసుకు వెడుతున్నారని    సృజనకు మంచి ప్రోత్సాహమిస్తున్నారని తరచూ ఉపాధ్యాయులతో హెడ్ మాస్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దుతున్నారని హెడ్మాస్టర్స్ కాన్ఫరెన్స్ లోను ,స్పాట్ వాల్యూ యేషన్    లోను తోటి హెడ్మాస్టర్లు టీచర్స్ చెప్పగా వినేవాడిని అందుకని యాక్టివిటీ ఎక్కువగా ఉండే ఆ డివిజన్ లో ఉయ్యూరుకు దగ్గర స్కూల్ కు  వెడితే బాగుంటుంది అనిపించింది .
  జులైనెలలో నూజివీడు డివిజన్ ఉపవిద్యాశాఖాధికారి గా ఎవరో కొత్త ఆవిడ వచ్చిందని ,ఆవిడ అదేనెలలో మేడూరు స్కూల్ ఇన్స్పెక్షన్ కు రావాలని అనుకొంటున్నారని తెలిసింది .ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ జరిగి రెండేళ్లు దాటింది .కనుక స్టాఫ్ ను సమావేశ పరచి ఇన్స్పెక్షన్ కు సిద్ధమౌదామా అని అడిగాను . ఎకాడమిక్ ఇయర్ ప్రారంభమే కనుక త్వరగా అయిపోతే అందరికీ మంచిదని అనుకున్నాం .అయిన ఖర్చు అంతా టీచర్ల జీతాల ఆధారంగా లెక్కవేసి కట్టుకోవాలని నిర్ణయించాం  లెసన్ ప్లాన చార్టులు మోడళ్ళు  అలంకరణ  వగైరాలతో సిద్ధమవమని చెప్పి గుమాస్తా శ0 కరరావు ను నూజివీడు పంపించి ఆవిడతో మా స్కూల్ స్పెక్షన్ కు సిద్ధమేనని చెప్పించాను .ఆవిడా సంతోషంగా ఒప్పుకుని షెడ్యూల్   పంపారు .డేట్స్ జ్ఞాపకం లేవు కానీ రెండు రోజుల ఇన్స్పెక్షన్ . దీనికి చుట్టు  ప్రక్కల హై స్కూల్స్ నుంచి  సబ్జెక్ట్  ఎక్సపర్ట్ లనూ వ్రాతపూర్వకం గా పిలిపించాం .స్కూల్ రికార్డ్ లన్నీ పకడ్బందీ చేయించా .సైన్స్ లో గేమ్స్ లో పనికి రాని  ఆర్టికల్స్ ను తీసెయ్యటానికి రైటాఫ్ లిస్ట్ లు తయారు  చేయించాను   వీటిని డి వై యి ఓ అంగీకరించి సర్టిఫై చేస్తేనే తొలగించాలి ఒక్కోటి మూడు కాయీలు తయారు చేయాలి
   మొదటి రాజు ఇన్స్పెక్షన్  కు ఆమె గుమాస్తా  తో సహా నూజి వీడు నుండివచ్చారు .రాగానే ఫార్మాలిటీ ప్రకారం కాఫీ టిఫిన్ ఆమెకూ గుమాస్తాకు పానెల్ మెంబర్లకు ఏర్పాటు చేయించాం అందరూ సంతృప్తిగా తిని మొదలు పెట్టారు కొబ్బరి చెట్లున్నాయికనుక ఆరగా ఆరగా కొబ్బరి బొండాలు కొట్టించితాగ్గించాం ..మధ్యాహ్న భోజనాలూ శుస్టుగా నే ఏర్పాటు చేయించాం కడుపు నిండా తిన్నారు .ఆ సగం క్లాసుల ఇన్స్పెక్షన్ అయింది . డ్రిల్లు  తో సహా అన్నీ చూశారామె .రికార్డ్ లన్నీ గుమాస్తా చూశాడు .ఆతను సరే నంటే ఆమె ఫైనల్ సంతకం పెడతారు .లాగ్ బుక్ విజిటర్స్ బుక్ అకౌంట్ బుక్స్ అన్నీ చూసి రామమోహనరావు గారి విగ్రహ ప్రతిష్టాపనకు మురిసిపోయారామె .సాయంత్రం మళ్ళీ నూజి వీడు వెళ్లినట్లు గుర్తు .
  రెండవ రోజు న మిగిలిన క్లాసులు సబ్ జెక్ట్ లు చూడటం పూర్తి అయింది మర్యాదలన్నీ మామూలే  .ఆమె పేరు గుర్తులేదుకాని కొంచెం నల్లగా పట్టు చీరెలో కుదిమట్టంగా చిరునవ్వుతో ఉన్నారు క్రిస్టియన్ .పేరు మనపేరు లానే ఉన్నగుర్తు .
  రెండవ రోజు పని పూర్తి అవగానే సాయంత్రం  స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేశాను ఆమె సమక్షం లో .ముందుగా పానెల్ మెంబర్లు తాము టీచర్స్ విషయం లో సబ్ జెక్ట్ బోధనా విషయం లో గమనించిన విషయాలు చెప్పారు సూచనలు ఉంటె సూచించారు .చివరికి డెప్యూటీ ఎడ్యుకేషనల్  ఆఫీసర్ అయిన ఆమె మాట్లాడుతూ స్కూల్ అన్ని విధాలా అభి వృద్ధిలో ఉందని ఇన్నిరకాల ఈవెంట్స్ తానూ పని చేసివచ్చిన ఏలూరు లోకూడా చూడలేదని హెడ్ మాస్టారు చాలా విషయాలలో ముందుండి సహచరులను నడిపిస్తున్నారని ,స్టాఫ్ సహకారం అత్యద్భుతమని ,అకౌంట్స్ చాలా పెర్ ఫెక్ట్ గా ఉన్నాయని  హెడ్ మాస్టారి కృషికి జిల్లావ్యాప్తంగా గుర్తింపు వచ్చేట్లు చేస్తానని ,ఇంత మంచి స్కూల్ ను విజిట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఇక ఎక్కడికి వెళ్లినా మేడూరు హై స్కూల్ ను మోడల్ గ పెట్టుకొని హెడ్ మాస్టర్లకు టీచర్లకు చెబుతానని మహా ఆనందంగా తెలిపారు చప్పట్లు మోగించారు అందరూ  ఆవిడకు శాలువా ఒక జ్ఞాపిక స్కూల్ తరఫున బహూకరించిన జ్ఞాపకం . గుమాస్తా మామూలు మామూలే . రెండురోజుల్లో ఏడాదిభారం ఒక్క సారిగా తీరి పోయినందుకు అందరూ రిలీఫ్ పొందాం .
  పామర్రులో నాతోపాటు సైన్స్ అసిస్టెంట్ గా పని చేసి కాటూరు హెడ్ మాస్టర్ గ ఉన్న పామర్రు నేటివ్ శ్రీ నందిపాటి  .వీరారెడ్డి గారు ఉయ్యూరు దగ్గర కాటూరు హెచ్ ఏం గా ఉన్నారు .అయన రోజూ పామఱ్ఱునుంచి ఉయ్యూరువచ్చి,మళ్ళీ అక్కడినుంచి బస్ లో కాటూరువెళ్ళాలి .కలిసినప్పుడల్లా కష్టంగా ఉందనే వారు .మంచి హాస్యప్రియత్వం తో ఎప్పుడూ నోట్లో క్రేన్ వక్కపొడితో ఉండేవారు .ఆయనతో మాట్లాడటం సరదా గా ఉండేది నాకు సీనియర్ . ఆయన అడ్డాడ ,అడ్డాడలో పనిచేస్తున్న వీర0 కిలాకు నేటివ్ రామారావుగారు  నేనూ ముగ్గురం ట్రయాంగిల్ లింక్ తో రిక్వెస్ట్ పెట్టుకొని  ట్రాన్స్ఫర్ అవుదామని ఒక సారి ఆలోచన వచ్చింది .అప్పటికి రెడ్డిగారికి రెండేళ్లు మాత్రమే ఉంది రిటైర్ అవటానికి .కనుక ఆయన ఈలోగా బదిలీ ఎందుకు  కాటూరులోనే హాయిగా రిటైరవుతాన్న అభి ప్రాయం చెప్పారు .కనుక ఇక కుదరదు అనుకొన్నాను .    ఆగస్టు మొదటివారం లో ఒక ఆదివారం రోజు ఉదయమే రామారావు గారు మాఇంటికి వచ్చి మేమిద్దరం మ్యూచువల్ పెట్టుకొని తాను  మేడూరుకు  నేను అద్దాడకూ బదిలీ అవుదాం ఇష్టమేనా అని అడిగారు .వెదక బోయిన తీగ కాలికే తగిలినట్లయింది .అంతే ఇక ఆలోచించకుండా సరేనని ,బదిలీ అయ్యేదాకా ఎవరికీ తెలియరాదని అత్యంత సీక్రెసీ మెయింటేన్ చేయాలని  ఈ బదిలీ నేనేమీ ప్రయత్నం చేయనని ఎవరినీ కలవనని రూపాయి కూడా చేతి చమురు వదిలించుకోనని  అన్నీ ఆయనే చేయించి ఆర్డర్ తెస్తే ఓకే అనీ చెప్పాను .అన్ని హామీలు అయ్యాక రిక్వెస్ట్ మ్యూచువల్ లెటర్ ఇచ్చాను . మేడూరు వచ్చి ఏడాదిపైన మూడు నెలలే అయింది మళ్ళీ నన్ను మార్చరుఅని లోపల ఉంది .కానీ కొ0డకు వెంట్రకకట్టాం కదా  .అయితే మంచిది అవకపోయినా మంచిదే .
  రామారావు కు జిల్లాపరిషత్ లో పలుకుబడి ఉపయోగించి మా ఇద్దరి మ్యూచువల్ ట్రాన్స్ ఫార్ ఆర్డర్ వారం రోజుల్లో వచ్చేట్లు చేశాడు . ఈ వార్త తెలిసి స్కూల్ స్టాఫ్ గగ్గోలు పెట్టింది . అంతాబాగానే ఉందిగా ఇన్ని మంచి పనులు చేసి అందరిచేతా ప్రశ0సలు పొంది ఇప్పుడు ఎవరికీ కనీసం రామమోహనరావుగారి అబ్బాయికి గారికి కూడా చెప్పకుండా వెళ్లి పోవటం ఏమిటి అన్నారు .సర్పంచ్ గారికి రామారావు గారు రావటం ఇష్టం లేదు .మీరుఊ  అంటే  నిమిషాలమీద ఆర్డర్ కాన్సిల్ చేయిస్తారు అన్నారు . ఆయన వచ్చి ఆ మాటే అన్నారు. నేను శాంతంగా ”రామారావు మేడూరుకు దగ్గర వాడు .మీ అందరికి పరిచర్యమున్నవాడు . అడ్డాడలో  ఐదారేళ్లు  పనిచేసి రోజూ  ప్రయాణం చేయలేక నన్ను అడిగితె నాకు మేడూరైనా అడ్డాడ అయినా ఒక్కటేకదా ఆయనకు కొంత ఉపశమనం కదా అని ఒప్పుకున్నాను” అని తప్పుకున్నాను . ఆర్డర్ వచ్చిన మర్నాడు సాయంత్రమే వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు .అందరూ ఆధారంగా మాట్లాడారు నా గురించి . ఇక గుడ్ బై చెప్పి వచ్చేశాను . ఇది ఆగస్టు 13 వ తేదీ అనిగుర్తు . జాయింగ్ టైం రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కు ఉండదు  .కనుక వెంటనే  అడ్డాడ లో మర్నాడు  ఉదయమే చేరాలి . సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మా ఇంట్లో కూడా ఎవరికీ తెలియదు .  పామర్రులో సైన్స్  మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలకు అద్దాడకు ఇన్విజిలేటర్ గా వెళ్లాను .శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారు హెడ్ మాస్టారు .మంచి బిల్డింగులు లాబ్ ,ఆటస్థలం చిన్న స్కూలు . అంతకు మించి నాకు దాని గురించి తెలీదు .హెడ్మాస్టారు చాలా క్రమశిక్షణతో పరీక్షలు నిర్వహించటం బాగా గుర్తు .స్టాఫ్ ఎవరెవరున్నారో  కూడా తెలీదు .అలాంటి స్కూల్ లో చేరబోతున్నానన్నమాట . .ఏమైతే నేమి గుడివాడ డివిజన్ స్కూల్ లో పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది    ఇది నా రెండవ మ్యూచువల్ ట్రాన్స్ ఫర్  .ఒకసారి అనుకోకుండా ఉయ్యూరునుంచి గన్నవరం హై స్కూల్ కు దసరా సెలవల్లో మార్చారు .మాంచి వరదల భీభత్సం .బుడమేరుపొంగి బస్సులు నడవటం లేదు .  బెజవాడ వెళ్లి అక్కడినుంచి గన్నవరం వెళ్లి జాయినయ్యాను .ఒకవారం పని చేశాక నాకు ముందుపనిచేసిన కృష్ణ పామర్రు వెళ్లి ఉండలేక రిక్వెస్ట్ మ్యూచువల్ అడిగితె ఇచ్చా నేను పామర్రుకు ఆత ను గన్నవరానికి వెళ్లాం .అప్పుడూ ప్రయత్నమంతా కృష్ణదే .  దసరా సెలవల తర్వాత గట్టిగా పది రోజులు కూడా గన్నవరం లో పని చేయకుండానే నాకిష్టమైన పామర్రు వచ్చాను .     

             సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42

 మల్లినాథుని స్వీయ రచనలు -1

మహా వ్యాఖ్యాన కర్త ఒక్కోసారి మహాకవిగా మారిపోతుండటం అరుదైన విషయమని పిస్తుంది . -వైశ్య వంశ సుధాకరం 2-రఘువీర చరిత0 3-ఉదార కావ్యం 4-భక్తి రహస్యం 5-నక్షత్ర పాతా ధ్యాయం  అనే అయిదు మల్లినాథ సూరి రచనలు లోకం లో ప్రసిద్ధి చెందాయి . కనుక విమర్శనా విశ్లేషణ వ్యాఖ్యానాలతో అగ్రభాగాన ఉన్న మల్లినాథుడు కవిగా కూడా సమున్నత స్థానం లో ఉన్నాడని తెలుస్తుంది ఈ ఐదింటిలో మొదటి రెండు మాత్రమే లభ్యమౌతున్నాయి .ఈ రెండిటిపై  సంక్షిప్తంగా విశేషాలు తెలుసుకొందాం

     వైశ్య వంశ సుధాకరం
కాంచీపురం లో వైశ్యులకు  , వ్యాపారులకు మధ్య జరిగిన వివాదం  పరిష్కరించటానికి తన తీర్పుగా మల్లినాథ సూరి ఈ కావ్యం రాశాడు .ఈ వివాదం 1426 లో రెండవ ప్రౌఢ దేవరాయలు రాజ్య పాలన చేస్తున్న సమయం లో వచ్చింది . రాజు మల్లినాథుని ఈ సమస్యను పరిష్కరించమని కోరగా మల్లినాథుడు ఈకావ్యం రాసి తీర్పు ప్రకటించాడు కనుక మల్లినాధునికాలం దీని ఆధారంగా 1430 గా భావించారు .దురదృష్టవశాత్తు ఈ కావ్యం మొత్తంలో అతి కొద్దిభాగమే వ్రాత ప్రతిగా లభ్యమైంది .అది సరళ సంస్కృత వచనం లో తెలుగు వచనం కోవలో  రాయబడిఉంది  .”చాతుర్వర్ణ నిర్ణయా నామ దశమోధ్యాయహ్ ” అందులోని ముఖ్య సారాంశాన్ని తెలుసుకొందాం .
  ఇందులో మల్లినాథుడు వైశ్య శబ్దానికి పర్యాయపదాలు చెప్పాడు అవి నాగర ,ఉరుజ ,త్రీయ ,కోమటి . ఆయన ఉద్దేశ్యం ప్రకారం వాణి ,కోమటి వాళ్ళు వర్ణ సంక్రమణం వలన పుట్టినవారు .కనుక వాళ్ళు అన్ని నగర పట్టణాలలో వస్తువులను అమ్మటానికి అర్హత ,హక్కు కలవాళ్ళు  అమరకోశం నుంచి కొన్ని ప్రకారణాలను ఉదహరిస్తూ నాలుగు వర్ణాలవారి స్వాభావ లక్షణాలను తెలిపాడు .వైశ్య అనే పద శబ్దోత్పత్తిప్రకారం వైజాతి అంటే ద్విజాతి ,అని అర్ధం చెప్పాడు –”అత  ఏవ విజాతిత్వా స్థాపనాత్ అమరసింహా క్తా వివర్ణత్వ స్థాపనం చ ఉపపద్యతా ఏవ -తదాచ శాసనోక్త విజాతీయ శుద్ధ కన్యాయాం జనితోభయ జాతి వంశ్యహ్ వైశ్యోక్తం  విజాతీయహ్ -అమర సింహోక్త వివరణా పృథగ్ జానో వైజాతిరితిసిద్ధం ” (వైశ్య వర్ణస్య సుధాకరహ్ )   కోమటి వారు రెండు వర్ణాల సాంకర్యం వలన పుట్టారుకనుక ద్విజాతి అని పిలువబడ్డారని అందుకే వారిలో  భేదం ఏర్పడిందని చెప్పాడు.  కనుక వైజాతిఅనేది  వైశ్యాతి అయిందని అమరసింహుని అభిప్రాయం అన్నాడు –  ”ద్వై గాతి రితి జాతిద్వయ సాంకర్య  సంభవేన వైజాతి కోమటీనాం  వంశ వైశ్యోక్త  విజాతీయత్వ స్థాపనం శాసనోక్త భేదగలం స్థాపన ”
  వైశ్య ,నాగర ,వణిక,పదాలమధ్య  ఉన్న అర్ధం లో ఏకత్వాన్ని అమరకోశంలోని అనేక ప్రకారణాల నాధారంగా మల్లినాథుడు సాధించి  చెప్పాడు . మరొక విషయమూ తెలియ జేశాడు .సూటిగా చూడబడిన వస్తువు యొక్క జ్ఞాపకం, దాన్ని పరోక్షంగా జ్ఞాపకమని చెప్పినదానికంటే బలవత్తరమైనది అనే సిద్ధాంతాన్ని చాలా చక్కగా ఉపయోగించాడు  -”అనుమితి స్మృత్యపేక్షయా ప్రత్యక్ష క  స్మ్రుతి కృతే ప్రాబల్యమితి  న్యాయ సిద్ధం ”. మల్లినాథుని ఈ రచనలో సంస్కృతం తోబాటు  కొన్నిఅంటే 11,12,13 లతో బాటు 14 మొదటిభాగం  తెలుగు ప్రకారణాలుగా  కూడా ఉండటం విశేషం .మనుస్మృతి ,పద్మపురాణం  భాగవతం ,ధర్మపాల చరితం మరికొన్ని స్మృతులనుండి తన భావ స్థాపనకు బలంగా అవసరమైనవాటిని ఉటంకించాడు సూరి .
              రఘువీర చరిత మహాకావ్యం
రఘువీర చరితం అనే మహాకావ్యం రాసి మల్లినాథుడు తాను  వ్యాఖ్యాన చక్రవర్తిని మాత్రమేకాదు మహా కవిని అని రుజువు చేసుకొన్నాడు .సంస్కృత మహా కావ్యానికి ఉండవలసిన సర్వ లక్షణాలతో దీన్ని నిర్మించాడు .దీనికి మూలాధారం వాల్మీకి రామాయణమే ..ఈకావ్యం శ్రీరాముడుతండ్రికిచ్చిన మాటపై వనవాసం కోసం  దండకారణ్యం ప్రవేశించటం తో ప్రారంభమౌతుంది ..శ్రీరామ పట్టాభిషేకం తో పరిసమాప్త మౌతుంది .చివరలోపట్టాభిషేకానికి హాజరైన వారందరూ శ్రీరాముని నుండి వీడ్కోలు పొంది వెళ్ళటం ఉంది . ఈ కావ్యం 7 సర్గల కావ్యం ..మొత్తం 1 ,4,62 శ్లోకాలున్నాయి .మొదటి సర్గలో చల్లని మలయమారుతం వర్ణన ఉంది ఆశ్రమ జీవిత పవిత్రత సర్వత్రా గోచరి0చి అన్నింటిపై ప్రభావం చూపినట్లు అనిపిస్తుంది .అరణ్య ప్రవేశంలోనే విశ్వామిత్రుడు శ్రీరాముని దయ కారుణ్య  సహన శీలాదిఉత్తమ గుణాలను ,పరశురాముని గర్వ భంగాన్ని  ప్రస్తుతిస్తాడు  .రాముని ప్రతిధర్మ  కార్యం లో నీడలా లక్ష్మణుని కృత్యమూ ఉంటుంది -.అప్పుడు మహర్షి విశ్వామిత్రుడు శ్రీరాముని వీర విక్రమ శౌర్య పరాక్రమాలు లోకం లో ప్రతిస్థాపితమవ్వాలన్న ఆ కాంక్షను వ్యక్తం చేస్తాడు ..రాముని స్తుతించి అరణ్యవాసులైన తాపసుల పవిత్ర జీవనానికి యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా కొనసాగించటానికి ,వాళ్ళను ఆటంక పరచే రాక్షస ప్రమాదం నుండి రక్షించి  రాజుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చమని చెప్పాడు  ..సీతారాములు మునుముందుకు సాగుతూ ఉంటారు శరభంగ మహర్షి దర్శనం చేసి సుతీక్షణ ముని ఆశ్రమం చేరి ఆశీస్సులు అందుకొంటారు ఇక్కడ ఆశ్రమవర్ణనను మహాద్భుతంగా గొప్ప శ్లోకాలలో మల్లినాధకవి చేశాడు .సుతీక్షణమహర్షి రాముని  గుణగణాలను  కులక శ్లోకాలలో బహుధా ప్రశంసించాడు  రాముడు  సాధించాల్సిన లక్ష్యాలను   మహర్షి వివరంగా ఆదేశించి తెలియజేశాడు అవి బాధితుల యెడ దయ ,కారుణ్యం ,మంచిని కాపాడటం ,,దుష్టత్వాన్ని అంతమొందించటం  అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకాన్ని కాపాడటం ,యుద్ధాలలో విజయం సాధించటం . ఇక్ష్వాకు వంశ రాజుల వ్రతాలు అంటే నియమ నిబంధనలు పాటించమని బోధించాడు-”ఆర్తనుకమ్పా సాధూనాం రక్షణం ఖలనిగ్రహః -రణేషు విజయశ్చేతి  వ్రతాని నియతానివహ్ ”
  తర్వాతి మూడు కులక శ్లోకాలలో అరణ్య స్వాభావిక శోభను ,విశ్వామిత్రుడు క్షణాలలో నిర్మించిన సుందర ఆశ్రమ వర్ణన ఉంటుంది  ..అందరూకలిసి అగస్త్యమహర్షిని సందర్శిస్తారు .మహర్షి వీరి దక్షిణంవైపు ప్రయాణంలో కనిపించే పంచవటి మొదలైన వాటి గురించి వివరిస్తాడు ..దారిలో సంపాతి ని చూసి పంచవటి చేరుతారు . ఇక్కడి ప్రకృతి  అందానికి రాముడు పరవశుడౌతాడు .ఇక్కడ గలగలా పారే గోదావరి నది పులకింతలు పెడుతుంది .గోదావరీ తీరం లో సాయం వేళ గడపటం ఏ సర్గలో ఉంటుంది. కావ్య మర్యాద ననుసరించి అనేక వర్ణనలు చేశాడు కవి మల్లినాథ సూరి .సీతారాముల శృంగార వర్ణనా గొప్పగా చేశాడు .శూర్పణఖ రాకతో ఈ  సర్గ  సమాప్తమౌతుంది  .
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -103 మేడూరు ఉద్యోగం -4

నా దారి తీరు -103

                 మేడూరు ఉద్యోగం -4
రామ మోహనరావు గారి విగ్రహ ప్రతిష్ట
 వేసవి సెలవుల తర్వాత  బడులు తెరిచే నాటికి  శ్రీ యలమంచిలి రామ మోహనరావు గారి ఫైబర్ బస్ట్ విగ్రహం తయారైంది .మా వాళ్ళు వెళ్లి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు . నేనూ చూశాను .రావాల్సి నంత కవళికలు రాలేదని పించింది  నాకు అంతగా నచ్చలేదు . కానీ అంతకంటే సమయం లేదు .వారి కుటుంబ సభ్యులు కూడా పెదవి విరిచారని ఉయ్యూరయ్య ఉవాచ .ఇక చేసేదేమీ లేదు . ఆవిష్కరణ జూన్ చివరివారం లో ఆయన మరణించిన నాడు అని నిర్ణయించాం . తేదీ సరిగ్గా గుర్తులేదు .నేనూ స్టాఫ్ సెక్రెటరీ మరో ఇద్దరం కలిసి రుద్రపాక వెళ్లి జిల్లా పరిషత్ చై ర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారిని కలిసి ఆహ్వానించాం తప్పక వస్తామన్నారు .సంతోషంగా తిరిగి వచ్చి ఏర్పాట్ల పై దృష్టిపెట్టాం .విగ్రహానికి సుమారు 6 అడుగుల ఎత్తు  దిమ్మ కట్టించటం ,దానికి నగిషీల పని అంతా  ఉయ్యూరయ్య చూశాడు . పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చిన జ్ఞాపకం . తెలిసిన వారందరికీ ఆహ్వానపత్రాలు పంపాము మండలం లోని అన్ని పాఠశాలలకు ఆహ్వానాలు వెళ్లాయి ఇక్కడ పని చేసి రిటరైన వారికి  వేరొక చోట పని చేస్తున్నవారికి ఎవరినీ వదిలిపెట్టకుండా పూర్వపు టీచర్స్ అటెండెన్స్ ఆధారం గా పంపాము .దాదాపు నాలుగైదు వందల మంది వస్తారని లెక్కవేశాము సర్పంచులకు మండల ప్రెసిడెంట్ లకు కూడా వెళ్లాయి ఆహ్వానాలు . వీరందరికి సాయంత్రం రాగానే టిఫిన్ టీ  ఇవ్వటం రాత్రికి డిన్నర్ కూడా ఏర్పాటు చేసిన గుర్తు . స్కూల్ అలంకరణ అంతా డ్రాయింగ్ మాస్టర్ ప్రసాద్ చూశాడు వచ్చిన వారిని ఆహ్వానించటానికి నేనూ లెక్కల ప్రసాద్ డ్రిల్ మాష్టర్  సుబ్బారావు,లాబ్ అసిస్టెంట్ ప్రసాద్ ,ఉయ్యూరయ్య శంకరరావు లు చూసాం కమిటీలను ఏర్పరచి బాధ్యతలు అప్పగించాను ఎవరూ ఇందులో నా ప్రమేయం లేదే అనుకోకూడదని నా తలంపు .అందరూ ఇన్వాల్వ్ అయేట్లు ఏర్పాట్లు చేసాం
  ఆవిష్కరణ రోజు రానే వచ్చింది .చైర్మన్ గారు సమయానికే వచ్చారు . ఆహ్వానితులందరూ వచ్చారు రామమోహనరావు గారబ్బాయి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు .వారి బాబాయి కెసిపి రైతు పేరు గుర్తులేదు  ఆయనకూడా అతిధులు వేదిక నెక్కించాం వారి కుటుంబ సభ్యులనూ సగౌరవంగా ఇంటికి వెళ్లి అంతకు ముందే ఆహ్వానించాం .అందరి రాకతో విద్యార్థినీ విద్యార్థులతో ప్రాంగణం కళకళ లాడింది .విగ్రహానికి శాటిన్ కలర్ వస్త్రం తో ఆచ్చాదన (ముసుగు )విషయం డ్రాయింగ్ మాస్టారు తెరపాటు చేశాడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరింప జేయటం నా  సర్వీస్ లో ఇదే మొదటిది .ముసుగు వేయాలని డ్రాయింగ్ మాస్టర్ చెప్పేదాకా నాకు తెలియదు . అనేక మంది రిటైరైన హెడ్ మాస్టర్లు మేస్టార్లు ఆయన పై ఉన్న అభిమానంతో వచ్చారు .అందరినీ ఆహ్వానించి అల్పాహారాలు అందజేశాక సభ ప్రారంభించాం .
   చైర్మన్ గారి తో శ్రీ యలమంచిలి రామమోహనరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించామని కోరగా వచ్చి హర్ష ధ్వానాల మధ్య  ఆవిష్కరించారు కొబ్బరికాయ కొట్టి విగ్రహానికి హారతి పట్టారు కుటుంబ సభ్యులు కూడా వారి వెనుక నిలబడ్డారు . .నా జీవితం లో ఒక గొప్ప ఘనకార్యం చేశానని సంబర పడ్డాను
 చైర్మన్ కోటేశ్వరరావు గారు రామ మోహనరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించటం తన అ దృష్టం దీనికి పూనుకున్న పాఠ  శాల హెడ్ మాస్టారు అయన నాయకత్వం లో పని చేసిన ఉపాధ్యాయ బృందం అభినందనీయులు  అంటూ  తమకూ, రామ మోహనరావు గారికీ ఉన్న సుదీర్ఘ పరిచయాన్ని ఆయన నిస్వార్ధ జీవిత విశేషాలను ,త్యాగాలను పాఠశాల అభి వృద్ధికి గ్రామాభి వృద్ధికి వారి కృషినీ ప్రశంసిస్తూ వారి జీవితాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించారు , తరువాత నేను మాట్లాడుతూ ఆవిష్కరణ పూర్వా పరాలను స్టాఫ్ సహకారాన్ని గ్రామస్తుల అభిమానుల వదాన్యతను తెలియ జేశాను ఇతర ప్రముఖులు రిటైర్ హెడ్ మాస్టర్లు అభిమాన రాజకీయ నాయకులు తక్కువ సమయం లో వారి గొప్పతనాన్ని వివరించారు . సభ తర్వాత అతిధులకు భోజనాలు ఏర్పాటు జరిగింది .చైర్మన్ గారితో సహా అందరూ భోజనం చేసి వెళ్లినట్లు జ్ఞాపకం . ఆవిష్కరణ గ్రాండ్ సక్సెస్ .
   మేడూరు గ్రామకరణం శ్రీ కిండి  శేషగిరిరావు గారు నాకు ఇక్కడ పరిచయమైనా నాటి నుంచి అన్ని విషయాలలో సహాయకారిగా ఉన్నారు ఆయన ఉయ్యూరు షబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో దస్తావేజులు  రాసేవారుగా ప్రసిద్ధులు .ఊళ్ళో బ్రాహ్మణ సంఘ నాయకులు . ని చేతిలో డబ్బుతో  మంచిపనులు చాలా ఖర్చు చేసేవారు స్కూల్ ఫంక్షన్ లకు పిలిస్తే ఏదో ఒక రూపం లో విద్యార్థులకు సాయం చేసేవారు .పెద్ద ఆస్తిపరులేమీ కాదు ఎప్పుడూ తెల్ల ఖద్దరుపైజమా లాల్చీ తో   నల్లగా పొడుగ్గా భారీగా నుదుట యెర్ర కుంకుమ బొట్టుతో  నవ్వుతూ కనిపించేవారు .కార్తీకమాసం లో మామిడి తోటలో కార్తీక వనభోజనం ఏర్పాటు చేయమని స్టాఫ్ సెక్రెటరీకి తెలుగు శర్మగారికీ చెప్పగా బాగా ఏర్పాటు చేశారు .ఒక ఆదివారం జరిపాము .తర్వాత శేషగిరిరావు గారు ఏర్పాటు చేసిదానికి  బ్రాహ్మణ మేష్టర్లను ఊరిలోని బ్రాహ్మణులను పిలిచి వనసమారాధన చేస్తే ఉయ్యూరునుంచి వచ్చి పాల్గొన్నా .కానీ వీళ్లంతా పేకాటతో కాలక్షేపం చేయటం నాకు అస్సలు నచ్చలేదు . ఉయ్యూరులో మేము  విష్ణ్వాలయం లో జరిపే బ్రాహ్మణ సంఘ వన భోజనానికి శేషగిరిరావు గారు కూడా వచ్చేవారు .ఆయన తమ్ముడు ఉయ్యూరులో పని చేసేవాడు . రావుగారి భార్య మండలం లో టీచర్ .ఇల్లు పురాతన  మట్టి గోడల మండువా పెంకుటిల్లు .మా ఇంట్లోలాగానే ఎప్పుడు కూలి పోతుందో అనిపించేది .ఒకటి రెండుసార్లు  వీరింట భోజనం చేశా మంచి ఆతిధ్యమిచ్చేవారు .. నేను బదిలీ అయి ఇక్కడినుంచి వెళ్ళిపోయినా ప్రతికార్తీక వనభోజనానికి పిలిచేవారు రెండువందల రూపాయలు ఇచ్చేవాడిని . మహా పెద్దమనిషి .మర్యాదస్తులు .అంతకంటే మేడూరులో నాకెవరూ పరిచయం కాలేదు .రిటరైన ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ ప్రతి నవంబర్ లో ట్రెజరీలో ఇవ్వాలి వాళ్ళు బతికి ఉన్నట్లు గెజిటెడ్ ఆఫిసర్ సర్టిఫై చేయాలి అందుకని చాలామంది వచ్చి సంతకం పెట్టించుకునేవారు  శేషగిరిరావుగారి అమ్మాయి తమ్ముదురామారావు గారి కూతురు ఉయ్యూరు కాలేజీలో చదివేవారు .ఆతర్వాత పదేళ్లకు రామారావుగారు చనిపోయారు
      విగ్రహావిష్కరణ అవగానే బాధ్యతలు అప్పగించిన వారిని లెక్కలు పూర్తి చేసి రెడీగా ఉంచమని  స్టాఫ్ మీటింగ్ లో లెక్కలు చెప్పి అందరి సంతకాలు తీసుకోవాలని చెప్పాను .ఇదిగో అంటూ ఆలస్యం చేశారు .డబ్బు విషయం లో నేను అలసత్వాన్ని సహించను .కనుక ఒక రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టి ఆలోపల లెక్క అప్పగించాలని ఒత్తిడి తెచ్చాను .వాళ్లకు మింగుడు పడలేదు .లెక్కలెందుకండి అందరికీ తెలిసిందేకదా అన్నారు అదేమీ కుదరదు అణా  పైసలతో సహా యెంత వసూలైంది దేనికి ఎంత ఖర్చయింది పూర్తి వివరాలు చెప్పాల్సిందే అన్నాను .కొందరు గొణిగారు .ఎవరేమనుకున్నా నా పద్ధతి నాదే  దీనికి తిరుగు లేదన్నాను .అనుకొన్న రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టి వాళ్ళతో లెక్కలు రాయించి అందరికి చెప్పించాను . ఒకటి రెండు వేలు మిగిలినాజ్ఞాపకం .దీన్నేమి చేయాలని అడిగాను అందరూ కామన్  గుడ్ ఫండ్ కు జమ చేయమని సలహా చెప్పారు .అలాగే చేసాం అందరితో  జమాఖర్చుల పై సంతకాలు పెట్టించాను .ఇది అగ్రనాయకులు నచ్చలేదని భోగట్టా .నేను దేనికీ భయపడను .ఈ ఊరుకాకపోతే మరో ఊరు .నా కాళ్ళు ఎప్పుడూ చెప్పుల్లోనే ఉంటాయి .
  అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయాలి ఇదివరకు రాసిందే  ఇది . నేను దీనికి ముందు మైలవరం దగ్గర చిలుకూరివారి గూడెం (పుల్లూరు )హై స్కూల్ లో పని చేస్తుండగా అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ వి హనుమంతరావు గారి బామ్మర్ది హైదరాబాద్ లో భారత్ డైనమిక్ లిమిటెడ్ లో  కెమిస్ట్ గా పని చేస్తున్న మా తమ్ముడు మోహన్ కు అటెండర్ గా ఉండేవాడు .అతడు ఎప్పుడూ మా వాడిని సార్ మీ కేదైనా సహాయం కా వాలంటే మా బావ తో చేయిస్తాననేవాడట .ఒకసారి మావాడు నీకు ట్రాన్స్ ఫర్ కావాలంటే చెప్పు హనుమంతరావు తో చేయిస్తానన్నాడు .పుల్లూరు నాకు బాగా నచ్చింది ఎన్నో మంచిపనులు అక్కడ చేశాను .కనుక అక్కడినుంచికదలా లని లేదుకమిటీ వాళ్లకూ నేనంటే  గౌరవం  ఆదరణ  ఉన్నాయి  కానీ మా వాడు అయిదారు సార్లు చెప్పాక సరే అన్నా .అనటం మావాడు వాడి అటెండర్ కు చెప్పటం వాడు హనుమంతరావు చెవిలో ఊదటం జరిగిపోయి నాకు తెలియ కుండానే హనుమంతరావు ఇచ్చిన బదిలీ రికమండేషన్ లెటర్ ఉయ్యూరు మా ఇంటికి రావటం జరిగి నేను దాన్నుచ్చుకుని చర్మన్ గారిని కలవటం .ఉయ్యూరుకాని చుట్టుపక్కలకాని వేయమని అడగటం ఉయ్యూరు తప్ప ఎక్కడా పని చేయరా మీరు అనినవ్వటం మేడూరుకు వారం లోపలే ట్రాన్స్ఫర్ అవటం జరిగిపోయాయి .కనుక ఒకరకంగా ఇష్టం తో వచ్చిన వాడినే .కానీ ముందే చెప్పినట్లు సంకుచితత్వం ఉన్న చోట ఉండలేను . అందుకని విగ్రహావిష్కరణ ఉదంతం మనసును కలత చెందించింది .సమయం కోసం ఎదురు చూస్తున్నాను
ఇక్కడ మరో విషయమూ చెప్పాలి .నా ముందు మేడూరులో పని చేసిన హెడ్ మాస్టర్ జి ఎస్ యెన్ చౌదరి నాకు బీఎడ్ ట్రెయింగ్ మేట్ హాస్టల్ మేట్ కూడా రాజమండ్రిలో .అంతకు ముందు అతని స్థానం లో నేను మానికొండకు సైన్స్ మాస్టర్ గా వెళ్ళా .ఘన చరిత్ర ఉన్నవాడు .  స్కూల్ ఫండ్స్ లో ఎక్యుములేటెడ్ ఫండ్ అని ఉంటుంది .దాని జోలికి ఎవరూ వెళ్లరాదని ఫండమెంటల్ రూల్ ఉంది .ఒక వేళ అందులో అత్యవసర సమయాల్లో తీసి ఖర్చు పెట్టాలంటే రిజల్యూ షన్  రాసి దాని కమిటీతో సంతకం చేయించి హెడ్ మాస్టర్ జిల్లాపరిషత్ కు పంపి అక్కడ ఆమోదం పొంది ఆర్డర్ వస్తేనే తీసి ఖర్చుపెట్టి మళ్ళీ దాన్ని నింపాలి .కానీ మా చౌదరి ఇవేమీ లెక్క చేయకుండా మొత్తం నాకిపారేశాడు  అదేదో సినిమాలో జూ ఏంటి ఆర్ బ్రహ్మానందం తో రమాప్రభ నయన తారలతో ”మా గురువుగారిని  కంప్లీట్ గా నాకి పారేశారన్నమాట ”అన్నట్లు నాకి పారేశాడు ..నేను వచ్చాక చూస్తే ఖాళీ .ఏమయ్యా ఉయ్యూరయ్యా ఇదేంటి అంటే ఆయన మీలాగా లెక్కలు మాతో రాయించేవాడుకాదు ఏమి జరిగిందో జరుగుతోందో మాకే  కాదు బ్రహ్మ దేవుడికి కూడా తెలీదు అని నెమ్మదిగా చెప్పాడు .కమిటీ వాళ్ళనూ లెక్క చేసేవాడుకాడట . కమ్మవారుగా ”మూసుకు ”కూర్చున్నారు రహస్యం బయట పడకూడదని .నా దగ్గర అప్పుడుడప్పుడు సర్పంచ్ వెళ్లగక్కేవాడు అతి రహస్యం బట్టబయలు అని సామెత .తర్వాత ఇక్కడినుంచి పునాదిపాడువెళ్లి అక్కడా అంతా  నాకేసి చివరికి సస్పెండయ్యి ,ఏదో కిరికిరి చేసి బయటపడ్డాడు . ఇక్కడ నన్ను అందరూ ఆదరిస్తున్నా ఏదో  కూపం లో ఉన్నట్లు అనిపించేది కనుక నేను ఇక్కడ నుంచి అంతా మంచిగా ఉన్నప్పుడే చల్లగా జారుకొంటే మంచిది అని నిర్ణయించుకున్నాను . వెయిటింగ్ ఫర్  ఆపార్ట్యూ నిటి .
     కానీ ఇక్కడ పిల్లలకు సైకిళ్ళు పార్కింగ్ చేయటానికి చోటు లేదు .ఎక్కువమంది చుట్టూ ప్రక్కల నుంచి సైకిళ్ళ మీద వస్తారు . దీనికి పరిష్కారం ఆలోచించాలనిపించింది స్టాఫ్ మీటింగ్ లో చెప్పాను .మంచి ఆలోచన అన్నారు మరి ఫండ్స్ ఎలా ?ఉయ్యూరు కె సిపి ,రోటరీ క్లబ్ లు ఇలాంటి కార్య క్రమాలు చేయటం లో ముందు ఉంది . నేను పెనమకూరు లో సైన్స్ మేస్టారుగా ఉన్నప్పుడు హెడ్మాస్టర్ తో చెప్పి అక్కడ బోరింగ్ వేసి రక్షిత నీటి సరఫరా అవసరం చెప్పి ,కె సిపి వాళ్ళ మా ,గ్రామస్తుల సహకారం తో చేయగలిగాము అది జ్ఞాపకమొచ్చి కెసిపి తొబాగా టచ్ ఉన్న రామమోహనరావు గారి తమ్ముడిని సంప్రదించి ,అందరం కలిసి ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారినీ మిగిలిన అధికారులను కలిసి మా ప్రపోజల్ ముందుపెట్టాం . వెంటనే అంగీకరించి వాళ్ళే ఖర్చు పెట్టి హెడ్మాస్టర్ గది  వెనకాల పడమటిభాగం లో గోడ వెంబడి రేకుల షెడ్ వేసి మా కోరిక తీర్చి వచ్చి ఆవిష్కరణ చేశారు . ఇదొక మైలురాయి నాకు ..అయినా వెళ్లాలనే కోరిక తగ్గలేదు
   సశేషం
      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-15-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41

 వరద రాజా ;;తార్కిక రక్షా ”కు మల్లినాథుని ”నిష్క0ట ”వ్యాఖ్య -2
  మల్లినాథుడు మరొక అభ్యంతరాన్ని లేవదీశాడు .దైవం అనంతత్వం యొక్క ప్రజ్ఞానం కాదు .-”తదుత్తాచ ప్రమాతృతా ”(తార్కిక రక్షా వృత్తి )అని చెప్పి ప్రజ్ఞానం యొక్క నిర్వచనం చెప్పాడు . ప్రజ్ఞాని  లక్షణం  ప్రజ్ఞానం కలిగివుండటమే .దీని అర్ధం ప్రజ్ఞాని ప్రజ్ఞానానికి సంబంధించిన సంపూర్ణ సరైన ప్రజ్ఞానం కలిగిఉండటమేకాని దానికి గుర్తుకాని సంస్థకాని ఏజెన్సీ కానీ కాదు .కనుక దైవం ప్రజ్ఞాని .కొందరు దైవం ప్రజ్ఞానం కాదని దీనికి కారణం తెలుసుకొన్నవాడు దాని పరికరం ఒకటి కాదు కనుక  వైరుధ్యం ఏర్పడుతుందికనుక అంటారు  .దీన్ని ముందే ఊహించిన మల్లినాథుడు ”మన దృక్పధం నిర్దుష్టమైన  సాక్ష్యం  రుజువు సరైన జ్ఞానం తో పరి వెస్టించి ఉంటుంది కానీ దాని ప్రతినిధిపై కాదు .కనుక చెప్పబడిన ప్రకారణలో వైవిధ్యమే లేదు ”అన్నాడు .-”తద యోగ్యవ్యవ చ్చేదః -ప్రామాణ్యం గౌతమేమతే ”  మల్లినాథుడు ప్రజ్ఞాని అయినవాడు తన  స్వ  విజ్ఞానం పైనే ఆధారపడతారు కనుక సరైన విజ్ఞాన ప్రజ్ఞానాలు అన్నీ ఆయనవే .
   ఈ రెండూ వైరుధ్యాలుకావు .ప్రపంచ జ్ఞాన విషయాలలో సరైన రుజువు ఏదో ఒక ప్రతినిధిని ఆశ్రయించే ఉంటుంది .ఆధారం లేదు .కనుక వైరుధ్యమే లేదు పై వాదాన్ని ఆమోదిస్తే దైవం యొక్క అనిశ్చిత్వం సరైన జ్ఞానానికి అయిదవ మార్గం లేక సాధనమవుతుంది .దైవం మన నాలుగు రకాల అవగాహనకు లలో చేర్చటానికి కుదరదు .కారణం దైవం ప్రత్యక్ష అవగాహనవలననే తెలియ దగినవాడు .దైవం సూటి సరైన విజ్ఞానం  తోనే వ్యాపించి ఉంటాడు అన్నాడు లాల్యే పండితుడు -God is included in the category of direct perception . He is permeated by the direct valid knowledge ;”.
  వరద రాజుని  మరొక వృత్తి ప్రకరణం లో ,చర్య లేక క్రియ అది కర్మ యొక్క చర్య వలన అందులో కోరిన ఫలితం లేకపోయినా రుజువు చేయబడుతుంది అన్నాడు .-”ఇచ్చాది  జన్య ఫలాంతరస్యా భావేపి కరణవ్యాపార విషయత్వ మాత్రేణ కర్మత్వోపపత్తే”
తెలుసుకొనే స్థితిలో చర్య ఉంటుంది .దీన్ని  సూచించే గుర్తు(ఇండికేటరి  మార్క్ ) ఏది ? క్రియ అనేదాని అర్ధం పూర్తిగా దాని ధాతువు మీదనే ఆధారపడితే అప్పుడు అనిశ్చితం ఏర్పడి అది సముచ్చయం వగైరాల పై తప్పనిసరిగా ఆధార పడాల్సి వస్తుంది .చర్య స్పందన పై ఆధారపడితే ,అలా చెప్పటానికి సాక్ష్యం ఉండదు ..ఈ ప్రకారణాలలో మల్లినాథుని గతితార్కిక తర్క ప్రతిభా  సర్వస్వము, నైపుణ్యం విశ్వ రూప సందర్శనమై భాసించింది .ఈ వ్యాఖ్యానం లో మల్లినాథుడు ఇతరుల తప్పుడు  

గుర్తింపు ,పోలికలపై చాలా అసహనం ప్రదర్శించాడు .-”అయమప్యేకః కిరణావళీ గ్రంథ ఆత్మా ప్రకరణాస్య ఇతి కైశిచ్చ దుత్తుంగ తుండే రాఖ్యాతం చ తదవ్యాకరణా పరిజ్ఞాన వంచనా సాహస విలాస ఏవే త్యాస్తం  -ఇంద్రియాలింగాది జ్ఞాన కరణా వ్యాపార విషయత్వమేవ  తత్ఫల జ్ఞాన కర్మత్వా మిత్యర్ధహ్ ”    మల్లినాథుడు ప్రజ్ఞాన0  యొక్క
 కారణం ,దానిఫలితం  భావం దాని చిహ్నం ఒకటే అయినట్లుగా  ఒకటేఅవుతుంది అని భావించాడు .సరాసరి భావం లేక జ్ఞానం ను విస్మరి0చైనా దానితాలూకు చిహ్నం మిగిలే ఉంటుంది అని ఎవరైనా వాదించవచ్చు .
  మల్లినాథుడు వెళ్ళటం అనే పని ఒక గ్రామానికి చేరటానికి  ఫలితం అంటాడు సూరి . ఇచ్చిన ఉదాహరణలో ఫలితలోపం లేదు .అది జ్ఞానం, చర్యయొక్క స్థితి  దాని అర్ధం ధాతుజన్యమా?మొదటి ప్రత్యామ్నాయం లో రూపం ,ఆసాధన.విజ్ఞానం ఎన్నటికీ చర్య కానేకాదు  అడి రూపానికున్న ఒక గుణం లేక లక్షణం  -జ్ఞానం న క్రియా  గుణత్వాత్ రూప విదిత్యర్ధః  ”
 అది గుణం అనటానికి సూరి కారణం చెప్పాడు .దాని ఉనికి అశక్తత లేక నిరసన .మిగతాది అంతా దాని చర్యపై అసక్తత వగైరా .విజ్ఞానం గుణం లేక లక్షణం .ఎందుకంటె అదే ఫలితంకనుక అది అంతర్గతం గా అనంత విషయం తో సంతోషం ఆనందం లాగా  సంబంధం కలిగి ఉంటుంది . రెండవ ప్రత్యామ్నాయంగా స్పందన విషయం లో అతిక్ట్రమణ (ట్రాన్స్ గ్రేస్షన్  )లేక దుర్వినియోగం ఉన్నది .ఈ సందర్భం లో వరద రాజు ఉదయన రచన నుంచి ఒకదాన్ని ఉదహరించారు -”అనేకాన్యా దసిదేవీ —– ”(తార్కిక రక్షా )
  ఈ చిన్న వ్యాఖ్యాన గ్రంధం లో మల్లినాథుడు న్యాయ శాస్త్ర కోవిదులైన అనేక కవుల రచనలను ఉదహరించారు .అంటే ఎంతటి విస్తృత పరిశీలనం చేసి తార్కిక రక్షా కు నిష్క0టక  వ్యాఖ్య రాశాడో తెలుస్తుంది .కొన్నిటిని మాత్రం తెలుసుకొందాం –
1 అక్ష చరణాః 2-అక్షపాదః 3-అమర 4-ఆచార్య 5-ఉదయనుడు 6-కణాదుడు 7-కిరణావళికారుడు 8-ఉదయణాచార్యుడు 9-కోచిత్ 100-గురు 11-గురుమత0 12-చార్వాక 13 నైయాయిక 14-న్యాయ చార్య 15-పక్షిలా 16-పీలుపాక వాది17-ప్రభాకర 18-బుద్ధ 19-బౌద్ధ 20-భట్టపాద 21- భాట్ట 22-భాష్యకార 23-భూషణ 24-భూషా పీయ 25-మీమాంసకులు 26-మను 27-కాచస్పతి 28-వాచస్పత్య పర్య 29-వృత్తిక కారులు 30-వైశేషికాదేశీ 31-శబరుడు 32-వృద్ధ 33-శాక్య 34-శాబ్దిక 35-సాండా ఖ్య 36-గౌతమ 37-సూత్రకార మొదలైన 40 తర్క  న్యాయ శాస్త్ర గ్రంధాలను మల్లినాథుడు అవలోడనం చేసి ,సార   సంగ్రహం చేసి చిన్నపామైనా పెద్దకర్రతో కొట్టినట్లు విపుల వ్యాఖ్యానం రాశాడు ఆ మనీషకు జేజేలు  .
  ఇంతటితో మల్లినాథుని వ్యాఖ్యానాలకు సమాప్తిపలికి తర్వాత ఆయన స్వ0త     రచనల ను  వాటి వైశిష్ట్యాలను తెలుసుకొందాం .
   సశేషం
    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్

షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్

Inline image 1  Inline image 2

49 NERS                                       BONNIE E CONE

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ వారం

వీక్లీ  అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్  వారం

                  8-5-17నుండి 14-5-17 వరకు
 ఈనెల 6 వ తేదీకి అమెరికావచ్చి నెల , 7 వ తేదీకి షార్లెట్ వచ్చి నెలా అయింది . 8 వ తేదీ సోమవారం ఫిష్ బుక్ లో పద్మశ్రీ పోతుకూచి సాంబశివరావు గారు అంతకు ముందు రోజు డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు పలకరించారు .మైనేని గారుపంపిన వెనిగళ్ల కోమలగారి అనువాద రచన ”కాళరాత్రి ”చేరింది ..రెండుపూటలా నడక .సాయంత్రం మా అమ్మాయి ఆఫీసు నుంచి వచ్చేసరికి భోజనాలు చేసి సిద్ధంగా ఉంటె” బలి” కి తీసుకు వెళ్ళింది హాలు అరగంట ప్రయాణ దూరం .టికెట్ పెద్దవాళ్లకు 17, పిల్లలకు 11 డాలర్లు .మొత్తం 75 బొక్క .నాకు ఒక్క అంగుళం కూడా నచ్చలేదు .రొయ్యలమీసాల నాజర్ ను చూస్తే డోకు వచ్చింది .ప్రభాస్ డైలాగ్ పల్లెటూరి బైతు మాటలాగా చాలా రఫ్ గా ఉంది . బాగ్రౌండ్ సంగీతం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది .  సంగీతం పాటలూ అసలు నచ్చలేదు . రాణా  శెభాష్ అనిపించాడు . ఈ కధకు అన్నికోట్లు కుమ్మరించటం పరమ దండగ . దీనికంటే శాతకర్ణి వెయ్యి రె ట్లు ,పూర్వపు శోభన్ బాబు ”వీరాభిమన్యు ”పదివేల రేట్లు నయం సినిమా నుంచిరాగానే ఒక కవిత గీకాను  –”డబ్బు -టైము  -బుర్ర-మనసు -విశ్రాంతి -వినోదం -వివేకం -విచక్షణ -విజ్ఞానం -సెల్యులాయిడ్ ఇలా” బహు ”బలి-బాహు బలి . ఇది నా  అభిప్రాయం .చూసేవాళ్ళనీ కనకవర్షం కురిపించేవారినీ ఏమీ అనలేను .ఒక్కటి మాత్రం నిజం అసలు ఏమీ లేని కథను అంత భారీ ఖర్చుతో తీసి రెట్టింపు పైగా డబ్బు 15 00 కోట్లు పిండటం రాజమౌళి వ్యాపార దక్షతకు నిదర్శనం
  మనవళ్లు స్కూల్ ట్రిప్ లో మంగళవారం కొలంబియా వెళ్లి సాయంత్రానికి వచ్చారు . మధ్యాహ్నం ఏమీ తోచక ”మీ గొట్టం”-యూ ట్యూబ్ తిరగేస్తుంటే ఆకెళ్ళ రాసి డైరెక్ట్ చేసిన పద్యనాటకం ”అల్లసాని పెద్దన ”కనిపిస్తే పెట్టాను అద్భుతం అని పించింది .”బలికి బలైన” మనసు ఆనంద తాండవమే చేసింది మనసంతా ఆర్ద్రత తో నిండిపోయింది  పర్గెషన్ అంటారే అది జరిగి తేలికపడింది బుర్ర  హాయిగా ఊపిరి పీల్చుకున్నాను . తర్వాత ఆకెళ్ళ తో ఇంటర్వ్యూ చూశాను .చాలాహుందాగా ,నిజాయితీగా వినయం గా ఆత్మ విశ్వాసం గా చెప్పారాయన .బెజవాడ బుక్ ఎక్సిబిషన్ లో ఈ జనవరి 10 తేదీ సాయంత్రం రచయితలతో సమావేశం ఉందని తప్పక రమ్మని నాకు శ్రీ పూర్ణ చాంద్ ఫోన్ చేసి చెప్పగా వెళ్లాను .అక్కడే మొదటి సారిగా ఆకెళ్ళ ను చూశాను తనను గురించిన పరిచయం లో ఆయన బాగా తనను ఆవిష్కరించుకొన్నారు .తన కదా నవల నాటక సినీ సాహిత్య కృషిని 15 నిమిషాలలో చెప్పేశారు .నేనూ తర్వాత నా గురించి చెప్పాను . మా ఇద్దరితోపాటు మరో పాతిక మందికి మాట్లాడే అవకాశానిచ్చి ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ డి విజయభాస్కర్ బుక్ ఎక్సిబిషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ బాబ్జీ ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్య దర్శులు శ్రీ గుత్తికొండ  సుబ్బారావు డా జి వి పూర్ణ చ0ద్ మొదలైన పెద్దల సమక్షం లో సన్మానం చేశారు . ఇవన్నీ గుర్తుకు వచ్చాయి .
  కోమలగారు ఇంగిలీషు లో రాసుకున్న ”మై లైఫ్ ”పుస్తకాన్ని పంపిస్తున్నట్లు గోపాలకృష్ణ గారి నుంచి మెయిల్ వచ్చింది మర్నాడే అందింది . బుధవారం సాయంత్రం గుంటూరు కు చెందిన రిటైర్డ్ పశువుల డాక్టర్ శ్రీ తాళ్ళూరి వెంకట ,పుట్టపర్తి  నివాసి ,బిల్డర్ శ్రీ సూరపనేని నారాయణప్ప గార్లు ఇంటికి వచ్చారు శతకత్రయం ఇద్దరికీ ఇచ్చాను .తరచూ కలుసుకొందామనుకొన్నాం .
  గురువారం కిరణ్ ప్రభ  ఆకేళ్లతో  తో చేసిన ఇంటర్వ్యూ ఆమని ఇంటర్వ్యూ చూసాం .రమణ ,చరణ్ ,భవానిగారు మంకు శ్రీను గార్లతో ఫోన్ లో మాట్లాడాము
12-వ తేదీ శుక్రవారం మా పెద్దమనవడు చి సంకల్ప్ అంటే  మా పెద్దబ్బాయిశాస్త్రి కొడుకు ఎంఎస్ .కోర్స్ పూర్తయిన సందర్భంగా షార్లెట్ యూని వర్సిటీ  లో జరిగిన గ్రాడ్యుయేషన్ కు మేమిద్దరం మా అమ్మాయి వెళ్లాం . సుమారు 45 నిమిషాల ప్రయాణం .మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటకు ప్రారంభమైంది .ముందు  బాండ్  వాయిద్యం తర్వాత ఛాన్సలర్ ఫిలిప్ ఎల్ డూబోస్  ప్రసంగం ,తర్వాత బోర్డు ఆఫ్ ట్రస్టీ మాటలు ,దానివెనుక కొంతమంది ప్రముఖుల ఉపన్యాసాలు జరిగాయి ..హామిల్టన్  సెంటర్ హాల్ లో లో జరిగిన ఈ జరిమానికి వేలాది తలిదండ్రులు గాలరీలనిండా కూర్చుని నుంచొని వీక్షించారు వారందరి ఆనందం  వర్ణనాతీతము .ముందుగా డాక్టరేట్ లకు మెడలో పతకంవేసి  సర్టిఫికెట్ ఇచ్చారు . ఆతర్వాత ఏం ఎస్ వాళ్లకు వరుసగా షేక్ హాండ్ లతో సరిపుచ్చారు .ఆతర్వాత బాచెలర్స్ కు .ఇదంతా రెండుంబావు గంటలలో అత్యంత క్రమశిక్షణతో వేడుకగా జరిగింది ..మా మనవడు సంకల్ప్ ”డేటా సైన్స్ అండ్ బిజినెస్ ఎనలిటిక్స్ ”లో ఏం ఎస్ చేశాడిక్కడ  మా అమ్మాయి వాళ్ళున్న షార్లెట్ లోని యూ ని వర్సిటీ ఆఫ్ షార్లెట్ లో సీట్ వస్తే డిసెంబరు26 న  2015   హైదరాబాద్ నుంచి  బయల్దేరి వచ్చి ఇందులో చేరాడు .సుమారు ఒకటిన్నర ఏడాది చదువుతో పూర్తయింది కోర్స్ చివరి పరీక్ష ఈ నెల 10 న జరిగింది .అదికూడా పాసయ్యాక సర్టిఫికెట్ ఇస్తారు .మనకు డిగ్రీ పాసయ్యాక  కాంవో కేషన్ జరిపి సర్టిఫికెట్ ఇవ్వటం అలవాటు    మనకు భిన్నం ఇది . ఏం ఎస్ ఇక్కడ చేసిన వారిలో ఆంద్ర ప్ప్రదేశ్ కు చెందినవాళ్లు మా వాడితో సహా దాదాపు 25 మంది ఉన్నారు
   మా అల్లుడు ఫ్లారిడాలోని నోవా యూని వర్సిటీ నుండి ఆన్ లైన్ ఏం ఎస్ చేశాడు   మేము మొదటిసారి2002 లో  అమెరికాకు టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ కు మా పెద్ద మనవడుఅంటే అమ్మాయి పెద్దకొడుకు శ్రీకేత్ పుట్టిన మూడు నెలలకు వచ్చాము అప్పుడు  మా అల్లుడి ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ కోసం మేమిద్దరం మా అమ్మాయి అల్లుడు మనవడు హూస్టన్ నుంచి ఫ్లయిట్ లో లాడర్ డేల్  కు వెళ్లి అక్కడ హోటల్ లో రూమ్ తీసుకొని మర్నాడు జరిగిన గ్రాడ్యుయేషన్ లో పాల్గొన్నాం .మియామీలో డాల్ఫీన్ సర్కస్ చూసాం . ఇలా అల్లుడి ,మనవాడి గ్రాడ్యుయేషన్ లలో పాల్గొనే అవకాశం వచ్చి ఆనందంగా ఉంది మాకు .
  .ఇప్పుడు ఈ యూని వర్సిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకొందాం . 1000 ఎకరాల విస్తీర్ణం లో ఇది వ్యాపించి ఉంది .అన్ని కోర్సులూ ఉన్నాయి రైల్వే స్టేషన్ కూడా కాంపస్ లోకి వచ్చింది .జూన్ లో ప్రారంభమవుతుంది .ఈ  వర్సిటీ   కి
’49 ERS”అనే నిక్ నేమ్  అనే మారు పేరుంది .దీనికి కారణం 1949 సంవత్సరం యొక్క ప్రాధాన్యమే .ఒకప్పుడు ఆఫ్ -కాంపస్ గా ప్రారంభమైన యూని  వర్సిటీ 1949  లో మూత పడి మరణం చెంది ఉండాల్సింది అప్పుడు” బొన్నే  కోన్ ”అనే వితరణ శీలి  ఆమె బృందమూకలిసి నార్త్ కరోలీనా లెజిస్లేచర్ ను షార్లెట్ లో ఉన్నత విద్యలకోసం శాశ్వత  వ్యవస్థ ఉండాలని చెప్పి ఒప్పించి దాని ఆమోదంతో షార్లెట్ కాలేజీని 1949 లో స్థాపించారు ..అంతేకాకుండా ఈ యూని  వర్సిటీ 49 నంబరు హైవే మీద ఉండటం మరో ప్రాముఖ్యమైన విషయం ..అంతే కాదు అమెరికాలోని నార్త్ కరోలీనాలోని షార్లెట్ లో బంగారు గనులు బాగా ఉన్నాయి .కాలిఫోర్నియాలో ”గోల్డ్ రష్”కంటే ముందే ఇక్కడ బంగారు గనుల త్రవ్వకం జరిగింది .ఇవన్నీ కలిసి వచ్చేట్లుగా యూని వర్సిటీ కాంపస్ లో” కాటో  కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్” , అండ్ కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్లాజ”ప్రాంగణం లో కూర్చుని పళ్లెం లో బంగారు రజను ను నీటితో శుద్ధి చేస్తున్నట్లున్న ఒక బంగారు గని కార్మికుని బ్రాన్జ్ విగ్రహాన్నిఏర్పాటు చేశారు .ఇది ఈ ప్రాంతం  గోల్డ్ మైనింగ్  సెంటర్ అనే చారిత్రిక సత్యాన్ని ,అదీకాక  ,1949 సంవత్సరం  ఈ యూనివర్సిటీ   అభివృద్ధిని నాటకీయంగా  మలుపు తిప్పిన సంవత్సరమని గుర్తు చేస్తుంది .ఆ స్టాథ్యూ లో జీవకళ ఉట్టిపడుతుంది . దీని ఫోటో కింద జమ చేశాను చూడండి  .యూని వర్సిటీ చరిత్రను ఇంతగా మలుపుతిప్పిన బొన్నీ  కోన్ అనే మహిళా మాణిక్యం గురించి తెలుసుకోకపోతే చరిత్ర క్షమించదు .
  బొన్నీ ఇ .కోన్ 1907 లో లో జన్మించింది  1946 నుంచి ఈ యూనివర్సిటీ సంస్థాపకురాలు.ఇక్కడే టీచర్ గా పని చేసి ,1947 లో షార్లెట్ సెంటర్ ఆఫ్ ది  యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలీనా కు డైరెక్టర్ అయి0ది . ఈ సంస్థ మూతపడి చనిపోయే స్థితిలో ఉంటె కోన్ లెజిస్లేచర్ ను ఒప్పించి 1949 లో షార్లెట్ కాలేజీ స్థాపనతో  జీవింపజేసి  దానికి ప్రెసిడెంట్ గా ఉన్నది . 1963 లో రాష్ట్ర ప్రభుత్వ ఆసరాతో  1963లో 4 ఏళ్ళు వికసించింది . 1965   లో కాలేజీని యూని వర్సిటీ స్థాయికి తీసుకురావటానికి తీవ్రం గా కృషి చేసి సఫలమనోరధురాలైంది కోన్ ..అప్పుడామె స్తూడెంట్ ఎఫైర్స్ కు వైస్ ఛాన్సలర్ గా సేవ ప్రారంభించి రిటైర్ అయ్యేదాకా ఉంది 8-3-2003 న బొన్నీ కోన్ శాశ్వతయోగా ఈ లోకానికి దూరమైంది .తనజీవితాన్ని త్యాగం చేసి ప్రాణం పోసి ప్రాణాధికంగా ఆరాధించిన  యూనివర్సిటీ కాంపస్ లో 2004 స్ప్రింగ్ లో కోన్  భౌతిక శరీరాన్ని ఖననం చేశారు . కానీ ఆమె ఆత్మ ఈ  యూని వర్సిటీ లో నే పరిభ్రమిస్తూ వివిధ సంక్షేమకార్యక్రమాలను అభి వృద్ధినీ చూస్తూ సంతృప్తి చెందుతూ ఉంటుందని భావిస్తారు
  ఈ యూనివర్సిటీ మొదటి చాన్సలర్ డీన్ డబ్ల్యు కొల్వర్డ్ . 1966 లో ఈ పదవిలో చేరి 12  ఏళ్ళు పనిచేసి ఇందులో అనేక కాలేజీలు హాస్టళ్లు ,కట్టించి గ్రాడ్యుయేట్ వర్క్ ప్రారంభించి దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేశాడు ఆయన కృషితోనే యూనివర్సిటీ రీసెర్చ్ పార్క్ ,యూనివర్సిటీ అర్బన్ ఇన్ ష్టి ట్యూట్ లు ఏర్పడి అర్బన్ వాతావరణమున్న షార్లెట్ విద్యార్థులకు బహుముఖాలుగా తోడ్పడ్డాయి ..ఈయన 1913 లో జన్మించి 2007 లో మరణించాడు.
  ప్రాస్తుతం ఛాన్సలర్ ఫిలిప్ ఎల్. డుబోయిస్
  శనివారం సాయంత్రం కాకినాడ వాసి  రిటైర్డ్ ఎస్ బి ఐ .ఉద్యోగి పుట్టపర్తి ప్రస్తుత నివాసి శ్రీ అప్పారావుగారు మా ఇంటికి వచ్చారు .ఆయన పూర్తిగా సత్యసాయి భక్తులు . అక్కడే సేవలో గడుపుతారు మన శతకాలిచ్చాను మా అమ్మాయికి బాగా పరిచయం  ఆయన్ను కారులో వారి అబ్బాయి ఇంట్లో దింపివచ్చాము . .మా మనవడు చి హర్షకు 20015 ఆగస్టు లో యాక్సిడెంట్ అయిందని తెలిసి మా అమ్మాయి ఉండ లేక ఆగలేక  ఆగమేఘాలమీద మర్నాడే  బాయల్దేరి ఇండియావచ్చి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి రాగానే ఆయన కాకినాడ నుంచి ఫోన్ చేశారట మా అమ్మాయికి .ఆయన మనసు మంచిది గొప్ప సాయి భక్తులు కనుక  సెంటిమెంట్ గా ఫీలయి మా హర్షకు ఏమీ కాదు గండ0  నుంచి బయట పడతాడు అని గట్టిగా నమ్మానని  చెప్పింది చెపుతుందిఎప్పుడూ .
  మా అమ్మాయి గొల్లపూడికాలం చూడమని చెబితే కొన్ని చూశా చాలా బాగా ఉన్నాయి .ఆయనలాగా విషయాన్ని  కరెంట్ టాపిక్  ను అంత అర్ధవంతంగా సుత్తిలేకుండా సూటిగా నిష్పక్షపాతంగా చెప్పే వాడు లేదని నా నమ్మకం ఆయన హావ భావాలు  ఊగటాలు స్ట్రెస్సులు ,ఊనికలు ఒత్తి చెప్పటాలు నాకు భలే ఇష్టం .ఆకెళ్ళ గొల్లపూడి గురించి నేను చూసినవి మైనేనిగారిని చూడమని రాస్తే చూసి చాలా ఎంజాయ్ చేశానని రాశారు . . రాత్రి చంద్ర మోహన్ ఇంటర్వ్యూ చూసాం నిష్పక్షపాతంగా చెప్పాడు .
  14 ఆదివారం ఉదయం మల్లినాథ 40 రాశా .మధ్యాహ్నం  సంగీత గురువు శ్రీ రామాచారి గారి ఇంటర్వ్యూ యూ ట్యూబ్ లో చూశా.అద్భుతం .ఆయన ఎంత ఉదారంగా స్వచ్చంద సేవ చేస్తున్నారో తెలిస్తే చలించి పోతాం అందరూ కూడాల్సిందే  మధ్యాహ్నం” కాళ రాత్రి ”చదివేశాను బాగుంది . ఇదొక్కటే ఈవారం చదివిన పుస్తకం ..మరిన్ని విషయాలు వచ్చే వీక్లీ  లో .
ఫోటోలు జత చేశాను చూడండి
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40

  తార్కిక రక్ష పై మల్లినాథుని ”నిష్క0టక ”వ్యాఖ్య -2
సాధన పై మల్లినాథుని వివరణ చాలా సమ్మతంగా ఉంది -”కిమ్ చ ఈశ్వర ప్రమయానిత్య సర్వార్ధ గోచరయా-ప్రమా వ్యాప్తేహ్ తన్నిరాశోనార్ధ వత్వం ద్రష్టవ్యం ”దేవుడు అనే బయటి వాడి జ్ఞానం ,ప్రతిదీ ఆయన విషయమే .ప్రమేయాలన్నీ ”ప్రమా” లో  వ్యాప్తి చెంది ఉన్నవే అన్నాడు మల్లినాథుడు ..ప్రమేయం నిర్వచనం విషయం లో అతి అనువర్తనం (అప్లికేషన్ )ను పరిహరించటానికి నిర్వచనం లో సాధన అనేపదం తప్పక ఉండాలి అన్నాడు  .ఇది సత్య సమర్ధనంగా ఆమోదయోగ్యం గా ఉన్నది .ఇదికాక మల్లినాథుడు మరింత ముందుకు వెళ్లి  మరొక తాజా చర్చను తెచ్చాడు ..ఇదీ చాలా ఆమోదయోగ్యంగానే ఉంది .-”ప్రమాణామావి సంవాదిజ్ఞానమర్ధం క్రియాస్తితిహ్ (తార్కిక రక్ష)   .వరద రాజు బౌద్ధుల అభిప్రాయాలను ముందుంచుతూ ,”అవిసంవాది ”  ని  అది అనుమాన ప్రమాణం తో సాధింపబడదు అని వ్యతిరేకించాడు ..బౌద్ధుల ఆలోచన ప్రకారం ప్రతిదీ అనిశ్చితంగా వికల్పమే ,అనుమితి కారణాలైన వాటితో సహా.వికల్పం అనేదితప్పనిసరిగా విషంవాది  అవుతుంది కనుక అనుమానం అనుకొనే ప్రశ్నే లేదు .ఈ  సందర్భం లో ల మల్లినాథుడు ”ఉదయనుడు”రాసిన దాన్ని   ఆధారంగా చూపించాడు -”కిమ్ చేత్యం ప్రలపతో బౌద్ధస్య మూర్ధని భగవతాపి -వృద్ధేన దుర్ధర్షే మహానయం వజ్రపాతః కృత ఇత్యాహ ”(తార్కిక రక్ష)ప్రభాకరుడు   చెప్పిన ప్రమాణం అనేది అనుభూతి అన్నదాన్ని వరద రాజు ఆక్షేపించారు .ఇందులో అసంగత్వం లేక అస్థిరత ఉందన్నాడు .వాళ్ళు వేద విజ్ఞానాన్నిచెల్లుబాటయ్యేది అని  అంగీకరించారుకాని  ప్రమాణ విషయం లో స్మృతిని దూరంగా పెట్టారు .ఇక్కడే మల్లినాథుని వ్యాఖ్య మహా ఆసక్తికరంగా ఉంటుంది -తదే  తత్తర గాది రూఠస్య తురగావిస్మరణం యద్ వేదప్రమాణాన్య సాధనే ప్రవృత్తస్య మీమాంస గురో స్తస్మాద్ ఇతి ”.ఒక్కోసారి వరద రాజు కొన్నిటిని ఆమోదించాడు . ప్రత్యక్ష ,అనుమాన ,ఉపమాన ,శబ్ద, క్రమం ఏర్పరచటం లో సరైన తార్కిక సమర్ధన చేయలేక పోయాడు .కానీ మల్లినాథుడు వీటి వరుసక్రమాన్ని చాలా చక్కగా సమర్ధించి చూపాడు -”తత్ర సర్వ ప్రమాణోప జీవ్యత్వాత్ ప్రత్యక్షస్య ప్రాధామ్యం తదితర ప్రమాణో ప జీ వ్యత్వాత్ ప్రత్యక్ష నా0తర్దమనుమానస్య పృథక్ప్రమావ్యదాఠర్య సూచనార్ధ ముపమానస్య శబ్దాత్ ప్రాధామ్యే  పరిశేషా చ్ఛబ్ద స్యాంతే  నివేశ ఇతి ”(తార్కిక రక్ష )
  మల్లినాథుని మరికొన్ని వాదాలు తెలుసుకొందాం -మల్లినాథుడు”నను ఈశ్వరస్య కృతః ప్రమాణాని ”మొదలైన వాటిపై  మరొక ప్రశ్న లేవనెత్తి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు .దైవ0  సరైన జ్ఞాన పరివ్యాప్తుడు అని ఎలా చెప్పగలం ? అయన గురించిన జ్ఞానం ఉత్పత్తి కాదు ,కారణం అది ఫలితం  ప్రయోజనం కాదు ..కనుక జ్ఞాన పరివ్యాప్తుడుకాదు .ఈ విషయంపై వాదం లేవదీస్తూ రచయిత ప్రమాణం కు నిర్వచనం చెప్పాడు ”మితిహ్ సమ్యక్ పరీచ్ఛా త్తిరితి ” .అర్ధవంతమైన జ్ఞానం సరైన నిశ్చయం ..అది ఫలితం కాకపోయినా  దైవజ్ఞానము అనేది సరైన ఖచ్చితమైన  జ్ఞానమే కారణం అది ఖచ్చితమైన అనుభవం కనుక
   సశేషం
    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గొల్లపూడి

గొల్లపూడి

అమెరికా వచ్చి నెలదాటినా యూ ట్యూబ్ లో కామెడీ సీన్లు ,ఫన్   బకెట్ లు తప్ప పెద్దగా రాత్రిపూట చూసినవేవీ లేవు . ”బలి ”కి బలైన మర్నాడు ఫ్రస్ట్రేటెడ్  ఉమన్ చూస్తుండగా  ఒక్కసారిగా  దృష్టి  వేరేవాటిపై పడితే ఆకెళ్ళ రాసి దర్శకత్వం చేసిన ”అల్లసానిపెద్దన”పద్యనాటకం కంటబడి వెంటనే చూశా .చాలా అద్భుతమనిపించి ”బలి ” పాల బడిన నాకు గొప్ప రిలీఫ్ ఇచ్చింది  మనసు  ఆనంద  తాండవమే చేసింది .తర్వాత ఆకెళ్ళ తో ఇంటర్వ్యూ చూశా .ఆయనలో ఎంత నిజాయితీ నిక్కచ్చితనం ఉందో  అర్ధమయింది . ఆయన శ్రీనాధ నాటకం కోసం వెతికా దొరకలేదు . మొన్నరాత్రి మా అమ్మాయి గొల్లపూడి ఇంటర్వ్యూ చూశావా అని అడిగింది .చూడలేదన్నాను చూడమంది . ఉయ్యూరులో ఉండగా ఎప్పుడూ ఇలాంటి వాటి జోలికి పోలేదు .రాత  ,చదువు తో సరిపోయేది . మా అబ్బాయి రమణ గొల్లపూడి కాలం పెట్టి వినేవాడు ఏదో ఒకటి రెండు సార్లు అటూ ఇటూ  వెడుతూ విన్నానేమోకాని పెద్దగా దృష్టిపెట్టలేదు .
అయితే మారుతీరావు తో సుమారు ఏడెనిమిదేళ్లు గా పరిచయం ఉంది .ఆయన రచనలు నటన  నాకూ మా శ్రీమతికి బాగా ఇష్టం . ఆయన ”రోమన్ హాలిడే” కథా  సంపుటి నాకు పిచ్చపిచ్చగా నచ్చి సుమారు 15 ఏళ్ళక్రితం 45 పేజీల వ్యాసం రాశాను నాకోసమే . తర్వాత మద్రాస్ లో ఉండే మా బంధువు శ్రీ నోరి రామకృష్ణయ్య గారితో పరిచయం వలన ఫోన్ సంభాషణలవల్లా ఆయన మారుతీ రావు తనకు మార్కింగ్ వాక్ మేట్ అని రోజూ కలుస్తామని చెప్పేవారు .నేను  రాసిన ఈ వ్యాసాన్ని ఫోటోస్టాట్ తీసి రామకృష్ణయ్యగారికి పోస్ట్ లో పంపించి ఆయనకు నచ్చితే మారుతీ రావు కు ఇమ్మని రాశా .ఆయన  చదివి బాగా నచ్చిందని గొల్లపూడి ఇచ్చానని ఆయన చదివి చాలా సంతోషించాడని ఫోన్ లో చెప్పి , మారుతీరావ్ ఫోన్ చేసి నాతో మాట్లాడు తాడు అని చెప్పారు .అన్నట్లే ఒక రోజు ఉదయమే గొల్లపూడి ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా నాతో మా శ్రీమతితో మాట్లాడాడు . అందరికీ గర్వంగా చెప్పుకున్నాం .తర్వాత నేను ఆ స్క్రిప్ట్ ను  సరసభారతి బ్లాగ్ లో రాశా . ఆయన దాన్ని సి డి చేయించి పంపమంటే పంపాను .నా మెయిల్స్ కూడా పంపేవాడిని అప్పుడప్పుడు సమాధానం రాసేవాడు సరస భారతి పుస్తకాలు ప్రచురించటం ప్రారంభించాక రామ కృష్ణయ్యగారితో మరోకాపీ ని గొల్లపూడి ఇమ్మని నా సంతకం తో పంపేవాడిని ఆయన జాగ్రత్తగా అన్నీ అంద  జేసినట్లు ఫోన్ చేసేవారు .  తర్వాత రావు విశాఖ కు మకాం మార్చినట్లు కృష్ణయ్యగారు చెప్పారు అక్కడికే పుస్తకం ఆవిష్కరణ అవగానే పంపేవాడిని .
  బహుశా 2015 మార్చి లో ననుకొంటా మారుతీరావు ఒక సాయంత్రం ఫోన్ చేసి ”నిన్ననే మద్రాస్ లో   రామకృష్ణయ్య గారితో  మాట్లాడి ఇవాళ హైదరాబాద్ వచ్చాను ఎందుకో మీతో మాట్లాడాలని పించింది అందుకని చేశాను .అని పదినిమిషాలు ఆత్మీయంగా మాట్లాడారు . ఆ వారం లో జరిగిన సరసభారతి ఉగాది వేడుకలలో ఈ విషయం సభా ముఖంగా అందరికీ తెలియ జేసి గర్వపడ్డాను . కానీ నామనసులో ”మారుతీరావు కు  మనం ఇన్నిపుస్తకాలు ఆయన చదవాలని ఆత్మీయంగా పంపామే .ఆయన మర్యాదకైనా కనీసం ఒక్కటి కూడా తన  పుస్తకం నాకు పంపలేదే ”అని బాధ గా ఉండేది . ఇది పొసెసివ్ నెసో ,స్వార్థమో సంకచితభావమో ఆకాంక్షో  కోరికో ఆశో  అత్యాశో  చెప్పలేను . ఒక ఉగాదికి ఆయన్ను పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిధిగా ,ఉగాదిపురస్కార ప్రదానం తీసుకోవలసిందిగా ఫోన్ చేశా మెయిల్స్ కూడా రాశా .వస్తానని చెప్పారు .కానీ చివరికి కొత్త సినిమా ఒప్పుకున్నందువలన రాలేనని రాశారు . బెజవాడలో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు రచయితల సమావేశం లోనూ అంతకు ముందు ఒకటి రెండు సభల్లోనూ కలిశాను ఫోటోలు పంపమంటే పంపాను కూడా .
   కానీ సుమారు రెండేళ్లక్రితం వరకు ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారెవరో నాకు తెలియదు .ఒక రోజు కొరియర్ లో ఆరేడు పుస్తకాలు వారి నుంచి నాకు వచ్చాయి .వాటిలోని ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వారితో ”నా అడ్రస్ మీకు ఎలా దొరికింది నాకు ఇన్ని పుస్తకాలు ఎందుకు పంపారు ?”అని అడిగా సాహితీ ప్రియులెవరో  తెలుసుకోవటం నా కు ఇష్టం .మీ అడ్రస్ సంపాదించి పుస్తకాలు పంపాను చదివి అభిప్రాయం రాయండి ”అన్నారు .ఆ సౌజన్యానికి కరిగిపోయాయి వెంటనే చదివి ఫోన్ లో వారికి నా అభిప్రాయం తెలియజేసి సరసభారతి అప్పటిదాకా ప్రచురించిన పుస్తకాలన్నీ కొరియర్ లో పంపాను అందినట్లు ఫోన్ చేసి అభినందించారు .ఇలా మా ఇద్దరిమధ్యా ఫోన్ భాషణం కొనసాగింది అప్పటినుంచి నేనూ గీర్వాణకవుల కవితా గీర్వాణం రెండు భాగాలు కొలచల సీతారామయ్య గారిపై పుస్తకం వగైరాలు పంపాను .  సంస్కృత కవులపై నేను చేస్తున్న కృషిని మెచ్చుకొంటూ మాట్లాడారు . దానిపై ప్రముఖ విశాఖ సాహితీ పత్రిక”ప్రసన్నభారతి ” లో వ్యాసం కూడా రాశారు .న్యాయంగా ఆయన ముందు నావి హనుమంతుని ముందు  కుప్పి గంతులు ..అమెరికా వచ్చేముందు మార్చి 15 న నేనూ మా శ్రీమతి మనవడు చరణ్ విశాఖవెళ్లి డా శ్రీ రాచకొండ నరసింహ శర్మగారిని శ్రీమతిగారిని చూసి  సాయంత్రం వేదుల వారిని చూద్దామని అనుకొంటుండగా వారే ఫోన్ చేసి తప్పక రమ్మని చెప్పగా వెళ్లి సందర్శించాం . ఆయన మా ఇద్దర్నీ చూసి పులకించిపోయారు .మేము ఆదంపతులకు సన్మానం చేద్దామని నూతనవస్త్రాలు శాలువాలు తీసుకు వెడితే వారు ”మీరు మాఅతిధులు .ముందు మీకు మేము సన్మానం చేస్తాం .తర్వాతే మీరు ”అని నన్ను ఆపి తామిద్దరూ మా ఇద్దరికీ నూతనవస్త్రాలు శాలువా కప్పి సత్కారం చేసిన సంస్కారం వారిది .తర్వాత మేమూ చేసాం శాస్త్రిగారి టేబుల్ పై నా గీర్వాణం రెండుభాగాలు ముచ్చటైన అట్టలతో దర్శనమిచ్చాయి .వారు నాతో ”మీ పుస్తకాలలో విష్యం మీరు రాసిన తీరు బ్రహ్మానందంగా నచ్చాయి వాటిలో రోజుకు ఒకటైనా చదవకుండా ఉండలేక పోతున్నాను .అంత రీడబిలిటీ ఉంది మిగతావాళ్లూరాస్తే దీన్నే కీకారణ్యం చేసేవారు మీరు మహా గొప్పగా మనసుకు హత్తుకునేలా సరదాగా చదువుకోనివిషయం   తెలుసుకునేలా రీసెర్చ్ చేసేవారికిరిఫరెన్స్ పుస్తకాలుగా ఉన్నాయి మీ కృషి బహు  గొప్పది మీ రెండో పుస్తకం కోసం వేయికళ్లతో ఎదురు చూశా .అన్నారు .   అక్కడే విశాఖ సాహితీ సంస్థ నిర్వాహకులు శ్రీ ఏం ఎస్ ఆర్ ప్రసాద్ గారు ఇంకొకరు కలిశారు .  వీరుకూడా తమ ప్రచురణలు 6 పుస్తకాలు నాకు ఇచ్చారు .అందులో  శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రీ గారిపై శ్రీమతి చర్ల సుశీలమ్మగారిపై  పుస్తకం  ఆమె కుమార్తె నిడదవోలు మహిళాశ్రమం నడిపే చర్ల సరళ గారి  రచనలు ఉన్నాయి .శ్రీపాద ,సుశీలగార్లపై వెంటనే వ్యాసాలూ నెట్ లో రాశాను  నిడదవోలు ఆవిడతోఫాన్ చేసిమాట్లాడాను ఆమె  యెంతో  సంతోషించారు ఉయ్యూరు రావాలనికొరగా వస్తానన్నారు ఆమెకూ సరసభారతి పుస్తకాలు కొరియర్ లో పంపాను  ఇవన్నీ చూస్తుంటే మారుతీరావు నాకు పుస్తక0 ఒక్కటి కూడా పంపనందుకు మనసు  తొలిచేస్తున్నట్లుంది .. గతం గతః
  నిన్న మధ్యాహ్నం ” యూ ట్యూబ్ లో మారుతీ రావు కాలం పెట్టి విన్నా .ఈ పూటా విన్నా .అద్భుతం అనిపించాయి .బాలమురళి కృష్ణ సంగీత కచేరీ చేస్తూ ఎంత ఆనందిస్తూ మనల్ని ఆనందింప జేస్తారో మారుతీరావు కూడా అంతే ఫీలింగ్ తో ,హావభావాలతో చక్కని రిపిటీషన్ లతో ,నొక్కి చెప్పటం తో గత వర్తమాన భవిష్యత్తులు తరచటం లో  ఇంగ్లీష్  ను  కూడా అవసరమైన చోట వాడటం లో తెలుగులోకంటే ఇంగిలీషు లో ఇంకా బలంగా చెప్పటం లో తెలుగు భాషకు ప్రాణం పోయటం లో భారతీయ సంసంస్కృతికి పట్టం కట్టటం లో  పాశ్చాత్త్య  నాటకాల పోకడలను ఆదరణను వ్యక్తీకరించి మననాటకాలు వృద్ధి లోకి రావటానికి చేయాల్సిన ప్రణాళిక వివరణలో  పెద్దల యెడ విధేయతను వ్యక్తం చేయటం లో ,సమకాలీన రాజకీయ డొల్లతనాన్ని  ఏకి  పారేయటం లో నచ్చినదాన్ని నిష్పక్షపాతంగా  మెచ్చటం  లో తెలుగు కధకులను కధలను ఛానల్ ద్వారా వివరించి ప్రాణ ప్రతిష్ట చేయటం లో మారుతీ రావు కు సరిపోలిన వారు లేరు .కథ , నాటకం వ్యాసం విమర్శ నవల సినీ సంభాషణలు స్క్రీన్ ప్లే  నాటక రచన నటనా సినీనటన లలో ఆయన స్థాయి అందుకొనగలవారు లేరు . విషయవివరణలో ఆయన ముందుకూ వెనక్కూ వెడుతూ అతి సూటిగా శ్రోతల ప్రేక్షకుల గుండెలను తాకేట్లు చేసే స్వీయ  వ్యక్తిత్వం ప్రతిభా గొల్లపూడిది . ఆయన కాలం బ్రహ్మం గారి నేటి  కాల జ్ఞానం అని పిస్తుందినాకు .
   మా గోపాలకృష్ణగారికి ఈ కాలం ,ఆకెళ్ళ నాటకం ఇంట్రవ్యూ చూడమని  రాస్తే  చూసి పరమానంద భరితులయ్యానని రాశారు..
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39
   వరద రాజ విరచత తార్కిక రక్ష కు మల్లినాథుని ”నిష్కంటక ”వ్యాఖ్య -1
కవి, మహా వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి న్యాయ శాస్త్రం లోనూ అమోఘ పాండిత్యం ఉన్నవాడని తెలిస్తే మహదాశ్చర్యమేస్తుంది అన్నాడు లాల్యే పండితుడు .వ్యాకరణం మల్లినాథుని నాలుకపై నాట్యమే చేస్తుందని మనకు తెలుసు .ఇప్పడు ఆయన న్యాయ లేక తర్క శాస్త్ర పాండితీ గరిమను తరచి చూద్దాం .దీనిలో ఆయనప్రతిభ తార్కిక రక్ష పై రాసిన వ్యాఖ్యానం వలన స్పష్టమవుతుంది .దీన్ని రాసిన వాడు వరద రాజకవి .ఈ కవి 12  లేక 14 వశతాబ్ది మధ్యకాలం వాడు ..యితడు ఆంద్ర కవి అని ”హిస్టరీ ఆఫ్  సాంస్క్రిట్ లిటరేచర్ ”రాసిన విద్యాభూషణుడు పేర్కొన్నాడు .కొందరుమాత్రం కాశ్మీర దేశస్తుడు అన్నారు . ఏ  వాడైతేనేమి అతడు  తార్కిక రక్ష రాశాడనేది నిర్వివాదం . దీనికి ఆయనే ”సార సంగ్రహ ”అనే వ్యాఖ్యానమూ రాశాడు .ఈ రెండిటిపై మల్లినాథుడు ”నిష్క0టక ”అనే వ్యాఖ్యానం రచించాడు .   వరద రాజకవి భట్టోజి శిష్యుడు .భట్టోజి రాసిన ”సిద్ధాంత కౌముది ;;ని మధ్య  సిద్ధాంత కౌముది ,లఘు సిదాంత కౌముది అనే రెండు సంక్షిప్త గ్రంధాలుగా చేశాడు .”వ్యవహార నిర్ణయం” అనేదికూడా రాశాడని అంటారు . 18 వ శతాబ్దికి చెందిన మరో వరద రాజకవి ”వ్యవహార మాల ”రాశాడని కానే పండితుడు చెప్పాడు .
   మల్లినాథుని నిష్కంటక లో 1- వర్గాలు 2-చెల్లుబాటయ్యే తార్కికం 3-8 నిర్వచనాలతో సూటి అవగాహన లేక జ్ఞానం అని మూడు భాగాలున్నాయి ..మల్లినాధుడు అనుమాన ప్రమాణం లేక అనుమితి ,ఉపాధి లను పూర్తిగా చర్చించాడు భట్ట వాదాలకు చెందిన వాటిని మల్లినాథుడు త్రోసిపుచ్చాడు ..ప్రభాకరుని ”అభావాన్ని కూడా తిరస్కరించాడు .న్యాయ సూత్రాలు రాసిన గౌతముని మార్గం లో సూరి ప్రయాణించాడు దానిపైనే ఆధారపడ్డాడు .”హేత్వాభాస ”వంటి కొన్ని అవాస్తవాలు లేక భ్రమలను ఉన్నవాటికి అదనంగా సూరి కలిపాడుకూడా.అయితే దురదృష్ట వశాత్తు మల్లినాథుని పూర్తి వ్యాఖ్యానం లభ్యం కాలేదు .మొదటి అధ్యాయాన్ని మాత్రమే విపి  ద్వివేది ప్రచురించాడు ..తార్కిక రక్ష పై వ్యాఖ్యానిస్తూనే మల్లినాథుడు తర్కం పై భూషణ ,న్యాయ కుసుమాంజలి టీక ప్రభాకర ,శా లికనాధ ,శ్లోక వార్తికాకర ,తథాగత ,ఉదయన మొదలైన ఇతరులు రాసిన లేక ఇతర  గ్రంథాలనుండి    అవసరమైనవాటిని  కూడా పేర్కొన్నాడు ..అదనపు వివరణలు ఇచ్చినా సూరి, మూల గ్రంధానికి పరిమితమై మాత్రమే రాశాడు   .ఈ విషయం పై ప్రసిద్ధ పరిశోధకుడు ప్రొఫెసర్ ఇ .ఆర్ .శ్రీకంఠ శర్మ విలువైన వ్యాసం రాశాడు అందులోని కొన్ని విషయాలను లాల్యే  తెలియ జేశాడు .
   వ్యాకరణ వివరణలను మల్లినాథుడు ”షోడశ పదార్ధ ‘ 16  విషయాలపై ఇచ్చాడు వీటిని వరద రాజుకూడా చెప్పాడు .వీటికి ఒక ప్రత్యేక వరుస క్రమాన్ని మల్లినాథుడు తెలియ జేయటం విశేషం -అదే ”ప్రమాణం వినా ప్రమేయాది సిద్ధే -విషయ  వినా ప్రమాణ ప్రవృత్తే -అసందిగ్ధస్య ప్రతి ఇత్సవాత్ -సందిగ్ధస్యాపి నిష్ప్రయోజనం అప్రతి పితిస్త్స త్వాత్ ప్రతిపత్తేశ్చదృష్టాంత ముఖత్వాత్ -అవయవాది నియమస్య సిద్ధదాం తాను సరిత్వాత్ -ప్రమాణ కరణా శరీర నిర్వర్తకాంగేత్వాత్  ప్రమాణానుగ్రాహకత్వాత్ –

తత్ఫల త్వాత్ -తస్యాపి కదా సాధ్యత్వే వాదస్య -తత్వ నిర్ణేయ ఫాలేత్వాత్ ”(తార్కిక రక్ష కారిక పై సూరి వ్యాఖ్య )

 ప్రమాణ0  పై వరద రాజునిర్వచన వివరణలో మల్లినాథుని విధానం సంక్షిప్తంగా అతి స్పష్టంగా అర్ధవంతంగా ఉంది -”సాధనాశ్రయాయో రణ్యతరత్వే  సతి ప్రామాణ్యత్వాత్ ”.ఆశ్రయ పదం ఆవ్యాప్తిని నిర్వచనంలో తొలగించి0ది .దైవం సాధనకాకాపోయినా ప్రమాణమే ”ప్రమా ”  అంటే విఙ్నానానికి అది పునాది (సబ్  స్ట్రాంటం). వరద రాజు

సాధన అవసరం లేదని దీనికి కారణం ప్రమాణాన్ని ప్రభావితం చేయటానికి ఉన్న వ్యాప్యత్వం వలన ప్రమేయం తొలగింపబడ లేనిదని అన్నాడు ..సాధనను సమర్ధిస్తూ ప్రమేయం ఉంటేనే సుఖ దుఃఖాలుంటాయన్నాడు వీటి నిర్వచనాలను ప్రయోగించటానికి సాధన శబ్దం నిర్వచనం లో ఒక భాగమై వివరిస్తుంది అంటాడు.
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా    .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి

 

 

షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి

  Inline image 1
వైశాఖ బహుళ దశమి 21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో 17-5-17 బుధవారం నుండి 21-5-17 ఆదివారం వరకు ఉదయం 7-30 గం  నుండి 9-30 గం  వరకు 5 రోజులు నా 55 వ శ్రీ సుదరకాండ పారాయణ ,నిత్యం శ్రీ సువర్చలా0జనేయస్వామి వారలకు అష్టోత్తర సహస్రనామ పూజ  శ్రీ సువర్చలాన్జనేయ శతక పఠన0  నిర్వహింప బడుతుంది .
 21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి  నాడు  ఉదయం 9-30 నుండి 11గం  వరకు మంత్ర సహిత  ,తంత్ర రహితంగా సంకల్ప  భూశుద్ధి ,విష్వక్సేనారాధన ,పుణ్యాహ ,బ్రహ్మాద్యస్ట దిక్పాలక  ,నవగ్రహ పూజ ,రక్షాబంధన  ,కన్యావరణ మధుపర్క ,మంగళాష్టక ,చూర్ణికా ,మహా సంకల్ప ,ప్రవర అక్షతారోపణ లతో శ్రీ సువర్చలాంజ  నేయ స్వామి వారల శాంతికళ్యాణం మా దంపతులచే నిర్వహింపబడుతుంది ,
                       గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17 -షార్లెట్ -అమెరికా 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మా పెద్దమనవడుచి సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ ఫోటోలు -షార్లెట్ యూని వర్సిటి -12-5-17

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

అమెరికా పూల ఆనందం

This gallery contains 12 photos.

More Galleries | Tagged | Leave a comment

మల్లినాథ సూరి మనీష -38

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -38

 పాకం పై వ్యాఖ్యానం -2(చివరిభాగం )
 వాక్యం లోని పదాలు ఒక దానితో ఒకటి సాఫల్య ,ఆనుకూల్య దగ్గర  సంబధం కలిగి ఉంటె ఒక కొత్త భావం ఆవిష్కరింపబడుతుంది అదే తాత్పర్యం .అదొక ప్రత్యేక ప్రయోజనం .సముచ్ఛయమైన ”దద్నా  జుహోతి ”లో పెరుగులు  అనే అర్ధం మరొక చోటు నుండి పొందాల్సి ఉంటుంది .అది పునరుక్తి అవుతుంది అది పెరుగు కు త్యాగానికి అసాధ్యమైన సంబంధమవుతుంది ఇదే తాత్పర్యం తనభావానికి మద్దతుగా మల్లినాథుడు రుయ్యకుని భావాన్ని తెలియబరచాడు -”పదార్ధ వాగమసమనంతర భావినీ సమన్వయ శిక్త స్తాత్పర్యం ”ఇక్కడ సమన్వయ అనే మాట చాలా ముఖ్యమైనది .అంటే వేరే  భావం వచ్చే అవకాశముంది కనుక ..తాత్పర్యం సాధారణంగా అర్ధవంతమై సూచనగా ఉండాలి .
 కనుక అలంకారాలలో తాత్పర్యం ప్రధాన భూమిక వహిస్తుంది .ఈ కీలక భావాన్నే మల్లినాథుడు చాలా విస్పష్టంగా తెలియ బరచాడు .అలాగే ”ఉపచార”అనే పదం అలంకారశాస్త్రం లో తరచుగా వాడబడే పదం పి .వి .Kane  పండితుడు ఉపచారా పదానికి చాలా అర్ధాలు చెప్పాడు ..ఉపచారను రూపకం గా భావించాడు .కారణం ఇది రెండు వస్తువులు విభిన్నంగా ఉండి సాధారణం గా అనుమానాన్ని మరుగు పరచి అసామాన్య పోలికను బలపరుస్తుందికనుక .kaneపండితుడు ఈ భావాన్నే మిగిలిన అలంకారికులు కూడా ఉపయోగించారని చెప్పాడు ..కానీ ”తరళ ”వ్యాఖ్యానం లో మల్లినాథుడు మరింత చిన్న నిర్వచనాన్ని ”ఉపచార ”కు ఇచ్చాడు -”అత త్వస్య తత్వేనవ్యపదేశహ ”-”భిన్నత్వేన  ప్రతీయ మానయోరేవే యారోపణమూపచారః ”న్యాయ వార్తికలో ఇవ్వబడినదానికి ఈ నిర్వచనం అతి దగ్గరలో ఉంది .”.వీటన్నిటిని బట్టి చూస్తే విద్యాధరుని ”ఏకావలి ”అనే కంఠాభరణం  మల్లినాథుని తరళ వ్యాఖ్య అనే మెరుగు చేత మరింత ప్రకాశించింది అని స్పష్టం గా  చెప్పవచ్చు ”అన్నాడుడా  పి జి..లాల్యే   పండితుడు .
  ఇంతటితో  విద్యాధరుని  ఏకావలి కి మల్లినాథ సూరి వ్రాసిన తరళ  వ్యాఖ్యానం పై వివరణ పూర్తయింది .
  తరువాత వరద రాజపండితుడు రాసిన ”తర్క రక్ష”కు మల్లినాథ సూరి రాసిన ”నిష్క0టక ”వ్యాఖ్యాన విషయాలను తెలుసు కొందాం .
 సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా .
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -102 మేడూరులో ఉద్యోగం -3

నా  దారి తీరు -102

             మేడూరులో ఉద్యోగం -3
సీనియర్ గుమాస్తా వెంకటరామయ్య రిటైర్ అయ్యారు .ఆయన బదులు సమితినుంచి లోయ శంకరరావు అనే కుర్రాడు వచ్చాడు .చాకు .కాంగ్రెస్ నాయకులతో బాగా పరిచయమున్నవాడు .పని వేగం గా నిర్దుష్టంగా చేసేవాడు .జిల్లాపరిషత్ లో కూడా మంచి పరిచయాలుండటం తో పంపిన బిల్లులు కావాల్సిన ఆర్దర్లు త్వరగా సాంక్షనై  వచ్చేవి ..ఇద్దరు ముగ్గురు లెక్కలమేస్టార్లు బదిలీ అయి కొత్తవారు చేరుతుండటం తో ఇబ్బందిగా ఉండేది పదవతరగతి పిల్లల్ని పరీక్షకు తయారు చేయటం లో లెక్కల ప్రసాద్ బాధ్యత ఎక్కువయ్యింది అయినా చాలా సమర్ధంగా చేశాడు . లైబ్రరీ పై అంతస్తులో ఉండేది .చాలాపుస్తకాలు ఇక్కడే చదివాను . దానికి అనుబంధంగా హాలు ఉండేది .ఎవరైనా మేష్టారు సెలవు పెడితే ఎక్స్ట్రా వర్క్ గా పిల్లల్ని లై బ్రరీకి పంపి పుస్తకాలు మేగజైన్లు చదివించేవాళ్ళం .ఇది నేను రాకముందు నుంచే ఉంది . డ్రాయింగ్ మాస్టర్ కాటూరి ప్రసాద్ కాటూరు వాడు మాతో పాటే ఉయ్యూరు నుంచి వచ్చేవాడు మంచి ఆర్ట్ ఉన్నది. మరో మొహంజదారో నాటకం ,అక్కినేని ఆదుర్తి తీసిన ఆర్ట్ సినిమాలు సుడిగుండాలు ,మరోప్రపంచం  లకు సంభాషణా రచయిత మోదుకూరి జాన్సన్ దగ్గర పని చేసినవాడు పాటలు రాసేవాడు బాగా పాడేవాడు .జాన్సన్ తో తన అనుభవాలు చెప్పేవాడు ..ఈయనను ఎలా బాగా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తున్నాను  .లైబ్రరీహాల్ లో గోడలమీద మంచి సూక్తులు ,పద్యాలు రాయించటం తో మొదలుపెట్టి భారత దేశం మాప్ వేయించి ,సైన్స్  రూమ్ లో మానవ శరీర బాగాలు  పీరియాడిక్ టేబుల్ వేయించి అతని కళను సద్వినియోగం చేయించాను ..
  ప్రతి సెక్షన్ వాళ్ళూ ఒక జాతీయ నాయకుని ఫోటో తమక్లాసు రూమ్ లో స్వంత   ఖర్చులతో క్లాస్ టీచర్ల సహకారం తో పెట్టించాను .సైన్స్ రూమ్ లో సైన్టిస్ట్ ల ఫోటోలు ,ట్యూబ్ లైట్ల అమరిక చేయించాను ..పెద్ద బావికి మోటారు ఉండేది ఆ నీరు కొబ్బరి చెట్లకు పారించటం ,గార్డెన్ లో కూరగాయలు పండించటం అవి వేలం వేసి డబ్బు జమ చేయటం ఉయ్యూరయ్యే చేసేవాడు . కొబ్బరి చెట్ల  పోషణ బాధ్యతా అతనిదే .స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే లను ఘనంగా నిర్వ హించేవాళ్ళం .ఆడపిల్లలు ఎక్కువమందిఉన్నా పాటలు పాడేవాళ్లు ఉండేవారుకాదు . పమిడిముక్కలలోడా కృష్ణారావు గారు మేడూరు వారే .ఆయన అక్కడ ఒక కాన్వెంట్ నడిపేవారు భార్య ప్రిన్సిపాల్. ఆయన్ను ఫంక్షన్ లకు పిలిస్తే వచ్చేవారు ..సంస్కారమున్న మనిషి .తెలుగు దేశం పార్టీలో పెద్ద లీడర్ కూడా . పమిడిముక్కల నుండి వచ్చే డ్రిల్ మాస్టారు రిటైరయ్యారు  ఆ సందర్భం గా స్టాఫ్ ఆయనకు సన్మానం చేసి వీడ్కోలు సభ నిర్వహించాము ఆయన ఆటలలో బాగా ఆడినవారికి బహుమతులు ఇవ్వటానికి కొంత డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్ కు ఇచ్చారు .ఈ వ్యవహారం తెలుగు మేష్టారు చూసేవాడు . డ్రిల్ మాస్టారు చాలా సంతోషంగా మా అందరికీ పెద్ద పార్టీ కూడా ఇచ్చారు ..మేడూరులో ఎల్ ఐసీ ఏజెంట్ ఒకాయన ఉండేవాడు మంచివాడు చిన్నతరగతులకు ట్యూషన్ చెప్పేవాడు .మేడూరు పోస్ట్ మాస్టారు బాగా సహకరించేవాడు . అప్పుడు పబ్లిక్ పరీక్ష  ఆన్సర్ పేపర్లు పోస్టాఫీస్ ద్వారా ఎవరికి అంటే ఏ సెంటర్ కి పంపమంటే ఆ సెంటర్ కు పంపేవాళ్ళం ఇక్కడ పోస్ట్ మధ్యాహ్నం 2 కు క్లోజ్ .ఈ లోపల బండిల్ తయారుకాకపోతే మర్నాడు పోస్టులో పంపేవాడు ..నాకు అనుమానం వచ్చేది . నేను అక్కడినుంచి వచ్చాక డబ్బు బాగా తినేశాడని ఆరోపణవచ్చి ,రుజువై సస్పెండ య్యాడు .అతనికొడుకు అప్పుడు బడిలో చదివే వాడు తర్వాత అనేక ఉద్యోగాలు చేసి ప్రస్తుతం బెజవాడ  వన్ టౌన్ పోస్టాఫీజు లో పని చేస్తూ అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు
      వార్షికోత్సవం జరపటానికి అన్నితరగతులవారికి వక్తృత్వ వ్యాస రచన క్విజ్ పోటీలు నిర్వహించాం .ప్రతి క్లాసులో ఎక్కువ శాతం హాజరున్న వారికీ ,సంచాయికలో ఎక్కువ డబ్బు పొదుపు చేసినవారికి  పైతరగతులలో  క్రింది తరగతులలో   మంచి క్రమశిక్షణతో మెలగినవారికి ఉత్తమ విద్యార్థి పురస్కారం ఇచ్చాము ఆటలు క్రీడలలో పోటీలు పెట్టి జూనియర్స్ ,సీనియర్స్ కు వేరుగా ,అలానే ఉపాధ్యాయుల మధ్య బాడ్ మింటన్ వాలీ బాల్ పోటీలు పెట్టి వారికీ బహుమతులు ఇచ్చాము .క్రీడా విషయాలన్నీ డ్రిల్ మేష్టారు సుబ్బారావు గారే చూసేవాడు .వార్షి కోత్సవానికి మేడూరు వాసి రేడియోలో పాడీ  పంట నిర్వాహకులు యలమంచిలి హనుమంతరావు గారిని ఆహ్వానించాం ..వారు స్ఫూర్తి  దాయక ప్రసంగం చేశారు .ఎందరో దాతలు ఫిక్సెడ్ డిపాజిట్లు చేశారు ..ఆ  వడ్డీ  డబ్బులు బాంక్ నుంచి తీసి ఎవరికోసం నిర్దేశింప బడిందో వార్షికోత్సవం రోజున అంద  జేయటం అలవాటు అలానే చేసాం .ప్రతి తరగతిలో  ఫస్ట్  సెకండ్ థర్డ్  వచ్చినవారికి మంచి విలువైన పుస్తకాలు కొని బహూకరించాం
   పద వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర కోస్తున్నాయి .హయగ్రీవం గారు హెడ్ మాస్టర్ గా ఉండగా ఉయ్యూరునుంచి మేము వాచర్లుగా వచ్చాము .అంతా యమా డి ప్లిన్ గా కనిపించేది .కానీ కాపీలు తెగ కొట్టేవాళ్ళు .ఎప్పుడూ వీళ్ళ పాస్  శాతం 80పైన ఉండేది నేను డేగ చూపుతో అన్నీ కనిపెట్టి లాగేసి అక్రమం జరక్కుండా చూశాను నా రూమ్ లో కానీ అందరూ అలా ఉండరు . ఆ ఏడు కఠినంగా మేస్టార్లు అందరం  ఒకే మాటమీద ఉండటం తో శాతం 50 కి పడిపోయింది .వాపు తప్ప బలుపుకాదు ఇప్పుడు  నేనే పరీక్ష నిర్వహించాలి .కనుక అతి జాగ్రత్తగా ఉన్నాను .శంకర రావు ను కూడా లైన్ లో పెట్టాల్సి వచ్చింది . ఇక్కడికి ఆగినపర్రు విద్యార్థులు కూడా వచ్చి పరీక్ష రాశారు .ఆ మేస్టార్లు వాచర్లుగా వచ్చారు వారిని మేడూరు పిల్లలున్న రూమ్ లకు వేయాలి అందులో ఒక సైన్స్ మేష్టారు బాగా ట్యూషన్లు చెప్పేవాడు .ఆయన చాలా లూజుగా ఉన్నట్లు మొదటి రోజే గమనించి అత్య0త  జాగ్రత్తగా ఉండి”  రేకాడ ”కుండా చేశాను పరీక్ష హాలులోకి ప్రవేశించేముందే అందర్నీ పూర్తిగా చెక్ చేసి పంపేవాళ్ళం నేనూ డిపార్ట్ మెంట్ ఆఫీసరూ అయినా ”ఎక్కడో ”దాచి దొరికి పోయేవారు .ఆ ఏడాది ఏం ఆర్ ఓ కూడా విజిటింగ్ కు వచ్చేవాడు డిపార్ట్ మెంట్ వాళ్ళుకాక .చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు . రెండుమూడుసార్లు విజిట్ కు వచ్చాడు నాకు సంతోషంగా ఉండేది .పరీక్షలన్నీ బాగానే జరిగాయి అనుకొన్నసమయం లో చివరి పరీక్ష సోషల్ -2 లో యెంత జాగ్రత్తపడ్డా ఒక మేడూరు కుర్రాడే కాపీ తీసి పట్టుబడి సస్పెన్డ్ అయ్యాడు .నెత్తీ నోరూ కొట్టుకుంటూనే ఉన్నా0 అందరం .ఇదొక లోపం తప్ప అంతా  సవ్యంగా జరిగింది   ,
  అలాగే ఏడవతరగతి పరీక్షలూ నిష్పక్షపాతంగా జరిపాను . ఇలా కఠినంగా ఉండటం సర్పంచ్ కి ఇష్టం లేదన్నట్లు వార్తలు విన్నాను ఎవరికోసమో పనిచేయం కదా మన ఆత్మా తృప్తికే డ్యూటీ . మేడూరు లో పని చేస్తుండగానే మా పెద్దబ్బాయి శాస్త్రికి చి సౌ ములగలేటి   సమతకు వివాహం జరిగింది .ఆ అమ్మాయి మా ఇంటికి పెద్దకోడలు .చలాకీ గా ఉండేది అలాంటి అమ్మాయి కోడలుగా రావాలని అనుకొన్నాం .అలాగే ఆ అమ్మాయి చాలా బాధ్యతగా ఉంటుంది అన్నివిషయాలలో . మేడూరు స్టాఫ్ అందరూ బెజవాడ వచ్చారు పెళ్ళికి . ఇక్కడ ఉండగానే మ్యూజిక్ వాల్ క్లాక్ కొన్నాం బెజవాడ వెళ్లి . హెడ్ మాస్టార్ల లిస్ట్ ఉన్న బోర్డు లు ,ఏడు ,పది  పాస్    శాతం  ఫాస్ట్ వచ్చిన వారిపేర్లు రాయించాను .స్కూల్ యెట్ ఏ గ్లాన్స్ కూడా
    మేడూరి రామమోహనరావు గారు అనే యలమంచిలి రామమోహన రావు  గారు బాడీనిర్మాత వితరణ శీలి  జూన్ నాటికి మరణించి సంవత్సరం అవుతోందని ,ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేయాలని స్టాఫ్ లో ఆలోచన వచ్చింది .బాగుంది అని ముందు స్టాఫ్ మెంబర్లు చందాలు వేసుకొని మిగిలినవారి వద్ద వసూలు చేయాలని నిర్ణయించాను నేను వెయ్యి నూట పదహార్లు వేశాను ,అలాగే జీతం బట్టి లేక వారిష్టం ప్రకారం చందాలు వేశారు . దీనికి రసీదు పుస్తకాలు వేయించాం .సర్పంచ్ వగైరాలూ బాగా సహకరించాం .అయితే విగ్రహం తయారు చేసేదెవరు అనేది ప్రశ్న అయింది ఎవరికీ ఏమీ తెలియదన్నారు .అప్పుడు తెనాలిలో అక్కలమంగయ్య అనే ఆయన కొడుకు బాగా చేస్తాడని ఒక సారి వెళ్లి కనుక్కోమని చెప్పాను దీనికి సుబ్బారావు లాబ్ అసిస్టెంట్ ప్రసాద్ స్టాఫ్ సెక్రెటరీలకు బాధ్యత అప్పగించాం వాళ్ళు వెళ్ళిమాట్లాడి చేస్తానని అనగానే అడ్వాంస్ ఇచ్చారు . కొంత షేప్ వచ్చాక మళ్ళీ చూసి రమ్మని పంపాము బాగా నే వచ్చింది అన్నారు ఫోటోలు తీయించి వారి కుటుంబ సభ్యులకు చూపించి వారి ఆమోదమూ పొందాం .మేడూరులో పని చేసి వెళ్లినవారందరికీ ముందుగానే ఆహ్వానపత్రాలు పంపాము అందులో ఆయనపై అభిమానం ఉన్నవారందరూ డబ్బులు పంపారు కంచు విగ్రహం చాలా ఖరీదు అని భావించి బస్ట్ సైజు తో తేలిక విగ్రహానికి ఆర్డర్ ఇచ్చాము .విగ్రహం జూన్ 10 నాటికి అందజేయాలని చెప్పాం సరేనన్నాడు శిల్పి .
         సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36

ఏకావాలి పైవ్యాఖ్యానం లో మల్లినాథుని ప్రత్యేకతలు

ఇప్పటిదాకా మనం అలంకారాలపై మల్లినాథుని వ్యాఖ్యలను పరిశీలించాక  ఆయనలోని సునిశిత  , సూక్ష్మ పరిశీలానా దృష్టికి ఆశ్చర్య చకితులమవుతాం ..ఇప్పుడు ఏకావళిపై సూరి రాసిన తరళ  వ్యాఖ్యానం లోని కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకొందాం . ఆయన పాండిత్యగరిమ  ,పారదర్శకత వ్యాఖ్యానం లో  ప్రస్ఫు ట మై అబ్బురపడతాం .వ్యాకరణ సిద్ధాంతాలపై ఆయనకున్న ప్రస్ఫు ట అవగాహనకు ఆశ్చర్య పడతాం
  తరళ  వ్యాఖ్యానం లో అతి సూక్ష్మ కీలక భావనలను ఆయన అతి సునాయాసం గా అత్యంత స్పష్టంగా వివరించాడు .క్రియ యొక్క ప్రాముఖ్యత ఒక పదం లోలేక సమ్మేళనం లో ముఖ్యంగా కానీ గౌణంగాకాని కానీ సహాయకారిగా ఉంటె  క్రియను సంభావించని లోపం వలన అది ప్రాముఖ్యత చెందుతుంది దీన్నే అవిధేయతా విదేయాంశ అన్నాడు .తద్ధితాలలో లోకూడా ఇలాంటి లోపమే ఉంటుంది .దీనికి ఆపవాదు  ఉదాహరణ ఇస్తూ ,క్రియ యొక్క ప్రధాన స్వభావం కొన్ని విభక్తులలో లోపం కాదు నరసింహ భారతి లో భారతి యొక్క ప్రాధాన్యత తద్ధితమైన నరసింహ వలన తగ్గలేదు అని చెప్పాడు .-”నరసింహీ భారతీత్యుక్తే నరసింహ సంబంధ భారతీ పరత్వం ప్రతీయతే న తు నరసింహ పరత్వం ప్రకృత్యార్ధ ప్రాధాన్యక్కారేణ ప్రత్యయేన్ స్వార్ధ ప్రాధాన్య ప్రకాశనా దిత్యర్ధహ్ ”
  మల్లినాథుడు మరో ఉదాహరణ  ఇచ్చాడు .వైశ్వ దేవిక్  ఆమీక్షా ” అంటే పెరుగు మజ్జిగ మిశ్రమం   వైశ్వ దేవికి  నైవేద్యం అని అర్ధం .ఇక్కడ ఆమీక్ష అనేది ఒక ప్రత్యేక పదార్ధం దేవునికి నైవేద్యగా తయారు చేయటం .ఇది తద్ధితమైన అన్  ను వైశ్వ దేవి ని బలీయం చేసింది -నరసింహ భారతి లో భారతి నరసింహ శబ్దానికి సమందించి నట్లుగా . దీన్ని మల్లినాథుడు ఇలా వివరించాడు -”విభక్తిరహి ప్రతిపాడుకాదుత్పన్నా తదర్థస్య విశేషతః సామాన్యతో వా సంబంధం బోధయ0 తీ న తస్య విధేయస్య ప్రాధాన్యం తాత్పర్య విషయతారూప0 తిరోధతే -తద్ధితస్తు తస్యేదామితి  తత్సంబంధ న్య ర్ధాంతరే విహితస్యే వ  ప్రాధాన్యం గమయనన్  ప్రకృత్యార్ధ ప్రాధాన్యం వ్యాహన్తీ త్వన్యాయ వ్యతిరేకా భ్యామ వగమ్యత ఇత్యర్ధహ్ ”
  మూలానికి   విభక్తి తగిలిస్తే అది దానికి సామాన్యంగా కానీ ప్రత్యేకంగా కానీ సంబందాన్నిస్తుంది   తాత్పర్యం లో భేదం రాదు తద్ధితమ్ కనుక తస్య ఇదం తో కలిస్తే ప్రాధానమైనదాని  ప్రత్యేకత తెలుపుతుంది .ఇవి దన్తమ్కు రుణాత్మక చర్చలద్వారా సాధించాలి నరసింహ భారతిలో భారతి ప్రధానమై నరసింహకు విశేశార్ధాన్నిచ్చింది దీన్ని మల్లినాథుని వృత్తి లో స్పష్టంగా వివరించాడు -”అక్లాండం ముఖం చంద్ర ఇతి ప్రయోగే శబ్దాదన్య దాత్వేపి విశేష్య ముఖ చంద్ర గతోక్త ర్ష హేతు త్వె న తద్ది శేషణ యో  సకలంకత్వా కళంకాన్వయో ర్వి ధేయత్వాత్  ప్రాధాన్యం తాత్పర్య విషయత్వ రూపం వివేప్యయో రముఖ చంద్రయో నృ దామన్యో రప్రదాన్యం చార్యా సిధ్య నృవాద  సమ ర్య రూపాదవగమ్యతా   ఇత్యర్ధహ్ -వృత్తో   తు  నైవం ”
ముఖం కళంకరహితం .చంద్రుడు కళంక  సహితుడు .కనుక ముఖం చంద్రునికంటే ప్రకాశయానం .ఇది విద్యానువాదం వలన బలీయమైంది .నరసింహస్య బదులు నరసింహి  అని ఉంటె విశేషణం క్రియగా భాసించదు .ఈ విధంగా మల్లినాథుని తరళ  వ్యాఖ్యానం లో కీలక భావనలపై అతి సంక్షిప్త స్పష్ట నిర్వచనాలున్నాయి .ఈ నిర్వచనాలు ఏకావలికి రాసిన వృత్తి లోనూ కనిపిస్తాయి .కొద్దీ తేడా ఉంటుంది వివరణలో .వృత్తిని వక్రీకరించకుండా నిర్వచనాలను మరింత సరళం చేసి పునర్మించాడు .
   తరువాత ఒకసారి” పాకం ”లో మునుగుదాం
    సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -101 మేడూరులో ఉద్యోగం -2

నా దారి తీరు -101   మేడూరులో ఉద్యోగం -2

డూరులో ఉద్యోగం -2 ఒకవారం రోజులు రోజంతా అందరు మేష్టర్ల క్లాసులకు వెళ్లి పావుగంటలోపల సమయమే ఉండి ఎవరెవరు ఎలా బోధిస్తున్నారో పరిశీలించాను . లెక్కలమేస్టారు  ప్రసాద్ ,తెలుగుమేస్టర్  శర్మ  హిందీపండిట్ సావిత్రి గార్లు తప్ప అంతమంది లో ఎవరూ ఆప్ టు ది మార్క్ గా అనిపించలేదు .వీళ్లంతా రామమోహనరావు గారి జమానాలోవాళ్ళు . వాళ్ళదగ్గర అతివినయంగా ఉండటమే తప్ప బోధనలో మెళకువలు లేవు .మరో తమాషా నేను గమనించింది సాయంకాలానికి రామ మోహన రావు గారబ్బాయి దగ్గరకు స్కూల్   లోని అన్నివిషయాలూ చేరేసే వాళ్ళు .వీళ్ళనే గడప పూజారులు అనేవాళ్ళం  గుమాస్తా  ఉయ్యూరయ్య నిఖార్సైన మనిషి .లెక్క అంతా పకడ్బందీ స్కూల్ అకౌంట్ డబ్బులు కూడా అతని చేతికే ఇచ్చాను .ఎక్కడా తేడా రాదు .అంత నమ్మకం .గొల్లలు అతనే  రిటైరయ్యాక మేడూరు సర్పంచ్ గా ఎన్నికై మంచి పనులు చేశాడు . అంతా  బాగానే ఉంది కానీ ఎక్కడో ఇరుకు గదిలో నేనున్నట్లు ఫీలయ్యాను . నాకు స్వతంత్రం గా ఉండి  అన్నిపనులు సమర్ధంగా చేయటం ఇప్పటిదాకా అలవాటు .ఇక్కడ సాంస్కృతిక విషయాలేమిటో టీచర్లకూ పిల్లలకూ తెలియదు .ఇంతవరకు అల్లాంటివి ఇక్కడ జరగ లేదని చెప్పేవారు . అయినా నా పద్ధతిలో  వీటిని అధిగమించి నడపాలని నిర్ణయానికొచ్చాను .ముందుగా ప్రతిరెండవ  బుధవారం మిగతా చోట్ల చేసినట్లే సాయంత్రం చివరి పిరియడ్ లో వాటిని క్లాస్ టీచర్ల చేత నిర్వహించే పధ్ధతి మొదలుపెట్టాను వక్తృత్వ వ్యాసరచన క్విజ్ పోటీలు గా వీటిని చేయించాను  సైన్స్ క్లబ్ అంటే కూడా వీళ్లకు తెలీదు సైన్స్ మేష్టర్లతో దాన్ని ఏర్పాటు చేయించి సైన్స్ రూమ్ లో నెలకొక ప్రోగ్రామ్ చేయించాను .ప్రసిద్ధులైన సైన్టిస్ట్ ల జీవితాలను వారి పరిశోధనలను ఒకరిద్దరు విద్యార్థుల చేత సైన్స్ టీచర్ పర్య వేక్షణలో తయారు చేయించి మాట్లాడించాను .ఇవి విద్యార్థులలో బాగా క్లిక్ అయి నాపై విశ్వాసం కలిగించాయి ..అంతా బాగానే ఉంది అనిపించిన సమయం లో ఒక తమాషా జరిగింది .

   ఒక రోజు ఉయ్యూరు నుంచి బస్ లో వచ్చి నడిచి స్కూల్ కు వస్తుండగా రోడ్డుమీద చాక్ పీసు తో నాకూ హిందీ పంతులమ్మకు అక్రమ సంబంధం అంటగట్టే రాతలు కనిపించాయి  రోడ్డుకు అడ్డంగా రెండుమూడు చోట్ల ఉన్నాయి చదివి కామ్ గా స్కూల్ లోకి వెళ్లి నా పని నేను చేసుకుంటున్నాను . అసెంబ్లీ అయింది క్లాసులు మొదలయ్యాయి .ఒక గంట తర్వాత డ్రిల్ మేస్టర్ సుబ్బారావు గారు నా దగ్గర కొచ్చి ”హెడ్ మాస్టారూ !రోడ్డు మీద ఎలా ఛండాలంగా రాశారో చూశారా ?”అని అడిగాడు .నేను ”ఏమో నండీ తలవంచుకుని నేను రోజూ లాగానే వచ్చాను .ఏమీ చూడలేదు .అని చిన్న అబద్ధం ఆడాను.  అసలు విషయం చెప్పాడు . అప్పుడు నేను ”నేను మగాడిని .సర్దుకు పోవచ్చు ఆమె లేడీ టీచర్ ఆమె చదివివుంటే యెంత బాధ పడుతుందో ఆలోచించండి . మా ఇద్దరి ప్రవర్తన పై స్టాఫ్ లోకాని పిల్లలలో కానీ ఊరిజనం లో ఏమాత్రం అనుమానం ఉందని భావి0చినా  నేను ఈక్షణమే సెలవు పెట్టి వెళ్ళిపోతాను .ప్రెసిడెంట్ గారికి చెప్పి ఆయనకు ఇష్టమైన వారిని వేయించుకోమని చెప్పండి నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా బాధ లేదు ”అన్నాను ..వెంటనే ”కాదు సార్ !ఇలాంటివి ఉపేక్షిస్తే చాలాప్రమాదం .మీకయ్యింది .రేపు వేరెవరికైనా అవచ్చు ఆడపిల్లలపై రాయచ్చు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ”అన్నాడు .”బడి డిసిప్లిన్ చూసేది మీరు కనుక మీరూ లెక్కలమేస్టారు  స్టాఫ్ సెక్రెటరీ ,శర్మగారు కలిసి కూర్చుని చర్చించి అసలు రాసిన వాళ్ళు ఎవరో ఏ ఉద్దేశ్యం తో రాశారో కనుక్కుని  తేల్చండి  వాళ్ళ పేర్లు నాకు ఇస్తే క్రమ శిక్షణ చర్య తీసుకుంటాను .ముందుగా హిందీ పంతులమ్మగారికి మనందరి తరఫున సారీ చెప్పి తర్వాత పనిలో దిగండి ”అన్నాను . మంచి ఆలోచన అని అని ఆపనిలో దిగి దోషుల్ని తేల్చి నాదగ్గరకు పంపించి వాళ్ళూ వచ్చారు . ఇద్దరో ముగ్గురో ఉన్నారు పిల్లలు .వాళ్ళు ఎవరో తమతో చేయించారని నిజం చెప్పారు .కూపీ లాగితే అక్కడ రిటైర్ అయిన హిందీ పంతులు ట్యూషన్ కింగ్ పని అని తేలింది .అందరిదగ్గర క్షమాపణ ఉత్తరాలు రాయించి ,తలిదండ్రులను పిలిపించి ఇది మొదటి తప్పుకానుక వదిలేస్తున్నాను కానీ మా స్టాఫ్ కి ఇది చాలదు ఇంకా మీకుకఠిన మైన పనిష్ మెంట్ ఇవ్వాలంటున్నారు అని బెదిరించి తలో నాలుగు డ్రిల్ మిస్టర్ చేత పీకించి వదిలేశా .ఉడత ఊపులు ఊపుదామని ప్రయత్నం .స్టాఫ్ మీటింగ్ పెట్టి జరిగిన విషయం వివరించి హిందీపంతులమ్మగారికి అందరం క్షమాపణ చెప్పాం .ఆమె కన్నీరు మున్నీరు గా ఏడ్చింది .మేమిద్దరం బ్రాహ్మణులం అవటం రోజూ బస్ లో ఉయ్యూరు నుంచి రావటం ,ఆమె మా ఇంటిదగ్గరే రాజా గారి కోటలోని ఇంట్లో అద్దెకుండటం ఇంతటి సీన్ ను క్రియేట్ చేయించింది .మళ్ళీ ఇలాంటి దేదీ నేనుండగా జరగలేదు .అందరం మర్చిపోయి మాపనులు మేము చేసుకు పోతున్నాం .సర్పంచ్ కూడా వచ్చి జరిగిన దానికి బాధపడి పునరావృత్తం కాకుండా జాగ్రత్త తీసుకుంటానని హామీ ఇచ్చారు . మళ్లీ  గాడిలో పడింది స్కూల్ .
  సోషల్ మేష్టారు మస్తాన్ గార్ని పిలిచి ”మాక్ పార్లమెంట్ ”జరిపించమన్నాను .ఆయన అలాంటి మాట తానింతవరకు  వినలేదని చెప్పాడు .అప్పుడు దానికి కావలసిన అన్ని విషయాలూ నేనే సేకరించి ఆయనకు ఇచ్చి ఎలా నడపాలో నేర్పించి పిల్లలకు శిక్షణ నిప్పించి నెల రోజుల్లో పిల్లల్ని తయారు చేయించి నిర్వ హింప జేశాను అద్భుతంగా చేశారు పిల్లలు ప్రశ్నోత్తరాలు ,బిల్లు ప్రవేశపెట్టడం చర్చ బిల్ పాస్ చేయించటం అన్నీ పార్లమెంట్ లో జరిగినట్లు జరిపించాను .బ్రహ్మానంద పడ్డారు విద్యార్థులు తలిదండ్రులు మేస్టార్లు .అక్కడ ఒక చరిత్ర సృష్టించాను ..వీటితో నేనేది చెప్పినా చేయటానికి అందరూ సిద్ధమయ్యారు .
  మేడూరుకు దగ్గరలోనే ఐలూరు పుణ్య క్షేత్రం ఉంది  -.దీన్ని ఉభయ రామ లింగేశ్వర  క్షేత్రం అంటారు .ఇక్కడా కృష్ణకు అవతలి ఒడ్డున గుంటూరు జిల్లా చిలుమూరు లో శ్రీరాముడు శివలింగ ప్రతిష్టాపన చేశాడు ఏకకాలం లో కృష్ణానది దానిప్రక్కనే ప్రవహిస్తుంది  ఐలూరు కు ఫీల్డ్ ట్రిప్ ఎప్పుడైనా వెళ్ళారా అని అడిగా స్టాఫ్ ని .అలాంటి వాసనే మాకు తెలీదుఅన్నారు .ఆశ్చర్యం వేసింది .సరే దీన్నీ సాధించాలి అనుకోని ఒక రోజు మధ్యాహ్నం ఉదయం పూట  బడి అవగానే పిల్లలని తీసుకు వెళ్లే ఏర్పాటు చేసాం .నది ఒడ్డున కూర్చుని ఏదైనా ఫలహారం  తింటే  బాగుంటుంది అనిపించి సెక్రెటరీకి ఆ బాధ్యత అప్పగించాను .ఈ వార్త ఊర్లో సంచలం కలిగించి మహిళలు ఒక బృందంగా ఏర్పడి అందరికి కావలసిన పులిహోర తయారు చేయించి  పెట్టుకు తినటానికి గిన్నెలు గరిటెలు కాగితాలు మంచి పండిన అరటిపళ్ళు వాళ్ళే సిద్ధం చేసి మాకు ముందే తెలియబరచి రిక్షాలో మాతో పంపించే  ఏర్పాటు  చేశారు . ఇందులో ఉయ్యూరయ్య పాత్ర బాగా ఉంది మంచి చెయ్యాలనుకొంటే  కలిసి వచ్చేవారెప్పుడూ ఉంటారు . అందరం బృందాలుగా క్లాస్ వారీగా వెనక ముందు టీచర్లతో నడక సాగించి ఒక అరగంటా ముప్పావు గంటలో ఐలూరు కృష్ణా నది ఒడ్డుకు చేరి సేద తీరి వెంట తెచ్చినవి పిల్లకు మేష్టర్లకు అందరికీ పంచి సంతృప్తి కలిగించాం .ఇక్కడి దేవాలయ చరిత్రను నేను తెలుగు మేష్టారు  అందరికి వివరించాం తర్వాత దేవాలయాన్ని  సందర్శించి మళ్ళీ బడికి నడిచి వెళ్లాం . ఈ ఫీల్డ్ ట్రిప్ గొప్ప స్పందన కలిగించింది ఊర్లో . ఏపనికైనా సహాయ సహకారాలు అందిస్తామని ముందుకొచ్చారు ..
   పిల్లల తో  బాడ్ మింటన్  వాలీబాల్ కబాడీ  బేస్ బాల్ ఖో ఆటలలో డ్రిల్లు మేష్టర్లు మంచి శిక్షణ ఇచ్చి తయారు చేశారు .ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడించాం గ్రిగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు పంపించాం .బాడ్మింటన్ లో ప్రయిజు వచ్చిందని జ్ఞాపకం . టీచర్స్ కూడా గేమ్స్ ఆడి పాల్గొన్నాం .బాడ్ మింటన్ లో నేను లెఫ్ట్ ఫ్ర0ట్ .శర్మగారు సెంటర్ .బాక్ .సుబ్బారావు  ప్రసాదరావు .వాలీ బాల్  కూడా బాగా ఆడేవాళ్ళం నేను ఈ రెండిటిలో ఎప్పుడు సర్వీస్ చేసిన కనీసం మూడు పాయింట్లయినా వచ్చేవి .జనం ఈలలు చప్పట్లతో ఆభినందించేవారు
  స్కూల్ పరీక్షలు మొహమాటం లేకుండా కాపీ కొట్టకుండా చాలా పకడ్బందీ గా నిర్వహించాం దీనికి లెక్కలమేస్టారు   ప్రసాద్ సహాయం అద్వితీయం అతనికే కొన్ని నిర్దిష్ట భావాలున్నాయి అందుకే మా ఇద్దరికీ కెమిస్ట్రీ బాగా కుదిరింది . ఇన్ని విషయాలు బాగానే ఉన్నా క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశరావు విపరీతమైన తాగు బోతు ,బడిపక్కనే ఇల్లు  .గంటకో అరగంటకు ఎవరికీ తెలీకుండా మందుకొట్టి వచ్చేవాడు మాటలు తడ  బడేవి  కళ్ళు చింత నిప్పులు బక్కపలచగా ఉండేవాడు తోస్తే పడిపోయే రకం .అతన్ని కంట్రోల్ పెట్టటం శక్యం కావటం లేదు .అంతకు పూర్వం హెడ్ మాస్టర్లు కూడా ఏమీ పీక లేక వదిలేశారు .అతని కులమూ ఇబ్బంది కలిగించేది ఏ చర్య తీసుకోవలన్నా .మనమే సర్దుకు పోవటం . మనిషి మంచివాడు పిల్లాడు తొమ్మిది చదువుతున్నాడు చురుకైన వాడు . బెదిరించేవాడిని స్టాఫ్ఆర్దర్ వేస్తానని అది రికార్డ్ అయితే జీవితం  జీతం ఖాళీ అని పైవాళ్లకు రాస్తానని హెచ్చరించేవాడిని .చెప్పిన పని చేస్తాడు ఇదొక్కటే లోపం బలహీనత . పామర్రులో సైన్స్ మాస్టర్ గా పని చేస్తుండగా ఇద్దరు డ్రిల్లు మేస్టార్లు తెగ తాగి వచ్చేవారు .ఒకడు రోడ్డుకడ్డంగా నిలబడి బస్సులు ఆపేవాడు .మరోడుఫుల్ గా మందుకొట్టి తెగవాగేవాడు ఇతను నేనంటే బాగా అభిమాన0గా ఉండేవాడు   .సముద్రం ఒడ్డు  చినగొల్లపాలెం వాడు .అక్కడ రాజకీయ నాయకుడు ఏటూరి బలరామ మూర్తి ఇతనికి కాపు ఏడు గడ .కనుక చైర్మన్లు కానీ ఇంకెవరూ ఇతని జోలికి వచ్చేవాళ్ళు కాదు మనిషి బంగారం   .ఖాళీగా  ఉన్నప్పుడల్లా అతని రూమ్ లో కూచునేవాడిని .కాఫీలు ఆరగాఆ రగా తెప్పించేవాడు .భార్యబంగారు  తల్లి .మంచి టీచర్ . ఈ ఇద్దరు ”డ్రిల్లులు” మను షులు మంచివాళ్ళే గుణం ”గుడి సేటిది ”టైప్  మేడూరునుంచి పామర్రుకు జంపయ్యాను సారీ .  ఉపేక్షతప్ప నాకు క్రాఫ్ట్ మేస్టార్ విషయం లో ఏ ఉపాయము కనిపించలేదు . ఇలాంటి వారిమధ్య పని చేయటం ఎంబరాస్మెంట్ గా  ఉంది .తరుణోపాయంకోసం మనసులో అన్వేషిస్తున్నాను .
                సశేషం
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-17 కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35

  ఏకావలి లో అలంకార చర్చ(చివరిభాగం )  

పర్క్యాయోక్తి  అలంకారం-పర్యాయోక్తి అలంకార నిర్వచనం లో విద్యాధరుడు పూర్తిగా అలంకార సర్వస్వాన్నే  అనుసరించాడు  -”గమ్యత్సా పి భంగ  గ్య0త రేణాభి  దానం పర్యోక్తం ”
  ఈ అలంకారం తెలియాల్సిన దాన్ని ఏదో ఒక విధానం లో తెలియ జేస్తే పర్యాయోక్తి .అంటే ఫలం ,ప్రభావం ,ప్రయోజనం  మొదలైనవి తెలియాల్సిన లేక గమ్యం కు కారణాలు అవుతాయి. దీనిపై మల్లినాథుని  వ్యాఖ్యానం చాలా స్పష్టంగా ఉంది .-”యత్ర ప్రస్తుత కార్య కధనాత్ ప్రస్తుతమేవ కారణం గమ్యతే -తత్ర కార్యద్వారా కారణ  స్యేవ పర్యాయేణ భంగ యంత రేణోక్త త్వాత్ పర్యాయోక్త  మిత్యర్ధహ్ ”అన్నాడు
  ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది -ఒకే వస్తువు వివరణగా సూచనగా ఎలా ఉంటుంది?కారణాన్ని సూచిస్తే ఫలిత0 ద్వారా తెలియ జేయవచ్చు కారణం కూడా సంబద్ధమైనదే అప్పుడు అది అప్రస్తుత ప్రశంస తో భేదిస్తుంది ..ఇక్కడ విద్యాధరుడు సూచింపబడిన అర్ధం లేక భావం బలవత్తరమైతే అప్పుడు అది ఒకరకమైన ధ్వని అని పిస్తుంది ”యత్ పునరిహకార్యస్యేవ వర్ణనం తత్కారణా పేక్ష యస్య చమత్కారాతిశయ కారిత్వాత్ ”(ధ్వన్యాలోక0 )    ఇక్కడ అతని వ్యాఖ్య ధ్వన్యాలోకం లోని వ్యాఖ్యను పోలి ఉంది కనుక మల్లినాథుడు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు .సంబద్ధమైన కారణం సంబద్ధమైన ఫలితాన్ని సూచిస్తే అది పర్యాయోక్తి అవుతుందన్నారు .అంటే ఫలితం కారణాన్ని మరొక విధంగా తెలియ జేస్తుంది .ఫలితం ద్వారా చెప్పబడే కారణం యొక్క వర్ణన  ,సూటిగా వర్ణించినదానికంటే మరింత రమ్యంగా ఉంటుంది .
  మల్లి నాధుడు కొన్ని అలంకారాలతో పోలికలు భేదాలు చర్చించి ఇదే విధంగా స్పష్టం చేశాడు .కొన్ని ఉదాహరణలు చూద్దాం –
విరోధ ,విశేషోక్తి అలంకారాల మధ్య తేడాలను వివరిస్తూ రెండు వస్తువులు ఒకే సమాన బలం తో  ఒకదానికొకటి వ్యతిరేకంగా చెప్పబడితే అది విరోధా భాస  అన్నాడు .విశేషోక్తి లో ఫలితం దాగి ఉండి కారణం లేకుండా అంగీకరింపబడకుండా ఉంటె విశేషోక్తి అవుతుంది .కానీ కారణం లేకుండా ఫలితం అంగీకరింపబడదు -”అతః ప్రతినియత్ బాధ్య బాధ్యక భావాపన్నో విరోధో విశేషోక్త్యో -విరోధాలంకారే తు విశేష భావాదుభయొహ్  పరస్పర బాధ క భావాపన్న ఇత్యనయోరపి భిన్న విషయత్వ మేవేత్యర్ధహ్ ”
 ఇలాగే రూపకాన్ని ఉత్రేక్ష ,అతిశయోక్తి ల మధ్య భేదాన్ని కూడా ఇంత స్పష్టంగానూ వివరించాడు .ఈ రెండు బృందాలలో ఉన్న భేదం ఆరోప ,అధ్యారోపాల  ఆధారంగా ఏర్పడినవే అన్నాడు .భేదం లేనిది వస్తువును మింగేసి అనుభవానికి వస్తే అధ్యవాస్యా అవుతుంది అలాంటి మింగుడు లేకపోతె ఆరోపణ అవుతుంది -”ఆరోపాన్యత్రాన్యస్యా వాపః -యధా ముఖం ఇత్యాన్న ముఖే చంద్రత్వస్య  ఏతే నాద్యావశ్య మూలో త్ప్రేక్షా తిశయోక్తి భ్యాం భేదః -విషయని గరణేనా భేద-ప్రతిపత్తి రధ్యావసాయః -విషయాని ఘరానా మంత రేణా  భేద ప్రతి పత్తి  రారోప  ఇత్యన్యో  భేదాదితి”
   ”ఏకాదశ వివర్త రూపకాల”కు సమాసోక్తికి మధ్య ఉన్న ముఖ్య విలక్షణతనుమల్లినాథ సూరి వివరించిన విధానాన్ని డా త్రివేది ఎలా తెలియజేశాడా లాల్యే పండితుడు చెప్పాడు -”మొదటి దానిలో పోలిక చెప్పే విషయి  విషయ0  పై ఆరోపింపబడి ఒక చోట చెప్పి వేరొక చోట సూచనగా ఉంటుంది అప్రస్తుతమైన విషయి  ప్రస్తుతమైన విషయాన్ని తన ధై న రూపం లో రంగుల్లో తెలియ జేస్తుంది .రెండవదానిలో అప్రస్తుతం సామాన్య గుణం తో సూచింపబడి ప్రస్తుతాన్ని బలీయం చేయదు కానీ దాని వేరే మాటలతో ఆవిష్కరిస్తుంది .మరో రకంగా రూపకం లో విషయి  ప్రస్తుతం పై ఆరోపించబడుతుంది .సమాసోక్తి లో అప్రస్తుతం యొక్క  ప్రవర్తన ప్రస్తుతం పై ఆరోపింపబడి  ”వ్యంజనమ్ ”కు కారణమవుతుంది .
  మల్లినాథుడు ఆపహ్నుతి ,వ్యాజోక్తి లమధ్య విలక్షణాలనూ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పాడు ..పోలిక దాగి ఉంటె ఆపహ్నుతి . దాగి ఉన్నదాన్ని పోలికతో చెబితే వ్యాజోక్తి .-”యత్రాహ్నవ  ముఖేన సాదృశ్యం ప్రతిపాద్యతే తత్రాపహ్నవః -యాత్ర సాదృస్యోప జీవనే నాపహ్నవః క్రియతే తత్ర వ్యా జోక్తిః ”(ఏకావాలి ).తుల్య యోగితా విషయం లో మల్లినాథుని వివరణ సూటిగా సుత్తి లేకుండా ఉంది .దీన్ని పట్టికలో ఇలా చూఅచ్చు
  ఔ పమ్య  గర్భాలంకారః
|
పదార్ధ గతః                 వాక్యార్ధ గతః ,

–     |

సమాసపూర్వకం            వ్యాస పూర్వకం
దీపకః                                    తుల్య యోగితా

పోలిక దాగ్గిఉన్నా  ధ్వనికి అవకాశం లేదు సూచింపబడిన భావం  సూటిగా అర్ధాన్ని బలీయం చేసి అది ప్రాధాన్యం కోల్పోయి అపరాఅంగికమై గూనీ భూత వ్యంగ్యం లో ఒక అరకం అవుతుంది మరో చోట దీపకం తుల్య యోగితాల ప్రధాన లక్షణ భేదం వివరణ ఉంది సమాన లక్షణం ప్రాకృతానికి కానీ అప్రకృతానికి కానీ సమీపం లో ఉంటుంది  . 
  సూరి దృష్టాంత ,నిదర్శనాలంకారాలమధ్య భేద లక్షణాలన్నీ అదే స్ఫూర్తి తో చెప్పాడు  .రెండు వాక్యాలు రెండు విభిన్న భావాలను సంబంధం లేనివాటిని చెబితే దృష్టాంతం .రెండువాక్యాలు ఒకే  భావాన్ని విధి మొదలైన ఆదేశాలతో చెబితే అర్థవాదం తో ఉంటె నిదర్శనాలంకారం -”యత్ర పరస్పర నిరపేక్షా ర్ధ త్వేన  వాక్యార్ధ భేదస్తత్ర దృష్టాంత -యాత్ర సాపేక్షార్ధత్వే న విద్యర్ధ వాదయోరివ వాక్యయో  రేఖ వాక్యతా తత్ర నిదర్శనేతి  భేదః
    అలంకారాలతో సూక్షం భేదాలను మల్లినాథుడు గమనించాడు -”ప్రత్యాయ్యప్రత్యాయక భావోనుమానం -సమర్ధ సమర్ధకా భావే నిరపేక్ష యో తతస్టే  న హేతుర్వేర్యార్దంతరన్యాసః -కేవలం సామాన్యయోహ్ కేవలావ శేష యోర్వా నిరపేక్షయోరేవ హేతు త్వే దృష్టాంత -కార్యకారణా రూపవాక్యార్ధ యోస్తు సాపేక్షార్హే తుత్వే  వాక్యార్ధ హేతుకం కావ్యలింగమితి ”అని స్పష్టపరచాడు
 నిరూపించింది ,నిరూపించబడినదానిమధ్య సంబంధం ఉంటె అనుమానాలంకారం .కారణం ఒక సామాన్యం తో విశేషం విశేషం తో సామాన్యం సమర్ధిస్తే అర్ధాంతరన్యాసం .సామాన్య విశేష వాక్యాలు భావాలు వేరుగా స్వతంత్రంగా ఉంటె దృష్టాంతాలంకారం .రెండువాక్యాలలోని భావం కార్య కారణాలు గా ఉంటె కావ్యలింగాలంకారం అవుతుంది అని సందేహ రహితంగా ఏకావాలి లోని అలంకార చర్చలో వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి వివరించాడని  త్రివేదీ తెలియజేసినట్లుడా  పి .జి .లాల్యే పండితుడు మనకు చెప్పాడు . ఇంతటితో అలంకార చందన చర్చ కు సమాప్తి పలికి  ఏకావాలి పై మల్లినాథుని వ్యాఖ్యానం లోని ముఖ్య విషయాలను తరువాత తెలుసుకొందాం .
     అన్నమయ్య   జయంతి శుభాకంక్షలతో
Inline image 1
   సశేషం
 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34

  ఏకావాలి లో అలంకార చర్చ
సమాసోక్తి అలంకారం -ఒకే పదం రెండు విషయాలను తెలియ జేయటమే సమాసోక్తి అలంకారం .ఇందులో సంబద్ధమైనది  తెలియ జేయబడి  అసంబద్ధమైనది  సూచింపబడుతుంది .ఇతరమైనదేదోదాని గుణం  ఆపాదింపబడుతుంది -”విశేషణ సామ్య మాత్ర గమ్యత్వేన రూప సమారోపా యోగాదం ప్రస్తుతస్య విషయం వాంఛే దకత్వ మాత్రం నతు తాదాత్మ్యే నావ చ్చేదకత్వమేవేతి సర్వాలంఘ రో త్తీ ర్ణేయం సమాసోక్తి రిత్యర్ధహ్ ”   

అసంబద్ధమైన దాని ప్రవర్తన ”అప్రకృత0 ”కప్పి వేయబడి లేక సంబద్ధమైనది ప్రకృతం పనిలో పోలికవలన కానీ ,లేక విశేషణాలవలనకాని కప్పబడుతుంది .రూపక ,ఉపమా సమాసోక్తి ల మధ్య విచక్షణత ఒక్కోసారి తెలియ బడుతుంది మల్లినాథుడి భావనలో మొదటి రెండు కలయికలో రూపకం బలీయంగాను ,చివరి రెండిటికలయికలో సమాసోక్తి బలీయం గాను ఉంటుంది -”ఏవం సమాసోక్త్యే క దేశా వివర్తి రూపకాయోహ్ సమావేశే రూపకం బలీయ ఇత్యుక్తమ్ .-ఉపమా సమాసోక్తి సమవాయే తు సమాసోక్తి రేవ బలీద సీతి ”
”ఏకా దేశ  వివర్తి రూపకం ”అనేది ఒక విషయం చూపబడి ,చూపే బడిన దానితో సాక్ష్యాధార పోలిక కనిపించకపోతే ఏర్పడుతుంది సూచింప బడిన రూపకాన్ని మరో చోట ఉన్న వర్ణనతో అక్కడ శబ్దాలతో చెప్పబడక పోయినా మనం గుర్తించాలీ .ఉపమాలంకారం లో ఒకదానికొకటి పోలిక  బంధింపడి గ్రహించే వీలుంటుంది .కానీ సమాసోక్తిలో ఒక దాని ప్రవర్తన మరొకదానిలో  ఆపాదింపబడుతుంది .అసంబద్ధమైన దానిలో సంబద్ధమైన దాని ప్రవర్తన ఆపాదింపబడుతుందని భావం కానీ సంబద్ధమైన దానిపై అసంబద్ధమైన దాని ప్రవర్తన  ఆచ్చాదింపబడదు
విరోధాలంకారం -రెండు విషయాలలో వ్యతిరేకత స్పష్టంగా ఉంటే  అది విరోధాలంకారం .రెండు విషయాలలో సామాన్యత ,గుణం ,క్రియ ,పదార్ధం లలో వ్యతిరేకత కనిపిస్తున్నా ఒకటిగానే ఉండాలి ‘–యత్ర ధర్మయోహ్ సమానాధికరణ్య నిబ0ధో విరోధః స్ఫు రతి తత్ర విరోధాలంకారః -యత్ర తు వైయాది కరుణ్యనిబంధనో విరోధస్తత్రా సన్మత్యాది రిత్యర్ధహ”
అర్ధాంతరన్యాసాలంకారం -ఏకావాలి లో ఒక ప్రత్యేక అసంబద్ధ  ప్రతిపాదన మరొక సామాన్య ప్రతిపాదన తో సమర్ధింపబడినప్పుడుకానీ సాధారణాన్ని విశేషణం తోకాని సమర్ధించి చెప్పటాన్ని  అర్ధాంతర న్యాసం అవుతుందని చెప్పాడు .మామూలు భాషలో సామాన్యాన్ని విశేషం తోకాని విశేషణాన్నిసామాన్యం తో కానీ సమర్ధించి చెప్పటం అన్నమాట .”యత్ర ప్రస్తుతస్య సామాన్య విశేషస్య ,వా పూర్వ పంచాద్వా నిర్దిష్టస్య తదితరేణ సమర్ధన మర్దాన్తరన్యాస ఇత్యర్ధహ్ ”
  మల్లినాథుడు సామాన్యానికి ,అనుమితి (ఇన్ఫరెన్స్ )కు ఉన్న విలక్షణత ను (డిస్టింక్షన్ )గుర్తించాడు ఆయన పద్ధతిలో ఈ అలంకారం అనుమితి తో భేదిస్తుంది .ఒక నిర్దిష్ట విషయం సూచింపబడిన వ్యాప్తి ద్వారా తెలియబడుతుంది -”ఆప్రతీత ప్రత్యాయన మనుమానే ,ప్రతీతస్య సమర్ధన మత్రేతి  భేద ఇత్యర్ధహ్ ”అన్నాడు మల్లినాథ సూరి .
   సశేషం
  నృసింహ జయంతి శుభాకాంక్షలతో
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-9-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ

టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ

 అమెరికాలోని అలబామా రాష్ట్రం లో మన్రోవిల్ లో 28-4-1926 లో జన్మించిన నెల్లీ హార్పర్ లీ అక్కడే ఎక్కువ కాలం గడిపిహార్పర్ లీ కలం పేరుతొ రచనలు చేసింది తల్లి గృహిణి .తండ్రి న్యూస్ పేపర్ ఎడిటర్ ,అలబామా స్టేట్ లెజిస్లేచర్ మెంబర్ .లీ లాయర్ అయి తెల్లవాడిని చంపారని అభియోగం మోపబడిన ఇద్దరు నల్లవారి తరఫున వాదించింది .అయినా కేసు ఓడిపోయి తండ్రీ కొడుకు అయినా ఆ దోషులు ఉరి తీయ బడ్డారు తనకుటుంబం ,చుట్టూ ప్రక్కలవారినీ బాగా గమనిస్తూ రచనలు చేసేది అలీస్ ఫించ్ లీ ,లూయీ లీ కాన్నర్ ఎడ్విన్ లీ అనే మూడు పుస్తకాలను 1911 నుంచి 1951 లోపు రాసింది
  మన్రో కౌంటీ హై స్కూల్ లో చేరి ఆంగ్ల సాహిత్యం పై అభిమాని అయింది గ్రాడ్యుయేట్ అయి మాంట్ గోమరి లోని హాంటింగ్డన్  మహిళా కాలేజీ చేరి తర్వాత తస్కలూసా లోని అలబామా యూనివర్సిటీ కి బదిలీ అయి లా చాలాకాలం చదివి  యూనివర్సిటీ న్యూస్ పేపర్ లో రచనలు చేస్తూ డిగ్రీ మాత్రం పూర్తి చేయలేదు 1948 లోలండన్  ఆక్స్ ఫర్డ్ ,యూనివర్సిటీలో యూరోపియన్ నాగరికత పై జరిగిన  సమ్మర్ క్లాస్ లకు హాజరైంది .కానీ దీనివలన ఫలితాంకనపడక మళ్ళీ లా కోర్సులో చేరింది
  1949 లో న్యూయార్క్ చేరి ఎయిర్ లైన్ రిజర్వేషన్ ఏజెంట్ అయి ఖాళీ సమయం లో ఫిక్షన్ రాసింది .అనేక పెద్ద కథలు రాసి పేరు తెచ్చుకున్నది .అప్పుడే ఆమెకు స్నేహితుడు ఒకాయన ఒక సంవత్సర జీతాన్ని పంపి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఆ కాలం లో కావలసినంత రచన చేసుకోమని రాశాడు 31 ఏళ్ళవయసులో 1957 లో ”గో సెట్ ఏ వాచ్ మన్ ”నవల రాసి ఏజెంట్ ద్వారా పబ్లిషర్ కు పంపింది .జె బి లిప్పిన్ కాట్ ఆ రచన చదివి అందులో ప్రతివాక్యం లో జీవం ఉందని పొగిడికొన్నాడు కానీ మెస్ హోహఫ్ కు నచ్చక ఎప్పటికప్పుడు మార్పులూ చేర్పులూ చేస్తూనే ఉండి చివరకు ”టు కిల్ ఏ మాకింగ్ బర్ద్ ”నవలగా రెండేళ్ల తర్వాత బయట పడింది ఈ నవలపై ఆమె I never expected any sort of success with Mockingbird. I was hoping for a quick and merciful death at the hands of the reviewers but, at the same time, I sort of hoped someone would like it enough to give me encouragement. Public encouragement. I hoped for a little, as I said, but I got rather a whole lot, and in some ways this was just about as frightening as the quick, merciful death I’d expected.

— Harper Lee, quoted in Newquist, 1964[14]
అని తన నిర్వేదాన్ని తెలియ బరచింది .రచయితా పబ్లిషర్ లమధ్య అనేక సార్లు చర్చలు జరిగేవి మార్పులకు ఆమె సుముఖంగా లేకపోతె వాళ్ళు చాలాబాగా నచ్చ చెప్పేవారు అలా ఆ నవల తుది రూపానికి చేరి1960 లో ప్రచురణ పొందింది .అమ్మకాలు జోరుగా సాగి బెస్ట్ సెల్లర్ అయిపులిటీజర్ బహుమతి పొందింది . 1999

లో లైబ్రరీజర్నేల్ ఆ నవలను ”ఈ శతాబ్దపు ఉత్తమ నవల ”అని ఎన్నికద్వారా తేల్చింది ఇదిఒక రకం గా ఆమె జీవిత చరిత్రే .పూర్తి యదార్ధ సంఘటనల తోనే రాసింది అందుకే జీవత్వం తో తొణికిసలాడింది

  తర్వాత కాన్సాస్ లోని హొల్కొంబ్ కు వెళ్లి అక్కడ ఒకకుటుంబ హత్య విషయాన్ని శోధించి ”ఇన్ కోల్డ్ బ్లడ్ ”నవలారాసి  1966 లో అచ్చేసింది — మాకింగ్ బర్ద్ ప్రచురణతర్వాత 2016 లో చనిపోయే దాకా బహిరంగ సమావేశాలలో పాల్గొనటం కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ లీ చేయనే లేదు .ది లాన్గ్ గుడ్ బై నవల రాస్తూ కాలక్షేపం చేసింది దీన్ని ముద్రించలేదు .అలాగే అలబామా మర్డరర్ పై రాసినా అదీ నచ్చక అచ్చు వేయలేదు  మాకింగ్ బర్ద్ సినిమా తీశారు దానికి అకాడెమి అవార్డు వచ్చింది ..నవలను ఇంట గొప్పగా ఇంతకూ ముందెవ్వరూ సినిమా కధగా మలచలేదు ”అని రాసింది .నటుడు గ్రెగరీ పెక్ తోను ఆతనికుటుంబం తోను లీ కుటుంబం చివరిదాకా  స్నేహ  సంబంధాలు కొనసాగించారు మన బాలీవుడ్ నటుడు దేవానంద్ ను గ్రెగరీ పెక్ అనేవారు పెక్ కు ఆస్కార్ అవార్డు ఆటి కస్ ఫించ్ పాత్రకు ఇచ్చారు 1966 లో ప్రెసిడెంట్ జాన్సన్ లీ ను ”నేషనల్ కౌన్సిల్ ఆన్ ది ఆర్ట్స్ ”కు ఎంపిక చేశాడు 1910 లో ప్రెసిడెంట్ ఒబామా ”నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ ”అంద  జేశాడు 2013 లో హార్పర్ లీ తన నవల మాకింగ్ బర్ద్ కాపీ హక్కులను స్వాధీనం చేయమని తన ఏజెంట్ అల్లుడిపై కోర్ట్ లో దావా వేసింది ఇరుపక్షాల వాదనలు విని జడ్జి రాజీ కుదిర్చి పరిష్కరించాడు 2014 లో మన్రో హైకోర్టు లో మ్యూజియం తనకు తెలియకుండా అనుమతి లేకుండా తననవలా ప్రదర్శన చేస్తోందనివ్యాజ్యం వేసింది
   2015 లో ”గో సెట్ ఏ వాచ్ మన్ ”నవల ప్రచురణకు కోర్ట్ అనుమతించింది 89 ఏళ్ళవయసులో 19-2-2016 న హార్పర్ లీ మరణించింది .రెండే రెండునావాలాలు అయిదే అయిదు వ్యాసాలూ మాత్రమే రాసినా హార్పర్ లీ అమెరికా సాహిత్యం లో గొప్ప నవలాకారిణిగా గుర్తింపు పొందింది
Inline image 1Inline image 2Inline image 3
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం

సాహితీ బంధువులకు – ఈ వ్యాసం రాసి సుమారు 9 నెలలయింది .కంటిన్యుటీ తెలియాలని దీన్ని మళ్ళీ పంపిస్తున్నాను .ఈ రోజు నుంచి దీని తర్వాతి విషయాలు రాస్తాను -దుర్గాప్రసాద్ -8-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

నా దారి తీరు -100

మేడూరు లో ఉద్యోగం

2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 సాయంత్రం విధులనుండి విడుదలై ,రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కనుక జాయినింగ్ టైం ఉండదు కనుక మర్నాడే  మేడూరు హైస్కూల్ లో 23-8-90 ఉదయం చేరాను .

సుమారు సంవత్సర కాలమే చిలుకూరి వారి గూడెం లో పని చేసినా ,ఆ స్కూల్ అన్నా ఆ ఊరు అన్నా విపరీతమైన అభిమానం ఏర్పడింది .మళ్ళీ ఎప్పుడైనా అక్కడే చేయాలని అనిపించేది .అంతమంచి వాతావరణం ఏర్పడి ,అనుబంధం శాశ్వతమయింది .అందుకే ఈబాద .రాను పోనూ ప్రయాణపు ఇబ్బంది తప్ప అక్కడనాకు యే ఇబ్బందీలేదు స్టాఫ్ సహకారం ,పిల్లల ప్రవర్తన కమిటీ వాళ్ళ చేయూత అన్నీ అందుకొని స్కూల్ రూపు రేఖలనే మార్చగాలిగాను .ఇంత గొప్ప అభి వృద్ధి చేయగాలుగుతానని నాకే తెలియదు అన్నీ కుదిరి అలా జరిగింది .ఇందులో నాకు సహకరించిన లెక్కల మేష్టారు శ్రీ పురుషోత్తమా చారి సెకండరీ మాస్టారు శ్రీ శేషగిరి రావు హాస్టల్ వార్డెన్ శ్రీ రాఘవుల చేయూత జీవితం లో మరువ లేనిది .నేను అక్కడి నుంచి బదిలీ అయి వచ్చినా, వీళ్ళు నాతో ,మా కుటుంబం తో అదే బాంధవ్యాన్ని కొనసాగించారు .లెక్కల మాస్టారి తల్లిగారు భార్య నా యెడల చూపిన ఆప్యాయత మరువలేను .పై మూర్తిత్రయం బెజవాడ వైపు వచ్చినప్పుడల్లా ఉయ్యూరు వచ్చి మా ఆతిధ్యం పొంది వెళ్ళేవారు వాళ్ళను చూస్తే మహదానందంగా ఉండేది .పూర్వం మానికొండలో రాజుగారు గరుడాచలం గారు ,రాఘవ రావు లు యెంత అభిమానంగా ఉండేవారో అదే ఇప్పుడు కనిపించింది .జననాంతర సౌహృదం అనిపిస్తుంది ఆలోచిస్తే .అలాగే మేము మైలవరం వైపు వెళ్ళినా వాళ్ళను కలిసి మాట్లాడకుండా ఉండే వాళ్ళం కాదు .మా మూడో వాడు మూర్తి చిలుకూరి వారి గూడెం దగ్గర రామ చంద్రాపురం లో ఆర్ ఏం పి డాక్టర్ గా ఉన్నప్పుడు ,మైలవరం దగ్గర గణపవరం లో ఉన్నప్పుడు కారు మీదమా అక్కయ్య బావలతో  మైలవరం లో రాఘవులుగారిని పుల్లూరులో ఆచార్యుల గారి ఫామిలీ ని అక్కడికొచ్చిన శేష గిరి రాగారినీ చూసి కిన్నెర సాని ,భద్రాచలం ,నెమలి ,జమలాపురం ఒక సారి వెళ్లాం మరో సారి మా అమ్మాయి మేము కలిసి వెళ్లి వీళ్ళందర్నీ చూశాం .అలా చాలాకాలం కొనసాగింది .

తర్వాత శేషగిరి రావు గారు నన్ను మళ్ళీ చిలుకూరి వారి గూడెం ట్రాన్స్ ఫర్ చేయించే ప్రయత్నం శాసనసభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారిద్వారా చేస్తానని రిక్వెస్ట్ రాసి ఇమ్మని ,రెండు మూడు సార్లు నేను అడ్డాడలో ఉండగా వచ్చి అడిగారు .అది ఇక జరగని పని అని ఆయన్ను సమాధాన పరచి పంపేవాడిని .ఆయనకు హెడ్మాస్టర్ బండి రామారావు కు కెమిస్ట్రీ కుదరలేదని ఆయన మాటల్లో తేలింది స్కూల్ డబ్బు స్వాహా చేస్తున్నాడని కూడా చెప్పిన జ్ఞాపకం గుడివాడలో ఆయన బ్రహ్మాండమైన ఇల్లు కట్టి గృహప్రవేశానికి స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లాను అక్కడ లెక్కలమేస్టారు వార్దేన్ గారు మళ్ళీ కలిశారు .తర్వాత శేషగిరి రావు గారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని లేక్కలమేస్టార్ ఫోన్ చేస్తే బెజవాడ విజయ టాకీస్ ఎదురుగా ఉన్న హాస్పిటల్ లో ఇన్సెంటివ్ కేర్ లో ఉండగా చూసొచ్చాను .కాని ఆయన ఆతర్వాత రెండుమూడు రోజులకే చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు గుడివాడలో కార్యక్రమాలు చేశారు కాని నేను వెళ్ళలేక పోయాను వీరు భొట్ల శేషగిరిరావు గారి అన్నగారికి ఉయ్యూరు లో ఉన్న వేమూరు దుర్గ,సుబ్రహ్మణ్యం గార్ల అమ్మాయినిచ్చి ద్వితీయం చేశారు .ఆ సందర్భం గా రెండు వైపులవారూ నన్ను సంప్రదించి మంచి చెడ్డలుతెలుసుకొన్నారు ఈ విధంగా ఉయ్యూరు బంధం ఆయనకు ఏర్పడింది

లెక్కల మాస్టారు ఏం .పురుషోత్తమా చారి గారి తో స్నేహం అసలెన్నటికీ మరుపు రాదు ఆయన కుటుంబం తో నూ అంతే .ఇదెక్కడి బంధమో ఆశ్చర్యమేస్తుంది .ఆచారి గారి తల్లిగారి ఆరోగ్యం బాగా ఉండేదికాదు భార్య చాలా సన్నగా అనారోగ్యంగా నే ఉండేవారు .కాని ఆదరణకు స్నేహానికి వాళ్ళనే చెప్పుకోవాలి ఆడపిల్ల మగ పిల్లాడు చిన్నక్లాసులు చదువుతున్నారు .దాదాపు 8 ఏళ్ళక్రితం ఆచారి గారు చనిపోయారని వాళ్ళబ్బాయి ఫోన్ చేశాడు .వెళ్ళలేక పోయాను .తర్వాత వాళ్ళ అమ్మాయి వివాహం మైలవరం లో చేస్తున్నామని శుభలేఖ పంపి వాళ్ళబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు  .అదే ముహూర్తానికి బెజవాడలో మల్లాది వెంకటేశ్వర్లు కూతురు వివాహం .వివాహం చూసి అక్షంతలు వేసి దీనికి హాజరైన దంటు వారబ్బాయి ,వెంపటి శర్మగారబ్బాయిలను చాలా రోజుల తర్వాత చూశాం .అక్కడికి మమ్మల్నిద్దర్నీ చూడటానికి వచ్చినఆత్మీయులు కవి కధకులు  శ్రీ గంధం వేంకాస్వామి శర్మ గారిని చూశాం అప్పటికే 85 ఏళ్ళ వృద్దు ఆయన .’’ఎందుకండీ శ్రమ పడి వచ్చారు ?మేమే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళం కదా ‘’అన్నాను .ఆయన నవ్వి ‘’మీ ఇద్దర్నీ చూస్తే పార్వతీ పరమేశ్వరులని పిస్తుంది అందుకే దర్శనం కోసం వచ్చాను ‘’అన్న ప్రేమాభిమాన మూర్తి వారు .ఇదే వారిని చూసిన చివరి సారి .ఆ తర్వాత మేము అమెరికా వెళ్ళటం అక్కడ మేము ఉండగానే వెంకాస్వామి శర్మగారు చనిపోవటం జరిగింది

సత్యనారాయణ పురం లో మల్లాది  వెంకటేశ్వర్లు కూతురు పెళ్లి నుంచి సరాసరి బస్ స్టాండ్ కు వెళ్లి మైలవరం బస్ ఎక్కి ఫంక్షన్ హాల్ కు చేరేసరికి సుమారు మధ్యాహ్నం 2 అయింది వేలాది మంది వచ్చి భోజనాలు చేసి వెడుతున్నారు మేము లేక్కలమాస్టారి భార్యను పలకరించి పెళ్లి కూతురు కు కానుక అందజేసి ఆశీర్వ దించి వాళ్ళబ్బాయి అబ్బాయాచారి మా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట వివాహ భోజనం చేసి మళ్ళీ బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరాం ఇన్ని జ్ఞాపకాలు మాకు లేక్కలమేస్తారి కుటుంబం తో ఉన్నాయి పిల్లలిద్దరూ మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోనే బి టేక్ చదివి బెంగుళూర్ లో ఉద్యోగాలలో ఉన్నారు మంచి అభివృద్ధి సాధించారు లెక్కల మేస్టారి మంచి మనసే ఈ అభివృద్ధికి కారణం వారి అమ్మగారి ఆశీస్సులు విశుద్ధ హృదయం తోడ్పాటుగా నిలిచాయి .

అంతకు ముందు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్త్రేస్ విజయ లక్ష్మి గారి పదవీ విరమణకు ఆహ్వానిస్తే నేనూ  వెళ్లాను అప్పుడు ఆచారిగారు కలిసి ఇంటికి తీసుకు వెళ్ళారు .

మేడూరు స్కూల్ విశేషాలు

ఉయ్యూరు లో 23-8-90 ఉదయం 7 గంటలకేఇంట్లో భోజనం చేసి సరాసరి బెజవాడ మేడూరు బస్ ఎక్కి ,తాడంకి కపిలేశ్వరపురం వీరంకిలాకు పమిడిముక్కల మీదుగా మేడూరు చేరాను .ఉదయం విధుల్లో చేరినట్లు సంతకం పెట్టాను .పెద్దస్కూల్ .సుమారు ౩౦౦ మంది పిల్లలు .అన్నీ రెండు సెక్షన్లు .స్టాఫ్ అందరూ కొత్త నా ముందు ఇక్కడ పనిచేసిన శ్రీ జి ఎస్ యెన్ చౌదరి కూడా బిఎడ్ లో నా ట్రెయినింగ్ మేట్ అవటం మరో తమాషా అతన్ని పునాది పాడు వేశారు .ఒక సారిస్కూల్ అంతా కలయ తిరిగా .మంచి బిల్డింగ్ లున్నాయి .పెద్ద ఆటస్థలం  మంచి లేబరేటరీ దానిలోనే పాఠాలు చెప్పటానికి వీలైన విశాలమైన హాలు ,పైన లైబ్రరీ కం కామన్ హాల్ ఉంది లైబ్రరీలో చాలా పుస్తకాలు మంచి పుస్తకాలు ఉన్నాయి లైబ్రేరియన్ శ్రీమతి  కోటమ్మ అనిజ్ఞాపకం ఇక్కడే ఉద్యోగం లో చేరి నాన్ స్టాప్  గా పని చేస్తోంది చాలా మంచి ఆవిడ అనిపించింది .పెద్దావిడే .స్కూల్ ముందు వెనకా ఆట స్థలం చుట్టూ కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి పెద్ద ఊటబావి దానికి ఎలక్ట్రిక్ మోటారు ఓవర్ హెడ్ వాటర్ టాంక్ అన్నీ ఉన్నాయి .కొబ్బరి  పోషణకు ప్రభుత్వం డబ్బు అందజేస్తుంది మూడు నేలలలకోసారి జమాఖర్చులు పంపాలి ఉయ్యూరయ్య అనే జూనియర్ గుమాస్తా స్కూల్ లెక్కా డొక్కా తోపాటు దీన్నీ చూస్తాడు .నమ్మకస్తుడు భయస్తుడు కమితీవారి తలలో నాలుక కూడా .కొంతా స్థలం లో వరిసాగు కూడా ఉంది గొప్ప  .సీనియర్ గుమాస్తా సుబ్రహ్మణ్యం గారని గుర్తు ఉయ్యూరులో మాధవరావు అనే ఆయన తోడల్లుడు .గంభీరంగా ఉంటాడు .సైన్స్ మేస్టర్ శ్రీసుబ్రహ్మణ్యం  నాతొ పెనమకూరులో చేశాడు .భార్య గ్రేడ్ టు తెలుగుపండిట్ .లెక్కల మాస్టారుశ్రీ ప్రసాద్ అని చాలా సమర్ధుడు ,మంచి టీచర్ .తలలో నాలుక .స్కూల్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్ ఆయనే ఇంకో పోస్ట్ లో ఎవరో ఒకరు రావటం వెళ్ళటం జరిగేది .కనుక బాధ్యతఅంతా ప్రసాద్ గారిమీదే ఉండేది .సీనియర్ తెలుగు మేష్టారు శర్మగారు .దగ్గరలో ముళ్ళపూడి వారు స్కూల్ ఫంక్షన్ లన్నీ ఈయనే నిర్వహించేవారు .వాళ్ళబ్బాయి టెన్త్ లో ఉన్నాడు చురుకైనవాడు పబ్లిక్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు నాకు బాగా ఇష్టమైన శిష్యుడు చాకు అంటామే అలాంటి షార్ప్ నెస్ ఉన్నవాడు ఆయన కుటుంబం లో అందరూ తెలుగు పండితులే ఒక అన్న పెనమకూరు లో తెలుగు పండిట్ .ఇంకో ఆయన కపిలేశ్వరపురం లో అలా .సోషల్ మేష్టారు మస్తాన్ గారు .ఇక్కడి వాడే  హిందీటీచర్ లేడీ .ఉయ్యూరు లనుండి వస్తారు కోటలో అద్దెకుంటున్నారు భర్త తమిరిశ దగ్గర సోషల్ మేష్టారు ఇద్దరు ఆడపిల్లలు .పేరు తూటుపల్లి సావిత్రి అనిజ్ఞాపకం .సెకండరీ గ్రేడ్ లలో లంకపల్లి ఆయన నల్లగా పొట్టిగా ఉండేశ్రీరామ మూర్తిగారు .మా మామయ్యా వాళ్ళ పొలం కౌలుకు చేస్తానని ఒకటి రెండు సార్లు ఉయ్యూరులో నన్ను చూశానని గుర్తు చేసుకొన్నారు  .ఈయనే స్టాఫ్ సెక్రటరి .అందర్నీ ఒప్పించగలిగే ఓర్పూ నేర్పూ ఉన్నవారు .భీష్మ పితామహుడు ఒకాయన రెడ్డియ్యగారు ఉండేవారు .క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశ రావు గార్డెనింగ్ .’’దేవదాసు ‘’.అటెండర్ అర్జున రావు .రుద్రపాక వాడు ఇక్కడే సెటిల్ అయ్యాడు నైట్ వాచ్ మన్ ఆ ఊరివాడే కోటయ్య .సీనియర్ డ్రిల్ మాస్టారు శ్రీ సుబ్బారావు కపిళేశ్వరపురం వాడు రెండో డ్రిల్ మాస్టారు పమిడిముక్కలనుంది వచ్చేవారు మెతక మనిషి .నా దగ్గరే రిటైర్ అయ్యాడుసహృదయుడు  లాబ్ అసిస్టంట్ ప్రసాద్ –అతనికొడుకు 9 లో ఉన్నాడు స్కూల్ లో సంచాయిక ‘’అనే పిల్లల పొదుపు పధకం నేనెక్కడ పని చేసినా సమర్ధంగా నిర్వహించాను ఇక్కడ దాన్ని ప్రసాద్ చూస్తున్నాడు .వార్షికోత్సవం నాటికి ఎవరు ఎక్కువ పొడుపు చేస్తే వారికి బహుమతి ఇచ్చేవాళ్ళం .బాగా తెలివిగలవాడు సహృదయుడు .కొద్దికాలానికి గుమాస్తా సుబ్రహ్మణ్యం గారు బదిలీ అయి, లోయ శంకర రావు వచ్చాడు జగజ్జన్త్రీ మాటల గారడీ వాడు పని కూడా స్పీడ్ గా చేసేవాడు బాగా రాజకీయ పలుకుబడి ఉన్న వాడు .నాకు బాగా ఉపయోగ పడ్డాడు .అలాగే కొద్దిమంది బదిలీ అవటం కొత్తవాళ్ళు రావటం జరిగేది .

సాయంకాలం స్టాఫ్ సెక్రెటరి స్టాఫ్ సమావేశం ఏర్పాటు చేశారు తేనీటి విందు ఇచ్చారు .నన్ను నేను పరిచయం చేసుకొని అందరి పరిచయం చెప్పించి ,అందరం కలిసి స్కూల్ అభి వృద్ధికి పని చేద్దాం యిలా చేస్తా అలా చేస్తా అని నేను చెప్పను సంవత్సరం చివరికి మనం ఏం చేశామో తెలుసుకొందాం అని చెప్పాను ఒక పావుగంటలో స్టాఫ్ మీటింగ్ పూర్తీ చేశాను స్కూల్ జనరల్ డిసిప్లిన్ అంతా డ్రిల్ మాస్టర్ సుబ్బా రావు గారే చూసేవారు .రోజూ సమయానికి అసెంబ్లీ నిర్వహించటం ,లేట్ గా వచ్చిన వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వటం అన్నీ పకడ్బందీ గా చేసేవాడు .టీచర్ లలో బాడ్మింటన్  ఆడే వాళ్ళలో నేనూ తెలుగు మాస్టారు డ్రిల్ మాస్టారు , సైన్స్ ,లెక్కల మేస్టార్లు ఉన్నాం మేమందరం వాలీబాల్ కూడా ఆడేవాల్లమే కనుక స్కూల్ అయ్యాక ఒక గంట ఆడుకొని అప్పుడు బయల్దేరేవాళ్ళం

మళ్ళీ ప్రయాణం తిప్పలు

మేడూరు ఉయ్యూరుకు దగ్గరే .సుమారు 15 కిలోమీటర్లు కాని రోడ్డు బాగుండదు బస్ ఫ్రీక్వెంసి లేదు .ఏదో రకంగా వీరంకి లాకు చేరితే అక్కడినుండి వెళ్ళాలంటే ‘’టంగు’’ తెగేది .ఏదో తంటాలుపడి పమిడిముక్కల చేరితే అక్కడి నుండి స్కూల్ పిల్లల సైకిల్ మీద ఎక్కి వెళ్ళాలి లేక పోతే లెఫ్ట్ అండ్ రైట్ రెండుకిలోమీటర్లు   అలాగే సాయంకాలం 5 గంటలకే మేడూరు నుంచి విజయవాడ బస్ .అది మిస్ అయితే ఆరున్నరకో ఏడుకొ కాని మళ్ళీ బస్ లేదు .ఇంటికి చేరేసరికి ఎనిమిది దాటేది .ఒక రకంగా నాపని’’ పెనం మీంచి పొయ్యిలోకి ‘’అన్నట్లు అయిందేమో అనిపించింది .

సాయంకాలం బస్ కోసం స్కూల్ దగ్గరే ఉన్న యలమంచిలి వెంకటేశ్వరరావు గారు అనే రిటైర్డ్ సెకండరీ గ్రేడ్ మాస్టారి అరుగులపై ఆయనతో కబుర్లు చెప్పుకోవటం ఆయన శ్రీ పి శ్రీరామ మూర్తి గారి మనిషి .కబుర్లు బాగానే చెప్పేవారు ఎన్నో పాత విషయాలు తవ్వుకొని మాట్లాడుకొనేవాళ్ళం అలాగే ఆ ఊళ్లోనే రిటైర్ అయిన ఒక హిందీ మాస్టారు కూడా ఉన్నారు ఆయనా వెంకటేశ్వర రావే ఆయన ఇక్కడ ట్యూషన్ కింగ్ .

శ్రీ యలమంచిలి రామమోహన రావు గారు

మేడూరు అన్నా మేడూరు స్కూల్ అన్నా శ్రీ యలమంచిలి రామమోహన రావు గారే జ్ఞాపకం వస్తారు ఎవరికైనా మేడూరు లోనే కాదు చుట్టూ ప్రక్క వంద గ్రామాలలో అంతటి మంచి మనిషి .లేరు .మేడూరు గ్రామ సర్పంచ్ గా దాదాపు 25 ఏళ్ళు పనిచేశారు స్కూల్ బిల్డింగ్ కు స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టించారు .పంచాయితీ భవనం పసువులాస్పత్రి వంటివి అన్నీ వారి వితరణ వలన వచ్చినవే  ఆయన గొప్ప సంస్కారి .మాంచి కాంగ్రెస్ అభిమాని నిజాయితీకి నిర్భీకతకు ప్రసిద్ధి .ఎప్పుడూ తన చేయి పైనే ఉండాలని కోరుకొనేవారు దాన ధర్మాలకు లెక్కేలేదు .శ్రీ కాకాని వెంకటరత్నం గారికి నమ్మిన బంటు ,కాకాని వారు యే ఎలక్షన్ లో నిలబడినా ఖర్చు అంతా రామ మోహన రావు గారిదే దానితో ఎలక్షన్ అయ్యాక ఈ యన పొలం నాలుగో ఐదో ఎకరాలుఖాళీ .అంతమాత్రం చేత వెనకడుగు వేసేవారుకాడు మళ్ళీ ఎన్నికకు మళ్ళీ రెడీ సుక్షేత్రమైన మాగాణి పొలం కాకాని వారికోసం ఎన్నికలార్పణం అయ్యేది .సర్పంచ్ గా గ్రామాన్ని సర్వతోముఖా భి వృద్ధి చేశారు కాని రోడ్డు సౌకర్యం ఎర్పరచుకోలేక పోయారు తారు రోడ్డు గతుకుల రోడ్డే గతి .రావు గారికి రాజకీయ ప్రమోషన్ రావాలని ఆశించారు జనం దానికి ఆయన ససేమిరా అనేవారు నేను శాసన సభకు నిలబడతాను అంటే కాకానికి నిలబడే సాహసం ఉండేదికాదు అంత సాహసం ఈ వీర భక్త హనుమాన్ చేయలేదు ఏనాడూ .చివరికి ఉయ్యూరు మండలానికి ఉపాధ్యక్షులుగా అందరి బలవంతం మీద పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .ఆయన కనబడినా ఆయన పేరు చెప్పినా ‘’చేయెత్తి మహానుభావుడు ‘’అని నమస్కరిస్తారు జనం అదీ ఆయన కున్న కీర్త ప్రతిష్ట ‘అలాంటి రామ మోహన రాగారు నేను మేదూరులో చేరటానికి సుమారు రెండు నెలల ముందు చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రావు  మేడూరు సర్పంచ్ .ఆయన తమ్ముడు ఉయ్యూరు షుగర్ ఫాక్ట్రరీ లోను ,చుట్టూ ప్రక్కలా ప్రసిద్ధుడైన చెరుకు రైతు .పేరు గుర్తు లేదు .స్కూల్ కు సలహా దారు కూడా  ఇదీ నేను చేరిన మేడూరు అక్కడి స్కూలు నేపధ్యం మిగతా వివరాలు తరువాత తెలియ జేస్తా .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -33

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -33

— ఏకావాలి లో  అలంకార  చర్చ

అతిశయోక్తి అలంకారం -అతిశయోక్తి అలంకారం  ఉత్ప్రేక్షను పోలి ఉంటుంది కనుక మల్లినాథుడు దీని గురించి  చర్చించే ముందు ఆసక్యికలిగించే చిరు  ఉపోద్ఘాతం రాశాడు.-”తదేవ మధ్యవసాయ ప్రధానోత్ప్రేక్షామ్ లక్షయిత్వా -సంప్రత్య ధ్యవసితం ప్రాధాన్యేనాతిశయోక్తి0 విభాగ పూర్వ కమాహ ”
 ఆద్యావసతి అంటే అధ్యవసాయ .అది  సాధన స్థితిలో ఉంటె అప్పుడు అతిశయోక్తిలో మొదటి రకం అవుతుంది ..కానీ ఉత్ప్రేక్ష అధ్యావసాయాలో సాధ్య రకం పై ఆధార పడి  ఉంటుంది .ఉత్ప్రేక్ష సాధ్యవత్వం ,విషయం ల కు సంబంధం కలిగి ఉంటుంది .కానీ అతిశయోక్తి సిద్టత్వ ,విషయాంగిర్ణత్వ లతో సంబంధం కలిగి ఉంటుంది .అతిశయోక్తిలో అధ్యావసిత  సిధత్వం అంటే సంబంధం తేడా లేక పోవటం వలన అంటే వస్తువు వేరొకటి కాకపోవటం వలన ఉంటుంది .తేడా ఏమిటి అంటే తేడా లేకపోవటమే . విద్యాధరుని గ్రంధం ఏకావాలి లో అతిశయోక్తి నాలుగు రకాలని చెప్పాడు .మల్లినాథుడు మాత్రం మమ్మటుడు చెప్పిన నాలుగు అతిశయోక్తుల్ని వ్యతిరేకించాడు .మమ్మటుని అతిశయోక్తులు -1-భేదం లో భేదం లేక పోవటం 2-భేదం లేకపోవటం లో తేడా ఉండటం 3-వేరొక అసాధ్యమైన అర్ధం ”యది” మొదలైనచిన్నభాగాలతో  (పార్టికిల్ ) తెలియజేయటం  4-ఫలితం కారణం ల క్రమం అతిక్రమించటం
  ఇక్కడ మల్లినాథుడు సంబంధ అసంబంద0 ల నాధారంగా రకాలు చెప్పాడు .ఆ వైవిధ్యాన్ని ఒప్పుకోకపోతే ఆ రెండూ వేరు అవ్వాలి లేక రకాలలో కలిసి పోయి ఉండాలి అన్నాడు .అందులో మొదటిది ప్రత్యేక విలక్షణత ఉండటం వలన సమర్ధించ సాధ్యంకాదు .రెండవ ప్రత్యామ్నాయం కూడా సమర్ధింపబడదు కారణం ఇందులో భేద పరచే విషయం చెప్పబడక పోవటమే .ఇక మూడవ రకానికి వస్తే మమ్మటుడికే అనుమానాస్పదంగా ఉంది కనుక మొదటి రెండు ఒప్పుకోదగ్గవి కావు .నాలుగవ దానికి అసలు అవకాశమే లేదు -”పుష్పం ప్రవాలోపహితం యది స్యాన్ -ముక్తాఫలం వాస్ఫుటా  విద్రు మాస్యాం-తతో నుకుర్యా ద్విపదస్య తస్యా – స్తా మ్రొష్ట పర్యస్త  రుచం స్మితస్య ”
 మొదటిది సంబంధం లేని దానిలో సంబంధంఉందని చెప్పే ఉదాహరణ  .ఇక్కడ ‘  పుష్పం ,ముత్యం లమధ్య ఏరకమైన సంబంధం లేక పోయినా ”యది” అనేదాని వల్ల  సంబంధ అవకాశం ఉందేమో నని పిస్తుంది .రెండవ ఉదాహరణలో అభేదాలలో ఉన్న భేదాల రకాలు తెలియ జేస్తుంది ..స0బంధ  రాహిత్యం ఏదో ఒక భావం వలన ఉందనిపించటం. దీన్ని పండితులే తేల్చి చెప్పాలి .కనుక మల్లినాథుడు ఐదురకాల అతిశయోక్తులను సమర్ధించాడు అయితే ఇందులో సామాన్యం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది దీనికి అలంకార సర్వస్వ కర్త సమాధానం చెప్పాడు -”అధ్యావసిత ప్రాధాన్యే అతిశయోక్తిహ్ ఇతి సర్వస్వ కారో క్త మేవేతి బృమః ”
దీపకాలంకారం -దీన్ని చాలా స్పష్టంగా మల్లినాథుడు వర్ణించి చెప్పాడు .-”యథావా లోకే దేవా సమీపే స్థాపితస్య దీపస్య -కుంభా స్తంభా ధ్రుప లంభో పకారక త్వం త ధాయ మప్యేకత్ర స్థితం సర్వం -దీపకాతీతి దీపక ముచ్యత ఇత్యర్ధహ ”
ప్రాయాజా అనేది జంతువుకు అర్ధం అయినా త్యాగానికి కూడా అర్ధంగా ఉండి ,దేవుని దగ్గర పెట్టిన దీపం దూరానికి కూడా   కాంతిని  ప్రసరింప జేసినట్లు దారిలోని అన్నివస్తువులను  కాంతి వంతమ్ చేసినట్లు దీపక అలంకారం సార్ధకమైంది దీపకం లో ఒకటికాని  ఎక్కువ  సంబంధిత వస్తువులు ఒక గుణం తో కలపబడి ఉంటా యి .తుల్య యోగితలో అన్ని వస్తువులు సంబంధం కలిగికాని సంబంధం లేకుండాకాని ఉంటాయి .
 శ్లేషాలంకారం -మల్లినాథుడు శ్లేషను ”పదం లో సామ్యత ఉండి అది వస్తువుకు విశేషణానికి సంబంధం కలిగి ఉంటె శ్లేష ”అన్నాడు .కనుక ఇది శబ్దాలంకారం .విద్యాధరుడు ,మల్లినాథుడు ఇద్దరూ కూడా శ్లేషకు ,శబ్ద శక్తి మూల ధ్వనికి  ఉన్న భేదాన్ని వివరించారు .రెండింటిలోనూ వస్తువు విశేషణం లలో రెండు అర్ధాలు ఉంటాయి కానీ శ్లేషలో ఆ రెండు సంబంధం కలిగికాని లేకుండాకాని ఉంటాయి .అక్కడ పదానికున్న భావం సందర్భాన్ని బట్టి కప్పేస్తుంది కానీ వేరొక సందర్భం లేని అర్ధాన్ని సంబంధ మున్నా అర్ధం తర్వాత  సూచిస్తుంది .సందర్భం లేనిదాన్ని రెండర్ధాలమాటవలన గ్రహించాలి .శబ్ద శ్లేషలో సంబధం ఉన్నది లేనిది రెండూకూడా  బంకా ,కర్రా లాగా అతుక్కు పోయి ఉంటాయి అర్ధ శ్లేష లో అవి రెండుఒకే కొమ్మకున్న  రెండు పళ్ళు లాగా ఉంటుంది . ”యత్రప్రయత్న స్వరాది భేదా ద్రవస్తుతో భిన్నయోరేవ శబ్దయెహ్ మిథః సంశ్లేష భేదత్వాతు -కాష్ఠవదే కట్వేనావభాసః శబ్ద శ్లేష ఇత్యర్ధహ-తత్రైక వృ0త  ఫలద్వయ పద  ఖండేక  శబ్దే అర్ధ ద్వయ శ్లేష సార్ధ శ్లేషహ  ఇత్యర్ధహ  ”
అప్రస్తుత ప్రశంస -ఇందులో సంబంధం లేని అప్రస్తుతం చెప్పబడి ప్రకృతం సూచింపబడుతుంది ప్రశంస అనే దాని అర్ధం పొగడటం కాదు చెప్పటం లేక వర్ణించటం -”యత్రసారూప్యాది సంబంధత్రమా వశేనా ప్రస్తుత కధనాత్ ప్రస్తుతం గమ్యతే సాప్రస్తుత ప్రశంసయ్యుత్యర్ధహ్ ” అని మల్లినాథుని నిర్వ చనం
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు )

వీక్లీ  అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు )

  రెండు పుట్టిన రోజుల వారం -2
7 వ తేదీ ఆదివారం విషయాలు -నిన్న మైనేనిగారు నాకు మెయిల్ రాస్తూ డా ఇన్నయ్యగారి భార్య గారు ”ఈల్ వీజిల్ ”రాసిన ”నైట్ ”పుస్తకాన్ని తెలుగులోకి”కాళరాత్రి ”గా  అనువదించి ముద్రించారని తనకు పంపిన మూడు కాపీలలో ఒకటి పంపానని మంగళవారం అందుతుందని తెలియ జేశారు .దీ న్ని మా మనవుడు శ్రీకేత్ టెక్స్ట్ బుక్ గా చదివి నాకిస్తే నేనూ చదివి తెలుగులో డబ్బింగ్ చేద్దామనుకొని ఎందుకో చివర నచ్చక మానేశాను ఆ పని ఆమె చేసినందుకు అభినందనలు మా అమ్మాయి ఇంటి దగ్గర నిర్వహించే తెలుగు క్లాసులు ఈ రోజుతో అయిపోయాయి పరీక్ష పెట్టారు మళ్ళీ సెప్టెంబర్ లో బడులు తెరిచాకనే మళ్ళీ ప్రారంభం అప్పటిదాకా ఆటవిడుపు . ఇవాళ ఉదయం  వీక్లీ  5 మొదటిభాగం రాశాను .     మధ్యాహ్నం  భోజనాలయ్యాక రెండు గంటలకు బయల్దేరి హిందూ సెంటర్కు వెళ్లాం .అక్కడ షార్లెట్ సాయి సెంటర్ వాళ్ళు గాంధీ భవన్ లో శ్రీ సత్య సాయి మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మగారి జయంతిని జరిపారు శ్రీమతి జయ ముఖ్య భూమిక వహించింది.  పిల్లలతో చక్కని ప్రోగ్రాములు నిర్వ హింప జేశారు తలిదండ్రుల సహకారం పిల్లల కుతూహలం ,సెంటర్ లోని టీచర్ల శిక్షణ అన్నీ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి మా మనవాళ్ళు చి ఆశుతోష్ ,పీయూష్ లు కూడా పాత్ర పోషణ చేశారు  .
  సరిగ్గా మధ్యాహ్నం 3 కు ప్రార్ధన తో మొదలైంది .తర్వాత అందరూ సత్య అనిపిలిచే సత్య శంకర్ -బాబా కు తల్లికి ఉన్న చక్కని అనుబంధాన్ని తేలికమాటలతో అందరికీ అర్ధమయ్యేట్లు ఇంగ్లీష్  లో తెర మీద పిక్చర్లు చూపిస్తూ ప్రసంగించారు అతడు మంచి వక్త ,వాద్యకారుడు . భార్య సౌమ్య హార్మోనిస్టు  గాయకురాలు . కూతురు కూడా మంచిగాయని .ఈ కుటుంబం సాయి సెంటర్ కు వెన్నెముక అన్నివిషయాలలో –
”సాయి బాబా తాత  కొండలరాజు మనవడి లో  దైవ లక్షణాలు కనిపెట్టి చేయెత్తి నమస్కరించకుండా చేయి పట్టుకునేవాడు అదే నమస్కారం బాబా నిద్ర పోతుంటే వచ్చి పాదాలకు నమస్కరించేవాడటతాత .తాత కుఅన్నం వండేవాడు బాబా రసం బాగా కాచేవాడట ..పుట్టపర్తి అంటే పాము పుట్టపర్తి అనేవారట నాగ సంచారం ఎక్కువ కొండలు రాళ్లు రప్పలమయం బాబా చిన్నతనం లో .బాబాను చిన్నప్పటినుంచి బ్రహ్మ జ్ఞాని అనేవారట అందరూ .తల్లి నమ్మేదికాదట .ఒక్కోసారి ఆయన మహిమలు చూసి కంగారుతో అత్తగారికి చెప్పేది .ఆమె ఎవరికీ చెప్పకు నవ్వుతారు అనేది .. ఇంట్లో ఏ పండగ జరిగినా తన పుట్టిన రోజు అయినా సరే అందరికీ అన్నీ ఇప్పించి చివరికి తాను తీసుకునేవాడు సత్య నారాయణ రాజు అనే సత్య సాయి .దూరం గా అడవుల్లో ధ్యానం లో ఉన్న బాబా ను చూడటానికి తలిదండ్రులు వస్తే ”మాయ ”వచ్చింది అనేవాడు .అంటే తానూ సంసార బంధానికి దూరామని అర్ధం .బ్రహ్మజ్ఞానికి ఏ బంధాలు ఉండవని భావం .. తల్లితో ”నువ్వు ఈ ప్రపంచానికి చెందిన దానివి సర్వ ప్రపంచం నీదే ”అనేవాడు.
  దగ్గరున్న కొండపై మందిరం కడతాననేవాడు .అక్కడెందుకు పాములమయం ఇక్కడున్న బడి ని బాగు చేసి కొత్తది కట్టించు అని తల్లి చెబితే ముందర ఎలిమెంటరీ స్కూల్ కట్టించాడు .తర్వాత తల్లికోరికపై హైస్కూల్ కట్టించి ఆమెపేరుపెట్టించాడు .ప్రశాంతి మందిరం కట్టించినతర్వాత బాబా అక్కడే ఉండేవారు తల్లిదండ్రులు గ్రామం లోనే ఉండేవారు అందరు అప్పుడు రాగి సంకటే  తినేవారు . ప్రజలుసాయి గురించి చెడుమాటలు అంటూటే భరించ లేక కొడుక్కి చెబితే అప్పుడు అందర్నీ మందిరం లోనే ఉండే ఏర్పాటు చేశారు .ఒకసారి ప్రిన్సిపాల్ గోకక్ ఒక పిల్లాడు మందిరం లో అనేక పనులు చేసి ఆలస్యంగా వెడితే పంపించేశాడు వాడు ఏడుస్తూ కూర్చుంటే తానూ ప్రిన్సిపాల్ కు ఖాళీ ఉన్న సమయం లో వెళ్లి ”సారూ !మీ కన్నీ తెలుసు బిడ్డడు పను లన్నీ చేసి రావటం మూలాన కుసుసింత లేటుగా వచ్చిండు .తొ లి తప్పు కాయండి ”అని బతిమాలి ఆయన్ను ఒప్పించి కుర్రాడు వెళ్లేట్లు చేసిన మాతృమూర్తి అన్నాడు సత్య .తల్లి దండ్రులను తాతగారిని వీలున్నప్పుడల్లా వెళ్లి అంతకు ముందు చూసివచ్చేవారు సాయి .ఒక సారి తల్లికి తీవ్రంగా జ్వరం వచ్చి భరించలేక పోతుంటే సాయి వచ్చిమందు వేసి తగ్గించారట అప్పుడు ఆమెకు నమ్మకం కలిగిందట బాబా దైవ స్వరూపం అని . అలాగే చివరి సారి 19 72 లో ”స్వామీ స్వామీ ”అని కలవరించిందట వెంటనే ఆమె ముందు ఉన్నారట బాబా ”నాయనా నువ్వెవరవో నాకు ఎరుక పరచావు ధన్యోస్మి ”అంటూ చేతులు పట్టుకొని బాబా తల్లి ఈశ్వరమ్మగారు మరణించారని సత్య ప్రసంగం పూర్తి చేశాడు ఆసాంతం చాలా క్రమ పద్ధతిలో వివరించగా  అందరు  కరతాళ ధ్వనులతో అభినందించారు .
  తర్వాత 4-15 నుంచి నాలుగు ప్రదర్శనలు నిర్వహించారు .అందరూ పిల్లలే . వినాయక షణ్ముఖ ఈశ్వర రామ కృష్ణ సరస్వతి లక్ష్మి షిర్డీబాబ సత్యసాయి వేషాలతో మంచి దుస్తులు అలంకారాలు ఆయుధాలతో అలంకరించిన కుర్చీలలో కూర్చుని దేవతలంతా ఒక్కటే అనే భావాన్ని కలిగించారు .సాయి సర్వదేవతా స్వరూపుడు అనే భావం కలిగించారు దీనికి మంచి ట్రెయినింగ్ ఇచ్చి ,తీర్చి దిద్దిన లేడీ టీచర్ మానిని అభినందనీయురాలు డెకరేషన్ తో సహా అన్నీ ఆమె సమకూర్చింది తలిదండ్రులు వస్త్రాలు సమకూర్చారు .కాన్సెప్ట్ బాగుంది .పిల్లలతో తాము ఎందుకు ఏ పాత్ర వేసింది తెరమీద చెప్పగా చూపించి వైవిధ్యం కలిపించారు  .తర్వాత రీ సైక్లింగ్ విధానం పై నలుగురు ఆడపిల్లలు వివరించారు  చిలక పలుకుల్లా ఉన్నాయి ఫీల్ రాలేదని పించింది ..మూడోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోబాటు బాబా కాన్ఫిడెన్స్ కూడా ఉండాలన్న ధీరీ తో పిల్లలే రాసి ప్రదర్శించింది బాగానే ఉంది అందరూ బాగానే చేశారు .చివరిదైన నాలుగవది సత్య సాయి జియోపార్దీ ”.దీనిని హిందూ సెంటర్ లో తెలుగు నేర్పే టీచరూ  పిల్లల డాక్టర్  మంచి డాన్స్ టీచర్ అయినా సాయి కృష్ణ అనే ఆవిడ నేతృత్వం లో ప్రదర్శించారు .ఇందులో మా మనవాళ్ళు అశుతోష్ ,పీయూష్ లు కూడా ఉన్నారు ఇంటి దగ్గర ఏ వేషం వేస్తున్నార్రా అని అడిగితె ”సీక్రెట్ ”అక్కడే చూడాలి అన్నారు అంతటి సీక్రెసీ ని బృందం అంతా మెయిన్ న్టైన్ చేసింది.ఇది సాయిబాబా జీవితం పై క్విజ్ ప్రోగ్రామ్ . చిన్న ప్రశ్నలే తేలికైనవే .ప్రేక్షకులకే   సరైన సమాధానం చెబితే బాబా ఫోటో బహుమతిగా ఇచ్చారు తమాషా ఏమిటట ఇన్నేళ్ళుగా సాయి సెంటర్ నడిపేవాళ్లు ఆయనపై ఎన్నో ప్రసంగాలు విన్నవాళ్ళు కూడా ఆయన ఎప్పుడు ఏనెల ఏ తేదీ ఏ వారం పుట్టారని అడిగితె కరెక్ట్ సమాధానం చెప్పక పోవటం వింత అనిపించింది
  దీనితర్వాత మళ్ళీ ఒక అరగంట భజన .
  సాయంత్రం 6 నుంచి స్నాక్స్ టీ  ఏర్పాటు .ఎవరికి వారు తమకు చేతనయింది ఇంటి దగ్గర చేసుకొచ్చి ఇక్కడ అందరూ తినే ఏర్పాటు చేశారు .ఒక తెలుగమ్మాయి పుట్టినరోజు నిన్నయితే ఇవాళ అందరి సమక్షం లో”ఎగ్ లెస్  బర్త్ డే కేక్ ”కోయించి అందరికి పెట్టించారు.ఇదికాక రసగుల్లాలు పునుగులు ,మిరపకాయ బజ్జీ ,మరొక శ్వీటు ,పిజ్జాలు ,అటుకుల పులిహోర కర్బూజకాయ ముక్కలు, మరమరాలు, కాఫీ, టీ లతో అందరూ సుష్టుగా లాగించారు .అంతా  అయ్యేసరికి రాత్రి ఏడు అయింది .ఇంటికి వచ్చేసరికి ఏడున్నర . ఈ ఫోటోలు పెట్టి ఇదంతా రాసేసరికి రాత్రి 10 .. ఇంతటితో ఈ వారానికి స్వస్తి .
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ జయంతి -7-5-17 ఆదివారం షార్లెట్ సాయి సెంటర్

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -5-1 (1-5-17 నుండి 7-5-17 వరకు )

వీక్లీ  అమెరికా -5-1 (1-5-17 నుండి 7-5-17 వరకు )
రెండు పుట్టిన రోజులవారం

1-5-17 సోమవారం ఉదయం నిద్ర మంచం మీద నించి ఇంకా కేవకుండానే ఉయ్యూరు నుంచి మా మనవడు చరణ్ ఫోన్ చేసి”తాతా ! ఉయ్యూరు ను ,మమ్మల్ని మర్చిపోయావు ఫోన్ చేయటం లేదు ”అని నేరం వేశాడు నవ్వుతూ .మధ్యాహ్నం అడ్డాడ శిష్యుడు భూషణం ఫోన్ చేసి అక్కడ నేను పని చేసినప్పుడు దివాకర్లవారు రాసిన ”భారతావతరణం ”పద్యనాటిక నేను వేయించటం అందులో తానూ నన్నయ పాత్ర వేయటం జ్ఞాపకం చేశాడు .నిజమే అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఎస్ సి వాళ్ళు .వాళ్లకు మాటలు పలకటమే రాదు కానీ సాహసంగా తీసుకొని వాళ్ళతో పద్యాలు ప్రాక్టీస్  చేయించి వేయించాను చాలా చక్కగా చెప్పారు .అదొక సాహసం . మల్లినాథ సూరి 29 వ ఎపిసోడ్ రాసి  సుమారు 5 నెలలయింది .మళ్ళీ ఇవాళ మొదలుపెట్టి 30 వ ఎపిసోడ్ రాశాను .

సాయంత్రం డా ఎల్లాప్రగడ రామ మోహన రావు గారు” కారీ ”నుంచి ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా మాట్లాడారు .మైనేనిగారికి ఊరగాయలు పంపించానని ఆయన చాలా అల్ప సంతోషి అని ,తనకు క్లాస్ మేట్ అని ఏరా అనుకుంటామని  ఊరగాయలు పంపినందుకు తనకు వెయ్యి డాలర్లు పంపిస్తానన్నారని తానూ ‘ఏరా !నేను పచ్చళ్ళు అమ్ముకునే వాడిగా కనపడుతున్నానా ?”అన్నానని చెప్పి మైనేని గారి వితరణ శీలత్వం సరసభారతి పుస్తకాలలో బాగా నేను రాశానని ,డబ్బు ఎందరికో ఉంటుంది కానీ దాన్ని మంచిపనులు ఖర్చు చేసి వారు అరుదు అలాంటి ఆరుధై నవాడు మా గోపాలకృష్ణ అన్నారు . ఆ తర్వాత మా చిన్నతనాలలో ఊరగాయలు పెట్టటం ఒక ఖార్ఖానా గా ఆ పరిశ్రమలాగా ఉండేదని ఇద్దరం జ్ఞాపకం చేసుకున్నాం .ఇళ్లల్లో గజం ఎత్తు  జాడీలు ఉండేవని మామిడికాయలు తరగటం కలపటం వగైరా వేసవి కాలపు కుటీర పరిశ్రమగా ఉండేదని అనుకొన్నాం . ఈ విషయాలన్నీ మైనేని గారికి వెంటనే మెయిల్ రాశా .ఆయన  రావుగారు రేపల్లె లో తమ స్వంత  తోట లో కాసిన మామిడికాయ చింతకాయ గోంగూర ,నిమ్మకాయ పండు మిర్చి లతో ఊరగాయలు పెట్టిస్తారని వాటినే తమకు పంపారని రాశారు . వారిద్దరి సౌజన్యం గొప్పది అలాంటి వారు నాకు మిత్రులవటం నా అదృష్టం .

  లైబ్రరీ పుస్తకాల గడువు రెండువారాలు మాత్రమే .మామనవాడు పీయూష్ చేత ఆన్ లైన్ రెన్యూ చేయించా .మళ్ళీ మంగళవారం మధ్యాహ్నం భూషణం వాట్సాప్ చేశాడు విషయం ఏమీ లేదు .సాయంత్రం కోడూరి పావని కెంటకీ నుంచి ఫోన్ చేసి మాట్లాడింది .ఆ అమ్మాయి చాలా పద్ధతిగల పిల్ల .భూషణం విసిగిస్తున్నాడా సార్ అంది . తాము  జులైలో మరో చోటికి వెళ్లవచ్చని చెప్పింది .మా శ్రీమతి తోనూ మాట్లాడింది ఎండ బాగానే ఉంది రెండుపూటలా వాకింగ్ చేశాను . ”చెన్నై చంద్రమా ”అన్నట్లు షార్లెట్ సూర్యుడు రాత్రి 8 గంటలకూ కనిపించాడు . రాత్రి సునయన ప్రెసెంట్ చేస్తున్న ”ఫ్రస్ట్రేటెడ్  ఉమన్ ”యు ట్యూబ్ లో చూసాం . సరదాగా బాగుంది ఎన్నో సమస్యలపై తనదైన ధోరణిలో బాగా ప్రదర్శిస్తోంది . దాదాపు ఏక పాత్రాభినయం . కరెంట్ టాపిక్స్ పై మంచికథనాలు . ఎంత ఈజీ గా చేస్తోందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది ..మహా నటీమణులు చాలరుఅనిపించింది .చిన్నతనం లో బేబీ సునయన గా చాలా చేససిందని ప్రభావతి జ్ఞాపకం  చేసుకొన్నది ..మహాతల్లి  లూ  బాగుంటాయి  

  బుధవారం మా మనవడు చి హర్ష 6. 7 /10 మార్కులతో తెలంగాణా ఎస్ ఎస్ సి పాసయ్యాడు . 2015 ఆగస్టు 9 న పెద్ద యాక్సిడెంట్ అయి డివైడర్ కు తల తగిలి రెండు సార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరిగి  అన్నీ మర్చిపోయి క్రమ క్రమంగా కోలుకుని 10 పరీక్షలు రాయాల్సినవాడు 9 చదివి తర్వాత 10 కూడా చదివి ఈ ఏడాది టెన్త్ పాసవ్వటం అద్భుతం . అందుకే వాడి బ్రెయిన్ ఆప రేషన్ చేసిన డాక్టర్ వాడిని మిరకిల్ బాయ్ అంటాడు  నిజమే హోప్స్ లేవని చెప్పారు కానీ దైవ కృపవలన సమయానికి హాస్పిటల్లో చేర్చిన యువ దంపతుల చలువ వలన మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి కృప వలన బతికి బయట పడి  క్రమంగా అన్నీ గుర్తుకు వచ్చి చదివి పరీక్ష పాసవటం ఎనిమిదవ వింత యే . వాడు పాసయిన సంగతి అందరికి మెయిల్ లో తెలియబరచాను మైనేనిగారు శ్యామలాంద  ప్రసాద్ గారు ,వారణాసి సూర్యకుమారిగారు  బొడ్డ పాటి చంద్ర శేఖర్ మొదలైనవారు సంతోషం వెలిబుచ్చుతూ సమాధానమిచ్చారు .
  వైకింగ్ శకం పై మూడు ఎపిసోడ్లు రాశాను . ది నాజీ హోలోకాస్ట్ ,ఏ వరల్డ్ వితౌట్ జ్యుస్  ది  వైకింగ్స్ పుస్తకాలు చదివేశాను .ఉయ్యూరునుంచి తెచ్చుకొన్న ఆలంకారికులు చదివాను ఈవారం లో . గురువారం సాయంత్రం 6-30 కు మా మనవళ్లు 6 వతరగతి చదువుతున్న  స్కూల్  లో పిల్లల జంత్ర వాయిద్య ప్రదర్శన కు వెళ్లాం మా మనవడు చి ఆశుతోష్ ట్రంపెట్ వాయించాడు బృందంతో .చాలామంది పేరెంట్స్ చూడటానికి వచ్చారు
 మే  21 వ తేదీ జరిగే శ్రీ హనుమజ్జయ0తి  కార్యక్రమం తయారు చేసి ప్రింట్ చేయించమని రమణకు మెయిల్ లో పంపాను .శ్రీమతిశాంతిశ్రీ భక్తి సంగీత విభావరి డా శ్రీ ఆచంట శివరామ కృష్ణ మూర్తిగారి ధార్మిక ప్రసంగం ,శతకత్రయ ధారణ పోటీలు బహుమతుల ప్రదానం మిగిలిన వాటితో చేర్చాం
  శుక్రవారం హర్ష పాలిటెక్నీక్ ఎంట్రన్స్ బాగా రాస్శాడని శర్మ చెప్పాడు . ఆదివారం హిందూ సెంటర్ లోశ్రీ సత్యసాయి మాతృశ్రీ ఈశ్వరమ్మగారి జయంతి  కార్యక్రమ0 లో వేసే పిల్లల డ్రామాలో మా మనవాళ్ళు స్టేజ్ ప్రాక్టీ స్  కోసం విజ్జి పిల్లని రాత్రి 7 కు తీసుకువెళ్లి 10 కి తిరిగివచ్చింది .అంతకు ముందుకొక గంట ఇంట్లో తెలుగు స్పెషల్ క్లాస్ నిర్వ హించింది ఆఫీస్ నుంచి రాగానే .
  రాత్రి బాలమురళీ కృష్ణ సంగీతం ఎలాపడాలి గాత్ర ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి స్వర రాగ విషయాలలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి అనేవిషయాలపై ఇంగిలీషు లో చేసిన డిమాంస్ట్రేషన్ లెసన్ చూసాం యు ట్యూబ్ లో తర్వాత బృందావని రాగ తిల్లానా ఎలా పాడాలో నేర్పే తీరునూ చూసాం  బాలమురళి అంటే తిల్లానా స్పెషల్ .దీన్ని తమిళ విద్యార్థులకు నేర్పే  సిడి అది బాగుంది వాళ్ళు ఆయనతో చక్కగా పాడారు .ఇవి చూస్తే ఇలాంటి విషయాలపై బాలమురళికి ఉన్న సర్వజ్ఞత్వాన్ని  మన తెలుగు వాళ్ళు ఉపయోగించుకోలేక పోయారని పించింది .ఇలాంటి ఆయన పాఠాలు తెలుగులో ఉన్నాయో లేదో నాకు తెలియదు ఉంటె సంతోషం  .
  శనివారం  జ్యుల పై రెండు పుస్తకాలూ చదివి ఘోరకలి పేరిట 5 ఎపిసోడ్ లు రాశా . చి హర్ష పాలిటెక్నీక్ ఎంట్రన్స్ పరీక్షలో 45 మార్కులతో క్వాలిఫై అయినట్లు శర్మ మార్కుల మెమో తోసహా పంపాడు సంతోషించాము ఫోన్ చేసి మాట్లాడాం . అందరికి మెయిల్ ద్వారా విషయం తెలియ బరచాను .శ్రీ మైనేని  శ్రీ గాయత్రిప్రసాద్ గార్లు వెంటనే స్పందించి సంతోషం తెలిపారు
  సరసభారతి వీక్షకుల  సంఖ్య  ఈ ఉదయానికి 4 లక్షల 61 అయింది ఈ సంతోషవార్తనూ అందరికీ పంపాను  పవన్ రెండవ అమ్మాయి చి ప్రశాంతి పుట్టిన రోజును పిల్లలందరితో బయట నిర్వహించి రాత్రికి మమ్మల్ని ఇంటికి భోజనాలకుపిలిచాడు .మా కుటుంబం ,రాంకీ తమ్ముడు సాయి పవన్ కుటుంబం పవన్ మేనమామ కొడుకు కుటుంబం అతిధులం ..పవన్ భార్య రాధ అతిథిమర్యాద బాగా చేస్తుంది వాళ్ళత్త గారిని కంటికి రెప్పలాగా చూసుకుంటోంది ఆవిడ మా రెండవ బావగారు  వేలూరి వివేకానంద్ గారి అన్నగారైన ముకుందం గారి భార్య అంటే వదినగారు పవన్ ఆమె కుమారుడు ..పవన్ తండ్రి ముకుందం గారు చనిపోయి చాలా ఏళ్లయింది . వీరి బాగోగులు మా బావా అక్కయ్య చూశారు .  మంచి బంధుప్రేమ ఉన్నవాడు . భోజనంలో వంకాయ ,బెండకాయ కూరలు అల్లం చట్నీ ఆవకాయ ,బజ్జీలు గులాబ్జామ్ ,పెరుగు  పుచ్చ ముక్కలు ,మా అమ్మాయితీసుకు వెళ్లిన జున్ను ,పనస తొనలుతో సుష్టుగా భోజనం చేసాం . అన్నీ అదరహా . రాంకీ తమ్ముడు సాయి నా మెయిల్స్ పంపితే చదువుతానని అన్నాడు .వాళ్ళత్తగారు మామగారలకు మేంమంతా బాగా తెలుసునన్నారు విష్ణుభొట్ల ఇంటిపేరట . ఇంటికొచ్చి కొన్ని పంపాను . పవన్ తో డొమినికన్ ఆవిడ తన గురించి నాకేమీ సమాచారం పంపలేదని చెబితే తనకు పంపిందని తన గురించి రాయతగినంత గొప్ప విషయాలు లేవని తెలియ జేసిందని చెప్పాడు .సరదాగా ఒక అరగంట కబుర్లు చెప్పుకొని ఇంటికి రాత్రి 11 గంటలకు చేరాం .పవన్ ఇల్లు మా వాళ్ళ ఇంటికి చాలాదగ్గరే ఏడెనిమిది నిమిషాల కారు ప్రయాణమే  .మిగిలిన విషయాలు తర్వాత రెండో ఎపిసోడ్ లో రాస్తా ..
       మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మా బంధువు వేలూరి పవన్ కుమార్తె చి ప్రశాంతి పుట్టిన రోజు 6-5-17 రాత్రి వాళ్ళఇంట్లో విందు

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

ఘోరకలి -5(చివరిభాగం )

ఘోరకలి -5(చివరిభాగం )

                     బర్నింగ్ బుక్స్ బోన్ ఫైర్ -2

–అంతకు ముందు కొన్నివారాలుగా నిషేధిత పుస్తకాలను నాజీ ప్రభుత్వం సవాదేనం చేసుకొన్నది . మార్చ్ 12 న  స్టార్మ్ట్రూపర్స్ లోకల్ ట్రేడ్ యూనియన్ లైబ్రరీ ని తస్కరించి బోల్షెవిక్ ,పసిఫిస్ట్ ఏదీస్ట్  మార్క్సిస్టు పుస్తకాలు న్యూస్ పేపర్లు లోకల్ లైబ్రరీలనుంచి తొలగించాలని ఆదేశించింది .తర్వాత పబ్లిక్ లైబ్రేర్రలన్నీ వెయ్యి కళ్ళతో వెతికించి లాగించేసింది .హీదేం బెర్గ్ స్తూడెంట్ బాడీ విద్యార్థుల్ని తమదగ్గరున్న నిషేధ సాహిత్యాన్ని తొలగించమన్నది  తర్వాత బాన్ ,డార్మ్ స్టెడ్  డ్రేస్డైన్ ,ఫ్రీబర్గ్ ,గీసేన్  గూటింజెన్ ,విటెన్ బెర్గ్ మొదలైన 24 చోట్ల బుక్ బోన్ ఫైర్ పండగ చేశారు . ఏప్రిల్ ,మే లలో వేలాది లైబ్రరీ పుస్తకాలకు దహన సంస్కారం చేశారు  .వీటి స్థానం లో హిట్లర్ మీన్ కాంప్ పుస్తకాలను చేర్చారు లైబ్రరీలలో . ఫ్రాంక్ ఫర్ట్ లో రొమేన్ బెర్గ్ 15 వేలమంది చూస్తుండగా పుస్తక భోగిమంటలు వేశారు బెర్లిన్ ఒపెరాస్క్వేర్ లో 25 వేల విలువైన వెస్టర్న్ కాల్చర్కు చెందిన గ్రంధాలను అగ్నికి ఆహుతి చేశారు .ఇందులో 10 వేలు సెక్సువల్ ఇంస్టి ట్యూట్ కు చెందినవి  ప్రఖ్యాత జర్మన్ రచయితలైన షాలేం యాష్ ,హేన్రి బార్బస్ ,ఫ్రాంజ్ బోస్ ,జాన్ డాస్ పాసోస్ ,ఫరాయిడ్ ,అయిన్ స్టెయిన్ ,ఆంద్రీ గైడ్ ,ఎర్నెస్ట్ హేమిగ్వే ,హెలెన్ కెల్లర్ , లెనిన్ ,రోసా లక్సన్  బెర్గ్ అప్టాన్  సింక్లెర్ ,హేజీ వేల్స్ ,మొదలైన వారి అమూల్య గ్రంధాలు నాజీల అహంకారానికి అగ్ని జ్వాలకు ఆహుతయ్యాయి .ఈ బుక్ బర్ణింగ్  మంటలు ”సింబల్ ఆఫ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ”అని నాజీలు భుజాలు చరచుకొన్నారు ..ఈ దహన కాండలో ఎందరో ఎకాడమిస్ట్ లైబ్రేరియన్లు ,టీచర్లు  ,పాల్గొన్నారు .జెర్మనిస్ట్ అయిన మాక్స్ హెర్మన్ ఒక్కడే దీన్ని వ్యతిరేకించాడు  .ప్రాపగాండా మినిష్టర్ గోబెల్స్ ,అతని మంత్రిత్వ శాఖ ముందు నాయకత్వం వహించలేదు .కానీ తర్వాత సపోర్ట్ చేశాడు

    అనేక అసోసియేషన్లు నాజీ మూకలు ఈ సరస్వతీ మరణ హోమాన్ని జాతీయ పండగగా జరిపారు ..ఇదొక సంప్రదాయమే అయింది .ట్రక్కులనిండా నిషేధ పుస్తకాలు పెట్టి హిబ్రూ అని నిక్ నేం తగిలించి ,రెండు ఎద్దులతో లాగించి  కెన్నీ ట్రక్కులమీద ”చెత్త పుస్తకాలు ”అని పేరు రాసి  మరికొన్న ట్రక్కులను గుర్రాలతో లాగించి దానిమీద ”నేను ఈ పుస్తకాలు చదివిన గాడిదను ”అని పోస్టర్ అంటించి కుర్రాళ్ళు స్తూడెంట్లు అరుపులు కేకలతో ఊరేగి తగలబెట్టారు ..పిల్లలు యువకులు ముసలి ముతక అందరూ ఈ పాపం లో భాగస్వాములయ్యారు . దీనికి తోడు సంగీతం తో హోరెత్తించారు .ఇందులో పాల్గొన్నవారికి ఆ పుస్తకాలేమిటో ఎవరు రాశారో వాటిప్రాముఖ్యత ఏమిటో ఎవ్వరికీ తెలియదు అదీ మూక రాజ్యం అంటే ..హిట్లర్ చాలా అముఞ్చిపని చేస్తున్నాడని అభినందనలు ..నాజీల లిస్టులో శత్రువుల పేర్లు ఎక్కువ స్నేహితులపేర్లు అతి తక్కువ అదీ వైపరీత్యం .ఒపేరా స్క్వేర్ దగ్గర జరిగిన బుక్ బార్కింగ్ లో రచయితఆర్నార్డ్ జ్వీ గ్ తన పుస్తకాలు తగలబడుతుండగా స్వయం గా చూశాడు 1887 లో పుట్టిన ఆయన జర్మనీ తరఫున మొదటి వరుసలో యుద్ధం చేసి న యుద్ధ వీరుడు.
        సమాప్తం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-17-కాంప్-షార్లెట్-అమెరికా ..


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -4

ఘోరకలి -4

             బుక్  బర్ణింగ్ బోన్ ఫైర్
మనుషుల పనిపట్టి వారి సర్వ నాశనం చేసినట్లే హిట్లర్ తనకిష్టం లేని వారిరచనలను తగలబెట్టే ప్రయత్నం దేశవ్యాప్తంగాచేసి రికార్డ్ నెలకొల్పాడు .ఇదే” పుస్తక దహన భోగిమంటలు ”అనే బుక్ బర్ణింగ్ బోన్ ఫైర్ .ముఖ్యంగా హీబ్రూ బైబిల్ దహనం సోషలిస్టు సాహిత్య  దహనం ఇందులో భాగాలు .. ఈ దహనక్రియ పబ్లిక్ గా  బాండ్  మేళాలతో చప్పట్లు కేరింతలతో నడిబజార్లలో, యూని వర్సిటీ ఆవరణలో,సెంటర్ లలో  జరిపించాడు ..జ్యోవోయిష్ నాగరికత పూర్తిగా అంతమైపోవాలన్న  ఆరాటమే ఇది జ్యులు లేని ప్రపంచ నిర్మాణం సాధించాలన్న తపన . ఇదంతా ఒక  ఫా0టసీ . జ్యుల ను ఒక కల్పిత శత్రువుగా భావించి చీకట్లో చేసిన యుద్ధమే ఇది . జ్యులు ఏనాడూ జర్మనీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పని చేయలేదు ఆక్రమణలు చేయలేదు .ఆరకమైన సాహిత్యాన్నీ రాయలేదు . అందుకే యా0టి సెమిసిస్ట్ అనేది ఒక ఫా0టసీ అన్నారు . 1937 లో ”ది జ్యు  యాజ్ ఎ  క్రిమినల్ ”అనే పుస్తకాన్ని కిల్లర్ ,హాన్స్ ఆండర్సన్ లు రాశారు .అందులో ”స్పైరోకైతే బాక్తీరియా సిఫిలిస్ వ్యాధి కారణమైనట్లే జ్యులలో రాజకీయ ,రాజకీయేతర విషయాలలో నేర చరిత్ర రక్తం లోనే ఉన్నవాళ్లు మానవులకు జ్యులు పూర్తి వ్యతిరేకులు దుష్టత్వానికి మూర్తీభవించిన రూపం జ్యు .దేవుడికి వ్యతిరేకి .వాడి వాసనే చావుకు కారణం ”అని అభూత కల్పనలతో రాశారు  జాతి విద్వేషం కలగటానికి ఇది పూర్తిగా కారణాలలో ప్రధాన కారణమైంది
  క్రిస్టియానిటీ  జ్యుల మతమార్పిడిని సమర్ధించింది కానీ నాజీలు వ్యతిరేకించారు .ఇంతటి జాతి వ్యతిరేకతను నాజీలు కలిగించటానికి క్రైస్తవం కూడా బాగా దోహదం చేసింది .జ్యులనూ  జ్యుయిజాన్ని అగ్నికి ఆహుతి చేయాలన్నది హిట్లర్ సంకల్పం .వీళ్లకు ఈ భావం యూరోపియన్ కాలనీల నుండి వచ్చింది లక్షలాది ఇతరులను చంపి బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ బెల్జియం రాజ్యాలను ఏర్పరచుకున్నారు 1904 -1907 మధ్యఆగ్నేయ ఆఫ్రికాలో(నాంబియా )   హెరెరో ,నామాక్వా లను జర్మన్లు తుడిచిపెట్టేశారు కనుక ఇప్పుడు కూడా అలాంటిది సాధ్యమని కలలు కన్నారు .జ్యులకు మూలాలు బలంగా ఉన్నాయని ,బైబిల్ ,క్రిస్టియానిటీ ,లకు కారణం భూతులని కనుక కొత్త పరభుత్వానికి పాత వాళ్ళు అడ్డు అని భావించారు నాజీలు జ్యులు అంటే టెర్రర్ ..కనుక ఎన్ని లక్షలమంది అయినా సరే జర్మనీ యూరప్ దేశాలలోని జ్యులను అంతం చేయాలనే నిశ్చయించాడు హిట్లర్ .. 919-33 వరకు జర్మనీలో న్యాయం చట్టం ప్రజాస్వామ్యం చక్కగా వర్ధిల్లాయి.  జ్యులకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే పోలీస్ న్యాయస్థానం వారి హక్కులను కాపాడాయి . థర్డ్ రీచ్ పాలనవచ్చాక జ్యులకు హింస ప్రజ్వరిల్లింది .రౌడీలు వీధిమూకలు మిలిటరీలో ఎస్ ఏ రూపం లో దూరిపోయారు .వీళ్ళు సైన్యానికి అనుబంధ సంస్థ అయ్యారు  జ్యులకు అన్యాయం జరిగి ఫిర్యాదు చేస్తే ”జ్యులను రక్షించటం పోలీసుల ద్యూటీ కాదు ”అనే స్థితికి వచ్చింది .ధనికులైన జ్యులు అనేక వర్తక వాణిజ్య సంస్థలను  కంపెనీలను స్థాపించి నిర్వహించేవారు .వేలాది ఉద్యోగస్తులు పని చేసేవారు .అనేక యూనివర్సిటీలలో న్యాయస్థానాలలో సంస్థలలో విద్యాలయాలలో జ్యులు ఉన్నతపదవుల్లో ఉండేవారు ఇప్పడు దీన్ని సహించలేక నాజీలు ”యాంటీ కే పటలిస్ట్ ”విధానం అవలంబించారు .హిట్లర్ కు జ్యుల వల్లనే ఫ్రెంచ్ విప్లవం ,సమాన హక్కులు ,కమ్యూనిజం కేపటలిజం వచ్చాయని భ్రమ ఉండేది .ఇదంతా కూలదోసి నవ జర్మనీ ఏర్పరచాలనుకొన్నాడు ఆ విషయం స్పష్టంగామీన్ కాంప్ అనే 

తన చరిత్రలో చెప్పాడు -”సృష్టికర్త దేవుని ఆజ్ఞప్రకారం నేను జ్యులను వ్యతిరేకిస్తూ ,దేవునిపనిలో నడుస్తున్నాననుకొంటున్నా”అన్నాడు  .కేపిటలిజం కన్జర్వేటిజం కమ్యూనిజం బోల్షివిజం మార్క్సిజం ,సోషలిజం .లిబరలిజం ,పసిఫిజం ,కాస్మోపాలిటనిజం  మెటీరియలిజం  నాస్తికత, ప్రజాస్వామ్యం లు ఏర్పడ్డాయని తానునమ్మి ప్రజలచేత నమ్మించాడు హిట్లర్ .నిజానికి వీమర్ రిపబ్లిక్ లో సాహిత్య సంస్కృతులు మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లాయి .వినోదం కేబరే క్లబ్ డాన్స్ లైంగిక స్వాతంత్రం ,సైకో అనాలసిస్ , ఫెమినిజం ,హోమో సెక్సుయాలిటీ  అబార్షన్ జాజ్ సంగీతం బాహాస్ ఆర్కి టెక్చర్  ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్  ఇంప్రెషనిజం ,క్యూబిజం డాడాయిజం ఎక్స్ప్రెషనిజం లు వర్ధిల్లాయి అందుకే హిట్లర్ కు ”ఎక్కడో ”కాలింది .. 1933 వరకు నాజీలకు జీనోసైడ్ (జాతి విధ్వంసం ),ఎక్స్టెర్మి నేషన్(దుంపనాశనం )ఆలోచన రాలేదు . కొత్త జర్మన్ జాతిని జ్యుల  రక్త రహితంగా ఏర్పరచాలని ఆతర్వాత వచ్చింది అందుకే ఆ మారణ హోమాలు .దానికోసమే ప్రజాస్వామ్యాన్ని బలపరచిన వీమర్ డెమాక్రసి చట్ట న్యాయ వ్యవస్థ ,జర్మన్ ఉదారవాదం కమ్యూనిజం  విధ్వంస నిర్ణయం  హిట్లర్ ఛాన్సలర్ అయినా కొత్తలో ”ఆ వీడెన్ని  రోజులుంటా డు రెండునెలల్లో మూలకు తోసిపారెయ్యమా స్ప్రింగ్ దాకా ఉంటె గొప్పే ”అని ప్రగల్భాలు  పలికారు డెమొక్రాట్లు .అప్పటికి హిట్లర్ అధికారాలు పరిమితమే .క్రమంగా బలపడి ప్రెసిడెంట్ అయి సైన్యాధికారి అయి సర్వాధికారాలున్న ఫ్యురేర్ చక్రవర్తి అయి డెమొక్రసీని డిక్టేటర్షిప్ తో శాసించాడు ఏకు మేకయ్యాడు . .
   ఏది చేసినా హిట్లర్ పెద్ద ఆర్భాటం గా చేసేవాడు” లో కీ ”ఉండేదికాదు .బంద్ మేళాలు మార్చింగ్ లు హెయిల్ హిట్లర్ నినాదాలు దీపాలతో హోరెత్తించేవాడు సెబాస్టియన్ హాఫ్నర్ హిట్లర్ గురించి రాస్తూ ”అతడిదగ్గర మనిషి రక్తం మాంసం వాసన వచ్చేది .మనుషుల్ని తినే జంతువు. అతడి చూపు భయంకరం ”అన్నాడు ..బలపడిన హిట్లర్ స్వతంత్రముగా ఉన్న రాజకీయ ,సాంఘిక ,సాంస్కృతిక ,సంస్థల అధికారాలను రద్దు చేసిపారేశాడు దీన్ని సింక్రనైజేషన్ ;;అన్నాడు ..ట్రేడ్ యూనియన్ లను రద్దుచేసి జర్మన్ లేబర్ ఫ్ర0ట్ఏర్పరచి  కమ్యూనిస్ట్ సోషలిస్టు పార్టీ ఆఫీసులని కూలగొట్టి  ఏక పార్టీ నాజీ ఏకవ్యక్తి హిట్లర్ పాలన ప్రారంభించాడు  ఫ్రాన్స్  లో బాస్టిల్లే పతనం 1789 లో జరిగిన జులై 14 నుంచి అమలు చేశాడు ..నాజీలు అంటే టెర్రర్ అనుకున్న హిట్లర్ ఇప్పుడు అందరికీ టెర్రర్ అయ్యాడు ప్రజాస్వామ్య మూలాలన్నీ విధ్వంసం చేశాడు .ఆటలు సంగీతం డాన్స్ లలో జ్యులు లేకుండాచేసి నాజీ లతో ఆలోచనలతో నింపాడు .జర్మన్ ఆర్ట్ లో విదేశీయులు దూరారని భావించి ఇప్పుడు జర్మన్ ఆర్ట్ కు ప్రాణం పోశాడు .జర్మన్ ఆర్ట్ సోల్ అండ్ స్పిరిట్ అనేది హిట్లర్ నినాదం   దీనికోసమే పుస్తక దహన కార్యక్రమం .చేబట్టాడు .టౌన్హాల్ ముందు రాత్రి 9-30 కి విద్యార్థులతో టార్చ్ పెరేడ్ జరిపించి ఊరేగింపు జరిపి స్వస్తిక్ జెండాలతో ,రైట్ వింగ్ పారామిలిటరీ దళాలు నడుస్తుంటే ఎస్ ఎస్ ఎస్ ఏ వాళ్ళ కేరింతలతో అరుపులు ఆర్భాటాలతో ప్రొఫెసర్లు లెక్చరర్లు విద్యార్థులు కదం తొక్కుతూ నడిచి ,అప్పటికే మధ్యాహ్నం పెద్ద పెద్ద దుంగలతో 12అడుగుల ఎత్తు  ,6 అడుగుల వెడల్పుగ తయారై  కణకణ మండుతున్న అగ్ని వేదిక  భగభగ భోగి మంటలను  వెదజల్లుతుండగా వామపక్ష జర్నల్స్ ,న్యూస్  పేపర్లు ,కమ్యూనిస్ట్ సోషలిస్టు గ్రంధాలు పోస్టర్లు కరపత్రాలు జెండాలు మంటల్లో కేరింతలతో వేసి మండుతుండగా చూసి చప్పటలతో హర్షధ్వానాలు చేస్తూ ఆపైన సోషలిస్టు టోపీలను విసిరేసి మండుతుండగా ఆనందించి వీమర్ రిపబ్లిక్ బ్యానర్లనూ తగలెట్టి రాక్షసానందాన్ని సామూహికంగా అనుభవించారు .ఇదే  బర్ణింగ్  బుక్స్ బోన్ ఫైర్ .కు నాంది .తర్వాత ఎక్కడెక్కడ ఎలా మండించారో చూద్దాం
ఇన్‌లైన్ చిత్రం 1.
ఇన్‌లైన్ చిత్రం 2
   సశేషం
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రసిద్ధులైన అయిదుగురు హవాయి మహిళలు-

ప్రసిద్ధులైన అయిదుగురు హవాయి మహిళలు-గబ్బిట దుర్గా ప్రసాద్

హవాయి ద్వీప దీపకాంతులై వెలుగులు చిమ్మిన అయిదుగురు ప్రసిద్ధ మహాళామణులను గురించి తెలుసుకొందాం ..

     1-మహిళా విద్య ఆరోగ్య దాయిని -క్వీన్ ఎమ్మా
 హవాయి  ప్రజల ఆరోగ్యం రోజు రోజుకూ  క్షీణించి పోతున్న సందర్భాన్ని గుర్తించి క్వీన్ ఎమ్మా కాలానికా మాకా 1859 లో క్వీన్స్ హాస్పిటల్ కట్టించి ప్రజలను కాపాడింది ..మసూచికం ,కలరా ఇన్ఫ్లు ఎంజా  వంటి వ్యాధులకు ఉచిత చికిత్స చేయించి ఆదుకున్నది .   1867 లో సెయింట్ఆండ్రోస్ బాలికా పాఠశాల స్థాపించి బాలికల విద్యకు మార్గదర్శి అయింది . గాత్ర సంగీతం  పియానో ,నాట్యంలలో ఆమె   అత్యధిక ప్రతిభావంతురాలు .
      2- పురుషులతో మహిళలకు సమాన హక్కులు ఇచ్చిన  -కా ఆహుమాను
హవాయి చరిత్రలో కా అహుమాను అత్యంత ప్రేరణాత్మక పాత్ర పోషించి మహిళాభివృద్ధికి దోహదం చేసింది . హవాయి సొసైటీలో ఆమెది అద్వితీయమైన పాత్ర . కామేహ మెహాకు అత్యంత నమ్మకం విధేయతకలిగి వుండి  రాణించింది . రాజు కామేహ మెహకు అత్యంత ఇష్టురాలైన భార్యగా దాదాపు ప్రధాన మంత్రి హోదాలో వుండి స్థానిక హవాయి స్త్రీల హక్కులకోసం అవిశ్రాంత కృషి చేసింది . మహారాజుతో మగవాళ్ళు తప్ప  వేరెవరు ప్రక్కన కూర్చుని భోజనం చేయని పరిస్థితి ఉండేది .ఈ పద్ధతిని మార్చేసి మగవారితో సమాన హోదాలో ఆడవారుకూడా కూర్చునే అర్హత కలిపించింది . మగవాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉన్న అన్ని కార్యకలాపాలలోను ఆడవారుకూడా  స్వేచ్ఛగా పాల్గొనే హక్కు  కల్పించి  కా అహుమాను మహిళా మార్గ దర్శిగా నిలిచింది .
    3-ప్రసిద్ధ ఎత్నో  బయాలజిస్ట్ -ఇసబెల్లా లోనా ఆబ్బట్

  మాలీ లోని హన్నాకు కు చెందిన ఎత్నో బయాలజిస్ట్ ఇసాబెల్లా కాకియా యు యాంగ్ లోనా అబ్బట్ హవాయిలో సైన్స్ లో పి .హెచ్ డి .పొందిన ప్రధమ మహిళ. చైనా ,హవాయిన్ మిశ్రమ జాతికి చెందిన ఈమె హవాయియన్ ఆల్గె ను తన హవాయియన్ తల్లి వలన విని గుర్తించి పరిశోధన చేసింది .  అకాడెమిక్ రికార్డ్ ప్రకారం ఆమె ఫసిఫిక్ ఆల్గె  పై ఎక్స్పర్ట్ .రెడ్ ఆల్గె అని పిలువబడే కుటుంబానికి చెందిన రోడో మేలాషియా తో సహా 200  స్పెసీస్  ను ఇసబెల్లా కనిపెట్టి రికార్డ్ సృష్టించింది . ఆమె కృషిని గుర్తించి రోడోమెలాషియా ను  ´´ఆబ్బొట్టెల్లా ´అని ఆమె పేరు తో గౌరవంగా పిలుస్తున్నారు . తన ప్రతిభా సర్వస్వ0 తో ఆమె ఎనిమిది గ్రంధాలు రాసింది . కాలిఫోర్నియా మాంటెరి పెనిన్సుల కు చెందిన మెరైన్ ఆల్గె  గ్రంధానికి సంపాదకత్వం వహించింది . సుమారు 150 రీసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించింది .

   4- సర్ఫింగ్ చాంపియన్ -రెల్  సన్
రెల్  కపోలియోకా ఎధు కాయ్ సన్ హవాయికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ సర్ఫింగ్ చాంపియన్ మాత్రమేకాక స్పోర్ట్స్ లో మార్గ దర్శి కూడా . చాలా ప్రశాంత చిత్తం తో దృఢ సంకల్పం తో ఉండే ఈమె చక్కని రైడింగ్ శైలికి ఆద్యురాలు . సర్ఫ్ కమ్యూనిటీ లో ఐక్యత సాధించి ,´ప్రో ఉమెన్స్ కాంపిటీటివ్ సర్ఫింగ్ సర్క్యూట్ ´ఏర్పడటానికి కృషి చేసింది . 1975 లో తనకు అత్యంత అభిమానమైన నార్త్ షోర్  లోని బీచ్ లో మొట్టమొదటి ఫీమేల్ లైఫ్ గార్డ్  అయింది .
 రెల్ ను అందరూ అభిమానంగా ´ఆంటీ రెల్ ´అని పిలుస్తారు . ఆమెకు వచ్చిన ´బ్రెస్ట్ కేన్సర్ ´ను ధైర్యం తో ఎదుర్కొని ఆరోగ్యం పొందినందుకు ఆమెను అందరూ గొప్పగా అభినందించి ఆరాధించారు . 1983లో డాక్టర్లు కేన్సర్ ను గుర్తించి ఆమె ఒక ఏడాదికన్నా ఎక్కువ కాలం బ్రతకదని తేల్చి చెప్పారు . 15 ఏళ్ళు అనుక్షణం మరణ యాతనతో పోరాడి గెలిచి 2-1-1998 న మరణించింది రెల్ -ది రియల్ హీరోయిన్ .
   5- అమెరికన్ కాంగ్రెస్ కు ఎన్నికైన ప్రధమ ఏషియన్ అమెరికన్ మహిళ-పాట్సి టి మింక్
అమెరికన్ కాంగ్రెస్ కు ఎన్నికైన మొదటి ఏషియన్ అమెరికన్ పాట్సి టోకెమోటో మింక్ . ఆమె స్థానికంగాను అమెరికాలోను సంచలనమే సృష్టించింది . 1960 లో పదివేల డెమొక్రాట్ నేషనల్ కన్వెన్షన్  ను ఉద్దేశించి టెలివిజన్ లో ప్రసంగించి అబ్బుర పరచింది . ఆ పార్టీలోని మూడువంతులు సభ్యులచేత సివిల్ రైట్స్ పై అభి వృద్ధికరమైన ఆలోచనలకు ఆమోదం తెలియ జేయించిన ఘనత ఆమెది . సివిల్ రైట్స్ కమిషన్ ను శాశ్వత కమీషన్ గా ఉంచటానికి ఆమె చేసిన కృషి బహుధా ప్రశంశనీయమైంది . ´ఫెడరాలిటీ  ఫండ్ ఎడ్యుయేషన్ ప్రోగ్రామ్ ´లో లింగ వివక్షతను  నిషేధించే ´టైటిల్ 9 ´గ్రంధాన్ని రాసింది . 1972 లో ప్రెసిడెన్షియల్ నామినేషన్ ఫర్ డెమొక్రాటిక్ పార్టీ కి మొదటి ఏషియన్ -అమెరికన్ మహిళ అయిన గౌరవం పొందింది .
                                                                                                           -గబ్బిట దుర్గాప్రసాద్
———————————————————————————————————————————
Posted in రచనలు | Tagged | Leave a comment

ఘోరకలి -3

ఘోరకలి -3

”Power tends to corrupt and absolute power corrupts absolutely ”అన్నాడు లార్డ్ జాన్ యాక్షన్ 18 87 లోనే .హిట్లర్ ఈ మాటలను రుజువు చేద్దామని కంకణం కట్టుకున్నాడు . దీనికి ఎన్నో మాయోపాయాలు నక్కజిత్తులు ,కపట నాటకాలు తడిగుడ్డతో గొంతులు కోయటాలు చేసిపారేశాడు పావులు చకచకా కదిపాడు అవతలి వాళ్ళను చిత్తైపోయేట్లు దిగ్భ్రము లోనయ్యేట్లు  నటుడు మహేష్ పోకిరిలో చెప్పిన మైండ్  బ్లాకయ్యేట్లు   చేశాడు శకునికి మించిన రాచకీయ జూదం ఆడాడు గోకర్ణ గజకర్ణ మాయల మరాఠీ విద్యలన్నీ ప్రదర్శించాడు .అదృష్టవంతులకే కాదు దురదృష్టవంతులకూ కాలం కలిసి వస్తుంది .జర్మన్ బజారులో పెయింటింగులు అమ్ముకుంటూ చింపి గుడ్డలు  కట్టుకొని నిలువ నీడ లేక  తిరిగినవాడికి అదృష్టం వరించి అందలమెక్కించింది . నహుషుడి లా కళ్ళు నెత్తికెక్కవా  ?గర్వం తో కళ్ళు మూసుకుపోవా.  ఉచ్ఛనీచాలు మర్చిపోయి పిచ్చ పిచ్చగా ప్రవర్తించి జర్మనీ ప్రజాస్వామిక పార్లమెంట్  మూడవ రీచ్ ను  ను చిదిపి ఛిద్రం చేసి వాళ్ళతోనే రాజాధి రాజమార్తా0డ,   చక్రవరి ఫురేర్   డిక్టేటర్  అనిపించుకున్నాడు దేనికీ ఎదురు లేకుండా సర్వాధికారాలు వారితోనే కట్ట బెట్టించుకొని థర్డ్ రీచ్  కి దిశా నిర్దేశం చేశాడు .ఎదురొస్తే ఖతం .దీనికి వంటపాడిన వాళ్ళు ఎస్ఎస్  దళం  ప్రచార సార్వ భౌమ గోబెల్స్ వగైరా .
  ఎర్నెస్ట్ రోహం ఎస్ ఎ.  ను బలమైన జర్మనీ సాధారణ సైన్యం ను  గడ గడ లాడించి ,హిట్లర్ అధికార ఆరోహణకు వీధి రౌడీలను  రివాల్యూషన ర్ల ను  అందించింది .వీళ్ళు  వ్యతిరేకుల  గొంతు  నొక్కేశారు . హిట్లర్ ఛాన్సలర్ అవగానే వీళ్ళను కరేపాకు ఏరేసినట్లు ఏరేశాడు . ఇది రోహీమ్ కు నచ్చలేదు .అతడు జర్మనీ అంతా ఎస్ ఎస్ఏ  చేతిలోకి వచ్చి జర్మన్ ఆర్మీని కంట్రోల్ చేయాలనుకున్నాడు .ఘటికుడైన హిట్లర్  వ్యాపార  మిలిటరీ సంస్థల తోడ్పాటు లేనిదే చక్రవర్తి కాలేనని గృహహించాడు .వాళ్ళతో మాట్లాడి ఎస్ ఏ వాళ్ళ పవర్ తగ్గించేశాడు .రోహీమ్ ను వదిలించుకోవడానికి రీన్ హార్డ్ హెడ్రిచ్ ని ఉసిగొల్పాడు .ఎస్ ఏ బలపడితే తమ ఉనికికి ప్రమాదమని గ్రహించాడు రోహీమ్ ను బలహీనపరిచే చర్యలన్నీ చేశాడు నాజీపార్టీలో ఒక సీక్రెట్ సెల్ ఏర్పాటు చేశాడు .వీళ్ళు సహజం గా హోమో సెక్సువల్స్ అన్నవిషయం అందరికీ తెలుసు .ఇదేదో తామే కనిపెట్టినట్లు పెద్ద బిల్డప్ ఇచ్చారు వ్యతిరేకులు .
   19 34 జూన్ 30 న వీళ్ళ భరతం పట్టటానికి మాస్టర్ ప్లాం వేశాడు హిట్లర్ అదే ”నైట్ ఆఫ్ ది లాంగ్ నైవ్స్ ”హిట్లర్ అనుచరులు బ్రయోన్ షార్ట్ ఎస్ ఏ లను చుట్టుముట్టి బజారులో కాల్చి చంపించాడు కొందరు ఇళ్లల్లోనే కైమా అయ్యారు మిగిలిన వాళ్ళు జైలుపాలయ్యారు రోహిన్ ను తెల్లవారుజామున హిట్లర్ ఆర్డర్ పై కస్టడీ లోకి తీసుకొని ఎక్సిక్యూట్ చేశారు .ఈ ఆకస్మిక హననం లో ఎంతమంది చచ్చారో తెలియదు కనీసం వందమందిని లేపేసి ఉంటారు .వీళ్ళ చావుపై విచారణ లేదు కారణం వీరంతా దేశ ద్రోహులని ముద్ర వేయటమే ..హిట్లర్ అండ్ కో కు ఆ రాత్రి శుభ రా త్రి .ఎస్ ఏ  లకు కాళరాత్రి .ఈ హత్యలు ఆగిపోక ముందే జనరల్ వీల్ హెల్మ్ వాన్ బ్లూమ్ బెర్గ్ సైన్యం పూర్తిగా ఫ్యుహెర్ హిట్లర్ ను సమర్ధిస్తున్నట్లు ప్రకటించాడు హీంలర్ కు ఘెట్టో ఆపరేషన్ అధికారం కట్టబెట్టాడు హెడ్రిచ్ కి రోజువారీ కార్యక్రమాలకు -హత్యలకు అధికారం వచ్చింది గోరింగ్ విమాన దళం అనబడే లూప్త్వాఫీ కి అధికారిఅయ్యాడు హిడేన్ బర్గ్ చనిపోయాక హిట్లర్ ప్రెసిడెంట్ ఛాన్సలర్ అయ్యాడు .అంటే సైన్యం కూడా హిట్లర్ చేతిలోకి వచ్చి సర్వ సత్తాక నియంత అయ్యాడు ఒకే దెబ్బకు ఎన్ని పిట్టాల్నో రాల్చేశాడు హిట్లర్ ..
               శుద్ధ జర్మనీ
  అధికారాలన్నీ హస్తగతమయ్యాక హిట్లర్ అనవసరమైన వాళ్ళను ఏరిపారెయ్యాలని జర్మన్ల శుద్ధ రక్తం కలుషితం కాకూడదని భావించాడు .హోమో సెక్సువల్స్ ను ముందు అరెస్ట్ చేయించి బహిష్కరణ (డిపోర్టేషన్)కాంప్ లకు తరలించాడు దీన్ని మతగురువులు సమర్ధించారు వీళ్ళవలన పబ్లిక్ హెల్త్ దెబ్బ తింటుందని గగ్గోలు పెట్టించాడు జర్మనీ అంతా గాలించి హోమోలను హోమో అని అనుమానమొచ్చింది వాళ్ళనూ అరెస్ట్ చేశారు .. తర్వాత చర్య ”జెహోవాస్ విట్నెస్ ”అంటే నాజీ పతాకమైన స్వస్తిక్ పతాకానికి సెల్యూట్  చేయనివారిని అగౌరవ పరచినవారినీ  హిట్లర్ కు విధేయత ప్రకటించనివారినీ  ,ఆర్మీలో  చేరనివారినీ ”రాజ ద్రోహులు ”(treasons) గా ముద్రవేసి బొక్కలో పెట్టారు .మతాన్నివదిలేసి రీచ్ కి కొందరు సాల్యూట్ కొడితే కొందరు వ్యతిరేకించి చువ్వలు లెక్కబెట్టారు .
           జిప్సీ ల హననం
 తరువాత ఘనమైన హిట్లర్ గారి ద్రుష్టి జిప్సీ లపై ప్రసరించింది .ఈ సంచార జాతికి థర్డ్ రీచ్ లో స్థానమే లేకుండా పోయింది .వాళ్ళు నల్లగా ఉండే సంచారులు వాళ్లకు స్వతంత్రం కావాలి ఎవరి కంట్రోల్ లోనూ ఉండని జాతి .వాళ్ళు సోషల్ ఆర్డర్ ను భంగపరచి ఆర్య రక్తాన్ని కలుషితం చేస్తున్నారని హిట్లర్ ఉవాచ . అందుకని 1930 లో నాజీలు జిప్సీ  సమస్యకు పరిష్కారం ఆలోచించింది స్థానిక పోలీసులు వారిపై దొంగతనం దోపిడీ ,సోమరితనం  అభియోగాలు మోపి అరెస్ట్ చేసే అధికారం ఇచ్చాడు .సహజం గా వాళ్ళకు జర్మనీ పౌరసత్వం ఉండదు కనుక వాళ్ళను దేశ బహిష్కరణ చేయటం తేలిక యింది .
           జ్యుల ఏరివేత
1935 లో నాజీ నేషనల్ కాన్ఫరెన్స్ నూరేం బెర్గ్ లో జరిగి మొదటిసారిగా జ్యుల కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఇక వరుస స్టేట్ మెంట్లు షురూ చేశారు .జర్మనీ వాళ్ళు కానీ జర్మన్ రక్తమున్నవారుకాని  జ్యుల తో వివాహ మాడటాన్ని  15-9-1935 న చట్టం ద్వారా రద్దు చేశారు పిల్లలు పుట్టే వయసున్న జ్యులు కాని   ఆడపిల్లలు   జ్యుల ఇళ్లల్లో పనిమనిషులుగా ఉండరాదని శాసించారు .చివరికి జ్యులు జర్మనీ జాతీయ జెండా ఎగుర వేయటాన్ని నిషేదించారు ..నవంబర్ 14 న జ్యుల పౌరసత్వాన్ని ఓటుహక్కును లాక్కుని   ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలనుంచి ఊడబెరికారు  .
                      వెర్రి వెయ్యి విధాలు
స్వచ్ఛ రక్త నినాదం జ్యులు జిప్సీలు ,ఇతర తక్కువ స్థాయి మనుషుల విషయంలోనే కాక రీచ్ పౌరుల విషయం లోనూ అవలంబించారు ..దీనికోసం దేశవ్యాప్తం గా  ”జాతి ఆరోగ్యం ”(రేషియల్ హైజీన్ )ప్రోగ్రామ్ అమలు జరిపారు .ఉత్తమ మానవ జాతిని సృష్టించటం ”అనే యుజెనిక్స్ ”ను అమలు చేశారు దీనికోసము వంశ చరిత్రలను త్రవ్వి తీశారు .జీన్ ఆధారంగా మానవ స్వభావాలుంటాయని ఈ శాస్త్రం చెబుతోంది .ఉదాహరణకు ”దాలా సోఫీల్లా ”అనే జీన్ ఉన్న వారి వంశం అంతా నౌకా రంగం లో రాణిస్తారు ”నోమాధిజం ”జీన్స్ ఉంటె ఇంటిపట్టున ఉండకుండా ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ఇది వారసత్వ లక్షణమై జిప్సీలు ,కోమాంఛెస్ తెగలు సంచార జాతులయ్యాయి ..ఇవాళ ఈ విషయాలు నవ్వు పుట్టిస్తాయికానీ హిట్లర్ కాలం లో ఇదేంటి అని ఎవరూ ప్రశ్నించలేదు .యుజెనిక్స్ అప్పుడు ఒక గొప్ప శాస్త్రమై నాజీకాలం లో విజృంభించింది  ..దీన్ని అడ్డం పెట్టుకొని నాజీలు  బలవంతపు  స్ట్రెయిలైజేషన్ అమలు చేసి అంటేలోపమున్న వ్యక్తులకు బలవంతంగా  సంతానోత్పత్తి లేకుండా చేసి జాతిని శుద్ధి చేసే ప్రయత్నం చేశారు .దీనికి అనుగుణంగా చట్టాన్ని 1933 జులై 14 న తెచ్చి అనువంశిక లోపాలు లేకుండా జాతి శుద్ధ రక్తం  కలుషితం కాకుండా చేస్తున్నట్లు ప్రకటించి ఇందిరా గాంధీ కాలం లో కొడుకు సంజయ గాంధీ ప్రవర్తించినట్లు బలవంతపు కుటుంబ నియంత్రణ చేసిపారేశారు .మానసిక బలహీనులు మానసిక రోగులు ,కొన్ని రకాల నరాల  జబ్బువాళ్ళు ,గుడ్డి  కుంటి క్రానిక్ ఆల్కహాలికులు అందరూ దీని బారిన పడ్డారు ..ఆతర్వాత తెలివిమీరిన ప్రభుత్వం వ్యక్తులకు అనుమతి లేకుండానే ,వాళ్ళకసలు తెలియ కుండానే స్టెరిలైజేషన్లు శత సహస్రాలుగా చేశారు .ఎలా చేశారో జర్మన్ చరిత్రకారుడు అలెక్సా0డర్ మిత్స్ రిలీచ్ ”వ్యక్తులు డాక్టర్ ఎదురుగా కుర్చీలలో కూర్చుని ఫారాలు ఫిలిప్ చేస్తుంటారు వారికి తెలియ కుండానే ఎక్స్ రే పరికరాలు వాళ్ళ కుర్చీలకిందనే పెట్టి వాళ్ళ జనానావయవాలపై మూడే మూడు నిమిషాలు కిరణ ప్రసారం చేయించి స్టెరిలైజేషన్ చేశారు ”అని రాశాడు . ఇంతకంటే ఘోరం -మాస్ స్టెరిలైజేషన్ కోసం ఒక ఇర్రిటేటింగ్ పదార్ధాన్ని స్త్రీల  గర్భాశయం లోకి   పంపి  అండ ఉత్పత్తి ని నాశనం చేసి పిల్లలు పుట్టకుండా చేయటం .ఈ పని నమ్మకమైన చెకప్ పేరిట డాక్టర్ల చేత ఇంజెక్షన్లు చేయించటం .ఇలా జరిగిందని పేషేంట్ కు అసలు తెలియని తెలియదు నమ్మక ద్రోహం అంటే ఇదే .ఇదేమీ కాకమ్మకబుర్లుకావు స్టెరిలైజేషన్ ప్రాజెక్ట్ లో పాల్గొన్న కార్ల్ బ్రాన్డ్ట్ చెప్పిందే -”పెద్దగా డబ్బు ఖర్చుకాని అతి తేలికైన ,త్వరగా జరిగే స్టెరిలైజేషన్ ను జర్మన్ రీచ్ కు వ్యతిరేకులైన రష్యన్లు ,పోల్స్ జ్యుల పై ప్రయోగించారు.ఇది శత్రు వులను ఓడించటమే కాక సంపూర్ణ శత్రు సంహారం చేస్తుంది ”అని నమ్మకంగా చెప్పాడు
             అర్ధ రాత్రి అంకమ్మ శివాలు
  1938 అక్టోబర్ 27 న హిట్లర్ జ్యులకు వ్యతిరేకంగా ఒక చట్టం తెచ్చి 18 వేలమంది జ్యులను జర్మనీ నుంచి బహిష్కరించాడు వీళ్ళు పోలాండ్ ,రష్యాలలో పుట్టినవాళ్ళు కనుక వాళ్ళు జర్మన్ పౌరులు కాదుఅన్నాడు .వాళ్ళ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కుక్కలని పిల్లుల్ని కుక్కినట్లు వాన్ లలో కుక్కి పశువులను సంతకు తోలుకు వెళ్లినట్లు సరిహద్దులలదాకా తీసుకొని వెళ్లి వాళ్ళమానాన వాళ్ళను వదిలేశారు .ఇందులో ఒక బాధితుడు జిండెల్ గ్రీన్ స్పీజిన్ ”ఎవరిదగ్గరా చిల్లిగవ్వ కూడా లేదు పదిమార్కులడబ్బుదాటి ఉంటె లాగేసుకున్నారు .ఇదేమిటి అంటే ఇదే  జర్మన్ చట్టం అన్నారు .ఎస్ ఎస్ మనుష్యులు మమ్మల్ని కొరడాలతో కొట్టారు  రక్తం కారిపోతున్నా  కనికరించలేదు మా సామాన్లన్నీ లాగేసుకున్నారు .అత్యంత ఆటవికంగా పాశవికం గా మా జీవితాలతో ఆటలాడారు ..జర్మనీలో ఇదే నేను చూసిన మొట్టమొదటి అమానుష చర్య ”అని  ఆతర్వాత గుర్తు చేసుకున్నాడు . అయ్యా అదీ హిట్లరయ్య నాజీ నియంత పాలన .
  జ్యుల నివాసాలపై పడి  దోచుకుని తగలబెట్టి భయపెట్టి చంపి విధ్వసం సృష్టించారు ఫైరింజన్ వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. వేలకొద్దీ జ్యుల ఆరాధనా స్థలానను ,7500 వ్యాపార సంస్థలను నాశనం చేశారు  లక్షలాది జ్యులను చంపారు .ఇంత  చేసిన హిట్లర్ ఆల్కల్ తాగేవాడుకాదు సిగరెట్ అలవాటులేదు పూర్తి శాకాహారి ,పెళ్లి పెటాకులు సంసారం చట్టబండలు లేనివాడు .మానవ సంబంధాలు తెలియనివాడు ప్రేమ  స్నేహం అంటే ఏమిటో తెలీనివాడు అంటే నమ్మగలమా నమ్మాలి ఇది నిజమే ..గోముఖ వ్యాఘ్రం సరైన పదమా ?ఇతని కేరక్టర్ ను చార్లీ చాప్లిన్ ”డి గ్రేట్ డిక్టేటర్ ”మూకీ చిత్రం లో అద్భుతంగా ఫన్నీగా పోషించి చూపాడు .
 ఇన్‌లైన్ చిత్రం 1
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-17 కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -2

ఘోరకలి  -2

        మరో మృత్యుద్వారం -ఘెట్టో
నాజీ యుద్ధ తంత్రం యూరప్ అంతా మోహరించి జ్యుస్ ను అందరి లోనుంచి  వేరు చేయటం ప్రారంభించింది . వాళ్ళను తేలికగా గుర్తు పెట్టె వీలుగా జ్యులు ఎందరో ”ఎల్లో జ్యుఇష్ స్టార్ ”లను ధరించాలని ఆదేశించింది .వాళ్ళ ఐడెంటిటీ పేపర్లలో పెద్ద అక్షరం తో  ”j”ఉండేట్లు చేసింది వాళ్ళందరూ ప్రత్యేక నివేశన స్థలాలలోనే ఉండాలని శాసించింది .ఇవే ”ఘెట్టోలు ”.ఈ పనిని తాము ఆక్రమించుకున్న దేశాలనుంచి ముందుగా ప్రారంభించింది .వీటికోసం బాగా మురికి వాడలను ఎంపిక చేసింది దాని చుట్టూ గోడకాని బార్బెడ్ వైర్ ఫెన్స్ కానీ ఏర్పరచి ,,మైళ్ళ దూరాలలో ఉన్న జ్యు లను కాలినడకన నడిపించి ఇందులో పడేయించింది .అక్కడ అందరూ కిక్కిరిసిన గదులలో గాలి వెలుతురూ లేక సరైన మరుగుదొడ్లు లేక నీచ నికృష్ట జీవితం గడిపేట్లు చేసి అంటువ్యాధులు ప్రబలటానికి దోహదం చేసింది .చాలామంది టైఫాయిడ్ క్షయలతో బాధపడి చనిపోయారు .బొచ్చెలో ఇంత చాలీ చాలని రేషన్ కూడు పడేసి చావ లేక బతకా లేక త్రిశంకు స్వర్గం లో వేలాడేట్లు చేసింది ..డబ్బున్నవాళ్ళు ఇళ్ల నో  స్థలాలలో అమ్మి కానీ తనఖా పెట్టికానీ డబ్బు పొంది బయటినుంచి కావలసిన తిండి తెప్పించుకొనేవారు ..ఘెట్టో లో బతకాలీ  అంటే నాజీలు చెప్పిన ఏదో పని చేసిబతకాలి అదొక్కటే మార్గం ఇదీ బానిస బతుకే . విపరీతమైన ఎండా వానా చలి లో ఆడవ  చాకిరీ చేసి ,ఒళ్ళంతా గుల్ల చేసుకొని బతికారుపాపం .దీనితో నీరసం వచ్చి జబ్బులపాలయ్యేవారు .అక్కడ వాళ్లకు ఏమైందో తెలియదుకాని ఈ ఘెట్టోలనుంచి బతికి బయటపడిన వారు కనిపించనే లేదు .
          ఇంకో చావు తెలివి -ఆపరేషన్ బార్బరోస్సా
1941 స్ప్రింగ్ కాలం లో నియంత హిట్లర్ ”ఆపరేషన్ బార్బరోస్సా ”ప్రారంభించి సోవియట్ యూనియన్ పై దాడి చేశాడు .స్టాలిన్ తో అంతకు ముందు చేసుకున్న ఒడంబడికను గాలికొదిలేశారు హిట్లర్ ..ఇప్పుడుకూడా అతని సై నికాధికారులు వద్దనే వారించారు .ఇలా చేస్తే జర్మనీ సైన్యం చాలా చోట్ల మోహరించాల్సి వస్తుందని దానితో సైనిక పాటవం బలహీనమవుతుందని హెచ్చరించారు . రాజు కంటే మోండివాడు గొప్ప అన్నట్లు రాజూ చక్రవర్తి నియంత ఫురోర్ అయిన సర్వాధికారాలు చేతిలో ఉన్నహిట్లర్ మొండోడి కంటే గొప్పవాడై వాళ్ళమాట పట్టించుకోలేదు రుడాల్ఫ్ హెస్ కూడా వద్దన్నాడు .హిట్లర్ అతడిని విజయానికి తోడ్పడమన్నాడు .ఇంగ్లా0డ్ తో ఉన్న ఒప్పందం ప్రకారం పడమర భాగాలను అది కాపాడుతుందని తూర్పు వైపు జర్మన్ దాడికి ఇంగ్లాన్డ్ సహకరిస్తుందని నచ్చ చెప్పాడు .ఈ పని తానే  చేయాలని హెస్  రహస్యంగా పారాచూట్ లో ఇంగ్లాన్డ్ వెళ్లగా అతడు మానసికంగా బలహీనుడని భావించి జైల్లో పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం .జర్మనీ కి ఎంతో సేవ చేసి హిట్లర్ కు కుడిభుజంగా ఉన్న హెస్ ను హిట్లర్ తో నాజీలందరూ దేశద్రోహి అనే ముద్రవేసి అవహేళన చేసి అవమానించారు .అతడు చేసిన మంచి అంతా గాలిలో కలిసిపోయింది ..
  1941 జూన్ 22 న జర్మన్ సైన్యం రష్యా సరిహద్దులు దాటి లోపలి ప్రవేశించింది దీనితో ఆపరేషన్ బార్బరోస్సా ప్రారంభమైంది .వెంటనే స్టాలిన్ జర్మనీపై యుద్ధం ప్రకటించి కూటమిలో చేరాడు ..యుద్ధం లో రష్యా తో తలపడటమే కాదు హిట్లర్ మనసులో మరో ముఖ్య ఆలోచనా సుళ్ళు తిరుగుతోంది .బార్బరోస్సా నెపం తో జ్యుల సమస్యను పరిష్కరించాలని భావించాడు .కొన్ని యూనిట్లు ”Einsatzgruppen ”పేరుతొ సైన్యం వెంట వెళ్లాయి .ఈ యూనిట్లది  ఒకటే లక్ష్యం -జ్యులను ,పనికి మాలిన ,అక్కర లేని వాళ్ళను చంపేయటం . సరైన లక్ష్య నిర్దేశం తో ఈ యమభట యూనిట్లు  సామూహిక మరణాలను పకడ్బందీ గా చేసేశాయి .సెప్టెంబర్ 29 30 తేదీలలో యుక్రెయిన్ లోని ”బాబ యార్రవైన్  ”లో అత్యధిక సంఖ్యలో యూదులను ఊచ కోత  కోసేశారు ”Einsatzgruppen ”యూనిట్లు వేలాది యూదులను చుట్టు ముట్టి రవైన్ కుఅంటే లోయలోకి  ”తోలుకు ”వెళ్లారు . ఈ మృత్యు  దళాలన్నీ ఒకే రకంగా పని చేశాయి .ముందుగా జ్యుల  బట్టలు బలవంతంగా  విప్పించేశారు నగ్నం గా చేస్తే సిగ్గుతో ఎదురు తిరిగే ధైర్యం రాదనీ నాజీలనమ్మకం . ఆ బట్టల్ని రీచ్ లో కావాల్సినవారికి అమ్మేశారు .  ఈ ఘోరకలి ని చూసిన ఒక ప్రత్యక్ష సాఖికధనం -”లోయలో అడుగున అప్పటికే చంపబడిన జ్యు ల శరీరాలపై  అంటే శవాల గుట్టలపై  వీళ్ళను అతి వేగం గా పడుకో బెట్టారు .మార్క్ మాన్ వచ్చి ప్రతి జ్యు ను మెడపై పిస్టల్ తో కాల్చాడు .అతడు చావగానే మరో జ్యు ను ఆతర్వాత ఇంకో జ్యు ను నిరాటంకంగా వరుసబెట్టి కాల్చి చంపుతూనే ఉన్నాడు  .ఆడ ,మొగా పిల్లా జెల్లా అనే విచక్షణే లేదు .పసిపిల్లని తల్లి చంకలో ఎత్తుకొనేట్లు చేసి దారుణంగా చంపారు ఆ నికృష్టులు ”అని చెప్పాడు ..ఈ రెండు రోజుల్లో మృత్యుదళాలు 33,771 మంది యూదులను  చంపేశారు .బాబీ యార్ లోయ అంతా జ్యు ల మృత్యు కళేబరాలతో నిండి పోయింది .
   తర్వాత గాస్ చేంబర్లున్న మొబైల్ వాన్ లలో కూర్చోబెట్టి చంపారు వాన్లలో జ్యు లను కోళ్లను కుక్కినట్లు కుక్కి దాని డోర్ కు తాళం పేట్టి సీలు వేసి కార్బన్ మోనాక్సయిడ్ విషవాయువును వాన్ లోకి వదిలి అందరూ చచ్చే దాకా కాపలా కాశారు .ఇదో మృత్యుహేల పైశాచికానందం . ఈ మృత్యు యూనిట్లు రోజుకు ఒక లక్షమందిని చంపారంటే ముక్కున వేలేసుకొంటాం .నిజమే ఆ చావు  వాసన భరించలేక. .ఈ వేగం చాలలేదట మహా నియంత హిట్లర్ కు .. 1941  వేసవిలో ”యూరప్ లో ఉన్న జ్యు  కమ్యూనిటీ నంతా సంపూర్ణంగా అంతమొందించాలి ”అని హిట్లర్ తన అరమీసాలపై చెయ్యేసి శపథం చేశాడు .  కనుక ఇది అమలు చేయటానికి మరొక నరాంతక కీచక మార్గాన్ని అవలంబించాలని పధకం పన్నాడు . అతడి బుర్ర డెవిల్స్ వర్క్ షాప్ అయింది .
                      తుది  పరిష్కారం
 జ్యు  సమస్యకు అంతిమ పరిష్కారం కోసం ప్రణాళిక రీన్ హార్డ్ హెర్డ్రిచ్ కు హిట్లర్ అప్పగించాడు . 1942 జనవరి 20 న బెర్లిన్ పరిసరాల్లో ఉన్న వాన్నెసీ లో జరిగే మీటింగ్ లో దాన్ని హిట్లర్ ముందుంచాడు .ఈ పధకం ప్రకారం జ్యు లనందర్నీ సమావేశపరచటం ,వాళ్లకు ప్రయాణ సౌకర్యం కలిపించి రైళ్లలో ఎక్కించటం అక్కడినుంచి సమూల దుంపనాశనం చేసే కాంప్ (ఎక్స్టె ర్మి నేషన్ కాంప్ )లకు తరలించడం అక్కడ సామూహిక నరకం లోకి తోసెయ్యటం ఇందులో దశలవారీ పధ్ధతి .ఆ కాంప్ లు ప్రత్యేకంగా వేలాది మందిని అతి తక్కువ కాలం లో కిక్కురుమనకుండా ,పకడ్బందీగా  అత్యంత నైపుణ్య సామర్ధ్యాలతో చంపటానికి వీలుగా తయారు చేయించారు .చావు తెలివి తేటలంటే ఇవే మరి . ఇలాంటి మృత్యుకుహరాలను నాలుగు చెల్మ్నో ,బెలీజెక్ ,ట్రెబ్లింకా  శోబిబోర్ లలో ఏర్పాటు చేశారు.రెండు కాన్సంట్రేషన్ కాంప్ Auschwitz ,Majdanek లను కిల్లింగ్ సెంటర్లుగా మార్చారు ..ఇవి మనం చెప్పుకున్న ఏదనేషియా అంటే మెర్సీ కిల్లింగ్ సెంటర్ లను పోలినవే .ఇవన్నీ భయంకర అత్యంత మరణ సామర్ధ్యమున్న చావు కేంద్రాలే .షవర్ బాత్ లులాగా అనిపించే విషపు గ్యాస్ చేంబర్లు  శవదహనం క్షణాలమీద చేసే అతి విశాల దహన వేదికలతో భూలోక నరకాలుగా ఆఘ మేఘాలమీద తయారు చేయించారు .
   వాన్నెస్సే కాన్ఫరెన్స్ అయినఏడాదికే సోవియట్ యూనియన్ జర్మనీని తూ ర్పుయుద్ధం లో  చావు దెబ్బ తీసింది  2.-2-19 42 న  91 వేల  జర్మన్ సైన్యం స్టాలిన్గ్రాడ్ లో లొంగిపోయింది .అసలు 2,85 000 మందిలో యుద్ధం లో బతికినవాళ్లు వీళ్ళే. అత్యంత విశాల థర్డ్ రీచ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేద్దామనుకున్న నరరూప రాక్షస హిట్లర్ కు  ఈ అవమానం  అశనిఘాతమే అయింది  . యుద్ధం లో చావుదెబ్బతిన్నా జర్మన్ సైన్యం ,ఎస్ ఎస్ వాలంటీర్లు తుది పరిష్కారానికి పని చేస్తూనే ఉన్నారు .చావు రైళ్లు పరుగెత్తుతూనే ఉన్నాయి వేలాది మంది జ్యు లు తరలింపబడుతూనే ఉన్నారు ,గాస్ చేంబర్లు శవదహన వాటికలు ఇరవై నాలుగు గంటలూ పని చేస్తూ జ్యు హననం చేస్తూనే ఉన్నాయి .కాంపులలోని పెద్దపెద్ద ఇటుక చిమ్నీలనుంచి శవాల బూడిద ,పొగా  గాలిలోకి నిరంతరం చేరుతూ కారుకంపు కొడుతూనే ఉంది .ఈ ఫైనల్ సోల్యూ షన్ పితామహుడైన రీన్హర్ హి డ్రిచ్ ను జేక్ అభిమానులు పట్టుకొని చంపేసి పరిష్కారకర్త  జీవితాన్ని అనంత వాయువులోకలిపి పరిష్కరించారు ఎవడు తీసుకున్న గోతిలో వాడు పడటం సహజమే దీన్ని క్రూర ప్రతీకారం అన్నది జర్మన్ ఏ ఎస్ దళం .ఈ తుదిపరిష్కారాన్నే ”ఆపరేషన్ రీన్ హార్డ్ ”అన్నారు . రీన్ హార్డ్ హేడ్రిచ్  హత్యకు  ప్రతీకారం గా ఎస్ ఎస్ దళాలు 13 వందలమంది జేక్ లను విచక్షణా రహితంగా చంపేసి  లిడికో అనే చిన్న పట్టణాన్ని ధ్వంసం చేసి నేల మట్టం చేశారు.బెర్లిన్ లో 152 మంది జ్యు లను ఉరితీసి 3 వేలమంది జ్యు లను కాన్సెన్ట్రేషన్ కాంప్ లనుంచి పోలాండ్ లోని హనన కేంద్రాలకు తరలించారు
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2
ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4ఇన్‌లైన్ చిత్రం 5
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్కూల్ లో మా మనవడు చి ఆశుతోష్ ట్రంపెట్ కచేరి -4-5-17 సాయంత్రం

This gallery contains 8 photos.

More Galleries | Tagged | Leave a comment

ఘోరకలి -1 ,

ఘోరకలి -1         ,

జర్మనీలో హిట్లర్ నియంతకాలం లో జరిగిన దారుణ మానవ కాండ నరజాతి చరిత్రలో రక్తపు మరకలను మిగిల్చింది . అంతకు పూర్వం రష్యా చైనా లలో మానవ హననం జరిగింది కానీ ఇక్కడ పగా ద్వేషం జాతి నిర్మూలన తోపాటు పసిపిల్లలు వృద్ధులు ,పిచ్చివాళ్ళు అంగవైకల్యమున్నవారు ,,ముఖ్యం గా యూదులు ,జిప్సీ జాతులను భూమి మీదే లేకుండా చేయాలని ఆర్య రక్తమే స్వచ్ఛమైనది మిగతా రక్తం లేని స్వచ్ఛ ఆర్యరక్తపు జనాలతో  నూతన జర్మనీ నిర్మించాలన్న పగటి క లలతో ఇంతటి ఘోర కలి  సృష్టించారు .ఆ బీభత్సం జరిగి సుమారు 80 ఏళ్ళు అయినా ఎందరెందరో ఇప్పటిదాకా ఎన్నెనో రహస్యాలు వెలికి తీసి చరిత్ర కెక్కిస్తున్నా ,చదివిన ప్రతిసారీ గుండె చె రువైపోతూనే ఉంటుంది ఒళ్ళు గగుర్పాటు పొందుతూనే ఉంటుంది ఆ అభాగ్యులపట్ల కళ్ళు చెమరిస్తూనే ఉంటాయి ఆ నర రూప కిరాతుల అనాగరిక వికృత చేష్టలకు  బాధ్యులైన వారిపై కసి ద్వేషం ఉవ్వెత్తున ఉబుకు తూనే ఉంటుంది . రక్తం మరుగుతూనే ఉంటుంది ఇంతటి ఘోరకలి ఎప్పుడూ ఏదేశం లోనూ చూసి విని ఉండరు .
  హిట్లర్  స్టూడెంట్ లాండ్ ను వశ పరచుకున్నాక జెకోస్లో వేకియాపై ద్రుష్టి లేదన్నాడు.దాని సరిహద్దుల జోలికి రానని అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు  ఆత ను చెప్పేది ఒకటి చేసేది మరొకటి అబద్ధాలాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య -కాదుకాదు వెన్నుతో పుట్టిన విద్య . 1939 మార్చ్ 15 ఉదయం 6 గంటలకే జర్మనీ సైన్యం జెకోస్లోవేకియాపై దాడి చేశాయి .తమాషా ఏమిటంటే అక్కడ వారిని ఎదిరించినవారే లేరు . ముసలివాడైనా జేక్ ప్రెసిడెంట్ ఈమైల్హాచా ను బెదిరించి లొంగిపోయినట్లు సంతకం పెట్టించాడు హిట్లర్ . ఒక వేళ కాదని ఎదురు తిరిగితే జేక్ ప్రజల్ని చంపి ,నగరాలను విధ్వంసం  చేసి బూడిద కుప్ప చేస్తానని బెదిరించాడు ఇది హిట్లర్ సిగ్గులేని చేస్ట కు నిదర్శనం ..ఇలా జర్మన్ల రక్తపు బొట్టు చిందకుండా విజయం సాధించి మూడవ రీచ్ అనే జర్మనీ సామ్రాజ్యం లో కొత్త దేశాన్ని కలిపేశాడు 

దాస్టికం బుకాయింపు ,ఆగ్రహం బెదిరింపు లతో పొందిన విజయం అందుకే అతనిని ”బ్లఫ్ బ్లస్టర్ మాస్టర్ ”అంటారు . . 1939 ఆగస్టు 23న రష్యా నియంత స్టాలిన్ తో దాడి రహిత సంధి కుదుర్చుకొని రష్యాను తటస్థంగా ఉండేట్లు చేశాడు .ఫ్యూరర్ అని పిలువ బడే హిట్లర్ ..అందుకే అతనిని ‘ . ఇంతటి తో ఆగక చూపు పోలాండ్ పై పడింది .సైన్యాధికారులు సమయం కాదని వారిస్తున్నా ఉక్కు ,ఆయిల్ ,సరఫరాలు చాలా తక్కువగా ఉన్నాయని  ఉన్న ఆయుధ సామాగ్రి 6 వారాలకు మాత్రమే సరిపోతుందని చెప్పినా  పెడ  చెవిని పెట్టి ఆకస్మిక దాడులతో భయ భ్రా0తులను  చేసి చరిత్రలో పేరు పొందాలని భావించి సాధించిన ప్రతి విజయం మరోదానికి దారి చూపిస్తుందని కావలసినవన్నీ త్వరలోనే సమకూరుతాయని నచ్చ చెప్పి 1939 సెప్టెంబర్ 1 న పోలాండ్ పై 10 లక్షల సైన్యం తో విరుచుకు పడ్డాడు యుద్ధ టాంకులు  కాల్బలం లూప్త్ వాఫ్ అనే వైమానిక రక్షణ పై నుంచి ఇచ్చింది వణకిపోయిన పోలాండ్ లొంగిపోయింది .దీనితో తటస్థంగా ఇప్పటిదాకా ఉన్న బ్రిటన్ ఫ్రాన్స్ లు జర్మనీ పై యుద్ధ ప్రకటన చేసి ”అనుబంధ కూటమి ”గా మారాయి తర్వాత రష్యా అమెరికాలు దీనిలో చేరాయి ఇటలీ  జపాన్ లు జర్మనీ వైపు నిలబడి ”అక్ష కూటమి ”గా మారాయి .  .మళ్ళీ మామూలే హిట్లరయ్యకు మాట తప్పటం .చేసిన ఒప్పందాన్ని తూనా బొడ్డు  అని ఒట్టు తీసి గట్టున పెట్టి 1941 జూన్ 22 న హిట్లర్ రష్యాపై దాడి చేశాడు .జపాన్ అమెరికా వాళ్ళ పెరల్ హార్బర్ పై దాడి చేసింది .మొదట్లో దూకుడుగా దూసుకు పోయి,అజేయమగా ఉన్న  జర్మనీ పడమటి యూరప్ దేశాలను వరుసగా స్వాధీనం చేసుకొంటూ అప్రతిహతంగా ముందుకు పోతోంది డెన్మార్క్ నార్వే ,లక్సమ్  బర్గ్ బెల్జియం నెదర్లాన్డ్స్ చివరికి ఫ్రాన్స్ లు దాసోహమన్నాయి
       స్వచ్ఛ జర్మన్ రక్తం కోసం దారుణాలు
జర్మనీని స్వచ్ఛ జర్మన్ రక్తం తో నింపాలన్న హిట్లర్ ఆశయం ఎన్నడూ వదిలి పెట్టలేదు  కనుక ముందు ఎధునాసియా అంటే ” మెర్సీ  కిల్లింగ్”ను అమలుపరచాడు .అవయవ లోపంఉన్నవారు వికృతంగా ఉన్నవారు , మతి స్థిమితంలేనివారు పిచ్చివాళ్ళు వీరందరూ  మెర్సీ కిల్లింగ్ కు  బలయ్యారు   వీళ్ళతో ఆగలేదు పుట్టిన పసిపిల్లలమీదా దృష్టి పడింది ”సైన్టిఫిక్ రిజి స్ట్రే షన్ ఆఫ్ సివియర్ హెరెడిటరీ ఎయి ల్మెంట్స్ ”అనే సంస్థ రీసెర్చ్ నెపం తో తీవ్రం గా బాధపడుతున్న పిల్లకు మంచి మందు ఇచ్చి నయం చేస్తామని నమ్మబలికి ఈ రీసెర్చ్ కి సహాయంగా ప్రసూతి హాస్పత్రులు ,మిడ్ వైఫ్  లు ,లను సరైన పుట్టుక లేని బేబీలను గుర్తించి రిపోర్ట్ చేయమని చెప్పి జాబితాలు తయారు చేయించింది .వాళ్ళు చాంతాడంత లిస్ట్ లు తయారు చేసిచ్చారు . అవయవ లోపం  నరాల బలహీనత మానసికంగా కుంగిపోయిన వారూ ఉన్నారు .ఈ లిస్ట్ రీచ్ కమిటీకి చేరాక చూపు పెద్ద పిల్లలపై  పడివారి లిస్ట్ లు తయారు చేయించారు . ఈ రిపోర్ట్ లను ముగ్గురు పీనల్ డాక్టర్లు పరిశీలించి ఇందులో ఎవరు చావాలో ఎవరు బతకాలో నిర్ణయం చేసేవారు .కానీ చివరికి వాళ్లకు మందులు ఇచ్చిబాగు చేసినట్లుకాని అందులో బతికి బట్టకట్టిన వారు కానీ కలికానికి కూడా కనిపించేలేదని ఇదంతా నయవంచన అని తేలింది ఎవరూ మాట్లాడే వీలు లేదు మూ సుక్కొచోవటమే  ,
  పిల్లలనుంచి తలిదండ్రులను వేరు చేసి ”మీ పిల్లాడు కొత్త ట్రీట్ మెంట్ ప్రోగ్రామ్ ”లో ఉన్నాడు మంచి గట్టి మందులిచ్చి మీ వాడిని ఆరోగ్య వంతుడిని చేస్తారు ,,మంచి గొప్ప జీవితం లభిస్తుంది ”అని బ్లఫ్ మాస్టర్స్ పలికి వేరు చేసేవారు ఒక వేళ ఎవరైనా  తలిదండ్రులు  మేము ఇవ్వం మాపిల్లల్ని అన్నా ,అనుమానం తో ప్రశ్నలు వేసినా వారిని నయానా భయానా చెప్పి చివరికి ఒప్పుకునేదాకా బెదిరించేవారు .దీనిపై నిర్ణయం బాధ్యత పేరెంట్ లకు లేదు అదీ బ్లఫ్ మాస్టర్స్ చేతుల్లోనే ఉండేది .నిర్ణయాధికారం ఉందని మాత్రం పో జు కొట్టేవారు . సర్వం దైవా దీనం -సారీ నారీ అధీనం మరోసారి సారీ నాజీ అధీనం .అయ్యా ఈ ఇన్టేక్  ట్రీట్ మెంట్ సెంటర్లు నగరం నడి  బొడ్డున ఉన్నాయని కొంటె” తప్పులో”కాలేసినట్లే ఎక్కడో చాలా దూరం లోనిర్మాణుష్యప్రదేశం లో పల్లెల్లో ఉండేవి అంటే నమ్ముతారా ?అబద్ధాలమీద బతికింది నాజీ రెజీమ్ .
  కొన్ని వారాలతర్వాత పేరెంట్స్ కు వాళ్ళ పిల్లాడో పిల్లో చచ్చి పోయిందని నోటీస్ వచ్చేది .చావుకు కారణం న్యుమోనియా ,అపెండిక్స్ బద్దలవటం అని మాత్రమే తెలియ జేసేవాడు .అసలు కారణాలు వేరు బాబూ . వాళ్ళ డాక్టర్లే వాళ్ళని మర్డర్ చేశారు .రీచ్ కమిటీ పిల్లలు  ప్రాణాంతక  ఇంజెక్షన్లు ,విషవాయువు  ఆకలి , మూలం గానే చనిపోయారు .స్వయానా ఈ భయానక మరణాలను చూసిన డాక్టర్ హెర్మన్ ఫానిమిల్లర్ ”ఓక్ అనే ఆరోగ్య జర్మన్ ప్రజలకు  ఈ అభాగ్యులు  భారమని భావించాం .మేం  పిల్లల్ని చంపం ఇంజెక్షన్లతో విషంతో .మాది ఇంకా తేలికపద్ధతి చాలా సహజంగా ఉంటుంది ”అని  చెప్పి బెడ్ మీద ఉన్న పిల్లాడిని చచ్చిన ఎలుకను పట్టుకున్నట్లు పట్టుకుని విషపు నవ్వు నవ్వుతూ  ఈ వెధవ  చావుకు ఇంకా మూడునాలుగు రోజుల టైమ్ ఉంది ”అని ఒక డాక్టర్ స్వయానా చెప్పాడని రాశాడు ..ఇలాంటి చోట్ల వేలకొద్దీ జర్మన్ పిల్లలు ఈ డాక్టర్లనబడే కిరాతకులు చేతుల్లో అసువులు బాశారు .దీనికి కారణం ఒక్కటే ”రీచ్(హిట్లర్ జర్మనీ ) కు ఇలాంటి వాళ్ళు బతకటానికి అనర్హులన్న భావమే ఇక్కడ హీలర్స్ కిల్లర్స్ గా మారారు  ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న మెంటల్ పేషేంట్ లను ముందే హతమార్చారు ఈ హత ప్రక్రియకు ఒక కోడ్  ”ఆపరేషన్ T4”అని పేరుపెట్టారు .ఇది బెర్లిన్ హెడ్ క్వార్ట్రర్స్ –”టీర్ గార్టన్ స్ట్రాస్సీ -4 ”పేరు
  ఇక యువకులను చంపే ప్రోగ్రామ్ అమలుకు t 4 కిల్లింగ్ కేంద్రాలు 6 సెంటర్  లలో పెట్టారు . వాటిలో గాస్ చేంబర్లు షవర్ బాత్ ల రూపం లోనూ అనుబంధంగా   కళేబర దహన  వాటికలు ఉండేవి . ఒక క్రమపద్ధతిలో చంపటం అంతే  వేగంగా కాల్చిపారేయటం క్షణాలమీద జరిగిపోయేవి . 1941 ఆగస్టు లో ఈ హనన దహన ప్రోగ్రామ్ అంతమైంది .అప్పటిదాకా నిరంతరాయంగా 24 గంటలు ఏడు రోజు లూ జరిగింది .దాదాపు 80 వేల ప్రాణాలు వీరి ఆపరేషన్ 4 లో గాస్ కు మంటలకు ఆహుతయ్యాయి . కాదేదీ కవితకనర్హం ”అన్నాడు ఆతర్వాతెప్పుడో శ్రీ శ్రీ కానీ నాజీలు ”కాదేదీ చావుకనర్హం ”అని నమ్మారు ,రుజువు చేశారు ..నిజానికి ఈ నిరంతర హనన ప్రక్రియ ఆగిపోలేదు రెండవ ప్రపంచ యుద్ధకాలం లోను ఆ తర్వాతా కూడా జరిగింది ఈ కాలాన్ని ”వైల్డ్ ఎధునేషియా ”అన్నారు అంటే” ఆటవిక కారుణ్య హత్య ‘-వైల్డ్ మెర్సీ కిల్లింగ్ . కారణం ఇది అనధికారిక ,అవ్యవస్థిత మానవ మారణ హోమం .జర్మన్ కిల్లింగ్ సెంటర్ లలో ఈ మెర్సీ  కిల్లింగ్ సెంటర్ లలో ఎధు  నేషియా  ప్రోగ్రామ్  అధికారికంగా సమాప్తమయిన తర్వాత  ఎన్ని వేలమందిని చంపారో  లెక్కా డొక్కా లేదు
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3
  .
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి, మల్లినాథ సూరి మనీష -32

వ్యాఖ్యాన చక్రవర్తి,  మల్లినాథ సూరి మనీష -32

ఏకావాలి లో  అలంకార చర్చ
ఆపహ్నుతి  అలంకారం -దీనిలో రూపకాలంకారం లో ఉన్నట్లే ఆరోపం ఉంటుంది .అయితే ఇది అపహ్నవం  చేత సమర్ధింపబడుతుంది .కనుక వర్ణించబడే విషయం అలా ఉన్నట్లు కనబడదు అది ఒక ప్రత్యేకతతో మారిపోతుంది విద్యాధరుడు ఆపహ్నుతి లో మూడు రకాలు ఉన్నాయని చెప్పాడు -”ఆపహ్ను త్యా రొపః , ఆరోప్యా పహ్నవః -చలాది  శబ్దే రసత్యవం ప్రతిపాదనం చేతి త్రివిధోస్య బంధ ఇత్యర్ధహ ”అన్నాడు సూరి .మొదటి దానిలో ఆరోపం  రహస్యమైన దానితర్వాత వస్తుంది .రెండవ దానిలో దీనికి వ్యతిరేకంగా అంటే రహస్యం తర్వాత ఆరోపం వస్తుంది .మూడవ దానిలో రహస్యంగా ఉన్నదాన్ని చల ,ఆపదేశ వంటి శబ్దాలచేత సూచింపబడుతుంది దీని నేపధ్యంగా మల్లినాథుని నిర్వచనం సరళం గా ఉండి  ప్రత్యేకంగా కనిపిస్తుంది -”యత్యా రో ప్య మాణస్యా రోవిషయాపహ్నునేవనావ సాపాహ్నుతిః ”
 సహోక్తి-సహోక్తి   విషయం లో సూరి రుయ్యక భావం పై ఆధారపడ్డాడు ఇందులో సహా అంటే సూత్రాలోచన పాదాలమధ్య గౌణమైన సంబంధం కనుక వస్తువులమధ్య సంబంధం గా ఉండాలని లేదు అదివస్తువు  ఒకదానితో ఒకటి కలిసి పోవటం (ఇంట్రా ససెప్షన్ )పై ఆధార పడి  ఉంటుంది దీన్ని శ్లేష ద్వారా గుర్తించాలి ఇక్కడ రుయ్యకుని వివరణపై మల్లినాథుని వ్యాఖ్యానం దాన్ని గుర్తుకు తెస్తుంది .సహోక్తి లో ఉపమా న ,ఉపమేయాల సంబంధం ఉద్దేశ్య పూర్వకమైనదే ..సహా చేత సూచింపబడే వస్తువు ఉపమేయ స్థానం లో ఉండి వ్యక్తీకరించే క్రియ తో సంబంధంకలిగి ,రెండవ దాని అర్ధం సహలో చెప్పినట్లు  ఉద్దేశితమౌతుంది .-”ఇహ భావే ప్రకృతత్వాన్ ఉపమానోపమేయ భావో వైవక్షి కః -తత్ర సహార్ద నిర్దిష్టస్య అప్రాధాన్యా దుపమానా త్వమర్దాది తరస్య ప్రాధాన్యాద్యుపమేయ త్వం -యాత్రోపమానోపమేయ యో రేకస్య శబ్దహ -క్రియా సంబంధ ఇతరస్య సహార్ద నిర్దేశా ద్ గమ్యహ సా సహోక్తి రిత్యర్దా ”
ప్రతి వస్తూపమాలంకారం -అనేక వాక్యాలలో పోలిక ఉండటం దీనిప్రత్యేకత రెండు వాక్యాలుంటే వాటిలో లక్షణం లేక గుణం (యట్రి బ్యూ షన్ ) ఒకే రకంగా ఉంటుంది . దృష్టాంతం లో  మొదటిదానిలోని గుణం రెండవ దానిలోగుణం పోలికతో  ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఈ రెండు వేరు వేరు వాక్యాలలో చెప్పబడిన గుణాలు అసలైనదానికి దాని ప్రతిబింబాన్ని ఉన్న సంబంధంగా ఉంటాయి . మల్లి నాధుని వివరణ -”భిన్న యోరేవ వస్తు నో రత్యంత సదృశా యోరుభయత్ర  పృధంగా నిర్దేశో బింబ ప్రతి బింబ భావః ”కానీ ”యత్ర వస్తు స0బందేన ప్రతి బింబనం గమ్యతే సా నిదర్శనమే ”అన్నాడు .కొన్ని చోట్ల వస్తువుకు ,పోల్చబడేదానికి  ,సాధ్యం లేక సాధ్యం కాని    సంబంధాలు కొన్ని సందర్భాలలో ఉంటె   అది నిదర్శనాలంకారమవుతుంది-యత్ర పరస్పరని రక్షరాని రపేక్షర్ద త్వే న వాక్యార్ధ భేద స్తత్ర దృష్టాంతః -యత్ర సాపేక్షార్ధత్వే న విద్యర్ధ వాద యోరివ వాక్యయో  రేకవాక్య తా తత్ర నిదర్శనేతి  భేదః -ఉత్ప్రేక్షాలంకారం -ఉత్ప్రేక్షను విద్యాధరుడు తనపద్ధతిలో విచిత్రంగా నిర్వచించాడు .ఈ అలంకారం   శోషణం (అబ్సా ర్ప్షన్  ) లేక ఒకదానిలో ఒకటి దూసుకుపోవటం వలన అంటే ఆద్యావసయం వలన ఏర్పడుతుంది ఏకావాలి కర్త చక్కని నిర్వచనం చెప్పాడు -అభిన్న త్వే న ప్రతిభాసనమద్యావసాయహ్ ”అని అధ్యావసాయ కు అర్ధం చెప్పాడు వస్తువును పోల్చబడేది పూర్తిగా మింగేస్తే వచ్చేది ఆద్యావసయం 1-సిద్ధ 2 సాధ్య అని రెండురకాలన్నాడు విద్యాధరుడు.పోల్చబడినది వస్తువుతో ఉన్న సంబంధం తెలియబడితే వచ్చేది విషయ పై విషయం ఆరోపిస్తే వచ్చేది   .ఇదే అతిశయోక్తి ఆధారం .విషయం విషయిల సంబంధం వేరుగా ఉంటె కొత్త భావం అందులో స్ఫురిస్తుంది .ఇక్కడ అనుమానం  తర్కం ఊష సహాయ పడుతుంది .మల్లినాథుడు ఉత్ప్రేక్షకు కొత్త నిర్వచనమిచ్చాడు -”స0 భావన మాయోత్ప్రేక్షా ప్రకృతస్య పరేణ యాత్ అని మమ్మటుడు చెప్పనడానికి సూరి ”అప్రకృత గుణ క్రియాభి సంబంధాత్ ప్రకృతస్య  ప్రాకృతత్వే న స0భావన ముత్ప్రేక్ష్యో త్య ర్ధః ”
అధ్యావసాయ లోని సిద్ధ ,సాధ్యలనూ మల్లినాథుడు  విస్తరించి చెప్పాడు .-”యత్ర వైశ్య విషయిణో ర్ధ యో రూపాదానం తత్ర భేద వదవ భాసా దభేదో నావ బాసతే -విషయిణో సత్యతా ప్రతీతేహ్ -తథాపి విషయస్య తదా వ్యపదేశత ద్ధర్మ యోగి త్వాభ్యామ భేదోద్యవసీయతే సంభావ్యతా ఇతి వ్యాపార ప్రాధాన్యా ధ్యా వసాయః సాధ్య ఇత్యర్దహ”
  అధ్యావసాయ  సిద్ధ ఎప్పుడు అవుతుందిఅంటే విషయం శబ్దాలతో చెప్పబడక పోలిక చెప్పబడే దానితో మింగివేయబడితే అప్పుడు పోలిక వస్తువు అధ్యావాసిత అయి కప్పి వేయబడి స్పష్టమౌతుంది . సాధ్య ఎప్పుడౌతుంది అంటే -వస్తువు పోలిక చెప్పబడే దానితో తాదాత్మ్యంగా చెప్పబడితే అప్పుడు సాధ్య అవుతుంది -”యత్ర తుతస్యానుపాదానం తత్ర విషయిణా ఏవోయాదాన మహిమ్నా తస్య వస్తు తో సత్య స్యాపి సత్యతా ప్రతీతౌ విషయస్య తదాత్మా నాధ్యా వసిత ప్రాధాన్యే ”జ్ఞాతోదర ”ఇత్యర్ధ ధరమ్ ప్రతి జ్ఞానస్యేవా ద్యావసాయ స్యాద్య వసితం ప్రత్యుప సర్జన త్వం ప్రతీయతే -ఏతదేవాద్యావస్యా వయస్య సిద్ధాంతం నామ ”
  ఉత్ప్రేక్షలో ఉపమాన ఉపమేయాలు లేక విషయం విషయ లను గుర్తించటం  పూర్తికాకపోతే సాధ్య అవుతుంది .కానీ అతిశయోక్తిలో గుర్తించటం పూర్తి అయితే సిద్ధ అవుతుంది ఏకావాలి మల్లినాథుని నిర్వచనం లో ”గుణాభి సంబంధా ”అనే దాన్ని ఉపయోగించాడు ఇక్కడ గుణ అంటే క్రియ అనే అర్ధం లో వాడాడని గమనించాలి  .మరికొన్ని అలంకారాలు తర్వాత తెలుసుకొందాం .
  సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలంగాణ సాహిత్య అకాడెమి

ఇన్‌లైన్ చిత్రం 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వైకింగ్ శకం -3

వైకింగ్ శకం -3

1014 లో శ్వీన్ ఫోర్క్ బియర్డ్ లంకా షైర్ లోని  గెయిన్స్ బర్గ్ లో ఫిబ్రవరి 3 చనిపోయాడు  డెన్మార్క్ లో ఖననం చేశారు . ఏదెల్  రెడ్ నురాజుగా  పిలవగాశ్వీన్ కొడుకు  క్నాట్   ది  గ్రేట్ ను  తరిమికొట్టి సోదరుడు హరాల్డ్ -2 ను డెన్మార్క్ రాజును చేశాడు క్లాన్  టార్ఫ్  బ్రియాన్ బోరు ,హై కింగ్ ఆఫ్ ఐర్లాండ్ యుద్ధాలలో లీన్ స్టర్  రాజును  డబ్లిన్ రాజు సిల్క్ బియర్డ్  ఎరల్  ఆఫ్ ఆర్కెని ఐలాండ్స్ లాడ్  వేసేం ల సాయం తో ఓడించి చివరికి తానె చనిపోయాడు . 1015  లో క్నాట్  ఇంగ్లాన్డ్ కు 200 షిప్పులతో 10 వేల  సైన్యం తో  తిరిగివచ్చాడు . 1016   ఆషింగ్టన్ యుద్ధం లో ఏదెలా రెడ్ సాయాన్ని దుంప నాశనం చేసి థేమ్స్ నదికి ఉత్తరాన ఉన్న ఇంగ్లాన్డ్ ను స్వాధీనం చేసుకొని దేనిలా వెళ్ళాడు .ఏదేరాల్డ్ చనిపోగా పాత సెయింట్ పీటర్ పాల్ కాధెడ్రల్ లో  ఉంచారు . 1017లో క్నాట్   ది  గ్రేట్ ఇంగ్లాన్డ్ రాజుగా పట్టాభి షిక్తుడయ్యాడు .తర్వాత డెన్మార్క్ రాజు క్నాట్   తమ్ముడు హెరాల్డ్ చనిపోగా డెన్మార్క్ వచ్చేసి  దానికీ రాజయ్యాడు . 1027 లో రోమ్  సందర్శించి రెండవ కాన్రాడ్ కారోనేషన్ కు హాజరయ్యాడు . 1028 లో క్నట్  ఇంగ్లాన్డ్  డెన్మార్క్ నార్వే లకు రాజుగా గుర్తింపు పొందాడు .అంటే విశాల బ్రిటిష్ సామ్రాజ్యానికి వైకింగ్ కింగ్   చక్రవర్తి అనిపించుకున్నాడు . 7ఏళ్ళు పాలించి 1035 లో చనిపోతే వెస్ట్ మినిష్టర్ కెదెడ్రల్ లో అంత్యక్రియలు జరిపారు .కొడుకు హెరాల్డ్ హేర్  ఫుట్ ఇంగ్లాన్డ్ రాజయి 1040లో చనిపోయాడు మూడవ కెనాట్ 10 42 వరకు రాజు నార్వే జార్చుకున్నాడు 1040లో ఆర్దాక్న్తట్  ఇంగ్లాన్డ్ రాజుగా హెరాల్డ్ మరణం తర్వాత అయ్యాడు . 1042 లో హెర్లాడ్ ది కన్ఫెస్సర్ రాజయ్యాడు నార్వే రాజుగా హరాల్డ్ హార్ డ్రాతా ఉన్నాడు ఇతనికజిన్ డెన్మార్క్ రాజై 1066 దాకా ఉన్నాడు డెన్మార్క్ రాజు హరాల్డ్ శ్వీన్ యేస్ట్రర్ సన్ 1074 దాకా రాజ్యమేలాడు . 1066 లో కన్ఫెస్సర్ చనిపోగా ఎడ్వార్డ్ భార్య తమ్ముడు గా డ్ విన్సన్ తాత్కాలిక రాజయ్యాడు .హరాల్డ్ హర్ డ్రాడా ఇంగ్లాన్డ్ పై దాడి చేసి ఓడిపోయాడు  స్టామ్ఫోర్డ్  బ్రిడ్జ్ బాటిల్ లో చనిపోయాడు వైకింగ్ రాజు  రోల్లో మునిముని మనవడు విలియం నార్మాండి ఇంగ్లాన్డ్ ను 7 వేల  మంది సైన్యం తో ముట్టడించి హరాల్డ్ ను ఓడించి చంపి క్రిస్మస్ రోజున వెస్ట్ మినిష్టర్ అబ్బే లో ఇంగ్లాండ్ రాజయ్యాడు . 1069 లోనార్వే రాజు  శ్వీన్ యేస్త్రిడ్సన్  తమ్ముడు ఆస్ బోరన్  ”యార్క్ ”అన్వేషణకు మద్దతిచ్చి విలియం కు వ్యతిరేకంగా పెద్ద సైన్యం తయారు చేయించాడు .కానీ అతని అన్వేషణ పూర్తికాలేదు 1094 లో చివరి  డబ్లిన్ వైకింగ్ కింగ్ గాడ్ఫ్రెడ్  తొలగింపబడ్డాడు 1098లో నార్వే రాజు మాగ్నస్ బేర్ లెగ్స్ ఆర్కనీ  హెబ్రీడ్స్ కు  అన్వేషణకు వెళ్లి స్కాటిష్ రాజుచేత రికగ్నిషన్ పొందాడు . 1263 లో వెస్టర్న్  ఐల్స్ లో వైకింగులపాలనపై  స్కాట్ ల తిరుగుబాటుకు ప్రతిగా వైకింగ్ రాజు నాలుగవ హాక్సన్ లార్గ్స్ లో యుద్ధం చేసి ఓడిపోయాడు .చరిత్రలో వైకింగ్ ల చివరి దండ  యాత్ర ఇదే .దీనితో సుమారు 500 ఏళ్ళ వైకింగ్ శకం సమాప్తమైంది .

  వైకింగ్ అనే మాట విక్  అనే పదం నుంచి వచ్చింది దీని అర్ధం ఇరుకైన అగాధం .దీనికి చెందిన వాళ్ళని భావం .వికేం అనే నార్వీజియన్ పదం పాత నార్సేలోని వికిన్ నుంచి వచ్చి అక్కడ నివ సించినవారు అనే అర్ధం రూఢి అయింది వికింగ్ అనే పదం పాత ఆంగ్లో సాక్సన్ కవితలో ఉంది  జర్మన్లు వీరిని ”యాస్కోమిన్ని ”లేక యాష్ మెన్ అన్నారు అంటే  యాష్ అనే కలపతో పడవలు తయారు చేసేవారని అర్ధం బైజాన్టియన్లు ”వారంగియాన్స్ ”అన్నారు .అంటే మాటకు కట్టుబడేవారని నమ్మకస్తులని భావం .ఫ్రాంక్స్  ఇంగిలీషు వాళ్ళు వీళ్ళని నార్దర్న్ మెన్ లేక డేన్స్ అన్నారు .
గమ్యాలా ఉప్సల లో 2 వేల  ఏళ్ళనుంచి 2 నుంచి 3 వేలమంది మట్టిలో కూరుకు పోయిన మట్టి దిబ్బలున్నాయి 40 అడుగుల ఎత్తు తో ఇవి కట్టబడ్డాయి వీరు శ్వీడాన్ వైకింగులు   భావింపబడ్డారు డెన్మార్క్ లోని ఆల్ బోర్గ్ దగ్గర లిన్దోమ్ హుజీ 600  రాతినావలు వైకింగ్ కాలానివి కనిపించాయి . బ్రాన్జ్ యుగానికి చెందిన వైకింగ్ ల మట్టి సమాధులున్నాయి నార్త్ సి ఒక బ్రిడ్జిలాగా స్కాండినేవియాకు ఉపయోగ పడింది రేవన్  యుద్ధ వీరుని కి వైకింగ్ సంప్రదాయ సైనిక లా0చనాలతో పాతిపెట్టబడిన సమాధులను ఇటీవలకాలం లో త్రవ్వకాలలో కనుగొన్నారు
we are the pilgrims master -we shall go -always a little further -it may be -beyond that last blue mountain barred with snow -across that angry or that glimmering sea (golden journey to( s’amarkhand )కవిత వాళ్ళ ధైర్య సాహసాలకు ప్రతీక .హవామాల్ ”అనే పెద్దలు చెప్పిన సుద్దిమాటలు లో ఒక వైకింగ్ హీరో ఎలా జీవించి ఎలా మరణించాలో  వర్ణించబడింది –
”a coward believes he will live for ever -if he holds back in the battle -but in old age he shall have no peace -though spears have spared his limbs -cattle die  kindred die -every man is mortal -but the good name never dies -of one whohas done well.”
యూరప్ అంతా పోలార్ వేల్స్ పై మోజెక్కువ .గ్రీన్ లాండ్ వైకింగ్ లు అతి విలువైన నాణ్యమైన ఒకమాది రి సైజులో ఉండే నార్వాల్ వే ల్ అంటే బాగా ఇష్టపడ్డారు.వైకింగ్ యుగం లో అవి ఆర్కిటిక్ సముద్రం గ్రీన్ లాండ్ ,కెనాడాల లో బాగా ఉండేవి దీని మాంసం సి విటమిన్ కు బదులుగా వాడతారు దాని చర్మతో తాళ్లు పేనేవారు .దాని  దంతం అన్నిటికంటే మహా విలువైనది  ఎర కు బాగా పనికొచ్చేది ఇవి చాలా మిస్టీరియస్ జంతువులు . ఎప్పుడు ఎలా మీద పడతాయో తెలీదు 16 అడుగుల పొడవుండి 3,500 పౌండ్ల బరువుంటాయి వంకర తిరిగిన 10 అడుగుల దంతం 20పౌండ్ల బరువుతో తమాషాగా ఉంటుంది  ఆడది కనిపిస్తే మొ గా ఆడ నీటిపైకొచ్చి టస్క్లతో శృంగారం చేసుకొంటాయి .అప్పుడు ఫెన్సింగ్ కట్టినట్లే ఉంటుంది .మాధ్యయగపు గ్రీకులు  ఒక తెల్ల గుర్రం నుదుటిపైనా ఉన్న ఒకే కొమ్ముతో  స్వచ్ఛతకు చిహ్నంగా ఉండేదని నమ్మేవారు దాన్ని కన్యలు మాత్రమే మచ్చిక చేయగలరని దాని కొమ్ములతో కప్పులు తయారు చేసి అందులో ఏదైనా పోసుకొని త్రాగితే విషా నికి విరుగుడు  ఆవు తుందని  నమ్మకం కొమ్మును పొడి చేసి వైద్యం లో వాడితే సర్వ రోగాలకు మందు అని కూడా .కనుక నార్వాల్ వేల్స్ టాస్క్ కు యెంత విలువ ఉందొ ఆలోచించండి .వీటి టస్క్ ”బంగారం కంటే అతి విలువైనది ”అందుకే వైకింగ్ లకు దీని వేట  తెల్ల ఎలుగుబంటి ఫర్,  హంటింగ్ ఫాల్కన్ లపై మోజెక్కువ వీటిని పట్టి చక్రవర్తులు అమ్మేవారు డబ్బో డబ్బు .
  వైకింగ్ ల అన్వేషణలో గ్రీన్లాండ్ లోని చెట్లతో నిండియున్న భాగాన్ని మార్కులాండ్ అంటే వుడ్ లాండ్ గా రాళ్ళతోఉన్న భాగాన్ని హాల్  లాండ్ అంటే స్టోన్ లాండ్ అనీ పిలిచారు బెర్రీలు  ద్రాక్ష ప0డే దాన్ని న్యూ ఫౌండ్ లాండ్ అన్నారు అమెరికాలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న స్థానిక ఆటవికులు నార్త్  అమెరికన్ ఇండియన్స్ అయిన ఇనూట్ లను    స్క్రేలింగర్ లు అంటే ”అగ్లిమెన్ ”అన్నారు
  వైకింగ్ రాజు క్నాట్ కు ఇంగ్లాన్డ్ అంటే మహా అభిమానం    ఇవాళ ఐరోపాలో డాలర్ కు బదులు ”యూరో ;;ఉన్నది దీని ఆ వైభవం మొట్ట మొదట తెచ్చినవాడు క్నా ట్ .అతడు ”ఎడ్గార్ ది  పీస్ ఫుల్ ”పవిత్ర గ్రంధం నుంచి ఒక ఆకు తీసి ఇంగ్లాడ్  స్కాండినేవియన్ నాణాలను ప్రామాణికం చేశాడు ..కనుక 11 వ శతాబ్దిలో” సెంటర్ ఆఫ్ మానిటరీ యూనియన్”జర్మనీ కాదు ,ఫ్రాన్స్ కాదు ఇంగ్లాన్డ్ మాత్రమే అని గ్రహించాలి .ఔన్స్ యొక్క బరువునూ ప్రామాణికం చేసి బంగారం,వెండి  తూకం లో  తన సామ్రాజ్యం లో అంతా అమలు చేశాడు . అప్పుడు అది బైజాన్టిన్ సామ్రాజ్యపు ప్రమాణానికి సరిపోయింది .దీనితో యూరప్ అంతా ఒకే రకమైన మిడీవల్ సింగిల్ మార్కెట్ విధానం అమలైంది క్నాట్  ది  గ్రేట్ వైకింగ్ ఎంపరర్ వలన .. ఇతని చక్రవర్తి కిరీటం అష్టభుజాకారంగా 8 ఇరవై రెండుకేరట్ల బంగారు రేకులతో వజ్ర వైఢూర్యాలు ముత్యాలతో ధగధగా లాడింది . అప్పటికి ఇంకా వజ్రాలను సానబెట్టటం తెలియదు అందుకే నదిలోని గులక రాళ్ళలాగా వాటిని పొది గారు ..అతని సామ్రాజ్యం అతి విశాలమైనది .ఇంత ఘాన చరిత్ర ఉంది వైకింగులకు .
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వైకింగ్ శకం -2

వైకింగ్ శకం -2

హాఫ్ డాన్  రంగర్సన్  సైన్యాన్ని 876 లో నార్త్ అంబీరియా కు తీసుకు వెళ్లి అక్కడి ఆంగ్లో సాక్సన్  రాజులు అతన్ని దానికి రాజుగా ప్రకటిస్తే ఉండిపోయాడు .ఆతర్వాత రెండేళ్లకు గుత్రుమ్ నాయకత్వాన డేనిష్ సైన్యం ఆల్ఫ్రెడ్ నాయకత్వం లోని ఇంగిలీషు సైన్యాన్ని దోచుకొ0టే  తరిమేస్తే సోమర్సెట్ లెవెల్స్ కు పారిపోగా మళ్ళీ బలం కూర్చుకుని ఎడింగ్టన్ యుద్ధంలో విజయం సాధించి 880 లో ఆల్ఫ్రెడ్ తో సంధి చేసుకొని మెర్సియాను విభజించి ఈస్ట్ ఆంగ్లికా అనబడే ప్రాంతాన్ని పొంది వైకింగుల సంప్ర దాయాలు పాటించేట్లు చేసుకున్నాడు . 889 లో ఈస్ట్ ఆంగ్లికా కు  డేనిష్ రాజయిన   క్రిస్టియానిటీ పుచ్చుకొని ఏదెలా స్టన్ గా పేరు మార్చుకున్న  గోత్రుమ్ చనిపోయడు. 892 లో పెద్ద సైన్యం తో  డేనిష్ నౌకలు 300  తో కెంట్ పై దాడిచేసి ఆల్ఫ్రెడ్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి చెల్లాచెదరు చేశాయి 899 లో ఆంగ్లో సాక్సన్ రాజు  ఇంగ్లాన్డ్ గొప్పపాలకుడు  ఆల్ఫ్రెడ్ ది  గ్రేట్ చనిపోగా  ,మరుసటియేడు గన్  బోరన్ ఉల్ఫ్ సన్ గ్రీన్లాండ్ వశం  చేసుకున్నాడు 907 లో కీవ్ కు చెందిన ఓలెగ్ .అనే రస్ నాయకుడు  కాన్  స్టాన్టి నొపిల్ పై దాడికి సి ద్ధ మవగా  .అక్కడి రాజు సంధి తో రస్ లకు వ్యాపారానుమతినిచ్చారు . 911 లో  ఫ్రాన్స్  రాజు చార్లెస్ ది  సింపుల్ రూ పట్టణం తోబాటు పరిసర ప్రాంతాలన్నీ రోల్లో అనే వైకింగ్ నాయకుడికి కు ఇచ్చేశాడు  ఈ ప్రాంతమే నార్మ0డి  .స్నేబ్ జార్న్ అనే వాడు కొంతమందితోకలిసి ఐస్ లాండ్ నుంచి గ్రీన్ ల్యాండ్ కు అన్వేషణకు వెళ్లి అక్కడ వింటర్ గడిపారు .. 936 లో డెన్మార్క్ రాజుగా గోరం ది  ఓల్డ్ గుర్తింపు పొందాడు . లో యెదిలిస్తాన్ పెద్ద సైన్యం తో వైకింగులను ఓడించాడు 947 లో ఎరిక్ బ్లడ్ ఎక్స్ కాంబ్రియా యుద్ధం లో చనిపోగా ఇంగ్లాన్డ్ రాజు ఎడ్గార్ నార్స్   రాజ్యాన్ని రద్దు చేసి నార్త్ అంబార్లాన్డ్ కు అప్పగించాడు 958 లో గోరోం ది ఓల్డ్ కొడుకు  హరాల్డ్ బ్లూ టూత్ డెన్మార్క్ రాజై డేనిష్ తెగలనన్నిటినీ ఏకం చేసి సువిశాల రాజ్యాన్ని గొప్పగా పాలించాడు ఇతన్ని పేరే మనసెల్ ఫోన్ లోని బ్లూ టూత్ పరికరం.  975 లో ఇంగ్లాండ్ రాజు ఎడ్గార్ చనిపోతే ఎడ్వర్డ్ రాజయ్యాడు 978 లో ఏథేల్  రెడ్ రెండు సార్లు ఇంగ్లాన్డ్ రాజయి పాలించాడు . 980 -2 లో వైకింగ్ లు ఇంగ్లాండ్ పట్టణాలపై విరుచుకు పడ్డారు .అదే సమయం లో ఎరిక్ ది రెడ్ ఐస్ లాండ్ నుండి పడమరకు గ్రీన్ లాండ్ వైపుకు అన్వేషణ జరిపాడు ఉత్తర అమెరికాలో కాలు పెట్టిన మొదటి వైకింగ్ గా గుర్తింపు పొందాడు ఆ ప్రాంతమే లాబ్రడార్ .  986 లో ఎరిక్ సుమారు వెయ్యి మందితో గ్రీన్ లాండ్ వెళ్లిగ్రీన్ లాండ్ నార్వే మధ్య  2 వేలాదిమైళ్ళు చుట్టూ తిరిగి  ఉత్తర అమెరికా అన్వేషణ చేశాడు ఇతని సాహసాలన్నీ ”ది  సాగా ఆఫ్ ఎరిక్ ది  రెడ్ ”లో వివరంగా ఉన్నాయి . 986 లో డెన్మార్క్ కు  బ్లూటూత్ కొడుకు శ్వీన్ ఫోర్క్ బియర్డ్ రాజయ్యాడు 988 లో రోరిక్ వారసుడైన వ్లాదిమీర్ ది  గ్రేట్ రస్  నాయకుడి పాత పాగాన్ దేవతలను ధ్వంస0మ్ చేసి  డ్నీపర్ నదిలో  విసిరేసి క్రైస్తవంపుచ్చుకుని  తానూ తన అనుచరులతో సహా క్రైస్తవులయ్యారు . వైకింగులు ఉత్తర ఇంగ్లాన్డ్ పై దాడి చేశారు 991 లో నార్మాండి  ఇంగ్లాన్డ్ ల మధ్య శాంతి ఒడంబడిక జరిగి ఇంగ్లాన్డ్ లో శరణార్థులుగా నార్మన్ లో ఉండిపోయారు . 995 నుంచి నార్వే రాజుగా ఉన్న ఒలాగ్ మనవడితోసహా93 నౌ కలతో మాల్దాన్ యుద్ధం లో ఇంగ్లాన్డ్ సైన్యాన్ని ఓడించి ఏదెలా రెడ్ నుంచి 10 వేల  పౌండ్ల వెండిని పొందాడు . 994 లో వొలాఫ్ మళ్ళీ ఇంగ్లాన్డ్ వచ్చి శాంతి ఒడంబడిక చేసుకొని నార్వే వెళ్ళాడు 997-1000 లో డేనిష్ ఆర్మీ   నిరంతరం గా ఇంగ్లాన్డ్ పై దాడి చేస్తూనే ఉంది శ్వీన్ ఫోర్క్ బెడ్ తో చేసిన పోరాటం లో వొలాఫ్ చంపబడ్డాడు .ఈ లోగా ఐస్ లాండ్ లో థోరుగూరి తనవాళ్ళందర్నీ క్రైస్తవులుగా మార్చాడు 1001 లో డెయిష్ యుద్ధ నౌకలు పడమటి సస్సెక్స్ పై దాడి చేసి 24 వేల  పౌండ్ల డబ్బు పోందిందింది మరుసటి ఏడు సెయింట్ బ్రేస్ డే మాసకర్ జరిగి ఇంగ్లాండ్లో డే నుల సర్వ నాశనం జరిగి ఫోర్క్ బెడ్ సోదరి గున్నిహిల్డ్ తో సహా అందరూ చంపబడ్డారు మరోయేడాదికి శ్వీన్ ఫోర్క్ బెడ్ అనే డెన్మార్క్ రాజు ఇంగ్లాన్డ్ పై దాడిచేశాడు ఇంగ్లాన్డ్ లో అప్పుడు తీవ్రకరువు ఏర్పడింది డేనిష్ ఆర్మీ  డెన్మార్క్ కు తిరిగి వెళ్లి పోయింది 1006 లో శ్వీన్  మళ్ళీ ఇంగ్లాన్డ్ వచ్చి 36 వేల  పౌ0మ్ డ్లు  పట్టుకు పోయాడు . 1009 -12 మధ్య ఢోర్కెల్ ది  టాల్ తమ్ముడు హెమ్మింగ్ లు పెద్ద వైకింగ్ సైన్యం తో  ఇంగ్లాన్డ్ పై పడగా ఏదెలా రెడ్ అతనికి 48 వేల పౌన్లు  ఇచ్చిమంచి చేసుకున్నాడు లండన్ ను శ్వీన్ సైన్యపు దాడి నుంచి రక్షిస్తానని ఎధేర్డ్ తో ఒప్పందానికి వచ్చి తనవారిని గాలికొదిలేశారు . 1010లో డార్ఫిన్ కారల్స్ ఫెని  గ్రీన్ లాండ్ నుంచి ఉత్తర అమెరికాకు మూడవ   యాత్రమూడేళ్లు  చేసి మిగిలిన కొద్దిమందితో గ్రీన్ లాండ్ తిరిగివచ్చాడు .1013లో శ్వీన్ ఫోర్క్ బెడ్ శక్తి యుక్తులన్నీ సమీకరించి ఇంగ్లాన్డ్ పై పడగా  ,ఏధిల్ రెడ్ కొడుకులు  ఎడ్వార్డ్ ,ఆల్ఫ్రెడ్ ల తో సహా  నార్మాండీకి ప్రవాసానికి పారిపోయాడు .క్రిస్మస్ రోజున శ్వీన్ ఇంగ్లాన్డ్ కు మొదటి వైకింగ్ రాజుగా పట్టాభి షిక్తుడు అయ్యాడు ఇలా ఇంగ్లాన్డ్ లోనూ వైకింగ్ సామ్రాజ్యం ఏర్పడింది శ్వీన్ ఫోర్క్ బెడ్ రాజుగా .
      సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వైకింగు శకం

వైకింగు శకం

ఈ నాడు మనం సెల్ ఫోన్ లలో సమాచార0 ,  ఫోటోలు ,డాక్యుమెంట్లు ,మెసేజస్ సరఫరా చేయటానికి వాడుతున్న ”బ్లూ టూత్ ”ను  స్వీడన్  చెందిన ఎరిక్సన్  కంపెనీ  మొదట తయారు చేసి 19 94 లో విడుదల చేసింది .ఈ టెక్నలాజికి ఆపేరు ఎందుకొచ్చిందో తెలుసా ఆ పేరు 10 వ శతాబ్దికి చెందిన హరాల్డ్ బ్లూటూత్ బ్లాటంట్ అనే డెన్మార్క్ ను 958-987 వరకు పాలించిన వైకింగ్ రాజు  ఆ దేశాభి వృద్ధికి చేసిన విశేష కృషికి గౌరవ చిహ్నంగా పెట్టటం వలన . 8 వ శతాబ్దం నుంచి 11 వ శతాబ్ది వరకు వైకింగ్ యుగం ఉన్నది ఉత్తర యూరప్  ,స్కాండి నేవియన్ చరిత్ర తో సంబంధమున్నది .స్కాండినేవియన్ ” నా ర్సే  మెన్ ”సముద్ర ,నదీ మార్గాలద్వారా యూరప్ అన్వేషణలో వ్యాపారం ,దాడి ,కాలనీ స్థాపన ,రాజకీయ పాలన లతో నార్జ్  గ్రీన్ లాండ్ ,న్యూ ఫౌండ్ లాండ్ ,ఈ నాటి ఫారో ఐలాండ్స్  ,ఐస్ లాండ్ ,నార్వే,స్కాట్లాండ్ ,ఇంగ్లాన్డ్ ఐర్లాండ్ ,నెదర్ లాండ్స్ ,జర్మనీ యుక్రెయిన్ ,రష్యా టర్కీలను  వశపరుచుకొని రాజ్య పాలన చేసి విశాల వైకింగ్ సామ్రాజ్యాన్ని ఏర్పరచి చరిత్రలో వైకింగ్ యుగాన్ని స్థాపించారు . మొదట్లో ఆ యా దేశాల కరెన్సీ నే వాడినా తర్వాత  సొంత కరెన్సీ ప్రవేశ పెట్టారు .సముద్ర ప్రయాణం వారికి వెన్న తో పెట్టిన విద్య కావటం వారి నౌకలు పొడవుగా ప్రత్యేక తరహాలో ఉండటం ధై ర్యం సాహసమే ఊపిరిగా బాహు బలంతో బాహుబలులు అయి యెంత దూరమైనా వెళ్లి అనుకొన్నది సాధించటం వీరి లక్షణం .ముందు వ్యాపారం కాకపొతే దాడి  అవసరమైతే యుద్ధం లేక రాజులతో సంధి చేసుకొని వాళ్ళిచ్చే నగలు  బంగారం వెండి ఆయుధాలు దంతపు సరుకులు , రాజ్య భాగాలు తీసుకొని క్రమంగా బలపడి సత్తా చూపించారు వైకింగ్ లు .అందితే జుట్టు అందకా పొతే కాళ్ళు . దాదాపు భూమి సరిహద్దుల వరకు  ప్రయాణం చేశారు . హై  ఆర్కిటిక్ నుంచి పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ ద్వారా బైజాన్టిన్ కాలపు కాంస్టాన్టి  నొపిల్ దాకా వాళ్ళు వెళ్లారు . ఇండియా ,పర్షియా లనుంచి సిల్క్ బట్టలు సేకరించారు బాగ్దాడ్ సమర్ఖండ్ లనుంచి వెండి దీనారాలు సంపాదించారు .వీటిని తీసుకొని స్వదేశానికి వెళ్లేవారు . చరిత్ర వాళ్ళని క్రూరులు దుస్టు లు అన్నదికాని వారు దోచుకొన్నట్లు ఎక్కడా లేదు .వారిది ఎదురుదాడి మాత్రమే వారి భూముల్ని క్రిస్టియన్ మిషనరీలు ఆక్రమించటానికి వస్తే దేశ రక్షణ కోసం చేసినవే .చార్లె మాన్ అతని తర్వాత వారు చేసిన  యుద్ధాలకు వైకింగులు చేసింది ప్రతీకారం మాత్రమే .
    ఇంగ్లాన్డ్ లో వైకింగ్ యుగం 8-6-793 లో నార్త్ అంబర్ లాండ్ లోని విద్యా కేంద్రం లి0డి స్ ఫారినే అనే ఆబ్బె ను ధ్వంసం చేసి ,అందులోని మాంక్స్ ను చంపి ,లేక సముద్రంలోపడేసి లేక బానిసలుగా తీసుకు వెళ్లి ,చర్చిలో ఉన్న అమూల్య సంపద చేజిక్కించుకొని ఒక కొత్త సంప్రదాయానికి దారి చూపటం  తోప్రారంభమైంది .    బ్రిటన్ చరిత్రలో మునుపెన్నడూ ఇంతటి విధ్వంసం జరగలేదని చరిత్రకారులన్నారు ..దీని పని సాధనకు నాలుగేళ్లుగా ఓడలతో నార్త్ అంబర్ లాండ్ లో తిష్టవేసి ఈ నాటి రెక్కీలాంటివి నిర్వహించి అదును చూసి ఆ పని చేశారు అందుకే వాళ్ళను గొర్రెల్లో దాక్కున్నా నక్క అనేవారు వైకింగ్ లది  నార్త్ జర్మన్ భాష దానినే ఓల్డ్  నార్జ్  అంటారు నార్వే లో సహజ పర్వత శ్రేణులు వారికి సురక్షిత ప్రదేశాలు .ఇక్కడినుంచి ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్లకు సముద్రం చాలా అందుబాటులో ఉండటం వాళ్ళ సాహస యాత్రలకు బాగా కలిసి వచ్చింది
   884 లో డేనిష్ వైకింగ్ సైన్యం నార్త్ సీ  దగ్గర ఆర్చిబిషప్ రొంబర్ట్ఆధ్వర్యం లోని ప్రిషియన్ సైన్యం చేతిలో ఒడి పోయారు దీనితో ఈస్ట్ ప్రిషియానుంచి వైకింగులు శాశ్వతంగా వైదొలిగారు 911 లో  ఫ్రెంచ్ రాజు చార్లెస్ సింపుల్ వైకింగ్ యుద్ధ వీరనాయకుడు రోలో తో ఒక ఒడంబడిక చేసుకొని ”డ్యూక్   ”బిరుదిచ్చి  నార్మాండి ని కట్టబెట్టాడు రోలో అతనితో స్నేహం గా ఉంటానని ఉత్తర భాగం ప్పై ఏ ఇతర వైకింగ్ గ్రూపులు దాడి చేయకుండా రక్షిస్తానని  ఒప్పుకున్నాడు అనేక తరాల తర్వాత ఇక్కడ స్థిరపడ్డ వైకింగులు నార్మన్ భాష సంస్క్రుతులకు  అలవాటై నార్మన్ లు గా మారారు . 10 66 లో ఇంగ్లా0డ్ ను గెలిచిఆంగ్లో సాక్సన్  అరిస్టోక్రాసి రాజులయ్యారు .స్కాండినేవియాలో స్కాండినేవియన్ రాజ్య పాలన ఏర్పడ్డాక వైకింగుల  1030 లో సిక్ల్ స్టాడ్  యుద్ధం లో ఓడిపోవటం తో వైకింగుల యుగ పరి సమాప్తి అయింది ఇంగ్లాన్డ్ లో నార్వేజియన్ రాజు మూడవ హరాల్డ్  -1066 లో కింగ్ హెరాల్డ్ గాడ్ విన్సన్ చేతిలో స్తాంఫోర్డ్ బ్రిడ్జి యుద్ధం లో ఓడిపోయాక ,డాబులుం  ను స్ట్రాంగ్ బౌ ఆక్రమించాక ఐర్లాండ్ ,,స్కట్లాండ్ మూడవ అలెక్సాఅండర్ చేతిలో హకాన్ హాకనోర్సన్ ఓడా కా ,గాడ్విన్సన్ ను నారండి వైకింగ్ సంతతికి చెందిన ద్యూక్ విలియం ఓడించాక నా ర్స్ నుండి  స్కాట్ లాండ్ దాకా  13 -15 శతాబ్దాలలో విముక్తి చెందాక పూర్తిగా ఇంగ్లాండ్ లో  వైకింగుల శకం సమాప్తి అయింది .
  ఒక సారి వైకింగుల ప్రతాపాన్ని చారిత్రకంగా చూద్దాం 800 లో గ్రిమూర్ కంబన్ ఫారో ఐలాండ్ లో స్థిరపడ్డ మొట్టమొదటి సె ట్లర్ . 802 లో వైకింగ్ దండ  యాత్రలవలన
 అయోనా మొనాస్టరీ తర్వాత స్కాట్లాండ్  ఐర్లాండ్ మొనాస్టరీలు నాశనమయ్యాయి 806 లో మూడోసారి అయోనాకు వైకింగులు వచ్చారు కానీ వారిలో 70 మంది చచ్చారు 810 లో పెద్ద డేనిష్ నౌకలుదక్షిణ డెన్మార్క్ తీరప్రాంతం  ప్రిసియాపై దండెత్తాయి 827 లో గాడ్ ఫ్రెడ్ కొడుకు హారిక ది  ఎల్డర్ డేనిష్ రాజుగా క్రానికల్స్ పేర్కొన్నాయి 8 35 లో   థేమ్స్ ముఖద్వారం దాడికి గురైంది 836-37 లో వైకింగ్ నౌకలు బాయని ,లీఫీ లగుండా ఐర్లాండ్ చేరాయి 840 వింటర్ లో ఐర్లాండ్లో ఉండిపోయారు . డబ్లిన్ రీంరిక్ ,ఆర్కులో  వాటర్ ఫోర్డ్ ,వీక్లో నగరాలను చేరారు. 841 లో వైకింగ్ నావలు ఉత్తర ఫరాన్స్ లోని సీన్ వాలీ పై దాడి చేశాయి .డబ్లిన్ లో మొదటిసారి ఉండిపోయారు 841 లో వైకింగుల డబ్లిన్ వాసం చరిత్ర కెక్కింది 844 లో ఐర్లాండ్ లోని మిడీలాండ్ మొనాస్టరీ లపై దాడి చేశారు. 845 హోరిక్  ది ఎల్డర్ 600 నౌకలతో హంబర్గ్ పై దాడి చేసి ద్వాంసం చేసి హొలీ రోమన్ ఎంపరర్ లూయీ ది జర్మన్ వైకింగుల సహాయకులైన,యుక్రెయిన్ నుంచి జర్మనీ వచ్చిన  స్లావిక్ ఆటవికులపై చేసిన దాడికి , ప్రతీకారం తీర్చుకున్నాడు  వైకింగ్ నాయకుడు లగ్నర్  లార్డ్ బ్రోక్   పారిస్ పై దండెత్తుతానని బెదిరిస్తే సంధి చేసుకొని 7 వేల  పౌడ్ల వెండి అప్పగించాడు 848 లో బోర్డరాక్స్ వశమైంది 850-60 లో నార్వేజియన్ అయిన నద్దేడ్ ఐస్ లాండ్ లో మొదటిసారిగా కాలుపెట్టాడు . లో వెల్ష్ తీరం పై మొదటి దాడి 853 లో డబ్లిన్ కు వొలాఫ్ ఫస్ట్ మొదటి రాజై 870 వరకు పాలించాడు ..తర్వాత 1052 లోపు 20 మంది 1072-74 వరకు మళ్లీ 1091-నుంచి 10 94 వరకు వైకింగ్ రాజులపాలన సాగింది 859  లో బార్న్ ఐరన్ సైడ్ ,తమ్ముడు హాస్టీన్  లోరీ రివర్ మీదుగా  60 నౌకలతో ఫ్రాన్స్ ,స్పెయిన్ తీరాలను  జిబ్రాల్టర్ జలసంధి దాటి రోన్  చేరి స్థావరాలు ఏర్పరచుకొని , ఫ్రాన్స్  ఇటలీ  ఉత్త్రర ఆఫ్రికాలకు చేరి స్థిరపడ్డారు . 860 లో రూరిక్ సోదరులు తూర్పు స్వీ డన్ లోని రోసాగ్లేన్ లో  స్లావ్స్ ట్రైబల్ ఫెడరేషన్  కోరికపై పరిపాలన చేశారు నోల్ఖోవ్ నదిప్రక్కన నోవ్  గోరోడ్ ను కొత్త రాజధాని చేశారు తర్వాత రోరిక్ 200 షిప్పులతో సైనికులను తెప్పించి కాన్  స్టాన్టి నొపిల్ పై దండెత్తా లనుకొన్నాడు . నార్వే లోని ,కింగ్ హెరాల్డ్ ఫ్రీర్ తండ్రి     వెస్ట్ ఫోల్డ్ రాజు హాఫ్ డన్  ది బ్లాక్  ను నార్వేజియన్ రాజ్య  వంశ  స్థాపకుడు  గా భావిస్తారు.యితడు మరణించాడు.  865 లో  ”ది  గ్రేట్ హీడే న్   ఆర్మీ”ఇంగ్లాండ్ లో మొదట కాలు పెట్టి తర్వాత యార్క్ లో ప్రవేశించింది. 868 లో వెస్సెక్స్ ఏదెల్  రెడ్   డేనిష్ కు చెందిన ఇవ్వార్ ది  బోన్ లెస్ సైన్యం చేతిలో ఓడింది . 869 లో ఈస్ట్ ఏంజెల్స్ రాజు ఎడ్మన్డ్ హీడే న్ ఆర్మ్ చేతిలో చంపబడ్డాడు.  8 71  లో ఏడాదిపాటు వెస్సెక్స్ లో డేన్స్ తో యుద్ధం సాగింది.  సాక్సన్  రాజ్యాలన్నీ వైకింగుల హీడే న్  ఆర్మీకి దాసోహం అన్నాయి ఏధెల్రెడ్ చంపబడి ఆల్ఫ్రెడ్ రాజ్యానికి వారసుడయ్యాడు 8 71 లో హాఫ్డం రంగరెస్సన్ రాజై తన పేరుమీద మొదటిసారిగా వైకింగ్ నాణాలు ముద్రించాడు . 872 లో నార్వేవైకింగ్ మొదటి  రాజుగా హరాల్డ్ ఫహార్ అంటే బ్లాక్ కొడుకు అయ్యాడు . 874 లో ఐస్ లాండ్ లోఇంగోఫర్ ఆర్నర్సన్ మొదటి సెటిలర్ .రేక్జవిక్ (పొగ మేఘాలు )  అని తానె పేరుపెట్టిన  చోట నివాసమేర్పరచుకున్నాడు
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2

 సశేషం 
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-17 -కాంప్- షార్లెట్ -అమెరికా 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -31

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -31

 ఏకావలి  లో అలంకార చర్చ
ఏకావాలి లో మరో ముఖ్య విషయం అలంకార నిర్వహణ .ఈ విషయం లో విద్యా దరుడు ,మల్లినాథుడు అత్యున్నత స్థాయి ప్రదర్శన చేశారు . పూర్వ ఆలంకారికుల విధానాన్ని అనుసరించి ,తమ వ్యాఖ్యానాలను జోడించారు .మల్లినాథుడు అలంకారాలతో ఉండే పోలికలను ఒక సామాన్య సిద్ధాంతాన్ననుసరించి వివరించాడు . ఇదే మల్లినాథుని ”తరల ”వ్యాఖ్యానం లో ప్రత్యేకత అందువలన అసలు ఏకావాలి లో ఉన్న వాటిని బహిర్గతం చేయటం సులువైంది . 5 వ ఉన్మేషం  అంతా అలంకార చర్చకే కేటాయించాడు సూరి . కొన్ని అలంకారాలపై మల్లినాథుని అభిప్రాయాలేమిటో తెలుసుకొందాం .
  కొన్ని అలంకారాలు ఆధారం లక్షణం
విద్యాధర ,మల్లినాధులిద్దరూ కొన్ని అలంకారాలు కొన్ని రకాల లక్షణాలపై ఆధార పడ్డాయని చెప్పి ,వివరించారు .దీనినేలాల్యే పండితుడు ఒక పట్టికలో పొందు పరచాడు .
లక్షణం                     ఉదాహరణ                          అలంకారానికి మూలం 

1-జగత్స వార్యా     సురధీర్ఘి కా అతిశయ పావనాపాది  అప్రస్తుత ప్రశంస
2-విపరీత             కిమివ నాపకృత మనేన                  వ్యాజ స్తుతి
3-అజహత్స్వార్యా   కావ్యాదయహ -విదుషో లక్ష  య0తి   సమాసోక్త్యాది
                              ఉత్ప్రాదాన లక్షణ

-4-జహ దజ హాత్సవర్యా – వారణేంద్రస్య దేశకాల విశిష్టహ  సమాసోక్త్యాది

                                  త్వ మధునా నాస్తి
5-సారొపా            అగ్నిర్మాణ వాకః
  1- గౌణి
   2- శుద్ధా             ఉపచారవతీ ,ఉపచారః ,విద్యా విధి
                          కార్య కారణా భావః తాదాభ్యామ్                       రూపకాది
       శుద్ధా –       యధా ఇంద్రార్ధ స్యూ ణాఇంద్రహ
                     స్వస్వామి భావా లక్షణా సంబంధః


6-సాధ్య వసనా    విషయం నిర్జీణౌ విషయహ
        1-గౌణి             అయం పరిజాతః                                  అతిశయోక్తి
    2-శుద్ధా          ఆయమానందః
మల్లినాథుని భావనలో ఆ రెండు అనుబంధాలు ఆరోప ,అధ్యారోపాల వలన  భిన్నమైనవి ”సారొపా సాధ్యాయ వసనా శుద్ధాస్ ”ల మధ్య భేదం కూడా అలాంటిదే కారణం సంబంధం ,పోలిక .విద్యాధరుడు 7 లక్షణాలను కావ్యప్రకాశ లోని 6 లక్షణాలకు బదులు  గా చెప్పాడు .జహదాది లో 3 రకాలు ,సారోపాధ్య వాసనం లో 4 రకాలు -2 గౌణాలు 2 శుద్ధాలు చెప్పాడు .అవి ఒకదానితో ఒకటి కలిసి మిళితమై ప్రాధమికంగా ,,ఆధీనకంగా సంబంధాలను తెలియ జేస్తాయి
  విద్యాధరుడు ఏకావాలి 5 వ ఉన్మేషం లో గుణాలు ,అలంకారాల పనేమిటో వివరించాడు . గుణాలు తీపి లాంటివని మనోభావాలకు  పూర్వ లక్షణాలకు లోబడి ఆ మనో భావ  ఉత్కృష్టత ను వ్యక్త పరుస్తాయి .అలంకారాలు కవిత్వం లో పదం అర్ధాలు సంబంధం తో ఉత్కృష్టత ను వివరిస్తాయి . వాటిలోనే ఉండి కలయికలో మనో భావాలను ద్రవీ భూతం చేస్తాయి .ఏకావాలి లోని ఒక విషయం పై వ్యాఖ్యానిస్తూ మల్లినాథ సూరి అనుమానం వ్యక్తబరచి దాన్ని చర్చతో నివృత్తి చేస్తాడు కొందరు గుణాలు ఉత్కృష్టత కలిగిస్తాయని అంటే ,అలంకారాలతో కలిసి ఆ స్థాయి తెస్తాయి అంటూ మల్లినాథుడు –
”కావ్యాత్మ రస సమావేతా  స్తుదుక్త ర్ష వేతవే ధర్మా గుణః -కావ్యా0గ సంయుక్త  స్తదుక్త
ర్శ హేతవోలంకార ఇతి భేద ఇత్యర్ధహ్ ”అంటూ అంగిరసమా వేతా గుణాః ఆంగే స్సంయుక్త స్త్వలంకారా ఇత్యుక్తమ్ ”అన్నాడు .. దీని తర్వాత ఏకావాలి లో కొన్ని అలంకారాలను వాటిపై మల్లినాథుని భావాలను తెలుసుకొందాం . 
   సశేషం 
  మీ-గబ్బిట  దుర్గా ప్రసాద్ -2-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -30

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -30

‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -3

ఏకావలి లో రసవిధానం -3

రస విధానం లో 2 వభాగం 23-12-16 న రాశాను .మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నాను .

  కావ్యాలలోరాముడు మొదలైన  పాత్రలు కొద్ది గానే ఉన్నాయి .అవీ పూర్వకాలం పాత్రలు నటుడు ఈ పాత్రలను పోషించే టప్పుడు ఆ రస భావం అనుభావైకం కాదు అతని దృష్టి అంతా నటనపైనా వినోదం ఇవ్వటం పైనా డబ్బు సంపాదనపైనా  కేంద్రీకరించి ఉంటుంది . రసభావన కలగాలంటే నటుడు  ప్రేక్షక స్థానం లో ఉండాలి .మరి అప్పుడు రసం పరిధి ఏమిటి ?అప్పుడతను ప్రేక్షకులే పరిధి గా నిరూపిస్తాడు ‘’సామాజికానామితి ‘’.ప్రేక్షకులలో రసానందం కలుగుతుందా ?కాదన్నాడు .ప్రేక్షకుడికి  తనకు అనుభావాలైన ప్రేమ మొదలైన వి  వాసనా రూపం లో ఉంటాయి .అంటే ప్రేక్షకునిలో వాసనా రూపం లో ప్రేమ ,శృంగారం వంటికి శాశ్వత స్థాయి ఉంటుంది .ఈ స్థాయి ఆనందాన్నివ్వటం లో ఉన్న నిర్ణాయకాలలో అనేక తేడాలుంటాయి .ఈ  తేడాలురసం కంటే భిన్నం కాకపొతే వాటి ఉనికికి సార్ధకమేమిటి ?దీనికి సమాధానం ‘’పానక రసన్యాయం .పానకం లో అనేకం కలిసిఉన్నా మొత్తం మీద దాని రుచి వేరుగా ఉంటుంది .అంటే అన్నీ కలిసి ఒక కొత్త అనుభవాన్ని స్తాయి .అందులోని పదార్ధ ప్రత్యేకతలన్నీ కరిగిపోతాయి . ‘’.ఇక్కడ కూడా అంతే .ప్రతిదీ కూడా రసం లాగానే అనుభూతమౌతుంది .కాని చివరికి వాటి సమాహార భావనఅలౌకిక  ఆనందాన్నిస్తుంది  ఆనందం ఎలాగో ఇదీ అలానే .’’చార్వ్య మాణాతైకప్రాణాఇతి -అనుభవైక జీవిత ఇత్యర్ధః ‘’దీనితో దాని అసాధారణ ,అసామాన్యమైన స్వభావం ఎలా స్థాపించ బడుతుంది ?దీన్ని ఊహించిన రచయిత రసం అంటే బ్రహ్మాను భూతి అన్నాడు ‘’బ్రహ్మాస్వాద సబ్రహ్మ చారీ-బ్రహ్మాస్వాదకల్ప  ఇత్యర్ధః ‘’బ్రహ్మానందం శాశ్వతం గా ఉన్నప్పటికీ అంతరాయం లేని నిరంతర  ధ్యానం వలన పొందగలుగుతారు అంతకు ముందు కాని ,ఆ ఆతర్వాత కాని అది ఉండదు. అలాగే రసం కూడా స్వయం ప్రకాశకం (సెల్ఫ్ లూమినస్ ).అదిసదా కట్టుబడి ఉండే  ఆనంద సారం యొక్క స్వభావం .అది మానసిక గుణం .అది సూచన అనే ‘’వ్యాణీ జన ‘’తో కలిసి ఉంటుంది .జ్ఞానం మొదలైన వాటినుండి వేరు చేయబడి ఉండి వ్యక్తమౌతుంది అది స్వయం ప్రకాశకం గా దర్శన మిస్తుంది .ప్రాపంచిక ఆనందం ఇలా ఉండడు అయితే అసాధారణ అసామాన్య మైన రస స్వభావాన్ని ఎలా  కాదనగలం ?రసం బ్రహ్మానందమే .బ్రహ్మానుభవాన్ని యోగ సాధన వలన సాధించ వచ్చు .ఇదే తేడా .ఇక్కడ సరైన విభావ ,అనుభావాదులవలన అనుభవించగలం .ఇదొక్కటే ఈ రెండిటికి ఉన్న తేడా -’’కిం చ బ్రహ్మానంద  ఏవాయ మన్యత్ర యోగా గమ్యః-అత్ర తువిభావాదను సంధాను సంధానం గమ్య ఇతీయన్ ‘’

రసానుభవం అనేది సౌందర్య రసజ్నులందరి మనసుల కు సాక్షి .దీని వశీకరణ  ఇంద్రియాతీతమైనది .దాని రహస్యాన్ని ఎవరూ విప్పి చెప్పలేరు నిరూపించలేరుకూడా ..అందుకే ఈ ఉద్దేశ్యం తోనే ‘’లోకోత్తర చమత్కారి ‘’అనే పదాన్ని ప్రయోగించాడు దీనిపై రూడేన్ బెర్గ్ చక్కని వివరణ ఇచ్చాడు దాన్ని ముందే మనం తెలుసుకొన్నాం .ప్రేమ మొదలైనవి విభావాలనుండి పుడతాయి అవి ఆలంబన కారణాలయి స్త్రీలలో విభావ నలను చంద్రుడు,కోకిల స్వరం  మలయా మారుతం ,అందమైన ఉద్యానవనాలు  మొదలైన ఉద్దీప కారణాల వలన అనుభలవుతాయి .విద్యాధరుడు మొదటి అధ్యాయం లోనే ధ్వని సిద్ధాంత సూచన చేశాడు .ధ్వన్యాలంకార కర్త ఆనంద వర్ధనుని సిద్ధాంతాన్ని మరో సారి సమర్ధించి చెప్పాడన్నమాట .ధ్వనిని వ్యతిరేకించేవారిని వ్యతిరేకించాడు విద్యాధరుడు .ఈ విషయం లో మల్లినాద సూరి వ్యాఖ్యానం చాలా సరళం సంక్షిప్తం వివాదాస్పదం .

దీని తర్వాత ఏకావలి లో  అలంకారాలను గురించి తెలుసుకొందాం .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం ) 24-4-17 నుండి 30-4-17 వరకు మూడు విందులు రెండు పూజల వారం .

వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం )

24-4-17 నుండి 30-4-17 వరకు

  మూడు విందులు రెండు పూజల వారం .

 

 శుక్రవారం ఎండబానే ఉంది .రాత్రి కొన్ని చినుకులు మాత్రమే పడ్డాయి ..ఇక్కడ ‘’షవర్స్ ఇన్ ఏప్రిల్ బ్రింగ్ ఫ్లవర్స్ ఇన్ మే ‘’అనే సామెత బాగా ప్రచారం లో ఉంది .ఏప్రిల్ వర్షాలు మేలో పూలు రావటానికి బాగా తోడ్పడతాయని భావం .మా అమ్మాయి విజ్జి ఉదయం 6-30 కే డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం లీవ్ పెట్టి ఒంటిగంటకు వచ్చి మమ్మల్ని గోసుకొండ అరుణ ఇంటికి భోజనానికి తీసుకు వెళ్ళింది వీళ్ళ  కమ్యూనిటీలోనే ఆ చివర ఉంటారు .అప్పటికే ‘’మణిద్వీప’’పూజ పూర్తీ చేసి మా కోసం రెడీ గా ఉంది అరుణ ..మణిద్వీపపూజ  ఇప్పటికి 8 వారాలుగా ప్రతి శుక్రవారంచేస్తూ ఆఖరి9 వ వారం ఇవాళ చేసి మాశ్రీమతికి  వాయనం ఇవ్వాలని ఆమె సంకల్పం .దేవుడిగది చాలా బాగా ఉంది అమ్మవారి అలంకారం పూలతో శోభాయ మానంగా ఉంది .లలితా పరమేశ్వరీ అమ్మవారు మణి ద్వీపం లో ఉంటుందని మనకు తెలుసు .మణి ద్వీపేశ్వరి పై అస్తోత్తరం ఉంది అది ప్రతివారం చదివి పూజ చేస్తారు .32 శ్లోకాల మణి ద్వీప వర్ణన స్తోత్రం,మణిద్వీప స్తోత్రం ,పంచ దశీ మంత్రం 40  చరణాల ‘’లలితా చాలీసా ‘’ నిత్య పారాయణ శ్లోకం ,దీప ప్రార్ధన ,లలితా నవ విధ భక్తిమాలిక  భక్తీ నీరాజనం మంగళ హారతి చదివి పూజ పూర్తీ చేస్తారు .మేము ఈ పూజను వినటం ఇదే మొదటి సారి .ఈ విషయాలన్నీ ఉన్న చిన్నపుస్తకాన్ని పెద్ద బాల శిక్ష సంకలన కర్త శ్రీ గాజుల సత్యనారాయణ ప్రచురించారు  అ పుస్తకం మాకు ఇచ్చింది .దాన్ని బట్టే వివరం తెలిసింది .

‘’పార్వతీ పరమేశ్వరుల వంటి దంపతలు మా ఇంటికి వచ్చారు ‘’అంటూ అరుణ పొంగిపోయింది మా శ్రీమతికి  నాకూ పూజ చేసి నూతన వస్త్రాలు అందజేసి మా శ్రీమతికి వాయనమిచ్చింది . తర్వాత భోజనాలు .మా కోసం కారం ఉప్పు తగ్గించి ప్రత్యేకంగా చేసింది .టమేటా పప్పు వంకాయ కూర ,బీన్స్ కూర కొత్త ఆవకాయ ,చట్నీ పూర్ణపు బూరెలు ,గారెలు పాయసం ,పులిహోర ,కర్నాటక బేడల(పప్పు) చారు అనే రసం పెరుగు మాంగో సలాడ్  లతో కమ్మని భోజనం పెట్టింది .దగ్గర కూర్చుని అన్నీ అడిగి వడ్డించి కొసరి కొసరి తినిపించింది అరుణ    అక్కడ సుమారు 15 మంది ఆడవాళ్ళు కూడా మాతో ఉన్నారు భోజనానికి .గురువారం ఉదయం మా ఇంటికొచ్చిన పద్మ అనే అమ్మాయి  కబుర్లతో జోకులతో మంచి సందడి చేసింది .ఈ బాచ్ ని చూస్తే మా అమ్మాయికి ట్విన్స్ పుట్టినప్పుడు2005 లో  మేము మిచిగాన్ లోని డెట్రాయిట్ దగ్గరున్న ట్రాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న జ్యోతి ప్రీతీ బిందు మొదలైన వారంతా గుర్తుకొచ్చారు .అక్కడ వారానికొకరింట్లో భోజనాలు కబుర్లు సరదాలు పుట్టిన రోజు ,సీమంతం వేడుకలతో కాలం యిట్టె గడిచిపోయింది .అందరం అరుణ ఇంట్లో గ్రూప్ ఫోటో దిగాం ..మా అమ్మాయి అరుణకు చీర జాకెట్ పెట్టింది .ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 3 -30 అయింది .సాయంత్రం స్వామి బ్రహ్మానంద సరస్వతి పై రాశా .రాత్రి యు ట్యూబ్ లో కామెడీ  చూశాం .

 ఈవారం లో ‘’హ్యూమరిస్త్స్ ‘’,బిగ్ జోక్స్ ,బైజాంటిన్ ఎంపైర్ ,ది నాజిహోలో కాస్ట్,చదివాను .దీనిపై రాయానిపిస్తోంది ఇవికాక ది వైకింగ్స్ ఇంట రెస్ట్ గా  ఉంటె చదువుతున్నా ‘’.28 టు యాక్టర్ ప్లేస్ ‘’ డ్రైవింగ్ త్రూసౌది’’మొదలుపెట్టాకాని రుచించలేదు .

  శనివారం మా ఇంట్లో శ్రీ శంకర జయంతి .మా అల్లుడి సంకల్పం అమ్మాయి సహకారం  .ఉదయం 7 గంటలకే ఆవాహనతో ప్రారంభమైంది .రాంకీ తమ్ముడు ఇంకొక ఆయన వచ్చారు . ఉపనిషత్తులు ఆదిత్య హృదయం అరుణం చదివారు .తర్వాత ఒక 10 మంది వచ్చారు మధ్యాహ్నం 12 30 కు  కేసరి ఉప్మా కాఫీ లతో ఫలహారం . తర్వాత నమక చమకాలు .మధ్యాహ్నం 3 కు ఒక 25 మంది అయ్యారు .అప్పటికే రాంకీ వగైరాలు వచ్చారు .ఒకాయన భజగోవిందం పై పది నిమిషాలు మాట్లాడాడు .తరువాత ఆడవాళ్ళు పాటలు పాడారు .మా అమ్మాయి చెప్పే అపర ఘ౦టసాల గారుపూర్వపు  కాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమాలోని భక్తీ గీతం పాడారు .రాంకీ తమ్ముడిభార్య పద్మశ్రీ త్యాగ రాజక్రుతులు బహుకమ్మగా గానం చేసింది .ఇద్దరు పిల్లలూ బాగా పాడారు గాయత్రి అనే అమ్మాయి కూడా చక్కగా స్వర రాగ యుక్తంగా పాడింది ఈమెను  ‘’షార్లెట్ స్కైలార్క్ ‘’అన్నాను ..రాంకీ  తమ్ముడు పంచాంగ శ్రవణం చేశారు సరైన హోమ్ వర్క్ చేయనట్లు అనిపించింది .మధ్యమధ్య నేను కొంత చెప్పా .తర్వాత శ్రీ శంకరాచార్యస్వామికి  అస్టోత్తర పూజ జరిగింది. రాంకీ పురోహితునిగా ఉన్నాడు . చివరికి మధ్యప్రదేశ్ లోపుట్టి బొంబాయిలో పెరిగి అమెరికా చేరిన ఒక యోగా మాస్టర్ తేలికైన ఇంగ్లీష్ ,హిందీలలో యోగా గురించి డిమాన్ స్ట్రేషన్  లెసన్ చెప్పాడు అందరూ మెచ్చారు .కేరళ లోని 92 ఏళ్ళ స్త్రీ యోగాసనాలు చాలా  సునాయాసంగా  చేస్తున్న వీడియో క్లిప్పింగ్ చూపించాడు .అందరూ చప్పట్లు చరిచారు .తర్వాత  మహా నైవేద్యం హారతి ,మంత్రం పుష్పం తో కార్యక్రమం పూర్తి .నాలుగు మాటలు నన్ను మాట్లాడమని రాంకీ అడిగితె ‘’ఇండియాలో మేము మరచిపోతున్న శంకరాచార్య స్వామిని అమెరికాలో గుర్తుంచుకొని మా అమ్మాయి అల్లుడూ శ్రర్దగా ఉదయం 7-30 నుంచి సాయంత్రాం 6-30 వరకు నిర్వహించటం గొప్ప విషయమని వారిద్దరిని అభినందిస్తున్నానని ,కంచి పెద్ద స్వామి శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు ‘’మైత్రీ భజతే ‘’అనే సంస్కృత గీతాన్ని రచిస్తే అంతర్జాతీయ సమితి యు యెన్ వో 50 వ వార్షికోత్సవం లో భారత రత్న ఏం ఎస్ సుబ్బు లక్ష్మి గానం చేసిందని దానికి అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారని,సరస భారతి మార్చి 26 ఉగాది వేడుకలో ‘’వసుధైక కుటుంబం ‘’శీర్షికపై కవి సమ్మేళనం నిర్వ హించిందని దాన్ని పుస్తకంగా తెస్తున్నామని  ,అప్పుడు జ్ఞాపికగా వసుధైక కుటుంబం చిత్రం  పరమాచార్య ఫోటో, వారి మైత్రీ గీతం లో చివరిభాగం తో జ్ఞాపిక తయారు చేయించి అందరికీ ఇచ్చామని చెప్పి జ్ఞాపిక చూపించా . పద్మశ్రీ వెంటనే ఆ గీతాన్ని బహు శ్రావ్యంగా పాడింది. అందరూ అభినందించారు .కార్యక్రమం పూర్తి ఆయే సమయానికి 45  మందిఉన్నారు పొద్దున్న కొందరు వచ్చి వెళ్ళారు .’’రాలీ’’లో భగవద్రామానుజ జయంతి చేస్తున్నారని అక్కడ సినీ ,టీవీ గాయని శ్రీమతి ఉష సంగీత విభావరి ఉందని చాలా మంది ఇక్కడికి రాలేదు లేక పోతే మరో 15 మంది వచ్చి ఉండేవాళ్ళు ఉష అమెరికాలోనే ఉండి ప్రోగ్రాములున్నప్పుడు మాత్రమే ఇండియాకు వస్తుంది .ఉష అక్క  ఉదయమే వచ్చి కాసేపు ఉండి వెళ్ళింది .

  తర్వాత మా అమ్మాయి అందరికీ చేసిన  వంట కాలతో  కమ్మని విందు భోజనం-టమేటా పప్పు వంకాయ చిక్కుడు కాయ కూర ,ఆవకాయ  పూరీలు ,బంగాళాదుంప కూరా ,కేసరి ,బూరెలు గారెలు ,పెరుగు పచ్చడి సాంబారు ,పెరుగన్నం .అందరూ సంతృప్తిగా భోజనం చేశారు .5 ఏళ్ళక్రితం పరిచయమైనా మంజుల .ప్రక్కి అరుణ చక్కగా పలకరించారు .

  భోజనాలతర్వాతగాయత్రి తో అందరూ అడిగి పాటలు పాడించాం .ప్రక్కి వాళ్ళమ్మాయి అబ్బాయి కూడా పాడారు . గాయత్రికి ‘’షార్లెట్ కౌమార కోకిల ‘’అని సరదాగా బిరుదు ఇచ్చి ఆ పేరేరే రాసి శతకత్రయం సరసభారతి ఉగాది జ్ఞాపిక అంద జేశాం ..ఆ అమ్మాయి తలిదండ్రులు బాగాశ్రర్ధ తీసుకొని సంగీతం నేర్పిస్తుంటే ఆ అమ్మాయి సార్ధకం చేస్తోంది ఇక్కడ పాడిన వారందరి తలిదండ్రులను అభి నందిస్తున్నాను .సరదాగా నేను  ఇద్దరు అరుణలలో ఒకమ్మాయిని ఇంటిపేరుతో ప్రక్కి అరుణ అని రెండో అమ్మాయి మాటల్లో చాలాసార్లు ‘’కరెక్ట్ అంకుల్ మీరుకరేక్ట్ ఆంటీ ‘’అనటం మూలంగా ఆ అమ్మాయిని ‘’కరెక్ట్ అరుణ ‘’అన్నా.అందరూ పగలబడినవ్వారు అరుణ ‘’కరెక్ట్ అంకుల్ ‘’అంది సరదాగా .ఇదంతా పూర్తి  అయేసరికి రాత్రి 9 అయింది .పవన్ భార్య రాదఉదయం నుంచి విజ్జికి చాలా సహాయంగా ఉంది .చివరికి అన్నీ సర్ది పవన్ దంపతులు మా ఆశీర్వాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళారు .

పవన్ రెండో కూతురు మా రెండవ బావ గారు  వేలూరి వివేకానంద్ గారి చెల్లెలు శాంతమ్మగారు లాగా నవ్వుతూ నవ్విస్తూ మూతి ముప్ఫై వంకర్లు తిప్పుతూ అచ్చంగా ఆవిడ పోలికలే వచ్చినట్లు అనిపించింది .ఈ విషయం హైదరాబాద్ వెళ్ళినప్పుడు శాంతమ్మగారితో చెప్పాలని మా ఆవిడ తహ తహ లాడుతోంది .తాత గారి చెల్లెలి అంటే మేనత్త పోలిక  అన్నమాట .

కొస ముక్క -తిరువాయూర్ లో త్యాగరాజ ఆరాధననాడు ఆయనకూ శివునికి అభిషేకం చేస్తారు .శంకర జయంతి నాడు కూడా శంకరా చార్యులు అపర శంకరులే కనుక ఆయనకు మహన్యాసం తో అభిషేకం చేస్తే బాగుంటుంది .వ్యాస మహర్షి వేద వాజ్మయాన్ని పురాణ ఇతిహాసాలను మనకు వరం గా ప్రసాదించారు .శ్రీ శంకర భగవత్పాదులు ప్రస్తానత్రయానికి వ్యాఖ్యానం రాసి జ్ఞానానికి  మార్గ౦ సుగమం చేశారు. ఇది ఒక స్థాయి ఉన్నవారికే పనికొస్తుంది .సామాన్యులు తరించటానికి మార్గం వారు రాసిన స్తోత్రాలు ,శివానంద సౌందర్య లహరి మొదలైనవి అందులో వేద వేదాంత సారం అంతా నిక్షిప్తం చేశారు . సంస్కృతాన్ని సామాన్య జనం స్థాయికి స్తోత్రాల ద్వారాతెచ్చి తరుణోపాయం చూపారు .కనుక జయంతి నాడు కనీసం రెండు గంటలు శివానంద సౌందర్య లహరి ,స్తోత్రాలను విడివిడిగా సామూహికంగా గానం చేస్తేనే ఆయన ఋణం తీరుతుంది .అప్పుడే గొప్ప అనుభూతి కలుగుతుంది. సౌందర్య లహరి అందరికీ అందుబాటు లో ఉండటం కష్టం .శివానంద లహరి చాలా సులభం అందరూ నేర్చుకొని పాడచ్చు అలాగే స్తోత్రాలు కూడా సామూహికంగా పాడాలి .అప్పుడే దాని ఇంపాక్ట్ మనకు తెలుస్తుంది .

   మరో విషయం శంకర జయంతినాడు సంస్కృతం లో కృషి చేసినవారికి కాని ,స్తోత్ర గానం చేసినవారికి కాని సంగీత నృత్యాలలో  రాణించినవారికి కాని ప్రోత్సాహక బహుమతులు అందిస్తే సార్ధకమౌతుంది ..దేశం కాని దేశం లో చేస్తున్నప్పుడు ఈ రెండూ బాగా రాణిస్తాయి .కనుక ఈ సారి శంకర జయంతికి ఈ ఆలోచన చేస్తే బాగుంటుందని నా భావన .ఒడ్డున కూర్చుని ఎన్నైనా చెప్పవచ్చు .దిగితే కానీ లోతు తెలియదని నాకు తెలుసు .అందుకే సరసభారతి గాయత్రికి శ్రీ సువర్చలాన్జనేయ శతక త్రయం, ఉగాది జ్ఞాపిక అందజేసి మార్గం చూపించింది .

  రాత్రి భారవి తీసిన శంకరాచార్య తెలుగు సినిమా చూశాం యు ట్యూబ్ లో .పైత్యం ఎక్కువ శ్రీహరిని మోహన బాబు ను ,సుమన్ ను  భరణి నిఎక్కడపడితే  అక్కడ చూపించి పలచన చేశాడు . హు౦దాతనం  ఉత్క్రు స్టతలోపించి చౌకబారు సినిమాగా గ్రాఫిక్ మయం గా మారింది. నిద్ర పోయే సరికి రాత్రి 12 .

30-4-17 ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి .వీలు ప్రకారం శనివారం చేశారు మా వాళ్ళు . నేను ఉదయం 6 -30 కే లేచి కాలకృత్యాలు పూర్తీ చేసి ఉదయం 7-30 కు పూజలో కూర్చున్నా .మామూలు నిత్య పూజ చేసి   శ౦కరా చార్య అస్తోత్తరం  శివ అస్తోత్తరం  సహస్రం ,లలితా సహస్రం దక్షిణా మూర్తి దత్త్రేయ అస్తోత్తరాలతో పూజ చేసి శివానంద లహరి సౌందర్య లహరి చదివి ,మహాన్యాసం తో నమక చమకాలు దశ శాంతి  సామ్రాజ్య పట్టాభి షేకం  తో ఏక రుద్రం చేసి(చదివి) , బిల్వ అష్టోత్తర౦  తో పూర్తీ చేసే సరికి ఉదయం 10-30 అయింది అంటే మూడు  గంటలు  పట్టింది ధన్యుడను అనుకొన్నా ..తర్వాత టిఫిన్ .

               వీక్లీ అమెరికా 4 మొదలు పెట్టి కొంత  రాశా .కాలి ఫోర్నియా నుంచి మేనల్లుడు శాస్త్రి భార్య విజయ లక్ష్మి  కొడుకు కృష్ణ ఫోన్ చేసి మాట్లాడారు . కృష్ణకు  సాన్  ఫ్రాసిస్కో లో మంచి కొత్త ఉద్యోగం వచ్చిందని మే 15 చేరుతాడని ,విజయలక్ష్మి అమ్మగారు మే 7 న కొడుకుతో ఇండియా నుండి అమెరికా వస్తున్నారని ,మమ్మల్ని వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండేట్లు రమ్మని కోరారు .సరే అన్నాం. మా ప్రయాణం మా చేతుల్లో లేదుకదా .

  ఈ వారమంతా బాహుబలి హడావిడి ఇండియాలో టికెట్ వెయ్యి రూపాయలు అమెరికాలో 42 డాలర్లని అంటున్నారు .అయినా కొని చూస్తూనే ఉన్నారట .80 కోట్లు కూడా ఉండని తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి 450కోట్ల స్థాయికి తెచ్చి బాలీ వుడ్ ను మించి అతనిపై  నమ్మకం తో నిర్మాతలు అంత డబ్బూ పెట్టు  బడి పెట్టారు . వాళ్ళ పంట పండినదని కాసులవర్షం కురుస్తోందని మీడియా కోడై కూస్తోంది .రాజమౌళి తీసిన్న మగ ధీరకాని బాహు బలి 1 కాని నేను చూడలేదు ఆ సీన్లు ఏదైనా చానల్ లో వచ్చిన స్కిప్ చేస్తా . సినిమా హృదయాన్ని కదిలించాలి కాని గ్రాఫిక్స్ కాదు

  విజ్జి  ఉదయం 9-30 కు తెలుగు క్లాసు నిర్వహించి మధ్యాహ్నం 12 కు ఆఫీస్ కు వెళ్ళింది .రాత్రి 8 కి వచ్చింది .కాసేపు ఫ్యాన్ బకెట్ చూశా .అయ్యర్ సంస్కృత శ౦కరాచార్య కాసేపు చూశా .1970 దశకం లో తమిళ నుంచో మలయాళం నుంచో తెలుగులోకి డబ్బింగ్ అయిన  ఆది శంకరాచార్య సినిమా బాగా ఆడింది అందరికీ నచ్చింది అద్భుతమ నిపించింది అది యెక్కదైనా దొరుకుతుందేమోనని యు ట్యూబ్ లో వెతికితే కనపడలేదు .ఇక ఈ వారానికి స్వస్తి .

               మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-17 – కాంప్ -షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -4 –1 24-4-17 నుండి 30-4-17 వరకు

వీక్లీ అమెరికా -4 –1

24-4-17 నుండి 30-4-17 వరకు

  మూడు విందులు రెండు పూజల వారం .

24 వ తేది  సోమవారం  ఇంకా బెడ్ మీద ఉండగానే  సెల్ మోగింది .నిద్రలో ఎత్తా.విశాఖ నుంచి స్వామిగారట మెయిల్ రాశాను జవాబు లేదని ఫిర్యాదు .తెలివి తెచ్చుకొని అమెరికాలో ఉన్నా తడిసి మోపెడవుతుంది అని కట్టేశా అయినా 30 రూపాయలు బొక్క పొద్దున్నే .అలాగే ఇక్కడికి వచ్చిన 7 వ తేది వాషింగ్టన్ నుంచి కారులో వస్తుంటే రావి శాస్త్రిగారి అబ్బాయి ప్రసాద్ గారు ఫోన్ చేశారు .అప్పటికి రోమింగ్ విషయం గుర్తులేక కాసేపు వాయి౦చామ్ .మా అమ్మాయి అరుస్తూనేఉంది. ఉండమని ఆపేశా .90 రూపాయలు తోసింది .అప్పటినుంచి మ్యూట్ లో పెడుతున్నా సెల్ .రెండు రోజులుగా వర్షం పడుతోంది . శ్రీ గండికోట సుబ్బారావు ,సోమలత గుర్తించినవైద్య  భైరవ దత్త లపై నెట్ లో రాశా ..ఇల్లంతా ఇద్దరు ఆడవాళ్ళు బహుశా మెక్సికన్లు అన్నీ సర్ది క్లీన్ చేశారు .

హైదరాబాద్ లో జ్యోతి శ్శాస్త్ర వేత్త ,పంచాంగ కర్త శ్రీ అడుసుమిల్లి (బ్రాహ్మణుల ఇంటిపేరు కమ్మవారింటి పేరుకాదు )లీలాప్రసాద్ గారబ్బాయి రాంకీ ,భార్య ఉష లు అయిదేళ్ళ క్రితం వచ్చినప్పుడే బాగా పరిచయం .వాళ్ళ ఇంట్లో ఇవాళ రాత్రి సాయి భజనకు పిలిస్తే మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చాక రాత్రి 7-30 కు బయల్దేరి 8 కి చేరాం .సుమారు 50 మంది వచ్చారు . రాంకీ ఉషా దంపతులకు శతకత్రయం ఇచ్చాము  ఆతను’’ వేద మాల ‘’అనే సంస్కృత శ్లోకాల పుస్తకం ఇచ్చాడు తర్వాత భోజనాలు .మూడు స్వీట్లు రెండుహాట్లు రెండుకూరలు పప్పు అప్పడం సాంబారు ,పెరుగు ,పుచ్చముక్కలు వగైరా లతో భోజనం .అన్నీ బాగానే ఉన్నాయి .రాంకీ తమ్ముడు భార్య ఇక్కడే ఉంటున్నారు .ఆమె పద్మశ్రీ సంగీతం బాగా పాడింది. మా మనవళ్ళు  ఆశుతోష్ ,పీయూష్ లకు సంగీత గురువు .అక్కడ ఒక డాన్స్ టీచర్ పరిచయమైంది .అలాగే పవన్  డోమేనికన్ రిపబ్లిక్ కు చెందిన ఆవిడను  పరిచయం చేశాడు ఆవిడను ఆరాధన రోజూ చూశా .ఇప్పుడు మాట్లాడా .ఆమె అక్కడ దేశానికి ప్రెసిడెంట్ అయ్యే చాన్స్ వచ్చినా వదిలేసి ఇక్కడ కొడుకుతో ఉంటోంది .మన సంప్రదాయాలు తెలుసు .ఉష బొట్టుపెడితే చక్కగా పెట్టి౦చు కోన్నది  .పవన్ చెబితే ఆవిడపై నెట్ లో వ్యాసం రాద్దామని అనుకొన్నాను .ఆవిడకు నా మెయిల్ ఐడి ఇక్కడి ఫోన్ నంబర్ ఇచ్చి ఆమె గురించి విషయాలు మెయిల్ చేయమన్నాను .అందగానే తెలుగులో రాస్తానని చెప్పా. .ఈ రోజు వరకు ఆమె నుండి విషయం రాలేదు .ఇంటికి వచ్చేసరికి రాత్రి పదిఅయింది

 మంగళవారం మధ్యాహ్నం మాంచి నిద్రలో ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు విజయ  వాడ నుంచి నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు చదివిన భూషణం బాబు వాట్సాఫ్ లో రెండు సార్లు ప్రయత్నిస్తే నేను ఎత్తలేదు  .మూడో సారీ చేస్తే అప్పుడు మెసేజ్ లో తాను స్టూడెంట్ అని ఉంటె నేనే ఫోన్ చేశా .దర్వాజా అయ్యాడు పాపం ఆనందం పట్టలేక .చాలా విషయాలు మాట్లాడుకున్నాం అతనిప్రక్కనే సురేష్ అనే అదే బాచి కుర్రాడుకూడా మాట్లాడాడు. అడ్డాడ వదిలి సుమారు 20 ఏళ్ళు అయినా ఇంకా గుర్తుపెట్టుకున్నారు ఈ బాచ్ వాల్లందరూ కలిసి అక్టోబర్ లో నేను ఇండియా వచ్చినతర్వాత ఒక గెట్ టు గెదర్ పెట్టాలన్న ప్లాన్ లో ఉన్నట్లు చెప్పారు .వీళ్ళతో పాటే 12 ఏళ్ళుగా ఇక్కడున్న పావని అనే అమ్మాయి దుబాయ్ లో ఉన్న ఆనంద్ కూడా ఇదివరకే మాట్లాడారు .నిద్రపట్టక మైనేనిగారికి వాట్సప్ లో  ప్రయత్నిస్తే దొరక్క పొతే మెయిల్ పెట్టాను .తర్వాత ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు .తర్వాత డా. యెన్ ఇన్నయ్యగారు ఫోన్ చేసి మాట్లాడుతూ చిత్రకారులు శ్రీ ఎస్వి రామారావు గారు చికాగో వచ్చి వారమయిందని  తెలుగు విద్యార్ధి పత్రికకు ఆర్టికల్ రాయమంటే రాశానని చెప్పారు ..బైజాంటిన్ సామ్రాజ్యం చదవటం మొదలుపెట్టి దాని నాగరకతపై ఒక వ్యాసం రాశాను  గీర్వాణ౦ లో 12 5 వరకు లాగాను .

కళాతపస్వి  కాశీనాధుని విశ్వనాద్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చారు .విశ్వనాధ ,మొల్ల, వెంగమాంబ పోస్తేజ్ స్టాంపులను కేంద్రం విడుదల చేసింది. రాత్రి 12 వరకు నిద్ర పట్టలేదు

 బుధవారం ఎండ బాగానే వచ్చింది రెండుపూటలా వాకింగ్ కు వెళ్ళా .ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో బి జెపి ‘’ఆప్’’ను వాళ్ళ ‘’చీపిరి ‘’తోనే తుడిచేసి 18 2 స్థానాలు 3 మునిసిపాల్తీలు గెల్చింది రాత్రి యు ట్యూబ్ లో క్రిష్ సినిమా ‘’కృష్ణం వందే జగద్గురుం ‘’చూశాం .పేరుకీ సినిమాకు లంకె లేదు సీన్లు అన్నీ ఇష్టం వచ్చినట్లు తీసి అతికించినట్లు అనిపించింది నయనతార ఎందుకున్నదో ఎవరికీ తెలీదు .దగ్గుబాటి రాణా బానే చేశాడు  టార్జాన్ సినిమాలకు బ్రహ్మాండంగా పనికోస్తాడని పించింది .మణిశర్మ సంగీతం సిరివెన్నెల పాటలూ వినసొంపు .పిక్చరై జేషన్ బాగుంది  సాయంత్రం ‘’కారీ ‘’లో ఉంటున్న మా అన్నయ్యగారి మనవడు అంటే కూతురు వేదవల్లి కొడుకు వేలూరి హరి ఫోన్ చేశాడు భార్య కూడా మాట్లాడింది .

  గురువారం గీర్వాణం 13 5 వరకు దేకా .రెండుపూటలా నడక .స్వామి రామా పుస్తకం ‘’లివింగ్ విత్ ది హిమాలయన్  మాస్టర్స్ ‘’పూర్తి చేసి హిమాలయ యోగులపై రాశా .విజ్జి వాళ్ళ ఇంటి ప్రక్క రవి గాయత్రి పలకరించి మాట్లాడారు రవి తలిదండ్రులు బుధవారం వస్తారట ఇండియా నుంచి

మధ్యాహ్నం విజ్జి స్నేహితురాలు వీటూరి పద్మ వచ్చి పలకరించింది .తర్వాత గోసుకొండ అరుణ కూడా వచ్చి శుక్రవారం వాళ్ళ ఇంట్లో అమ్మవారి మణి ద్వీప పూజ ఉందని తాంబూలాని భోజనానికి రమ్మని పిలిచింది .నేనెందుకు ‘’పోతు పేరంటాలు ‘’లాగా అనిపించింది కాని అంత ఆప్యాయంగా పిలిస్తే వెళ్ళాలి అనుకొన్నా .రాత్రి ఏమీ తోచక ‘’ఫ్యన్ బకెట్ ‘’చూశా౦ .ఒక జోకు మురికిదే అయినా బాగుంది -అది చెప్పకపోతే నా కడుపుబ్బరం తగ్గదు .ఒక భార్యా భర్తా తగువులాడుకొని విడాకులిప్పించమని పోలీస్ స్టేషన్ కొచ్చి సబిన్స్పెక్టర్ను . అడుగుతారు .సరేనని ఆమె దగ్గర లక్ష రూపాయలు కాష్ ఉందని సగం భర్త కిస్తానని అంది ఒకే ఇంటిలో వంటిల్లు భార్యకు బెడ్ రూమ్ భర్తకు పంచాడు .ముగ్గురు పిల్లల్ని ఏం చేయాలని సమస్య .ఎస్ ఐ నాలుగో సంతానం కన్నాక విడాకుల సంగతి చూద్దామన్నాడు .భార్య ‘’ఈ యనపై నమ్మకం పెట్టుకొంటే ఆ ముగ్గురూ కూడా పుట్టేవాళ్ళు కాదు ‘’అని గబుక్కున నోరు నొక్కు కుంది. అవాక్కవటం భర్త ,ఎస్ ఐ ల వంతు అయింది .పనిలో పని మరోకుళ్ళు జోకూ చెప్పకపోతే ఆగలేదు .బిగ్ జోక్స్ అనే పుస్తకం చదువుతున్నా .అందులో రాజకీయ నాయకుల మీద ఏదో కల్పిత జోకులు చాలా ఉన్నాయి అందులో ఒకటి చదివి నవ్వు ఆపుకోలేక పోయా . అమెరికా ప్రెసిడెంట్ ఒబామా  ఇంగ్లాండ్ వెళ్ళాడట. రాణి ఆరుగుర్రాల బండీలో ఆయన్ను  రాజ సౌధానికి   తీసుకు వస్తోందట .అందులో ఒక గుర్రం కొంత దూరం వెళ్లేసరికిడామ్మని పెద్ద శబ్దం తో పిత్తిందిట .పిచ్చకంపుట .ఇద్దరూ అవాక్కయి ‘’పిత్తినన ముత్తయిదుల్లా ముక్కు మీద కర్చీఫ్ పెట్టుకొని  భరి.స్తున్నారట .కాసేపయ్యాక   రాణి ఇకమర్యాదగా ఉండదని’’మిస్టర్ ప్రెసిడెంట్ ! మహా రాణీ అయినా కొన్ని విషయాలు ఆవిడ చేతుల్లో ఉండవు ‘’అన్నదట .అప్పుడు ఒబామా కూడా నవ్వుతూ ‘’ఇప్పటిదాకా ఆశబ్దం గుర్రానిదనుకోన్నాను  మీదా ?’’అన్నాడట ఆశ్చర్యంగా .ఆ పుస్తకం చదివితే జోకులు ఎలా పుట్టాయో మొదటి అధ్యాయం లో రాస్తూ ఇలాంటి కుళ్ళు జోకులే ముందు పుట్టాయని అన్నాడు రచయిత .కొన్ని జోకులు తరువాత రాస్తా. ఇప్పటికే వాసన భరించ లేక పోతున్నారేమో ?

                  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సరసభారతి పురస్కారం

29-4-17 శనివారం షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో  చక్కని సంగీతస్వరాలతో భక్తి కీర్తనలు గానం చేసిన సంగీతం టీచర్ శ్రీమతి పద్మశ్రీ ,గారికి ”షార్లెట్ స్కై లార్క్ ”అనే బిరుదు ను ,కుమారి గాయత్రికి ”షార్లెట్ కౌమార కోకిల ”బిరుదాన్నీ సరదాగా అందరి సమక్షం లో ఇచ్చి గాయత్రికి సరసభారతి పురస్కారం  గా ఉగాది జ్ఞాపిక ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామి శతక త్రయం బహూకరించిన ఫోటోలు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

షార్లెట్ శంకర జయంతి

షార్లెట్ శంకర జయంతి

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

కరపత్ర స్వామి ‘’అద్వైత బోధ దీపిక ‘’లోని ముఖ్య విషయాలు

కరపత్ర స్వామి  ‘’అద్వైత బోధ  దీపిక ‘’లోని ముఖ్య విషయాలు

ఒకసారి ఒక శిష్యుడు గురువు దగ్గరకు వగరుస్తూ పరుగెత్తుకొని వచ్చి తనను  సంసార  నావ దాటి౦చ మని సంసార సర్ప కాటునుంచి కాపాడమని  కోరాడు .శిష్యుడు తెలివిగా లవాడేనని  క్రమ శిక్షణ ఉన్నవాడేనని గ్రహించి గురువు  ఇలా చెప్పాడు -’’’మార్పు లేని ,ఆకారం లేని , ఆనంద  మయుడవైన నువ్వు  పరకాయ ప్రవేశం చేశానని ,నికృష్ట జీవితం గడుపుతున్నానని ఎందుకు అనుకున్నావు ?నిజానికి చావు లేదు ,పుట్టుక లేదు చావటానికి ఎవరూ పుట్టటానికి చావటానికి  ఉండరు .అసలు అలాంటిదేమీ లేదు .మరి ఉన్నదేమిటి అని అనుమానం వస్తుంది .ఆది అంతం లేని అద్వైతమైన బంధనం లేని  సర్వ స్వతంత్రమైన ఏక  ఆనంద సత్య చిదానందమే .మరి ఈ బాధలూ అవి ఎందుక౦ టే అద్వైత శక్తిని పూర్తిగా సరిగా అర్ధం చేసుకోకపోవటం వలన  .మాయా మొహం వలన .అది ఎందుకు ఏర్పడుతుంది ?అజ్ఞానం  అవిద్యవలన అలా అనిపిస్తుంది .సరే అజ్ఞానం అంటే ?శరీరం  నేను అనే భావాన్ని కలిగిస్తుంది దానినే జీవాత్మ అనుకొంటుంది .ఈ జీవాత్మ ఈ కనిపించేది అంతా నిజమని తానేఅన్నీ చేస్తున్నానిఅనుకుని  సుఖ దుఖాలు పొందుతాడు  .అదికావాలి ఇదికావాలని ఆరాట పడతాడు .అంతేకాని తనను తానూ తెలుసుకోడు .తన స్వీయజ్ఞానాన్ని ఉపయోగించడు .’’నేనెవరు ? ఈ ప్రపంచం ఏమిటి ’’అని ప్రశ్నించుకోడు .కనుక సంసార లంపటం లో పడి స్వస్వరూపాన్ని జ్ఞానాన్ని కోల్పోయి మర్చిపోతాడు ఇదే అజ్ఞానం

 శాస్త్రాలన్నీ మాయ వలననే సంసారం ప్రపంచం ఏర్పడుతున్నాయని అంటారు కదా మరి అజ్ఞానం వలన అంటారెందుకు ?ఈ రెండిటిని ఎలా సమన్వయించాలి ?మంచి ప్రశ్నే ఇది అజ్ఞానికి అనేక పేర్లున్నాయి అవే మాయ ,ప్రధాన ,అవ్యక్త ,అవిద్య ,ప్రకృతి  చీకటి మొదలైనవి .అజ్ఞానం వలనననే సంసారం ఏర్పడుతుంది  .అజ్ఞానం రెండు విధాలుగా  ఆవరణ  విక్షేపణ లా పని చేస్తుంది  ఆవరణ లో రెండురకాలు -ఇదికాదు అనేది ,అది ప్రకాశించదుఅని చెప్పేవి .మరి వీటినుండి దూరమై అసలు స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి ?గురువులవద్ద శాస్త్రాలు చదివి అర్ధం చేసుకొని .అప్పటికీ అద్వైత భావన అర్ధం కాకపొతే సత్యం ప్రకాశించడు అనిపిస్తుంది .దీనివలన కొంత జ్ఞానం కలిగి ఇంకా భ్రమలోనే ఉండటం జరుగుతుంది .ఇదే ఆవరణలో రెండవ దశ .

  విక్షేపం అంటే ?తాను  అద్వైత సచ్చిదానంద స్వరూపం అయినా తనను శరీరిగా భావి౦చటం వాడు వీడు అనుకోవటం అన్నీ తానే చేస్తున్నట్లు చెప్పుకోవటం  ను విక్షేపం అంటారు .ఇక్కడ అద్వైత సత్యం విక్షేపం లో చుట్టబడి ఉంటుంది . దీనినే అధ్యారోపణ౦  సూపర్ ఇంపోజిషన్ అంటారు .దీనిభావమేమి తిరుమలేశ ?తాడు పాముగా భావించటం స్తంభాన్ని దొంగగా  భావించటం ఎండమావి ని నీరుగా  అనుకోవటం లాంటిది .అసలు వస్తువును వేరొకటి అని భ్రమించటమే అధ్యారోపణ. ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే అద్వైత సచిదానంద పరమాత్మ సత్యమైనది .దీనిపై ప్రపంచం లోని జ్ఞాన అజ్ఞాన విషయాలు వస్తువులు విక్షేపిస్తాయి .ఇది నిజం కాని భావన -అన్ రియల్ ఫినామిన .అలా అయితే అద్వైతం కానిది ఏది ఎవరు విక్షేపం కలిగిస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది .సమాధానం మాయ .మాయ అంటే బ్రహ్మ గురించి తెలియకపోవటం

  సృష్టికి ముందు లయం తరవాత ప్రపంచం లేదు అంటే ఏది ఉన్నట్లు ? సజాతీయ ,విజాతీయ ,స్వగత భేదాలు లేని ఆధార భూతమైన ది మాత్రమె ఉంది . అదే సత్యజ్ఞానమన0తమ్ బ్రహ్మ .దాన్ని తెలియటం యెట్లా ?వేదం ఏం చెప్పిందంటే -సృష్టికి పూర్వం శుద్ధ ఆత్మ మాత్రమే ఉన్నది .యోగ  వాశిస్టం వలన కూడా అర్ధం చేసుకోవచ్చు .కొంచెం వివరంగా చెప్పాలంటే -ప్రళయం లో ఏక శుద్ధాత్మ తప్ప అంతా వెనక్కి తీసుకోబడుతుంది -విత్ డ్రాన్..శుద్ధాత్మ కదలదు మాట్లాడదుఆలోచించదు .కా౦తిచీకటికాని ఉండవు అయినా పరిపూర్ణంగా అవాచ్యం గ అంటే చెప్పటానికి వీలులేనిదిగా  శూన్యం కానిదిగా ఉంటుంది .అలాంటి అద్వైత స్థితిలో సృష్టి ఎలా జరిగింది ?అంటే మాయ వలన .దానితో అనేక రూపాలు పేర్లు వచ్చాయి .ఈ మాయ మనసుగా మారి అన్నీ సృష్టిస్తుంది .ఈ విషయాన్ని ఇంతకు ముందు ఎవరైనా చెప్పారా ?శ్రీరాముడికి వశిష్టుడు చెప్పాడు .ఎలా ? బ్రహ్మ౦  శక్తి అనంతం .అ శక్తులు మార్పు చెంది అన్నీ ఏర్పడతాయి . బ్రహ్మానికున్న విశేష శక్తు లేమిటి?జ్ఞానులలో జగృతికలిగించటం ,ఆకాశగమనం భూమిని ఘనంగా చేయటం ,నీటికి  ద్రవత్వం ,అగ్నికి వేడి ఆకాశం లో శూన్యం ,మృతజీవులను  కుళ్లి౦ప   జేయటం ,మొదలైనవి  దాని అనంత  శక్తులో కొన్నిమాత్రమే  ఈ లక్షణాలన్నీ వాటిలో అంతర్గతంగా ఉంటాయి . బ్రహ్మ౦ వలన  చైతన్యమౌతాయి . అద్వైత బ్రహ్మం లో ఇవన్నీ పైకి కనిపించకుండా లోపలే ఉండి నెమలి పురివిప్పినప్పుడు కనిపించే వివిధ రంగుల్లా విత్తనం లో దాగిన వృక్షంలా గుడ్డులోని పక్షిలా  బయట పడతాయి .

  బానే ఉంది ఇన్ని శక్తులు బ్రహ్మం లొ అంతర్గతంగా ఉంటె అన్నీ ఒక్కసారే ఎందుకు బయట పడవు అని అనుమానం రావచ్చు . భూమిమట్టిలో అనేక రకాల విత్తనాలు కాలాన్ని బట్టి ప్రదేశాన్నిబట్టి అనుకూల పరిస్తితులబట్టి ఎలా మొలకెత్తి వృద్ధి చెందుతాయో ఇక్కడా అంతే.బ్రహ్మం మాయ ను మనసుగా మార్చటం తో దాని శక్తులన్నీ విజ్రుమ్భించి ఈ ప్రపంచం ఆవిర్భ విస్తుంది అని  రాముడికి   వశిష్టుడు  బోధించాడు .

ఇన్‌లైన్ చిత్రం 1

           రేపు 30-4-17 ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకరాచార్య జయంతి సందర్భం గా శుభాకాంక్షలతో

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3

13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 )

19 07లో ఉత్తరప్రదేశ్ ప్రతాపగ్హడ్ దగ్గర భాటిని గ్రామం లో హరినారాయణ ఓజా గా కరపత్రి స్వామి జన్మించాడు .హిమాలయ దశనామి ముని సంప్రదాయానికి చెందినవాడు .జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి బ్రహ్మానంద సరస్వతి కి ముఖ్య శిష్యుడు .వార ణాసి లో ‘’ధర్మ సంఘం ‘’స్థాపించాడు .జీవితం లో ఎక్కువకాలం కాశీ లో నే గడిపాడు .అద్వైత వేదాంతాన్ని బహుళ ప్రచారం చేసిన వారిలో కరపత్రి స్వామి ఒకడు 19 4 8 లో ‘’రామ రాజ్య పరిషత్ ‘’అనే రాజకీయ పార్టీ నెలకొల్పాడు .19 51లో లోక్ సభకు జరిగిన మొదటి ఎన్నికలలో ఈ పార్టీ 3 సీట్లు ఉత్తర ప్రదేశ్ లో గెలిచింది .దీనిద్వారా హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రచారం చేశాడు భారతీయులందరికీ ఒకే సివిల్ కోడ్ ఉండాలని,  అది ధర్మ శాస్త్రాలపై ఆధార పడి ఉండాలని కరపత్రి స్వామి వాదన . కాని ఆపలేక పోయాడు 19 5 8 లో తనపర్తీని జన సంఘ్ పార్టీలో స్వామి విలీనం చేశాడు .19 6 6 లో గో సంరక్షణ ఉద్యమం చేబట్టి ఆవులను చంపరాదని ,గో మాంసాన్ని నిషేధించాలని తీవ్రంగా దేశ వ్యాప్త ఉద్యమం చేశాడు .సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటానికి 19 48 ఏప్రిల్ 18 న’’సన్మార్గ్ ‘’అనే దిన పత్రిక పెట్టి నడిపాడు 19 8 2 లో 7 5 వయేట మరణించాడు .

 కరపత్ర స్వామి సంస్కృతం లో ‘’అద్వైత బోధ దీపిక ‘’అనే గ్రంధాన్ని 12 అద్యాయాలతో రాశాడు ఇది తమిళ ఇంగ్లీష్ భాషలలో అనువాదమైంది .’’టాక్స్ విత్ రమణ మహర్షి’’ నిరికార్డ్ చేసిన మునగాల వెంకట రామయ్య 8 అధ్యాయాలను ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు.అద్వైత బోధ దీపిక శంకరాచార్యులవారి అద్వైతాన్ని అతి సులభంగా తేలికగా అర్ధం చేసుకోవటానికి వీలు కలిగించింది .భగవాన్ రమణ మహర్షి ఎవరికైనా సందేహాలుంటే అద్వైత కర దీపికను చదివి హాయిగా అనుమాన నివృత్తి చేసుకోవచ్చునని దీనిని రికమెండ్ చేసేవారు .’’శ్రీ విద్య -వరివస్య ‘’అనే కరపత్రిస్వామి వ్యాసాలను సంకలనం చేసి స్వామి దత్తాత్రేయానంద అనే సీతారామ కవిరాజ ప్రచురించాడు

.ఇన్‌లైన్ చిత్రం 4ఇన్‌లైన్ చిత్రం 5ఇన్‌లైన్ చిత్రం 6

13 7-చైతన్య  చరితామృత కర్త -కృష్ణ దాస కవిరాజ గోస్వామి (15 20-16 17)

 భాగీరధ ,సునందల కుమారుడైన కృష్ణ దాస బీహార్ లో కత్వా లోని బర్ద్వాన్ జిల్లా  జమాత్ పూర్ దగ్గర సాలారాలో 15 20 లో బ్రాహ్మణ వంశం లో జన్మించాడు మరణం 16 17 . .కలలో చైతన్యుడు దర్శనమిచ్చి బృందావనం వెళ్ళమని బోధించాడు .బృందావనం చేరి తన గత జీవితాన్ని ఎవరికి చెప్పలేదు .హరికధలతో  హరి కీర్తనలతో కాలక్షేపం చేశాడు నిత్యానంద స్వామి ,మణికేతన రామ దాసు లు ఆహ్వానితులు గా వచ్చేవారు .విష్ణు దైవం వైష్ణవ భక్తుల సహకారం లేకుండా చైతన్య చరితామృతం రాయలేనని భావించి ప్రతి అధ్యాయం లో చైతన్య ప్రభుని అద్వైత ప్రచారకర్త నిత్యానంద ప్రభులను స్మరించాడు .వ్యాసమహర్షి భాగవతం లో క్రష్ణలీలను  వర్ణించినట్లే బృందావన గోస్వామి అయిన కృష్ణదాసు చైతన్య లీలా విలాసాలను వర్ణించాడు .దీనిని చైతన్య గౌడీయమతం ప్రచురించింది .మదన మోహనుడు చెబితే నేను ఒక చిలకలాగామళ్ళీ పలికాను అన్నాడు కృష్ణదాస .దీన్ని రాయటానికి స్వరూప దామోదరుని నోట్స్ ను ఆధారంగా చేసుకున్నాడు .కృష్ణదాస్ హృదయం లో చైతన్య నామం భావం మూర్తి బోధనా భక్తీ అన్నీ సంగమించాయి .చైతన్య చరితకు విశ్వనాధ చక్రవర్తి టీక రాశాడు .

 కృష్ణ దాస కవిరాజ స్వగ్రామం జమతాపుర లో ఒక చిన్న గుడిలో స్వామి నిత్యానంద పాద ముద్రలున్నాయి .క్రష్ణదాసుకు నిత్యానందుని అనుగ్రహం పుష్కలంగా ఉన్నదని శ్రీ కృష్ణ మంత్రం ఉపదేశించాడని ని స్థానికులు భావించారు .అందుకనే అదే ప్రదేశం లో నిత్యానంద పాదుకలను ఏర్పాటు చేసి స్మరిస్తారు .కాని కృష్ణదాస రఘునాధ గోస్వామివద్ద దీక్ష తీసుకున్నాడని  ప్రేమ విలాసలో ఉన్నట్లు చెబుతారు .ఇక్కడి దేవాలయం లో క్రష్ణదాసుని కొయ్య పాదుకలుఅంటే పాంకోళ్ళున్నాయి .కృష్ణదాస విగ్రహం, సమాధి రాదా కుండ్ లో ఉన్నాయి .రఘునాధ దాస స్వామి మరణం తరవాత కృష్ణదాస కవిరాజ గోస్వామి అశ్విని మాసం కృష్ణ ద్వాదశినాడు మరణించాడు .

ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3

ఇన్‌లైన్ చిత్రం 1

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment