పిఆర్కే ప్రసాద్ ఇకలేరు

clip

clip

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

426- నరహరి యతి చరిత్ర కర్త -నరహరి తీర్ధ (1324-1333)

మధ్వాచార్య శిష్యుడు ,దాస సంప్రదాయ కర్త నరహరి తీర్ధ విజయనగర సామ్రాజ్య రాజగురువు ,యతీంద్రుడు 1323 లో జన్మించాడు .ఈయనది ఆంద్ర దేశమే నని భావిస్తారు .పుర్వాశ్రమ నామం శ్యామ శాస్త్రి .కళింగ రాజుల మంత్రి గా 12 ఏళ్ళు ఉన్నానని  ‘’నరహరి యతి చరిత్ర ‘’లో చెప్పుకున్నాడు. శ్రీకూర్మం ,సింహాచలం దేవాలయ శాసనాలు ఆయన మంత్రిత్వాన్ని రుజువు చేస్తున్నాయి .కన్నడం వాడుకాకపోయినా ఆయన రచనలు కన్నడం లోనే ఎక్కువగా ఉన్నాయి .కళింగ ఆంద్ర లలో చాలామందిని మధ్వ మతం లోకి మార్చినట్లు ఆధారాలున్నాయి .ఆయన వారసులు ఇప్పటికీ సాగరాంధ్రలో ఉన్నారు .హరిదాసు ఉద్యమానికి ఈయనే ఆద్యుడు అంటారుకాని శ్రీపాద రాయలే ఆద్యుడని ఎక్కువమంది భావిస్తారు . కానీ యక్షగానాలు సృష్టికర్త నరహరి తీర్ధ మాత్రమే అలాగే బాయలత నృత్యానికి ఆద్యుడు ఆయనే .ఈ సంప్రదాయం ఇప్పటికి కర్ణాటక లో కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతం లో ఉన్నాయి .ఈయన కృష్ణాజిల్లా శ్రీకాకుళం లో ఆంద్ర మహా విష్ణువు వెలసిన చోట మఠాధిపతి గా ఉన్నాడని కూచిపూడి నృత్య ప్రదాత అని ప్రచారం లో ఉంది .సంస్కృతం లో ‘’దసరాపదాలు ‘’  రాశాడు .

427-గురు కృతి కర్త -ఊత్తుక్కాడు వేంకటకవి (1700-1765 )

ఊత్తుకాడు  వెంకటసుబ్బయ్య అయ్యర్ 1700లో తమిళనాడులో జన్మించి గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడయ్యాడు .వెంకట కవిగా ప్రసిద్ధుడు . సంస్కృత ,తమిళ మరాఠీ భాషలలో 500 కు పైగా కృతులు రచించాడు . ఇవి ఆయన సంగీత శాస్త్ర పాండిత్యానికి ఉదాహరలుగా నిలిచాయి .కావడి చిందు ,తిల్లానా ,కృతులు ఆయన ప్రత్యేకం . పురన్దరదాసుకు కర్ణాటక సంగీత త్రయానికి వారధిగా వేంకటకవి ని భావిస్తారు .సంగీతం లో సరైన గురువును అన్వేషిస్తూ చాలాకాలం గడిపి చివరికి ఊత్తుక్కాడు కళింగ నర్తన ఆ లయం లో శ్రీకృష్ణుడిని గురువుగా భావించాడు . కృష్ణ భగవానునుని ప్రేరణ చెంది ఆరభి రాగం లో ‘’గురుపాదారవిందం కోమలం ‘’కృతి రాశాడు .తన గురుదేవుడైన కృష్ణుడిపై కనీసం 15 గురు  కృతులు రాసి అంకితమిచ్చాడు .ఆయన ఫిలాసఫీ ‘’భక్తియోగ సంగీతమార్గమే పరమపావన మహునే ‘’. అనేక రాగాలను ఉపయోగించాడు .అరుదైన బాలహంస, రసమంజరి రాగాలను ఆలపించి కృతులురాశాడు .మధ్యమావతిలో ‘’శ0కరి రాజరాజేశ్వరి’’సుందర నంద కుమారకృతులు మాధుర్యానికి పరాకాష్ట .ఖండ ధ్రువ ,సంకీర్ణ మధ్యమ వంటి అనేక తాళా ల పై గొప్ప ప్రయోగాలు చేశాడు .సాహిత్య వైవిధ్యాన్ని చాలా అద్భుతంగా పోషించాడు .ఉదాహరణకు అభోగి  రాగ పల్లవి ‘’మహశ్యాయ హృదయ ‘’మాధ్యమకాల విధానం లో 1-మధుకర చంపక వన విహార మనమోహన మధుసూదన నవభూషణ 2-మధుకర చంపక వనవిహార నవపల్లవ పదకర  మదన గంభీర 3-మధుకర చంపక వనవిహార గోవర్ధనధర భుజగ నర్తన చరణ ‘’

ఇదేకాక గౌళరాగం లో ‘’అగణిత మహిమ ‘’లో కూడా ఇలాంటి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు .ధన్యాసిరాగం లో కూర్చిన ‘’భువనమోహన’’లో ఆరుసార్లు పునరావృత్తమై 11 సార్లు వినిపించి అలౌకిక ఆనందాన్ని సృష్టించాడు .సంస్కృతం లోని ఈరచన కర్ణామృతమే -’’అతినూతన కుసుమాకర ,వ్రజమోహన సరసీరుహ దళ లోచన మమమానస పటు చోరసు -స్వరగీతసు -మురళీధర సుర మోదిత  భవమోచన ‘’/ఆయన సంస్కృత పాండిత్యం అమోఘం .దానిలోని సొగసులన్నీ కృతులలో దింపేశాడు .ఆయన ప్రసిద్ధ తమిళకృతి తోడిరాగం లోని ‘’తాయి యశోద’’సంగీతకచేరీలలో తప్పని సరి అయి శ్రీ కృష్ణలీలకు  పరమ భాష్యమై నిలిచింది .ఇందులో 8 చరణాలున్నాయి .ఒక్కో చరణం  లో ఒక్కో లీల దర్శనమౌతుంది .రాధా కృష్ణకల్యాణాన్ని కృతి మాధ్యమంగా రాశాడు .మహాభారతం దక్షయజ్ఞం ప్రహ్లాద చరితం లకూ కృతి గౌరవం కల్పించి శాశ్వతత్వం చే కూర్చాడు .సామూహిక కృతులైన సప్త రత్న ,కామాక్షి నవ రత్నం ,ఆంజనేయ రత్నం వంటివీ రాశాడు .మాధవ పంచకం ,నృసింహ పంచకం ,రంగనాధ పంచకం వంటి స్తోత్రాలుకూడా రాశాడు .’’త్యాగ రాజ పంచరత్నాలు’’వంటి ‘’సప్త రత్న కృతులు ‘’రాశాడు -1 నాట రాగం లో ‘’భజనామృత 2-గౌళ రాగం లో ‘’అగణిత మహిమ ‘’,3-కళ్యాణిరాగం లో ‘’మాధవ హృది కేళిని ‘’4-కీరవాణిరాగం లో ‘’బాలసరస మురళి ‘’5-తోడి రాగం లో ‘’జటధార  6-పరాస్ రాగం లో ‘’అలవ0దె న్నెలో  7-మాధ్యమావతి రాగం లో ‘’సుందర నంద కుమార’’.

  ఆంజనేయ సప్తవర్ణ సంస్కృత కృతులలో హనుమ వైభవ విశేషాలన్నీ చూపించాడు-

1-వసంత రాగం లో -’’పవన కుమార 2-కేదార గౌళ లో -’’వీక్షితోహం 3- తోడిరాగం లో -’’అంజనానందన అమ్బోధి చంద్ర 4-సురటి రాగం లో -శ్రీరాఘవ దూతం 5-మాధ్యమావతి రాగం లో -’’భక్త భాగ ధేయ  ‘’6-రసమంజరి రాగం లో -’’సత్వ గుణ విరచితాంగ 7-మలయ మారుత రాగం లో ‘’వాహిని తట  ‘’.

 దసరాలలో శ్రీ విద్య పై పాడే నవ వర్ణకృతులు  వినాయక స్తుతి ,ధ్యాన స్తుతి ఫలస్తుతి కూడా రాశాడు .కూచిపూడి భరతనాట్య ,కథక్ ,ఒడిశా నృత్యకళాకారులు ఆయన కృతులకు నాట్య ఆకృతులను కూర్చి బహుళ వ్యాప్తి చేశారు. అందులో  వైజయంతిమాల ,కమలా లక్ష్మణ్   బిర్జు మహారాజ్ పద్మా సుబ్రహ్మణ్యం వెంపటి చినసత్యం వంటి వారెందరో ఉన్నారు .ఆయన రాసిన హరికథలను శ్రీ కృష్ణ ప్రేమి అన్న ,గురు హరిదాసు గిరి వంటి హరికథా కళాకారులు వీనుల విందుగా వినిపించి ప్రచారం చేశారు .ఆయనకే ప్రత్యేకమైన -’’కళింగ  నర్తన నటంగం,కృష్ణ పాదాది కేశాంతవర్ణనం ‘’నభూతో అనిపిస్తాయి .భజన సంప్రదాయం లోకూడా వేంకటకవి రచనలు స్థానం పొందాయి .  ,శివ తాండవం ఆయన సంస్కృత భాషా పటిమకు  పరమ భక్తికి తార్కాణంగా నిలీచింది .  .నిత్య జీవితం లో పారాయణకు తోడ్పడి ప్రతి ఇంటా  మార్మోగుతూ వినిపిస్తాయి . 65 సంవత్సరాలు జీవించి శ్రీ కృష్ణ శిష్యుడైన వేంకటకవి 1765లో శ్రీ కృష్ణ ధామం చేరాడు

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

419-కర్ణాటక జాతీయ గీతకర్త -బసవప్ప శాస్త్రి (1843-1891)

 కర్ణాట రాష్ట్ర జాతీయ గీతం ‘’కాయో శ్రీ గౌరీ ‘’రాసిన బసవప్ప శాస్త్రి 1843 లో మైసూర్ జిల్లా నరసా0ద్ర  గ్రామం లో జన్మించాడు . సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు . కాళిదాసుని శాకుంతల మాళవికాగ్నిమిత్ర మొదలైన సంస్కృత నాటకాలను  షేక్స్పియర్ ఓదెల్లో నాటకాన్నీ కన్నడీకరించాడు .’’కర్ణాటక నాటక పితామహ ‘’బిరుదాంకితుడు . తన రత్నావళి ,ఉత్తరరామ చరిత నాటకాలకు చాలాపాటలు కూర్చాడు . 1891 లో చనిపోయాడు .

  తంజావూర్ చిన్నయ్య (1803-1856 )తంజావూర్ జిల్లాలో పుట్టి మైసూర్ రాజాస్థాన సంగీత విద్వా0సు డయ్యాడు .సంస్కృతం తెలుగులలో  లో వర్ణాలు కృతులు జావళీలు విశేషంగా రాశాడు .ఆయన ఆరభిరాగం లో రాసిన ‘’అంబాసౌరంబ ‘’నీలాంబరితో రాసిన ‘’అంబా నీలాంబరి ‘’కృతులు చిత్త స్వరాలతో విశేష ప్రాభవాన్ని తెచ్చాయి .

420-సంస్కృత కృతి కర్త  -వీణ పద్మనాభయ్య   (1842-1900 )

కర్ణాటక చిత్తనాయక హళ్ళికి చెందిన వీణ పద్మనాభయ్య 1842లో జన్మించి 58 వ ఏట  1900 లో మరణించాడు .సంస్కృతం ఆంధ్రం లలో అనేక స్వరాలు కృతులు  జావళీలు వర్ణాలు  ,తోడిరాగం లో సప్త తాళేశ్వరం రచించాడు .నాట కురంజి రాగం లో ‘’శ్రీ హేరంబ మీడే ‘’,నాగేశ్వరావళి  రాగం లో   ‘’భావయామి తవపాదం ‘’బాగా ప్రసిద్ధమైనవి .కన్నడం లో ఒకేఒక్క జావళి రాశాడు .మిగిలినవి సంస్కృతం ,తెలుగు లలో రాశాడు .

421-సంగీత సుబోధిని కర్త -మైసూర్ కరగిరిరావు (1853 -1927 )

1853లో కర్ణాటక తుంకూర్ లో పుట్టిన కరగిరి రావు సంగీత నిధి . 200 ల దేవర నామాలకు సంగీత స్వరాలు కూర్చాడు ఆయన కృతులన్నీ చిత్త స్వరాలతో చిత్తాన్ని ఆకర్షిస్తాయి .సంగీత సుబోధిని ,గాన వాద్య రహస్య ప్రకాశిని అనే గొప్ప సంగీత  గ్రంథాలు రాశాడు .మోహనరాగం లో ‘’నెనరుంచిర ‘’,సరస్వతి రాగం లో ‘’సరస్వతి భగవతి ‘’కృతులు మంచి పేరు తెచ్చాయి . 74 వ ఏట మరణించాడు .

422-108 చాముండీ అష్టోత్తర కృతులురాసిన -ముత్తయ్య భాగవతార్ (1877-1945 )

సంస్కృత కన్నడ తెలుగులలో అనేక కృతులురాసి హరికథ గానం తో ప్రేక్షకులను పరవశం కలిగించిన హరికేశ నల్లూరు ముత్తయ్యభాగవతార్ 1877 లో తిరునల్వేలిలో పుట్టి 20 వ శతాబ్దపు ఉత్తమ సంగీత స్వరకర్తగా పేరుపొందారు .వర్ణాలు కృతులు రాగమాలికలు తిల్లానాలతో వైవిద్యరచన చేసి మెప్పుపొందాడు .నిరుపనం ,పాదం లకు ఆయన పెట్టిందిపేరు . 108 చాముండేశ్వరి అష్టోత్తర కృతులురాసిన మహా భక్తుడు .ఖామాస్ రాగం లో ‘’మాతే మలయధ్వజ ‘’ కర్ణ రంజనిలో ‘’వాంఛతోను నా ‘’బాగా పేరు తెచ్చాయి .నిరోష్ట ‘’వంటి అనేక కొత్తరాగాలు సృష్టించాడు . 68 వ ఏట చాముండేశ్వరి సన్నిధానం చేరుకొన్నాడు .

423-వీణ శివ రామయ్య (1886-1946)

వీణ పద్మనాభయ్య కుమారుడు శివరామయ్య . మైసూర్ రాజ్య ఆస్థాన

సంగీత విద్వా0సుడు .సంస్కృత తెలుగు కన్నడాలలోచాలా కృతులు జావళీలు స్వరాలు కూర్చాడు 72 మళ రాగ కృతులురాశా డు. శ్రీరాగం లో ‘’వాణీ వీణాపాణి ‘’,ధర్మావతి రాగం లో ‘’శ్రీరాజ రాజేశ్వరి ‘’సుప్రసిద్దాలు . ,

424-కొత్త సంగీత రూపం ‘’నగ్మ’’సృష్టికర్త -వీణ వెంకట గిరియప్ప (1887-1952 )

కర్ణాటకలో హెగ్గేడ  దేవకోటలో పుట్టి మైసూర్  పాలస్ ఆర్కెస్ట్రా డైరెక్టర్ అయిన వీణ వెంకట గిరియప్ప 1887 లో పుట్టాడు .వీణ లో అసాధారణ ప్రతిభ సాధించి భారత దేశమంతా పర్యటించి తన వీణాగానమాధుర్యాన్ని పంచాడు .సంస్కృత ,తెలుగు ,కన్నడాలలో చాలా కృతులు రాశాడు .కొత్త సంగీత రూపం ‘’నగ్మా ‘’ను సృష్టించాడు .ఇది హిందూస్థానీ గతులను కలిగి ఉండటం విశేషం .ఈయన కృతులలో భువన గాంధారి రాగం లోని ‘’లలితాంబికే శ్రీ మాతే ‘’బేహాగ్ రాగం లో ‘’శ్రీ జయలలితే ‘’ప్రత్యేకంగా పేర్కొనదగినవి .

425-సంస్కృత తిల్లానాలు రాసిన -టి .చౌడయ్య (1894-1967 )

చోడయ్యావయోలిన్ అంటే చెవులు కోసుకోవటం అందరికి తెలిసిందే .మైసూర్లోని కావేరీ తీరం లో తిరుముక్కడాల్ నర్సిపురం లో 1894 లో జన్మించి వయోలిన్ కు విశ్వ విఖ్యాతికలిగించి ఎన్నో పురస్కారాలు బిరుదులూ సన్మానాలు అందుకొన్న టి చౌడయ్య 73 వ ఏట మరణించాడు .బెంగుళూర్ లో ఆయన పేరఒక వీధి ఉంది .మైసూర్ రాజాస్థాన సంగీత విద్వా0సుడు ,గాన విశారద బిడారం కృష్ణప్ప శిష్యుడు .వయోలిన్ మాధుర్యం పెంచటానికి తార షడ్జమ ,మంద్ర షడ్జమ మొదలైన కొత్త తీగలను ఏర్పాటు చేసి సప్త తంత్రులతో వయోలిన్ వాయించేవాడు .దీన్ని గురువు బిడారం అంగీకరించక ఎందుకుఈ ప్రయోగం అనిఅడిగితే బాగా వెనక ఉన్నవాళ్లకూ  స్పష్టంగా వినబడటానికే అన్నాడు .వీణ శేషన్న దీన్ని అంగీకరించగా చివరికి గురువుకూడా సంతోషం తో ఒప్పుకున్నాడు .లెక్కలేనంతమంది శిష్యులను చౌడయ్య తయారు చేశాడు .సంగీత కళానిధి సంగీత శిఖామణి బిరుదులు పొందాడు 19-1-1967 నమహా వాయులీన విద్వా0సుడు   చౌడయ్య మరణించాడు . చౌడయ్య సంస్కృత తెలుగు కన్నడాలలో కృతులు రచించాడు అందులో ప్రసిద్ధమైనవి-కాంభోజి రాగం లో ‘’శ్రీ వేణుగోపాల ,’’   ధన్యాసి రాగం లో ‘’దేవి పూర్ణ మంగళ ‘’చెప్పుకోదగ్గ కృతులు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

T Chowdiah.jpg

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి .రామారావు

నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి .రామారావు

రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375

ఇంతింతై ఎదిగిన యశస్వి ఎస్వి

కృష్ణా జిల్లా గుడివాడ లో వడ్రంగం లో అద్భుతాలు సృష్టించిన శ్రీ శిరందాసు గంగయ్య ,శ్రీమతి లక్ష్మమ్మ దంపతుల కు 1936 లో శ్రీ రామారావు.జన్మించారు .చిన్నతనం నుండే బొమ్మలు వేస్తూ ,తొలిగురువు   శ్రీ.కే వేణుగోపాల్ గారి  గురుత్వం లో13 వ ఏడు వరకు  బాగా రాణించారు  .  గుడివాడ ఎ.యెన్ ఆర్ కాలేజీ లో ఇంగ్లీష్ బోధించిన వైస్ ప్రిన్సిపాల్ శ్రీ యడవల్లి సన్యాసి రావు గార౦టే ఎస్వి గారికి వీరాభిమానం .ఎకనామిక్స్ ,కామర్స్ లలో డబుల్ గ్రాడ్యుయేట్ అయి ,1955 నాటికే  ఆర్ట్ లో 4 డిప్లమాలు సాధించారు .తండ్రిగారే ఆయన కు స్పూర్తి ప్రదాత .మద్రాస్ వెళ్లి ప్రముఖ చిత్రదర్శకుడు, కదా రచయితా, స్నేహితుడు మాధవ పెద్ది గోఖలే సలహా పై మద్రాస్ ఆర్ట్ కాలేజ్ లో చేరారు . ప్రిన్సిపాల్ శ్రీ దేవీ ప్రసాద్ రాయ్ చౌదరిని తన కళా ప్రదర్శనతో మెప్పించి 6ఏళ్ళ కోర్సు గా ఉన్నదానిలో సరాసరి 3 సంవత్సరం కోర్స్ లో  చేరారు ..ఫణిక్కర్ ,ధనపాల్, రాం గోపాల్ సంతాన రాజ్ ,మునిస్వామి వంటి ప్రముఖుల చిత్రాలు పరిశీలిస్తూ ఎంతో నేర్చారు. 1960 లో డ్రాయింగ్ లో డిప్లొమా పొందారు. భారత ప్రభుత్వ స్కాలర్ షిప్ వరుసగా మూడేళ్ళు  పొందారు  .కామన్వెల్త్ ఫెలోషిప్ కు భారత దేశం మొత్తం మీద 315మంది పోటీ పడితే ,రామారావు ఒక్కరే ఎంపికైన ఏకైక వ్యక్తిగారికార్డ్ సృష్టించారు .అప్పుడు ఆయన  వయసు కేవలం 23 మాత్రమే.

కళా నిష్ణాత  -శైలీ నిర్మాత

1962 లో  లండన్ వెళ్లి అత్యున్నత ప్రమాణాలకు నిలయమైన’’  స్స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్’’ లో చేరి, సర్ విలియం కోల్డ్ స్ట్రీం ,విలియం రోజర్స్ ,బెర్నార్డ్ కోహెన్ వంటి లబ్ధ  ప్రతిష్టులవద్ద కళా విద్యా రహస్యాలు గ్రహించారు.ఆయన చిత్రాలు ప్రచురించని ప్రసిద్ధ పత్రిక ఉండేదికాదు .తన చిత్రాలపై ‘’ఆర్య దేవ’’అని సంతకం చేసేవారు .‘’అక్కడ ఈయన గీసినచిత్రాన్ని ప్రిన్సిపాల్ ఇండియాలో గొప్ప ఆర్ట్ క్రిటిక్ శ్రీ రామన్ కు ఎస్వి పేరుకనిపించకుండా చేసి ‘’ఇది ఎవరు గీసింది ?’’అని అడిగితే‘’పికాసో ‘.అని చెబితే ‘’కాదు –మీ దేశ చిత్రకారుడు ఎస్వి రామారావు చిత్రించినది ‘’అని చెప్పగానే  ఆశ్చర్య పోయాడు రామన్.సమకాలీనుడైన పికాసో తో పోటీపడాలని భావించి  బోర్డ్ మీదనే ఆసియా కళ ఆధారంగా బొమ్మలు వేస్తూ ,తనదైన స్వంత శైలికోసం తపిస్తూ ,మ్యూజియం లో బొమ్మల్ని చూస్తూ లైబ్రరీలలో అధ్యయనం చేస్తూ, ప్రపంచ చిత్ర కళా రీతులను అవగాహన చేసుకొన్నారు .వివిధ దేశాల చిత్రకళా రీతులనుండి తనకు కావలసిన అంశాలు ఎన్నుకొని తనదైన చిత్ర ప్రవాహాన్ని సృష్టించుకొన్నారు .ఆఫ్రికా జానపదుల మాస్క్ లనుండి పికాసో ముడి సరుకు తీసుకొన్నట్లు ,రామారావు గారు మొఘల్ ,రాజపుట్  కళ నుంచి అలంకరణ రీతిని ,జపాన్ చిత్రకళ నుండి రేఖలను తీసుకొని వాటి మేళ వింపు తో  చిత్రాలు గీశారు. రామారావు గారి చిత్రకళపై వ్యాఖ్యానిస్తూ’ ఇలస్ట్రే టెడ్ వీక్లీఆఫ్ ఇండియా ‘’ ‘’సంపాదకుడు శ్రీ ఏ.ఎస్.రామన్’’For as artist ,in his style ,idiom and technique Rama Rao is as Western as any of his Western counterparts ,in spite of his passion for basic Indian values ‘’అన్నాడు .

 

1966 లో’’ మోస్ట్ అవుట్ స్టాండింగ్  లితోగ్రాఫర్ ‘’’’గా గుర్తింపు పొందారు.  1965 కు కోర్సు పూర్తి చేసి ‘’వర్ణ చిత్ర రచనలో నూతన  శైలీనిర్మాత  ‘’ ఇన్వెంటర్  ఆఫ్ స్టైల్ ఇన్ ఆయిల్ పెయింటింగ్ ‘’అని కీర్తి పొందారు .’1965లోవిఖ్యాతమైన ‘’ లార్డ్ క్రాఫ్ట్స్ అవార్డ్ ‘’అందుకొన్నారు  .

పికాసో  సరసన

కామన్ వెల్త్ ఆర్ట్ ఎక్సి బిషన్ లో చిత్ర ప్రదర్శన నిర్వహిస్తూ ,లండన్ కౌంటి కౌన్సిల్ లో పెయింటింగ్ డ్రాయింగ్ లను 1965నుండి  -69 వరకు బోధించారు  .

లండన్ లోని ‘’న్యు విజన్ సెంటర్ గాలరీ వారు ‘’ఆల్ఫబెట్ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ‘’పై నిర్వహించిన ఎక్సి బిషన్ లో శ్రీ రామారావు పాల్గొన్నారు.  ఆనాటి ప్రముఖ ఆర్టిస్ట్ లైన పాబ్లో పికాసో,బ్రాక్ ,మీరో, డాలి, మాక్స్ ఎర్నెస్ట్ జాక్సన్ పొలాక్ వంటి హేమా హేమీ ఆర్టిస్ట్ లచిత్రాల సరసన రామారావు గారి చిత్రాలు చోటు చేసుకొన్నాయి అంటే అద్భుతః అనిపిస్తుంది . . . ఆసియా మొత్తం మీద ఎస్వి ఒక్కరికే ఈ అరుదైన అవకాశ౦ లభించటం ఆయన ప్రతిభకు తగిన పురస్కారం . లండన్ లో జరిగిన .ప్రతిష్టాత్మకమైన ‘’బ్రిటిష్ ఇంటర్నేషనల్ ప్రింట్ బైన్నియల్ ‘’ప్రదర్శనకు పికాసో చిత్రాలతో పాటు ఇండియన్ పికాసో ఎస్వి గారి చిత్రాలు కూడా ఎంపికయ్యాయి .ఇది తన అదృష్టం అని వినయంగా చెప్పారు ఎస్వి .ఈ  ఎంపిక ను చిత్రకారులు నోబెల్ బహుమతి తో సమానంగా భావిస్తారని రామారావు గారు అన్నారు  .ఎన్నో దేశాలలో తన చిత్రాలను ప్రదర్శించారు .అధిక ధరలకు అవి అమ్ముడయ్యాయి .

కళా బోధన- పద్మశ్రీ పురస్కార౦

 

శ్రీ ఎస్వి 1969 లో అమెరికా వెళ్లి టఫ్త్స్ ,బోస్టన్ ,సిన్సినాటి, వెస్ట్ కెంటకి  యూని వర్సిటీలలో1978  వరకు బోధించారు   డాక్టర్ శ్రీమతి  సుగుణ  గారిని వివాహమాడి  చికాగోలో ఉంటున్నారు  .వీరి కుమార్తె శ్రీమతి పద్మావతి  భరత నాట్యం లో గొప్ప నర్తకీమణి   అల్లుడు డా హర్షవారధి  .

రామారావు గారికి 2001 లో బారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని  నాటి రాష్ట్ర పతి శ్రీ కె ఆర్ నారాయణగారి చేతులమీదుగా  ప్రదానం చేసింది .పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ,గౌరవ డాక్టరేట్ అంద జేసింది.

.   తిరుపతి లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల లో రాష్ట్రపతి శ్రీప్రణబ్ ముఖర్జీ గారి చేత సత్కార సన్మానాలు అందుకొన్నారు. అమెరికాలోని నార్త్ టెక్సాస్ తెలుగు సంస్థ మొదలైన ప్రసిధ సంస్థలచేత సత్కారం పొందారు  . శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డలో ఏర్పాటు చేసిన నేతాజీ శత జయంతికి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన ప్రపంచ సభలకు హాజరై సన్మానాలు అందుకొన్నారు .

రామారావు గారి కి తెలుగు సాహిత్య  కళా రంగాలలో  లబ్ధ ప్రతిస్టుల౦దరి తోను గాఢమైన పరిచయం ఉంది ..ఆయన ఏనాడూ మూలాలను విస్మరించలేదు. శ్రీ ఆచంట జానకిరాం ,శ్రీ కొడవటి గంటి కుటుంబరావు ,శ్రీమతి కె రామ లక్ష్మి ,శ్రీ సొంఠి సదాపూర్ణ ,శ్రీ శివలెంక శంభు ప్రసాద్  శ్రీ వాకాటి పాండురంగారావు వంటి దిగ్గజాలతో ఆయనకున్నఆత్మీయత మరువ లేనిది .వీరంతాఎస్విగారి  సృజనశీలతను బహుధాప్రశంసించినవారే .ఆంద్రపత్రిక, భారతి,లసంపాదకులు శ్రీశివలెంకశంభుప్రసాద్ గారికోరికపైశ్రీరామారావుకళారహస్యాలపైప్రత్యేకమైనవిశ్లేషణాత్మకవ్యాసాలు భారతికి ,రాసి,తెలియనిఎన్నోవిషయాలను లోకానికిఎరుకపరచారు .వీటినిచదివిఅబ్బురపడినఅమెరికాలోబెర్కిలీలోని కాలి ఫోర్నియా యూనివర్సిటిఇంగ్లీష్ ప్రొఫెసర్ వీటిలో ముఖ్యమైన వాటినిఇంగ్లీష్ లోకి అనువాదంచేసిరామారాగారి భావాలకువిశ్వవ్యాప్తికలిగించారు.

మూర్తీభవించిన మానవీయత

ప్రపంచ ప్రఖ్యాతచిత్రకారులైన శ్రీ రామారావుగారు వ్యక్తిగాఅతిసున్నిత మనస్కులు .ఎవరికి యే బాధా,ఆపదా కలిగినా తనది గానే భావించి, వెంటనే స్పందించి,స్నేహహస్తంచాఛి,ఆదుకొనే సహృదయత ఉన్నసంస్కారంవారి విశిష్టలక్షణం .మానవతమూర్తీభవించిన ఉత్తమ కళాకారులాయన .1977 కృష్ణా జిల్లా దివిసీమనుఅల్లకల్లోలంచేసిన ఉప్పెన విషయం తెలిసి,ఇక్కడిబాధితులనుఆదుకోవటానికి అమెరికాలోతెలిసినవారందరివద్దస్వచ్చందంగావిరాళాలుసేకరించి పంపించినమానవతామూర్తిశ్రీ రామా రావు  ‘ఆనేక కవితలుఆంగ్లం లోను తెలుగు లోను  రాసి పుస్తకాలుగా తెచ్చారు ఎస్వి .

నైరూప్య చిత్రకళా యశస్వి

రామారావు గారి నైరూప్య చిత్రాల ప్రత్యేకత గురించి తెలుసుకొనే ముందు అసలు నైరూప్య చిత్రాలు అంటే ఏమిటో తెలియాలి .’’ఆకారాలలో కనిపించేది అబద్ధం, అశాశ్వతం కనుక వస్తు రూపమే మిధ్య ‘’అనే భావన కిందటి శతాబ్దం మధ్యలో పుట్టి అదే ఒక రూపం గా ఎదిగింది .ఈ భావన మొదట చిత్రకళలో ,తర్వాత శిల్పం,సంగీత ,సాహిత్యాలలో ప్రవేశించి  విలక్షణమైన భావోద్రేకాలను ప్రకటించే విధానంగా రూపొందింది .సహజ రూపాన్ని వదిలేసి ,అందులోని ప్రాధమిక రూపాన్ని విశ్లేషించే బొమ్మలు గీసే విధానమే నైరూప్య చిత్రకళ.అంటే చిత్రకళలో ఒక విలక్షణ ప్రక్రియ నైరూప్య చిత్రకళ.వాస్తవాన్ని వదిలిపెట్టి కళ లోని ఊహల వర్ణనలను సూచిస్తు౦దన్నమాట .మనకు వచ్చే కలలలో నైరూప్య చిత్రాలు అంటే ఆబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ ఉంటాయి .ఆ కలల స్వభావాన్నీ ,వాటికీ నిజ జీవితానికీ ఉన్న సంబంధాన్ని మనం అన్వయించుకొంటాం . ఈ చిత్రాల్లో మనకు పరిచయమున్న రూపాలేవీ కనిపించవు .అంతా రేఖల ,రంగుల ఇంద్రజాలంగా అనిపిస్తుంది .ఇందులో ప్రసిద్ధుడైన వాడు ఫ్రెంచ్ చిత్రకారుడు పాబ్లో పికాసో .ఎస్వి రామారావు గారు ఈ నైరూప్య చిత్ర కళలో కొత్త శైలిని అలవరుచుకొని ‘’ఇండియన్ పికాసో ‘’గా విఖ్యాతులయ్యారు .

. డాక్టర్ రామారావు చిత్ర లేఖన ప్రతిభ క్రమంగా స్వీయ వ్యక్తిత్వాన్నిఏర్పరచుకొని ,ఎన్నో దశల ప్రయోగాలు దాటి నైరూప్య –ఆబ్స్ట్రాక్ట్ చిత్రకళా రూపం లో పతాక సదృశ౦ గా నిలిచింది .కవి ,రచయిత విమర్శకులు అయిన రామారావు బహుముఖ ప్రజ్న అనితర సాధ్యమని పిస్తుంది ‘’అన్నారు డా సి నారాయణ రెడ్డి గారు .ఆధునిక చిత్రకళా ప్రపంచం లో  ఫ్రెంచ్ చిత్రకారుడు పాబ్లో పికాసో ధ్రువతార .ఇవాళ ఎస్వి గారిచిత్రకళా విశ్వరూపాన్ని దర్శించిన వారు ఆయనను  ‘’ఇండియన్  పికాసో ‘’ అంటారు .కాని ఆయనమాత్రం ‘’నేనుపికాసో కు వీర అభిమానిని .ఆయనే నాకు మార్గ దర్శి ’అని సగర్వంగా చెప్పుకున్నారు .అది ఆయన సంస్కారానికి  నిదర్శనం .’

నేటి నవ్య కళ ఎన్నో యుగాలకిందటి నీగ్రో మూర్తి కళలో కన్పిస్తుంది .ఈనీగ్రో మూర్తికళ నుంచే ‘’ఫాదర్ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ‘’అనిపిలువబడే పికాసో స్పూర్తి పొందాడు.సహజ రూప చిత్రణ కంటే అసహజ రూప చిత్రణకు ప్రతిభను పదునుపెట్టి నవ్య చిత్రకళా నిష్ణాతు డైనారుశ్రీ రామా రావు . నవ్య చిత్రకళ విశ్వజనీనమై తైల వర్ణ చిత్రాలలో ఒదిగి పోయింది .ఇందులో రూపం కంటే రంగుకే ప్రాధాన్యం ఎక్కువ .రంగుల ఇంద్రజాలందీని విలక్షణత్వం అన్నారు సంజీవ దేవ్ ..

క్యూబిజం ఇంప్రెషనిజం ఎక్స్ప్రెష నిజం సర్రియలిజం లోనూ అనేక ప్రయోగాలు చేసి ఎస్వి ,చిత్రాలలో మంచి టెక్చర్ అంటే స్పర్శి౦చదగిన పైభాగం సృష్టించటం లో మహా నిష్ణాతులయ్యారు .తాను మనో చక్షువులతో చూసే రూపాన్ని చర్మ చక్షువులకు అందించే నేర్పు అద్వితీయం .స్వయంగా చిత్రకళా మర్మజ్ఞులు  కూడా  అయినందున , కళావిమర్శకులకు అందని లోతులు ఆయన అందుకోగలిగారు  . ’సామాన్యంగా నైరూప్య చిత్రాలు ఏదో ఒక వ్యక్తికో వస్తువుకో, స్థలానికో చెంది ఉండవు .కాని ఎస్విగారి నైరూప్య చిత్రాలు విషయాలకు సంబంధించినవిగా ఉంటాయి . ‘’లండన్ లో మొదటి చిత్ర ప్రదర్శనకు’’ కృష్ణానది’’ని వస్తువుగా తీసుకొని ‘’ఆప్టికల్ ఇల్యూజన్ తో ధారావాహిక చిత్రాలు గీసి అద్భుతం అనిపించారు . కృష్ణానది మనకు తెలిసినా ఆయన చిత్రించిన కృష్ణానది మనకు తెలియదు .అంటే ఆనదీ ప్రవాహం ,ఒడ్డు, కెరటాలు ,వేగం వంటి స్థూల రూపాలు కాకుండా, సూక్ష్మ రూపం,  దాని నైరూప్య రూపాన్ని చిత్రిస్తారన్నమాట.ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి వారు దీనిపై కవిత్వం రాశారు . ‘’లేపాక్షి, ఉషోదయం చిత్రాలూ పెద్ద పేరు తెచ్చుకోన్నాయి .

’   తర్వాత పూర్తిగా అమెరికాలో స్థిరపడి ప్రయోగ శీలతతో తైల, నీటి రంగుల చిత్రాలలో కోమలత్వ,మార్దవత్వాలేకాకవిశిష్టమైన వర్ణ సంగీతాన్ని సృష్టించారు .నీటి రంగుల్లో మాత్రచే కనిపించే పార దర్శక వాష్ పద్ధతిని ,ఆయిల్ పెయింటిం గ్  లో తెచ్చి అబ్బురపరచారు .పేలట్ నైఫ్ కాని ,  కుంచె కాని వాడకపోవటం  ఎస్విగారి మరో ప్రత్యేకత .వీటిబదులు గుడ్డ పీలికలతో రంగులు పట్టిస్తారాయాన .దీనివలన  పాలరాతి నునుపుదనం రావటమేకాక మేఘాల తెరలలాంటి  వాయు నీయత ప్రత్యక్ష మౌతుంది అన్నారు సంజీవ దేవ్ .‘’భారతీయ దృశ్య కవితా సారాన్ని 20 వశతాబ్దపు నైరూప్య చిత్రాలలో చూపటం పై దృష్టిపెట్టారు .ఇది విలక్షణ కృషి . .ప్రాక్ పశ్చిమాలకు ఒక దృఢమైన సేతువు అయ్యారు రామారావు . ఆయన చిత్రం ‘’వసంత ఋతువు ‘’లో అమెరికాలోని ప్రాణస్పందన ,ఉల్లాసం ,మధుర రసానందం, నైసర్గిక శోభ అన్నీ కూడా ఆధునిక నైరూప్య వాయునీయ వర్ణాలలో ప్రదర్శితమౌతుంది. ‘’ఉషోదయం ‘’చిత్రం లో ఉష్ణ వర్ణాలతో చిత్రింప బడి ,వెచ్చని పశ్చిమ పవనాలతో మృదువర్ణ లయతో తాండవించే చెట్లూ కొండలు పూత పూస్తున్నట్లు ఉంటాయి.

 

శ్రీ ఎ .కృష్ణా రెడ్డి, శ్రీ  ఎస్వి రామారావు లు ఇద్దరే ఇద్దరు తెలుగు  చిత్రకారులు ఇతర దేశాలలో స్థిరపడ్డ వారు . .ఇండియాలో ఉండగానే ఎస్వి చిత్రకళ వాస్తవంనుండి కల్పనకు ఎదిగి పాశ్చాత్య దేశాలలో నైరూప్యానికి విస్త రించింది. వర్ణ చిత్రకారు లైన శ్రీ రామారావు వర్ణ వ్యతిరేకతలనూ వర్ణాల ఐక్యతనూ సమతూకంగా చిత్రించారు . ఆయనది అమెరికన్ నైరూప్యాకలకు అనుకరణకాదు’’ప్రాచ్య రీతులున్న నైరూప్య కళ ‘’అన్నారు విశ్లేషకులు. తెలిసిన రూపాన్ని తెలియని రూపాల లో చిత్రి౦చటమే రామారావు గారి కళాసృస్టి’’అన్నారు చిత్రకళలో పండిపోయినశ్రీ సంజీవ దేవ్ .

 

.శ్రీ రామారావు గారిని ‘’ An important color-based non-figurative artist.అంటారు

’కుండలిని మేలు కొలుపు ,సాగర మధనం, ఎర్ర మట్టిలో నదీ ప్రవాహం, వెన్నెలలో నది ,నల్లడవిలో నీలి నది వంటి చిత్రాలలో రంగులు మహావేగం గా ప్రవహించేట్లు చేశారు .ఆయన చిత్రాలను ‘’పొయేమ్స్ ఇన్ పిగ్ మెంట్స్ అంటే వర్ణ ద్రవ్య కవిత్వం ‘’అంటారు. పంచ భూతాలలో నీరు, గాలి ,అగ్ని అనే మూడింటిని చక్కగా ఉపయోగించుకొన్నారు శ్రీ రామారావు.నీరు  ఆవిరై మేఘాలను చేరి కుంభ వృష్టి కి కారణ మౌతుందని ,తానెప్పుడూ తెలుపు రంగును ఉపయో గించ నేలేదని, అదే తన పేపర్ నియంత్రణకు కారణమయిందని నలుపు రంగు ఉపయోగించటమూ చాలా కష్టమే నని, కాని మిగిలినరంగులకు డెప్త్ ను ఇవ్వటానికే వాడతానని, పెర్షియన్ బ్లూ  ,క్రి౦సన్  లేక్ రంగులు వాడి సూర్యాస్తమయ సమయం లో బంగారు మేఘాల ను సృష్టిస్తానని వివరించారు. రెండవదైన గాలిని గూర్చి చెబుతూ మనచుట్టూ ఉండి ఉచ్చ్వాస నిశ్వాసాలకు కారణమైన గాలి , అదే ప్రళయ  జంఝ గా ,ప్రశాంతమలయానిలం గా ఉండే  రీతిని వర్ణిం చానని చెప్పారు మూడవదైన అగ్ని హిందూ పురాణాలకు సంబంధించినదని ,పృద్విని రక్షించే ఎనిమిది మూలకాలలో అతి ముఖ్యమైనదని ,అది శాశ్వతత్వానికి, తాత్కాలికానికి చిహ్నంగా తన చిత్రాలలో జ్వాలలుగా కనిపిస్తుందన్నారు.

భారతీయతకై ఆరాటం

ఇంతగా ప్రపంచ ప్రసిద్ధి పొందినా, తనను భారతీయులు మనస్పూర్తిగా ఆదరించ లేదని భావించి గత కొన్నేళ్లుగా ఢిల్లీ లో ఉంటూ, స్వదేశీయులకోసం 80 చిత్రాలు గీశానని ,మరో 20 పెయి౦టింగ్ లు వేస్తానని ఎస్వి అన్నారు .ఇప్పుడు తన చిత్రాలు భారతీయ స్పిరిట్ ప్రకారం కొత్త రూపాన్ని దాల్చాయని అంటారు .ఆర్ట్ లోని ప్రక్రియలు తెలియని వాళ్ళనూ ఆకర్షించేలా ప్రతిదీ వైవిధ్యంగా రూపొందించారు . ‘’నేచర్స్ ఆబ్ స్ట్రాక్ట్ గ్లోరీ ‘’పేరిట ఢిల్లీ లో దూమిమల్ ఆర్ట్ గాలరీలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసి ఆకట్టు కొన్నారు .   భారతమాజీ  రాష్ట్ర పతి,  భారత రత్న డా ఎ.పి.జె ‘అబ్దుల్  కలాం గారు ఎస్వి గారి ‘’సోలో ఎక్సిబిషన్ ప్రారంభించారు .ఈసందర్భంగా డా కలాం తమ తదుపరి రచన ముఖ చిత్రం పై శ్రీ ఎస్వి రామారావు గారి పెయింటింగ్ ను ముద్రి౦చుకొంటానని సగర్వంగా తెలియజేశారు.నిరంతర ప్రయోగ శీలి అన్వేషకులు పద్మశ్రీ ఎస్ వి.రామారావు గారి కళ  .భారతీయులకు ,భారతీయతకు  దగ్గరవ్వాలన్న వారి ఆకాంక్ష నెర వేరు తున్నందుకు అందరం సంతోషం తో అభినందిద్దాం .

గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-16 –ఉయ్యూరు –9989066375

2-405  శివాలయం వీధి –ఉయ్యూరు -5 21165

విశ్వ విఖ్యాత నైరుప్య చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ రామారావుకు -2-9-16 న ఉయ్యూరులో ఘన సత్కారం

-నేటి విద్యార్ధులు చదువుతోపాటు కళలపట్ల మక్కువ చూపాలని, నైరుప్యంగా ఎదగాలని విశ్వ విఖ్యాత చిత్ర కళాయశస్వీ పద్మశ్రీ ఎస్వీ రామారావు అన్నారు. గురువారం నాడు సరసభారతి మరియు శ్రీశ్రీనివాస విద్యాసంస్థల సంయుక్త అధ్వర్యంలో నిర్వహించిన సత్కర సభలో రామారావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నాటి భారతీయులైన రవీంద్రనాథ్, హరగోవింద్ ఖురానా , రాధాకృష్ణ, చంద్రశేఖర్లకు నోబుల్ అందినాయని నేటి యువత దానిని అందిపుచ్చుకోవడంలో వెనుకంజలో ఉన్నారని తెలిపారు. విద్యార్ధులు తమ సమయాన్ని గ్రంధలయలల్లో ఎక్కవ సేపు గడిపితే జీవితం తెలుస్తుందని, కానీ యువత ఉద్యోగాలకోసం ఉపయోగపడే విద్యనే అభ్యసిస్తున్నరన్నారు.

సభలో శాసన మండలి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి పెద్దలను చూసి

 

యువత కళల పట్ల అధ్యయనం చేయాలనీ, చదువుతో పాటు విద్యార్ధులకు కళలను విద్యాసంస్థలు ప్రోత్సాహం అందించాలని సూచించారు.

రియో ఒలింపిక్స్ లో  రజిత,కా0 స్య పతకాలు సాధించిన సింధు, సాక్షిలను ఆదర్శంగా తీసుకోవాలని, అలాంటి  క్రీడలు, కళలు జోలికి నేటి విద్యార్ధులు ఆసక్తి కనబరచడం లేదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రామారావు లాంటి చిత్రకారులు మన కృష్ణాజిల్లా, రాష్ట్రానికి దేశానికి తమ చిత్రలేఖనం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం గొప్ప విషయమని అన్నారు. అనతరం పద్మశ్రీ రామరావుని శాసనమండలి సభ్యులు రాజేంద్రప్రసాద్, సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీ శ్రీనివాస విద్యాసంస్థల చైర్మన్ పరుచూరి శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన రావు. ఎం పి టి సి ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసరనేని మురళి ఘనంగా సత్కరించారు

DSCN1891DSCN1892DSCN1852

DSCN1855
DSCN1866
DSCN1869
DSCN1877
 DSCN1879
DSCN1880
DSCN1881DSCN1890
DSCN1889

అమెరికాలో ఉంటూ ఉయ్యూరు ,సరసభారతి పట్ల విశేష అభిమానం కల శ్రీ మైనేని గోపాలకృష్ణగారు నగదు కానుక గా పంపిన 11 ,116 రూపాయలు సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్ పద్మశ్రీ శ్రీ ఎస్వీ రామారావు గారికి సభా ముఖంగా అందజేశారు .

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు )

వీక్లీ అమెరికా -21(14-8-17 నుండి 20-8-17 వరకు )

           భజనవారం 

14-8-17 -సోమవారం -”-సంసారం లో రిగమనిస”సరదా హాస్య ఆర్టికల్ రాశా .నాని నటించి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం తో వచ్చిన ”జెంటిల్మన్ ”సినిమా ”గొట్టం ”లో చూశా .మంచి సస్పెన్స్ తో నాని నటనా వైదుష్యంతో చక్కని హమ్మింగ్ పాటలతో కొడైకెనాల్ బాక్ డ్రాప్ గా సినిమా కనుల పండువుగా ఉంది ..
15-8-17   మంగళవారం -శ్రీ కృష్ణాష్టమి –
ఉదయమే మా శ్రీమతి ముగ్గుతో వాకిలి నుంచి ఇంట్లోకి బాల కృష్ణుని పాదాలు వేసి కన్నయ్యకు ఆహ్వానం పలికింది .నేను మా మూలు సంధ్యావందనం చేసి తర్వాత మంగళవారం కనుక శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి అష్టోత్తర సహస్ర నామ పూజ ,కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణా అష్టోత్తర ,విష్ణు సహస్ర నామ పూజ చేశా .కృష్ణాష్టమి సందర్భంగా వైష్ణవాలయాలలో ప్రసాదంగా పెట్టె ”కట్టెకారం ”మా ఆవిడ చేయగా దానితోపాటు అటుకులు బెల్లం పాలు పెరుగు నెయ్యి వెన్న పండ్లతో సహా నైవేద్యం పెట్టాము .  తర్వాత కృష్ణలీలలు శ్రీకృష్ణ కర్ణామృతం జయదేవుని అష్టపదులు  జానకి పాడిన కస్తూరిరంగా పాటలూ  సుబ్బులక్ష్మి విష్ణు సహస్రనామ స్తోత్రం సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు మాడుగులచదివిన పోతన  భాగవత0   వగైరా వింటూ సాయంకాలం దాకా కాలక్షేపం చేశాను
           సాయం భజన
 సాయంకాలం7 గంటలకు  మా అమ్మాయి ఇంట్లో సాయి సెంటర్ వాళ్ళను ఆహ్వానించి భజన ఏర్పాటు చేసింది .శ్రీమతి గోసుకోండ అరుణ ఇంట్లోని పెద్ద శ్రీ కృష్ణ విగ్రహాన్ని వాళ్ళఅబ్బాయి తెచ్చాడు .దాన్నీ అలంకరించి సిద్ధం గా ఉన్నాం .దేవుళ్ళ అలంకారం మా అమ్మాయి బాగా చేసింది . ఇంట్లో ఉన్న డబుల్ స్పీఎకర్ లతో నాలుగు మైకుల ఏర్పాటు మా మనవళ్లు శ్రీకేత్ అశుతోష్ పీయూష్ లు సిద్ధం చేశారు .   అకస్మాత్తుగా సాయ0కాలం  6-30 నుంచి  పెద్ద వర్షం పడింది .అప్పటికే సాయి సెంటర్ హెడ్  సుబ్బు వచ్చేశారు . మిగిలినవాళ్లు వస్తారా రాగలరా అను కొంటుంటే ఉరుములు మెరుపులు వచ్చి వర్షం అంతే  సడన్ గా 6-50 కి ఆగిపోయింది . హమ్మయ్య అనుకొన్నాం .సరిగ్గా 6-55 కు  సాయి సెంటర్ నిర్వాహకురాలు శ్రీమతి జయ రాగా ఖచ్చితంగా 7 గంటలకు సుబ్బు జయ మా అమ్మాయి విజ్జి భజన ప్రారంభించారు .. ఆ తర్వాత అందరూ వచ్చేశారు దాదాపు 75 మంది .అందరూ ఏకకంఠంగా భజనలు చేశారు శ్రీ కృష్ణ భజనలు ఎక్కువగా చేశారు చిన్నపిల్లలూ చాలా శ్రావ్యంగా పాడారు మంచి నిండుదనం వచ్చింది .ఖచ్చితంగా రాత్రి 8 గంటలకు భజన ఆపేశారు . తర్వాత జయ రెండు నిమిషాలు మాట్లాడాక  మా అమ్మాయి నన్ను మాట్లాడమంటే కృష్ణాష్టమి ,భారత స్వాతంత్య్ర దినోత్సవ ప్రాధాన్యం పై 9 నిమిషాలు మాట్లాడాను .అందరూ తెలుగు తెలియని తమిళ కన్నడిగులు కూడా బాగుందని అన్నారు . ఇంకా ఒకఅరగంట మాట్లాడితే బాగుండు నన్నారు.  అది సమయం కాదు అంతా” ఫుడ్ కోర్ట్ లో చేతికీ  మూతికీ బాటింగ్ హడావిడి ”లో ఉన్నారన్నాను .కాదు భోజనాలయ్యాక మాట్లాడాలి అన్నారు సరే అన్నా.  భోజనం లో  పూరీ ,బంగాళాదుంపకూర ,మామూలు ఇడ్లీ రాగి రవ్వ ఇడ్లీ ,సాంబారు గోంగూర పచ్చడి ,అటుకులపులిహోర ,చట్నీ  జున్ను ,ఫ్రూట్ సలాడ్ ,ఫ్రూట్ జ్యుస్ ,అన్నం ,పెరుగు ,పెరుగన్నం  పుచ్చకాయ ముక్కలు చక్రపొంగలి   , వగైరాలతో కమ్మని భోజనం .
  భోజనాలు అయ్యాక ఒక పది మంది నేను మాట్లాడాలని కోరగా హాలులో కూర్చునిరాత్రి 9-30కు మొదలుపెట్టి  సుమారు 20 నిమిషాలు బ్రహ్మ వైవర్త పురాణం లోని  గోలోకం విశేషాల ,మరికొన్ని విషయాలు మాట్లాడాను చాలా శ్రద్ధగా విన్నారు మా అమ్మాయి రాధ లక్ష్మి ,ఉషా ,సురేఖా  నీలిమ , పవన్ ,,రాంకీ అవధాని  జగదీశ్ మొదలైనవారు . అభి రుచి ఉన్నవారికి నాకు  తెలిసినవి  నాలుగు ముక్కలు చెప్పటం లో నాకు ఆనందం అలాగే అందరూ ఆనందాన్ని సంతృప్తిని   పొందారు .రాంకీ  ఉషా విజ్జి వీడియో తీసి లైవ్ గా మా వాళ్లకు పంపారు  .అంతా  అయ్యేసరికి రాత్రి 10 అయింది .అప్పుడు ఇళ్లకు బయల్దేరి వెళ్లారు . మంచికార్యక్రమం అనుకోకుండా జరిగింది . వర్షం హర్షం ఆనందం పంచింది .
  బుధవారం -నిన్నటి విశేషాలన్నీ ”కృష్ణం  వందే  జగద్గురుమ్”గా రాశాను  . రాజ్ తరుణ్ సినిమా ”ఉయ్యాల ;జంపాల ”యు ట్యూబ్ లో చూశా .కొత్తకుర్రాడు  చాలా  ఫ్రెష్  గా ఈజీగా చేశాడు అనిపించింది చక్కని గోదావరి పల్లెటూరు కూనవరం బాక్ గ్రౌండ్ గా తీసిన చిత్రం ప్రకృతి అందాలన్నీ ఒడిసిపట్టి చూపించాడు . దర్శకుడు .సంగీతం వీనులవిందు ఫోటోగ్రఫీ నయనానందకరం ..
17-8-17 గురువారం -మా అన్నయ్యగారి మనవడు చి కళ్యాణ్ ఛిసౌ మీనా ల  వివాహం ఈ రోజు ఉయ్యూరులో  ఉదయం 9 గంటలకు జరిగింది . మా బంధువులందరూ వచ్చారట .గ్రాండ్ గా జరిగిందని రమణ ఫోన్ చేసి చెప్పాడు . .మా మేనల్లుడు అశోక్ ,మేనకోడలు  పద్మ మా అబ్బాయి శాస్త్రి ,మనవడు భువన్  తమ్ముడు మోహన్ భార్య సునీత  మా అన్నయ్య మనవడు రవి ,హైదరాబాద్ నుంచి ,మా పెద్ద మేనకోడలు కళ , భర్త చంద్రశేఖర్ ,కొడుకు బాలాజీ ,మేనల్లుడు శ్రీనివాస్ ద0పతులు చెన్నై నుంచి,  గరివిడినుంచి మా అన్నయ్య కూతురు వేదవల్లి భర్త రామకృష్ణ మొదలైన బంధుగణం హాజరై దగ్గరుండి వివాహం జరిపించారు .
శుక్రవారం -”ట్యూబ్ లో శాతకర్ణి హిందీ సినిమా చూసి ఆనందించా .
శనివారం -త్రిపురనేని గోపీ చ0ద్ దర్శకత్వం లో ఘంటసాల సంగీతం తో ,కృష్ణవేణీ నారాయణరావు నాయికా నాయకులుగా శోభనాచల వారి  శ్రీ లక్ష్మమ్మ చూశాము గోపీచంద్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే నీట్ గా ఉన్నాయి .   . తర్వాత కృష్ణవేణి గారి ఇంటర్వ్యూ కూడా చూశాను . ఎందరెందరినో చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణీ భర్త మీర్జాపురం రాజా వారిది .నూజివీడు రైల్వే స్టేషన్ పేరు మీర్జాపురంఅని ఉండేది చాలాకాలం .
గీర్వాణం -3 లో 415 వరకు రాశా .
 మా అమ్మాయి తో సహా ఇక్కడి  సాయి సెంటర్ వాళ్ళు గ్రీన్స్ బరో లో నిర్వహించిన ఒక రోజు వాలంటరి  టీచర్స్ ప్రోగ్రామ్ కు  ఉదయం 5-30 కి బయల్దేరివెళ్లి రా త్రి 7-30 కు వచ్చారు .
  మా మనవళ్ళు  ఆశుతోష్ ,పీయూష్ లు నెల రోజుల టెన్నిస్ కోచింగ్ పూర్తి అయిన సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసిన కాంప్ కు ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చారు మా పెద్దమనవడు శ్రీకేత్ శని ,ఆదివారాలలో ఉదయం మాథ్స్ ఇంటెన్సివ్ కోచింగ్ కు వెళ్లి ,ఆ తర్వాత వై ఏం సి లో ఆడుకొని వస్తున్నాడు .ఇక్కడి స్కూళ్ళు  ఈ నెల 28 నుంచి ప్రారంభం   మళ్ళీ హడావిడి . .
 20-8-17 ఆదివారం -గీర్వాణం -3 లో 418 వరకు కవులగురించి ఇవాళరాశాను
  ఈ వీక్లీ ఇంతటితో సమాప్తం .
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మట్టిబండి కన్యాశుల్కం -రామతీర్థ

clip

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

416-స్వర జతులు రాసిన -మైసూర్ వాసుదేవ రావు-(1799-1879 )

కర్ణాటక లో 1799 లో జన్మించిన సంగీత వేత్త మైసూర్ వాసుదేవరావు త్రాగరాజస్వామి శిష్యుడు వాలాజపేట వెంకటరామణ  భాగవతార్ శిష్యుడు .గురువు ఈయనను మైసూర్ మహారాజు మూడవ కృష్ణ రాజ ఒడియార్ కు పరిచయం చేయగా ఆసంగీత ప్రతిభకు మెచ్చి ఆస్థాన విద్వా 0సుని చేశాడు . .క్షేత్ర సందర్శనం చేసి ప్రతి దేవునిపైనా కృతులు చాలాభాగం తెలుగులో కొన్ని సంస్కృతం లో రాశాడు .స్వరజతులు వర్ణాలు కృతులు తిల్లానా లు సంస్కృత తెలుగు భాషలలో రాశాడు .ఆయన కృతులన్నీ రాగభావం తో సాహిత్య సౌందర్యం తో అలరిస్తాయి .హరికాంభోజి రాగం లో రాసిన సంస్కృత కీర్తన -’’సాకేత నగరనాధ ‘’శ్రీమతి ఏం ఎస్ .సుబ్బులక్ష్మి గాత్రం తో బహుళ ప్రచారం పొందింది .తెలుగులో మాయామాళవ గౌళరాగం లోని ‘’దేవాది దేవ ననుకావ సమయమురా ‘’,ఆఠణా రాగం లో -’’వాచామ గోచరుండని ‘’,కమాస్ రాగం లో -’’పరమాధ్బుతమైన నీ సేవ ‘’హంసధ్వనిలోని స్వరజతి -’’రామాభిరామా ‘’   మొదలైనవి ఆయన ప్రతిభకు స్వరగోపురాలు   . 1879 80 ఏళ్ళ వయసులో  మరణించాడు .

417-సప్త తాళేశ్వర కర్త -వీణ వెంకట సుబ్బయ్య (1750-1838)

మైసూర్ లోని ప్రసిద్ధ వైణిక కుటుంబం లో 1750 లో తంజావూర్ జిల్లా కపిస్తలం లో  జన్మించిన వీణ వెంకటసుబ్బయ్య మైసూర్ ను పాలించిన హైదరాలి కాలం వాడు తర్వాత మూడవ కృష్ణరాజ ఒడియార్ కు సంగీతగురువై ,ఆస్థాన సంగీత విద్వా0సు డయ్యాడు .దివాన్ పూర్ణయ్యపంతులు మైసూర్ రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యంలాగా సాంస్కృతిక కేంద్రం చేయాలని చాలా కృషి చేశాడు . వెంకటసుబ్బయ్య రీతి గౌళరాగం లో  ఎనిమిది సులాది తాళాలతో రచించిన ‘’సప్త తాళేశ్వర గీతం ‘’ సుప్రసిద్ధమైనది . 88 ఏళ్ళు జీవించిన వీణ వెంకటసుబ్బయ్య జీవిత వీణ 1838 లో   ఆగిపోయింది .

418-లింగ రాజ అర్స్ (1823-1874 )

 మైసూర్ మహారాజా మూడవ కృష్ణరాజ ఒడియార్ అల్లుడు అలియ లింగ రాజ అర్స్ కన్నడ సంస్కృతాలలో అందెవేసిన చేయి .సంగీతకర్త .హెగ్గద  దేవనకోట వాస్తవ్యుడు .లలితకళాభిజ్ఞుడు .అనేక నాటకాలు ,యక్షగానాలు  ,50 కి పైగా కృతులు రచించాడు . లింగ ,లింగేంద్ర ,లింగరాజ అనే కలం పేరుతొ రాసేవాడు .సంస్కృతం లో పంచ వింశతి లీల ‘’అంబకీర్తన   బాగా ప్రసిద్ధం . అతని నీలాంబరి రాగం చిత్త స్వరం లో ‘’ శృంగార లహరి’’ సంస్కృత కృతి అత్యద్భుతం . 51 ఏళ్ళు మాత్రమే జీవించి అర్స్ 1874 లో అసువులు బాశాడు ..

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-7-17- కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర  భాగవతార్ (1815-1892 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

412-సంస్కృత కీర్తనలు రాసిన -పాలఘాట్ పరమేశ్వర  భాగవతార్  (1815-1892 )

 

కేరళలో నూరానిలో 1815 లో జన్మించి 1892 లో మరణించిన పాలఘాట్ పరమేశ్వర భాగవతార్  కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు . తిరువాన్కూర్ రాజు ,ప్రముఖ వాగ్గేయ కారుడు స్వాతి తిరుణాల్ కు చాలా సన్నిహితుడు అభిమానమైనవాడుకూడా .స్వాతి తిరుణాల్ రాసిన వాటికి  పరమేశ్వర్ నకలు   రాసేవాడు .గొప్ప వీణ విద్వా 0సుడు .స్వరబత్ వాయిద్యం లోను దిట్ట . హరికథాగానం తో జనాలను ఉర్రూత లూగించేవాడు . స్వాతి రాజాస్థాన సంగీత విద్వా0 సుడు  గురువు  వడివేలు మరణించాక భాగవతార్ ను ఆస్థాన విద్వా0సుని చేశాడు రాజు పరమేశ్వర భాగవతార్  సంస్కృతం లో కీర్తనలు రాశాడు . అవి అచ్చు స్వాతి తిరుణాల్ ,ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలాగానే ఉంటాయి .అనేక వర్ణాలూ రాశాడు .ఆయన రాసిన కీర్తనలలోనాటరాగం లోని  ‘’సరసిజనాభ’’,శ్రీ మహా గణపతిం భజే ‘’కీర్తనలు మంచి గుర్తింపు తెచ్చి కచేరీలు వరమయ్యాయి . 87 వ ఏట 1892 లో భాగవతార్ మరణించాడు . మలయాళం లో కూడా కీర్తనలు రాశాడు .

413-తిరువనంత స్థల పురాణకర్త -కుట్టికుంజన్  తంగాచి (1820-1904 )

కుట్టికుంజన్  తంగాచి ఇరై మాన్ తంబీ ఏకైక కుమార్తె .కేరళలో 1820 లో పుట్టి 1904 లో చనిపోయింది . తండ్రి స్వాతి తిరుణాల్ ఆస్థాన సంగీత విద్వా0సుడు .తండ్రి వద్దే సంగీతం నేర్చింది .హరిప్పద  కోచిప్పిల్ల వారియర్ వద్ద సంస్కృతం అభ్యసించి సంస్కృత ,మళయాళ భాషలో గొప్ప విదుషీమణి అయింది . నృత్యం కూడా తండ్రివద్దే నేర్చి దాని లోనూ ప్రతిభ చాటింది . .పార్వతీపరిణయం శ్రీమతి స్వయంవరం  అనే అట్టకాలు రాసింది  .సంస్కృతం లో తిరువనంతపురం స్థలపురాణం ,గజేంద్ర మోక్షం ,నలచరిత్రం రాసింది .అనేక కృతులు ,వర్ణాలు రచించింది అందులో కాంభోజిరాగం లో ‘’కాత్యాయని మాం ‘’కళ్యాణిరాగం లో ‘’సామజహరే ‘’మంచి గుర్తింపుపొందాయి  .సంస్కృత తిల్లానా కూడా రాసింది . కేరళలో కీర్తనలు రాసిన ప్రధమ మహిళావాగ్గేయకారిణిగా   ఆమె గుర్తిపు పొందింది.  84 వ ఏట1904 లో మరణించింది .

414-108 రాగాలలో 108 కీర్తనలు రాసిన -ఎన్నపాదం  వెంకటరామ భాగవతార్ (1880-1961)

కేరళలో కొచ్చిన్ లోని ఎన్నపాదం లో వెంకటరామ భాగవతార్ 1880 లో జన్మించి 1961 లో 81 వ ఏట మరణించాడు . హరికథాగానం లో సాటిలేనిమిటి .సంస్కృత తెలుగు కన్నడ మిళ మళయాళ భాషలో హరికథలు రాసి  చెప్పి ఒప్పించినహరికథా సరస్వతి .తిరువనంతపురం కొచ్చిన్ మైసూర్ ,బరోడా మొదలైన సంస్థానాలలో హరికథా గానం చేసి మెప్పుపొంది సత్కారాలు అందుకొన్నాడు .అనేక కొత్తరాగాలు సృష్టించాడు . కృష్ణ అష్టోత్తర శతనామ కీర్తనలు ‘’108 రాగాలలో 108 కీర్తనలు అంటే నామానికి ఒక్క కీర్తనగా రచించిన భక్త శిఖామణి . ప్రకాశిని రాగం లో ‘’గుహం ఆశ్రయామి ‘’,సుముఖిరాగం లో ‘’మాతంగ ముఖం ‘’కీర్త నలు  ప్రసిద్ధి చెందాయి .

415-మణిప్రవాళ శైలి కృతి కర్త -తమస్సేరి కృష్ణన్  భట్టాత్రి (1890-1963 )

1890 లో పుట్టి 1963 లో చనిపోయిన తమస్సేరి  కృష్ణన్  భట్టాత్రి కేరళలో జన్మించాడు .సంస్కృత మళయాళభాషలలో గొప్ప ప్రజ్ఞావంతుడు . ఈ రెండు భాషలు కలిపి మణిప్రవాళ శైలిలో కృతులు  రాశాడు .బేగడ  రాగం లో ‘’శ్రీరాఘవ పరిపాలయ ‘’,ఆనంద భైరవిలో ‘’ఆనంద నంద నందనం నమామి ‘’మొదలైనవి ప్రసిద్ధ కీర్తనలు .

416-దేవయాని చరిత నాటక కర్త -కుట్టు ముత్తు కుంజు కురుప్ (1880-1943)

కేరళలో కనియూర్ లో 1880 లో పుట్టి 63 ఏళ్లకు  1943లో చనిపోయిన కుట్టుముట్టు కుంజు కురుప్ సాహిత్య సంగీతాలలో మహా విద్వా 0సుడు . సంస్కృతం లో దేవయాని చరిత నాటకం ,విద్యా శ0ఖ ధ్వని ,బాలగోపాలం  వంటివి ఆయన ప్రతిభా ప్రదర్శనాలు .తననాటకాలలో 300 కు పైగా కృతులు రాసి స్వరపరచిన  మేధావి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-17 -కాంప్–షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అముల్యాభరణం “శంకరాభరణం“

చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో
అముల్యాభరణం
“శంకరాభరణం“
నేపధ్య సంగీతం  :

శంకరాభరణం చిత్రం ప్రారంభం లాంచ్ ప్రయాణం.  నది  తీరు తెన్నులు వన్నె చిన్నెలు ప్రయాణం లో లాంచీ గొట్టం లోంచి వచ్చ్చే నాదం వీనుల విందైన ధ్వని దానితో శ్రుతి కలిపే గాలి  తులసీరాం  హమ్మింగ్ అద్భుతం. నీటి సవ్వడి వేగం అద్భుతం గా విన్పిస్తుంది.  బాల మేధావి లయబద్ధంగా సంగీతాన్ని బిందెల మీద కర్రముక్కల తోనూ విన్పిస్తాడు .ఇదంతా వాచ్యం కానీ, నేత్రానంద రస స్ఫోరక కళా భిజ్నత . ఇది ఈ చిత్రానికి నేపధ్య సంగీతం .

శంకర శాస్త్రి   ని పరిచయం చేస్తూ ఆయన పాదాల ల సవ్వడిలో మంద్రగానం ధ్వని0ప జేయటం  అతని లోని కళాభిజ్ఞతకు ,నిశ్చల మయిన మనస్సుకు ప్రతిబింబం అని పిస్తుంది . తులసిని ఇంట్లోకి ఆహ్వానించినపుడు ”కొలువీయ వయ్య రామా ”అనే నేపధ్య సంగీత ధ్వని అపూర్వం .అలాగే రైల్ దిగుతున్నప్పుడు ”యెంత వార లైనకాంత దాసులే ” అన్న  నేపధ్య గీత ధ్వని ప్రేక్షకులకు కలిగించే సస్పెన్సు కు పరాకాష్ట .రేప్ సీన్ లో శంకరాభరణ రాగాన్ని ,చివరి సరిగమలను వాడుకున్న విధం అనిర్వచనీయం ,అద్భుతం ,అమోఘం, అనితర సాధ్యం .ఆ ఊహ కు జోహర్లె .అసలు శాస్త్రి నిద్రపోతుండగా బాల శాస్త్రి తో ”మానస సంచరరే ”పాట  ఎన్నుకోవటం సామాన్య దర్శకునికి అందే విషయం కాదు అది విశ్వనాధుని  దృష్టి .  ”శ్రీ రమణీ కుఛ దుర్గ విహారే ”అని నిద్రలోనే అనిపించటం ఔచిత్యానికి పరాకాష్ట.  మళ్ళీ కుర్రాడితో ”పరమహంస ముఖ చంద్ర చకోరే ”అనిపించటం శంకర శాస్త్రి లోని పరమహంసత్వాన్ని వ్యంగ్య వైభవం గా ఎరుక పరచటమే .ఇక్కడే కావ్య ధ్వని చిత్ర ధ్వని గా మారింది .ఇలా నేపధ్య సంగీతానికి ఈ చిత్రం పట్టాభిషేకం జరిపించింది . ఇది మహ దేవన్  విశ్వనాధ్  ల అపూర్వ భావ సంయోగ ముక్తా ఫలం .
సోమయాజుల నటన:
ఒక తరానికి చెందిన కళా సరస్వతి గా ఠీవి గాం భీర్యం లో నడకలో,నడతలో మాటలో హావ భావాలలో అతి లేని ఔచిత్యపు హద్దు లో నడయాడే సంగీత సర్వస్వం గా సంగీత రాయంచల పరమహంస లాంటి వేషం శంకర శాస్త్రిది .దాన్ని అన్ని రకాలుగా ,అన్ని విధాలుగా సరిపోయేటట్లు జీవి0 చేట్లు  నటించాడు” కలెక్టర్” సోమయాజులు . అంతకు ముందున్న ఎన్నో ఏళ్ళ నాటకానుభవం, నేపధ్యం గా సాయ పడింది . అది అతని పుణ్యఫలం,యోగబలం ,దీక్ష దక్షత ,పరిపక్వత.  సోమయాజులు నిజంగానే నట సోమయాజి అయాడు .ఆ హుందా తనం అనితర సాధ్య మనిపించాడు . అదో తపస్సు గా ,యోగ సమాధి గా నిర్వహించాడు.”నట సోమయాజి ”అనిపించాడు .
అసలు ఆ పాత్ర ఏమి  చెప్పదు  .అ0తా  మనం ఊహించు కోవలసిందే .ఊహా  సామ్రాజ్యమే. అంతా  . వ్యంగ్య వైభవమే .”లోకేశ్వరుడికి  తప్ప లోకానికి భయపడను  .  నాకు తులసికి వున్న సంబంధం నాకు తెలుసు ఆ పరమేశ్వరుడికి  తెలుసు .”ఇవి మాత్రమే ఆయన ఉచ్చరించే మాటలు .ఇందులోని నిగూఢ భావం ఆ  charector  ను విశ్లేషిస్తుంది . తులసి రైల్ ఎక్కేటప్పుడు, మైసూర్ లో పరాభవం   జరిగినప్పుడు, ఎక్కడా   తొణకడు , బెణకడు ఎవర్ని ఏమీ అనడు  ,తులసి తాను హత్య చేసి వచ్చి ,ఆ రక్తం తో పాదాభిషేకం చేసినపుడు  తొట్రుపడడు .  .
తనకుతురి పెళ్లి కూడా ”అపస్వర’తో ఆగిపోయనా  విచారించడు .అంత పరమేశ్వర సంకల్పం అన్నది అతని భావం గా అనిపిస్తుంది .అయితే  ఆ గంభీరం  వెనుక ఒక మహత్తర మానవత్వం అంతర్వాహినిగా  ప్రవహిస్తుంటుంది .అది సంస్కార  చేతన .  అది కట్టు బాట్లకు ఆచార వ్యవహారాలకు  అందనిది   అంత ఉత్తమమైనది .  .హృదయ గత మైనది .ప్రవర్తన లో రావాల్సిన దైవత్వం అది .అదే ఆ పాత్ర శి ష్టాచార  పరాయణు డైన ,సంగీతపు లో’తులు తరచిన సంగీత సాహిత్య మూర్తి అందించే సారాంశం . .సంగీతానికి భాష, భేదం లేదని  ,అది ఆ నాద బ్రహ్మను చేరే ఉత్తమ మార్గమని చెప్పిస్తాడు .మాట్లాడిన నాలుగు మాటలు majestic  గా ఒక కలెక్టర్ హుందా  తనం తో చెప్పినట్లుంటుంది .ఒక అద్వైతం ,ఒక నిర్లిప్తత ,జ్యోతకం అవుతాయి .అంతే కాదు హారతి కర్పూరం వెలిగించిన అరచేతికి  కూతురు వెన్న రాస్తుంటే  సుజల నయనాలతో కూతురు స్వరాలు అంటుంటే కరిగి పోయిన హృదయం ,తేలిక పడిన మనస్సు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అక్కడ సోమయాజులు మహోన్నత నటన  శిఖరారోహణం  చేసినట్లుంటుంది .గుండెలు పిండే సన్నివేశం  .అక్కడ ఆర్ద్రత వర్షించింది అనురాగం జల్లుగా కురిసింది మానవత మేల్కొంది గుండె చెరువే అయింది .అదీ నటన ,అదే నటన అనిపించింది . సోమయాజులు నట యజ్ఞం చేసి ధన్యడయాడు
చివరి సీన్ లో ”దొరకునా  ఇటువంటి సేవ ”పాటకు ముందు ”పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెప లాడు తున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒకింత ఆదుకునేందుకు ముందుకు వచ్చ్చిన ఆ అజ్ఞాత దాత కు ,నా నమోవాకాలు ఆ ళాభిజ్ఞతకు శిరసు వంచి పాదాభి వందనం చేస్తున్నాను .”అనటం లో మన గుండె కరగి కన్నీరు మున్నీరై రసప్లావితమౌతుంది .  బ్రహ్మానంద సహోదరత్వానికి సామీప్య మవుతుంది మనసులో .ఆనంద జ్యోతి వెలుగు తుంది .ఆరాధనకు అద్వైత సిద్ధి కల్గుతుంది .ఈ మాటలన్నీ తెలిసే అన్నాడు . అన్న భావన కలుగుతుంది .”క్షుద్రులెరుగని నిర్నిద్ర గానమిది అవదరించరా ,,విని తరించరా  ”అని అనిపించిన పాత్ర అది . తెలుగు చిత్ర రంగం లో ఇంతవరకు ఇంతటి ఉదాత్త వున్నత పాత్ర సృష్టి జరగలేదు .అంత గొప్ప పాత్రను మలచి తీర్చి దిద్దిన దర్శకుడు  విశ్వనాధ్  కళా  విశ్వ నాధ్  అనిపిస్తాడు .సోమయాజులు పాత్ర కర్తగా   విశ్వనాధ్  సృష్టికర్తగా ,కళా నరాజనాలు అందుకొన్నారు .  ఆ జంట ధన్యమై ,సార్ధకత చెందింది
మంజు భార్గవి :
నటన తపస్సు .ఏ పాత్ర ఎవరికోసం ఎందుకు ఎప్పుడు సృసింప బడుతుందో  తెలియదు .వాంప్ వేషాలలో.సెక్సీ గా కనిపించి న మంజు లో మంజుల గానానికి మనోహర నాట్య విలసంచేసే కళా మూర్తి వుందని  ఎవరూ ఊహించలేక పోయారు  ఊహించలేదుకూడా .  .ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో  కాసేపే నాట్యం చేసినా  బాగా చేసిందనిపించింది .అలాంటి భార్గవి  విశ్వనాధ్  చేతిలో మనోజ్ఞ మనోహర  శిల్ప మూర్తిగా  గా మలచ బడింది .అసలు ఆ పాత్రకు డైలాగులు లేవు .ఉన్నా చాల పొదుపు .అంతా సాత్విక అభినయమే  .ఊహాలోక  సంచారమీ .  .ఏదో తెలీని పిచ్చి ఆరాధన తత్త్వం .ఒక devotion  dedication ..సర్వాత్మన సర్వ సమర్పణ భావం .ఒక పూజారిగా ,వేదాంతిగా కనిపించే పిచ్చి  రూపం అలంకరణలో ఆహార్యం లో దుస్తుల్లో భాషలో స్వచ్చత .  అంత నిసర్గ రమణీయం .ఆ పాత్రలో మంజు మంజులం గా జీవించి తరించింది
జమీందార్ రేప్ చేసేప్పుడు సంగీత గమకా లకు అనుగుణంగా చేసిన నటన అద్భుతం .బెంగుళూరు లో తనకు, శంకర శాస్త్రి కి సంబంధాన్ని తల్లి అంట  గట్టి నపుడు, ,తిట్టినపుడు, ఏదో చెప్పాలనుకొని ,చెప్పలేక మనసు లో దాచుకున్న బాధ నివారించుకోవటం చాలా కష్టమే   .అదంతా అనుభవైక వేద్యం గా చూపించింది .శం కర శాస్త్రి రాగానికి తాను భావించిన, ఊహించిన రీతిలో నాట్యం చేసే సందర్భాలు రవి వర్మ  చిత్రాలుగా  దర్సన మిస్తాయి .బాపు బొమ్మలోని స్వచ్చ్హత సాక్షాత్కరించింది .ఆ హావ భావలు పరమ మనోహరాలు. శంకర   శాస్త్రికి సన్మానం జరిగేటప్పుడు ఆమె కళ్ళు కృతజ్ఞతా   భారం తో నిండి హృదయం ఆనంద ప్లావిత మవుతున్నట్లు చూపిన ఘట్టం బాగా ఆకర్షించింది.మనసులో చెరగని ముద్ర వేసింది . .
”బ్రోచే వారెవరురా ”పట పాడేటప్పుడు ఇంటి దగ్గర కొడుకు తో మిగిలిన పాదాలకు స్వయం గా భంగిమలో చూపినపుడు, సంతృప్తి సాధించాలనుకున్న గమ్యం చేరా ననుకున్న తృప్తి ఫలించిన దీక్ష ,తన కొడుకు గొప్ప తనం గురించిన ఆనందం  తన జీవిత ధ్యేయం నేరవేరిందన్న  సంతృప్తి  వ్యక్తమవుతాయి .అసలు సినిమా మొదట్లోనే శంకర శాస్త్రిని చూపిస్తూ చిరిగిన పంచె లోంచి flashback  లాగినపుడు అతని గత జీవిత వైభవం యెంత గొప్పదో ఆమె చూపిన  చూపుతో అర్ధమవుతుంది .  అది నటనకు పరాకాష్ట .పడవ లో తనకొడుకు లయ బద్ధం గా పాడుతున్నపుడు,అందరు మెచ్చు  కుంటుంటే చూపించే ఆనంద మందహాసం ఆమె  ఆత్మానందాన్ని  ప్రతీక .
జమీన్  దారును  హత్య చేసేందుకు నడచిన నడక లో కూడా ఒక లయ బద్ధత కన్పిస్తుంది .”రాగం తానం ”పాటకు అనుగుణం గా చేసిన నాట్యం మనోహరం .జీవితం లో ఆధనాకృతి  ఆకృతి  గా నిలబడాలన్న తపన అది .తనమూలం గా శంకరశాస్త్రికి   మరింకే కళంకం రాకూడదనే ఆరాటం . ఒక మూగమనసుగా  మనసున్న  వ్యక్తిగా భాషకు అందని భావానికి జీవం పోసింది మంజు భార్గవి .ఆమె లోని నటనను గొప్పగా explore expose  చేసిన కళా తపస్వి  విశ్వనాధ్  పరిశీనా  దృష్టికిహట్స్ ఆఫ్.
అల్లు రామ లింగయ్య :
శి వునిహృదయం మాధవునికి మాధవుని మనసు శంకరుడికి తెలుసు . సృష్టి లో తీయనిది స్నేహం . అది యెంత విషమ పరిస్థితులలో అయినా  పరిక్షలకు తట్టు కొని నిలబడుతుంది .   .ఆ స్నేహ బంధం  వీడదు .వాడదు  శంకర మాధవులు దేవతా స్వరూపులుగా  స్నేహితులు కూడా .ఈ సినిమా లో కూడా శంకర శాస్త్రి కి నిజమయిన స్నేహితుడు మాధవం .ను ఎంపిక చేయటం ఆ పేరుకు మాత్రమే కాదు పాత్రధారికి   కూడా గర్వ కారణం .అల్లు  రామలింగయ్య లోని కళా జీవి ధన్యుడయాడు ”వాడెంత ?నేను  గట్టిగా  కన్నెర్ర  జేస్తే గడగడ లాడ్తాడు ” అంటాడు శాస్త్రి ఎదురుగా లేనప్పుడు . అలా  డంబాలు కొట్టినవాడే ఆయన ఎదురు పడగానే చెప్పాల్సిన రెండు ముక్కలు కళ్ళు నేలకు తిప్పి తలవంచి చెప్పేసి అతను ఏమి చెప్పేది వినకుండా చక్కా  పోతాడు .
ఇలా యెంత చెప్పినా  తరగనిగని , ఘని  శంకరాభరణం . చూసి  పులకి0చా ల్సిందేకాని , చెప్పి ,మెప్పించలేము.అయినా ఇదొక చిన్న ప్రయత్నం .
మనవి : ఈ రాసిన దాన్ని అంతా దర్శకుడు విశ్వనాధ గారికి 24 -03- 99  న స్వర్గీయ శ్రీ వేటూరిసుందరరామ మూర్తి  కృష్ణా  జిల్లా లోని ఆయన స్వగ్రామం పెదకళ్ళే  పల్లి లో నిర్వహించిన్ రెండు రోజుల సదస్సు లో మొదటి రోజు నే  చూపించాను.  చదివి బాగుంది అని నా పుస్తకం లో ఆ కళాతపస్వి సంతకం . చేయటం నా అదృష్టం.
          కళాతపస్వి రాజర్షి శ్రీ కాశీనాధుని విశ్వనాధ్ కు కేంద్ర ప్రభుత్వం ”దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ”అంద  జేసి చాలా నెలలు అయినా ,ఆ వ్యాసాన్ని దుమ్ముదులిపి మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను .
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా ,

Inline image 1Image result for sankarabharanam of visvanadh
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

గోవాలో 1926 మే నెల 26 న ఆంటోనియో ఆలివర్ డీ సెల్వజార్ పోర్చుగల్ లో అధికారం లోకి రావటం తో రిపబ్లిక్ పాలనఅంతమైంది ..వాస్కోడి గామా ,ఆల్బు కెర్క్ లతర్వాత ఇతనితో క్రూరపాలన అంతమైంది పోర్చుగీసు అధికారం తో పెత్తనం చెలాయిస్తున్న సాలాజార్ కబంధ హస్తాలనుండి విడుదలై భారత దేశ విముక్తి కోసం పోరాడుతున్న యావద్భారత దేశం తోపాటు గోవా కూడా కలిసి అడుగులు వేయాలని నిశ్చయించింది .సాలాజార్ ప్రజల నోరు నొక్కి బహిరంగ సమావేశాలకుకాని ,భావప్రకటనకు కానీ అవకాశం ఇవ్వకుండా పౌరహక్కులకు తీవ్ర విఘాతం కలిగించాడు .అన్ని హక్కులను నిషేధించి తన క్రూర పైశాచిక నియంతృత్వాన్ని చెలాయించాడు .రాజకీయ సమావేశం జరపాలంటే గవర్నర్ దగ్గర ముందు అనుమతి పొందాల్సి వచ్చేది . 1933 కలోనియల్ యాక్ట్ ద్వారా ప్రజల సర్వ హక్కులు నిషేధానికి గురయ్యాయి . స్వేచ్చాప్రియులైన గోవన్లు దీన్ని జీర్ణించుకోలేక తిరుగుబాటు చేయాల్సి వచ్చింది’ అంతకంటే వారికి గత్యంతరం కనిపించలేదు .
క్రమంగా సంస్థలు ఏర్పడి ,జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు .ఈ ఉద్యమం లో మహిళలు తామేమీ పురుషుల కు వెనుకబడిలేమని తెలియజేస్తూ ముందుకు దూకి స్వాతంత్రేచ్ఛతో రగిలిపోయారు .గోవా ,డయ్యు డామన్ ల విముక్తికి సంఘటిత0గా నడుం కట్టి కదిలారు .
.అందులో పౌరహక్కుల ఉద్యమ ప్రధమమహిళా నాయకురాలుగా ప్రమీలా కాంత్ జంబోలికర్ అగ్ర శ్రేణిలో నిలిచింది .గోవా సేవా సంఘం ఆధ్వర్యం లో ఆమె అనేక కార్యక్రమాలు నిర్వహించి మహిళా చైతన్యాన్ని ద్విగుణీకృతం చేసింది . 1946లో ఆమె గోవా జాతీయ కాంగ్రెస్ సభ్యురాళ్ళలో ప్రధమ స్థానం పొందింది . 21.-7-1946 న ఆమె మడగావ్ లో ”ప్రభాత భేరి ”ఉద్యమానికి నాయకత్వం వహించింది .పోర్చుగీస్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టి హింసించింది .కస్టడీ లో ఉండగా పోలీస్ కమాండెంట్ అడిగిన ప్రశ్నలకు అత్యంత ధై ర్యం గా సమాధానాలు చెప్పి దిమ్మ తిరిగేట్లు చేసింది .మళ్ళీ ఉద్యమాలు చేస్తే బాలిక అనికాని మహిళఅనికాని చూడకుండా బట్టలు విప్పించి బాదేస్తానని భయపెట్టాడువాడు . వదిలేశాక ఆమె రెట్టించిన ఉత్సాహం తో మళ్ళీ ఉద్యమం చేసి అరెస్ట్ అయి ఏడాదిపాటు జైల్లో ఉంది
మహిళా కార్య కర్తల ఉద్యమపోరాట0 18-6-1946 న రామ మనోహర్ లోహియా మార్మగోవాలో ప్రసంగించిన సభతో తీవ్ర రూపం దాల్చింది .గోవన్ల పౌరహక్కుల కోసం ప్రభుత్వం తో పోరాటం చేయాలని లోహియా తీవ్ర స్వరం తో ఉద్రేకంగా మాట్లాడి గొప్ప ప్రేరణ కలిగించాడు .అప్పటిదాకా గోవాలోనియంతృత్వసాలజార్ పోర్చుగీసు పాలనలో ఎవరూ ఏ మార్పును తేలేరు అనుకొన్న నమ్మకాన్ని బద్దలు చేశాడు లోహియా . ఆయన కాలు పెట్టటం తో అంతా ఒక్క సారిగా మారిపోయింది .అంత గొప్ప ప్రేరణ కలిగించాడాయన .స్వాతంత్ర పిపాస విజృంభించింది .అన్ని నిషేధాలను ఉల్లంఘించి గోవా నాలుగు చెరగులా ఉన్న గోవన్లు వెల్లువగా ఉద్ధృతప్రవాహంలా దూసుకొచ్చి సభలో పాల్గొని ఆత్మ విశ్వాసాన్ని చాటి చెప్పారు .చేసేదేమీలేక ప్రభుత్వం లోహియాను అరెస్టుచేసింది .ఆయనతోపాటు వత్సలా పాండురంగ కీర్తనీ అనే యువతి కూడా ఉపన్యాసం ఇవ్వటానికి ముందుకు రాగా అరెస్ట్ అయింది .పోలీస్ కమాండెంట్ ఫిగారేడో ఆమెను ”ఎందుకు జై హింద్ అని అరిచావు ?”అని అడిగితే ఆమె ”జై హింద్ నినాదం మాలో స్వాతంత్రేచ్ఛ ,దేశభక్తి కలిగించి ధైర్యాన్నిస్తుంది ”అని భయపడకుండా చెప్పింది .ఈమె అరెస్ట్ అయ్యాక 40 మంది మహిళలు ఊరేగింపుగా వెళ్లి జై హింద్ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ను చుట్టు ముట్టి వత్సలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకపోతె తమనుకూడా అరెస్ట్ చేయమని డిమాండ్ చేశారు . అత్యంత నాటకీయంగా జరిగిన దీనికి కమాండెంట్ గుక్క తిప్పుకోలేక ఆమెను విడుదల చేశాడు . కానీ ఆమె మాత్రం లాకప్ నుంచి బయటకు రానని భీష్మించింది .అప్పుడు ఆఫీసర్ ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా బయటికి నేట్టేసి ఊపిరి పీల్చుకున్నాడు .
గోవా జాతీయ కాంగ్రెస్ ,గోవా సేవా సంఘం ,గోమంతకీయ తరుణ సంఘం మొదలైన రాజకీయ సంస్థలు గోవాలోని బాలికలను స్త్రీలను పౌరహక్కుల కోసం బా గా ప్రభావితం చేశాయి .వీరందరూకలిసి ఎన్నో ప్రభాత భేరీలు సత్యాగ్రహాలు ,మూడురంగుల జండా ఎగరేయటాలు ,కరపత్రాలు పంచటాలు తో ఉద్యమానికి గొప్ప ఊపు తెచ్చారు . జూన్ 18 ఉద్యమంలో లలితా కాంటక్ ,(లలితామాధవ్ ,వెలింగకార్ )కూడా ముఖ్యపాత్ర పోషించింది . ఆమె మార్ గోవాలో మీటింగులపై నిషేధాన్ని ఎత్తేయాలని రోజూ ప్రభాతభేరి నిర్వహించేది . 1946 జులై 21 న ప్రమీలాబాయ్ జమ్బోల్కర్ ,లలితా కాంటక్ ల ఆధ్వర్యం లో భారత జాతీయ జెండాను ఎగర వేసే ప్రయత్నం చేస్తూండగా పోలీసులు అడ్డుకొని వాళ్ళ చేతుల్లోని జెండాను బలవంతంగా లాగేసి వాళ్ళనుచితకబాదారు .
పౌరహక్కుల ఉద్యమం లో వీరితో పాటు చేతులు కలిపినమహిళలలో కృష్ణ హెగ్డే ,వితా హెగ్డే ,,కృష్ణ లోతిల్కర్ ,ముక్తా ఖరాపుర్కర్ ,ఉమాబాయి శ్రీరాలి ,ఇందిరా భైసే ,జీవన్ కరపుర్కర్ వంటి త్యాగ-శీల మహిళా మాణిక్యాలెందరో నిరంకుశ సాలాజార్ పోర్చుగీస్ పాలననుండి విముక్తికై అవిశ్రాంతంగా ఉద్యమించి చరితార్ధులయ్యారు .ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు వారిని ఒకసారి స్మరించి ప్రేరణ పొంది ధన్యులమవుదాం .

-గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

కృష్ణం వన్డే జగద్గురు0

నిన్న 15-8-17 మంగళవారం శ్రీ కృష్ణాష్టమి  71 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం .ఉదయం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ ముద్దుపాదాలను ముగ్గుతో మా శ్రీమతి చిత్రించి బాలకృష్ణుడిని ఆహ్వానించింది .నేను శ్రీకృష్ణఅష్టోత్తరం విష్ణుసామ్ తో సహస్రనామ0 తో కన్నయ్యకు పూజచేసి మా ఆవిడ చేసిన అటుకులు ,కట్టెకారం తో పాలు పెరుగు వెన్న మామూలు నైవేద్యానికి అదనంగా నైవేద్యం పెట్టాను . సాయంత్రం మా అమ్మాయి భజన ఏర్పాటు చేసింది . సాయి సెంటర్ వాళ్ళందరూ దాదాపు 75 మంది వచ్చి భజనలు చేశారు .అందులో కృష్ణభజనలూ ఉన్నాయి . మా అమ్మాయి నన్ను మాట్లాడమంటే 9 నిమిషాలు కృష్ణతత్వాన్ని గురించి చెప్పాను .చాలా  బాగుంది  ఇంకా చెబితే బాగుండేది అని చాలామంది ముఖ్యంగా శ్రీమతి లక్ష్మి ,ఉష ,రాధా అడిగారు .సరే నని భోజనాలయ్యాక రాత్రి 9-30 నుండి 9 50దాకా మళ్ళీ హోలిక విశేషాలు చెప్పాను .అందరూ సంతోషంగా ఆనందం తో రాత్రి 10 గంటలకు ఇళ్లకు బయల్దేరి వెళ్లారు . నేను మాట్లాడిన దాని సారాంశం తోపాటు మరికొంత సమాచారం తో దీన్ని ”కృష్ణం వ0దే  జగద్గురుమ్ ”గా అందజేస్తున్నాను .

” రాధనురా ప్రభూ ,నిరపరాధనురా ,అనురాగ భావనారాధన మాగ్న మానసనురా ”’
  ”ఏది మరొక్కమారు హృదయేశ్వర గుండెలు పుల్కరించగా ఊదగదోయి  యుష్మదీయ వేణు నాద  రసోదయ  రాగ డోలికలతో  జగమ్ము విస్మయమ్ముగ నిదురించే -కాంక్ష ”మర్రాకయి తేలేరా ప్రభూ ,రమ్ము ఒక్క క్షణమ్మేని  నిదురింతువుగానిరమ్ము  తెరచి యుంచితి నా హృదయ కుటీరమ్ము తలుపు ”అని రాధ ఆనందమయ గాధను కళ్ళకు కట్టించారు కరుణశ్రీ కవి .
  అసలు కృష్ణ అని అనగానే మనముందు నీలమేఘచ్చాయ తో ముగ్ధ మోహన రూపం తో” వ్యస్తష్టపాదం ” తో పెదాలవద్ద వేణువు తలలో నెమలి పించం మెడలో తులసిమాల  ,ప్రక్కన గోమాత ఉన్న నందనందన యదునందనుఁడు గోపాల కృష్ణుని దివ్య మంగళ రూపం కళ్ళ ముందు దర్శనమవుతుంది .ఆ రూపానికి జగత్తు అంతా పరవశించింది . ఆయన దేహచ్చాయ నీలవర్ణం .అనంతమైన ఆకాశం సముద్రం రంగు కూడా నీలమే .కనుక అది అనంతత్వానికి ప్రతీక -సింబల్ .అంతేకాదు అన్ని రంగులూ నీలం లో లయమవుతాయి .నిరాకార పరబ్రహ్మ తత్వానికి అదేప్రత్యేకత ..భాగవత రచన ప్రారంభిస్తూ వ్యాసమహర్షి కృష్ణుడు దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ కోసం మాత్రమే అవతరించలేదు -అజ్ఞానం ,విషయం వాంఛలతో ,సుఖ భోగ లాలసత్వం సంసారం లో మునిగితేలేవారికి తనలీలలద్వారా తరించే మార్గం చెప్పటానికి అవతరించాడు అంటే స్మరణ మాత్రం తో మొక్షాన్నిస్తాడని అర్ధం .అంతేకాదు ఇన్ని అవతారాలున్నాయి ఏ అవతర0 లో లేని లీలలు కృష్ణావతారం లో కనిపించి ఆ కృష్ణ లీలలకు సమ్మోహితులమవుతాం మన మనసు శరీరం అంతా ఆయన వశమైపోయే తాదాత్మ్య స్థితి అనుభవిస్తుంటాం .అదీ కృష్ణావతార పరమార్ధం . మేనమామకు  గండం ఉన్న రోహిణీ నక్షత్రం లో  ఆదివారం నాడు అడ్డ కాళ్లతో పుట్టాడు .పుట్టగానే తనను చంపటానికి సిద్ధపడిన ఏడుగురు దాసీలను చంపేశాడు . పూతన చనుబాలుతాగి దాని ప్రాణాలు తోడేశాడు దాని చనుబాలలో ఉన్న విషయాన్ని కూడా తాగేసి ,అంటే పాపాలన్నీ తాగేసి దాని శరీరానికికి పుణ్యమే మిగిల్చాడు పూతన దేహాన్ని తగలబడుతుంటే ”అగరువత్తుల సుగంధం వచ్చిందట . ”పునాతి దేహం పూతన ”అంటే దేహాన్ని పవిత్రం చేసేది అని అర్ధం . ఆమె విషం ఈయనకు అమృతం అయింది అందుకే ఏ పదార్ధమైనా భగవంతుడికి ”అమృతమస్తు ”అంటూ నైవేద్యం చేసి తింటాం అది అమృత స్వరూపంగా మారుతుంది అదే ప్రసాదం అంటే ప్రకృష్టమైన సాదం అంటే భోజనం పవిత్ర భోజనం శకటాసుర తృణాసుర ,కాళీయుల ను సంహరించాడు .అహంకారం తో ప్రకృతిపూజను అవహేళన చేసిన ఇంద్రుడికి గోవర్ధనపర్వతం కొనగోటిపై నిలబెట్టి వరుణుడి గర్వాన్ని అణచి గోవులకు గోపాలురకు రక్ష కల్పించాడు . గోపాలకులతో కలిసి చద్దన్నాలు తిన్నాడు . దీన్ని చూసిన నారదుడు ”మహా మునీశ్వరులు కూడా దర్శించలేని కృష్ణపరమాత్మతో ఈ గోపీగోపాలురు హాయిగా ఆటలాడుకొంటున్నారు కలిసి ఎంగిలి కూడు తింటున్నారు వాళ్ళ అదృష్టం యెంత గొప్పదో ”అన్నాడు .పోతన్నగారైతే ఏకంగా కృష్ణుడితో  ఆవకాయ మాగాయ పచ్చళ్ళుతినిపించాడు  దీన్ని చూసిన వ్యాసభగవానుడు కృష్ణుడితో ”కన్నయ్యా  నువ్వుమరీ తెలుగుకృష్ణుడివి అయిపోయావు ”అని అన్నాడని కరుణశ్రీ ”భాగవతః వయజన్తిక”లో సరదాగా రాశారు . ఏ ప్రాంతం వారికీ ఆ ప్రాంతపు కృష్ణుడుగా కనపడటం ఆయన ప్రత్యేకత . ఎంత ఆకర్షణ లేకపోతే భక్తమీరాలాయి సూరదాసు వంటి మహా భక్తులు తమహృదయాలలో ఆయనకు గుడికట్టి పూజించారు .అంతటి ఆకర్షణ ఉన్న అవతార పురుష్ఘుడు లేదు రామావతారం లో రాముడు నీలమేఘ శ్యాముడే .ఆయన మర్యాదా పురుషోత్తముడు .తానూ ఎలా ధర్మాన్ని పాలిస్తూప్రవర్తించాడో జనం అలా నడవాలని ఒక ఆదర్శ మూర్తిగా మార్గదర్శిగా నిలిచాడు కృష్ణుడు ఆచరింపజేశాడు . ధర్మ చ్యుతి కలిగితే నిర్దాక్షిణ్యంగా బంధువైనా సరే సంహరించాడు .అలా సంహరింపబడినవారిలో మేనమామ కంసుడు  మేన బావ శిశుపాలుడు లను చంపాడు .  బావలవరుస అయినసమస్త కౌరవులు అర్జునుంచేత భీమునిచేతసంహరింపజేశాడు .చివరికి ధర్మ భ్రష్ఠులైన యాదవుల ప్రవర్తన సహించలేక యాదవ కులం లో ముసలం (రోకలి )పుట్టించి వారందరి నాశనానికి కారకుడయ్యాడు ఆయన ధర్మ పక్షపాతం అంతటి విశిష్టమైనది అందుకే ”ధర్మ సంస్థాపనార్ధం సంభవాయై యుగే యుగే ”అని అభయమిచ్చాడు . ఇంతటి ఆకర్షణీయ పురుషునికి అంతటి పాగా ద్వేషమా అని అని అని పిస్తుంది అది ధర్మ సంస్థానార్ధమే అని గ్రహించాలి .
  నంద వంశ పురోహితుడు గర్గ మహర్షి నంద బాలుడికి ”కృష్ణ ”అని నామకరణం చేశాడు  .”కృష్ అంటే శాశ్వతత్వం ఉన్నవాడు” ణ ” అంటే చిదానందమైనవాడు అంటే శాశ్వత చిదానంద రూపుడైనవాడు అని అర్ధం .. ఇంకో అర్ధం సర్వాన్ని ఆకర్షించేవాడు .కృష్ -ఆకర్షణీయే.అధవా ఆకర్షయేత్ సర్వం జగత్ స్థావరం జంగమం -కృష్ణం ”అని గర్గముని తెలియజేశాడు .ఆయనే ”నామ్నా0 భగవతో నందః కోటీనాం స్మరణేచ యత్ ”అని వివరించాడు స్మరణ మాత్రం చేత తరింపజేసేవాడు .కృష్ణ అంటే సమస్త  సమ్మోహ పరచేవాడు ,ఆకర్షించేవాడు .సకాలానికి ఆత్మా అయినవాడు -ఆయనే ఆదిపురుషుడు . ..కృష్ణంధర్మం సనాతనం ” అంటే కృష్ణుడే  ధర్మం .మనకు రాముడుకాని కృష్ణుడు కానీ వాళ్ళ ధర్మాన్ని ఏదీ కొత్తగా బోధించలేదు సనాతన వైదిక ధర్మాన్నే వాళ్ళమాటలలో చెప్పారు అని మనం తప్పకుండా గ్రహించాలి ..వ్యాసుడు ”నిష్కల్మషులైన గోపా గోపీ జనాలకు ఆయన అతి దగ్గరవాడయ్యాడు ”అన్నాడు  .
  శ్రీ కృష్ణుడు తాను పుట్టిన దగ్గర్నుంచి ప్రతి సందర్భం లో తన పరమేశ్వరతత్వాన్ని ,సర్వ సాక్షిత్వాన్ని ,సర్వజ్ఞత్వాన్ని ,సర్వ కారణత్వాన్ని ప్రదర్శించిన సంపూర్ణ అవతారం .అందుకే కృష్ణం వన్డే జగద్గురుమ్ అన్నారు .జగద్గురుత్వం అంటే ఎవరు ఎలా పూజిస్తే ,వాళ్ళను ఆ ప్రకారం అనుగ్రహిస్తాడని అర్ధం . ఎవరు ఏ మార్గం లో సేవించినా  ,ఆ దారి తననే చేరుతుంది అని స్పష్టంగా చెప్పాడు .అందుకే అన్ని ధర్మాలను అన్నిమార్గాలను సమన్వయము చేస్తూ ”భగవద్గీత ”అర్జునిద్వారా మనకు బోధించి తన అవుతార తత్వాన్ని తెలియజేశాడు. పూర్ణ కళలతో భగవంతుడు కృష్ణావతారం దాల్చాడు  .
  జరాసంధుడు 18 సార్లు ప్రతిసారీ 23 అక్షౌహిణుల సైన్యం తో మధురపై దాడి చేశాడు . ఆసైన్యాన్ని అంతటినీకృష్ణ బలరాములు ఇద్దరే సంహరించారు .ఒక అక్షౌహిణి అంటే 10 వేల  రథాలు ,20 వేల  గుర్రాలు 40 వేల  కాల్బలం  . అంటే23 x 18=414 అక్షౌహిణుల సైన్యాన్ని బలరామకృష్ణులిద్దరే సంహరించారు .దేనికోసం ధర్మ సంస్థాపనకోసమే . అంటే కర్తవ్య దీక్ష మూర్తీభవించిన అవతారం కృష్ణావతారం …
  స్వామి త్యాగీశానంద గొప్ప వేదాంతి  మహా గొప్ప సన్యాసి . ప్రాక్ పశ్చిమ వేదాంతాలను క్షుణ్ణంగా చదివి లోతులు తరచినవారు .ఆయన కృష్ణుని గురించి చెబుతూ ”The lord of the autumn moon ”శరత్ చంద్ర ప్రభువు అన్నారు అంటే శరత్కాలం పౌర్ణమి వెన్నెల మనోహరంగా హృదయాహ్లాదంగా పరవశంగా ఉంటుంది అలాంటి పున్నమిచంద్రుడు కృష్ణుడు అని అర్ధం . ఆయనే శ్రీ కృష్ణుడు గొప్ప రాజకీయ నిపుణుడు – స్టేట్స్ మన్ అన్నారు ఆయనే ఆయన జగదురుత్వాన్ని గురించి చెబుతూ ”Krishna is the first teacher in the  history of the world to discover and proclaim the grand truth of love for love’s sake    and duty for duty’s sake ”అని గొప్పగా కృష్ణ గురుత్వాన్ని ఆవిష్కరించారు .అందుకే కృష్ణం వ0దే  జగద్గురుమ్ .               గోలోకం
మనలో చాలామందికి భాగవత భారతాలగురించి తెలుసు .కానీ కృష్ణుడికి ప్రత్యేకంగా ఒక లోకమే ఉందని తెలియక పోవచ్చు .బ్రహ్మ వైవర్త  పురాణం ”లో శ్రీ కృష్ణ ఖండం ”లో ఆ వివరాలన్నీ ఉన్నాయి .కొద్దిగా ఆ వివరాలు తెలుసుకొందాం .గోలోకం అన్ని లోకాలకంటే పైన ఉన్నది .అందుకనే ఆశీర్వదించేటప్పుడు ”గోలోకే నిత్యనివాస శాశ్వత సిద్ధి రస్తు ”అని దీవిస్తారు .వైకుంఠ లోకానికి 500 మిలియన్ యోజనాల దూరం లో అంటే 4,00000,0000మైళ్ళు .దాని విస్తీర్ణం(ఏరియా ) 30మిలియన్ యోజనాలు అంటే 24,00000,0000 మైళ్ళు .
  గో లోకం లోరాధా కృష్ణులు ఉంటారు . వీరిద్దరితో సహా గోప గోపికల   అందరి వయసు 16 సంవత్సరాలే దీనికి ”కిశోర ప్రాయం ”అంటారు .అదీ ఈలోగా ప్రత్యేకత ..చేతిలో మురళి వక్షస్థలంపై కౌస్తుభ మణి  ధరించి గోప వేషం లో శ్రీ కృష్ణుడు గోపీ జనం తో సదా రాసమండల విహారిగా సర్వ సిద్ధి స్వరూప ,సర్వసిద్ధి ప్రదాత ,ఆదిపురుష అవ్యక్త స్వరూపంగా ఉంటాడు అని బ్రహ్మ వైవర్త పురాణం చెప్పింది ..రాస లీలలు అంటేవిశృంఖల శృంగారం(రిబాల్డ్రీ  ) కాదు ,అది జీవాత్మపరమాత్మల సంధానమే అని నిరూపిస్తూ ఒక పుస్తకం రాసి అందరి కళ్ళు తెరిపించింది  అనీబిసెంట్  .  శ్రీ కృష్ణుని కుడి భాగం నుండి సత్వ ,రజస్ ,తమో గుణాలు  వాటి నుంచి అహంకారం ,పంచభూతాలు ,పంచ జ్ఞానాలు ఏర్పడ్డాయి. తరువాతా నారాయణుడు   జన్మించాడు .ఆయన ఎడమభాగం నుంచి లక్ష్మీదేవి పుట్టి భార్య అయింది ..కృష్ణుని ఎడమభాగం నుంచి ”సదాశివుడు ”అయిదు ముఖాలతో దిక్కులే వస్త్రాలుగా (దిగంబరం )సకల సిద్ధేశ్వరునిగా ,గురువుకే గురువుగా ఉద్భవించాడు ఆయన మృత్యుంజయుడు ,మృత్యు స్వరూపుడు ..నాభి నుంచి చతుర్ముఖ బ్రహ్మ కమండలం ,జపమాలతో పుట్టి  జీవుల ప్రాణదాత అయ్యాడు .శ్రీ కృష్ణ వక్షస్థలం నుంచి ”ధర్మ దేవత ” ఈయన ఎడమభాగం నుంచి ”మూర్తి ”పుట్టి ఆయన భార్య అయింది ..కృష్ణుని ముఖం నుంచి వీణా,పుస్తక ధారని సరస్వతి షోడశ వర్ష కన్యగా జన్మించి బ్రహ్మ భార్య అయింది .మనసునుంచి మహా లక్ష్మి  బుద్ధినుంచి ”మూలప్రకృతి -ఈశ్వరి ”జన్మించి వెయ్యి భుజాలతో దుర్గతి నాశిని దుర్గగా భాసించింది .ఈమె సర్వ శక్తులకు మూలం శ్రీ కృష్ణుని శక్తి స్వరూపమే దుర్గ .
  శ్రీ కృష్ణుని నాలుక చివర వేదమాత గాయత్రి జన్మించింది .మనసునుంచి మన్మధుడు ,అతని ఎడమభాగం నుంచి రతీదేవి పుట్టి భార్య అయింది .శ్రీ కృష్ణ వామభాగం నుంచి రాధ జన్మించింది .ఈమె కిశోర వయస్క .కృష్ణుని రోమాలనుంచి గోపాలుడు రాధ రోమాలనుంచి గోపికలు పుట్టారు .కృష్ణుని మనసునుంచి నారదుడు పుట్టి పుట్టగానే నారం అంటే నీటిని ఇచ్చాడు నారం అంటే జ్ఞానం కూడా .జ్ఞానప్రదాత నారదుడు ..బ్రహ్మ కంఠం నుంచి ”నరదులు ”అంటే మానవులు పుట్టారు .ఈ విధం గా అఖిల ప్రపంచాన్నీ సృష్టించి పాలించి ,తనలో లయం చేసుకొంటాడు శ్రీ కృష్ణ పర బ్రహ్మ . ఇంతటి అఖండ పరమానంద స్వరూపమైన శ్రీ కృష్ణుని మనసారా పూజించి గుణగానం చేసి ఎందరో మహాత్ములు పునీతులయ్యారు .
   చింతామణి అనే వేశ్య వలయం లో చిక్కిన బిల్వ మంగళుడు చివరికి తన తప్పు తెలుసుకొని సన్యాసియై ”లీలా శుక” నామం ;;తో ”శ్రీ కృష్ణ కర్ణామృతం ”రాసి ధన్యుడయ్యాడు .మనకు పరిచయమైన”కస్తూరీ తిలకం లలాట ఫలకె ”శ్లోకం అందులోనిదే .ఆయనే తిరువనంతపురం (త్రివేండ్రం )లో శ్రీ అనంత పద్మనాభ స్వామి దివ్య దర్శనం పొంది మొదటగా పూజించిన పుణ్యశాలి ,అనంత పద్మనాభునిలో త్రిమూర్త్యాత్మకం రూపం మూడు తెరలనుండి దర్శిస్తాం . శ్రీ కృష్ణుడు ద్వారక మునిగిపోయేటప్పుడు సోమనాధ్ లో ఒక అడవిలో నేలపై పడుకోగా ఆయన కాళ్ళను లేడికళ్ళు అని భ్రమించిన వేటగాడిబాణం తో ప్రాణాలు విడిచాడు . ఆ వేటగాడు పూర్వ జన్మలో వాలి .కృష్ణుడు తన భక్తుడు ఉద్ధవుడికి తన రూపాన్ని విగ్రహం గా చేసి ,మునిగిపోయే ద్వారకను వదిలి ఎక్కడైకైనా వెళ్ళిపోయి అనువైన చోట ప్రతిష్టించమని చెప్పాడు .ఆయన తిరిగి తిరిగి పరశురాముని సాయం తో శివుని అనుజ్ఞతో కేరళలోని ”గురువాయూర్ ”లో ఆ విగ్రహం ప్రతిష్టించాడు ..ఇది గొప్ప కృష్ణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది .ఇక్కడి నారాయణ భట్టు కవి ”నారాణీ యం ”రాశాడు

లీలాశుకుని శ్లోకం తో సమాప్తి చేస్తా –

హి గోపాలక హే  కృపా జలనిధే  హే  సింధు కన్యాపతే -హే కంసాంతక హే గజేంద్ర కరుణా పారీణ హే  మాధవ-హే  రామానుజ హే” జగత్రయ గురో ”హే పుండరీకాక్ష మామ్ -హే  గోపీ జననాధ పాలయ పరం జానామి న త్వామ్ పరం ”

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-16-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా


Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జాతీయ పతాక పిత పింగళి వెంకయ్య

clip
Posted in వార్తా పత్రికలో | Leave a comment

 సంసారంలో రిగమపదనిసలు 

సంసారంలో రిగమపదనిసలు

ఒక కాలనీలో ఆటగాళ్ల ,సంగీత వాద్యకారుల సంతానం నోచుకోని  భార్యలంతా చిన్న బోయిన ముఖాలతో ఆ కాలనీకి పెద్ద బాలమ్మగారి ఎదుట  ఒక రోజు సమావేశమై తమ సంసార గోడు వెళ్ళ  బుచ్చుకొని ఏదైనా సలహా చెప్పమని కోరారు .  .

 ముందుగా క్రికెట్ లో బౌలర్ భార్య ”బామ్మా !ఏం చెప్పను నా గోడు .ఆటలో వికెట్లు తీస్తాడుకాని మా అయన పెళ్లయి నాలుగేళ్లయినా ఇంట్లో ఇంతవరకు ఒక్క ”వికెట్ ”కూడా తీయలేదు ”అంది . వెంటనే బాట్స్ మన్ పెళ్ళాం ”నా బాధ ఏం చెప్పుకొను ? ఆటలో సెంచరీలపై సెంచరీలు చేస్తున్నాడు .మూడేళ్లయింది కాపరానికొచ్చి ఎప్పుడూ ”డకౌటే ”నా ఖర్మకాలి అని ముక్కు చీదుకొన్నది . వెంటనే వికెట్ కీపర్ భార్యఅందుకొని ”గ్రౌండ్ లో ఏ బాలూ మిస్ కాకుండా కాచ్ పడతాడు . ఒంట్లో బాల్స్ సంగతి పట్టించుకోడు నేనెవరికీ చెప్పుకోను ”?అంది బొటబొటా కన్నీళ్లు కారుస్తూ . అంపైర్  పెళ్ళాం రంగం లోకి దూకి ”ఫోర్ కి ,సిక్స్ కి వైడ్ కి  అవుట్ కి చేతులు చాపే  మాఆయన మంచం మీద మాత్రం చేతులు  చెప్పనే  చాపడు .ఇంకపిల్లలేం పుడతారు మామ్మా “‘అంది గోడు గోడు మంటూ .

  ఆటగాళ్ల పెళ్ళాల వంతు అయ్యాక వాద్య  కారుల  భార్యలు బాధా ఆరోణ అవరోహణాలు మొదలుపెట్టారు .ముందుగా  తబలా ఆయన భార్య ”సంగీతం అంటే పరిగెత్తుతాడు .మృదంగం రెండు కాళ్ళమధ్యా పెట్టుకొని ఎడా పెడా వాయిస్తూ, పాడేవాడికి చక్కని సహకారం అందిస్తాడు మాఆయన .కానీ సంసారం లో నేను సహకరిస్తున్నా దులభరిస్తూ  దూరం జరుగుతాడు .ఇక వాయింపుకేం నోచుకోను ”అని గోడుగోడుమంది . వయోలిన్ కళాకారుడి భార్య ”బామ్మా !తీగలు మీటటం లో ఉన్న ఆనందాన్ని తనువు  తీగ మీటటం లో చూపించటం లేదు .ఇక శ్రుతికలీసే దెప్పుడు  సంతానం కలిగేదేప్పుడే బామ్మో బామ్మ ”అని కన్నీరు కార్చింది . వెంటనే గాప్ లేకుండా వీణ ఆయన పెళ్ళాం అందుకొని ”కిందోబుర్ర ,పైనో బుర్రా ఉన్న తీగలపై టింగ్ టింగ్ మని గోళ్ళతో మీటు  తాడేకాని రెండు బుర్రలూ పక్కపక్కనే ఉన్నా తాకనైనా తాకేదే బామ్మా ఇక మీటుడు  సంగతే0 చెప్పను  .చెప్పుకొంటే సిగ్గుచేటు ”అని కన్నీరొలికించింది . .తర్వాత విరామం లేకుండా ఘటం –సారీ  ,సారీ  ఘటం వాయించే ఆయన పెళ్ళాం ”ప్రాణం లేని మట్టి కుండఒళ్ళో పెట్టుకొని .తలకాయ అటూ ఇటూ తిప్పుతూ సంగీతానికి తగినట్లు వాయించే మా ఆయన ,కళ్లెదుట సజీవ  బాండాలున్నా తకధిమి తో0 అనటంలేదు మామ్మో ”అన్నది .
  ”ఒసే పిల్లల్లారా !మీ బాధ విన్నాను .గుండె కరిగి పోతోందే .. నేను ఒక సలహా చెబుతా .పట్టు వదలకుండా సాధన చేయాలి ”అన్నది బామ్మ బాలమ్మ . ”చెప్పు బామ్మా -తూచా తప్పకుండా పాటిస్తాం ”అన్నారు అందరూ ఏక కంఠం తో .అయితే వినండి ”మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ మొగుళ్ళు చాలా మంచి వాళ్ళుగానే కనిపిస్తున్నారు .మీరూ ఇంకా మంచి వాళ్ళుగానే అనిపించారు .కానీ ఒత్తి వాజమ్మలు అనిపించింది నాకు . ఆట అవతలివాడు మొదలు పెట్టక పోతే మనమే ముందు మొదలు పెట్టాలి అంతే  కానీ నంగ నాచి  తుంగ బుర్రల్లాగా ఉంటె ఫలితం ఉండదు ”అన్నది . అప్పుడు అందులో ఒకావిడ ”బామ్మా !ఇందులో నీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటె చెప్పు .ప్రాక్టికల్ ఫిలాసఫీ మంచిదికదా ”అంది .దానికి బామ్మ ”నిజమేనర్రా .నేనే దీనికి ఉదాహరణ .మీభాషలోరోల్ మోడల్ అనుకోండి . మా ఆయన కుస్తీ ఫహిల్వాన్ .ఎప్పుడు ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా వెళ్లి పోయేవాడు అక్కడే తయారు తిండి తిని పోటీలో పాల్గొని గెలిఛీ ఓడీ వస్తూ ఇంటికొచ్చి గుర్రుపెట్టేవాడు .రెండేళ్లు ఓపికపట్టా . ఒక రోజు అనుకోకుండా మా బామ్మ వచ్చింది .ఆవిడ దగ్గర మీలాగానే నా బతుకు వెళ్ళ  బోసుకొన్నా .ఆవిడ తేలిగ్గా తీసుకొని ఉపాయం చెప్పింది .దాన్ని బెసగ కుండా  మా ఆయనపై ప్రయోగించా .ఏడాది తిరిగేటప్పటికీ కోడి రామమూర్తిలాంటి కొడుకు పుట్టాడు .ఆ కిటుకే ఇప్పుడు మీకు చెబుతా విని ఆచరించండి . మీ మొగుళ్ళు అటాక్ ఇవ్వకపోతే మీరే అడ్వాంస్ అవ్వాలి .నయానా భయానా కాలం దాటి పోయింది .ఇక వీర విజృంభణమే చెయ్యాలి మీరు . ఇంట్లో విజయం లేకపోతె బయటి విజయానికి సహకరించమని భీష్మించండి బెసఁగఁ నీయకండి . ఉడుం పట్టుపట్టండి . అనుకొన్నది సాధించండి మొహమాట పడద్దు . వాళ్ళ అభ్యంతరాలన్నీ తోసిపారేయండి . ముందుకు దూకండి .ఆతర్వాత ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు బోలెడు సినిమా సీరియళ్ల అనుభవాలున్నమీరు ఏడాది తిరిగే లోపు పండంటి బిడ్డలతో నాకు కనబడాలి .ఈ లోపు మీ మొహాలు కూడా నేను చూడను ”అన్నది .అందరికి బల్బ్ వెలిగింది .దూకుడుగా ఇళ్లకు వెళ్లిపోయారు బామ్మకు తాంక్స్ చెప్పి .
  సరిగ్గా ఏడాదికి మళ్ళీ వాళ్లంతా  చంకలో  పిల్లనో ,పిల్లాడినో ఎత్తుకొని బామ్మ తో సమావేశమయ్యారు .అందరి ముఖాలలో నవ్వు వరదలై ప్రవహిస్తోంది .అందరూ ముక్త కంఠం తో ”బామ్మా !నీకు  థాంక్స్ . నువ్వు చెప్పినట్లే చేసి పిల్లల్ని సాధించాం ”అన్నారుఆనందంగా . ‘ఒసే బానే ఉంది కానీ పిల్లలకు ఏం పేరు పెట్టారే ”అని అడిగింది .వాళ్ళు బామ్మ పేరుమీదుగా ఆడపిల్లకు బాలమ్మ అని మగపిల్లాడికి బాలయ్య అని పేరు పెట్టినట్లు ఉత్సాహంగా చెప్పారు  .పాపం ఇప్పుడు బాలమ్మబామ్మ కళ్ళ వెంట ఆనంద  బాష్పాలు  కారిపోయాయి .ఇందరు మనవాళ్ళు మనవరాండ్రను చూసే సరికి . వాళ్లందరికీ మర్నాడు భర్తలతో సహా తన ఇంట భోజనాలు ఏర్పాటు చేసి కడుపు నిండా తినిపించారు బాలమ్మ దంపతులు. పిల్లలందరికీ కొత్త చొక్కాలాగు లంగా లు కొని వాళ్లకు ఇచ్చి తొడిగించారు .  . వీళ్ళు ఊరుకుంటారా అందరూ ఆ దంపతులకు తమ శక్తికొద్దీ కొత్తబట్టలు పెట్టి ఆశీర్వాదం పొందారు
   శ్రీ కృష్ణాష్టమి, భారత 71 వ స్వాతంత్య్ర  దినోత్సవ శుభా కాంక్షలతో .

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-17 -కాంప్ -షార్లెట్-అమెరికా . 

— Image result for krishnam vande jagadgurum sri krishnaPakistan hoists biggest flag on border with India to mark independence day

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భారత స్వాతంతత్య్ర దినోత్సవం శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

50+ Adorable India Independence Day 2017 Wish Pictures And Images


Happy sri krishnashtami 2016 wishes in telugu latest whatsapp messages, greetings, below 10 MBGokulashtami
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పోతుకూచికి నివాళి

clip

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -20(-7-8-17నుండి 13-8-17 )వరకు -కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం

వీక్లీ అమెరికా -20-(7-8-17నుండి 13-8-17 )వరకు

-కస్తూరి వెంకయ్య అరంగేట్ర వారం

శీర్షిక కంఫ్యూజింగ్ గా ఉందా? కిందకి వస్తే అదే తేటతెల్లమవుతుంది .

-7-8-17 సోమవారం -అమెరికా వచ్చి నాలుగు నెలలయింది – మార్చి 30 న సీజన్ లో మామిడిపళ్ళు తినటం మొదలుపెట్టి ఈ రోజువరకు అంటే నాలుగునెలలపై 15 రోజులవరకు మామిడిపళ్ళు తింటూనే ఉన్నాం . మా జీవితం లో ఇంత లాంగెస్ట్ మామిడి సీజన్ ఇదే . మా అమ్మాయి పటేల్ బ్రదర్స్ లో పండ్లు కనబడటం ఆలస్యం కొని తెచ్చి తినిపిస్తోంది ..గీర్వాణం -3 లో 394 వరకు రాశా ..ఇవాళ శ్రావణ పౌర్ణమి జంధ్యాలపౌర్ణమి .నూతన యజ్నోపవీతం  ధరించాను

మంగళవారం -..మచిలీపట్నం హిందూకాలెజ్ హిస్టరీ హెడ్ శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఆధునిక ప్రపంచానిర్మాతలు కు ముందుమాట రాయమని కోరగా వెంటనే అంగీకరించటం వారికి ఫైల్ ను ఫార్వార్డ్ చేయటం జరిగిపోయింది అవధాన సరస్వతి .శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి గీర్వాణం -3 కు ముందుమాటరాయమని  మెయిల్ పెట్టిన వెంటనే జవాబు ఇస్తూ తప్పక రాస్తానని తెలియజేశారు . వారు ఆగస్టు 27 అమెరికావచ్చి సెప్టెంబర్ 27 మళ్ళీ ఇండియా చేరుతారు . కనుక ఆతర్వాత ఆపని చేస్తానంటే సరే అన్నాను .
  91 ఏళ్ళ శ్రీ పోతుకూచి సాంబశివరావు గారు మరణించిన వార్త చూశాను .ఆయన ఆంద్ర పత్రిక లేక ప్రభ వీక్లీ లో సీరియల్ గా  రాసిన ”ఏడు రోజుల మజిలీ ”నవల బాగా నచ్చింది .10 ఏళ్ళక్రితం ఒకసారి ఆయనకు ఫోన్ చేసి హైదరాబాద్ లో వారింటికి వెళ్లి ఒక అరగంట సేపు మాట్లాడాను .మంచి సంభాషణా చతురులు ఆయన .ఒక మాసపత్రిక కూడా నడిపేవారు .
 బుధవారం -గీర్వాణం -3 ను 410 వరకు లాగించా .
  గురువారం -”కస్తూరిసేవా పరిమళ వ్యాప్తి ”రెండుభాగాలు రాశా .ఇంద్రజ ,నారా రోహిత్ ,లవకుశ నాగరాజు ల ఇంటర్వ్యూలు చూశా .నాగరాజు తన స్నేహితుడు హైదరాబాద్ ఝాన్సినగర్ లో కట్టించిన శ్రీ షిరిడీ సాయిబాబామందిరం లో భార్యతో  సేవలో  ఉంటున్నాడట .ఇంద్రజ కూ  ఇద్దరుబాబాలు పూజనీయులేట .”గొట్టం” లో  నారా నటించిన రౌడీ ఫెలో చూశా కొల్లేరు సరస్సు ,ఆక్రమణపై కథ  బాగా చేశాడనిపించింది .
11-8-17 శుక్రవారం -వెంకయ్య 15 వ ఉపరాష్ట్ర పతిగా ప్రమాణ స్వికారం   చేశాడు .అఖిల భారతీయవిద్యార్థి పరిషత్ లో క్రియా శీలకం గా  పని చేసినవాడు అత్యున్నత పదవిని అలంకరించటం మనకు గర్వకారణం . అత్యున్నత పదవులలో ఈనాడున్న అత్యంత సామాన్యులు ప్రధాని మోడీ  ,రాష్ట్రపతి కోవింద్ ,ఉపరాష్ట్రపతి ఉషాపతి వెంకయ్య . స్పీకర్ సుమిత్రా మహాజన్ తో కూడా కలిపితే బిజె పి నాయకులు నలుగురు అత్యున్నత పీఠాలపై ఉండటం ఆపార్టీకి గర్వకారణం  మోడీ ,షా ల చాకచక్యం .చాణక్యం
  సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు శ్రీ కోట గురుదేవుల గురు పూజోత్సవ కార్యక్రమం తయారు చేసిపంపాను. కస్తూరి 3,4 రాశా .
                 అరంగేట్రం
12-8-17 శనివారం – కస్తూరి 5 రాసి ముగించా .
  ఇక్కడ మా కమ్యూనిటీ లోనే ఉన్న గుజరాతీ దంపతులు ప్రేరా ,అనుపమ పటేల్ లకుమార్తె కుమారి త్విషా పటేల్ భరతనాట్యం శ్రీమతి రాధికా ఉన్నితన్ వద్ద నేర్చి ఈ రోజు హాల్టన్  ధియేటర్ లో అరంగేట్రం చేసింది .అందరం వెళ్లాం 4-45 కు బయల్దేరి చూడటానికి  .సరిగ్గా 5గంటలకు ప్రారంభమైనది . షణ్ముఖ ప్రియ రాగం లో గణేశఅంజలి ముందుగా చేసింది .తర్వాత నాటరాగం లో అలరిపు (అలరింపు ),రసాళిరాగం లో జతిస్వరం ,రాగమాలికలో శబ్దం, ధన్యాసిరాగం లో వర్ణం లను కృతులు కీ ర్తనలకు తగినట్లుఒక గంట సేపు  అభినయించింది .
  తర్వాత ఒక 20 నిమిషాలు విశ్రాంతి-అందరికి సమోసా మాంగో జ్యుస్ , టీ  ఇచ్చారు .
  విరామానంతరం  హిందోళ  రాగంలో మైసూర్ వాసుదేవాచార్య కృతి”మామవతు”  సరస్వతీ దేవీ స్తుతి ,తర్వాత శివ తాండవానికి శివా అంటే పార్వతీదేవి చేసే ”లాస్యం ” చివరగా తిల్లాన కు నాట్యం చేసి , ఆతర్వాత  తండ్రికోసం గుజరాతీ పాటకు, తల్లికోసం హిందీ పాటకు నృత్యాభినయం, చేసి చివరకు నా ట రాగం లో మంగళం లో దేవుడికి గురువుకు ప్రేక్షక దేవుళ్ళకు విన యాంజలి ఘటించి  ఒక గంటలో ముగించింది .గురువు శ్రీమతి రాధికగారు నట్టువాంగం చేస్తూ ప్రోత్సహించింది . హావ భావాలు బాగానే ఉన్నాయి .కానీ ప్రతి అంశం  7లేక 8 నిమిషాలకంటే లేకపోవటం ,ఏదో చేసేసి వెళ్ళిపోదాం అన్నట్లు చేయటం గా నాకు అనిపించింది.  భరతనాట్యం పధ్ధతి ఇంతేనేమో నాకు తెలియదు   తర్వాత అందరికి డిన్నర్ . రోటీ ,రెండునాకుకూరల పులుసులు సువీత్ ,పులిహోర ,బిర్యానీలాంటిది ,అప్పడం .కావాల్సినవాళ్లకు కోకాకోలా .  రోటీ ఒకటిన్నరముక్క స్వీట్ అప్పడం తో లాగించా అంతే .      .
  ఇంతకు ముందు మేము చూసిన కుమారి రచిత కూచిపూడి రంగ ప్రవేశమే  నాకు బాగా నచ్చిందేమో అనిపించింది . మనకు నచ్చటం నచ్చకపోవడం అటుంచి ఇంగ్లిష్ లో చదువుతూ ,క్షణం ఖాళీ లేని విద్యా జీవితం గడుపుతూ ఇ0త  ఉత్సాహంగా అంకితభావం తో తమదికాని భాషలో ,తమభాష కాని  గురువువద్ద క్రమశిక్షణతో నృత్యం నేర్వటం ఆ చిన్నారుల పట్టుదల క్రమశిక్షణ ,అకుంఠిత దీక్ష కు జోహార్లు .మన సంస్కృతిని ఇక్కడ ఇంత గొప్పగా ప్రదర్శిస్తూ మన్ననలు అందుకోవటం సామాన్యమైన విషయంకాదు .ఆ పిల్లల తలిదండ్రులకున్న అభిరుచి గురువుపై నమ్మకం , ఎన్నో వేలడాలర్లు ఖర్చుపెట్టి నేర్పించటం ,రంగప్రవేశ అరంగేట్రాలకు కూడా సంకోచంలేకుండా డబ్బు ఖర్చు చేయటం చూస్తుంటే వీరందరికి ఉన్న ఉత్తమాభి రుచికి మనస్ఫూర్తిగా తప్పక అభినందనలు తెలియ జేయాల్సిందే . మేరా  భారత్ మహాన్ .
  13-8-17 ఆదివారం -ప్రొద్దున ,మధ్యాహ్నం ”శంకరాభరణం పాలెస్ ”కిట్టుగాడున్నా డు జాగ్రత్త” యు ట్యూబ్ లో చూశా . సరదాగా ఉన్నాయి . రమణ ఫోన్ చేసి ఉయ్యూరులో సేవింగ్స్ ఏజెంట్  మండా  ప్రసాద్ భార్య శ్రీమతి పావని చనిపోయినట్లు తెలిపాడు.పాపం ఆమె రెండేళ్లనుంచి కేన్సర్ తో బాధ పడుతోంది . వైద్య లోపం ఏమీలేదు .ఖరీదైన వైద్యమే చేయించారు . నేను మార్చి చివర్లో ఆమెకు రీకరింగ్ డిపాజిట్ కట్టాను కూడా ..అలాగే ఈవారం లోనే మా పెద్దకోడలు అమ్మక్కయ్యగారు శ్రీమతి భవానిగారు కూడా చనిపోయినట్లు తెలిసింది  .ఈ ఇద్దరి ఆత్మలకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను . ఆకుటుంబాలకు మా సానుభూతి తెలియ జేస్తున్నాను
  వాగ్గేయకారుడు మైసూర్ వాసుదేవాచార్య సంస్కృతం లో కృతులు రాశాడని తెలుసుకొని గీర్వాణం 3 లో 411 వ కవిగా ఇప్పుడే ఆయన గురించి రాశాను.. ఈ వీక్లీ సమాప్తం .
   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-17-కాంప్-షార్లెట్-అమెరికా


Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961)

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3

311-రామాయణాన్ని స్వరపరచిన –పద్మభూషణ్ మైసూర్ వాసుదేవాచార్య (1865-1961)

28-5-1865 న కర్ణాటకలో లోమధ్వ  బ్రాహ్మణకుటుంబం లో జన్మించిన సుప్రసిద్ధ కర్ణాటకసంగీత  విద్వా0సుడు ,త్యాగరాజస్వామి శిష్యుడు మైసూర్ వసుదేవాచార్య పద్మ భూషణ పురస్కార గ్రహీత . మైసూర్ మహారాజా ఆస్థాన వైణిక విద్వా0సుడు వీణ పద్మనాభయ్య వద్ద సంగీతం అభ్యసించాడు .సంస్కృతం వ్యాకరణ కావ్య అలంకార ,తర్క పురాణ ,ఇతిహాసాదులను మహారాజా సంస్కృత  కళాశాలలో విడిగా సంగీతం నేర్చుకొంటూనే  అభ్యసించాడు . మహారాజూ అందజేసిన పారితోషికం తో ప్రసిధ్ధ సంగీత విద్వా0సుడు పట్నం సుబ్రహ్మణ్య పిళ్ళై దగ్గర ,కావేరి డెల్టా లోని అనేక ప్రసిద్ధ సంగీత విద్వా 0సులవద్ద సంగీతపు లోతులు తరచి తెలుసుకొన్నాడు  .

 వాసుదేవాచార్య సంగీత విద్వత్తుని గుర్తించిన మహారాజు ఆస్థాన సంగీత విద్వా0సుని చేసి గౌరవించాడు . గురువు వద్ద నేర్చిన మాధ్యమకాల తానం లో మహా నిష్ణాతుడయ్యాడు .గురువు పట్నం ,శిష్యుడు మైసూర్ ను కీర్తనల రచనల విషయం లో  సలహాలు తీసుకునేవాడు. ఇది శిష్యుడికి బాగా ఉపయోగపడి వాగ్గేయకారుడవటానికి తోడ్పడింది . వాసుదేవాచార్య కర్ణాటక సంగీతం లోని రాగం ,తానం ,ఆలాపన ,పల్లవి  ,కల్పనస్వరాలలో సాటిలేనివాడయ్యాడు

 వాసుదేవాచార్య తాను  రచించిన సంస్కృత ,తెలుగు కృతులు 200 లను ‘’వాసుదేవ కృతి మంజరి ‘’గా ప్రచురించాడు .ఈ రెండుభాషలలో ఆయనరాసినవి సుమధురంగా  భాషా పరిజ్ఞానంతో భాసిస్తాయి .తెలుగు  హృదయం లోకి ప్రవేశించటం త్యాగరాజ గురు భిక్ష అని వినయంగా చెప్పుకొనేవాడు .ఇతర దాస కూట ద్వైత గీతాలలాగా కాకుండా ఈయన గీతాలు  ‘’పరమపురుష వాసుదేవ ‘’లేక ‘’వాసు దేవ’’అనే విష్ణు నామం తో విరాజిల్లటం విశేషం . అదే ఆయన ‘’ముద్ర ‘’కూడా .త్యాగరాజ శిష్యపరంపర లోని వారిలాగే ఈయనా శ్రీ రామునిపైనే ఎక్కువ కృతులు ,కీర్తనలు  రాశాడు.వర్ణాలు ,తిల్లాన శ్లోకాలు కూడా రాశాడు .కర్ణాటక సంగీత త్రిమూర్తులలో అద్వితీయుడైన త్యాగ బ్రహ్మం గారిని కళ్యాణిరాగ కీర్తనలో ‘’శ్రీ మదాది త్యాగరాజ గురువారం ‘’అంటూ స్తుతించాడు .ఒక రాగమాలికలో శ్రీరామ చంద్రుని మరి రెండు రాగమాలికలో ముత్తుస్వామి దీక్షితులు ,శ్యామశాస్త్రి ని కీర్తించాడు .వాసుదేవాచార్య కృతులు చక్కర పాకం లాగా మధు మధురంగా ఉండటం విశేషం .

 కన్నడం లో తన జీవిత చరిత్ర ‘’నేనపు గలు ‘’(జ్జ్ఞాపకాలు )పుస్తకం ,తనకు తెలిసిన సంగీత విద్వా 0సుల జీవిత చరిత్రలను ‘’నా కంద కలవిదరు ‘’గ్రంథం గా రాశాడు .వృద్ధాప్యం పైనబడినా శ్రీమతి రుక్మిణీదేవి అభ్యర్థనపై ఆమె కళాక్షేత్రం లో ముఖ్య సంగీత విద్వా 0సుడిగా సంగీతం బోధించాడు .సంస్కృత రామాయణానికి సంగీతం కూర్చాడు. ఆయన మరణం తర్వాత మనవడు రాజారామ్ బాధ్యతలు తీసుకొని తాతగారు మొదటినాలుగుకాండలకు సంగీతం కూర్చితే మిగిలినవాటికి సమకూర్చాడు . మరోమనవడు కృష్ణ మూర్తి ఆకాశవాణిలో పనిచేస్తూ తాతగారు రాసిన స్మృతులను ఆంగ్లం లోకి అనువదించాడు . వాసుదేవాచార్య  సంగీత విద్వత్తుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ పురస్కారం అందించి గౌరవించింది . కమాస్ రాగం లో ‘’బ్రోచే వారెవరురా ‘’,సునాద వినోదిని రాగం లో ‘’’దేవాధిదేవ ‘’,హిందోళం లో ’మామవతు సరస్వతీ’’,అభేరీరాగం లో ‘’భజరే రే మానస ‘’అనే ఆయన కృతులు  ఆనంద పులకితు లను చేస్తాయి  .ఆయన భాషా పాండిత్యానికి కైమోడ్పులు సమర్పించేట్లు చేస్తాయి .  96 ఏళ్ళ నిండు జీవనం గడిపిన ఆ సంగీత సాహిత్య సరస్వతి మైసూర్ వసుదేవాచార్య 17-5-1961న తానునమ్మిన వాసుదేవ పదం చేరుకొన్నాడు .

సంస్కృతం లో మైసూర్ వాసుదేవాచార్య కీర్తన సొబగులు చూద్దాం –

1-గంభీర నాట రాగం లో -’’గిరిజా రమణా నటరాజ న శరణ -కరుణారస పూర్ణ స్మరహర నాగాభరణా-

పరవాసుదేవ రధనా ధురీణ కార ధృత హరిణా కలిమల హరణా -మహా పంచాక్షరీ మంత్ర మూర్తే మహాభక్త కౌంతేయ నుత కీర్తే

మహాగణపతి గుహ సేవిత మూర్తే -మహాదేవ  పరిహృత దీనజన ఆర్తే -మహానంది భృంగాది నాట్య ప్రదర్శక కైలాసపతే ‘’.

2-అభేరీరాగం లో -’’గోకుల నిలయ ‘’

3-హిందోళయం లో -’’మామవతు సరస్వతీ ‘’

4-గౌరీమనోహరిరాగం లో -’’వరలక్ష్మి నమోస్తుతే ‘’

5-బిళహరి రాగం లో -శ్రీ చాముండేశ్వరి

6-గరుడ ధ్వని రాగం లో -దేవి కమలాలయే   మొదలైనవి .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

— mysore vasudevacharya 1865 1961 mysore vasudevacharya was a great ...

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )

గోపాలస్వామి మరీ బలవంతం చేస్తే కస్తూరి రేడియో స్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు .. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం . శత్రు సైన్యం మలేషియా దాకా దూసుకు  వచ్చింది ..కనుక ప్రతి వార్తా చాలా జాగ్రత్తగా ప్రసారం చేయాలి . ఇంటి దగ్గర దీనికోసం చాలా చదవాల్సి వచ్చేది . ఢిల్లీ వార్తలు విని అందులోని ముఖ్య విషయాలను కన్నడం లోకిమార్చి చేతితోరాసి ఒక విద్యార్థి చేతికిచ్చి సైకిల్ పై స్టేషన్ కు పంపేవాడు . అక్కడ చదివేవారు ..కావేరి డాం చూడటానికి బృందావన్ గార్డెన్స్ కు జనరల్ వావెల్ వచ్చాడు .ఈవార్తను చదివే అనౌన్సర్ ‘’శ్రోతృగళ్ ‘’అనటానికి బదులు ‘’శతృగళ్ ‘’అని తప్పుగా చదివాడు …దీనికి కస్తూరి పర్యవేక్షణ సరిగా లేదని నెపం వేశారు . 1942 ఆగస్టు 9 ఉదయం ఇంగ్లిష్ న్యూస్  బులెటిన్ కస్తూరి విన్నాడు .అది గాంధీగారి అరెస్ట్ వార్త.వెంటనే కన్నడా నువాదం చేసి సైకిల్ కుర్రాడికిచ్చి స్టేషన్  కు పంపాడు . ఈ వార్తలు విన్న జనం అప్పటికే బజార్లలోకి వచ్చి ముర్దాబాద్  నినాదాలు  ఇచ్చారు .కంగారుపడ్డాడు కస్తూరి . తాను  విన్న ఇంగ్లిష్ న్యూస్ కరెక్టేనా అని అనుమానమొచ్చింది .ఇంతలో మరాఠీ న్యూస్ లో కూడా గాంధీగారి అరెస్ట్ వార్త రావటం తో ఊపిరిపీల్చుకున్నాడు  .అంతగా అప్డేట్ గా ఉండేవాడు . ఇలాంటి టెన్షన్ లు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది .

  వార్తా బులెటిన్ ల క్వాలిటీ పెంపు కోసం మిగిలిన విషయాల కోసం తలలు పట్టుకోవాల్సివచ్చింది ..గోపాలస్వామి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాడు .ఇందులో ఆయన స్వార్ధమూ ఉంది .కస్తూరితో సంప్రదించేవాడు సలహాలు తీసుకొని అమలు చేసేవాడు ..సమాజం లో బిగ్ బిగ్ లగురించి రాసి ప్రసారం చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకొంటారో అని కంగారుఆడేవాడు స్వామి .ఒక సారి ‘’ఫెయిరీ టేల్ ఆఫ్ సిండరెల్లా ‘’ప్రసారం చేస్తుంటే అరిస్టోక్రాట్ ల మనోభావాలకు దెబ్బతగులుతుందేమో నని బాధ పడ్డాడు కూడా …దసరా ఉత్సవాల సందర్భం గా ప్రతి రోజు ఉదయం ప్రసారం చేయటానికి 9 రోజుల సంగీత కార్యక్రమం బాగా ప్రచారం చేసి మంచి రిహార్సల్స్ తో నిర్దుష్టంగా సిద్ధం చేశాడు కస్తూరి .   నాలుగు రోజుల ప్రసార0 అవగానే ప్రజాస్పందన అద్భుతం అని తెలిసింది .ఐదవరోజు అమ్మవారిపేరు తన భార్య పేరు ఒకటే అయిందని ఒక వి ఐ పి వ్యతిరేకించాడని స్వామి చెప్పాడు .మిగిలిన రోజు ల కార్యక్రమాలను కాన్సిల్ చేయమని ఒత్తిడి చేశాడు .తిరస్కరించి ప్రసారం చేయాలనే నిర్ణయించాడు కస్తూరి .దీనితో అహం దెబ్బతిన్న డైరెక్టర్ స్వామి కస్తూరిస్థానం లో మరొకరిని నియమిస్తున్నానని చెప్పాడు .ఇలా   అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ పదవి ఊడి మళ్ళీ యుని వర్సిటీ లెక్చరర్ గా చేరాడు ..శ్రోతల నుండి అనూహ్యమైన మద్దతు కస్తూరికి లభించింది . దీన్ని ఓర్వలేక పోయాడు డైరెక్టర్ ..కోపం తీరక మలేరియా విస్తృతంగా ఉన్న ,200 మైళ్ళ దూరంలో ఉన్న షిమోగాలోని ఇంటర్ కాలేజీకి కస్తూరి ని తన్నాడు ..ఆ ప్రాంతం లో ఉద్యోగులకు ప్రతినెలా మలేరియా చికిత్సకోసం జీతం తోపాటు ఒక నెలజీతం ఎక్ట్రా గ్గా  ఇస్తారు .

 కస్తూరి అనే ఫుట్ బాల్ మైసూర్ నుంచి తన్నబడి షిమోగాకు చేరింది .ఇదీ మంచిదేనని పించింది అక్కడి ప్రజల భాష సంస్కృతుల అధ్యయనం చేశాడు .ఇక్కడున్న రెండేళ్ళూ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు యధా ప్రకారం నిర్వహించాడు .వసంతోత్సవాలు జరిపాడు .షిమోగా బాగా ఎత్తైన ప్రదేశం.  విపరీతమైన వర్షాలు పడతాయి .రుతుపవన వర్షాలతో కావేరితుంగభద్ర నదులు పొంగి ప్రవహిస్తాయి .కొండలన్నీ పచ్చ తివాచీ పరచినట్లు ఆహ్లాదంగా కనిపిస్తాయి . నిప్పు సెగలవద్ద ప్రజలు  వెచ్చ దనాన్ని అనుభవిస్తారు . యువ కవి పరమేశ్వరభట్ ,షిమోగా  కర్ణాటక సంఘ కన్వీనర్ విష్ణుభట్ ,కస్తూరి అనే’’ బ్రహ్మ భట్ ‘’బ్రహ్మ విష్ణు పరమేశ్వర త్రిమూర్తులై షిల్లాంగ్ లో ఇది వరకు ఎప్పుడూ ఎవ్వరూ చేయని ‘’వర్షాగమ మహోత్సవం ‘’జరిపారు .దీనికి గుర్తింపు వచ్చి ఆ తేదీని కర్ణాటక లోని షిమోగా కాలెండర్ లో చేర్చి సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది .అదీ వర్షం లోనూ  మట్టివాసనలతోకలిసి సాగిన కస్తూరి పరిమళం .

 మరో విషయం లోనూ కస్తూరి షిమోగాలో విజయం సాధించాడు . ఆశువు (ఇం ప్రాం టు )నాటకాల పోటీ ఔత్సాహిక యువ నాటక నటీ నటులకు  కోసం నిర్వహించాలని ఆలోచించాడు . ఒక గంట ముందుమాత్రమే అయిదు విషయాలు ,సందర్భాలు ఇచ్చి అందులో ఏదో ఒకదానిపై  తయారవటానికి  ఆ గంట ఉపయోగించుకొని ముప్పావు గంట నాటకం వాళ్ళు ఆశువుగా ఆడాలి .వీటిలో గెల్చిన వారికి బహుమతులు ఇస్తారు ..గ్రామీణాభి వృద్ధి కార్యక్రమం లో ఇలాంటివాటిపై బాగా అనుభవం ఉండటం వలన కస్తూరి దీన్ని హాయిగా నిర్వహించాడు .ఈ ఐడియా బాగా క్లిక్ అయి యువజనం లో ఉత్సాహం ఉరకలు వేసి పాల్గొని బహుమతులు పొందారు . మరొక పోటీ ‘’జోక్ క్రాకర్స్ డే ‘’’(నవ్వుల టపాసుల రోజు )ని దీపావళినాడు జరిపాడు . దీనికి కస్తూరి ‘’హాస్య చటాకి ‘’అనే చక్కనిఅర్ధవంతమైన  కన్నడ పేరు పెట్టాడు .. టపాకాయల కోసం డబ్బు తగలేసి కాల్చిపారేయకుండా ఈ హాస్య టపాకాయలు పేలుస్తూ హాయిగా ఆనంద0 అనుభవించాలని కస్తూరి ఆలోచన . ఇదీ ఘన విజయమే సాధించింది . హాస్య కదంబానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ప్రొఫెసర్ ,ఒక డాక్టర్ ,,ఒక లాయర్ ,ఒక వ్యాపారి ,,ఒక బిల్ కలెక్టర్ ,ఒక రైతు లను ఆహ్వానించి వారికి పదేసి నిముషాల టైం ఇచ్చివాళ్లతో జో కులు హాస్య విషయాలు చెప్పించేవాడు .ఇది దీపావళికంటే పెద్ద శబ్దం తో పేలి ,నవ్వుల తారాజువ్వలు హాస్యపు మతాబులు , చెణుకుల కాకర పువ్వొత్తులు ,రిపార్టీల ఆటంబాంబులు తో ఆనంద హాస్యానంద దీపావళి అయి మానసిక సంతోషాన్నిచ్చింది .. ఇది కర్ణాటక అంతా పాకి మెట్రోలలోనూ ప్రవేశించి నవ్వుల దీపావళిగా మారిపోయింది .కన్నడ లిటరరీ అకాడెమి దీన్ని ఘనంగా నిర్వహించటం ప్రారంభించింది .కస్తూరిహాస్య  ప్రయత్నం గంధకం వాసనతో మరింత పరిమళించింది . 1946 లో కస్తూరి  బెంగుళూర్ లోని ఇంటర్ కాలేజీకి బదిలీ అయి కాన్స్టి ట్యూషనల్ అండ్ సోషల్ హిస్టరీ ఆఫ్ బ్రిటన్  సబ్జెక్ట్ ను సెంట్రల్ కాలేజీ  ఇంగ్లిష్ లిటరేచర్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థులకు బోధించాడు .మైసూర్ లోని ఇల్లు అమ్మేసి బెంగుళూర్ లో కొన్నాడు .మైసూర్ కాలేజీకి ,కొరవంజి ,శంకర్ వీక్లీ లకు స్వస్తి పలికాడు కస్తూరి ..

 సమాప్తం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా



Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణాష్టమి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో 14-8-17  సోమవారం రాత్రి 7 గంటలకు సరసభారతి ఆధ్వర్యం లో బాలబాలికలకు శ్రీ కృష్ణ ,రాధా ,గోపిక వేష ధారణపోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయబడును . ఉత్సాహ వంతులైన తలిదండ్రులను తమ పిల్లలను దీనిలో పాల్గొనేట్లు చేయవలసినదిగా కోరుతున్నాము . కార్యక్రమాన్ని సరసభారతి కోశాధికారి శ్రీ గబ్బిట వెంకటరమణ ,కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి,అర్చకస్వామి శ్రీ వేదాంతం మురళీ కృష్ణ నిర్వహిస్తారు .
                                                         గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
                                                       మరియు ఆలయ ధర్మకర్త

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4

1940 జనాభా లెక్కల సేకరణ (సెన్సస్ )కు కస్తూరి  మిత్రుడు కృష్ణ మూర్తి ‘’ఆదికర్ణాటక పురం ‘’ను ఎన్నుకొన్నారు . 12 మంది యువకులను కార్యకర్తలుగా తీసుకొన్నారు .అందులో ఒకడు బ్రాహ్మణ యువకుడు .అతడు’’ ఆ మాల మాదిగ వాటిక ‘’కు రానని భీష్మించాడు .. అతని భయం ,అనుమానం పోగొట్టటానికి కస్తూరి అతనిని ముందుగా అక్కడి హరిజనుల శ్రీ రామ దేవాలయానికి తీసుకు వెళ్ళాడు . అక్కడి హరిజనులు గుండె నిండుగా హరిభక్తి తో చేస్తున్న రామభజన చూసి ఆశ్చర్యపోయాడు .వారికి  హిందూ ధర్మం పై ఉన్న నమ్మక విశ్వసాలకు భక్తికి అతడికళ్లవెంట ఆనంద బాష్పవాలు ధారాపాతంగా కారిపోయాయి . .సెన్సస్ పూర్తిఅయినతర్వాత తన బాచ్ వారికి హరిజనవాడలో నే కస్తూరి విందు ఏర్పాటు చేశాడు .ఆ బ్రాహ్మణ కుర్రాడు ఆనందంగా వారితోపాటు కూర్చుని హాయిగా భోజనం చేశాడు .చివరికి కస్తూరితో ‘’సార్ !ఈ చిన్నవాడిని మీరు ఓడించేశారుసార్ ‘’అన్నాడు కృతజ్ఞతగా ..

 గ్రామీణ సేవా కార్యక్రమ నిర్వాహకుడుగా కస్తూరి తనబృందం తో యూనియన్ తరఫున ప్రతి శనివారం పూర్తిగా ఒక రోజు ప్రోగ్రామ్ మైసూర్ పడమటి భాగం లోని కూర్గ్ హళ్లి గ్రామం లో లో నిర్వహించాడు .బస్సులో   ఆ వూరు వెళ్లి అక్కడి పిల్లలను ఒక చోటికి చేర్చి ఆటలాడించి కథలు చెప్పేవాడు .ఇద్దరు ముగ్గురుకలిసి ఆ పిల్లల ఇళ్లకు వెళ్లి మామూలుగా మాట్లాడుతూ వాళ్ళ ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకొంటూ ఉండేవారు .డాక్టర్లను తమతోపాటు తీసుకు వెళ్లి వారిజబ్బులను పరీక్షింపజేసి మందులు ఉచితంగా ఇచ్చేవారు . వారి వినోదం కోసం నాటకాలుఆడే వారు . ఆధ్యాత్మిక గ్రంథాలు  ఉత్తమ వ్యక్తుల జీవిత గాథలు గ్రామం లోని స్త్రీ పురుషులకు చదివి వినిపించేవారు . కూర్గ్ హళ్లి ప్రజలను బాచీలు బాచీలుగా మైసూర్ తీసుకువెళ్లి మైసూర్ మహారాజు అంతఃపురం  రాయల్ కాటిల్ ఫారం ,రేడియో స్టేషన్ కాలేజ్ క్వాడ్రాంగిల్ మొదలైనవి చూపించేవారు .ఇవన్నీ వారి జీవిత లో ఎప్పుడూ చూడనివి చూడలేనివికూడా ..కస్తూరి బృందం వారికి ఆత్మీయ మిత్రులు సోదరులైపోయారు .వార0దరికి వీరిపై గొప్ప విశ్వాసమేర్పడి స్నేహితులనిపించారు . ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటే ఇదే .. ఇన్ని పనుల్లో మునిగిఉన్నా కస్తూరికి ‘’దక్షిణేశ్వర్ ‘’సందర్శన మనసులో మెదులుతూనే ఉంది . ,ఆటగాళ్ల కాళ్ల మధ్య అటూ ఇటూ తన్నులు తింటూ లక్ష్యం కోసం  గాలికొట్టిన ఫుట్ బాల్  తాను అని అనుకునేవాడు  .

 యుని వర్సిటీ మేగజైన్ లో సరదా కబుర్లుకన్నడం లో  రాసేవాడు కస్తూరి . మాండ్యా  కు చెందిన యువకుడొకడు వీటిని సేకరించి ‘’యద్వా -తద్వా ‘’సంపుటిగా డబ్బు ఖర్చుపెట్టి ముద్రించాడు ..ముఖ చిత్రం లో ఒక రైలు పట్టాలుతప్పినా, పొగ వదులుకొంటూ ముందుకు కదిలే బొమ్మ వేయించి ,పుస్తకం లోపలి తనభావాలు’’ pricking bubbles ,pulling legs ,drawing carpets ,from under feet ,minimising mountains into mole-hills ,holding mirrors to the face ,explosing clay feet ,buldozing castles built in the air ,letting lying ‘’dogs ‘’ snore and forcing sleeping ‘’dogs ‘’bark this was the hobby I loved ‘’అని చెప్పుకొన్నాడుకస్తూరి .. కస్తూరిరాసిన కన్నడ పుస్తకాలు ‘’అల్లోలకల్లోల’’,ఉపాయ వేదాంత ,అంకు మంకు ,నవలలు గాలిగోపురం ,శ0ఖ వాద్యం ‘’,గృహ’’దారణ్యకం ,రంగ నాయకి ,చారిత్రిక రచనలు ,చెంగోళి చెలువ అనే గుమాస్తా జీవితం లోని కన్నీళ్లు ఆనందపు వేణ్ణీళ్ళు .ప్రతిపేరాలో సస్పెన్స్ ,నవ్వాలా ఏడవాలా ,చావాలా బతకాలా అనే సందిగ్ధం .ఇవికాక ‘’అనర్ధ కోశం ‘’అనే ఫిక్షన్ లో పాతమాటలకు కొత్తపదాలు సమకాలీనమైన సరికొత్తపదాల సృష్టి ,పాత సామెతలకు కొత్త రూపాలు తో దీన్ని సమృద్ధం చేశాడు .యూనివర్సిటీ ఫాకల్టీ స్టేటస్ నుపయోగించి కన్నడం లో ‘’అశోక చక్రవర్తి, ‘’సోషల్ ఆంత్రోపాలజీ ,కన్నడం లో ‘’వివాహ వ్యవస్థ ‘’లను మోనోగ్రాఫ్ లుగా రాసి ప్రచురించాడు .ఇంగ్లిష్ లో రీసెర్చ్ పేపర్ గా ‘’కేరళ ఇన్ కర్ణాటక ‘’’’లాస్ట్ రాజాస్ ఆఫ్ కూర్గ్ ‘’రాశాడు .వీటన్నిటిలో కస్తూరి పరిశోధక సృజన పరిమళం వ్యాపించింది ..

‘’కొరవంజి ‘’అనే హాస్య మాస పత్రిక సంపాదకుడు   డా.శివరాం అనే హాస్య రచయిత పరిచయమయ్యాడు .కొరవంజి అంటే పల్లెలలో సోది చెప్పే అమ్మాయి అని అర్ధం . కస్తూరిని తన పత్రికలో రాయమని కోరుతూ ‘’your sense of humour is the golden mean -it can hit without hurting ‘’అని ఆహ్వానించాడు . అంగీకరించి కస్తూరి  10 ఏళ్ళు తన రచనలతో కొరవంజి కి పులకింతలు కలిగించి గిలిగింతలు పెట్టాడు .హాస్య ‘’అపరంజి ‘’ని చేశాడు . ప్రతినెలా పత్రికలో సగం పైగా పేజీలు ‘’కస్తూరి ‘’గుబాళింపు తో ఉండేవి.  .కస్తూరి దీనిలో ‘’రుద్రమ్మ ‘ పాటలి,నాకా ,తారక మొదలైన  ’కలం పేరుతోరాసేవాడు . .ఈ మేగజైన్ లో ఆర్ కె  లక్ష్మణ్  కార్టూన్లు గీసేవాడు .నాదిగ్ అనే మరో కార్టూనిస్ట్ కూడా వేసేవాడు .

 .శంకర్ అనే హాస్య రచయితపూర్తిగా హాస్యం తో తనపేర’’శంకర్స్ వీక్లీ ‘’తె స్తున్నాడని  దాన్ని ప్రధాని నెహ్రు ఆవిష్కరిస్తున్నాడని తెలిసి అందులో తాను ‘’చారివారియా ‘’పద్ధతిలో పంచ్ రాస్తానననీ తెలియజేసి కావాలంటే సాంపిల్ గా  కొన్ని పంపగలనని రాశాడు  కస్తూరి . దానికి శంకర్ జవాబిస్తూ దాన్ని సంపాదక వర్గమే నిర్వహిస్తుందని  కనుక అవకాశం ఉండకపోవచ్చునని తెలియజేస్తే ‘’కొరవి0జి ‘’లో తాను  కన్నడం లో రాసిన ‘’ఊరిగలు ‘’లాంటివి రాసిపంపాడు .శంకర్స్ వీక్లీ విడుదలై మొదటిసంచిక ను శంకర్  పోస్టులో పంపాడు.  అందులో ఒకే పేజీలో ఒకదానికింద ఒకటిగా ‘’ మియర్ ప్రాటిల్ ‘’(కేవలం తడబాటు )శీర్షికలో కస్తూరి రచనలు కనిపించి ఆశ్చర్యం కలిగించాయి . అప్పటినుంచి ఏడేళ్లు శంకర్స్ వీక్లీ లో ప్రతివారం మూడవ పేజీలో  శంకర్ వేసిన కార్టూన్ క్రింద కస్తూరి హాస్యం చెమక్కులూ గుబాళించాయి . కస్తూరి ఎక్కడున్నా దాని సుగంధం వ్యాపిస్తుంది ,మురిపిస్తుంది .

  మహారాజాకాలేజి సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గోపాలస్వామి కస్తూరి చేసే బహువిధ కార్యక్రమాలను దగ్గరగా గమనిస్తూ ప్రిన్సిపాల్ జె సి రోల్లో వార్షికోత్సవం నాడు కస్తూరిని ప్రశంసించటం వేదికమీదనే ఉన్న ఆయన చూసి కస్తూరిని ‘’కామెల్  ఆఫ్ ది కాలేజ్ ‘’ (కాలేజీ ఒంటె )అన్నాడు .అంటే అంతబరువు కస్తూరి మోస్తున్నాడని అర్ధం .ఎన్నిబాధ్యతలు తలకు ఎత్తినా కాదు అనకుండా మోయటం కస్తూరి ప్రత్యేకత .గోపాలస్వామి హాలండ్ కు కాన్ఫరెన్స్ కోసం వెళ్లి తిరిగి వస్తూ ఒక చిన్న ఫిలిప్స్ ట్రాన్సిమిటర్  తెచ్చాడు .  ..దీన్ని మునిసిపాలిటీ వాళ్ళ డబ్బుతో విద్యాకార్యక్రమాలు రోజుకు ఒకగంటసేపు గ్రామీణప్రజలకోసం ప్రసారం చేయాలని భావించి ఈ బాధ్యత కస్తూరికి అప్పగించాడు  . ఏ కొత్తదైనా నిస్సంకోచంగా ముందుకొచ్చి చేసే కస్తూరి గాలిలో కూడా కస్తూరి పరిమళాలను వెదజల్లే అవకాశంరాగా ఒప్పుకున్నాడు ..దీనిలో ప్రసంగించేవారికి ‘’టాంగా ‘’ఖర్చులు మాత్రమే ఇచ్చి సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయ,తాంబూలం ఇస్తానని చెప్పాడు గోపాలస్వామి .కొన్నేళ్ల ప్రయత్న ఫలితంగా షార్ట్ వేవ్ ప్రసారానికి అనుమతి తెచ్చాడు ..దీనితో సుదూర ప్రాంతాలవారికి  వినే  సౌకర్యం కలిగింది .ఒక రోజు స్టాఫ్ రూమ్ అనే ‘’థింక్ బాంక్ ‘’కు వచ్చిస్వామి తన తలనొప్పిని అందరికి అంటించి పరిష్కారం చెప్పమన్నాడు .అదే ఆలిండియా రేడియోకు సమానమైన పదం చెప్పమనిభావం . కస్తూరి క్షణం ఆలోచించకుండా ‘’ఆకాశ వాణి ‘’అన్నాడు .స్వామితో సహా అందరికీ ఆపదం  నచ్చి అలాఇండియా రేడియోకి ‘’ఆకాశవాణి ‘’పర్యాయ పదమైంది కస్తూరి చలువవలన   .ఈవిషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు .నాకు మాత్రం కస్తూరి  జీవిత చరిత్ర చదివాకే  తెలిసిందని నిజాయితీ గా ఒప్పుకొంటున్నాను .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

–              shankar

–   First content item page

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోట మాస్టారి గురుపూజోత్సవం 

కోట మాస్టారి గురుపూజోత్సవం

గురుపుత్రులకు నమస్కారములు -మా గురుదేవులు మీ పితృదేవులు కీశే శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రిగారి గురుపూజోత్సవంఉయ్యూరులో  5-9-17 మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు మధ్యాహ్నం 3 గం లకు సరసభారతి ,శ్రీ అమరవాణీ తెలుగు ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ సంయుక్త ఆధ్వర్యం లో ఆ పాఠశాల ఆవరణలోముఖ్య అతిధి  శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్   ,లయన్స్  క్లబ్ అధ్యక్షులు సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గార్ల ఆధ్వర్యం లో జరుగుతుంది . కనుక తాము తమ కుటుంబ సభ్యులతో ఆత్మీయ అతిథులు గా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయప్రార్ధన .

             కార్యక్రమం
1-గురు దేవుల చిత్ర పటానికి పుష్పమాలాంకరణ ,అతిథులు ,గురుపుత్రులచే చిత్రపటానికి పుష్ప సమర్పణ .
 2-. అతిథుల చే గురుపూజోత్సవ ,ఉపాధ్యాయ దినోత్సవ సందేశాలు
 3- .శ్రీ కోట గురుదేవుల ప్రియతమ  శిష్యులు  శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన ”శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి కోట సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారాలు  సరసభారతి ద్వారా   ప్రదానం
   1- అమరవాణి  పాఠశాలలో  10   వతరగతి చదువుతున్నఎంపిక చేసిన  పేద, ప్రతిభకల   విద్యార్థికి -కీశే .కోట సూర్యనారాయణ శాస్త్రిగారి స్మారక నగదు బహుమతి 10 వేల  రూపాయలు ప్రదానం
2- శాంతినికేతన్ పాఠశాల లో 10 వ తరగతి చదువుతున్న ఎంపిక చేయబడిన పేద ప్రతిభకల విద్యార్థినికి  కీశే .కోట సీతమ్మ గారి స్మారక నగదు బహుమతి 10 వేల  రూపాయలు ప్రదానం .
4-కోట గురుదేవుల పుత్రులు  శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి గారు ,శ్రీకోట  గాయత్రీ ప్రసాద్ గారు, శ్రీకోట సీతారామాంజనేయులుగారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన తమ మాతా పితల స్మారక నగదు బహుమతి10 వేల  రూపాయలు  వారి చేతులమీదుగా -ఇంటర్ మీడియట్ చదువుతున్న ఎంపిక చేయబడిన పేద ప్రతిభకల విద్యార్థి /విద్యార్థిని కి  బహూకరణ .
5–కోట  గురుపుత్రులకు   సత్కారం
6-ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం
  1-శ్రీ పి . నాగరాజు- ప్రిన్సిపాల్ అమరవాణి పాఠశాల
   2- శ్రీనాగరాజుగారి సతీమణి -సైన్స్ టీచర్ -అమరవాణి  పాఠశాల
    3 తెలుగు పండితులు  –అమరవాణి పాఠశాల
    4-శ్రీ ఏ .త్రినాథ శర్మ -గణిత ఉపాధ్యాయులు -జిల్లాపరిషత్ పాఠశాల
     5-శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి – సరసభారతి కార్య దర్శి –సాహిత్య సేవ
                                                                 ఇట్లు
                                                      గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
                                                       పి .నాగరాజు -ప్రిన్సిపాల్ -అమరవాణి పాఠశాల
    వీలును బట్టి మరిన్ని వివరాలతో ఆహ్వానపత్రిక ఆగస్టు 20 నాటికి అందజేయ బడుతుంది
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3

1937 లో దక్షిణేశ్వర్ కు చెందిన స్వామి శివానంద అనే ‘’మహాపురుష్ జీ ‘’,తారక మహారాజ్ మైసూర్ వచ్చారు.. పరమహంస లీలా ప్రసంగాలలో ‘’1887 శివరాత్రి  నాడు ఉదయం  9 గంటలకు భారంగ పూర్ మఠానికి మహేంద్రనాధ్ గుప్తా (ఏం )వచ్చేసరికి మహాపురుషాజీ ,బ్రహ్మానంద లు వివేకానందులు రాసిన శివ గీతాన్ని పాడుతూ తన్మయంగా నృత్యం చేయటం చూశాడు ‘’అని కస్తూరి ఎప్పుడో చదివింది గుర్తుకొచ్చింది .మహా పురుషుల సందర్శనభాగ్యం తో పులకించిపోయారు .ఆయన కస్తూరికి ‘’శ్రీ రామ కృష్ణ మంత్రోపదేశం ‘’చేశాడు .కానీ కొద్దికాలానికే కుదురుగా ఆసనం వేసి జప0  చేయటం  తనవల్ల కాదని గ్రహించాడు .కర్మయోగమే తనకు నచ్చిన పని అనుకొన్నాడు .రామ కృష్ణ పరమహంస దిండుకింద ఎప్పుడూ అష్టావక్ర గీత పుస్తకం ఉండేదనిదాన్ని తీసి వివేకానంద కు ఇచ్చి చదవమని చెప్పేవారని సుబ్రహ్మణ్య అయ్యర్ పాల్ బ్ర0ట న్ కు చెప్పాడట .. విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చి ఒకఏడాది పియుసి ,మూడేళ్ళ డిగ్రీ ,రెండేళ్ల మాస్టర్ డిగ్రీ వచ్చింది .దీనివలన కస్తూరిని మైసూర్ యుని వర్సిటీ కి స్కూల్ యాజమాన్యం 1928 జూన్ లో అప్పగించింది .తర్వాత మహారాజా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కు బదిలీచేసింది . 17  ఏళ్ళు ఎంతో సంతృప్తి జీవితం ఇక్కడ గడిపానని కస్తూరి రాసుకున్నాడు .స్టాఫ్ వాళ్లకు కస్తూరి ఒక  సాహసుడనిపించాడు .అతని ఇన్నోవేషన్ కు ఫ్లాట్ అయ్యారు .

 కస్తూరి స్టాఫ్ మెంబర్లనందర్నీ ఒప్పించి డ్రెస్ ,మాట లపై కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు పరచాడు .అందులో డ్రెస్ విషయం లో నేక్ టై కట్టుకోకూడదని  కోట్ పై గుండీ లను పెట్టుకోకూడదని 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు నిర్ణయించుకొన్నారు ..ప్రతిసోమవారం ఆరంజ్ తినాలి .అవతలివారితో కన్నడం లో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్ పదం ఉచ్చరిస్తే మాటకు ఒక పైసా ఫైన్ కట్టాలి .కన్నడ భాష వాడకాన్ని వేగంగా పెంచే చర్యలు తీసుకొన్నారు కస్తూరి బృందం .షెల్లీ కవి రాసిన ‘’డిఫెన్స్ ఆఫ్ పోయెట్రీ ‘’,కార్లైల్ ‘’ఆన్ హిస్టరీ ‘’రస్సెల్ ‘’ఫ్రీమాన్స్ వర్షిప్ ‘’మొదలైనవి కన్నడం లోకి అనువదించారు .పిక్నిక్ లకు వెళ్ళినప్పుడు ,లేక భోజనాళత్రవాత్ వీటిని చదివి వినిపించేవారు .అందరూకలిసి ‘’యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ‘’ఏర్పరచి కస్తూరిని సెక్రెటరీ చేశారు

  .’’ఎక్స్టెన్షన్ లెక్చర్ వీక్స్ ‘’ను జరపాలని నిర్ణయించి దూరపు పట్టణాలలో ఉన్న లైబ్రరీ సొసైటీలద్వారా ప్రచారం ప్రారంభించారు .దీనిలో మంచి ప్రోత్సాహంకలిగి చాలా వేగంగా అనుకొన్నది సాధించగలిగారు .సామాన్యమానవునికి సమాచారం అందించాలని ,ప్రభావితం చేయాలని వీళ్ళ సంకల్పం .కాలేజీలో సోషల్ ఆంత్రోపాలజీ బోధిస్తున్న కస్తూరి వివాహ పద్ధతులు ,కులాలు ,అవినీతి ,నేరాలు ఘోరాలు ,దెయ్యాలపై నమ్మకం , అంత్యక్రియల ఆర్భాటాలు మొదలైనవాటిపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి మెప్పించాడు హిస్టరీ లెక్చర ర్ కూడా కనుక అశోకుడు అక్బర్ ,చైనా యాత్రికులు ,చైనాలో భారతీయ బౌద్ధ గురువులు భారతీయ సంస్కృతి  చైనా బయట వ్యాప్తి చెందిన విధానం వగైరాలపై ఉపన్యసించి మనసులను గెలిచాడు ..

  ఆ కాలం లో కన్నడిగులు మరాఠా  ,ఉర్దూ ,తెలుగు ,తమిళ రాజుల నవాబుల వారి పాలనలో ఉండేవారు . తమిళుల దాస్టికం ఏక్కువగా ఉండేది .పాలకులను సంబోధించటం లో డాబు దర్పం అతి విధేయత చూపాల్సి వచ్చేది . .నైజాం నవాబ్ తనను ‘’హిజ్ హై నెస్ ‘’అనికాక ‘’హిజ్ ఎక్సాల్టెడ్  హై నెస్ ‘’అని పిలవాలని ,తర్వాత మరింత గౌరవంగా ‘’హిజ్ మెజెస్టి ‘’అనాలని బలవంతం గా అనిపించేవాడు .. దీన్ని వ్యతిరేకించాలనే ఉద్యమం చేబట్టారు కస్తూరి అండ్ పార్టీ అంటే యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ..బానిసత్వ భావనకు వ్యతిరేకత అందరినుంచి వచ్చి సైనికులతోసహా అందరూ దీన్ని ఆహ్వానించారు .

 గ్రామాలలో సంఘాలు కస్తూరిని ఆహ్వానించి రామ కృష్ణ వివేకానందులపైప్రసంగాలు చేయించేవారు .రోవర్స్ క్లబ్ వాళ్ళు ,కోచింగ్ క్లాస్ వాళ్ళు వాళ్ళవాళ్ళ ఊళ్ళల్లో కస్తూరిని వచ్చిమాట్లాడమని కోరేవారు . కస్తూరికి మరొక గొప్ప ఆలోచన ‘’గ్రామ పునరుద్ధరణ ‘’వచ్చి వాలంటీర్లను తయారు చేశాడు .యూనివర్సిటీ యూనియన్ ను ఆషామాషీ గా కాకుండా ఆ క్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి యూనియన్ ల స్థాయిలో ఒక ఎన్నికైన స్తూడెంట్ సెక్రెటరీ ,,ప్రిన్సిపాల్ నియమించిన స్టాఫ్ సెక్రెటరీ లతో ఏర్పాటు చేశాడు  . లెక్కల లెక్చరర్ టి కృష్ణమూర్తి వయోజన విద్య కార్యక్రమాలు చేసేవాడు .కస్తూరి కొత్తగా విద్య నేర్చుకొనేవారికి ఉపయుక్తంగా కన్నడ ప్రాధమిక విద్యా పుస్తకాలను రాశాడు .వీటిని నగరం లోని చాముండిపుర లో వారికి నేర్పేవాడు . విద్య ద్వారా జాగృతం చేయటానికి ఎన్నిప్రయత్నాలు చేసినా గ్రామీణులను ఆకర్షించటం కష్టం అని గ్రహించి వారికి ఇష్టమైన నాటకం సంగీతం ద్వారా వారికీ దగ్గరవ్వాలని ఆలోచించాడుకస్తూరి . .

 శని ఆదివారాలశెలవులలో కస్తూరి తనకొడుకుతోసహా కొందరు ప్రతిభా సంపన్నులైన విద్యార్ధులతోకలసి గ్రామాలకు వెళ్లి అస్పృశ్యత ,ను భక్త నందనార్  తిరుప్పాణాళ్వార్ చరిత్రతో.మూఢనమ్మకాలను పోగొట్టటానికి మంకాసుర వధ  కథ  ,విద్యాప్రోత్సాహానికి ‘’సాంబు ‘’కథ లను వీధుల్లో నాటకాలుగా ఆడి వారిని చైతన్యం చేశాడూకస్తూరి .ఇవన్నీ పౌరాణిక చారిత్రాత్మక విషయాలు కనుక జానపద నాటక ,గేయాలతో ,సంప్రదాయబద్ధమైన వేష ధారణతో ప్రదర్శించి మనసులను దోచేశాడు కస్తూరి .వీటిలోని సంభాషణలు ముందుగా రాసి పెట్టుకొన్నవికావు సమయం సందర్భాన్నిబట్టి అప్పటికప్పుడు  వేదికమీద అలవోకగా చెప్పినవే .స్పాంటేనిటీ ఉండటం తో బాగా ఆకర్షవంతమైనాయి . అనుకొన్నది సాధించగలిగారు .వీటిలో దేవతలు మునులు అకస్మాత్తుగా రంగం పైకి రావటం పోవటం ,హాస్యం వ్యంగ్యం చెమక్కులూ దట్టించటం తో బాగా పేలాయి .

 ఇంతటితో ఆగితే కస్తూరి గొప్పేముంది .ఆ రోజుల్లో హరికథకు మంచి ఆదరణ ఉండేది . దాన్నీ వదల్లేదు కస్తూరి .మహర్షుల జీవితాలు వారిప్రబోధలు ,పురాణ నాయకులు ,అవతారపురుషుల విషయాలను పాటలు చక్కని మాటలు తో హరికథ గా చెప్పేవాడు కస్తూరి .తన గొంతు సంగీతానికి సహకరించిందని గ్రహించి సంగీతం పాడటానికి కొందరు విద్యార్థులను తయారు చేసివాళ్లతో పాడించేవాడు .వీటన్నిటితో గ్రామీణులను మూవర్స్ అండ్  షేకర్స్ గా  మార్చానకి చెప్పాడూకస్తూరి .బుద్ధ ,రామకృష్ణ పరమహంస ,గీత ,తిరుప్పాణాళ్వార్ ,నందనార్, వివేకానంద ,మీరాబాయి ,అక్కమహాదేవి వేషాలు వేసి వారిపై మాట్లాడి అద్భుత ఛైతన్య స్ఫూర్తి కలిగించాడు  పల్లె టూళ్ల లో ..బెంగుళూరు  దావనాగిరె పట్టణాలలోనూ సిటీ ప్రేక్షకుల మనసు దోచాడు కస్తూరి .కస్తూరి సుగంధానికి పరవశులు కానీ వారెవరుంటారు?వీటి విజయాలకు తనకొడుకుతోసహా తనతోఉన్న సంగీత బృందమే కారణం అంటాడుకస్తూరి .రాజాస్థాన పండితుల వద్ద నుంచి తీసుకొన్న జిగ్ జిగేల్ మనే కాశ్మీ ర్ శాలువా ,యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్ బహూకరించిన వెండి చిడతలు తో తనవేషం  మహాబాగా  ఆకర్షణీయంగా ఉండేదని పల్లెప్రజలు వీటితో  రంజిల్లి ఫ్లాటై పోయేవారని అంటాడు కస్తూరి .

 ప్రజల నుంచి ఏమాత్రం వ్యతిరేకత రాకుండా అమ్మవార్లకు జంతుబలి నివ్వరాదని అట్టడుగు వర్గాలవారిని సమాజానికి దూరంగా ఉంచరాదని ,అధికసంతానం తో జనాభా  విస్ఫోటనం   కలిగించవద్దని  ,పురాణాలనుండి వేద,ఉపనిషత్తుల నుండి మహాత్ముల జీవితాలనుండి వారి బోధలనుండి విషయసేకరణ చేసి అందరికి మనసులకు నచ్చేవిధంగా చెప్పటం వలన తాను విజయం సాధించగలిగానని కస్తూరిరాశాడు ..యుని వర్సిటీ లెక్చరర్ ఒకరు మొట్టమొదటిసారిగా వీధుల్లో హరికథ చెప్పటం కస్తూరికే సాధ్యమైంది .దీన్ని కొందరు తప్పుపట్టి ఉన్నత విద్య భోధించేవాడు ఇలా బజార్లలో వేషాలేయటమేమిటి పరువు తక్కువ అని ఆక్షేపించారు .ఇదంతా ప్రచారంకోసం మెప్పూ మెహర్బానీ కోసమే అన్నారు .మరికొందరు తనను పల్లెటూరి బైతులన్నారు .చాలామందిమాత్రం హరికథను యూనివర్సిటీ గౌరవ కలిగించాడు కస్తూరి అని హృదయ పూర్వకంగా మెచ్చుకొన్నారు .ఇన్ని రంగాలతో  జన జాగృతి కలిగించి మానవ సేవే  మాధవ సేవగా భావించి చేశాడు కనుకనే కస్తూరి గురించి ఆయన సేవా పరిమళం  గూర్చి  రాయాలనిపించి రాస్తున్నాను .

  సశేషం

   మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

మహారాజా కాలేజీ లో రెండేళ్ల ప్రి  యూనివర్సిటీ కోర్స్ పూర్తిచేసి కస్తూరి మద్రాస్ లో పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్ లో పాసై ,మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లో చేరాడు .కస్తూరి స్నేహితుడికి మద్రాస్ యుని వర్సిటీ స్కాలర్ షిప్ కూడా కొచ్చిన్ ప్రభుత్వ స్కాలర్షిప్ తోపాటు వస్తే అతడు కొచ్చిన్ స్కాలర్షిప్ ఉంచుకొని యూనివర్సిటీ దాన్ని వదిలేశాడు  ఇది కస్తూరి ఆశలపై నీళ్లు చల్లింది ..త్రివేండ్రం చేరి మహారాజా కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీలో చేరి ,సత్రం లో తింటూ సుబ్బయ్యర్ హితోపదేశం పై ఇండియన్ హిస్టరీ ని స్పెషలైజ్ చేసి అక్కడ రామ కృష్ణ వివేకానంద బృందం తో పరిచయమేర్పడి అక్కడి సంస్కృత పండిట్  హిస్టరీ హెడ్ కె వి రంగస్వామి అయ్యంగార్ దృష్టిలో పడ్డాడు .. 1916 లో తానుఉంటున్న త్రిపుత్త రకు త్రివేండ్రం 150 మైళ్ళు 32 గంటల ప్రయాణం అయితే,మద్రాస్ మూడు రె ట్ల దూరం అయినా రైల్ లో 26 గంటలప్రయాణం అనిపించింది ..అదృష్టవశాత్తు మద్రాస్ యూనివర్సిటీ త్రివేండ్రం లో హిస్టరీ ఆనర్స్ కోర్స్ ప్రవేశపెట్టింది .ప్రొఫెసర్ రంగస్వామి క్షణం ఆలస్యం చేయకుండా కస్తూరిని అక్కున చేర్చుకొన్నాడు .ప్రిన్సిపాల్ కస్తూరికి గ్రిగ్ మెమోరియల్ స్కాలర్షిప్ నెలకు 12 రూపాయలు మూడేళ్లకు మంజూరు చేశాడు . అక్కడే మేనమామ కూడా టీచర్ గా  ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చింది . ప్రొఫెసర్ గారి ఇంటి లైబ్రరీ కస్తూరికి బాగా ఉపయోగపడింది ..ఇక్కడే బెనర్జీ అనే రామకృష్ణా మిషన్ వ్యక్తితో పరిచయమై ,అందులో సభ్యులను చేర్పించి నిధి సేకరణకు తోడ్పడ్డాడు .. ప్రొఫెసర్ గారి రెండెడ్ల బండిలో ఆయనతోపాటు అనంతపద్మనాభ దర్శనం ,బీచ్ లకు వెళ్ళేవాడు .ప్రొఫెసర్ సంప్రదాయాలను తప్పక పాటించేవాడు . అది కస్తూరి మనసుపై గొప్ప ప్రభావం చూపింది .ప్రొఫెసర్ స్కోల్లోస్ రినైసెన్స్ ను ,ప్రో సహస్రనామం ట్రాజి, కామెడీలను బోధించారు ..మూడవ ఏడాది టైఫాయిడ్ వచ్చి మేనమామ ఇంట్లో వాళ్లకు భారమే అయినా ఉండాల్సి వచ్చింది . తాత చనిపోగా తల్లి ఇక అక్కడ ఉండలేక పోయింది .ఇప్పుడు తల్లిని కూడా తెచ్చి మేనమామకు మరింత బరువు నెత్తికెత్తాడు .

 21 వ ఏటా హిస్టరీ ఆనర్స్ డిగ్రీ చేతబట్టి తల్లిని పెళ్ళాన్ని పోషించుకోవటానికి త్రివేండ్రం హై స్కూల్ టీచర్ అయ్యాడు . 1919లో కుటుంబం పెట్టాడు . మద్రాస్ ప్రెసిడెన్సీమొత్తం లో  ఆనర్స్ లో రెండవ స్థానం  పొంది ఇక్కడ బతకలేక బడిపంతులయ్యాను అనుకొన్నాడు  .ప్రొఫెసర్ గారు ఐ ఏ ఎస్ పరీక్షలు రాయమన్నాడుకాని ‘’విత్తులు ‘’లేక  లా కాలేజీలో ఉదయం సాయంత్రం క్లాసులకు హాజరై చదివాడు . అదృష్టం తలుపుతట్టి మాస్టర్ ఉద్యోగ జీతం యాభై శాతం పెరిగింది ..అక్కడ దామోదరన్ పొట్టి అనే ‘’డబ్బులావు ‘’  మనిషి పరిచయమై  తానూ సంపాదకుడుగా ఉన్న ‘’పీపుల్స్ ఫ్రెండ్ ‘’పత్రికకు ’’ ఘోస్ట్ రైటర్’’గా ఉండమని కోరాడు ..తనతరఫున తెచ్చే ప్రతిపత్రికకు 15 రూపాయలు ముట్ట చెబుతానని ఆశ చూపించాడు .సరే నని హాస్య వ్యంగ్య రచనలు పంచ్ డైలాగులూ రాసి పత్రికకు వన్నె తెచ్చాడు ..సంఘ వ్యతిరేకులమీద అవినీతిపరులు దేశ ద్రోహులపైనా తీవ్రంగా రాయమని కోరేవాడు ఆ ‘’దేశభక్తపొట్టి  . ‘’అలాగే  రెచ్చి పోయి రాసేవాడు .’’దీనితో వందేమాతర భావం వైరస్ లాగా నాకు సోకింది ‘’అంటాడుకస్తూరి .పొట్టి కోరికపై సేలం ఆయనతో వెళ్లి మహమ్మదాలీ షౌకత్ ఆలీ ల భుజాలపై చేతులు వేసి నడఁడుస్తున్న గాంధీని ,రాజాజీ ఏర్పాటు చేసిన స్వదేశీ ఎక్సి బిషన్ ,చూశాడు .

ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లికి మసూచికం సోకి కోలుకొన్నది .. టీచర్ ఉద్యోగం చేస్తూ లా చదువుతూ ,స్కూల్ లో విద్యార్థుల చేత తాను రాసిన ‘’షాజహాన్ ‘’నాటకం తనదర్శకత్వం లో వేయించటం వంటి సాంఘికకార్య క్రమాలతో గడిపాడు ..లా కాలేజీ లో చదువుతున్నప్పుడే మామగారిమామ గారు ఎప్పుడూ  ‘’లాయర్ కా వద్దు చీట్ చేయద్దు . టీచ్ చేయి  . గురువుజీవితం ఈ లోకం లోను ,పైలోకం లోను హాయిని సంతృప్తిని ఇస్తుంది ‘’అని చెవిలో జోరీగలాగా రొదపెట్టేవాడు..కనుక దేశం లో చాలా ప్రాంతాలనుండి ఆహ్వానాలు వచ్చినా వదిలేసి మైసూర్ డి బి హెచ్ .హై స్కూల్ లో హిస్టరీ  లెక్చరర్ గా చేరాడు . ఇప్పటివరకు ఎందరెందరిపైనో ఆధారపడ్డాడు కనుక ఇప్పుడు ఎవరికైనా ఆశ్రయం కలిగించాలని అనుకోగానే వాళ్ళ అమ్మ పల్లెటూళ్ళో నీళ్లుకారే రేకుల షెడ్ లో దరిద్ర జీవితం గడుపుతున్న తన అమ్మ అంటే కస్తూరి అమ్మమ్మ ను తమతో ఉంచుకుందామనగానే సరేనన్నాడు ..

 మైసూర్ వెళ్లి ధర్మ భానుమయ్య హై  స్కూల్ కు హెడ్మాస్టర్ ను కలవగానే ఆయనే రెండు చేతులతో నమస్కరిస్తూ ‘’వారుంగొ వారుంగొ ‘’అన్నాడు .మంచి  ఇల్లు తీసుకొని భార్య ,తల్లీ అమ్మమ్మలతో కాపురం పెట్టాడు .హిస్టరీ భోధించేవాడు .అక్కడి గోపాలకృష్ణయ్యర్ ,కృష్ణయ్యర్ తన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దారని కస్తూరి కృతజ్ఞతగా చెప్పాడు .ఉదయం అసెంబ్లీలో పా డాల్సిన ‘’ప్రార్ధన జీతం ‘’రాసి పిల్లతో రోజూ పాడించేవాడు .చంద్ర హాస ‘’నాటకం రాసి తాను క్రూర మంత్రిగా నటిస్తూ పిల్లలతో ఇంగ్లిష్ నాటకం వేయించి డైరెక్ట్ చేశాడు .వైస్ ఛాన్సలర్ చూసి చాలామెచ్చాడు .స్తూడెంట్ పార్లమెంట్ ,స్కూల్ మేగజైన్  నిర్వహించాడు ..స్నేహితుడు శంకరరావు తోకలిసి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పిల్లల చదువు వారికివ్వాల్సిన ప్రోత్సాహం గురించి చెప్పేవాడు మైసూర్ లో యుని వర్సిటీకాలేజిలో చేరే విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులను సర్వే  చేశాడు ..కుటుంబం తో చాముండి అమ్మవారి దర్శనం  చేసేవాడు . 1923లోమొదటిపుత్ర సంతానం కలిగింది .స్కూల్ వ్యవస్థాపకుడు మునిసిపల్ ఎన్నికలలో నిలబడి టీచర్లను తనకు ప్రచారం చేయమనటం అసహ్యంగా ఇబ్బందిగా ఉంది  . ప్రచారం కోసం సెలవు ఇమ్మనేవాడు .గదులన్నీ వాళ్ళకే కేటాయించమనేవాడు

 దీనిలో నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకొంటుంటే స్నేహితుడొకడు గాంధేయ వాది  ,మైసూర్ మహారాజా  కాలేజీ లాజిక్ లెక్చరర్ డా సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రియశిష్యుడు న్యాయవాద వృత్తి చేబట్టమని సలహా ఇచ్చాడు . అతని తండ్రి మైసూర్ రాష్ట్రం లో 50 గ్రామాలకు గురువు .కాదనలేక 350 మైళ్ళ దూరం లో ఉన్న సిద్దనహళ్లి వెళ్ళాడు  ,తనకు కన్నడం రానందువలన ,సివిల్ ప్రొసీజర్ కోడ్ పాసవనందువలన ఇప్పటిదాకా లా ప్రాక్టీస్  పెట్టలేదు .ఇప్పుడు లాయర్ గా  నమోదు చేయమని కోరాడు ..కానీ ఈగండం నుంచికూడా బయటపడ్డాడు .

 ఒక రోజుడిసెంబరునెల  ఉదయానే శంకరరావు గోపాల మారారు ను వవెంటపెట్టుకొని వచ్చాడు  ఆత ను తన సహాధ్యాయి  రాజా వంశీకుడు . మద్రాస్ లో చదివి డిగ్రీ పొందాడు .సన్యసించి రామకృష్ణా మిషన్ లో చేరి సిద్ధేశ్వరానంద గా వచ్చాడు .బేలూర్ మఠం  ఈయన్ను మైసూర్ లో రామకృష్ణ మఠం ఏర్పాటు చేయమని పంపింది ..బెంగుళూర్ లో అందర్నీ అడిగి కస్తూరి గురించి వాకబు చేసి ఇక్కడికి  వచ్చాడు .సిటీ టౌన్ హాల్  లో ఒక సమావేశమేర్పాటు చేసి ఆయనతో ప్రసంగం చేయించాడు .కొన్ని నెలలో  ఆశ్రమం  తగిన వసతులతో  ఏర్పడి వర్ధిల్లింది .కాలేజీ విద్యార్థులకు ,తలిదండ్రులకు పరిచయం చేశాడు .మొదటి విస్తృత సమావేశం లో కస్తూరి ముందుగా కన్నడం లో తర్వాత సిద్దేశ్వ రానంద ఆంగ్ల0 లో అందరికి నచ్చేట్లు మాట్లాడారు . ఎందరో ప్రముఖులు హాజరయ్యారు .

 తర్వాత యువత ను ఆకర్షించే ప్రయత్నం చేశారు .వివేకానంద రోవర్స్ స్కౌట్ ఏర్పరచి ట్రెయినింగ్ ఇచ్చాడుకస్తూరి .నిధి సేకరణ చేశారు .ఒక రోజు అకస్మాత్తుగా దగ్గరున్న స్పిన్నింగ్ మిల్ లో అగ్నిప్రమాదం జరిగింది .కస్తూరి యువ బృందం వెంటనే రంగ ప్రవేశం చేసి మంటలనార్పి పెద్ద ప్రమాదం తప్పించారు .మిల్లు డైరెక్టర్ తో సహా ఎందరో కస్తూరికి అభినందనలు తెలిపారు .మైసూర్ లో జరిగిన స్టేట్ రాలీ ఆఫ్ స్కౌట్స్ లో కస్తూరి యువజన రోవర్ బృందం పోలి కిట్టి ‘’నాటకం ప్రదర్శించి మహారాజు జయచామరాజ ఒడియార్ మన్నన పొందారు .కస్తూరి రాసి,డైరెక్ట్ చేసిన మరోనాటకం ‘’ది హెడ్ మాస్టర్స్ డాటర్ ‘’కూడా ప్రదర్శించారు . ఈ విధంగా రోవర్స్ క్లబ్ అటు జనానికి ,ఇటు ఆశ్రమానికి రాజకుటుంబాలకు బాగా దగ్గరైంది .గోపాల్ మహారాజ్ ప్రెసిడెంట్ గా కస్తూరి సెక్రటరీగా సేవ లందిస్తున్నారు .కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు .రెగ్యులర్ గా రాని  వారిని గుర్తించి కారణాలను కనుక్కొని కావాల్సిన సదుపాయాలూ కల్పించి వచ్చేట్లు చేస్తున్నారు .కె వి పుట్టప్ప అనే కవి కొన్ని సమావేశాలకు రాలేదని గ్రహించి ఆయన ఉండే చోటును వెతుక్కొని వెళ్లి చూస్తే టైఫాయిడ్ తో బాధ పడుతున్నాడని గ్రహించి డాక్టర్ ను సంప్రదించి కృష్ణరాజేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు . వారం తర్వాత తగ్గిపోయింది . తాను  ఆశ్రమం లోనే విశ్రాంతి తీసుకొంటానని ఆయన అన్నాడు .పుట్టప్ప భారతీయ సంస్కృతికి  ప్రతినిధి .ఆయనకవిత్వం ఆశ్రమ వాతావరణం లో పుష్పించి వికసించి ఫలించి లబ్ధ ప్రతిష్ఠుతుని చేసింది .సిద్ధేశ్వరానంద మైసూర్ ప్తజల హృదయం లో శాశ్వత స్థానం సంపాదించాడు ..ఇద్దరూకలిసి వైస్ ఛాన్సలర్ వీరాజేంద్రనాధ్ ను గీతపై ప్రసంగించవలసిందిగా కోరగా వచ్చి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు .యుని వర్సిటీ ,కాలేజీ లలో  సంస్కృత విద్యాలయాలలో ఉన్నసై కాలజి ఫిలాసఫీ ప్రొఫెసర్లు లెక్చరర్లు వచ్చి ఆశ్రమం లో ప్రసంగించి ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కల్గించేవారు .యుని వర్సిటీ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్య అయ్యర్ సిద్ధేశ్వరానంద శిష్యుడయ్యాడు .తాను  సెక్రెటరీ గా ఇలాంటి ఉన్నతులమధ్య గడపటం తన అ దృష్టం అన్నాడు కస్తూరి . తూర్పు పడమటి తత్వ శాస్త్ర రహస్యాలు ,ఉపనిషత్ సందేశాలు ,గీతారహస్యాలు ,అద్వైత ద్వైత వాదాలు మానసిక శాస్త్రం అన్నింటిపైనా విలువైన ప్రసంగాలు చేయించాడు కస్తూరి స్వామీజీతోకలిసి .సన్యాసులకు రెండేళ్ల శిక్షణ ప్రారంభించారు .మైసూర్ మహారాజా సుబ్బరామయ్యర్ ను ఘనంగా సన్మానించి ఆశ్రమానికి భూరి ధన సహాయమందించాడు … అనుకొన్న విధంగా సిద్ధేశ్వరానంద కస్తూరి సహాయం తో ఆశ్రమాన్ని సర్వతో ముఖాభి వృద్ధి చేయగలిగాడు .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -1

‘’కస్తూరి ‘’సేవా పరిమళ వ్యాప్తి -1

కేరళలో పుట్టి ,మద్రాస్ ,మైసూర్ లలో చదువు ఉద్యోగ0 చేసి ,పుట్టపర్తి చేరి శ్రీ సత్యసాయి బాబా ఆంతరంగికుడై ,మొట్టమొదటి బాబా జీవిత చరిత్రను ఆయన ప్రేరణతోనే రచించి ఆయనతో దేశమంతా పర్యటించి ఆయన ఆదేశం తో దేశాలు తిరిగి సాయి ప్రేమామృతాన్ని ప్రజలకు పంచి ,’’సనాతనసారధి ‘’కి రధ  సారధియై  ఆలిండియా రేడియోకి ‘’ఆకాశవాణి ‘’సార్ధక నామధేయాన్ని అందించి , ఉద్యోగకాలం లో ఎవరికీ తట్టని ఎన్నో సేవా కార్యక్రమ  కస్తూరికా పరీమళాన్ని వెదజల్లిన పుణ్యమూర్తి ప్రొఫెసర్ నారాయణ కస్తూరి  బహుభాషా కోవిదుడు .

 అందరి చేతా  ఆప్యాయంగా ‘’కస్తూరి ‘’అని పిలువబడే నారాయణ కస్తూరి కేరళలో కస్తూరి రంగనాథ శర్మగా నారాయణ శర్మ పుత్రుడిగా 25-12-1897న ఉత్తర తిరువాన్కూర్ లో ని త్రిపునిత్తూర లో జన్మించాడు.  పుట్టిన11 వ రోజున తల్లి అర్జునుడు ప్రతిష్టించిన స్థానిక పార్ధసారధి  దేవాలయానికి తీసుకువెళ్లి స్వామికి ఎదురుగా నేల మీద పడుకో బెట్టింది .ఆమెకు స్వామి ఏదో సందేశం ఇచ్చినట్లు భావన కలిగింది ..అలాగే రోజూ ఎత్తుకొని వెళ్లి స్వామి దర్శనం చేయించేది .అమ్మతండ్రి అంటే తాత దేవాలయ ఎక్సి క్యూటివ్ ఆఫిసర్ ..పెళ్లినాటికి  తండ్రివయసు 18 ,తల్లికి 12 . .నామకరణం నాడు తండ్రి అకస్మాత్తుగా కొడుకుకు ‘’కస్తూరి రంగనాధ ‘’అని పేరుపెట్టారు .ఇంతవరకు కస్తూరి పేరు ఆ ఇంట ఎవరికీ లేదు . సంప్రదాయం ప్రకారం కస్తూరి రంగనాధ శర్మ అయ్యాడు . కేరళ ,తమిళనాడులలో తండ్రిపేరు ఇంటిపేరు అవుతుందికనుక తర్వాత నారాయణ కస్తూరి అని షార్ట్ నేమ్ పెట్టుకొన్నాడు . శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి నుదుట ఉండే నిలువు బొట్టు కస్తూరితో పెడతారు .దాని సుగంధం ఎంతో దూరానికి వ్యాపిస్తుంది .అలాగే ఈ కస్తూరి సేవా పరిమళం కూడా బాగా వ్యాప్తి చెంది సార్ధక నామం అయింది ..

 చిన్నప్పుడే తండ్రికి మసూచికం సోకి మరణించాడు .. మాతామహుడి ఇంటనే తల్లీ కొడుకు ఉండేవారు . తాత చండ  శాసనుడు .ఆంగ్ల చదువులు ఇష్టం లేనివాడు . కానీ తల్లిప్రోత్సాహం తో అదే చదివాడు .ఆకాలం లో కొచ్చిన్ రాజు తమరాజ్యం లో బ్రాహ్మణులెవరూ తిండిలేకుండా ఉండరాదని రాజధానిని కొచ్చిన్ నుంచి త్రిపునిత్తురకు మార్చి అక్కడ అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు .తల్లి ,కస్తూరిని అక్కడ  హై స్కూల్ లో చేర్పించింది .చదువుకు తిండికి ఇబ్బంది లేకుండాపోయింది .ఫిఫ్త్ ఫారం లో ఉండగా కుమార్ అనే విద్యార్థి నాయకుడి ఆధ్వర్యం లోఒక డిబేట్ ‘’శ్రమ లేకుండా ఉచిత భోజనం అందించరాదు ‘’ను నిర్వహించి రిజల్యూషన్ రాజుకు పంపారు .కానీ ఆయన దీన్ని ‘’లైట్ తీసుకొని ‘’అన్నసత్రాన్ని కొనసాగించాడు  . 1903 లో చేరి 1914 వరకు కస్తూరి చదివిన స్కూల్ రాష్ట్రం లోనే నంబర్ వన్ .ఉపాధ్యాయలనుప్రతిభ ప్రాతిపదికపై ఎంపిక చేసేవారు .రాజుగారి పిల్లలు గుర్రబ్బండిలో స్కూల్ కు వచ్చేవారు .వాళ్లకు కుర్చీలు డెస్క్ లు ఉండేవి . మిగిలినవారికి’’ తొడలే’’  డెస్క్ లు ..యువరాజు గోపాల మారార్ కస్తూరి క్లాస్ మేట్ .అప్పుడప్పుడు అతనితో రాజ అంతఃపురానికి వెళ్ళేవాడు ..అప్పుడు క్లాసుకు 30 మందిమాత్రమే విద్యార్థులు  .ఉపాధ్యాయులు నిష్ఠగా బోధించేవారు ..హెడ్ మాస్టర్ గోపాలకృష్ణ అయ్యర్ రాజావారి పిల్లలకు  ట్యూషన్ చెప్పేవాడు ..యెన్ ఆర్ సుబ్బ అయ్యర్ బ్రిటిష్ హిస్టరీ చెప్పేవాడు . అప్పుడు ‘’రూల్ ఆఫ్ బ్రిటాన్నియా ‘’అందరు తప్పక నేర్వాల్సి వచ్చేది . అప్పుడే  అన్నన్  రాసిన   ‘’పార్లమెంటరీ ప్రాక్టీస్’’  అనే పుస్తకాన్ని ప్రచురింపబడగా కస్తూరి కొని చదివేశాడు . 1921  లో మైసూర్ కాలేజియేట్ హై  స్కూల్ లో హిస్టరీ బోధిస్తూ కస్తూరి విద్యార్థుల చేత ‘’స్తూడెంట్ పార్లమెంట్ ‘’అంటే మోడల్ పార్లమెంట్ నిర్వహింప జేశాడు .స్పీకర్ ప్రధాని,ప్రతిక్షానాయకుడు బిల్లు ప్రవేశ పెట్టటటం  చర్చ పాసవటం సవరణల ప్రతిపాదన వంటి తంతు అంతా  విద్యార్థుల చేత చేయించి శెభాష్ అనిపించుకున్నాడు కస్తూరి .ఇలా అక్కడ పని చేసిన కాలం అంటే 1928 వరకు ఏడేళ్లు ప్రతిఏడాది 20 ఆదివారాలలో ఈ కార్యక్రమం చేయించాడు ..సుబ్బ అయ్యర్ ‘’వారన్  హేస్టింగ్ ఇంపీచ్ మెంట్ ‘’ను విద్యార్థులతో చేయిస్తే కస్తూరి ,ఎడ్మ0డ్  బర్క్ ఆంగ్ల ప్రసంగాలు విద్యార్థులచే చేయించేవాడు  . వాగ్ధాటికి బర్క్ నే ముందు పేర్కొంటారని మనకు తెలుసు  .

స్టూడెంట్ అసోసియేషన్ లో వక్తృత్వ పోటీలు ,నిర్వహించేవాడు . వచ్చేవారం చర్చించబోయే అంశాన్ని ముందే తెలియజేసి విద్యార్థుల అవగాహనకు  అవకాశమిచ్చేవాడు ..ఒక విద్యార్థి ని 1913 లో తరువాతవారానికి విషయం ఏమిటి  అని అడిగితె ‘’The dippressed classes and the supression of the oppression practised on them ‘’అని చెప్పగానే అందరూ అందరూ అభినందనగా చప్పట్లు కొట్టారు .డిబేటింగ్ రసవత్తరంగా అర్ధవంతంగా జరిగి మంచి ఫలితాన్నిచ్చింది అని కస్తూరి గుర్తు చేసుకొన్నాడు  .

 పాఠశాల  గ్రంథా లయం లోని విలువైన పుస్తకాలు చదివాడు . స్కాట్ రాసిన ‘’టాలిస్మన్ ‘’బాగా ఇష్టం .తనతోపాటు స్కాట్ మనల్నీ తీసుకు వెడతాడు అంటాడు . 1913లో ఇన్స్పెక్షన్ లో అధికారి ఏ పుస్తకం చదువుతున్నావని అడిగితె ‘’లెస్ మిజరబుల్స్ ‘’అని చెబితే దాన్ని ‘’లా మిజరబుల్స్ ‘’అని పలకాలని సరిదిద్దాడని .నిజాయితీగా చెప్పాడు . ఇంటిదగ్గర తాతగారు కూడా కథల పోగు .రోజూ ఏదోఒకటి చెప్పేవాడు .. ఈ తాత మామూలోడు కాదు బలే ముదురు .ఇంట్లో పిల్లి లేవటానికి ఎన్నో ఉపాయాలు పన్నేవాడు .పెద్ద సంసారం .ఎంతవచ్చినా చాలేదికాదు .అందుకని  తీర్ధయాత్రలు అని చెప్పి డబ్బున్నవాళ్ళదగ్గర డబ్బు దండుకొని ,యాత్ర చేసివచ్చి మిగిలిన డబ్బును రెండు మూడు నెలలు కొంప గడవటానికి ఉపయోగించేవారు ..

 కొచ్చిన్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త పరీక్ష పెట్టి అందులో కస్తూరితోపాటు అయిదుగురిని సెలెక్ట్ చేసి నెలకు 5 రూపాయల స్కాలర్షిప్ మూడేళ్లు  ఇచ్చింది .దీనితో అతని నాలుగు అయిదు ఆరు ఫారం ల చదువు గట్టెక్కింది .మూడు నెలలకొకసారి హెడ్ మాస్టర్ పిలిచి పారితోషికం గా విక్టోరియా రాణి బంగారునాణెం అంటే 15 రూపాయల విలువకలది ఇచ్చేవాడు .దీన్ని తాత కిస్తే వెండి  నికెల్ రాగి నాణాలు గా మార్చి నాకి పారేసేవాడు అని చమత్కరించాడు కస్తూరి . పెద్ద కుటుంబాన్ని మోయటానికి తాత కు మరో గొప్ప ఆలోచనవచ్చి 7 వ ఏటఉపనయనం చేశాడు .ఒక  రోజు  పూర్ణా నదిలో కస్తూరి ఈదటం చూసి బాలశంకరులను మొసలి పట్టుకున్నట్లు మనవడిని పట్టుకొని సన్యాసం తీసుకొంటాడేమోనని భయపడి గీసి గీసి బేరమాడి  600 రూపాయల కట్నం తో పెళ్లి కుదిర్చి నాలుగు రోజులు పెళ్లి చేయించాడు ..ఈ డబ్బు నొక్కేద్దామని ముసలాడి ముదురుఆలోచన . కస్తూరి తల్లి బ్రేకే వేసి  ఆడబ్బు జాగ్రత్త చేసి తన చదువుకు ఉపయోగించిందని చెప్పాడూకస్తూరి .ఎర్నాకుల0 లో స్కూల్ ఫైనల్ పరీక్షరాసి మలయాళం సాహిత్యం హిస్టరీలలో రాష్ట్రం లో మొదటిమార్కు మొత్తం మీద 5 వ రాంకు  సాధించి కాలేజీ చదువుకు నెలకు 10 రూపాయల  రెండేళ్ల  స్కాలర్ షిప్ కు అర్హత పొందాడు . ఎర్నాకుల0 లో  లో ఇంటర్ కు చేరి సత్ర భోజనం చేస్తూ గడపచ్చుఅనుకొన్నాడు .కానీ సమయాలు కుదరక  ఒక విధవరాలింట్లో చిన్నగది తీసుకొని ఆమె వండిపెట్టింది తింటూ చదువుకున్నాడు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 408-ఋగ్వేద భాష్యా భాష్యం కర్త-ఓ .యం .సి. నారాయణన్ నంబూద్రి (1910-1989 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

408-ఋగ్వేద భాష్యా భాష్యం కర్త-ఓ .యం .సి. నారాయణన్ నంబూద్రి (1910-1989 )

కేరళలోని ఓలాపమన్న మన్న  వంశీకుడైన నారాయణన్ నంబూద్రి పండిత వంశ సంజాతుడు . 1910 లో జన్మించి 1989 లో చనిపోయాడు .ఋగ్వేదం లో మహా నిష్ణాతుడు .త్రిచూర్ బ్రాహ్మణ సర్వస్వ0 అధ్యక్షుడు .ఋగ్వేదాన్ని కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా నేర్పిన ప్రయోగ శీలి . ‘’ఋగ్వేద లక్షణార్చన ‘’ప్రారంభకుడు .ఆయన సంస్కృత రచన ‘’ఋగ్వేద భాష్యా భాష్యం ‘’ను ఆయన మేధోసర్వస్వము గా భావిస్తారు .ఆయన పేరిట ‘’దేవీ ప్రసాదం ట్రస్ట్ ‘’ఏర్పరచి ప్రతి యేటా వేద ,సంస్కృత ,సంగీత ,కథాకళీ లలో నిష్ణాతులకు పురస్కార సమ్మానాలు అందజేస్తున్నారు .

409-భారతీయ శాస్త్ర దర్శనకర్త -జి .విశ్వనాథ శర్మ (1912-1998 )

కేరళ లోని మంగుళూరు లో 1912 లో జన్మించిన విశ్వనాథ శర్మ సంస్కృతం శాస్త్రాలను విద్వా0సు లైన గొప్ప పండితులవద్ద అభ్యసించాడు .కాలడిలోని ఆశ్రమ విద్యాలయం  తీపిని తూర సంస్కృత విద్యాలయాలలో  రామాపురం టీచర్స్ ట్రెయింగ్ సెంటర్ లో సంస్కృత ఉపాధ్యాయుడుగా పనిచేశాడు .  వేదాంతం లో స్వర్ణపతకం పొందిన మేధావి .విద్యాభూషణ ,పండిత రత్న బిరుదాంకితుడు .ఆయన సంస్కృత రచనలు -భారతీయ శాస్త్ర దర్శనం ,సంస్కృతాధ్యాపనం .

410-సామవేద ఘనాపాటీ – త్రోత్తం  ఆర్యన్ నంబూద్రి (1930

కేరళలోని పంజాల్ లో జన్మించిన ఆర్యన్ నంబూద్రి సంప్రదాయ బద్ధంగా సామవేదం నేర్చి వేద పండిత బిరుదుపొంది ,కాలడిలోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వ విద్యాలయం లో పనిచేసి ,సామవేదాన్ని పఠించటానికి ఇంగ్లా0డ్ నుండి ఆహ్వానం అందుకొని ,అక్కడ పఠించి మన్ననలు పొంది తిరిగివచ్చాడు .కంచి శ్రీ జయేంద్ర సరస్వతి నంబూద్రికి ;;కీర్తి ముద్ర ‘’బంగారు పతకం ప్రదానం చేశారు .కాలడి శ్రీ శంకరాచార్య సంస్కృత విద్యాలయం కోసం సామవేదాన్ని పఠించి రికార్డ్ చేశాడు . కేరళ దేశాన్ని ఈ మహానుభావులందరూ వేద వేదాంగ శాస్త్ర సారం తో పునీత0 చేసిన పుణ్య మూర్తులు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 406-చిత్రోదయమణి  కర్త -సాంబశివ శాస్త్రి (1912-1991)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

406-చిత్రోదయమణి  కర్త -సాంబశివ శాస్త్రి (1912-1991)

కేరళకు చెందిన సాంబశివ శాస్త్రి ‘’చిత్రోదయమణి ‘’కావ్యం రాశాడు .తిరువనంతపురం మహారాజు చిత్ర తిరుణాల్ ,ఆయన వంశ పురుషుల గురించి రెండు సర్గలలో వర్ణింపబడిన కావ్యం .చేర రాజులలో చెంగుత్తవన్ ప్రస్తావన చేసి ఆయనను చేరమాన్ పెరుమాళ్ అన్నాడుకవి .తర్వాత ముకుందమాల కర్త కులశేఖర ఆళ్వార్ ను ప్రస్తుతించారు .మిగిలిన రాజులైన స్తాను రవి ,భాస్కరరవి ,గోవర్ధన మార్తా0డ  ,సంగమాది రవివర్మ ,కేరళవర్మ ,మార్తా0డ వర్మ ,శ్రీమూలం తిరుణాల్ ,చిత్ర తిరుమాళ్ మహారాజుల జీవిత వర్ణన చేశాడు

407-మార్తా0డ శతక  కర్త -మార్తా0డ వర్మ (1705-1758 )

111 శ్లోకాలున్న మార్తా0డ  శతక  కర్త రాజా వీర మార్తా0డ వర్మ .ఇది తిరువాన్కూర్ మహారాజు స్వాతి తిరుణాల్ మార్తా0డ వర్మ చరిత్ర .మొదటిశ్లోకం లోనే అయన వంశం వర్ధిల్లుగాక అని మొదలు పెట్టాడు .కార్తీక మాసం అశ్వినీ నక్షత్రం లో పుట్టాడని చెప్పి నాలుగవ శ్లోకం లో భారత దేశ రాజులలో గ్రాడ్యుయేట్ అయినమొట్టమొదటి  రాజు ఆయనేనని ,8 వ శ్లోకం లో ఆయన అన్నగారు కేరళవర్మ గురించి ,తర్వాత రాజమాతమరణం  పిమ్మట రాజు దేశాటనం లో హిమాలయ సందర్శనం రాసి మిగతాదానిలో ఆయన గుణగణాలను ప్రజాహితపాలనను వర్ణించాడు .మంత్రులు హితైషులు ఎందరు ఉన్నా నిర్ణయాలు స్వయంగానే తీసుకొనేవాడని ,అబద్ధాన్ని సహించేవాడుకాదని కవి తెలియజేశాడు .

408- పద్మనాభోదయ కావ్య కర్త -శంకుకవి (18 వ శతాబ్దం )

శంకర లేక శంకుకవి కేరళకు చెందిన 18 వశాతాబ్దిపూర్వభాగపు కవి ..తిరువనంతపురం లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి క్షేత్ర మహాత్మ్యంగా ‘’పద్మనాభోదయ ‘’కావ్యంయువరాజు రామవర్మ అభ్యర్థనపై  రాశాడు.కవి తమిళనాడు బ్రాహ్మణుడు . కావ్యం నాలుగుపద్ధతులు అంటే  భాగాలలో  142 శ్లోకాలలో ఉంది .దివాకర యతి అనుగ్రహం తో అనంత పద్మనాభ స్వామి అనంత వైభవాన్ని ఆనంద పారవశ్యంగా రాశాడు .రామవర్మ మాట తనకు దైవ శాసనమే అన్నాడు .రామవర్మ రాజు మూర్తీభవించిన ధర్మస్వరూపం అని ,ధర్మాన్ని నిత్యజీవితం లో ఆచరించి మార్గ దర్శకుడవటం వలన ఆయన శీల  ప్రవర్తనాదులవల్ల ఆయనను రామవర్మ అనికాకుండా ధర్మరాజు అనే ప్రజలు పిలిచేవారని చెప్పాడు

409-కేరళ విల్లాస  కావ్యాలు

కేరళకు చెందిన 19 వ శతాబ్ది మనవిక్రమకవి కేరళపై కేరళవిలాస కావ్యం రాశాడు.ఈయన కాలికట్ వాడు .కేరళోల్పత్తి ఆధారంగా దీన్ని 105 శ్లోకాలలో రాశాడు .ఏళత్తూర్ కు చెందిన రామస్వామి శాస్త్రి 1882లో వైశాఖం తిరుణాల్ మహారాజా కాశీ యాత్రను వర్ణిస్తూ ‘120 శ్లోకాల కాశీయాత్ర వర్ణన రాశాడు .సుబ్బరామ పట్టారు ‘’ఆ పద్దీప  ‘’అనే 33 శ్లోకాల కావ్యాన్ని జమోరిన్ రాజ్యాన్ని విడిచి వెళ్లిన ఒక దీన బ్రాహ్మణకుటుంబ గాధను వారు కొచ్చిన్ మహారాజు ఆశ్రయం పొందటానికి సహకరించిన అద్భుత అదృశ్య శక్తి గురించి చెప్పాడు .తిరువాన్కూర్ రాజవంశ చరిత్రను గణపతి శాస్త్రి లఘుకావ్యంగా ‘’శ్రీమూల చరిత్ర ‘’రాశాడు .అనంతగిరి ‘’గురు దిగ్విజయ ‘’పేరిట ఆది శంకరాచార్య చరిత్రను ,తుళు బ్రాహ్మణులు తుళునాడు వదలి కొళత్తూర్ ఉదయవర్మ రాజ్యానికి చేరే కథను ‘’బ్రాహ్మణ ప్రతిష్ట ‘’కావ్యంగా ,కొళత్తూనాడు ఉదయవర్మపై 8 శ్లోకాల ‘’దేశ్యాస్ట కం ‘’,కొచ్చిన్ కు చెందిన పరీక్షిత్ తంపురాన్ రాసిన చిన్నకావ్యం ‘’మాల ‘’,వైశాఖం తిరుణాల్ మహారాజాపై కేశవన్ వైద్యం రాసిన ‘’విశాఖ విలాసం ‘’మద్రాస్ గవర్నర్ లార్డ్ నేపియర్ 1883 లో త్రివేండ్రం సందర్శనను ఏళత్తూర్ రామస్వామి శాస్త్రి ;;గౌణ సమాగమం ‘’కావ్యంగా ,కడ త్తనాడు రాజు నిర్వహించిన మహా మృత్యుంజయ యాగాన్ని వర్ణిస్తూ మీథలే మాదం కు చెందిన శంకరవారియర్ రచించిన ‘’మహా మృత్యుంజయ చరిత్ర ‘’,కొచ్చిన్ మహారాజు మహా వాగ్ధోరణిని ,షష్టిపూర్తి ఉత్సవాన్నీ వర్ణిస్తూ నెల్లూరుకాండీ కి చెందిన కృష్ణన్ నంబూద్రి రాసిన ‘’మాతామహిషా షష్టి పూర్తి దశకం ,తిరువాన్కూర్ వైశాఖం తిరుణాల్ మహారాజు చేసిన సేతుయాత్రపై టి. గణపతి శాస్త్రి రాసిన ‘’సేతుయాత్రావర్ణన ‘’మొదలైనవి కేరళలో ఉద్భవించిన సంస్కృత లఘు విలాస కావ్యాలుగా చరిత్ర ప్రసిద్ధి చెందాయి .

సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

King Of Travancore sct.jpg
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ముందుమాటలు

సాహితీ బంధువులకు శుభకామనలు-నేను రాసిన1- ”ఆధునిక ప్రపంచనిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”గ్రంథానికి   మచిలీ పట్నం హిందూకళాశాల చారిత్రిక శాఖాధ్యక్షులు డా. శ్రీ ఎస్ .వెంకటేశ్వరరావు గారు 2-గీర్వాణకవుల కవితగీర్వాణం -3 మూడవ భాగం  గ్రంథానికి  అవధాన సరస్వతి డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ముందుమాటలు రాయటానికి దయతో అంగీకరించారని తెలియ జేయటానికి సంతోషిస్తూ వారిద్దరి సౌజన్యానికి సరసభారతిపై ఉన్న ఆదరణ,అభిమానాలకు  కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను . ఇవి సరసభారతి ప్రచురించ బోతున్న 26 27 పుస్తకాలని తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాహితీభీష్ముడు -పోతుకూచి సాంబశివరావు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితాగీర్వాణం -3 401-కామ సందేశ కర్త -మాతృ దత్త (16వ శతాబ్దం

గీర్వాణ కవులకవితాగీర్వాణం -3

401-కామ సందేశ కర్త -మాతృ దత్త  (16వ శతాబ్దం

 కేరళకు చెందిన మాతృ  దత్త కవి ‘’కామ సందేశం ‘’కావ్యం రాశాడు .మేల్పత్తూర్ కు చెందిన ఈ కవి వ్యాకరణ వేత్త .నారాయణ భట్ కుటుంబానికి చెందినవాడు .కావ్యం మొదటిభాగం లో 66 ,రెండవభాగం లో 69 శ్లోకాలున్నాయి .భార్యతో ఆనందంగా గడుపుతున్న అతనిని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయి చిదంబరం లో ఉంచుతాడు .అక్కడ కామ దేవుని కలిసి తిరునావయ లో తన భార్య చంద్ర లక్ష్మికి  అతనిద్వారా సందేశం పంపటం ఇతి వృత్తం . అందరు  సందేశకర్తలలాగానే ఈ కవీ రూట్ మాప్ ఇచ్చి పంపిస్తాడు .దారిలో రెండు సార్లు కొచ్చిన్ రాజు రామవర్మప్రస్తావన ఉంది .కావేరి నదికి ఉపనదిని  కొల్లిదం  అంటారు  .కొచ్చిన్ రాజుకు పోర్చుగీసు వారికి మధ్య జరిగిన టోల్ ఒప్పందం కూడా ఇందులో ఉంది . 16వ శతాబ్దం లో త్రిచూర్ లో కొచ్చిన్  రాజభవన్ నిర్మాణాలు ,పాత రాజభవనాల విషయమూ ఉంది .రామవర్మ అంటే 1764 నుంచి 1801వరకు పాలించిన కేశవ రామ వర్మ అని గుర్తించారు . 1774లో కోట గోడలు మట్టితో నిర్మించటం అగడ్తలు త్రవ్వటం కూడా కవి రాశాడు . ఈయనకాలం లోనే పోర్చుగీసులతో ఒప్పందం కుదిరింది . రాజు ముసలితనం లో కాశీ యాత్ర కు వెళ్లి అక్కడే కైలాసం పొందాడు .ఈ సందేశం లో కాలికట్ నాయకరాజుల ,జమెరియన్ రాజుల వర్ణన ఉన్నది .కావేరి నాదీ తీర బ్రాహ్మణులూ ,వివిధ వృత్తులవారు అచ్యుతప్పనాయకుని ప్రశస్తి ఉన్నాయి .

402-శుభగ సందేశ కర్త -నారాయణ (16 వశతాబ్దం )

కేరళ త్రిసూర్ కు చెందిన నారాయణకవి శుభగ సందేశం రాశాడు .అంతకంటే జీవిత విశేషాలు తెలియవు .ఏవోకొన్ని అనివార్య కారణాలవల్ల దెయ్యంబారిన పడి   కన్యాకుమారిలో ఉండవలసి వచ్చి త్రిసూర్ లో ఉన్న భార్యకు దూరమయ్యాడు .విరహవేదన తట్టుకోలేక పోతున్నాడు కన్యాకుమారి అమ్మవారి పూజారి స్నాతక బ్రాహ్మణుడైన సుభగ పరిచయమవగా భార్యకు అతనితో సందేశం పంపటమే కథ .కవి జయసింహనాడు పాలకుడు రామవర్మ ఆశ్రితుడు .రాజు ఆశ్రిత పోషణ గురించి వర్ణించాడు . పరిశోధకుడు ఉల్లూర్ ఈ రామవర్మ అంటే విజయనగర రాజులతో యుద్ధం చేసిన ఉదయ మార్తా0డ  వర్మ సోదరుడు అని చెప్పాడు .కొట్టాయం లోని  చంపకా స్సేరి దేవాల0 , దాని కోశాధికారి యజ్ఞనారాయణను రాజా రామవర్మ నియమించటం ఉన్నాయి …

403-చాతక సందేశ కర్త – ఒక బ్రాహ్మణకవి

కేరళ  మలబార్ ప్రాంత తిరువంతం కుంజు లోని నంబూద్రి  బ్రాహ్మణకవి తిరువాన్కూర్ మహా రాజ రామవర్మకు ఒక చాతకపక్షి ద్వారా తనకు ఆర్థికసాయం చేయమని పంపిన సందేశం . 1787లో టిప్పూ సుల్తాన్ మలబారును ఆక్రమించినపుడు ఈబ్రాహ్మణుడు తిరువాన్కూర్ మహారాజు కార్తీక తిరుణాల్ ఆశ్రయం పొందాడు .కొంతకాలానికి అకస్మాత్తుగా జబ్బు చేసి రాజుకు తెలియ బరచకుండా తన స్వగ్రామం చేరాడు .అక్కడ కాళికాదేవి పూజలో గడిపాడు .అక్కడ ఒక వనం లో చాతకపక్షికనిపిస్తే దానికి తన గోడు చెప్పి రాజుగారికి వెళ్ళగక్కమని  సందేశానికిపంపటం ఇతి వృత్తం .ఇందులోనూ దారిలోఉన్నపట్టణాలు ప్రజాసమూహాలు రాజులవర్ణన యధాప్రకారం కవి దట్టించాడు .ఇందులో కొచ్చిన్ మంత్రి రాజ గోపాల్ ప్రస్తావన ఉంది  .ఈయన పి .రాజగోపాలాచారి అని కొచ్చిన్ దివాన్ గా 1896-1901వరకు ఉన్నాడు అన్నది  చారిత్రిక సత్యం .ఎడ ప్పల్లి బ్రాహ్మణ రాజుల వర్ణనా ఉంది .వాళ్ళు దాంతాలి నాయకులు కావచ్చు .

404-నీలకంఠ సందేశకర్త -శ్రీధరన్ నంబి (1774-1830 )

నెమలి సందేశం అనే సందేశకావ్యాన్ని శ్రీధరన్ నంబి రాశాడు . కేరళ పట్టాంబి వంశం వాడు .భారత పిశరాట్టి  శిష్యుడై గొప్ప జ్యోతిశ్శా స్త్ర   వేత్త అయ్యాడు ,. ఈ వంశం వారు కాలికట్ రాజుల ఆస్థాన కవులు జ్యోతిష శాస్త్ర వేత్తలుఅయ్యారు .ఈ కవి  విక్రమాదిత్య చరిత్ర కూడా రాశాడు .నాయకుడు నాయకికి నీలకంఠం అంటే నెమలి ద్వారా  పంపిన సందేశం .జామోరీ రాజులకు హైదర్ జంగ్ కు జరిగిన యుద్ధం ,యూరోపియన్ జంటలు వాహనాలమీద తిరగటం ,బ్రాహ్మణులు వేద వేదాంత శాస్త్రాలు నేర్వటం వగైరా వర్ణనలన్నీ ఉన్నాయి .

405-మరికొన్ని సందేశ కావ్యాలు

కవి సార్వ భౌమ కొకుణ్ణి తంపురన్ కోటు నల్లూర్  (1858-1926 )’’విప్రసందేశం ‘’,18 వ శతాబ్దికి చెందిన రామపనివాద ‘’122 శ్లోకాల శారికాసందేశం ‘’1858-1926 కాలపు కవి సార్వ భౌమ కొకుణ్ణి తాంపురన్ కోటు నల్లూర్ ‘’విప్ర సందేశం ‘’అజ్ఞాతకవి విరచిత ‘’చకోర సందేశం ,పులియనల్లూర్ తెక్కపట్టు అనే నంబూద్రి బ్రాహ్మణకవి ‘’సంపాతి సందేశం ‘’,వాయస్కర  కు చెందిన   ఆర్యన్ నారాయణ మసాటు ‘’స్యేన  సందేశం ‘’కేరళలో సందేశకావ్యాలుగా చరిత్రకెక్కి సంస్కృత వాజ్మయం లో స్థానం పొందాయి.  ఇవన్నీ మూస కావ్యాలుగా కనిపించినా వాటిలో చారిత్రిక నేపధ్యం ఉన్నది.  ఆకాలపు రాజుల, ప్రజల జీవిత విధానాలకు అవి అద్దం పట్టాయి . వీటిపై ప్రత్యేక పరిశోధనలు జరిగి వాటిలోని చారిత్రిక  విషయాల నిగ్గు తేల్చారు పరిశోధకులు .. ఆరకంగా ఇవి చారిత్రిక సందేశ కావ్యాలుగా రాణ కెక్కాయి .

    సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8–8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 399-హంస సందేశ కావ్య కర్త-పూర్ణ సరస్వతి (14 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

399-హంస సందేశ కావ్య కర్త-పూర్ణ సరస్వతి (14 వ శతాబ్దం )

కేరళకు చెందిన 14 వ శతాబ్దపు కవి పూర్ణ సరస్వతి -పూర్ణ జ్యోతిష్యుని శిష్యుడు .ఉత్తర మలబార్ లోని కాట్టుమటం ఇళ్లాం  కు చెందినవాడు .పూ ర్ణ సరస్వతి వంశాన్ని పరశురాముడు ఆశీర్వదించి నట్లు ఐతిహ్యం .అనేక శాస్త్రాలలో విస్తృతపాండిత్యం కవిత్వ రచనలో మేటి అవటం వలన ఆయనకు పూర్ణ సరస్వతి అనేది బిరుదుగా లభించిన పేరు .కావ్యం లో పూర్వభాగం ,ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి .మొత్తం 102 శ్లోకాలు .కాంచీపురం లో ఒక కన్య ఒక ఉత్సవం లో శ్రీ కృష్ణుని మోహన రూపం చూసి మనసు పారేసుకొన్నది . ఒక హంసతో తనమనోభావాలను బృందావన కృష్ణునికి సందేశంగా పంపటం ఇతి వృత్తం .రాయబారి హంస చేర  ,పాండ్య దేశాలు చూస్తూ కావేరి ,కాళింది ,తామ్రపర్ణి లను దాటి తిరువనంతపురం వగైరాలను చూస్తూ బృందావనం చేరింది వీటి నన్నిటిని కవి చక్కగా అందంగా వర్ణించాడు .తిరువాన్కూర్ రాజు సర్వకళా  వల్లభ వంశీష. ఆయన బలపరాక్రమాలు వర్ణించాడు . బహుశా ఈ రాజు స్వాతి తిరుణాల్ రామవర్మ కావచ్చును .ఆయన రాజరికానికి వచ్చిన 1829-46 కాలం లో ఈ కావ్య రచన చేసి ఉండాలి .ఇందులో సుచీన్ద్రం లోని ప్రసిద్ధ ‘’కై ముక్కు ‘’అంటే వేడి నేతిలో చేయిపెట్టటం కూడా వర్ణితం . దోషి ఎవడైనా శుచీన్ద్రాలయం లో వేడి నే తిలో చేయి పెట్టించి దోషి అవునోకాదో నిర్ణయిస్తారు .దోషి అయితే చేయి కాలిపోతుంది .లేకపోతె ఏమీ కాదు

 కావ్యం లో దేవదాసి వ్యవస్థ వర్ణన కూడా ఉన్నది .తామ్రపర్ణి నదీతీర బ్రాహ్మణ అగ్రహారాలు స్నానఘట్టాలు ప్రకృ తి సౌందర్యం వర్ణన కూడా కనిపిస్తుంది ,.బ్రాహ్మణులను భూదేవతలు అని వర్ణించాడుకవి .

400-మయూర సందేశ కర్త -ఉదయ (16 వ శతాబ్దం )

కేరళ సందేశకావ్యాలలో మయూర సందేశం తలమాని కమైనది . దీనికర్త ఉదయ 16 వశతాబ్ది రాజకవి.ధ్వన్యాలోకానికి అభినవ గుప్తుడు రాసిన లోచన వ్యాఖ్యానికి ఈయన ‘’కౌముది ‘’వ్యాఖ్య రాశాడు .ఉదయ మానాకులం రాజా వంశీకుడు .వీరిపూర్వీకుడు శ్రీకంఠ మహాకవి .శ్రీకంఠుడు అనే నాయకుడు అంటే కవే  కున్నాం కులం వద్ద అన్నకార లో ఉన్నతనప్రేయసి మార చేమంతి కి మయూరంద్వారా తనమనసులోమాటను రాయబారంగా పంపటం .త్రివేండ్రం నుండిఅన్నకారకు మాప్ వేసి దారి చూపించడు కవి .సముద్ర  తీరం వెంబడి వర్కాలనుంచి క్విలన్ కు వెళ్లి ,అక్కడినుంచి తూర్పు కు తిరిగి కంటియూర్ మీదుగా కాయముకులం రాజుల రాజధాని కొట్టాయం చేరి , పుల్లా నదిదాటి కొచ్చిన్ రాజులువుండే త్రిపునీతురావెళ్లి .అల్వాయ్ నదిదాటి చిన్నమంగళం క్రన్ననూర్ మీదుగా బ్రహ్మమక్కాలకు తన ప్రేయసిని చేరుకోవాలి అని రూట్ మాప్ ఇచ్చిపంపాడు .ఇందులో చెప్పబడిన రాజులు మహాకవులు వ్యాఖ్యానాలు రాసినవారు .కోళంబ  అనేది కూపకులుల నగరం .

  సశేషం

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-17-కాంప్-షార్ల్లెట్- అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 397-దర్శన మాల కర్త -నారాయణ గురు (1885-1928 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

397-దర్శన మాల కర్త -నారాయణ గురు (1885-1928 )

కేరళలో తిరువనంత పురం లోని చెంపల0తి లో  1885 లో నారాయణ గురు జన్మించాడు .తండ్రి మదన్ ఆసన్  ,తల్లి కుట్టిఅమ్మ .గురుకుల పద్ధతిలో ప్రాధమిక విద్య  ఉన్నత విద్య 1887 వరకు నేర్చాడు .ఈకాలం లోనే తర్క ,వ్యాకరణ కావ్య నాటక వేదాంతాలు క్షుణ్ణంగా అభ్యసించాడు . సకల సద్గుణ రాశి గా పేరు పొందాడు .మంత్ర వేత్తగా ఉపన్యాసకుడుగా గురువుగా బోధకుడుగా సన్యాసిగా ప్రముఖుడయ్యాడు .కేరళలో హిందూ మత ,పునరుద్ధరణకు ,అందులోని మూఢ ఆ ఛారాలను తొలగించి సంస్కరణ చేసినందుకు నారాయణ గురు ను సదా స0స్మరించుకొంటారు .

 సంఘం లో అట్టడుగున ఉన్న అణగారిన కిందికి తొక్కబడిన జాతులవారిని కులమత భేదాలు లేకుండా చేరదీసి వారినీ సమాజం లో సమాన హోదాగలవారినిగా చేయటానికి చైతన్య వంతులను చేశాడు .తోటివారిని మానవులుగా గుర్తించాలే తప్ప హిందూ ముస్లిం క్రైస్తవాదులుగా గుర్తించరాదని బోధించాడు .వేద ,ఉపనిషత్తులు సర్వశాస్త్రాలు బాగా ఆకళింపు చేసుకున్నవాడుకా నుక వాటిలోని పరమ రహస్యాలను అర్ధం చేసుకొని ఆచరణ సాధ్యం చేశాడు .మనిషి వ్యక్తిత్వ వికాసానికి తోడు పడ్డాడు . దేశసంచారం చేస్తూ కట్టాంబి స్వామిని కలిసి ఆయన శిష్యుడై ఇద్దరూకలిసి సంఘ దురాచార నిర్మూలనకు నడుం కట్టారు .యోగ విద్యనూ సాధించాడు .వివాహమైందికాని సఫలం కాలేదు .

  నారాయణ గురు అరివిప్పురం లో ఒక శివ లింగ ప్రతిష్ఠచేసి గుడికట్టించి దాన్ని గొప్ప యాత్రాస్థలంగా మార్చాడు . 1895 లో డా.పల్పు ను కలుసుకోవటం తో సాంఘిక సేవకు మంచి ఊపు లభించింది .1903 లో ‘’శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన యోగం ‘’స్థాపించి అదో జగత్ సహోదరుల ను ఆదుకున్నాడు .నారాయణ గురు యజ్వ కులంలో పుట్టాడు ఆకులం వారికి అప్పుడు విద్యాలయాలలో  ఉద్యోగాలలో దేవాలయాలలో ప్రవేశం లేదు . ప్రముఖ మలయాళ వి కుమార  ఆసన్ ఈయన శిష్యుడే .ఆ సంస్థకు సెక్రెటరీ గా ఉన్నాడు . సంస్థ ‘’వివేకోదయం ‘’దిన పత్రిక ను ఆసన్ సంపాదకుడుగా ప్రారంభించింది .వీరి కులాలలో కెట్టు కళ్యాణం అనే శాస్త్ర బద్ధమైన ఖర్చుతోకూడిన తంతు  చేసుకొన్నవారికే  వివాహ యోగ్యత ఉండేది .ఈ పద్ధతిని మానిపించి సూటిగా తక్కువ ఖర్చుతో ఆదర్శ వివాహ పద్ధతిని జరిపించి సఫలుడయ్యాడు నారాయణ గురు .శివ గిరిలో శారదా మఠం  అలివిప్పురం మొదలైన చోట్ల ఆశ్రమాలు కట్టించి ,తాలస్సేరిలో జగన్నాధ దేవాలయం నిర్మించి అందరికి దేవాలయ ప్రవేశం కల్పించి గాంధీ ,ఠాగూర్ ల ను ఆహ్వానించి మన్ననలు పొందాడు .

 వేదాంత సంబంధమైన గ్రంథాలెన్నో నారాయణ గురు రాశాడు .కొన్ని సమాజ ఉద్ధరణకు రాశాడు .ఆయన సంస్కృత రచనలలో దర్శన మాల ,ఆత్మోపదేశ శతకం ,దైవ దశకం ,అనుకంప దశకం ,జటిలాక్షణం , చిచ్ఛ దా చింతనం ,శివశతకం,అద్వైత దీపికా ,జనని నవారత్న మంజరి ,నిర్వృతి పంచకం ,వినాయకాష్టకం ,జ్ఞాన దర్శనం ,చిదంబర శతకం ,ఇంద్రియ వైరాగ్యం  శ్రీ కృష్ణ దర్శనం కలినాటకం  మొదలైనవి ఉన్నాయి . 1928 లో ఈ ఆధ్యాత్మిక పుణ్య పురుషుడు నారాయణ గురు 43 ఏళ్లకే నారాయణ సన్నిధానం చేరాడు .

398-కేరళలో వివిధ రూపాలలో వర్ధిల్లిన సంస్కృత నాటకాలు

సంప్రదాయ ,జానపద పద్ధతులలో సంస్కృత నాటకాలు కేరళలో బహుళ వ్యాప్తి పొందాయి .అభినయ శైలి అద్భుతం .ఈ ప్రదర్శనా రూపకాలు -కుట్టియాట్టం ,ఛాక్యార్ కుట్టు ,నంగ్యార్ కుట్టు ,కృష్ణాట్టం అని వేర్వేరురకాలు ..

1-కుట్టి యా ట్టమ్ – కేరళలో సంస్కృత నాటకాలు ఆడటం ప్రారంభమైనది దీనితోనే .ఇది దేశంలో మిగిలిన చోట్లకంటే కొంచెం భిన్నంగా ఉంటుంది .అతి ప్రాచీన కళ  ఇది .కుట్టి అంటే కూడి అంటే కలిసి అని ,అట్టం అంటే నటించటం .అంటే కలిసి నటించటం అన్నమాట .నృత్యనాటకం లో ఉపరూపక విధానం . భరతముని చెప్పిన అన్ని సిద్ధాంతాలను దీనిలోపాటిస్తారు .ఈ కళ 10 వ శతాబ్దికి బాగా వ్యాప్తి చెందిన అతి ప్రాచీన ప్రదర్శన విధాన0 .కులశేఖర వర్మ కేరళలో దీన్ని మొదటిసారిగా ప్రదర్శించారు . దీనిలో ఆంగిక, వాచిక, సాత్విక ,ఆహార్య అభినయాలుంటాయి .ముద్ర ,చారి పద్ధతులను వాడతారు .తాళానికి మిలవు ,ఇడక్క ,కూడంకుల ,కూళితాళం  ఉపయోగిస్తారు . కుట్టియాట్టోమ్ లో ప్రదర్శించే సంస్కృత నాటకాలు -శక్తి భద్రుని ఆశ్చర్య చూడామణి నాటకం ,సుభద్రా ధనుంజయం ,కులశేఖరుని తపతీ  స్వయంవరం  హర్షుని నాగానందం ,నీలకంఠుని కళ్యాణ సౌగంధికం ,బోధాయనకవి రాసిన భగవదజ్జుక ,భాసుని అభిషేక, స్వప్న వాసవ దత్త , దూత వాక్య నాటకాలు

2-చాక్వార్  కుట్టు -ఇందులో న0జి యార్ ,నంబియార్ లు ఉంటారు .కుట్టియాట్టోమ్ లో ఇది విదూషక భాగం .ముఖ్యకథను హాస్యపద్ధతిలో అప్పటికాలానికి అన్వయిస్తూ విదూషకుడు చెబుతాడు .ఇది సంఘ దురాచారాలను ఖండించే రూపక విధానం .

3-నగరికుట్టు -ఇందులో ఆడవారే స్త్రీపాత్రలను ధరించటం ప్రత్యేకత .నంబియార్ కుటుంబాలకు చెందిన నంగియార్ లు నటిస్తారు .శ్రీ కృష్ణ కథలనే ప్రదర్శిస్తారు .వీటిలో ఏకాంకికలూ ఉంటాయి .చేటి నిర్వహణ బాధ్యత తీసుకొని కదా వృత్తాన్తమ్ తెలియ జేస్తుంది

4-కృష్ణాట్టం -ఇది అతిప్రాచీన సంప్రదాయ నృత్యనాటక ప్రదర్శన విధానం. దీనిని  1654లో గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం లో మొట్టమొదట ప్రదర్శించారు  .ఇందులో శ్రీకృష్ణుని జన్మ వృత్తాన్తమ్ దగ్గరనుంచి స్వర్గారోహణ వరకు 8 కధలను 8 రాత్రులు  ప్రదర్శిస్తారు.ఇందులో నృత్య సంగీతాలకే అధిక ప్రాధాన్యం .సంస్కృత సంగీత నాటకాలకు కేరళ ప్రజలు ఇస్తున్న ఆదరణకు ఇవన్నీ అద్దం పడుతూ వారి సాంస్కృతిక అభిరుచికి జోహార్లు అందుకొంటున్నాయి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Narayana Guru.jpg

— నారాయణ గురు


   కూడియాట్టం


  కృష్ణాట్టం 
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 395-చంద్రికా వీధి నాటక కర్త -రామ పనివాద (18 వ శతాబ్దం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

395-చంద్రికా వీధి నాటక కర్త -రామ పనివాద (18 వ శతాబ్దం

కేరళకు చెందిన 18 వ శతాబ్ది సంస్కృతకవి రామపనివాద గొప్ప సంస్కృత  విద్వా0సుడు .ఆ కాలపు ఎందరో రాజుల సంస్థానాలలో మన్ననల  నందుకున్నవాడు .ప్రాకృతభాషలోనూ అసామాన్య పాండిత్యం ఉన్నవాడు సంస్కృత ,ప్రాకృతాలలో చాలా రచనలు చేశాడు .వెత్తట్టు నాడు ప్రభువు వీర రాయల కోరికపై ‘’చంద్రికా వీధి ‘’ని ,అమలప్పుళ రాజు దేవనారాయణ కోరికపై ‘’లీలావతి వీధి ‘’ని ,తిరువనంతపురం సామ్రాజ్య స్థాపకుడు మార్తా0డ  వర్మ కోరగా ‘’సీతారాఘవ నాటకం ‘’చెన్నమగళం సైన్యాధియతి  కుబేర బిరుదాంకితుడు పలియాత్ అచ్చన్  అడగగా ‘’విష్ణు విలాసకావ్యం ‘’,కున్నమకులం లో మానాకులం కుటుంబం లో  ప్రసిద్ధుడైన ఆర్య శ్రీకంఠ రామవర్మ కోరికపై ‘’ముకుంద శతకం ‘’రాసి ప్రభువుల సైన్యాధికారులు ,ఉన్నత కుటుంబీకుల గౌరవ మన్ననలు పొందాడు . రామ ‘’పని వాద ‘’మంచి పనివాడు’’ అనిపించుకున్నాడు . పనివాద పేరును బట్టి ఆయన నంబియార్ కుటుంబం వాడని భావించారు . ఈ వంశం వారు ఛాక్యార్ లకు సంస్కృత నాటక ప్రదర్శనలో ‘’మిలవు ‘’అనే డ్రమ్ ను వాయిస్తూ సహాయపడేవారు .రామపని వాద నారాయణీయం రాసిన  నారాయణ భట్టు శిష్యుడు .తన రచనలన్నిటిలో గురుపాదుని సంస్మరించాడు .

 ఆయన రాసిన రాఘవీయ మహా కావ్యం లో 20కాండలు ,1572 శ్లోకాలున్నాయి .ఇవికాక మదన కేతు చరిత ప్రహసనం ,ముకుంద ,శివ ,సూర్య శతకాలు ,అంబర నాధీశ  స్తోత్రం  భాగవత చంపు ,వృత్త వార్తిక ,తాళ ప్రస్తార కావ్యం ,రాసక్రీడ తోపాటు కొన్ని సంస్కృత వ్యాఖ్యానాలు శాస్త్రీయ రచనలు చేశాడు .ఆయన రాసిన రాఘవీయానికి విష్ణువిలాసం మేలత్తూర్ దాతుకావ్యం గా భావిస్తారు .సుకుమార రాసిన కృష్ణ విలాసం పై విలాసిని ,వివరణ అనే వ్యాఖ్యలు రాశాడు .వరరుచి రాసిన ప్రాకృత ప్రకాశకు వ్యాఖ్యానం ,కంస వధ  ,ఉషానిరుద్ధ లఘుకావ్యాలు .లలితా రాఘవ ,పాదుకా పట్టాభిషేక నాటకాలు  లీలాశుకుని ‘’గోవిందాభిషేకం ‘’కు వ్యాఖ్యానం కూడా కూడా ఈయన రచించాడని ఏం కృష్ణమాచారియార్ తెలిపాడు .ఇవికాక పంచపాది అనే సంగీత రూపకం ,ముక్కొల్లు దేవాలయదైవం పై 20 శృంగార శ్లోకాల శృంగార వింశతి  జ్యోతిషం పై కొన్ని గ్రంథాలు కూడా రాశాడని అంటారు .బహుముఖ ప్రజ్ఞాశాలి ,అన్ని ప్రక్రియలలో సమానమైనపాండిత్యం తో కవిత్వం చెప్పి మహాభిరామంగా రామ పనివాద ప్రశస్తి చెందాడు .

396-కట్టాంబి స్వామి  (1853-1924 )

కేరళకు చెందిన కట్ఠంబి స్వామి హిందూ వేదాంతి గొప్ప సంఘ సంస్కర్త .భారతీయ తత్వ శాస్త్రానికి యోగం జ్ఞానం ఉచ్చావ నిస్వాసాలు అని చెప్పాడు .అద్వైత బ్రహ్మ స్వరూప దర్శనానికి ఇవే  మార్గ దర్శకాలు .కేరళలో రాజకీయ ,మత, సాంఘిక ,సాహిత్యాలలో సంస్కరణలు చేయాలని భావించాడు . 1853 ఆగస్టు లో కేరళలో తిరువనంతపురం దగ్గర కొల్లూర్ లో జన్మించాడు .తండ్రి వాసుదేవ శర్మ .తల్లి నాగమ్మ .చిన్నప్పుడు అందరూ కుంజు అని ముద్దుగా పిలిచేవారు అదే తర్వాత కుంజుపిళ్ల గా  మారింది .తలిదండ్రులకు చదువుచెప్పించే స్తొమత లేకపోవటం తో పెట్టియిల్ రామం పిళ్ల  ఆసన్ నడిపే గురుకులం లో చేరాడు .క్లాస్ లీడర్ అయినందున ‘’కట్టాంబి ‘’అనే పేరు వచ్చి అదే స్థిరమైంది .స్వామినాధ దేశికులవద్ద తమిళం ,సుందరం పిళ్ల వద్ద తత్వ శాస్త్రం ,టిక్కట్టు అయ్యావు వద్ద యోగా నేర్చాడు . ఒక సంచారస్వామి ఆఊరి కి వచ్చి బాల సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశాడు .దీన్ని నిత్యం జపం చేసి గొప్ప అనుభూతిపొంది ‘’షణ్ముఖ దాస ‘’బిరుదుపొందాడు .కుటుంబ భారం మీద పడగా చిన్నచిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించి పోషించాడు .త్రివేండ్రం ప్ర భుత్వ సెక్రెటేరియట్ లో గుమాస్తాగా చేయాడు .

 తమిళనాడువెళ్లి శుభా జట పాటిక అనే శాస్త్ర కోవిదుని శిష్యుడై చాలా కాలం ఉండి సంస్కృతం శాస్త్రాలు ,సిద్ధ వైద్యం ,సంగీతం  మార్షల్ ఆర్ట్ వగైరా నేర్చాడు .హిందూ, క్రిస్టియన్ ,ముస్లిం మత పెద్దలవద్ద, అవధూతల వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొన్నాడు .ఒక గొప్ప విద్యావేత్తగా ,మహర్షిగా మారి కేరళకు తిరిగిరాగా  నారాయణ గురు1882 లో ఈయన్ను కలిసి  , ఆయన కొట్టాంబి శిష్యుడైపోయాడు  .ఇద్దరూకలిసి హిందూమతం లోని మూడాఛారాలను సంస్కరించాలని నిర్ణయించారు .ముందుగా మహిళా విమోచన ఉద్యమం చేబట్టి వారికి అన్నిటా సమాన ప్రా తినిధ్యమివ్వాలని ఉద్యమించారు .మత  మార్పిడులను ఎదిరించారు .

 కిట్టాంబి స్వామి రచనలు ఆయన మేధో శక్తిని వివరిస్తాయి .సంస్కృతం లో ఎన్నో ముక్తకాలు  భజన గీతాలు ,వ్యాసాలూ రాశాడు .ఆయన రచనలో ‘’వేదాధికార మిరూపణ ‘’ప్రసిద్ధ గ్రంథం .అద్వైత పధ్ధతి ,ఆదిభాష  ,క్రీస్తు మత నిరూపణం ,దేవీ మానస స్తోత్ర వ్యాఖ్యానం ,నిజానంద విలాసం ,సర్వమత సామరస్యం లు కూడా బహుళ ప్రచారం లో ఉన్నవే .ఆయనను ‘’కవి వస్త్రం లేని సన్యాసి’’ అంటారు . 1924 లో పన్మన వద్ద కిట్టా0బి స్వామి 71 వ ఏటమహా సమాధి చెందాడు .ఆయనను విద్యాధిరాజా అని ,విద్యారాజరాజతీర్ధ పరామభట్టార అని కేరళ ప్రజలు  గౌరవంగా సంబోధిస్తారు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -19-2(31-7-17 నుండి 6-8-17 వరకు ) సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

వీక్లీ  అమెరికా -19-2(31-7-17 నుండి 6-8-17 వరకు )

సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

సరసభారతి 106 వ సమావేశం గా మహర్షి బులుసు సాంబమూర్తి గారి131 జయంతి

 ఈ శ్రావణ శుక్రవారం షార్లెట్ లోని మహిళలందరు సంప్రదాయ పద్ధతిలో పట్టు చీర జాకెట్ తలలో పూలు కళ్ళకు కాటుక ,చేతులకు గాజులతో సాక్షాత్తు అపర లక్ష్మీ దేవి స్వరూపంగా కనిపిస్తుంటే ఎంతో ముచ్చట వేసింది . మన సంప్రదాయ సంస్కృతులను ఇంత గొప్పగా పాటిస్తూ మనందరికి కీర్తి తెస్తూ ,ఆదర్శ ప్రాయమవటం అభినందించదగిన విషయం .భారతీయ మహిళలూ మీకు జోహార్లు .

శ్రీ మతి బులుసు పద్మ తమ ఇంటికి శనివారం రాత్రి టిఫిన్ కు రమ్మనమని చెప్పినప్పటినుంచి  ఆ రోజు ఎలా దాన్ని సరసభారతి కార్యక్రమంగా నిర్వహించాలా అనే ఆలోచన లో మధనపడ్డాను . శ్రీ బులుసు సాంబ మూర్తి గారింట్లో కలుస్తున్నాం కనుక మనమందరం మర్చిపోయిన స్వాతంత్య్ర సమార యోధులు ఆంద్ర రాష్ట్ర అవతారాణానికి శ్రీ పొట్టి శ్రీరాములుగారితో ఉద్యమించిన మహర్షి బులుసు సాంబ మూర్తిగారు జ్ఞాపకం వచ్చి ,బులుసు వారింట బులుసు వారిని జ్ఞాపక0  చేసుకుందామనిపించి ,దానితోపాటు ‘’నవ్వులతో ఆట నవ్వులాట ‘’ను కలిపి అందరూ పాల్గొనేట్లు చేద్దామని అనుకొన్నాను .

5-8-17 శనివారం – .మేము వాళ్ళఇంటికి రాత్రి 7 గంటలకే చేరాం .మిగతావాళ్ళు రావటం ఆలస్యమైంది .వాళ్ళు వచ్చాక ముందు ‘’టిఫిన్ కోర్ట్ ‘’లో ‘’బ్యాటింగ్ ‘’ప్రారంభించాం . పూరీ కూర ,ఇడ్లీ చట్నీ సాంబార్ ,మిర్చిబజ్జీ ,వెజిటబుల్ బిర్యానీ ,జున్ను లపై పడి  వీరంగం చేసాం ..అంతా అయేసరికి రాత్రి 10 అయింది .అప్పుడు అందరం ఒక చోట చేరి సరసభారతి 106 వ కార్యక్రమంగా మహర్షి బులుసు సాంబమూర్తిగారి 131 వ జయంతి ని నవ్వులతో ఆట నవ్వులాట కార్యక్రమం ప్రారంభించాం .అందరూ ఎంతో ఆశ్చర్య పోయారు . బులుసువారింట బులుసువారిపై కార్యక్రమం అనగానే . .యాక్సి డెంటల్ కో ఇన్సి డేన్స్ అంటే ఇదేనేమో కదా . నేను ముందుగా సరస భారతి  సాహితీ ప్రస్థానాన్ని వివరించి బులుసు వారి జీవిత విశేషాలను తెలియ జేశాను .. నేను ఈమాట చెప్పే దాకా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాను అందరూ ఎంతో ఆశ్చర్యానందాలు పొందారు .అలా ఉండాలనే సస్పెన్న్స్ క్రియేట్ చేశా . నా మాటల సారాంశ0-

‘’శ్రీ బులుసు సాంబ మూర్తిగారు తూర్పు గోదావరిజిల్లా కాకినాడ దగ్గర దూళ్ల గ్రామంలో 4-3-1886న జన్మించారు . తండ్రిగారు సుబ్బావధానులుగారు ప్రసిద్ధ వేద పండితులు .సాంబమూర్తిగారు ప్రాధమిక విద్య స్వగ్రామం లో నేర్చి  విజయనగరం మహా రాజాకాలేజి లో ఫిజిక్స్ చదివి డిగ్రీ పొందారు . కొద్దికాలం గుమాస్తాగా లెక్చరర్ గా పనిచేశారు . తర్వాత న్యాయ శాస్త్రం చదివి 1911 లో పాసై కాకినాడ బార్ కౌన్సిల్ లో చేరి  న్యాయవాది అయ్యారు .

 1920 లో దేశమంతటా ఉధృతంగా సాగిన సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్నారు .దేశ భక్త కొండా వెంకటప్పయ్య  పంతులుగారి ఉపన్యాసాలకు ప్రభావితులై న్యాయవాద వృత్తి వదిలేసి స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమం లో పాల్గొన్నారు మహాత్మా గాంధీ జీవిత విధానం నచ్చి 1923 లో కాకినాడ లో జరిగిన కాంగ్రెస్ సభలో సభ్యత్వం తీసుకున్నారు . భారత దేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలని డిమాండ్ చేసిన తొలికొద్దీ మంది నాయకులలో సాంబమూర్తిగారూ ఒకరు . 1930 లో కాకినాడలో ఉప్పు సత్యాగ్రహానికి నేతృత్వం వహించారు .. 18-4-1930  లో అరెస్టయి వెల్లూర్ జైలు లో నిర్బంధం లో ఉన్నారు . 1937 మద్రాస్ అసెంబ్లీ కి  జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు . అసెంబ్లీలో  అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి సాంబమూర్తిగారిని లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ను చేసింది .ఈ పదవిలో అయిదేళ్ళున్నారు .

 1942 లో క్విట్ ఇండియాఉద్యమం ఊపందుకొన్నప్పుడు గాంధీ ఆదేశం పై రాజకీయనాయకులందరు పదవులను త్యాగం చేయగా సాంబమూర్తిగారు లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పదవికి రాజయినామా చేసి ఉత్సాహంగా ఉద్యమం నిర్వహించారు .గాంధీగారిలాగానే సాంబమూర్తిగారుకూడా పంచె పై చొక్కాలేకుండా ఉత్తరీయం మాత్రమే ధరించి ఆదర్శ జీవితం గడిపారు .. భారత దేశం 1947 ఆగస్టు 15 న  స్వతంత్రం పొందింది సాంబమూర్తివంటి త్యాగ ధనుల నిస్వార్ధ సేవకు ప్రతిఫలంగా దాన్ని మనం హాయిగా అనుభవిస్తున్నాం .

 అప్పటికి మనం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో ఉన్నాం .ఇప్పుడు ఆంధ్రులకూ స్వతంత్రం కావాలని మద్రాస్ రాష్ట్రం నుండి వేరు చేసి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు శ్రీ పొట్టి శ్రీరాములు శ్రీ బులుసు సాంబమూర్తి శ్రీ ప్రకాశం పంతులు మొదలైన నాయకులు .. ప్రధాని నెహ్రు ఊగిసలాటకు ఆగ్రహించిన పొట్టి శ్రీరాములుగారు ఆమరణ నిరాహార దీక్ష కు సంకల్పించారు .అప్పటిదాకా ఆయనవలన లబ్ది పొందిన కాంగ్రెస్ నాయకులు మొహం చాటేయటం ప్రారంభించారు .శ్రీ రాములు గారి దీక్షకు  స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు .అప్పుడు బులుసుసాంబమూర్తిగారు తమ ఇంట్లో సత్యాగ్రహం చేయమని కోరగా ,చేశారు ఆ ఆతర్వాత సంగతులు మనకు తెలిసినవే .. ఆంద్ర రాష్ట్రం మహనీయుల త్యాగ ఫలితంగా ఏర్పడింది .కానీ ఆ మహానీయులను తర్వాత ఎవరూ పట్టించుకోలేదు ఉపేక్షకు గురి చేశారు .

  సాంబమూర్తిగారు కాకినాడ చేరి జీవిత చరమాంకం అక్కడే గడిపారు . చేతిలో చిల్లి గవ్వ లేని దీన స్థితి వారిది .కేంద్ర మంత్రి గోవింద వల్లభ పంతుకు  ఈ విషయం తెలిసి ఆర్ధిక సాయం చేశారు .అంతకు మించి ఆదరించిన వారెవ్వరూ లేకపోవటం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం .మహర్షి గా అందరి మన్నన పొందిన బులుసు సాంబ మూర్తిగారూ 2–2-1958 న 72 వ ఏట పరమ పదించారు . ఆతర్వాత ఎప్పుడో ఆయన కుమార్తె ప్రభుత్వానికి ఆర్ధిక సాయం కోసం విన్నపం పంపిస్తే ‘’సాంబ మూర్తి ఎవరు ?”’అని అడిగారట .అదీ మన జాతీయ నాయకులకిచ్చిన గౌరవం . అందుకే సాంబ మూర్తిగారిని ‘’నెగ్లెక్టెడ్ పేట్రియట్  ‘’అన్నారు … ఈ నెల15 న మనం భారత స్వాతంత్య్ర  దినోత్సవంజరుపుకో బోతున్నాం . ఆ సందర్భం గా మహనీయ త్యాగమూర్తి మహర్షి బులుసు సాంబమూర్తి గారిని సంస్మరించి ధన్యులమవుదాం .శ్రీ బులుసు సాంబ మూర్తిగారింట్లో స్వర్గీయ బులుసు సాంబమూర్తిగారి ని స్మరించుకొని అవకాశం మనకు కలిగినందుకు ధన్యులం దీనికి బులుసు దంపతులను అభినందిస్తున్నాను ‘’అని చెప్పాను . బులుసువారి త్యాగనిరతిని అందరు మొదటి సారి తెలుకొని తరించామని భావించారు  .

          నవ్వులతో ఆట నవ్వులాట

 తర్వాత నవ్వులతో ఆట నవ్వులాట ప్రారంభించాం .ఇందులో అందరూ పాల్గొని తమ అనుభవాలను ,తాము విన్న కన్నా హాస్యపు పనస తొనలను ,జోకులకేకులు తినిపించారు . శ్రీమతి సుబ్బలక్ష్మిగారు ఆమె భర్త కామేశ్వరరావుగారు రాకీ దంపతులు పద్మ దంపతులు  మా అమ్మాయి విజ్జి తమ అనుభవాలను తెలిపారు .బాధ్యత నాదే  దీనికీ ఫినిషింగ్ టచ్ ఇస్తూ

‘’మన హాస్య రచయితలైన చిలకమర్తి వారి గణపతి ,ప్రహసనాలు ,పానుగంటి సాక్షివ్యాసాలు ,వీరేశలింగంగారి ప్రహసనాలు , మొక్కపాటి నరసింహ శాస్త్రిగారి బారిస్టర్ పార్వతీశం  మునిమాణిక్యంగారి కాంత0  కథలు ,భమిడిపాటివారి హాస్య నాటికలు ,శ్రీశ్రీ రిమరిక్కులు ఆరుద్ర కూనలమ్మపాదాలు పఠాభి పంచాంగం జలసూత్రం పేరడీలు  బాపు రమణల హాస్యకథామృతం కార్టూన్లు ,శ్రీరమణ పేరడీలు హాస్యపు చెణుకులు ,రావికొండలరావు హాస్య నాటికలు సినీకవి పింగళి సినీమేటి  హాస్యం  తెలుగు హాస్యం పండించిన శివరావు రేలంగి రమణారెడ్డి ,హాస్యరాజా బాబు ,బ్రహ్మానందం ఏం ఎస్, ధర్మవరపు ,ఏ వి ఎస్  ఆంగ్ల హాస్యం పండించిన చార్లీ చాప్లిన్ లారెల్ ,హార్దీ  .రచయితలు  మార్క్ ట్వైన్  డికెన్స్ అమెరికా కార్టూనిస్ట్ జాన్ ధర్బర్  కోటి కి పడగలెత్తిన కార్టూనిస్ట్ ?తెలుగు హాస్యం అమెరికాలో చిందించిన వంగూరి చిట్టెన్ రాజు లను ఒకసారి గుర్తు చేసుకొందాం . అలాగే ఆవకాయ అత్తగారు తో సంసార ధర్మహాస్యం ఘాటు చూపించిన భానుమతి ,సురేకార హాస్య టపాకాయ్ సూర్యకాంతం  కె ఆర్కే మోహన్ మొదలైనవారు గురించి యెంత చెప్పినా అతక్కువే ..

 శ్రీనాధుడు పల్నాటిపై రాసిన చాటువులు తెనాలి పాండురంగనిపై ప్రచారం లో ఉన్న కధలు అన్నీ హాస్యపు తేనే తుట్టెలే . తాగే ఓపికవుంటే మధురమేకాదు అద్భుతః .

పల్నాడులో నీరు  దొరక్క ‘’తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా !గంగ విడువు పార్వతి చాలున్  ‘’అని ‘’కుళ్ళా  యుంచితి కోకచుట్టితి మహా కూర్పాము న్ గట్టితిన్ ,చల్లా యంబలి  ద్రావితి  విశ్వస్తవడ్డి0పగా -తల్లీ కన్నడ రాజ్య  లక్ష్మీ దయలేదా నేను శ్రీనాధుడన్ ;;’ ‘’జొన్నకలి జొన్నన్నము జొన్నపిసరు జొన్నలే తప్పన్ సన్నన్నము సున్నసుమీ పదునుగ పల్నాటిసీమ ప్రజలందరికిన్ ‘’

అలాగే తెనాలి రాముడు తాతా ఊతునా అంటే సరే నంటే తాంబూలం ముఖాన ఉమ్మేస్తే  పాంకోడు పెట్టి పన్ను రాలగొడితే  దుప్పికొమ్ము పెట్టుకొని రాయల సభకి వస్తే రాయలు రవి గానని చో  కవిగాఅంచునే కదా అని సమస్య ఇస్తే -’’ఆ రవి వీరభద్రు చరణాహతి కిన్ డుళ్ళిన బోసి నోటికిన్  కొక్కెర పంటికిం దుప్పి కొమ్ము పల్గా రచియించె నౌరా -రవిగానని చో  కవి గాంచునే కదా ‘’చాటువు -విజయనగరమహారాజు పూసపాటి  ఆనంద  గజపతి రాజు తన ఆస్థాన వైణిక  విద్వాన్ నడిమింటి సంగమేశ్వర  శాస్త్ర గారిని ‘’శాస్త్రి గారూ ఇంకా నడిమిల్లేనా ‘’అని హాస్యమాడితే ‘’ప్రభూ మా నడిమిల్లు మీ’’ పూసపాటి ‘’‘’చేయదా  ?అని ఇచ్చిన రిపార్టీ ,కాంతం ,మునిమాణిక్యం ప్రణయ కోపం తో కొంతకాలం మాట్లాడుకోపోతే ఒక రోజు ఆయన మేడ మెట్లు ఎక్కుతూంటే ఆమె దిగుతుండగా ఎదురుపడితే మునిమాణిక్యం ‘’నేను మూర్ఖులకు దారి ఇవ్వను ‘’అంటే ‘’నేను ఇస్తాను ‘’అని చాచి చెంపమీదకొట్టినట్లు రిపార్టీ ఇవ్వటం ,ఫన్ బకెట్ ఫన్ బకెట్ జూనియర్స్ ,ఫన్నీ ఫెల్లోస్ ,ఫ్రాస్త్రేటేడ్ వుమన్ మొదలైనవన్నీ ఒక్క సారి జ్ఞాపకం జేసుకొని హాయిగా 45 నిమిషాలు నవ్వుకున్నాం ,.  తర్వాత ఉషా పద్మ విజ్జి అంతా కలిసి పాడ  వోయి భారతీయుడా ,మా తెలుగు తల్లికి పాటలు పాడి ముగింపుకు వన్నె తెచ్చారు .అనుకోకుండా కార్యక్రమం అద్భుతంగా ఆనందంగా హాయిగా జరిగినందుకు ‘’ఆల్ హాపీస్’’ .

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-17-కాంప్ -షార్లెట్-అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా -19-1(31-7-17 నుండి 6-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -19-1(31-7-17 నుండి 6-8-17 వరకు )

సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

31-7-17 సోమవారం -ఉదయం సంధ్యావందనం ,నిత్యపూజ ,ఆంజనేయ అష్టోత్తర,సహస్ర నామ ,సువర్చలాఅష్టోత్తరపూజ తర్వాత  తొమ్మిదిరోజుల సుందరకాండ  శ్రీ సువర్చ లాన్జనేయ శతక పారాయణలో 5 వ రోజు పారాయణ ఉదయం పూర్తి చేశాను .. మా అమ్మాయి కొత్త ఉద్యోగం లో చేరింది .. మధ్యాహ్నం యు ట్యూబ్ జయ టివి లో మార్గశిర సంగీత ఉత్సవం చూశాను . చాలా అద్భుతంగా ఉంది . తమిళ తెలుగు కన్నడ మళయాళ హిందీ భాషలో గొప్ప సంగీత కచేరీలు కర్ణానందంగా ఉన్నాయి .. అలంకారిక ఆనంద నందనం -8 ,9 ఎపిసోడ్స్ రాశాను . రాత్రి ‘’గొట్టం ‘’లో  విశ్వనాధ్  సినిమా ‘’స్వరాభి షేకం ‘’చూశాము . ఆనందం తో గుండె కరిగి ఆనంద  బాష్పాలు  అడుగడుక్కీ కారి మహదానందమేసింది . ధన్యుడు  విశ్వనాధ్  .మనల్నీ ధన్యులను చేశాడు . అందులో రైల్వే కంపార్ట్ మెంట్ లో శివాజీ రాజా భార్యప్రసవం సీను సెంటిమెంట్ కు ,మానవత్వానికి ,సంగీత ప్రభావానికి ,హోమియో మందు ప్రయోజనానికి అద్దం పట్టింది . గుండెలు కరిగి ఆనంద తాండవమే చేయిస్తుంది . మొత్తం సినిమాలో ఒక పావుగంట సినిమా ఎడిటింగ్ లో తీసేసి ఉంటె శిఖరాగ్రాన నిలిచేది అని పించింది .

 ట్యూబ్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ -లక్ష్మణ్ కవల సోదరుల  ఇంటర్వ్యూ చాలా ఇంటరెస్టింగ్ గా రియలిస్టిక్ గా వాళ్ళ నిజాయితీకి నిదర్శనంగా ఉంది . పల్లె టూరు నుంచి సినీ పరిశ్రమకు వచ్చి ఎన్నో కస్టాలు పడి  ,ఏ దశలోనూ తమ నాయనమ్మ కు సిగరెట్ మద్యం జోలికి వెళ్ళమని చేతిలో చెయ్యేసి పెట్టిన ఒట్టును ,ఇచ్చిన మాట జవదాటకుండా ,అంచెలంచెలుగా ఎదిగి ఫైట్ మాస్టర్లు అయి సిగరెట్ ,మద్యం లేకుండా పైకొచ్చిన సోదరద్వయం వీరు .హీరోలుగానూ చేసి శెభాష్ అనిపించారు .అందులో వాళ్ళు ‘’మేము మంచివాళ్ళం అని అనుకునేవాళ్లం .ఇది కూడా గర్వానికి దారి తీస్తుందని మేమె గ్రహించి ఆ మాట చెప్పుకోవటం మానేసాం .ప్రతి స్టేజ్ లోనూ మా అంతటికీ మేము చెక్ చేసుకొని చేసిన తప్పులు తెలుసుకొని పురోగమించాం ‘’అని వారిద్దరూ ఏకకంఠం తో చెప్పట0  నాకు బాగా నచ్చింది ..

1-8-17 మంగళవారం -పారాయణ ఆరవ రోజు బాగానే జరిగింది ..ఆలంకారికులు 10 ,11 రాసి పూర్తి చేశా .

బుధవారం -7 వ రోజు పారాయణ . .గీర్వాణ కవుల  కవితా గీర్వాణం -3 లో 382,383 ఎపిసోడ్ లు రాశాను .

గురువారం -పారాయణ 8 వ రోజు ..గీర్వాణం -3 లో 384 నుండి 387వరకు కవుల గురించి   రాశాను .రాత్రి యు ట్యూబ్ లో హాస్య  చిత్ర దర్శకుడు రాజా వన్నేం రెడ్డి ఇంటర్వ్యూ చూశాను .’’క్షేమంగా వెళ్లి లాభంగా రండి ‘’ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా సూపర్ సక్సెస్  .ఆయనే డైరెక్ట్ చేసిన ఒక కుక్క పై తీసిన ‘’టామీ ‘’సినిమా అవార్డు లను పొందింది .రాజేంద్ర ప్రసాద్ అందులో హీరో .ఎక్కడో దారిలో ఒక కుక్క ఆయన వెంటపడి ఇంటికి వస్తే దాన్ని అల్లారుముద్దుగా పెంచుకొంటూ అదే సర్వస్వ0 గా గడుపుతాడు .రోజూ  అతను  రైల్ లో వేరే చోటుకు వెళ్లి ఉద్యోగం చేసి ,సాయంత్రం ఇంటికి వస్తాడు.  కుక్క ఆయనతో స్టేషన్ కు వెళ్లి మళ్ళీ సాయంత్రం ఆ ట్రెయిన్ వచ్చేసమయానికి అక్కడికి వెళ్లి వెంట తీసుకు వస్తుంది .అంత బాంధవ్యం ఏర్పడుతుంది వాళ్ళిద్దరికీ .ఒక రోజు యధా ప్రకారం ఆయన వెళ్ళాడు కానీ ,తిరిగి రాలేదు .ఆ విశ్వాసపు కుక్క ఏళ్ళ తరబడిరైల్వే స్టేషన్ దగ్గర అలాగే ఎదురు చూస్తూ తిండీ నీరు లేక చనిపోయింది  అతను  కూడా ఎక్కడో చనిపోయాడన్నమాట .విశ్వసానికి ప్రతీక గా టామీ కుక్క నిలిచి పోయింది .ఈకథ జపాన్ లో యదార్ధంగా జరిగింది .ఆ కుక్క విగ్రహం  స్థాపించి దాన్ని చిరస్మరణీయం చేశారట .ఆ కధకు ప్రేరణ పొందిన వన్నేం రెడ్డి మనవాతావరాణానికి తగిన మార్పులు చేసి తీశానని చెప్పాడు .అందులో రాజేంద్ర ప్రసాద్ నటన అద్వితీయమని ,కుక్క నాలుకను తన నాలుకతో తాకటం తన నాలుకను కుక్క తాకి నాలుకపై ఉన్నది తినటం దృశ్యాలలో ఏ మాత్రం సంకోచం ,అసహ్యం పడకుండా రాజేంద్ర చేయటం అతని నిబద్ధతకు నిదర్శనం అన్నాడు .అలా చేసిన నటుడు ఎవరూ ఉన్నట్లు తనకు తెలియదనీ రాజేంద్రను మెచ్చాడు . హాట్స్ ఆఫ్ రాజేంద్ర .

మదర్స్ డే సందర్భంగా ఎప్పటిదో -రాజీవ్ కనకాల ,వాళ్ళ అమ్మగారి తో ఇంటర్వ్యూ అతని చెల్లెలు శ్రీ లక్ష్మితో ముఖాముఖీ బాగున్నాయి అందరికీ ఆదర్శంగా కనకాల కుటుంబం నిలిచింది .సుమారు 20 ఏళ్ళక్రితం వేటూరి సుందర రామ మూర్తిగారి స్వగ్రామం కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి లో ఆయన తన ఇంట్లో ఆతిధ్యమిచ్చి జరిపించిన రెండు రోజుల సభలో కనకాల దేవదాస్ ద0పతులను ,విశ్వనాధ్ , బాలు, సప్తపది సినీ హీరోయిన్ సబితా వగైరాలను మేమిద్దరం చూసి మాట్లాడిన విషయాలు గుర్తుకొచ్చాయి .

4-8-17 శుక్రవారం -సుందర కాండ పారాయణం పూర్తి వరలక్ష్మీ వ్రతం

 శ్రావణ మాసం రెండవ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం .ఉదయం 4 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకొని 5 గంటలకు నిత్యపూజా ,శ్రీ సువర్చలాన్జనేయ అష్టోత్తర ,శతనామ పూజ చేసేసరికి ఉదయం 6-30 అయింది .రాత్రి తల్లీ కూతుళ్లు అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి గొప్ప శోభ చేకూర్చారు . అమ్మవారికి కట్టిన చీర చాలా శోభస్కరంగా ఉంది . అప్పటికే మా అమ్మాయి  వాళ్ళమ్మ లేచి వంట సగం పైనే చేసేశారు . 6-30 నుండి 7-45 వరకు వాళ్ళిద్దరికీ వరలక్ష్మీ వ్రతం యధా ప్రకారం చేయించి తోరపూజ తోరాధారణ మంత్రాలు చెప్పి కథ  చెప్పి వాయినాలు ఇప్పించేశాను .మా అమ్మాయి 8 గంటలకు బయల్దేరి ఆఫీస్ కు వెళ్ళింది .నేను తొమ్మది రోజులలో చివరి రోజు సుందరకాండ ,శ్రీ సువర్చలాన్జనేయ శతక పారాయణ పూర్తి చేసేసరికి .ఉదయం -8-45 అయింది .నైవేద్యంగా పూర్ణం బూరెలు గారెలు పులిహోర ,పాయసం ,పప్పు వంకాయ కూర కొబ్బరి చట్నీ . ఇంతలో శ్రీమతి ప్రక్కి అరుణ దంపతులు వచ్చారు . నైవేద్య హారతి మంత్రపుష్పం పూర్తయ్యేసరికి 9-15 అయింది . అరుణ దంపతులు మా దంపతులకు వస్త్రాలు అందజేసి వాయనం ఇచ్చుకున్నారు . ఆమెకూ మా వాళ్ళు కొత్త చీర జాకెట్ పేటి వాయనం ఇచ్చారు .

తర్వాత టిఫిన్  చేశాను .

 సుమారు 11 గంటలకు ప్రముఖ మృదంగ విద్వాన్ శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారి అల్లుడు వచ్చి వాళ్ళ ఇంటికి కారులో తీసుకువెళ్లాడు .ఎల్లా వారమ్మాయి 5 ఏళ్ళ క్రితం ఇక్కడే పరిచయం అప్పుడే వాళ్ళనాన్నగారితో ఫోన్ లో మాట్లాడుతుంటే మేమూ ఆయనకు నమస్కారాలు చెప్పాం . అయిదేళ్ల క్రితం వారు మా అమ్మాయిగారింటికి రావటం ఆయనను నేను ‘’టోరీ రేడియో ‘’కు ఇంటర్వ్యూ చేయటం ఆయన మా ఇంట్లో భోజనం చేయటం జ్ఞాపకం వచ్చాయి .ఆయన మర్చి పోలేదు . ఏడాది క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నాతో ఉయ్యూరుకు ఫోన్ లో మాట్లాడారు . విజయ మా ఇద్దరికీ బట్టలు పెట్టి వాయనమిచ్చి  టిఫిన్ పెట్టింది.మేము వాళ్ళఇంటికి వెళ్ళటం ఆమె ఆనందానికి అవధులు లేవని పించింది . .

 ఇంటికి రాగానే శ్రీమతి గోసుకోండ అరుణ  కారులో వాళ్ళింటికి తీసుకు వెళ్లి ఆదంపతులు మాకు బట్టలు పెట్టారు . వాయనం ఇచ్చారు . ఈ రెండు ఇళ్లకు మాతోపాటు మా ప్రక్కనున్న శ్రీ మతి సుగుణ కామాక్షిగారు కూడా వచ్చారు . ఇంటికి వచ్చి భోజనం చేసి సరికి మధ్యాహ్నం 1-30 అయింది .. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ భార్య శ్రీమతి రాధ మా ఆవిడను కారులో ఇంటికి తీసుకు వెళ్లి వాయనం ఇచ్చి ,చీర జాకెట్ పెట్టింది .

    సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మా అమ్మాయి ,వాళ్ళమ్మ కలిసి పిలిచిన వాళ్ళ ఇంటికి పేరంటానికి వెళ్లి వచ్చారు ఇంటికి వచ్చిన వారికి వాయనమిచ్చారు . రాత్రి 9 గంటలకు రాంకీ తమ్ముడు పవన్ భార్య శ్రీమతి పద్మశ్రీ వచ్చారు . పద్మశ్రీ అమ్మవారిపై శ్రావ్యంగా పాట  పాడింది . తర్వాత రాంకీ భార్య శ్రీమతిఉషా ,వాళ్ళ పెద్దమ్మ దంపతులు శ్రీమతి బులుసు పద్మజ వచ్చి పాటలుపాడి వాయనం తీసుకొన్నారు .పద్మ శనివారం సాయంత్రం వాళ్ళ ఇంట్లో టిఫిన్ కు రమ్మని ఆహ్వానించింది . ఆతర్వాత డా శ్రీమతి ఉపాధ్యాయుల శ్రావ్య ,వాళ్ళ అమ్మగారు వచ్చారు . ఆమె తలిదండ్రుల షష్ఠిపూర్తికి మమ్మల్ని పిలిస్తే వెళ్లాం . ఆమె అమ్మమ్మ మా గురువుగారు స్వర్గీయ  మహం కాళి  సుబ్బరామయ్యగారి తమ్ముడి భార్య అని అప్పుడు తెలిసింది .మళ్ళీ ఒక సారి జ్ఞాపకం చేసుకున్నాం . డా శ్రావ్య ఎంతో సాదా సీదాగా ఉంటారు . మంచి సంస్కారి .మళ్ళీ మనం కలుద్దాం అండీ అన్నారు . వీళ్ళ0దరికి మా అమ్మాయి వాయినాలు ఇచ్చింది అందరికి సరసభారతి పుస్తకాలు ఇచ్చాను చాలా సంతోషించారు  .

శనివారం -విజ్జీ వాళ్ళు తెలిసిన అమ్మాయి సీమంతానికి వెళ్లారు .మధ్యాహ్నం సాయి సెంటర్ నిరాహాహకురాలు శ్రీమతి జయ్ వాళ్ళ అత్తగారు ,లక్ష్మి పిల్లల డాక్టర్ నృత్య కళాకారిణి శ్రీమతి సాయి లక్ష్మి మొదలైనవారు వస్తే అందరికీ వాయినాలు ఇచ్చింది మా అమ్మాయి . డాక్టర్ గారికి మహిళా మాణిక్యాలు ఇచ్చాను ఆమె పొంగి పోయారు

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 393-  ఆంగ్ల సామ్రాజ్యం మహాకావ్య కర్త -ఏ.ఆర్. రాజరాజ వర్మ( 1863-1918 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

393-  ఆంగ్ల సామ్రాజ్యం మహాకావ్య కర్త -ఏ.ఆర్. రాజరాజ వర్మ( 1863-1918 )

      ఆంగ్ల సామ్రాజ్య సంస్కృత మహా కావ్యం రాసిన ఏ .ఆర్. రాజరాజ వర్మ కోయి తంపురన్ కేరళ దేశీయుడు .తల్లి కుంజి కావు తంబురాట్టి ,తండ్రి వాసుదేవన్ నంబూద్రి .  ఆయన రాసిన 30 గ్రంధాలలో దీనికి అత్యధిక ప్రాధాన్యం ఉంది .ఇది 23 సర్గలలో 1910శ్లోకాల కావ్యం .లండన్ నగర వైభవ వర్ణన తో కావ్యం ప్రారంభమై క్రమంగా ఆంగ్ల సామ్రాజ్య చరిత్ర ను ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు ను  రాశాడు కవి . ప్రతిశ్లోకం కావ్య గౌరవాన్ని పెంచేట్లు గా రాయటం కవి ప్రతిభకు నిదర్శనం .దీనిని 1901 లో టి గణపతి శాస్త్రి సంక్షిప్తంగా ముందుమాట రాసి ప్రచురించాడు .ఈ కవి ఇతర రచనలో విటవిభావరి లేక రాధా మాధవం నాలుగు భాగాలైన ‘’యమ’’లతో అలరారే చిన్నకావ్యం . తిరువనంత పురం లో సంస్కృత బోధపై ‘’గైర్వాణి విజయం ‘’రాశాడు .ఉద్దాలక చరిత వచన రచన ,తులాభారం ప్రబంధం ,ఋగ్వేదకారిక .పాణిని  అష్టాధ్యాయికి దీటుగా సంస్కృత వ్యాకరణం ‘’లఘుపాణినీయం ‘’. ఈ గ్రంథం  ఆయనను ‘’కేరళ పాణిని ‘’చేసింది .

294-కేరళోదయకర్త -డా .కె యెన్ .ఎళుత్తచ్చన్ (1911-1981)

సంస్కృత ,మళయాళ భాషలలో విస్తృత రచనలు చేసిన కేరళ పండితుడు డా .కె యెన్ ఎళుత్తచ్చన్ .పాలకాడు  జిల్లా చెరుపుల సెఱి లో 21-5-1911 న జన్మించాడు .విద్వాన్ పరీక్ష పాసై ,రెండు పాఠశాలలో పని చేసి బొంబాయి వెళ్లి తిరిగొచ్చి సంస్కృత ,మళయాళ ,ఇంగ్లిష్ లలో మాస్టర్స్ డిగ్రీ 1953 లో పొందాడు .మద్రాస్ యూనివర్సిటీలో లెక్చరర్ గాచేరి ‘’భాషా కౌతళీయం ‘’లో పరిశోధన చేసి పిహెచ్ డి పొంది ,కాలికట్ యూనివర్సిటీ లెక్చరర్ అయ్యాడు .కేరళ స్టేట్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ లో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అయ్యాడు .ద్రవిడియన్ లింగ్విస్టిక్ అసోసియేషన్ ఫెలోషిప్ పొంది ,కాలికట్ యుని వర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ చేశాడు .మళయాళ వ్యాకరణం పై విస్తృత పరిశోధన చేసి మళయాళ వ్యాకరణ చరిత్ర రాశాడు .మూడు చిన్నకథా సంపుటాలు ,మూడు కవితా సంపుటాలు ప్రచురించాడు మళయాళ భాషా సేవకు సాహిత్య అకాడెమి అవార్డు పొందాడు .

  సంస్కృతం లో రాసిన కేరళోదయాచారిత్రిక కావ్యం 21 సర్గలలో 2,500శ్లోకాలతో ఉన్నది .ఇది 1977 లో ప్రచురితమైంది .చరిత్రకావ్యాలలో ఇది అగ్రభాగాన నిలిచింది .కవి సృజన శక్తికి ,కవితాప్రతిభకు, శైలికి ఇది గొప్ప నిదర్శనంగా నిలిచింది .ఈ మహాకావ్యం లో జాతీయ సమైక్యతను చక్కగా చాటి చెప్పాడు .కావ్యాన్ని  స్వప్నమంజరి స్మృతిమంజరి ,ఐతిహ్య మంజరి ,బోధామంజరి చిత్ర మంజరి అనే అయిదు గుచ్చాలుగా విభజించాడు .కేరళ దేశం పరశురామ మహర్షి వలన ఏర్పడిందనే ఐతిహ్యం తో మొదలు పెట్టి  చేర  రాజుల ,జామోరీ రాజుల పాలన పోర్చుగీసుల రాక ,ఆధునిక కేరళ చరిత్ర అంతా సవివరంగా వర్ణనాత్మకముగా రాశాడు .మహాత్మా గాంధీ ,బాలగంగాధర తిలక్ వంటి జాతీయ నాయకుల చరిత్రనూ కలిపాడు .ఆధునిక భావాలను కూడా హాయిగా సుందరంగా సరళమైన సంస్కృతం లో రాయవచ్చునని కవి రుజువు చేసి చూపాడు . 28–10-1981 న 70 వ ఏట మరణించాడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

 

A.R. Raja Raja Varma.jpg

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 391-శ్రీ వెంకటేశ్వర సుప్రభాత కవి -ప్రతివాది భయంకర శ్రీ అనంతాచార్య -(1430)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

391-శ్రీ వెంకటేశ్వర సుప్రభాత కవి -ప్రతివాది భయంకర శ్రీ అనంతాచార్య -(1430)

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య సన్నిధిలో ప్రతి రోజు తెల్లవారుఝామున స్వామిని మేల్కొల్పటానికి ఆలపించే  శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం  సుప్రభాతాలలో తలమానిక మైనది .దీన్ని రాసే అదృష్ట0 పొందినవాడు ప్రతి వాది  భయంకర శ్రీ అనంతాచార్య .ఈయననే అన్నాచార్య అంటారు .ఇదిక్రీశ.  1430 లో రాయబడిందిగా భావిస్తారు .అనంతాచార్య శ్రీ మనవాల మాముని  స్వామి శిష్యుడు . మనవాల  స్వామి శ్రీరంగం లో శ్రీరంగ నాధ సుప్రభాతం రాసిన శ్రీ వైష్ణవ మహా భక్త శిఖామణి .

 శ్రీ వేం కటేశ్వర సుప్రభాతం లో నాలుగు భాగాలుంటాయి -1- శ్రీ  వేంకటేశ  సుప్రభాతం -29 శ్లోకాలు 2-శ్రీ  శ్రీ వేంకటేశ స్తోత్రం -10 శ్లోకాలు -3- ప్రపత్తి-16 శ్లోకాలు  4-మంగళాశాసనం .-14 శ్లోకాలు  సుప్రభాతం లో మొదటి శ్లోకం వాల్మీకి మహర్షి రచించిన శ్రీ మద్రామాయణం లోని విశ్వామిత్ర మహర్షి శ్రీ రాముని నిద్ర మేల్కొల్పుతూ చెప్పిన ‘’కౌసల్యా సుప్రజా రామా ‘’శ్లోకం తో ప్రారంభమవుతుంది . అనంతా చార్యులు  నిత్యం అర్చించిన శ్రీ లక్ష్మీ నారాయణ ,శ్రీ భూదేవీ సమే త పద్మనాభ స్వామి విగ్రహాలతోపాటు 12 దివ్య సాలగ్రామ శిలలు ప్రస్తుతం ఆయనకు 15 వ తరం వారైన ప్రతివాది భయంకర రాఘవాచార్యులవారి వద్ద ఉన్నాయి .ఇప్పటికీ అవి ఆంద్ర ప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న దివ్య సాలగ్రామ క్షేత్రం లో నిత్యం పూజలందుకొనటం గొప్ప విశేషం .

1-సుప్రభాతం .

1-కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే -ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవ మాహ్నికం .

24-ఇత్ధమ్  వృషాచలపతే రిహసుప్రభాతం –  ఏ మానవాః ప్రతిదినం పఠితుమ్  ప్రవృత్తాహ్

   తేషామ్ ప్రభాత సమయే స్మ్రుతి రంగ భాజాం -ప్రజ్ఞాన్ పరార్ధ సులభ0  పరమాం ప్రసూతే . 2- స్తోత్రం

1-కమలాకుచ చూచుక కుంకుమతో -నియతారణ  తాతుల నీల తనో

  కమలాయత లోచన లోకపతే – విజయీభవ  వేంకట శైలపతే  .

10-అజ్ఞానినా మయాదోషా న శేషాన్నిహితాన్ హరే -క్షమస్వత్వం క్షమస్వత్వం శేష శైల శిఖా మనే  .

3-ప్రపత్తి

1-  ఈశాన్యాం  జగతోస్య  వేంకట  పతే ర్విష్ణో పరాం ప్రేయసీ0-తద్వక్షస్థల నిత్య వాస రసికాం  తత్  క్షాన్తి  సంవర్ధినీం

పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనే స్థితం -వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీమ్ వన్డే జగన్మాతరం .

4-మంగళాశాసనం

1-శ్రియహ్ కాంతాయ నిధయే నిధయేర్థినాం -శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం .

14-మంగళా శాసన పరై ర్ మదాచార్య పురోగమైహ్  – సర్వైశ్చ పూర్వై రాచార్యైహ్   సత్కృతాయాస్తు మంగళం .

యాభై అరవై ఏళ్ళ క్రితం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పుస్తకం లేని ఇల్లు ఆంద్ర దేశం లో ఉండేదికాదు . నోటికిరాని వారు ఉండేవారుకాదు .శ్రీమతి ఏం ఎస్ సుబ్బలక్ష్మి తన అమరాగాణంతో దానికి మరింత వైభవం తెచ్చింది . ఆమె సుప్రభాతం వినకపోతే శ్రీ వేంకటేశ్వరుడు నిద్ర లేచేవాడుకాదు అన్నంతగా ప్రచారమైంది

392- యతిరాజ వింశతి కర్త -మనవాల మాముని (1370-1450 )

తమిళనాడు ఆళ్వార్ తిరుమంఝీరిలో 1370 లో మనవాల మాముని జన్మించాడు .అసలుపేరుఅళగియమనవాల పెరుమాళ్ నాయనారు .అంటే శ్రీ రంగనాధస్వామిలాగా ఉన్న అందమైన పెళ్లి కొడుకు అని అర్ధం .. తండ్రి తిరునైదయ అన్నారు .తల్లి శ్రీరంగ నాచ్చియార్.తండ్రీ ,మాతామహులవద్ద వేదం  వేదాంతం దివ్య ప్రబంధాలు అభ్యసించి , 16 వ ఏట సిక్కి కేదారం నుంచి  తిరువై మోళి పిళ్ళై వెళ్ళాడు . ఇక్కడే రామానుజుల విగ్రహం ఉంది .ఇక్కడే ‘’యతిరాజ వింశతి’’రాశాడు .శ్రీ భాష్యం చదివి రామానుజ ఆదేశం పై దివ్య ప్రబంధ ప్రచారం చేస్తూ శ్రీరంగం చేరి తన పూర్వీకులులాగానే రంగనాధ సేవలో పునీతుడయ్యాడు .ఇక్కడే శ్రీ రంగనాధ సుప్రభాతం ,స్తోత్రం రాశాడు . అక్కడినుంచికనుంచి తిరుమల  మొద లైన పుణ్య క్షేత్ర దర్శనం చేసి  మళ్ళీ శ్రీరంగం చేరాడు

 పిళ్ళై లోకాచార్య రహస్య  గ్రంధాలైన ముముక్షుపది  శ్రీ వచన భూషణం ,తత్వరహస్యం లపై  వ్యాఖ్యానాలు రాశాడు . జ్ఞాన సారం ,ప్రమేయం సారాలపై కూడా వ్యాఖ్యలు రాశాడు .మళ్ళీ తిరునగరిచేరి ఆచార్య హృదయం పై వ్యాఖ్య రాశాడు . 1430 లో రంగనాధ స్వామి మనవాల  మామునిని శ్రీరంగం కు వచ్చి నమ్మాళ్వార్ రాసిన తిరుమొళి పై ఉపన్యాసాలు ఇమ్మని ఆదేశిస్తే వచ్చి అందరికి అర్ధమయేట్లు ఆయన హృదయాన్ని ఆవిష్కరించి చెప్పాడు .ఈయన ప్రసంగాలకు మురిసిపోయిన రంగనాధుడు చివరి రోజు బాల పూజారిగా వచ్చి అభినందిస్తూ ‘’తనియన్ ‘’చెప్పి  అదృశ్యమయ్యాడు . ఆ శ్లోకం అన్ని వైష్ణవ దివ్య క్షేత్రాలలో దివ్య ప్రబంధ గానం కు ముందు పఠిస్తారు ,-ఆ శ్లోకం –

‘’శ్రీ శైలేశ దయాపరం  ధీ భక్యాది గుణార్ణవమ్ యతీంద్ర ప్రవణం రామానుజ మతారం మునిమ్ . దివ్య ప్రబంధ పఠనం -’’శ్రీమతే  రమ్యాజ మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వాసినే భూయాత్ శ్రీ నిత్య శ్రీనిత్య మంగళం ‘’అని పూర్తి చేస్తారు అంత   గౌరవం ఇస్తారు మాముని స్వామికి .ఆయన 19 గ్రందాలరాస్తే అందులో మూడు సంస్కృతం ,మిగిలినవి తమిళం లో ఉన్నాయి .

 సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-5-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3 389-బాహుబలి విజయ నాటక కర్త -యెన్.రంగ నాధ శర్మ (1916-2014 )

గీర్వాణ కవుల కావిటీ గీర్వాణం -3

389-బాహుబలి విజయ నాటక కర్త -యెన్.రంగ నాధ శర్మ (1916-2014 )

సంస్కృత కన్నడ వ్యాకరణా ల లోతులు తెరచిన యెన్ రంగనాధ శర్మ 7-1-1916న కర్ణాటకలో నాడహళ్లి లో జన్మించాడు .బెంగుళూరు చామరాజేంద్ర సంస్కృత కళాశాలలో 1948 నుండి 1976 వరకు నాలుగు దశాబ్దాలు సంస్కృత కన్నడాలు బోధించాడు .ప్రముఖరచయితాజి వి గుండప్పకు సహాధ్యాయి .సంస్కృతం లో బాహుబలి విజయం  ,ఏక చక్రం ,అనే చారిత్రిక ,పౌరాణిక నాటకాలు ,గురు పరే మిత చరితం ,గోమఠేశ్వర సుప్రభాతం ,గుమ్మటేశ పంచకం రాశాడు .కన్నడం లో చాలా విస్తృత రచనలు చేశాడు ఎన్నో అనువాదాలు రచించాడు

కర్ణాటక రాష్ట్ర బహుమతి రాష్ట్రపతి ప్రశంసాపత్రం ,రాజ్యోత్సవ పురస్కారం ఉత్తమ అధ్యాపక అవార్డు ,మొట్టమొదటి డి వి జి మెడల్ ,మహామహోపాధ్యాయ ,గౌరవ డాక్టరేట్ ,సంస్కృత గ్రంథ రచన పురస్కారం వంటివి ఎన్నో అందుకున్నాడు . 25-1-2014 న 98 ఏళ్ళ నిండువయసులో రంగనాధ శర్మ శ్రీరంగ ధామం చేరాడు .

390-మహాయాన బౌద్ధ ప్రజ్ఞా పారమిత్ర  గ్రంథం  (క్రీపూ 100  )

మహాయాన బౌద్ధ ఉద్గ్రంధం ప్రజ్ఞా పారమిత్ర అంటే సర్వతోముఖ జ్ఞానం పొందే సాధన మార్గం .ఇందులో బోధిసత్వుని మాతృ దేవతగా భావించారు .ఇది మహాయానం లోని మూల సిద్ధాంతం .ఇందులోని  సూత్రాలు అనుత్పాద  మైనవి గా విశ్వసిస్తారు .ఒకరకం గా అపౌరుషేయాలు .ఇందులో 8 వేల  సూత్రాలున్నాయి .వీటిని ‘’అష్ట సాహస్రిక ప్రజ్ఞా పార మిత్ర సూత్రాలు ‘’అంటారు .. ఇవన్నీ క్రీపూ ఒకటవ శతాబ్ది కి చెందినవి అని పరిశోధకుడు ఎడ్వర్డ్ కాంజ్  రాశాడు . ఇందులోని సంస్కృతం నిర్దుష్టమైనది కాదని భావిస్తారు .. వీటి చైనీ అనువాదం క్రీశ 2 వ శతాబ్దిలో లభించాయి  .ఇవే రత్న గుణ సముచ్ఛయగా పిలువబడుతున్నాయి  . మహాయానం లోని భాగమైన ‘’చాటిక ‘’లవారు అభి వృద్ధి చేశారని అనుకొంటారు .ఇవన్నీ ఆంద్ర దేశం లో కృష్ణా నదీ తీరాన అమరావతీ ధాన్యకటకం  మహాయాన సంఘాలలో ఏర్పడినవిగా ఊహిస్తారు  .వీటిలోని శాఖలను పూర్వశైల ,అపర శైల అంటారు .వీటిలో ఒక్కొక్కవ్రాత ప్రతి   ప్రాకృత భాషలో ఉన్నాయి. వీటిలో బుద్ధుని బోధలున్నాయని హుయాన్ సాంగ్ ధృవీకరించాడు . 2012 లో హ్యారీపాక్ ,శేషి కరసీమ లు శిధిలమైన దీని వ్రాతప్రతిని ముద్రించారు .రేడియోకార్బన్ డేటా ప్రకారం ఇది క్రీశ . 75 కు చెందినదిగా గుర్తించారు .బౌద్ధ గ్రంధాలలో అతిప్రాచీనమైనదిగా దీన్ని భావిస్తున్నారు .చైనా భాషలోకి అనువదించిన లోకేశేన- గాంధారీ భాష వ్రాతప్రతిని ఆధారంగా  చేసుకొని చేశాడు .జపాన్ భౌద్ధులుమాత్రం దీనికంటే ‘’వజ్రచ్చేదిక’’ప్రాచీనమైనది అంటారు .చివరికి దీనికి వజ్రచేదికా ప్రజ్ఞా పారమిత్ర అని పిలుస్తున్నారు .దీనికి ఆచార్య నాగార్జునుడు ,మైత్రేయ అసంగ ,వసుభద్ర దిఙ్నాగాదులు వ్యాఖ్యానాలు రాశారు .

  సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -3 388-సుధాపరిమళ  వ్యాఖ్య కర్త -శ్రీ రాఘవేంద్ర స్వామి (1595-1671 )

గీర్వాణ కవుల కవిత గీర్వాణం -3

388-సుధాపరిమళ  వ్యాఖ్య కర్త -శ్రీ రాఘవేంద్ర స్వామి (1595-1671 )

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వెంకట నాధుడుగా  తమిళనాడు భువనగిరిలో 1597లో కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో తిమన్నభట్ట  గోపికాంబ దంపతులకు జన్మించారు .మధురై లో బావ లక్ష్మీ నరసింహాచార్యులవద్ద  శాస్త్రాధ్యనం చేసి ,కుంభకోణం శ్రీమఠం లో చేరి ,సరస్వతీబాయిని వివాహమాడి ,లక్ష్మీనారాయణ ఆచార్య అనే కుమారుని కి తండ్రిఅయ్యారు.

 సుధీంద్ర తీర్థులవద్ద శిష్యరికం చేసి ఆయన అనుజ్ఞతో 1614 లో సన్యాసాశ్రమం స్వీకరించి  తమ శ్రీరామ భక్తికి నిదర్శనంగా ‘’రాఘలేంద్ర తీర్ధ ‘’అయ్యారు .సంస్కృతంలో నిష్ణాతులై వేద ,వేదాంత ,శాస్త్రాలను బోధించారు .గొప్ప సంగీతజ్ఞులేకాక వీణా వాదనలో గొప్ప నిపుణులుకూడా . 1621 లో  సుచీన్ద్రుల  తర్వాత శ్రీమఠం పీఠాధిపతి అయి 1671 వరకు ఉన్నారు  . దక్షిణ భారతం అంతా విస్తృతంగా పర్యటించి ద్వైతమత ప్రచారం ఉధృతంగా చేశారు .అనేక అద్భుతాలు చేసి ఆశ్చర్య పరచారు .1801 లో బళ్లారికలెక్టర్  గా ఉన్న థామస్ మన్రో రాఘవేంద్రస్వామి వారి అద్భుతాలను స్వయంగా చూసి అబ్బురపడి కైఫీయత్ లో  రికార్డ్ చేశాడు .

  రాఘవేంద్ర స్వామి ద్వైత మత గ్రంధం శ్రీమాన్ న్యాయ సుధకు సంస్కృతం లో .‘’సుధాపరిమళ వ్యాఖ్య ‘’రాశారు. మాధవా చార్యుల  పది ప్రకారణ గ్రంధాలలో ఆరింటిపై స్వామి దశప్రాకారణ వ్యాఖ్యానం రాశారు  .బ్రహ్మ సూత్రాలకు ‘’సూత్ర ప్రస్తానం ;; ఋగ్వేద ఉపనిషత్ ప్రస్థానాలు కూడా రాశారు .గీతా ప్రస్తానం శ్రీ రామ చరిత మంజరి ,శ్రీ కృష్ణ చరిత మంజరి ,ప్రతాః సంకల్ప గద్య ,సర్వ సమర్పణ గద్య కూడా రాఘవేంద్ర స్వామి రచించారు  .రాఘవేంద్ర స్వామిపై శ్రీ రాఘవేంద్ర విజయం ను వారి మేనల్లుడు ,నారాయణాచార్య రాశాడు .అప్పనా చార్య స్వామిపై 32 శ్లోకాల స్తోత్ర0 రాశాడు .ఇది  మఠం లో నిత్యా స్తోత్రమైంది . రాఘవేంద్ర స్వామి జీవితం పై ,మహాత్మ్యాలపై తెలుగు తమిళభాషలో చాలా సినిమాలు టివి సీరియల్స్ వచ్చాయి . తమిళనటుడు రజనీకాంత్ స్వామిగా నటించాడు . తెలుగు సీరియల్ లో ప్రసాద్ బాబు చేసినట్లుజ్ఞాపకం .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

–    శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

Varalakshmi vratham pooja procedureAadi 18 recipesAadi 18 celebration procedure


 

సాహితీ బంధువులకు ,సోదరీమణులకు రేపు 4-8-17 రెండవ శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 386-మధ్వ  విజయ కర్త -నారాయణ పండితాచార్య -(1240-1310)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

386-మధ్వ  విజయ కర్త -నారాయణ పండితాచార్య -(1240-1310)

ద్వైతమత స్థాపనాచార్యులపై మధ్వ  విజయం రాసిన నారాయణ పండితాచార్య శ్రీ మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడు త్రివిక్రమ పండితా చార్య కుమారుడు .మధ్వ విజయం 16 సర్గల మహాకావ్యం . మధ్వాచార్యులు సమకాలీకులవటం వలన ఈ గ్రంధం మన విద్యారణ్యులవారి శంకర విజయంలాగా సాధికారమైనది . దీనికి ఆయనే ‘’సుమధ్వ విజయ ‘’వ్యాఖ్యానం రాశాడు  ప్రకాశిక అనే పేరు కూడా ఉంది .నారాయణ పండితాచార్య శివస్తుతి ,3 వేల  శ్లోకాలతో సంగ్రహ రామాయణం ,ప్రమేయ నవ మాలిక  అనే ‘’అనుమాధవ విజయం’’ కూడా రాశాడు .ఇది 32 శ్లోకాల మధ్వ సంగ్రహ చరిత్ర .దీనికి రాఘవేంద్ర స్వామి తమ పూర్వాశ్రమం లో వ్యాఖ్యానం రాశారు .

 మణి మంజరి ,శుభోదయకావ్యాలు కూడా ఈ కవి రాశాడు .మణి మంజరిలో మధ్వాచార్యులు ముందున్న వైష్ణవాచార్యుల చరిత్ర అంతా  ఎనిమిది సర్గలలో సరళ సుందరంగా రాశాడు . ఈయన రచనన్నిటిపై విపులమైన వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి .మధ్వాచార్యులు దశ ప్రకాశం పై నారాయణ పండితాచార్య ప్రసిద్ధ వ్యాఖ్యానం ‘’విష్ణు తత్వ నిర్ణయ సారం ‘’రాశాడు . ఈ టీక నే ‘’తత్వ మంజరి ‘’అంటారు .అందుకనే ఈయనకు  ‘’ప్రాచీన టీకాకారుడు ‘’అని పేరు .   కేరళలోని కాసార్ గోడ్ లో ఇప్పటికీ ఆయన స్వగృహాన్ని చూడవచ్చు . దీనిని  గౌరవంగా ‘’కవి మఠం ‘’అంటారు  .

387-భ్రమర గీత కర్త -శ్రీ పాద రాజ(1404-1502)

కర్ణాటకలో హరిదాస ఉద్యమ పిత  . విజయనగర సామ్రాజ్య రాజగురువుకూడా .లక్ష్మీ నారాయణ తీర్ధ అనీ అంటారు ..కర్ణాటక చెన్నపట్న తాలూకా అబ్బూరులో జన్మిచాడు . ఆయనను ధ్రువుని అవతారంగా భావిస్తారు .. ద్వైత ,హరిదాసు సాహిత్యానికి ,రాజకీయ సాంస్కృతిక మార్పులకు ఆయన  అసమాన  కృషి చేశాడు . ఒకసారి స్వర్ణ వర్ణ తీర్ధ స్వామి అబ్బూరు వచ్చి బాల లక్ష్మీ నారాయణ ను అబ్బూరు ఎంత దూరం అని అడిగితె ,తెలివిగా ‘’అస్తమయ సూర్యుని చూస్తున్నారుకదా .మేము ఇక్కడ ఆడుతున్నాం కదా .యెంత దూరమో మీరే ఊహించండి ‘’అన్నాడు .అంటే చీకటిపడుతుంటే ఇంటికి వెళ్ళటానికి మాకు ఎక్కువ సమయం పట్టదు కదా అంతతక్కువ దూరం అనే భావం తో చెప్పాడన్నమాట . స్వాములవారు ఈ బాలుడు గడుసు పిండమే నని గ్రహించి ,తన శిష్యుడిని చేసుకొని  సన్యాసమిప్పించి ఉత్తరాధికారిని చేశాడు .

శ్రీపాద రాజ తీర్ధ పీఠాధిపతి అయి విజయ నగర రాజులుచేసిన బ్రాహ్మహత్యా  దోషాలను ఇవారించాడు సంస్కృత ,కన్నడ భాషలలో గొప్ప పండితుడై చాలా  గ్రంథాలు రాశాడు .భ్రమర గీత ,వేణుగీత ,గోపీ గీత ,మాధవ నామ సంస్కృత రచనలు బహుళ వ్యాప్తి పొందాయి .ఆయనతన భక్తి గీతాలను ‘’దేవర నామాలు ‘’అని చెప్పి పాడేవాడు .తన సంతకాన్ని ‘’రంగ విఠల ‘’అని చేసేవాడు . ఆయన రాసిన భక్తిగీతం ;;భూషణకే భూషణ ‘’అందరి నాలుకలపై నర్తిస్తుంది.  కోలార్ జిల్లా ముల్ బగాయ్ తాలూకా నరసింహ తీర్ధలో  ఆయన ‘’బృందావనం ‘’ను లక్షలాది భక్తులు దర్శిస్తారు .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 384-కుంభాభిషేక చంపు కర్త-కడూర్ కృష్ణ జాయిస్ (1912

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

384-కుంభాభిషేక చంపు కర్త-కడూర్ కృష్ణ జాయిస్ (1912

1-8-1912 న కడూర్ కృష్ణ జాయిస్ కర్ణాటక శృంగేరిలో శేషమ్మ ,సుబ్బా జాయిస్ దంపతులకు జన్మించాడు .అలంకార ,అద్వైతాలలో విద్వాన్ డిగ్రీ పొంది హోల్ నరసాపూర్ ,ఆధ్యాత్మ ప్రకాశం కార్యాలయం లో పని చేశాడు .తర్వాత బెంగుళూర్ శృంగేరి శంకర మఠం  లోఆధ్యాత్మ వేదాంత ప్రొఫెసర్ అయ్యాడు .కన్నడ సంస్కృతాలలో విశేష పాండిత్యం పొంది ఆ రెండుభాషల పత్రికాధిపత్య0వహించాడు . శృంగేరి స్వాములు పండితవర బిరుదు నిచ్చి సత్కరించారు .సంస్కృతం లో కృషికి రాష్ట్ర పతి ప్రశంసాపత్రం ,కన్నడ సేవకు రాష్ట్ర అవార్డు అందుకున్నాడు .సంస్కృతం లో కుంభాభిషేక చంపు ,శారదన్నవరాత్ర చంపు ,మూల విద్యా భాష్య  వార్తిక సమ్మతం ,శంకర దర్శనామ ప్రకాశం ,రాశాడు .సంస్కృత దశ శ్లోకి కి సంపాదకత్వం వహించాడు .కన్నడం లో సంబంధ వార్తిక ,ధర్మ శాస్త్ర రాశాడు .దశ శ్లోకిని ,వివేకచూడామణిని చంద్ర శేఖర భారతీతీర్థ వ్హయాఖ్యానం తో సహా కన్నడాను వాదం చేశాడు .శారదా నవ రాత్రి చంపు ను 1976 లో ముద్రించాడు అందులో శారదా అభిషేక ఉత్సవం ,నవరాత్రి ఉత్సవాలను వర్ణించాడు .ఆధునిక సంస్కృత కవులలో చంపు కు మళ్ళీ వైభవం తెచ్చినవాడు కృష్ణ జాయిస్

385-గాంధీ పై మోహనాయన కావ్యం రాసిన -బొమ్మలాపుర వెంకట రామ భట్ట (1915

బొమ్మలాపుర వెంకట రామభట్ట కర్ణాటక లోని బొమ్మలాపురం లో 1-1-1915 న జన్మించాడు .సరోబాలో సంస్కృత టీచర్ .సంస్కృత కన్నడ హిందీలలో కవిత్వం చెప్పాడు రాశాడు .సంస్కృతం లో మహాత్మాగాంధీ జీవితంపై ‘’మోహన యాన0 ‘’కావ్య0 ,శంకర చరితం ,భామినీ మాధవ కావ్యం ,సతీ మహా స్వేత ,విశ్వ రూప దర్శనం ,సత్యవిషయం నాటకాలు ,అంగద సంవాదం ,ఏకం నా ద్వితీయం ,నాధయ సంస్కృత భేరి ,భార్గవ శతకం ,యాజ్ఞ వల్క్య  బోధాయన ,భువనేశ్వరీ సుప్రభాతాలు ,శంకరాలోకం భావతరంగిణి సంస్కృత వచన రచనలు ,సత్యనీయ రీతి  అనే స్వీయ చరిత్ర ,మంత్రం వేదాంత శాస్త్రాలనాధారంగా వెయ్యిఆర్యా వృత్త  శ్లోకాల  ‘’ఆర్యా సహస్రి ‘’ రాశాడు .

 సంస్కృత కావ్యాలను కన్నడం లోకి కన్నడ రచనలు సంస్కృతం లోకి అనువదించి ప్రజ్ఞ ఆయనది .కన్నడ సంస్కృత నిఘంటు నిర్మాణము చేశాడు .కన్నడ భాషకే ప్రత్యేకమైన షట్పది ని సంస్కృతం లో ప్రవేశపెట్టిన ఘనత వెంకట రామ భట్టు ది .మోహనయానం లో భామినీ షట్పది ని నేర్పుగా ప్రయోగించాడు .

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 383-శ్రీ కృష్ణ కంఠాభరణ  మహాకావ్య నిర్మాత-గలగరి పండరీనాథాచార్య (1922-2015)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

383-శ్రీ కృష్ణ కంఠాభరణ  మహాకావ్య నిర్మాత-గలగరి పండరీనాథాచార్య  (1922-2015)

గలగరి పండరీనాథాచార్య 22-7-1922 న కర్ణాటకలోని గలగరి అనే కుగ్రామం లో జన్మించాడు . తండ్రి కూర్మా చార్యులు . చిన్నతనం లో చదువు ఒకటవ తరగతి తో ఆగిపోయింది .వెంటనే వేదాధ్యనం తండ్రివద్ద ప్రారంభించాడు . 1944  నుంచి 1960 వరకు బాగల్ కోట్ లోని శంకరప్ప సంస్కృత హై స్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయ్డుగా పని చేశాడు . 1961లో గడగ్ వెళ్లి వీరనారాయణ సంస్కృత పాఠశాల ప్రారంభించాడు  . 1971లో వేద  సాహిత్య  మాల సంస్థ స్థాపించి అష్టాదశ మహా పురాణాలను నలభయి  ఏళ్ళు కృషి చేసి కన్నడం లోకి అనువదించాడు .మధురవాణి ,వైజయంతి సంస్కృత పత్రికలకు ,శ్రీ సుధా ,పంచామృత కన్నడ పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు . ఆయన సంస్కృత వచన రచన శైలి బాణభట్టును పోలి ఉంటుంది .కవిత్వ శై లి కాళిదాసుకు సమానం గా ఉంటుంది .  సృజన సాహిత్యం లో  ఆయన అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు అన్ని ప్రక్రియలూ స్పృశించాడు .సంస్కృతం లో 22 సృజన రచనలు చేశాడు . అవి వేదాంత తుండ స్తవం ,రామరసాయన మహాకావ్యం ,శ్రీ కృష్ణ కంఠాభరణ మహాకావ్యం ,పవన పావన చంపు ,శ్రీ పాండురంగ  విఠల  చంపు ,శ్రీ రాఘవేంద్ర అశ్వ ధాటి ,తాత్యా తోపితా హ గాంధీ టోపీ పర్యంతం ,విప్లవ వీరుడు సుభాష చంద్ర బోసు పై ‘’క్రాంతి స్ఫు లింగ మొదలైనవి . కన్నడం లో రాసిన 21 రచనలలో -మహా భారత కోశ ,రాగ విరాగ ,భామతి ,కర్ణాటక కోశకారు ,కల్హణ రాజ తరంగిణి మొదలైనవి ఉన్నాయి .ఇవికాక ముందే చెప్పినట్లు 18 పురాణాలనకు కన్నడా నువాదం చేశాడు .

 పండరీనాధాచార్యులు తన ప్రతిభకు తగిన పురస్కారాలు ఎన్నో అందుకొన్నాడు .అందులో సాహిత్య అకాడెమి పురస్కారం ,రామకృష్ణ దాల్మియా ,రాష్ట్రపతి అవార్డు ,కన్నడ కాళిదాస బిరుదు ,రాజ్య ప్రశస్తి ,మహామహోపాధ్యాయ ,విద్వత్కవి తిలక  ,సచ్చాస్త్ర ప్రవచన విచక్షణ ,సంస్కృతివాహక ,విద్యా రాజా మొదలైనవి ఎన్నో బిరుదులూ ,పురస్కారాలు అందుకొన్న మహా   సంస్కృత విద్వా0సుడు గలగరి పండరినాధ ఆచార్య .. సాహిత్య వ్యాసంగం తో పండిపోయిన పండరినాథాచార్య 93 వ ఏటపండిన వయసులో 29-8-2015 లో పండరినాధుని చేరుకొన్నాడు ..

  సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 382-సంస్కృత అంతర్జాలం ప్రవేశపెట్టిన -వి.ఆర్.పంచముఖి (1936

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

382-సంస్కృత అంతర్జాలం ప్రవేశపెట్టిన -వి.ఆర్.పంచముఖి (1936

వాడిరాజాచార్య రాఘవాచార్య పంచముఖి లేక వాచస్పతి పంచముఖి 17-9-1936 న కర్ణాటకలోని ధార్వార్ లో జన్మించాడు . తండ్రి వైద్య రత్న ఆర్ ఎస్ .పంచముఖి .తల్లి కమలాబాయి .తండ్రి ప్రసిద్ధ ఎపిగ్రఫిస్ట్ ,ఆర్కియాలజిస్ట్ ఇండాలజిస్ట్ చారిత్రాత్మక పరిశోధనలో జీవితమంతా గడిపినవాడు .దాస సాహిత్య పరిశోధనలో పండిపోయినవాడు .తండ్రివద్దనే వాడిరాజు సంస్కృతం తత్వ శాస్త్రం అభ్యసించాడు . 1956 లో కర్ణాటక యుని వర్సిటీ నుండి సంస్కృతం గణితం లలో 82. 5 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ రాంక్ సాధించాడు .రెండేళ్ళతర్వాత  బాంబే యుని వర్సిటీనుండి ఎకనామిక్స్ లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రాంక్ తోపాటు గోల్డ్ మెడల్ పొందాడు . 1963లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో  ‘’అప్లికేషన్ ఆఫ్ గేమ్ ధీరీ ఆఫ్ ఎకనామిక్స్ పాలిసీ పై దిసీస్ రాసి పిహెచ్.డి .అందుకొన్నాడు .

 ఆర్ధిక రంగం  లో పంచముఖి సేవలు నిరుపమానమైనవి .నోబెల్ లారయట్ జాన్ టిన్ బెర్జిన్ తో ను జెనీవాలో టా0జానియా  మాజీ ప్రెసిడెంట్ జూలియస్ నైరేరీ తోను కలిసి పనిచేశాడు .అలీన దేశాల అభివృద్ధి చెందుతున్న దేశాలకు రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టం తయారు చేసిన ఘనత సాధించాడు .ఇండియా ప్లాంయింగ్ కమిటీ సెక్రెటరీగా 1977లో పనిచేశాడు .దీనివలన ఆర్ధిక సరళీకరణ విధానం ధ్రువ పడటానికి సహకరించాడు .

ఆర్థికరంగం లో దూసుకు పోతున్నా సంప్రదాయంగా వచ్చిన సంస్కృతం లోనూ అద్వితీయ ప్రతిభ ప్రదర్శించి అనేక పుస్తకాలు కవితలు సంస్కృతం లో రచించాడు పంచముఖి .తిరుపతి సంస్కృత విద్యాపీఠానికి 1998 నుండి 2008 వరకు రెండుసార్లు ఛాన్సలర్ అయ్యాడు .శ్రీ వెంకటేశ్వర వేదం విశ్వ విద్యాలయ  రాజ్యాంగ  నిర్మాణం లో స్థాపనలో విశేష కృషి చేశాడు .సంస్కృత -సైన్స్ ఎక్సిబిషన్ నిర్వహణలో ,సంస్కృత నెట్ ఏర్పాటులో ,ప్రాచీన సంస్కృత గ్రంధాల డిజిటలీకరణలో ఆయన సేవ అపారం .భగవద్గీత పైనా మేనేజ్ మెంట్ పైనా విశేష కృషి చేశాడు .సంస్కృతాన్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో బోధించే ఆలోచన చేసి అమలులోకి తెచ్చాడు .

  పంచముఖి సంస్కృతం లో  -1-భారతీయ ఆర్ధిక సర్వేక్షణ 2-కావ్య కుసుమాకర 3-బ్రహ్మ సూత్ర దీపికా 4-విచార వైభవం 5-భారతీయ అర్ధ శాస్త్ర మొదలైనవి 12రాశాడు .

ఎకనామిక్స్ లో -ట్రేడ్  పాలిసీస్ ఆఫ్ ఇండియా ,ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ ,టీచింగ్ ఎకనామిక్స్ ఇన్ ఇండియా ,ఫిస్కల్ మేనేజ్ మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ టు వార్డ్స్ యాన్ ఏషియన్ ఎకనామిక్ ఎరా మొదలైన 15 గ్రంధాలురాశాడు .ఆయన ప్రతిభకు తగిన పదవులు వరించాయి -ఇండియన్ కౌన్సిలాఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ చైర్మన్ గా ,ఇండియన్ ఎకనామిక్స్ జర్నల్ మేనేజర్ గా ,8 వ వరల్డ్ ఎకనామిక్స్ కాంగ్రెస్ కన్వీనర్ గా ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కు ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా  అఖిలభారత మధ్వ సమ్మేళనం ప్రెసిడెంట్ గా ఇవికాక మరో 30సంస్థలలో సభ్యుడుగా సలహాదారుగా గౌరవాధ్యక్షుడుగా  ఉన్నాడు .

 2003 లో భారత రాష్ట్ర పతి నుంచి సంస్కృతం లో ప్రతిభా పురస్కారం ,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ -ఢిల్లీ నుంచి విశిష్ట సంస్కృత సేవా వ్రతి ,ఢిల్లీ లాల్ బహదూర్ యుని వర్సిటీనుండి వాచస్పతి పురస్కారం ,విశ్వేశ్వ రయ్య ప్రశస్తిపురస్కారం ,కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం ,గురుసార్వ భౌమ రాఘవేంద్ర అనుగ్రహపురస్కారం ,విశాఖ లోని గీతం యుని వర్సిటీ పురస్కారం వంటివి ఎన్నో  బహుముఖ సేవకు పంచముఖిని  వరించాయి .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-17- కాంప్-షార్లెట్-అమెరికా

— V R Panchamukhi.jpg

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -11(చివరిభాగం )

అలంకారిక ఆనంద నందనం -11(చివరిభాగం )

భోజ రాజు -నా గ్రంథ ప్రారంభం లోని పది పద్యాలలో నా సిద్ధాంత సారాంశాన్ని వివరించాను . తర్వాత అధ్యాయం లో అర్ధనారీశ్వర వర్ణన చేసి నా శృంగారవాదానికి ఎంత సందర్భోచితమో చెప్పాను . పార్వతీ పరమేశ్వరులకలయిక స్త్రీ పురుషత్వాల సమైక్య స్వరూపం .దాని ఫలితంగా కలిగే హాస్య పూరిత అనుభవాలు సాంకేతికంగా వర్ణించా .అందులోని ప్రతిపదం సంభోగ ,విప్రలంభ శృంగారాల వివిధ రూపాలను ధ్వనింప జేస్తుందన్నాను ..ప్రాచీనులు 10 రసాలు చెప్పినా నేను శృంగారమే రసం అన్నాను .అదే ఆనంద స్వరూపం .భరతముని చెప్పిన 49 భావాలు సమానమైనవే .అందులో ఏదైనా ఉచ్ఛ  స్థితికి చేరి ఆనందంగా మారచ్చు . ఆనందాన్ని  కేవలం రసం అనకుండా శృంగారరసం అన్నాను .దీన్ని ‘’యేన శృంగారం రియతే స శృంగారహః ‘’అని నిర్వచించా .అంటే శిఖరాన్ని చేరటం అన్నమాట ..అంటే ఆన0దా ధిరోహణం చేయటమే .శృంగారం నుంచే 49 రసాలు జన్మించాయి ..దానికి అవి సహాయకాలు .ప్రేమ అంటే అనురాగానికి పర్యాయ పదం కాదు .సౌందర్య తత్వ సాధనమైన ఆనందమే ప్రేమ .అందుకే ఆనంద రసం అన్నాను ..అభిమానం వీటిని కలిపి ఉంచే లక్షణం .అభిమానమే రసాను భూతికి మూలం . రసాను భూతి అనే సోపానానికి ఉన్న మూడు మెట్లలో అది అట్టడుగు మెట్టు ..దీనినే అహంకారం అన్నాను .నా పేర్లలో సాంఖ్య సిద్ధాంత చాయలున్నాయి ..ఈ అభిమాన శబ్దానికే అహంకార ,శృంగార ,రస శబ్దాలు పర్యాయ పదాలు .అహంకారం అంటే స్పందించాగలిగే సహృదయుని భావోద్వేగ స్థితి నుంచి బహిర్గతమయ్యే అహంకారమే అభిమానం .అహంకారం అంటే లౌకికార్ధం లో ఉన్న గర్వం కాదు.  నేను అనే భావం అన్నమాట ..రసాను భూతిగా మారే ప్రతి దశలో అహంకార ఛాయకనిపిస్తుంది ..అలంకార శాస్త్ర ప్రయోజనాలకోసం సాంఖ్యుల భావాల్ని పునర్నిర్మించి ,తత్వ వేత్తల  అహంకారాన్ని ,అలంకార శాస్త్రజ్ఞుల భావయిత్రీ ప్రతిభను సమ్మిళితం చేసి కొత్త రూపాన్నిచ్చాను . మిత్రులారా తర్వాత మీ వంతు .

మహిమా భట్టు -రసము అంటే స్థాయి యొక్క ప్రతిబింబమే .కళాత్మకంగా ఉన్న కారణం నుంచి అనుమాన ప్రమాణం చేత సాధింపబడుతుంది .రసికుడిలో విభావాదుల జ్ఞానం వలన స్థాయీ భావం ఉద్దీన మవుతుంది . దాని నుంచి వచ్చిన అనుమాన స్ఫురణ యే రసాను భూతి . రసికుడు రసాన్ని భావ రూపంగా మాత్రమే అనుభవిస్తాడుకాని యదార్ధంగా కాదు .వ్యంజకా వ్యంజనాలను గ్రహించినప్పుడే కాక ,విభావాదుల నుంచి వచ్చే స్థాయీ భావాన్ని అనుభవించటం లో కూడా కాలక్రమం ఉంటుంది .దీనికి కారణం -వీటిమధ్య కారణం ,కార్య సంబంధం ఉంటుందికనుక . నా గ్రంథం రెండవ అధ్యాయం అంతా అనౌచిత్యాన్నే చర్చించాను .అనౌచిత్యం -అంతరంగ ,బహిరంగ అని రెండురకాలు .మొదటిది రసాన్ని అభివ్యక్తి చేయటంలో రెండవది శబ్దార్ధాల ప్రయోగాలతో కనిపిస్తుంది . ఈ రెండిటినీ మళ్ళీ 5 రకాలుగా విభజించా .ఇవన్నీ రసావిష్కారానికి అవరోధాలు .ధ్వనికారుని ‘’కావ్యమస్యాత్మా ధ్వని రీతి ‘’అని మొదలు పెట్టిన మొదటి కారిక లోనే ఈ దోషాలను చాలా ఉదాహరించి చూపించా ..ఆనంద వర్ధన శ్లోకాలే వాడి దోషాలకు ఉదాహరణలుగా చెప్పాను .ఈ దోషాలు పరిహరించి ఎలా రాస్తే బాగుంటుందో సూచించాను .భారతీయ సాహిత్య విమర్శనా చరిత్రలో నేను చేసి చూపింది అపూర్వం అసదృశం ..దీనికొక ఉదాహరణ ఇచ్చా ‘’వైద్యుడు ఇతరులను అయోగ్యమైన ఆహారం తినకుండా నివారిస్తాడు-తానూ దానికి అలవాటు పడిఉన్నా  సరే ‘’అని చెప్పాను .ఇక చెప్పాల్సింది లేదు .సెలవ్ .

విశ్వనాథుడు -నేను చెప్పాల్సింది అంతా  చెప్పేశాను ..పండితరాయలు ప్రసంగిస్తారు .సెలవ్

జగన్నాథుడు -రస ప్రాధాన్యాన్ని నేను అంగీకరిస్తా.కానీ రసం ప్రముఖంగా లేదనో ,రసధ్వని కనపడలేదనో కావ్యాన్ని కావ్యం కాదు అనకూడదు .అలంకార చమత్కారమున్నా ,చమత్కారాన్ని సూటిగా లేక వాచ్యార్థం గా చెప్పినా కావ్యం ఆనందాన్నిస్తుంది . చమత్కార గుణానికి జేజే లుపలికాను .రస ,అలంకార వస్తువులనుంచి ఇది నిష్పన్నమవుతుంది.  ధ్వని ,లేక వాచ్యం ద్వారా అభి వ్యక్తమవుతోంది .ఈ రకంగా కావ్య భావానికి కొత్త సమగ్ర స్వరూప నిర్ణయం చేశాను ..నా వాదనాపటిమ ఘనిస్టం .సహజ ఉన్నత కవిత్వం అని నా కవిత్వాన్ని కీర్తించారు ..తేడా వస్తే చమడా ఒలుస్తా ..నాది ఆత్మ విశ్వాసం .అద్వైతినైనా నాకు శివ కేశవ భేదం లేదు .లోకాన్ని నిశితంగా పరిశీలించి రాశాను .భోగ లాలసత కు ,శృంగార క్రీడలకు నిలయమైన మొఘల్ సామ్రాజ్య రాజధానిలో ఉండటం వలన శృంగారం నా అంగాంగానా అలముకొన్నట్లు కనిపిస్తుందికదూ ..ఇంతకంటే నాకూ చెప్పటానికేమీ మిగలలేదు సెలవ్ .

భోజరాజు -సాహిత్య రసానుభూతి మూడు మెట్ల సోపానం అని ఇందాకే చెప్పాను .అడుగుమెట్టును పూర్వ కోటి అని ,అభిమానం అనే మధ్యమెట్టు మాధ్యమావస్థ  భావన.ఇది మనో వృత్తులన్నీ అణగిపోయిన తర్వాత సాగే చింతన యొక్క ఉన్నత దశ .ఈ దశలో వివిధ మనోద్వేగాల  బహుళత్వం అను భూతమవుతుంది .ఇవే భరతముని చెప్పిన అష్ట రసాలు .నిజానికి ఇవి 49 .. భావనా పరిధిని అధిగమించి న శుద్ధానందం ఇది .ఈ  చరమ స్థితినే శృంగారం లేక ప్రేమ అన్నాను .ఇదే ఉత్తర కోటి . ఆనంద వర్ధనుని ధ్వనిని అంగీకరిస్తూ మీమాంసకుల ‘’తాత్పర్యం ‘’తో దానికి సామరస్యం కలిపించాను ..అంటే ధ్వనికి తాత్పర్యం అనే కొత్త పేరు పెట్టానన్నమాట .వర్ధనుడి అనువాద ధ్వనికి ప్రతివాదంగా ‘’శబ్ద ధ్వని ‘’అనే కొత్త రూపాన్ని ప్రవేశపెట్టాను ..అలంకార పరామర్శలో కొత్తదనాన్ని తెచ్చాను .గుణాలు ,రసాలు భావాలు అన్నీ అందులోకి వస్తాయని దాని విస్తృతి పెంచాను . సూక్ష్మ అర్ధ పరిమాణాలు గుర్తించా ..అలంకార సమ్మేళనంలో 6 ప్రమాణాల భావన సమర్ధించా ..అలంకారాలలోచమత్కారం పరాకాష్టకు చేరేది వాటిని నేర్పుగా కలిపినప్పుడే . ఇదే నాకున్న అలంకార శాస్త్రం పై శ్రద్ధ అన్నారు  . మీ కృష్ణా జిల్లా పెనమకూరు కవి అనంతామాత్యుడు ‘’భోజ రాజీయం ‘’రాసి నన్ను చరితార్థుడిని చేశాడు ..అందులో ఆవు -పులి కథ చిరస్మరణీయంగా రాశాడు .ఆ కథ  నాకు చాలా ఇష్టం . సత్య నిష్ఠకు అది గొప్ప ప్రతీక ఆయనకు అభినందన చందనాలు  .అభిమానంతో నన్ను ఆహ్వానించి నిర్వహణ బాధ్యతనూ అప్పగించినందుకు సరసభారతి కి కృతజ్ఞతలు .నేను నా రాజ్యం లోనే ఉన్నట్లు అనిపించింది .నా సాహిత్య సభనే నడిపిన అనుభూతికలిగింది .శ్రోతృ మహాశయులు ఓపికకు ధన్యవాదాలు .

 సాహితీ బంధువులారా !అలంకారిక ఆనంద నందనం చివరిభాగ0లో మన కోరికమన్నించి విచ్చేసి తమ సిద్ధాంత సారా మృతధారలతో తనియింపజేసిన అలంకారిక పరమేశ్వరులకు కృతజ్ఞతాభి వందనాలు . మీకూ శతకోటి అభినందనలు .ఒక్క సారి పునశ్చరణ చేసుకొందాం .

భోజమహారాజుగారి నిశిత పరిశీలనకు జోహార్లు .. వారిని ధారానగర ప్రభువు అంటారు ..భోపాల్ లో వారు నిర్మించిన ‘’భోజేశ్వర దేవాలయం ‘’సుప్రసిద్ధమైనది .భోజేశ్వర పట్టణం గొప్ప విద్యా కేంద్రం ..అతి పురాతన తాళపత్ర గ్రంధాలను సేకరించి భాప్రాపరచారు భోజరాజు .ఈ నాటి థార్ నగరం లో వారు నిర్మించిన సరస్వతీ దేవాలయం ఉంది .సరస్వతీ పుత్రలేకాక సమరాంగ ణ సార్వభౌములైన వారు .మన కృష్ణ దేవరాయలు గుర్తుకు వస్తారు . పతంజలి యోగ సూత్రాలకు భాష్యం రాశారు .సివిల్ ఇంజనీరింగ్ పై ‘’సమరాంగణ సూత్ర దారి ‘’రాసి దేవాలయ ,కోటల ,విగ్రహ, గృహ నిర్మాణ వివరాలు తెలిపారు .తంత్ర శాస్త్రంగా ‘’తత్వ ప్రకాశం ‘’,లోహ శాస్త్రంగా ‘’రస రాజమృగాంకమ్ ,నౌకా నిర్మాణ శాస్త్రంగా ‘’యుక్తి కల్పతరు ‘’న్యాయ శాస్త్రం పై ‘’ధర్మ శాస్త్ర వృత్తి ‘’రామాయణంపై రామాయణ చంపు రాశారు దీనికే ‘’భోజ చంపు’’ అనే సార్ధకనామమేర్పడింది .మొత్తం 84 గ్రంధాలు రాసిన బహుశాస్త్ర కోవిదులు .కాళిదాసాది కవులకు నిలయం భోజరాజాస్థానం .ఆంద్ర దేశం లో పూర్వం గురుకుల విద్య భోజ రాజ  చంపు తోనే ప్రారంభమయ్యేది ..అంతటి ప్రశస్తి పొందిన చంపు అది .. రాజుకనుక ప్రతి విషయాన్నీ చెప్పాలనే చాపల్యం ఉందనిపిస్తుంది . సర్వజ్ఞుడికి అందర్నీ తనలాగే చేయాలనే కోర్కె ఉంటుంది . అందుకే ఈతపన . కృతజ్ఞతలు భోజరాజేంద్రా .

  మహిమాబట్టు లవారు అనుమాన సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం కంటే మరింత సమ గ్రమైనది .రసాధిక్యతను నొక్కి చెప్పింది .గుణీ భూత వ్యంగ్యాన్ని  వివరించింది .కవితా సృష్టికి రసమే  ఆనంద  కారణం కనుక మరే  ఇతర పదార్ధానికీ కూడా దాన్ని లోబరచకూడదని స్పష్టంగా చెప్పారు ..అనుమాన సిద్ధాంతం లో గుణీ భూత వ్యంగ్యానికి అగ్రాసనమిచ్చారు .దీనిలో వక్రోక్తి తాత్పర్యాలను కూడా భాగం చేశారు.  మౌలిక ఆలోచనకలిగిన ధైర్య శాలి .అలంకార చరిత్రలో పాండిత్య స్ఫోరకమైన వాగ్వాదాలకు ,విస్తృతమైన విద్వత్తుకు ,విస్పష్ట విశదీకరణకు ,లోతైన గ్రహణ శక్తికి మహిమా భట్టు లవారికి సాటి వేరెవరూలేరు అన్న శ్రీ ఆర్ .పి .ద్వివేదీ పలుకులు అక్షర సత్యాలు ..వారు అవతరించిన అసమాన ‘’అనుమాన మహిమాభట్టు ‘’.

 విశ్వనాథకవిరాజుల  వారి సాహిత్య దర్పణం గురించి వారికుమారుడు అనంతదాసు ‘’శ్రవ్యా భి  నే యాలంకార తత్త్వం సత్కవి సమ్మతం -యదిహాస్తి యదన్యత్ర యాన్నే హస్తి తత్క్వచిత్ ‘’అని గొప్పగా చెప్పాడు -అలంకారాల ముఖ్య ధర్మాలన్నీ ఇందులో ఉన్నాయి .ఇందులో ఉన్నది ఇతర గ్రంథాలలో ఉండవచ్చు .కానీ ఇందులో లేనిది మాత్రం ఇంకెక్కడా ఉండదు ‘’అదీ అలంకార విశ్వ నాధీయ0 .  ‘’విశ్వ నాదీయం ‘’కూడా ..విశ్వనాధులవారు సాహిత్య దర్పణాన్ని సంక్షిప్తంగా ,అర్ధ స్పష్టత తో ,సర్వ దోషరహితంగా రచించారు దీనికి  ఆయన కుమారుడుఅనంతదాసు చెప్పిన శ్లోకమే సాక్షి -’’స్వల్పాక్షరాహ్ సుబోధార్దాహ్ ప్రధ్వస్త శేష దూషణాః –సాహిత్య దర్పణో నామ గ్రంథ స్తేన వినిర్మితాహ్ ‘’. ధ్వని సిద్ధాంత ప్రవర్తకులలో పరిపక్వమైన చింతనగల వారిలో విశ్వనాథ కవిరాజ స్థానం అత్యున్నతమైనది –

‘’ధ్వన్యాధ్వని  ప్రౌఢాధియం పురోగాహ్ శ్రీ విశ్వనాధాహ్ కవి చక్రవర్తీ ‘’..ఈ సభ మీ రాకతో ధన్యమైందికవి చక్రవర్తీ ,

మనవాడైన జగన్నాథ పండితరాయల వారి కవిత్వం కోన సీమ కొబ్బరికున్న తీపిదనం లేతతనంతో కోనసీమ అందాలవంటి శబ్దార్ధాల సుందర మేళవింపుతో  ఆ సీమ ప్రత్యేకమైన పక్వమైనపనసపండు తొనలవంటి మాధుర్యవంతమైన  ప్రయాస లేని యమకాల ఇంపు సొంపులతో అలరిస్తుంది .. రామణీయార్ద ప్రతిపాదనమైన శబ్దమే కావ్యం అనగలిగిన చేవ ఉన్న అలంకారిక కవి .సౌందర్యం మూర్తీభవించిన వ్యక్తి .ఐహిక భోగాలకు పర లోక చింతనకు సమ విలువనిచ్చినవారు .అపార విద్వత్తుతో ప్రకాశించే ఆపర సాహత్య  జగన్నాధులే .మీరాక తో మేము పావనమయ్యాము పండితరాయా నమోవాకాలు . అలంకారిక చతుష్టయం అందరికీ మరోమారు వందనం .ఆల0కారకులైన  మీ రాకవలన ఈ ప్రత్యేక కార్యక్రమం నిజంగానే ఆనంద నందనమై కను విందు, వీనుల విందూ చేకూర్చింది .

దీనిని ప్రశ్నోత్తర రూపం లో నిర్వహించి అలంకార పరిణామాన్ని తెలియ జేస్తే బాగుంటుంది అనే సూచన వచ్చింది .అసలు అలంకార  శాస్త్రం  డ్రై  సబ్జెక్ట్ .మళ్ళీ దీనిలో ప్రశ్నలు , సమాధానాలు ,చర్చలూ ఉపచర్చలు పెడితే బుర్ర వేడెక్కి మైండ్ బ్లాకై పోతుందని భయపడి ఈ విధానాన్ని ఎంచుకున్నాను .సరదాగా వినేందుకు ,కావాలంటే ఆరుద్ర రాసిన ‘’సమగ్రాంధ్ర సాహిత్యం ‘’లాగా హాయిగా చదువుకొనేట్లు రీడబిలిటీ ఉండాలని అనుకొని ,ఆలంకారికుల గురించి  తెలియని విషయాలెన్నో తెలియ జేసే వీలు ఇది కలిగిస్తుందని భావించాను .  . ఇది ఒక భూమిక మాత్రమే . కావలసినవారు దీనిపై సౌధాలు నిర్మించుకో వచ్చు . నేను తీసుకున్నది 13 మంది ఆలంకారికులను మాత్రమే . ఇంకా ఎందరో లబ్ధ ప్రతిష్టులైన వారున్నారు . ఎందరో ఆలంకారికులు అందరికీ ఆనంద నందన వందనములు . ఈ కార్యక్రమాన్ని సమాదరించి జయప్రద0 చేసిన అందరికీ మరొక్క మారు కృతజ్ఞతాభి వందనాలు .

ఆధారం -ఈఆలం కారిక ఆనంద నందనం ధారా వాహికకు  ఆధారం 1–నేను రాసిన గీర్వాణ కవుల కవితా గీర్వాణం -1 మొదటిభాగం 2- పబ్లికేషన్స్ డివిజన్ వారి ‘’భారతీయ సంస్కృతీ వైతాళికులు -ఆలంకారికులు .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -10

అలంకారిక ఆనంద నందనం -10

భోజ రాజు -సర్వ జన సంక్షేమం నా ధ్యేయం .సమైక్య భారతావని న దృష్టి .కేదారేశ్వర ,రామేశ్వర ,సోమనాధ ,సుందర ,కాల అనలా ,రుద్రాదులకు దేవాలయాలు నిర్మించాను కాశ్మీర్ లో ఇప్పటి కోధర్ వద్ద పాప సూడాన్  తీర్ధానికి మట్టికట్టలు పోయించటానికి ధనసహాయం చేశాను . ఈ విషయం కల్హణుడు రాజతరంగిణిలో రాశాడు ..భోజపురం అంటే ఈ నాటి భోపాల్ లో బెట్వానది ఉపనదితోకలిసే సన్నని కనుమద్వారా ప్రవహించే చోట మైలున్నర పొడవున్న ఆనకట్ట వేసి విశాల సరోవరాన్ని నిర్మించాను .ఇది అద్భుత సాంకేతిక పరిజ్ఞానానికి  నా సాహస కృత్యానికి ప్రతీక అని అంటున్నారు ..కవి ,పండిత ,కళాకారులకు భూరి విరాళాలిచ్చి పోషించాను ..వారి కవితా శక్తికి అక్షర లక్షలిచ్చాను ..దేశం లోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కవి పండితులూ నా ఆస్థానం లో ఉండటం నా అదృష్టం .నా సంస్థానం సరస్వతీ నిలయమై వర్ధిల్లింది .తిలక మంజరికర్త జైనమతాచార్యుడు ధనపాలుడు ,శుక్ల యజుర్వేద భాష్యకర్త కాశ్మీర పండితుడు ఊవటుడు,చిత్తకవి ,ఇంకా ఎందరెందరో నా కొలువు కూటానికి ప్రకాశం తెచ్చారు . నేను వారిని పోషించానని గర్వంగా చెప్పను .వారి వలన నా భోజ సభ భాజమానమైంది అంటాను ..నేను శివ భక్తుడనే కానీ అన్నిమతాలు నాకు ఆదరణీయమైనవే . జైన గ్రంధాలను కాపాడాను .కర్ణాటకలోనిశ్రావణ బెళగొళ లో  ఉన్నజైన గురువు ప్రభ చంద్రునికి భూరి దక్షిణ సమర్పించాను . దీనికి సంబంధించిన శాసనం అక్కడ వేయించాను .నా రాజ్య పాలన 40 ఏళ్ళు సాగింది ..

 నేను 84 రచనలు చేశాను. 84 దేవాలయాలు నిర్మించాను ..సరస్వతీ కంఠా భరణం ,శృంగార ప్రకాశం అనే అలంకార శాస్త్ర గ్రంధాలు నాకు మంచి పేరు తెచ్చాయి … మిగతా వివరాలు తర్వాత తెలియ జేస్తాను ఇప్పుడు మిగిలిన వారు మాట్లాడుతారు .

మహిమా భట్టు -భట్ట గోపాలుడు నా అనుమాన సిద్ధాంతాన్ని ఆరాధించాడు -’’రసామృత నదీ మగ్నే ,ధ్వనికారే మహా గురౌ అనుమానాయాహి కావ్యం గోష్టిమ్ న ముంచతి ‘’-మా గురువైన ధ్వనికార్టరసామృతం లో మునిగిపోయినా ,అనుమానం మాత్రం సాహిత్య విమర్శకుల గోష్ఠి ని వదిలి వెళ్ళలేదు ..నాతర్వాత వారైనా రుయ్యక మమ్మట విద్యాధర ,విశ్వనాథ  జగన్నాథా దులు నా సిద్ధాంతాన్ని పరిశీలించారు .నేను కళ వాస్తవాన్ని అనుకరిస్తుంది అని నమ్మాను .విభావానికి స్థాయికి మధ్య సంబంధం ,కారణానికి కార్యానికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే .రస సాక్షాత్కారం అనుమానాయిక గ్రాహకత్వాన్ని దాటి పోదు .అన్న నాసిద్ధాంతానికి తగిన నిర్మాణం దృఢంగానే చేశాను .భావ ప్రకటనకు భాష సహేతుక సాధనం . భావాలు అర్ధవంతమైతేనే ఇతరుల మనస్సులను ఆకర్షించుకో గలవు ..మీమాంసకులలాగానే నేనుకూడా కర్మను చేయించే ప్రవ్రుత్తి ,కర్మకు విముఖం చేసే నివృత్తి సిద్ధాంతమే భాషా లక్షణాన్ని శాసిస్తుంది అని నమ్మాను . వాక్యం లో సాధ్యం అంటే అనుమానం చేత సిద్ధించేది ,సాధన అంటే తర్కం అనే అంశాలుంటాయి .కనుక దీని స్వభావం అనుమానం చేతనే గ్రాహ్యం .కనుక వాక్యం ద్వారా అందజేసేభావాలు సాధ్య ,సాధనాల సంబంధం తో ముడిపడి ఉండటం వలన అనుమేయ స్వభావం కలిగి ఉంటాయి .. కావ్యార్ధం మూడురకాలు  -వస్తువు ,అలంకారం, రసం .మొదటి రెండిటినీ ప్రత్యక్షంగా చూపించవచ్చు .కానీ మూడవదైన రసం అనుమానం వలననే సిద్ధిస్తుంది .అక్షరాలచేత ప్రభావితమయ్యే పదాల అర్ధం ద్వారానే రతి మొదలైన స్థాయీ భావాలను అనుమానించటం జరుగుతుంది .అక్షరాలూ సూచించే గమకం అంటే గుణం పరోక్షంగా నే గ్రాహ్యమవుతుంది అభిదా శక్తినే గుర్తించాను .లక్షణ ,తాత్పర్య ,అర్దాపత్తి ఉపమానం వక్రోక్తి అన్నీ అనుమానం కిందికే వస్తాయి .

విశ్వనాథుడు -నా సాహిత్య దర్పణం భారత దేశమంతా ప్రచారమైంది .కావ్య ప్రకాశం పధ్ధతి ననుసరించి రాశాను .ఇందులో కారకాలు ,వృత్తులు నేనే రాశాను .ఉదాహరణలు నా గ్రంథా లనుండి ఇతర గ్రంథాలనుంచి ఇచ్చాను .నా ప్రసిద్ధ సిద్ధాంతం ‘’వాక్యం రసాత్మకం కావ్యం ‘’..వ్యంజన ను ప్రత్యేక వృత్తిగా చెప్పాను .పురాణకావ్యాలను కథ ,చంపు ,బిరుదు ,కరండ గా విభజించి నిర్వచించాను ..నాకు మార్గ దర్శి ధనుంజయుడు ..నేను అలంకార దోషాన్ని అంగీకరించలేదు ..సాహిత్యాన్ని శ్రవ్యం (కావ్యాలు )అని దృశ్యం (నాటకాలు )అని వర్గీకరించాను . ఆనంద వర్ధన ,మమ్మట ,జగన్నాధా దులు శ్రవ్య కావ్యాలనే చర్చిస్తే భారత ,ధనుంజయులు దృశ్య సాహిత్యాన్ని మాత్రమే చర్చిస్తే నేను మాత్రమే మొట్ట మొదటి సారిగా శ్రవ్య దృశ్య సాహిత్యాన్ని చర్చించాను . నాటకకళ కూయక ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించాను .  నా వంటి వారి వలననే ధ్వని సిద్ధాంతం సుస్థిరమైంది .నేనే ధ్వనిసిద్ధాంత ప్రతిస్థాపకుడనని -’’ప్రస్థాపనా పరమాచార్య ‘’అని నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పుకొన్నాను .. జగన్నాథుడు -షాజహాన్ చక్రవర్తి మామ నూర్జహాన్ సోదరుడు అసఫ్ ఖాన్ ప్రశంసిస్తూ ‘’ఆసఫ  విలాసం ‘’కావ్యం రాశాను జగదాభరణ ,ప్రాణాభరణ కూడా నావే .నా విడి విడి పద్య సంకలనమే ‘’భామినీ విలాసం ‘’..రస గంగాధర విషయాలను సంక్షిప్తం చేసి ‘’చిత్ర మీమాంస ఖండన ‘’రాశాను ..నా గురుదేవులు శేష కృష్ణులను భట్టోజీ దీక్షితుడు విమర్శిస్తే ,దీక్షితుల ‘’ప్రౌఢ మనోరమ ‘’పైనా  అక్కసు అంతా కక్కుతూ ‘’మనోరమా కుచమర్దనం ‘’రాశాను ..నా అలంకార గ్రంధం రస గంగాధరం నన్ను మహా పండితునిగా ,విమర్శకునిగా పేరు ప్రతిష్టలు తెచ్చింది .ధ్వన్యాలోకం కావ్య ప్రకాశిక ల తో సమాన స్థాయి పొందింది .నా తర్క శాస్త్ర పాండిత్యానికి ,ఆలోచనాపటిమకు ,సుబోధక శైలికి  అలంకార శాస్త్ర ప్రతిభకు ఇది నిలువెత్తు దర్పణం . ఇందులో రెండు అధ్యాయాలున్నాయి అధ్యాయాలను ‘’ఆనానాలు ‘’అని వినూత్నంగా పేరు పెట్టాను .మధుర కవిత్వం లో నాకు సాటి ఎవరూ లేరని సవాలు విసిరాను ..శృంగార0 రాసేటప్పుడూ ఔచిత్యాన్ని దాటకుండా రాశా .ముక్తకాలలో కూడా రస పోషణ చేసి సెబాస్ అనిపించుకొన్నాను .నా రచనలన్నీ ప్రసాద గుణానికి ఉదాహరణలే .’’.రమణీయార్ధక ప్రతిపాదక  శబ్దహః కావ్యం ‘’అన్న కావ్య జగజ్జెట్టీని నేను .

 భోజరాజు -సరస్వతీ కంఠాభరణం నా మొదటి రచన .చిన్నదికూడా . .శృంగార ప్రకాశం రెండవది .రెండిట కొన్ని సమాన విషయాలున్నాయి .నేను చెప్పాల్సిందంతా దీనిలోనే చెప్పాను .శృంగార విషయాల నిగ్గు తేల్చే గ్రంధం .లలితా కళారహస్యాలను ,కావ్యరచనా మర్మాలు ఉన్నాయి .కంఠాభరణం అయిదు పరిచ్చేదాలు .అలంకార శాస్త్ర విషయాలన్నీ ఉన్నాయి .అలంకారాలను శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు  ఉభయాలంకారాలుగా విభజించాను . 6 గుణాలు 16 దోషాలు చెప్పాను .ఒక్కోదానిలో 24 అలంకారాలు చెప్పాను .చివరి అధ్యాయం ముఖ్యమైంది ఇందులో రసం పై చర్చ ఉంది .ఇందులోకారికల సమాఖ్య ఉదాహరణలో ఎక్కువే .

‘’శృంగార ఏవ ఏకో రసః ‘’శృంగారం ఒక్కటే రసం అన్నాను .అంటే శృంగారం సంపూర్ణమైన రసం అని సిద్ధాంతం చేశాను ఇది వినూత్న సిద్ధాంతమే .

శృంగార ప్రకాశం లో 36 ప్రకాశాలున్నాయి .అధ్యాయాలను ప్రకాశానాలు అన్నాను శబ్దార్ధ సంబంధాల అభి వ్యక్తియే సాహిత్యం అని నిర్వచించాను ఈ సంబంధం 12 రకాలు .. 9వ అధ్యాయం లో సాహిత్య విమర్శ చేశాను . 13 వ అధ్యాయం ‘’రతి ‘’ కి కేటాయించాము ..ధర్మార్ధ కామ మోక్షాలకు సంబంధించిన నాలుగు శృంగార రూపాలతో కొత్త సిద్ధాంతాన్ని విస్తృత ప్రాతిపదికపై నిర్మించాను . 15 అధ్యాయాలలో సంప్రదాయ శృంగార రస లక్షణాలు చర్చించాను ..  22 వ అధ్యాయం ‘’అనురాగం ‘’కు కేటాయించాను .దీనిలో 64 రకాలున్నాయని చెప్పాను అందులో ఒక్కొక్కొటి 8 విధాలు .వీటిలో ఒక్కొక్కదానిలో మళ్ళీ 8 రకాలు .ఇవి మళ్ళీ ఒక్కోటి 3 రకాలు .కనుక మొత్తం 64x8x 24=12228రకాలు .ఇన్నిటికి పేర్లు పెట్టటం ఆషామాషీ కాదు కానీ అన్నిటికీ పేర్లు పెట్టాను ..అన్నిటికీ ఉదాహరణలివ్వగలిగాను .

మహిమా భట్టు -భోజమహా రాజుల వారిది ఎంతటి సూక్షం పరిశీలనా అర్ధమయిందికదా ..ఒక వస్తువు ను చూడటం వలన అది అనుభవం లోకి  వచ్చి సంస్కార రూపంగా మనసులో దాగి ఉంటుంది .దీనికి సంబంధించిన మరో వస్తువును విన్నప్పుడో చూసినప్పుడో పూర్వ సంస్కారం వలన క్రొత్తదాన్ని గ్రహించగలం ఈ మూడు రకాల అభి వ్యక్తీకరణలో ఒక్కటికూడా ధ్వనికి వర్తించదు .అందుకే రసధ్వనికి నిర్వచనంగా అభి వ్యక్తిని చూపటం జరిగింది ..వాచ్యార్థ రచనలన్నీ కవిత్వం అవుతాయి .ధ్వనికావ్యం దాని వెలుపలే మిగిలిపోతుంది ధ్వనిని రెండవ రకమైన వ్యంజకంగా భావిస్తే అప్పుడు వ్యంజకానికి అనుమాన సంజ్ఞ లేకుండా పోతుంది .ధ్వని సిద్ధాంతాన్ని వదిలి అనుమాన సిద్ధాంతాన్ని అంగీకరించాల్సి వస్తుంది .

విశ్వనాథుడు -నేను ధ్వనిని అంగీకరించి ,దాని ఉనికిని నిరూపిస్తూ -’’కావ్యస్యాత్మా సాయి వార్ధాహ్  కావ్యస్యాత్మా ధ్వని రీతిహ్ ‘’రస ప్రాధాన్యతపై నేను -’’ఏకో రసో అంగీకర్తన్యాహ్ ‘’అని ధ్వని వస్తు, అలంకార రసధ్వనులన్నాను ..మొదటి రెండు కావ్యాత్మ కానేరవు .రసధ్వనిమాత్రమే కావ్యాత్మ .ఈ ఒక్కమాటతో నా సాహిత్య దర్పణం అలంకార శాస్త్ర వికాసం లో అసదృశ స్థానం పొందింది .ధ్వని సిద్ధాంత ప్రవర్తకులలో నన్ను అగ్రగణ్యుని చేసింది .రస సిద్ధాంతాన్ని సుదృఢం చేసిన వానిగా కీర్తి గడించాను .

 జగన్నాథుడు -నా అన్యోక్తులలో కూడా ధ్వని ఉంది .సాహిత్య సేవలో ప0డిపోయాను .ఎన్నో స్వతంత్ర భావాలు చెప్పాను .ప్రతిభకు సర్వోన్నత స్థానమిచ్చాను .కావ్యాలను నాలుగు రకాలుగా విభజించాము .కొత్త రస సిద్ధాంతం చెప్పటం ,రెండురకాల గుణాలు అంగీకరించటం ,శబ్ద మూల శక్తి ధ్వనిని తర్క సమ్మతంగా రుజువు చేయటం ,అభిద లక్షణ శక్తులపై చర్చ ,అనేక అల0కారాలకు రూపాన్ని ,పరిధిని నిర్ణయించటం లో నా మౌలిక ప్రతిభ వ్యక్తమైనదని అంటారు.  నిజమేనేమో లేక పొతే ఎందుకంటారు ?

 సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-17-కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment