వీక్లీ అమెరికా -7 -55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం

వీ క్లీ  అమెరికా -7

55 వ సుందరకాండ పారాయణ ,హనుమజ్జయంతి వారం
15-5-17 నుండి 21-5-17 వరకు
15 సోమ వారం మల్లినాధ సూరి వ్యాఖ్యానం పూర్తయింది ఆయన రచనలపై రాయటం ప్రారంభించి 44 వ ఎపిసోడ్ వరకు రాశాను సోమవారం మధ్యాహ్నం యు ట్యూబ్ లో మంగళంపల్లి బాలమురళీ  కృష్ణ  కాంభోజి రాగాలాపన అందులో తన రచన ”ఏమి పాలింప జాలము ?”విని పరవశించాను . రాత్రి  LOL లో రౌడీ -బ0డ  ,పెళ్లి ఎగగొట్టటానికి ఎత్తులు చూసాం సరదాగా ఉన్నాయి యెంత మంది దగ్గర ఎంతటి టేలెంట్ ఉన్నదో రుజువు చేసేవి ఇవి ..
  మంగళవారం మామూలుగా శ్రీ సువర్చలాన్జనేయస్వామి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి శ్రీ రామ లక్ష్మణా చార్యుల ”సువర్చలా వల్లభ శతకం ”పఠించాను . సాయంత్రం ఇన్నయ్యగారి ఫోన్ పలకరింపు . ఆయన భార్య కోమలగారు రాసిన ”మై లైఫ్”చదివాను  .ఆవిడ పామర్రు దగ్గర కొండి పర్రు ఆశ్రమం లో హిందీ చదివారు . ఆమె హైదరాబాద్ లో ఉండగా రేడియో స్టేషన్ ప్రోగ్రామ్ ఎక్సి క్యూటివ్ శ్రీ వేలూరి సహజానంద గారు ఆమెను కొందరు విదేశీ రచయితలను శ్రోతలకు పరిచయం చేయమని కోరగా కాఫ్కా  ఆల్బర్ట్ కాము మొదలైన వారిని చక్కగా పరిచయం చేసినట్లు రాశారు .శ్రీ సహజా నంద మా రెండవ బావ గారు వేలూరి వివేకానంద గారి పెదనాన్న గారి అబ్బాయే . తేలప్రోలు  దగ్గర చిరివాడ అగ్రహారం వాసి .సహజ శ్శ్రీ అరవింద భక్తులు .అరవింద దర్శనం పై పుస్తకాలు రాశాడు వీరి తమ్ముడు సదానంద .ఈ అన్నదమ్ముల్ని మా బావ గారి కుటుంబం సహజ ,సదా అని పిలిచేవారు ఇద్దర్నీ  చూశాను .ఇన్నయ్యగారి పెద్దబ్బాయి శ్రీ రాజు నరిశెట్టి మా పెద్దబ్బాయి శాస్త్రికి గుజరాత్ లోని” ఇర్మ ” లో క్లాస్ మేట్ అని మా మనవడు సంకల్ప్ గుర్తించి చెప్పాడు .
17 బుధవారం నుండి 5 రోజుల న 55 వ సుందరకాండ పారాయణ మొదలు పెట్టాను .నిత్యపూజ ఆంజనేయ అష్టోత్తర ,శతనామ పూజ తర్వాత పారాయణ ప్రారంభించాను .మొదటి రోజు సంక్షిప్త రామాయణం ,తర్వాత శ్రీరామ జననం ,సీతారామ కళ్యాణం ,సీతా రామ సుఖ జీవనం సర్గలు చదివి సుందరకాండ ప్రారంభించి 15 సర్గలు పూర్తి చేశి  మంకు శ్రీనుగారి ”శ్రీ సువర్చలేశ్వర శతకం ”చదివి పూర్తి చేశాను అయిదు రోజులూ పానకం వడపప్పు చలిమిడి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం .7 గంటలకు ప్రారంభిస్తే పూర్తి అయేసరికి 10-30 అయింది తర్వాతే టిఫిన్ .ఉదయం 11 -30 కి డా.  యల్లాప్రగడ రామ మోహనరావు గారు ఫోన్ చేశారు .ఏం చేస్తున్నారని అడిగితె పారాయణ సంగతి చెప్పా .ఆయన నిత్యం సంధ్యావందనం పూజ చేస్తారట .నేను చెప్పాక పారాయణ కూడా చేద్దామని అనుకొన్నారటగాని 83 ఏళ్ళ వారు  అంతటి శ్రమ వద్దమని కుటుంబ సభ్యులు వారించారట అందుకని చేయటం లేదని తర్వాత గోపాల కృష్ణ గారు మెయిల్ రాశారు .మైనేనిగారు పంపిన ”Harry G.Frankfurt  రచన ”డి రీజన్స్ ఆఫ్ లవ్ ”అందింది చదివాను పెద్దగా చెప్పిందేమీ లేదని పించింది ..రాత్రి ఫన్ బకెట్ లో ”వుయ్ వాంట్  జస్టిస్ ”అని బాహుబలి -3 తీయాలంటూ నిరాహార దీక్ష చేసిన  సరదా ఎపిసోడ్ చూసి పగలబడి నవ్వుకున్నాం ..
గురువారం -రెండవ రోజు పారాయణ లో 27 వ  సర్గ  వరకు చేసి ముదిగొండ సీతారావమ్మగారి ”శ్రీ సువర్చలా వల్లభ మారుతి శతకం పఠించా .దాదాపు మొత్తం 3 గంటలు పట్టింది   ”నా దారి తీరు ”లో కృష్ణా జిల్లాలోని ”గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ”గురించి రెండు ఎపిసోడ్ లు రాశాను ..రాత్రి నర్మదా నదీ తీర”కరి వీర పీఠం”శంకరాచార్య శ్రీ స్వామి రామా గురించి ”పీఠాధిపత్యం బందిఖానా గా భావించి పారిపోయిన పీఠాధిపతి ”అని రాశా .  పారిపోయిన రామా గురువు బెంగాలీ బాబా ను దర్శించి విషయం  చెప్పగా  ”సాధకుడికి ఈ అనుభవమూ కావాలనే నేను నిన్ను నర్మదా తీరానికి 6 నెలల తపస్సుకోస0  పంపాను .దనం వ్యామోహం పదవీ ఎంత బాధకు గురి చేస్తాయో నీకు అనుభవం రావాలనే పంపాను ”అంటాడు
శుక్రవారం -ఉదయం 7-30 కే  పూజ ప్రారంభించి 10-15 కు మూడవరోజు పారాయణ 38 వ సర్గ వరకు చేసి సీతారావమ్మగారి ” ‘శ్రీ సువర్చలా వల్లభ మారుతి శతకం పఠించా..దీనిని మా అమ్మాయి వీడియో తీసి పేస్  బుక్ లో పెట్టిందిట నాకు తెలీదు మామూలు గా చేసే పానకం వడపప్పు చలిబిడి తోపాటు రవ్వకేసరి ప్రసాదం నైవేద్యం 10-15 కు పూర్తిఅయింది . . మధ్యాహ్నం మైనేనిగారి ఫోన్ .తర్వాత నేనూ చేసి మాట్లాడాను
 రాత్రి శ్రీ బులుసు సాంబమూర్తి పద్మ దంపతుల ఇంట్లో డిన్నర్ .వాళ్ళ అమ్మాయి ప్లస్ -2 కు సెలెక్ట్ అయి ర్యాలీ లో సీట్ వచ్చిన సందర్భంగా ఈ ఏర్పాటు .ఇలా సెలెక్ట్ అయినవారి చదువు హాస్టల్ ఖర్చు అంతా  ప్రభుత్వమే భరిస్తుంది స్టేట్ లో 300 మందికే ఆ ఛాన్స్ దాన్ని పొందటానికి అందరూ తీవ్రంగా  కష్ట  పెడతారట  ఒరిస్సా లోని  తెలుగు వారు .ఇక్కడే బరం పురం తెలుగు వారైన రాయప్రోలు వారూ కలిశారు .మేమూ ,పవన్ ,రాంకీ  కుటుంబం గెస్ట్ ల0 అదనంగా . పప్పు ఆలూ కూర ,తమాషా పాయసం ,పునుగులు ,పులిహోర ,సాంబారు ,పెరుగు పండ్ల ముక్కలతో పాటు వాళ్ళ స్పెషల్ ”అప్పడాలపిండి ఉండలు ”వేశారు ఒరిస్సా ప్రాంత తెలుగువారిళ్ళల్లో విందులూ వినోదాలలో అప్పడాల పిండి ఉండలు వడ్డించకపోతే మహా తప్పుట చెప్పారు వాళ్ళు .అలాగే తద్దినాలలో మనం ఆవ పచ్చడి ,నువ్వుల పొడి తప్పక చేస్తాం .కానీ వాళ్ళు ఉసిరి గింజల పచ్చడి పెరుగుతో కలిపి ,ఉసిరి గింజల పొడి చెయ్యటం తప్పదట . మనకు కొత్తగా ఉంది కానీ ఏ ప్రాంతం వారి అలవాటు వారిది .మనకు ఎవరైనా చనిపోతే దినవారాలలో 12 వ రోజు శుద్ధి నాడు ఉసిరి పొడి నెత్తిమీద రాసుకొని స్నానం స్నానం చేసి శుద్ధి అవటం ఉంది ‘
 శనివారం నిత్యపూజ ఆంజనేయ స్తోత్త్ర శతనామ పూజ తర్వాత నాల్గవ రోజు పారాయణ ఉదయం 7-30 కు ప్రారంభించి 54 వ సర్గ వరకు పారాయణ చేసి మామిడిపండ్లు ఆరంజ్ పీచు అరటిపళ్ళ తో పూజ  చేసి  మంకు శ్రీను గారి ”శ్రీ సువర్చలేశ్వర శతకం ”పఠించా .అదనపు ప్రసాదం ”చిట్టిగారెలు ”11 గంటల వరకు సాగింది  సంకల్ప్ ను మా అమ్మాయి యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చింది .

మా మనవడు శ్రీకేత్ 9 లో ఉన్నాడు .కనుక ఏం సెట్ లాంటి దాని కోచింగ్ కు షార్లెట్ యూనివర్సిటీ దగ్గర ”రమణ ”అనే లెక్చరర్ దగ్గర లెక్కల కోచింగ్ కు శని ఆదివారాలలో ఉదయం 7 గంటలకు వెళ్లి 12 దాకా ఉండి వస్తాడు మా అల్లుడో  అమ్మాయో  తీసుకుని వెళ్లి మళ్ళీ తీసుకు వస్తారు  .మా వాళ్ళ ఇంటినుంచి 45 మైళ్ళు అంటే సుమారు 70 కిలోమీటర్లు . మైనేని గారుపంపిన ”క్లియరెన్స్ డారో ”రచన ”ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ”బృహద్గ్రంథం అందింది మొదలు పెట్టాను .సాయంత్రం మా అమ్మాయి మనవాళ్లతో లైబ్రరీకి వెళ్లి 7 పుస్తకాలు తెచ్చుకున్నాను చదవాలి .

21-5-17 ఆదివారం వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి -ఉదయం 6-45 కే నిత్యపూజా ,ఆంజనేయ అష్టోత్తర సహస్ర నామ పూజ చేసి 5 వ రోజు అంటే చివరి రోజు పారాయణ ప్రారంభించి 68 వ సర్గతో సుందరకాండ పూర్తి చేసి తర్వాత నాగ పాశ  విమోచనం  ఆదిత్య హృదయం ,రామ రావణ యుద్ధం రావణ సంహారం ,దేవతలుచేసిన శ్రీరామ స్తుతి ,శ్రీ రామ పట్టాభి షేకం తో మొత్తం సుందరకాండ పారాయణ పూర్తి చేసి రామ లక్ష్మణాచార్యుల ”శ్రీ సువర్చలా వల్లభ సుందర వాయు నందన శతకం ”పఠించే సరికి ఉదయం 10-45  గంటలు అయింది  దీనితో శతక త్రయం ను రెండు సార్లు పఠించినట్లయింది  పావు గంట విశ్రాంతి తీసుకొని శ్రీ సువర్చలాంజ నేయ శాంతి కళ్యాణం    పుణ్యాహ వాచనం ,దిక్పాల  నవగ్రహ పూజ  కన్యావరణం ,ప్రవర మాంగల్యా పూజ ,ప్రవర చూర్ణిక మహా సంకల్ప0 మంగళాష్టకాలతో  సహా చదివి తంత్ర రహిత మంత్రం సహిత కళ్యాణం చేసి స్వామి వారల ఫోటోకు నేను తెచ్చుకున్న శ్రీ ఆంజనేయస్వామికి ప్రక్కనే పెట్టిన పసుపు తో చేసిన సువర్చలాదేవికి అక్షతారోపణ అంటే తలంబ్రాలు పోసి కళ్యాణం పూరి చేసాం అంతా అయ్యేసరికి 12 45 అయింది అంటే  ఉదయం నుంచిసుమారు 6 గంటల కార్యక్రమం నిర్వహించాం .నిత్య ప్రసాదాలతోపాటు పులిహోర ప్రత్యేక ప్రసాదం ఆ అమ్మాయి ,మనవడు పీయూష్ రాత్రి కూర్చుని స్వామికి పూల హారాలు కట్టారు. ఇవాళ పూలతో మామిడిపండ్లతో  చక్కగా అలంకరణ చేసి శోభాయమానం చేసింది  మా అమ్మాయి  . భోజనానికి పవన్ కుటుంబం గోసుకోండ అరుణ కుటుంబాన్ని పిలిచాం వాళ్ళూ వచ్చి స్వామిపాదాలకు తలంబ్రాలు పోసి భోజనం చేసి వెళ్లారు .భోజనం లోకి మామిడికాయ పప్పు ,వంకాయ కూర ,చిక్కుడుకాయ కూర పెరుగు పచ్చడి టమేటా చట్నీ చారు ,జున్ను .వడ్డించాం .కళ్యాణ విందుకూడా జరిగింది అనుకోకుండా
  శనివారం రాత్రి కాలిఫోర్నియా నుంచి మా మేనల్లుడు శాస్త్రి ,భార్య  ,అత్తగారు ఫోన్ చేసి మా అమ్మాయి పేస్ బుక్   లో పెట్టిన వీడియో చూసి ముచ్చటపడి ఆనందిం చామని అభినందనలు తెలిపారు మొత్తం మీద షార్లెట్ లో నా 55 వ సుందర కాండ పారాయణ  హనుమజ్జయంతి స్వామివార్ల అనుగ్రహం తో దిగ్విజయంగా జరిగింది
    ఉయ్యూరు  శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం 19 వ తేదీ నుండి మూడు రోజులు 21 వ తేదీ వరకు శ్రీ హనుమజ్జయ0తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు మా అబ్బాయి ఏ పూటకాపూట ఫోన్ చేసి చెబుతూ ఫోటోలు పెడుతూ తెలియ జేశాడు మొదటి రోజు ఉదయం స్వామివార్లకు అభిషేకం . సాయంత్రం శతకత్రయ పోటీకి ”ఒక్క పురుగు ”కూడా రాలేదట .శివాలక్ష్మి శ్రీ రామ లక్ష్మణ్చ్చర్యులు గారు నిర్వహించటానికి వచ్చారు వారికి శాలువాలతో సత్కారం జరిగింది .రెండవ రోజు 1000 రసం మామిడిపండ్లతో పూజ కనుల పండువుగా జరిగిందని  రాత్రికి మా శ్రీమతి కంటి డాక్టర్ శ్రీ మతి జయశ్రీ గారి కుటుంబం పూజలో పాల్గొన్నారని ,వారి అబ్బాయి అమ్మాయి చక్కగా పాటలు పడ్డారని మామానవరాలు హర్షితాఞ్జని కూడా పాడిందని శ్రీమతి శారదా గారు కూడా చక్కగా గానం చేశారని తెలిసింది  మూడవ రోజు ఉదయం 200 తమల పాకు కట్టలతో  అన్ని రకాల పుష్పాలతో అర్చన ఘనంగా జరిగిందని  స్వామివార్ల శాంతికల్యాణాన్ని మా రెండవ అబ్బాయి శర్మ ఇందిరా ద0పతులు  మూడవ కుమారుడు మూర్తి రాణి దంపతులు పీటలమీద కూర్చుని ఘనంగా నిర్వహించారని తెలిసి చాలా సంతోషించాం . రాత్రి  శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు గారు సంకల్పించి స్పాన్సర్ చేసిన 25 కిలోల మినపపప్పు తో స్వామివార్లకు గారెల దండలు అద్భుతః  అనిపించాయి .కాలనీ మహిళా మండలి వారు శ్రీ హనుమాన్ చాలీసా చాలా భక్తిగా చేశారు అక్కడ మేము లేకపోయినా మా రమణ అన్ని  బాధ్యతలు నిర్వహించి కార్యక్రమాలకు నిండుదనం తెప్పించాడు . ఈ వారానికి స్వస్తి .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

21-5-17 ఆదివారం షార్లెట్ లో హనుమజ్జయంతి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి కళ్యాణం

This gallery contains 11 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజనేయునికి నాగవల్లి పూజ

This gallery contains 100 photos.

More Galleries | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 138- సంస్కృత కీర్తనలురాసిన అన్నమయ్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

138- సంస్కృత కీర్తనలు రాసిన అన్నమయ్య  (1409-1503)
పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు 32 వేల  సంకీర్తనలు  రచించినా లభ్యమైనవి 12 వేలు  మాత్రమే  అందులో శృంగార భక్తి జ్ఞాన  నీటి ధర్మ వైరాగ్యభావాలను చక్కని తెలుగుపదాల పోహళింపుతో రాసి సొగసు తెచ్చాడు .తిరుమల శ్రీ వెంకటేశ్వర పాద పద్మ భృంగమై అందులోని మకరందాన్ని గ్రోలి మనకు అందించిన సంకీర్తనాచార్యుడు . కులమతాలకు అతీతమైన భావ వ్యాప్తి చేసిన సంస్కారి . .”బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే” అని ఎలుగెత్తి చాటిన వేదోపనిషత్ వ్యాఖ్యాత ”.ఏ కులజుడైన నేమి ఎవ్వడైన నేమి”అని అందరూ ఒక్కరే నాన్న వసుధైక విహావం వ్యాప్తి చేసైనా పూర్ణ ప్రజ్నడు . పదకవితా సాహిత్యానికి పట్టాభిషేకం చేసి  పదకవితా శారదను బంగారు పల్లకి లో  ఊరేగించినవాడు అన్నమయ్య. కలకండ తెలుగుకు మరింత తియ్యదనాన్ని అందించినవాడు.సర్వ దారి సంవత్సర   వైశాఖ శుద్ధ పొర్ణమి 22-5-1409న ఈ నాటి కడప జిల్లా లోని తాళ్ళపాక లో  జన్మించి 95  వ ఏట,దుందుభి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి   4-5-1503 న శ్రీ వెంకటేశ్వర పద సన్నిధికి చేరిన పుణ్యాత్ముడు .భార్య  తిక్కమ్మ ”సుభద్రా కళ్యాణం ”రాసిన తొలి తెలుగు కవయిత్రి .కొడుకు పేద తిరుమలాచార్యుడు ,మనవడు చిన్నయ్య కూడా కవులే .కర్ణాటక సంగీత కూర్పుకు పాదకవితలతో  ఒక సంచలనం సృష్టించినవాడు అన్నమయ్య.     సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య సంస్కృతం లోనూ కీర్తనలు రాసి తన గీర్వాణ పాండిత్యాన్ని ప్రకటించాడు .సుమారు వంద సంస్కృత కీర్తనలు రాసినట్లు తెలుస్తోంది .అందులో కొన్నిటి గురించి తెలుసుకుందాం
1-పృథుల  హేమ  కౌపీనధర-ప్రథిత  వతృమే బలం పాతు
సూపాసక్తః సుచి శ్శు లభః-కోప విదూరహ-కులా ధికః
పాపభంజకహ పరాత్పరోయం -గోపాలో  మే  గుణం పాతు
తరుణః చత్రీ దందా కమండలు-ధర పవిత్రీ దయా పరః
సురాణాం సంస్తుతి మనోహరః -స్థిర శ్శు ద్ధీర్మే ధృతిం పాతు
త్రివిక్రమః శ్రీ తీరు వెంకట గిరి -నివాసోయం నిరంతరం
ప్రవిమల మసృణ కబళ ప్రియోమే -దివా నిశాయాం థియమ్ పాతు ”

-వామన మూర్తి పై కీర్తనయుడి దీన్ని లతా మంగేష్కర్ పాడారు

2-భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింత ఏయం సదా –
కటి ఘటిత మేఖలా ఖచిత మని ఘంటికా -పాతాళ నినాదేన   విభ్రాజమానం
కుటిల పద ఘటిత  సంకుల శింజితేన తం -చేతుల నటనా సముజ్వల విలాసం
నిరత కర కలిత నవనీతం  బ్రహ్మాది సుర నికర భావనా శోభిపదం
తిరు వేంకటాచల స్థిత0 అనుపమమ్ హరిం -పరమ పురుషం గోపాలబాలం  –
మరో కీర్తన చూద్దాం
3-దేవ దేవం భజే దివ్య ప్రభావం -రావణాసుర వైరి రవి పుంగవం
   రాజవరం శేఖరం రవి కుల సుధాకరం -ఆజానుబాహు నీలాగ్రకాయం
   రాజారి కోదండ దీక్షా గురు0 -రాజీవ నేత్రం రామచంద్రం ,రామం
   నీల జీమూత సన్నిభ శరీరం -విశాలవక్షం నిబాల జలజ నాభం
   కాలాహి నాగ హరమ్ ధర్మ సంస్థాపనం -గో లలనాధిపమ్  భోగి శయనం రామం
   పంకజాసన వినుత పరమ నారాయణం -శంకరార్జిత జనక చాప దళనం
  లంకా  విశోషణం లలిత విభీషణం వెంకటేశం సాదు వినుత వినుతం రామం –
మరో ఆణిముత్యం –
4- మాధవ కేశవా మాధవ విష్ణో శ్రీధరా- పదనఖ0 చిన్తయామి యూయం
    వామన గోవిందా వాసుదేవ ప్రద్యుమ్న -రామరామ కృష్ణ నారాయణాచ్యుత
    దామోదరానిరుద్ధదైవ పుండరీకాక్ష -నామాత్రయాధీశ నమోనమో
    పురుషోత్తమ పుండరీకాక్ష -దివ్య హరి సంకర్షణ అధోక్షజ
    నరసింహ హృషీ కేశ నగధర త్రివిక్రమ – శరణాగత రక్ష జయ జయ సేవే
    మహిత జనార్దనా మత్స్య కూర్మ వరాహా -సహజ భార్గవ బుద్ధ జయ తురగ కల్కి
    విహిత విజ్ఞాన శ్రీ వేంకటేశ శుభకరం -అహమిహ తవపద  అనిశం భజామి
     అంటూ  విష్ణు అవతారాలను చక్కగా స్తుతించాడు అన్నమయ్య కీ ర్తనలో 
    సశేషం 
   మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యురులో హనుమాన్ జ్జయంతి సందర్భంగా ఆలయంలో

శ్రీ సువర్చలాంజనేయ స్వామి – ఉయ్యురులో హనుమాన్ జ్జయంతి సందర్భంగా ఆలయంలో త్రాయహ్నికంగా ఉత్సవాలు ప్రారంభమైనాయి. తొలిరోజు శుక్రవారం నాడు ఉదయం స్వామివార్లకు మాన్యు సుక్తంతో స్నపన,నూతన వస్త్ర ధారణ, పుష్ప పూజలు ఆలయ అర్చక స్వామి వేదాంతం మురళీకృష్ణ నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల బృందం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -44

 రఘువీర చరితం -3
ఎనిమిదవ అధ్యాయం లో రాముడు పంపానదిని చూసి పరవశించాడు  ..అక్కడి ప్రకృతి  అందాలకు పులకించాడు . మళ్ళీ సీతా దేవి గుర్తుకు వచ్చి విలపించాడు ..ఎవరో కొత్త వ్యక్తి వస్తున్నట్లు గమనించాడు వానరరాజు సుగ్రీవుడు హనుమంతుని పంపి విషయం ఏమిటో తెలుసుకోమన్నాడు .హనుమ తాపసి  వేషం లో వచ్చి సోదరుల శరీర దారుడ్యానికి ,శూర పరాక్రమ ఛాయలకు సంతసించాడు -” దంత మౌక్తిక నిష్ఠ యుతా మనః కుముద కౌముదీ -కాంతి ర్గండు గాంబు గౌరీ వ వామేషా స్నాపయతీవ మామ్ ” అనుకోకుండా హనుమ  వారిదేహ చ్చాయలను వర్ణించాడు -సుగ్రీవుని వద్దకు సోదరులను హనుమ చేర్చాడు ..మనసు విప్పి రామ సుగ్రీవులు మాట్లాడుకున్నారు .వాలితో ఉన్న అనుబంధాన్ని సుగ్రీవుడు వివరించాడు సోదరభావం ఒక చిన్న కారణం తో విరిగి పోయిందని అది  యెంత గొప్పవాడికైనా  మళ్ళీ అతికించటం సాధ్యం కానిపని అన్నాడు -అల్పేనాపి నిమిత్తేన సౌభ్రామం భిద్యతే తృణాం -పునస్త ప్రతి సంధానం మహాతాపి న లభ్యతే ”
 తన విషాద జీవితగాధ వివరించాడు వానర రాజు ..రామ సుగ్రీవుల మధ్య స్నేహం గాఢమైన పిమ్మట సుగ్రీవుడు సీతాన్వేషణకు సహాయ పడతానన్నాడు . ప్రవాసితుడైన సుగ్రీవుడు నిబ్బరం గల బలశాలి అని రాముడు గ్రహించాడు ..అప్పుడు హనుమ ”రాముని కోరిక తీగ పుష్పించి ఫలిస్తుంది ”ఆనాడు-”స్ఫీత చాపల సంపర్క మర్కటే స్మిన్  ప్రసారితా -కేవలాతే  కృపా వల్లీ  ఫలం భధ్నాతు మా చిరం ”.రామాహనుమలు తమకు సూర్యుని తో సంబంధాన్ని గుర్తుకు చెచ్చుకున్నారు  వాలిని చంపి వానర రాజు తో స్నేహాన్ని బలీయం చేసుకొంటాను అని సుగ్రీవునికి రాముడు అభయమిచ్చాడు .
   తొమ్మిదవ అధ్యాయం లో రఘు వీర మహాకావ్యంను మల్లినాథుడు  కాళిదాసు రఘువంశ 0లో తొమ్మిదవ సర్గ ను పూర్తిగా అనుకరించి రాశాడు .ముఖ్యంగా యమకాన్నిఅదే కోవలో దట్టించాడు .రఘువంశ వ్యాఖ్యానం రాసిన హేమాద్రి పండితుడు యమకాన్ని మహా గమకంగా నిర్వచించాడు –స్పాత్పాద పద వర్ణనామావృత్తిహ్  సంయుతా యుతా -యమకం భిన్న వాచ్యానామాది మధ్యాంత గోచరం -ఇతి వాగ్భటహ్ . ఇందులో యమకాలున్న శ్లోకాలు పదకొండుమాత్రమే రాముని దుఃఖ పరాకాష్టగా పర్వతాలను ,మేఘాలను  నెమళ్లను మొదలైన వాటిని తన సీతను తనకు తెచ్చి ఇవ్వమని వేడు కోవటం వింత గా ఉంటుంది  .
  సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా       

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి

పీఠాధిపత్యం బందిఖానా అని పారిపోయిన పీఠాధిపతి

హిమాలయాల్లో హాయిగా అంతర్ముఖుడై తపస్సు ధ్యానం చేసుకొంటున్న ఒక యువ శిష్యుడిని గురువుగారు పిలిచి ఆరునెలలు నర్మదా నదీ  తీరం ఏకాంత ప్రదేశం లో లోకఠిన నియమాలతో ధ్యానతపస్సులు చేస్తూ  గడిపిరమ్మని పంపాడు .సరే నని శిష్యుడు నర్మదానదీతీరం లోని ఓంకార క్షేత్రానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరం లో ఖేరిఘాట్ కు దక్షిణానఉన్న అరణ్యం కు వెళ్ళాడు .అక్కడి నర్మదా నది మొసళ్లమయంగా ఉండేది .ఉదయాన సాయం వేళల మొసళ్ళు హాయిగా నది ఒడ్డుకు వచ్చి ఇసుకలో పడుకునేవి ఈ శిష్య స్వామి అక్కడే ఆరు నెలలు ధ్యానం లో గడిపాడు .కానీ ఒక్కనాడూ ఆయన తపస్సుకు ధ్యానానికి అవి భంగం కలిగించలేదు .ఈ యువ సాధకుడివద్ద ఒక చిన్న నీళ్ల కుండ ,ఒక దుప్పటి  ,రెండు అంగోస్త్రాలు మాత్రమే ఉండేవి ..ఆరుమైళ్ళ దూరం లో ఉన్న గ్రామస్తు లు   యువ స్వామికి పాలు  గోధుమ రొట్టె రోజుకొకసారి తెచ్చిపెట్టేవారు .ఇలా ఆరునెలలు అతి   కఠోర  నియమ నిష్ఠలతో ధ్యాన తపస్సులలో గడిపాడు .ఒకరోజు పెద్ద వేటగాళ్ల బృందం అక్కడికి  వచ్చి సుమారు రెండుమూడు గజాల దూరం ఉన్న  మొసళ్ళమధ్య ఏకాంతం గా చలనం లేకుండా  ధ్యాన నిమగ్నమైన స్వామిని చూసిఆశ్చర్యపోయి స్వామికి తెలియకుండా  ఫోటో తీసి పేపర్లకు పంపారు .అవి అన్ని వార్తా పత్రికలలో ప్రచురితమై సంచలనాన్ని కల్గించింది . అదే సమయం లో కరివీర  పీఠ శంకరాచార్యస్వామిడా. శ్రీకూర్కొటి . గీతా రహస్యం రచించిన బాలగంగాధర తిలక్ కు సన్నిహితుడు    తమ వారసునిగా ప్రతిష్టించటానికి పదవికి తగిన వారికోసం   అన్వేషిస్తున్నారు ..ఈ యువ స్వామి విషయం తెలిసి కొందరు పండితులను రహస్యంగా పంపి స్వామి చర్యలను గమనించమన్నారు  .వాళ్ళు దగ్గర గ్రామం లో రహస్యంగా ఉంటూ స్వామి గురించి వింటూ చూస్తూ తెలుసుకొన్నారు .స్వామి కుటుంబ నేపధ్యం చదువు గురువు పవిత్రత  అన్నీ  తెలుసుకొని అసలు విషయం చెప్పి పీఠానికి వారసులుగా ఉండటానికి అంగీకారరించమని ప్రాధేయపడి   యువస్వామిని కూర్కొటి వద్దకు తీసుకు వెళ్లారు ఆయనకు స్వామి నచ్చినట్లు కనిపించింది .వెంటనే యువస్వామి తమ గురువు ను దర్శించి ఆయన అనుమతి, ఆశీర్వాదం పొందాడు
  18 రోజులు అనేక మంత్ర తంత్రాలతో స్నానాదులతో అన్ని రకాల మత సంబంధ విధులు నిర్వ హీంప జేసి కరి వీర పీఠ జగద్గురు  శంకరాచార్యులుగా ప్రతిస్థాపనం చేశారు .అభినందిస్తూ వేలాది టెలిగ్రాములు వచ్చాయి .రోమ్ నుంచి పోప్  సందేశం తోపాటు  ఎందరో మత గురువులనుండి  ఎన్నో సందేశాలు అందాయి.రంగ రంగ వైభవంగా కార్యక్రమం జరిగింది .అప్పటికి ఈ యువ  శంకరా చార్య  వయసు 30 సంవత్సరాలే .ఆరు  నెలల ఒంటరి  కఠిన  నియమ తపస్సు ఇంతటి గొప్ప పదవిని కట్ట బెట్టింది .
  డా కూర్కొటి సాంఘిక మత సంస్కరణలు చాలా చేశారు .మఠం  ఫైల్స్ అన్నీ అప్పగించారు విలువైన సమాచారం చాలా ఉంది ఎందరెందరికో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయాల్సి వచ్చేది .ఎన్నెన్నో బృందాలవారు  వచ్చి సందర్శించి ఆశీర్వాదాలు అభిభాషణలు చేయమని కోరేవారు .దేశాటనం చేస్తూ ధార్మిక ప్రసంగాలు చేస్తూ క్షణం ఖాళీ లేకుండా గడపాల్సి వచ్చేది . పీఠం లో ఉదయం సాయంత్రం వేలాది భక్తులకు దర్శనం ఇవ్వాల్సి వచ్చేది .ఈ బిజీ షెడ్యూల్ లో తనకు స్వేచ్ఛ అనేది లేదని అర్ధమయింది కొత్త శంకరాచార్య స్వామికి .. తన ఏకాంతం, ధ్యానం తపం ఎగిరిపోయాయి  ఇది నచ్చ లేదని పించింది . ఈ సుఖం సుఖం కాదనుకున్నాడు అంతరాత్మ ”నీకు తగిన పదవికాదు వదిలెయ్యి ”అని ప్రబోధించింది .  రెండేళ్ల తర్వాత ఎవరికీ తెలియకుండా చేతిలో పైసా కూడా లేకండా కట్టుబట్టలతో బయటికి వచ్చి హాయిగా మళ్లీ హిమాలయాలలో ఒంటరిగా తపస్సు చేసుకొందామని తాను  చేరాల్సిన గమ్యానికి చేర్చే రైలు లో మూడవ తరగతి పెట్టె ఎక్కి కూర్చున్నాడు .టికెట్ కొనటానికి చిల్లి గవ్వలేదు బైరాగి టికెట్ అంటారే అలా ఉంది పరిస్థితి .కాసేపయ్యాక కండక్టర్ వచ్చి టికెట్ ఏది అనిఅడిగితే లేదని చెబితే ఖరీదైన శంకరాచార్య దుస్తులు చూసి తర్వాత స్టేషన్ లో దిగిపొమ్మంటే దిగిపోయాడు .కానీ తానెవరో మాత్రం చెప్పలేదు .జీవితం లో ఆయన ఎప్పుడూ టికెట్ కొనకుండా ప్రయాణం చేయలేదు .కండక్టర్ కు వంగి నమస్కరించి ”నా మీద కేసు పెట్ట నందుకు కృతజ్ఞతలు ”అని చెప్పి దిగిపోయాడు .
  ఇంతకీ ఈ స్వామి ఎవరో తెలుసా ?స్వామి రామా .అసలు పేరు బ్రీజ్ కిషోర్ దస్మన    గురువు బెంగాలీ బాబా .స్వామి రామ 1925 లో   ఘర్వాల్ హిమాలయాలలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి   1996 లో చనిపోయాడు .లివింగ్ విత్ ది  హిమాలయన్ మాస్టర్స్ ”అనే గొప్ప గ్రంధం రాశాడు .అమెరికాలో పెన్సిల్వేనియారాష్ట్రం లో హాన్స్ డేల్  అనే చోట సుమారు అయిదువందల ఎకరాలలో ”హిమాలయన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ యోగ సైన్స్ అండ్ ఫిలాసఫీ ”స్థాపించాడు అనేక దేశాల పర్యటన చేశాడు అక్కడా బ్రా0చీలను  ఏర్పాటు చేశాడు .
  Inline image 1Inline image 2Inline image 3
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా     



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నా దారి తీరు -106 – గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )

నా దారి తీరు -106 –

గెలాక్సీ   ఆఫ్ హెడ్ మాస్టర్స్ -2(చివరిభాగం )
 ”పయస్ ”హెడ్ మాస్టర్ గా పేరొందినవారు అవనిగడ్డకు చెందిన శ్రీ ఏం వి .కృష్ణారావు గారు .అతి  సౌమ్యులు  ,పవిత్రలు ధార్మిక విషయాలలో నిష్ణాతులు .ఉయ్యూరు లో మాతో పాటు పని చేసిన లెక్కలమేస్టర్  ,తర్వాత హెడ్మాస్టర్ అయినశ్రీ అన్నే ఉమా మహేశ్వరరావు గారికి మేనమామ .కృష్ణారావుగారు పంచెకట్టు చొక్కా ఉత్తరీయం నవ్వు ముఖం తో   చూడగానే  రెండు చేతులు జోడించాలనిపిస్తుంది . స్నేహం సౌశీల్యం ఆదర్శం ఆయన సొత్తు అతి నిరాడంబరులు నెమ్మదిగా స్పష్టం గా మాట్లాడేవారు .ఏం ఎల్సీ ఎన్నికలలో కొల్లూరి కోటేశ్వర రావు గారికి నేనూ ఆయన శ్రీ ఆర్ ఎస్ కె మూర్తి శ్రీ గౌతమేశ్వరరావు గారు కలిసి ప్రచారం చేసినప్పుడు పరిచయమయ్యారు తర్వాత కాటూరు హెచ్ ఏం గా మరింత చేరువై వారి అభిమానినయ్యాను .ఆర్ ఎస్ ఎస్ లో సుశిక్షితులైన కార్యకర్త .మంచి బౌద్ధిక్  అంటే సంఘ సమావేశాలలో బుద్ధిని వికసింప జేసే ప్రసంగాలను చేసేవారిని బౌద్ధిక్  అంటారు .ఎన్నో విషయాలు లోతుగా చర్చించేవారు . శ్రీ గౌతమేశ్వరరావుగారు కాటూరులో సోషల్ మాస్టారుగా నాతోపని చేసి ప్రమోషన్ పై రెడ్డిగూడెం హెడ్ మాస్టర్ అయ్యారు .నిబద్ధత ఉన్న ఆర్ ఎస్ ఎస్ వ్యక్తి . అలాగే కపిల కాశీపతిగారు కైకలూరు ప్రాంతం లో ప్రసిద్ధులు . శ్రీ మారెళ్ల సుబ్బారావు గారు ఆకునూరు హెడ్ మాస్టర్ .పంచ  చొక్కా పై పై కోటు వేసేవారు.పిలక ఉండేది .నాకు బాగా పరిచయం .మంచి ఉపన్యాసకులు .అనలిటికల్ బ్రెయిన్ ఆయనది లోతులను తరచి మాట్లాడేవారు .
  మా రెండవ తోడల్లుడు చతుర్వేదుల శ్రీరామ మూర్తిగారి తండ్రిగారు చతుర్వేదుల సదా శివ మూర్తిగారు అతిపవిత్ర జీవి  .తాడంకి వల్లూరు హెడ్ మాస్టర్ చేసి శ్రీ కాకాని వెంకటరత్నం గారి అభ్యర్థనపై ఆకునూరు హెడ్ మాస్టర్ గా చేశారు డిసిప్లిన్ కు మంచి విద్యా శిక్షణకు జిల్లాలోనే పేరెన్నిక గన్న హెడ్ మాస్టర్ . ఎవ్వరినీ లెక్క చేసేవారుకాదు .అందరికి హడలు .మనిషి భారీ పర్సనాలిటికాదు  సరిసమానంగా తెల్లటి పంచ చొక్కా ఉత్తరీయం మెడలోనుంచి ముందువైపుకు దోపి ,ముఖాన పెద్ద బొట్టు తో  పిలక తో ఉండేవారు . ఇంగ్లీష్ , లెక్కలలో ఆయన వద్ద చదివిన వారు తప్పటం అనేది ఉండేదికాదు .బడితెలవంటి వాళ్ళు కూడా కుక్కిన పేనుల్లాగా తల వొంచి వినయంగా ఉండేవారు .నాకు బాగా పరిచయం .ఆకునూరు నుంచి పడమట వెళ్లి అక్కడే రిటైరయ్యారు .రిటైరయ్యాక ఆయన్ను లెక్కల ట్యూషన్ చెప్పమని బ్రతిమాలితే ఇంటి దగ్గరే ట్యూషన్ లెక్కలు ఇంగ్లీష్ బోధించారు యాభై మందికి తక్కువ ఉండేవారుకాదెప్పుడూ . ఒక ఇన్ స్టి  ట్యూషన్ లాగా నడిపారు  అలాగే కపిలేశ్వర పురం లో హెచ్ ఏం అయినా శ్రీ ఉమా రామ లింగమూర్తి గారికి జిల్లాలో పెద్దపేరు .చామన ఛాయ గోచీ పోసి పంచె కట్టు ,కోటు ,ఉత్తరీయం మెడలో మడిచి స్ఫురద్రూపంగా ఉండేవారు . సంప్రదాయం సౌశీల్యానికి పెట్టిందిపేరు . జిల్లాలో ఆయన పెద్ద దిక్కు . సలహా సంప్రదింపులకు ఆయన వద్దకే వెళ్లేవారు .ఆయన మేనల్లుడూ అల్లుడూఅయిన  శ్రీ  రామ గోపాలం గారు కూడా హెడ్మాస్టర్ . కపిలేశ్వరపురం లో చేసి గన్నవరం లో రిటైర్ అయ్యారు .నేను సైన్స్ మాస్టర్ గా గన్నవరం లో [అని చేసిన పది పది హేను రోజుల్లో నన్ను జాయిన్ చేసుకొని రిలీవ్ చేసింది ఆయనే .మూతి మీద చిన్న మొరిక ఉండేది .పొట్టిగా నే ఉండేవారు పంచెపై చేతుల గ్లాస్కో బనీను వేసేవారు .ఇది తమాషాగా ఉండేది .సైన్స్ టీచర్ గా పెద్ద పేరు
శ్రీ పుచ్చా శివయ్యగారు గ్రాండ్ ఓల్డ్ హెడ్ మాస్టర్ .కపిలేశ్వర పురవాసి . లెక్కలు ఇంగ్లీష్  లలో ధరో  నాలెడ్జ్ ఉన్నవారు . క్రమశిక్షణకు మారుపేరు . రిటైరయ్యాక ఉయ్యూరు లో శ్రీ సరస్వతి ట్యుటోరియల్ కాలేజీ ని శ్రీ అన్నే హనుమంతరావు గారితో కలిసి స్థాపించారు .మానాన్నగారు రిటరయ్యాక ఇక్కడే తెలుగు పండిట్ గా చేశారు ఆదిరాజు పున్నయ్యగారుకూడా ..మాతమ్ముడు కూడా కొద్దీ కాలం చేశాడు . .  శివయ్యగారితో అప్పుడే పరిచయం .
  ఉయ్యూరులో నేను ఎస్ ఎస్ ఎల్ సి చదివినప్పటి హెడ్మాస్టర్ శ్రీ కామినేని రాధాకృష్ణ మూర్తిగారు పెడసనగల్లు వాసి .సూటూ బూటూ టై తో ఉండేవారు .బాల్డ్ హెడ్ .ఆయన్ను ”దసరా బుల్లోడు ”అనేవారు ..ఇంగ్లీష్   ఆల్జీబ్రా  చెప్పారు .అర్ధంకాక నోట్స్ ఇవ్వక పొతే కాటూరు వెళ్లి హెడ్మాస్టార్ గా    ఉన్న శ్రీ సీత0  రాజు కామేశ్వరరావు గారి దగ్గరకు వెళ్లి వారమ్మాయి నోట్స్ అడిగి తీసుకొని రాసుకొని తిరిగి ఇచ్చేవాడిని అందుకే మార్కులు ఆ రెండు సబ్జెక్ట్ లలో తక్కువ వచ్చేవి . .రాధాకృష్ణమూర్తిగారిని నాగిరెడ్డి అనిస్టుడెంట్ స్కూల్ లోనే కొట్టాడు కారణం తెలియదు . కానీ ఆతర్వాత ఆ రెడ్డికి నడుం పట్టేసి  వంకరగా  జీవితాన్తమ్ నడిచేవాడు యాకమూరు వాసి . కామేశ్వరరావు గారు మేము టెన్త్ లో ఉండగా లెక్కలు చెప్పేవారు ఆయన పాఠం  చెబితే అక్కడికక్కడే రావాల్సిందే ఒక్క స్టెప్ కూడా వదలకుండా బోర్డు మీద రాసేవారు . కనుక యావరేజ్ వాడికి గొప్ప అవకాశం .ఆయన ఉయ్యూరులో మా బజార్లోనే కాపురముండేవారు మా నాన్న గారి శిష్యుడనని చెప్పేవారు నేను వారి శిష్యుడను .ఇంటివద్ద వక్కపొడి తయారు చేసి అమ్మేవారు .పంచ చొక్కా తో ఉండేవారు చాలా మర్యాదస్తులు  .వారమ్మాయి నా క్లాస్ మేట్ .” గురువుగారబ్బాయ్ ”అనే నన్ను పిలిచేవారు .పొట్లాలు నిలువుగా ఉండి  అడుగునా పైనా మూత లుగా చిన్న అట్టముక్కలుండేవి . చుట్టూ  గ్లేజ్ కాగితం అతికించి ఉండేది .
   ఉయ్యూరులో పని చేసిన శ్రీ కె ఎస్ ప్రకాశరావు గారికి మంచిపేరు. అలాగే రాళ్లబండి సత్యనారాయణ గారు మా ఇంటి పక్కనే ఉండేవారు .పంచెపై కోటు .భారీ పర్సనాలిటీ . ఎవరినీ లెక్క చేసేరకంకాదు .శ్రీ ఎస్ కె వెంకటేశ్వర్లుగారు నల్లగా ఆజానుబాహువుగా పంచెకట్టుతో ”సెల్ఫిష్ జయంట్  ”గా ఉండేవారు .ఆయన సంతకం ”జిలేబి చుట్ట”లా  ఉండేది . స్కూల్ లోనే హెడ్ మాస్టర్ రూమ్ లో ఒకప్రక్క ఉండేవారు .వైష్ణవులు .బ్రాహ్మణమాస్టార్ల ఇంటికి ప్రతి రోజు నాకో సూరి రామశేషయ్య గారికో అటెండర్ తో చిన్న చీటీ పంపేవారు ‘అందులో  ”ప్లీజ్ ఆరెంజ్ మీల్స్ టు  డే ”అని ఉండేది .అలానే చేసేవాళ్ళం .మందిని బాదుకోవటం సరదా .ఎక్కడ పని చేసినా స్పెషల్ ఫీ  ఫండ్స్ ”హూష్ కాకి ” నాకేసేవారని జిల్లాలో పెద్దపేరు . ఉయ్యూరులోనూ లేపేశారు .ఎవరికీ తెలిసేదికాదు .ఆయన ఉన్నప్పుడే బ్రహ్మనంద రెడ్డి  డిటెన్షన్ సిస్టం రద్దు చేశాడు .తర్వాత ఈ పాసులను బ్రహ్మానంద రెడ్డి పాస్  అనేవారు
  చెయ్యెత్తి మొక్కాల్సిన మరో హెడ్ మాస్టర్ శ్రీ ఏ బలరామ మూర్తి గారు .ఆయన శారీరక మానసిక ష్వచ్చత కు ఆయన అతి తెల్లని పంచ చొక్కాలు సాక్షి .జిల్లాలోనే తిరుగు లేని వారు ఆయన డ్రాఫ్ట్ రాస్తే తిరుగు లేదు టీచింగ్ లో డిసిప్లిన్ లో ఆయనకు సాటి ఎవరూ లేరు .ఇంటివద్ద మానసిక రోగి అయినా భారయకు అన్నీవండి పెట్టి   బడికి వచ్చేవారట .హేట్సాల్ఫ్ అనిపిస్తుంది .  సమయపాలన ఆయన విధి . స్టాఫ్ మీటింగ్ అంటే అయిదేఅయిదు నిమిషాలు చెప్పాల్సింది పాయిట్స్ గా రాసుకొని వచ్చి చెప్పేసి ఇలా చేయాలి . అంటారు అంతే సుగ్రీవజ్జనే .ఉయ్యుయూరులో కొద్ది కాలమే ఉన్నారు అప్పుడు వారివద్ద పని చేసే అదృష్టం నాకు దక్కింది  .
  ”హాఫ్ కార్ట్ ”  అనే బట్టతలఆయన పేరు బి కామేశ్వరరావు  సోషల్ మేష్టారు తరవాత హెడ్ అయ్యారు  అలాగే శ్రీనివాసరావు గారనే ఆయన రా గ్రాడ్యుయేట్ గా ఉయ్యురు లో సైన్స్ టీచర్ తర్వాత హెడ్ అయ్యారు .వారు  నేనుహెడ్  అయ్యాక మళ్ళీ పరిచయమయ్యారు  ఉయ్యూరు లో హెడ్ అయిన శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారు తమాషా గా ఉండే బుల్లి మూతితో మినీ ఎస్వీ రంగారావు గా అనిపించేవారు మంచి సైన్స్ ఇంగ్లీష్  టీచర్ .ఇక్కడే రిటైరయ్యారు ఆయన పాలనను” అక్బర్ పాలన” అనేవాడిని . స్కూల్ లో కొత్త బిల్డింగ్ లు నీటి సరఫరా గ్రౌండ్  మెరక  టిఫిన్ షెడ్ మొదలైనవి కెసిపి సహకారం తో ఏర్పడ్డాయి .అయన ఇద్దరు కూతుళ్లు మానికొండలో నా స్టూడెంట్స్
  చై ర్మన్ పిన్నమనేనిగారి కుడిభుజం  రుద్రపాక హెడ్మాస్టర్ శ్రీ ఈడుపుగంటి వెంకటేశ్వరరావు గారు మంచి వాలీబాల్, బాడ్మింటన్ ప్లేయర్ .టీచర్స్ బదిలీల్లో పిన్నమనేనిని ముఖ్య సలహాదారు   ఒకసారి నాకు  ముప్పాళ్లనుంచి పామర్రు రావటానికి తోడ్పడ్డారు .సరదాగా మాట్లాడే నేర్పు విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి యుక్తులు హై పర్సెంటేజ్ సాధించే  నేర్పు  ఓర్పు ఉన్నవారు నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు తర్వాత పునాదిపాడు వచ్చారు . వారబ్బాయిల్లో ఒకరు ఉయ్యురు కాలేజీ తెలుగు లెక్చరర్ ,రెండవనాయన కె సిపి ఉద్యోగి తరుచు ఉయ్యురు వచ్చేవారు .ఈ ఇద్దరు వెంకటేశ్వరరావు గార్లు వామభావ పక్షపాతులు .శ్రీ పి .శ్రీరామ మూర్తిగారి అనుచరులు . అసలు శ్రీరామమూర్తిగారే హెడ్ మాస్టర్ గా గొల్లపల్లి లో పనిచేసి టీచర్స్ తరఫున ఏం ఎల్ సిగా పోటీ చేసి గెలిచారు .మంచి పర్సనాలిటీ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు .మేమందరం కొల్లూరి గారి మనుషులం అయినా నాతో  మూర్తిగారు చాలా ఆప్యాయంగా ఉండేవారు .ఒకటి రెండుసార్లు సరసభారతి సమావేశాలకు ఉయ్యురు వచ్చారు . అరుదైన వ్యక్తిత్వం వారిది .కానీ గిల్డ్ తరఫున పని చేసి మేము రెండుసార్లు కొల్లూరి ని గెలిపించి ఆయన్ని ఓడించాం .లెఫ్ట్ భావాలున్న శ్రీ పి .జనార్దనా రావు గారు శ్రీ నెక్కలపూడి కోటేశ్వరరావు గారు మంచి హెడ్మాస్టర్లుగా ప్రసిద్ధులు . అంగలూరు హెడ్ మాస్టారు శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు అందరికీ ఆదర్శ ప్రాయులు .ఆంగ్ల బోధనలో నిష్ణాతులు రూల్స్ లో నిధి .అలాగే మంగళాపురం హెడ్ మాస్టర్ గా చేసి రిటైరైన శ్రీ జోశ్యులుగారు జిల్లా లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా స్కౌట్స్ ట్రెయినింగ్ లో మేటి
      జగ్గయ్యపేట దగ్గర శ్రీ రెబ్బా సత్యనారాయణ గారికి మంచిపేరుంది .గన్నవరం ఆత్కూరు లలో శ్రీ ఆళ్ళ కోటేశ్వరరావు గారు ప్రసిద్ధులు .లేడీస్ లో శ్రీమతి పి .ప్రమీలారాణిగారు అరుదైన వ్యక్తి .గన్నవరం గర్ల్స్ స్కూల్ ను తీర్చి దిద్దారు .ఆమెను మేము హెచ ఏం  అసోసియేషన్  ప్రెసిడెంట్ గా ,కామన్  ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీగా చేసాం . రెండితోనూ సమర్ధ వంతంగా పని చేసి రాణించారు .ఆమె చెల్లెలు సరోజినీ దేవిగారు నందిగామ లో పేరు పొందారు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి విజయ లక్ష్మిగారు కలుపుగోలు మనిషి
  ఉయ్యురు లో హెడ్ గా పని చేసిన తాడంకి నేటివ్ శ్రీ కోడెబోయిన సూర్యనారాయణ గారు నీట్ గా చొక్కా నలక్కుండా చేతికి మట్టి అంటకుండా పని చేశారు లెక్కలమేస్టారుగా మంచిపేరు  తెల్లని గ్లాస్కోపంచె అంతే  తెల్లని చొక్కా ఉత్తరీయం చేతిలో గొడుగు నెత్తిపై అటునుంచి ఇటు తిరిగిన నాలుగే నాలుగు వెంట్రుక లు ఆయన ప్రత్యేకత  . ఏం జరిగినా సంబంధ లేనట్లుండటం ఆయనకే చెల్లింది .ఆయన సమయం లో స్కూల్ లో హిందూ ముస్లిం స్టూడెంట్స్ కొట్లాట వస్తే బెదిరిపోతే నేనూ ,వల్లభనేని రామకృష్ణారావు గారు అన్నే పిచ్చిబాబు  గారు మొదలైన టీచర్స్ పూనుకొని ఘర్షణ లేకుండాకాపాడాం . ఆయన్ను అందుకే ”ఉపాయం మేష్టారు ”అనేవారు
  మంచి హెడ్మాస్టర్ లలో శ్రీ మంగళగిరి శాస్త్రిగారు ప్రసిద్ధి గొప్ప చెస్ బాడ్ మింటన్ వాలీబాల్ ప్లేయర్ .లెక్కలు  ఇంగ్లీష్ టీచింగ్ లో సూపర్ . గిల్డ్ ప్రెసిడెంట్ ను చేసాం తాడంకి హైస్కూల్ కు వన్నె తెచ్చి అక్కడే రిటైరయ్యారు .ఎన్నో సెమినార్లు నిర్వహించారు ..శ్రీ అన్నే ఉమామహేశ్వరరావు శ్రీ ఘంటా కోటేశ్వరరావు లు ట్యూషన్ మాగ్నెట్స్ .హెడ్స్ గా బాగా రాణించారు ..పెనమకూరు వాసి శ్రీ సూరపనేని వెంకటేశ్వరరావు శ్రీ విల్సన్ గార్లు ,నా ఎస్ ఎస్ సి క్లాస్ మేట్  శ్రీమతి చందా నిర్మల  ఆమె భర్త సామ్యుల్ గారు వత్సవాయి దగ్గర పోలం పల్లి లోను , గుడివాడ దగ్గర మోటూరు లో హెడ్స్ గా చేశారు . నా ” బెడ్ ”ట్రెయినింగ్ మేట్స్  హనుమంతరావు ఆండ్రు పాల్  బండిరామారావు చౌదరి , ,  శ్రీ పి ఆంజనేయశాస్త్రి ,లు హెడ్స్ గా ప్రసిద్ధులు శ్రీ కోకా మా ధవరావు గారు తాడంకి హెడ్మాస్టర్  ఎప్పుడూ ముక్కుపొడీపీలుస్తూ పంచెకు తుడుచుకొంటూ ఉండేవారు . మంచి టీచర్ కుసుమహరనాధ భక్తులు . భార్య  కూడా సౌజన్య  శీలి హెడ్ మిస్ట్రెస్ అయ్యారు .అలాగే శ్రీ వీరయ్య ,శ్రీ యెన్ అంజయ్య ,వి రఘురాములు ,శ్రీపే టేటి జగన్నాధరావు మొదలైనవారు నాకు సహా ప్రధానోపాధ్యాయలు .ఇప్పటిదాకా చెప్పబడిన వారంతా కృష్ణా జిల్లాపరిషత్ ప్రధానోపాధ్యాయులు .
  ఇప్పుడు ప్రయివేట్ హై స్కూల్ హెడ్మాస్టర్ ల గురించి నాకు తెలిసింది తెలియ జేస్తా .గుడివాడ టౌన్ హై  స్కూల్ వ్యవస్థాపక హెడ్ మాస్టర్ శ్రీ యి ఎస్ యెన్ వి మూర్తి గారనీజ్ఞాపకం కృష్ణా జిల్లాలో మొట్టమొదటి రాష్ట్ర పతి పురస్కార గ్రహీత . మూర్తీభవించిన స్వచ్ఛత . ఆయన ప్రత్యేకత . తర్వాత సోమంచి రామం గారికి  ఈ పురస్కారం వచ్చింది .టౌన్ హై స్కూల్ కె చెందిన మరో హెచ్ ఏం శ్రీ యెన్ వెంకటేశ్వరరావు గారూ పొడుగ్గా పలచగా ఉండేవారు .సౌజన్య మూర్తి . గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ నిర్మల గారుకూడా సమర్ధులని పేరుపొందారు .  . మచిలీపట్నం లో శ్రీ చోడవరపు బింధుమాధవరావు గారు జిల్లాలోనే లెక్కలలో ప్రసిద్ధులు .లెక్కలపుస్తకాలు రాశారు . ఆయన తమ్ముడు శ్రీ సి హెచ్  వి రామా రావుగారు ఇంగ్లీష్   లెక్కలలో దిట్ట .మా నాన్న  గారితో  ఉంగుటూరు లోపనిచేసి  తర్వాత  పెనమకూరు హెచ్ ఏంగ కొంతకాలం పని చేసి మళ్ళీ గుడివాడ వైపువెళ్లారు నవ్వుముఖం నాకు బాగా పరిచయం .  బెజవాడ లో హిందూహై స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహారావుగారు కామ న్ ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీగా చేసి టెస్ట్ పరీక్ష పేపర్లు కూడా అమ్మేశారని రుజువైతే మేమ0దరం ఎదురు తిరిగి ఆయన చేతిలోంచి దాన్ని తప్పించి శ్రీ నూకల శ్రీ రామమూర్తిగారు డి యి వోగా ఉన్నప్పుడు ప్రమీలా రాణిగారికి ఇప్పించాం .తేలప్రోలురాజా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రసాదరావుగారు  ఆంగ్ల  బోధనలో ,ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించటం లో  నిష్ణాతులు   వివేకానంద్ స్కూల్ హెడ్ శ్రీ నర్సింహ మూర్తి  గారిది  ఆకర్షణీయ వ్యక్తిత్వం .వానపాముల హెడ్మాస్టర్ సామ్యుల్ గారు భార్య  కూడా   హెడ్స్ .
  పెదముత్తేవి ఓరియంటల్ హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీ కోసూరి ఆదినారాయణ ”చాకు” .హెచ్ ఏం అసోసియేషన్ కు ఆయన్ని నేనే సెక్రెటరీని ప్రమీలారాణిగారిని అధ్యక్షురాలిని చేయటం లో నడుం కట్టాను  ఇద్దరూ దానికి గొప్ప వైభవం తెచ్చారు .శ్రీ మద్దూరి విశ్వం  శ్రీ వై వి రాజు  శ్రీ రమణారావు శ్రీమతి బి సుగుణ కుమారి గార్లు హెడ్ మాష్టార్లుఅయి డెప్యూటీ ఎడ్యుకేషనల్  ఆఫీసర్లు గా పదోన్నతి పొందారు .సుగుణగారి భర్త శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు సైన్స్ బోధనలో ప్రవీణులు అంగలూర్ హెచ్ ఏం అయ్యారు అందులో రాజు గారు నీతి  నిజాయితీకి ఆభరణం . అలాగే వెలగలేరు హెడ్మాస్టర్ శ్రీ ప్రభాకరరావు గారు లెక్కల మేస్టారుగా మంచి పేరు ఉన్నవారు . భార్య కూడా హెడ్ మిస్ట్రెస్ . నా మోపిదేవి శిష్యురాలు బందరు మునిసిపల్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి భారతీ దేవిని  మేంఅంతాకలిసి ప్రమీలా రాణిగారి తర్వాత  హెచ్ ఏం అసోసియేషను ప్రెసిడెంట్ ను  చేశాము . మస్తాన్ రావుగారు మాతోపాటు మోపిదేవిలో లెక్కల మేస్టారుగా పనిచేసి దివితాలూకా హెడ్మాస్టర్ అయ్యారు .స్వ ర్గీయ శ్రీ టి ఎల్ కాంతారావు గారిమామగారు  పెనమకూరు హెడ్మాస్టర్ గా చేస్తూ చనిపోయారు . అక్కడే పని చేసిన శ్రీ వేములపల్లి కృష్ణ మూర్తిగారు లెక్కల టీచర్ గా సుప్రసిద్ధులు భారీపర్సనాలిటీ . ఇక్కడే శ్రీ విల్సన్ గారు చేశారు . తోట్లవల్లూరు హెడ్ మాస్టర్ పేరుజ్ఞాపకం లేదుకానీ సిగరెట్టూ గుప్పిటిలోపెట్టి పొగ పీల్చేవారు  .తమాషాగా ఉండేది . శ్రీ చలపతిరావుగారు కపిలేశ్వరపురం ఎంకన్నవీడు ల్లో హెచ్ ఏం . శ్రీ నర్రా బాబూరావుగారు టీచర్ గా హెడ్ మాస్టర్ గా గుడివాడ చుట్టుప్రక్కల ప్రసిద్ధులు వాళ్ళబ్బాయి ఉయ్యూరులో నా శిష్యుడు తర్వాత   అడ్డాడలో లెక్కలమేస్టర్ .ఇలా ఎందరో మహాను భావులైన ప్రధానోపాధ్యాయులు అందరికి వందనములు  .
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్- షార్లెట్ -అమెరికా           


Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -105 గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1

  నా  దారి తీరు -105

             గెలాక్సీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ -1
అడ్డాడ హై స్కూల్ లో నా సర్వీస్ గురించి చెప్పటానికి ముందు కృష్ణా జిల్లాలో ప్రసిద్ధులైన జాతి రత్నాలవంటి కొందరు ప్రధానోపాధ్యాయుల గురించి తెలియ జేయటం నా  కర్తవ్యమ్  గా  భావిస్తున్నాను . ఇలాంటి వారి జీవితాలపై  రాయమని కృష్ణా జిల్లా సీనియర్ హెడ్మాస్టర్  రాష్ట్ర ప్రధానోపాధ్యా సంఘానికి అధ్యక్షులు మా లాంటి  వారికి మెంటార్  బాలసాహిత్యాన్ని అద్భుతంగా రాసినవారు రేడియో నాటికల ప్రసిద్ధులు ,హెడ్ మాస్టర్స్ కు కరదీపిక రాసినవారు ”సోమంచి రామం ”అని అందరిచే పిలువబడే  శ్రీ సోంచి శ్రీ రామ చంద్ర మూర్తి గారిని చనువుతో చాలా సార్లు అడిగాను .చూద్దాం అన్నారు కానీ జరగలేదు .వీరి తర్వాత ఇన్ని విషయాలూ తెలిసిన వారు  కృష్ణా జిల్లాటీచర్స్ గిల్డ్ కార్య దర్శి అధ్యక్షపదవులలో రాణించిన గన్నవరం సీనియర్  హిందీపండితులు ,అమెరికా ”తానా ”కు అధ్యక్షులుగా పని చేసిన శ్రీ తోటకూర ప్రసాద్ గారి తండ్రి శ్రీ తోటకూర అప్పారాయ వర్మగారినీ అడిగాను చాలా సార్లు ఫోన్ కూడా చేశాను .కదలలేదు .నేను సర్వీస్ లోకి రాకముందు ఎందరెందరో గొప్ప హెడ్ మాస్టార్ల పేరు వినేవాడిని ,నేను పని చేస్తున్నప్పుడూ పని చేసినవారు చాలా మందిఉన్నారు .వీరిలో కొద్దీ మంది గురించి మాత్రమే కొన్ని విషయాలు విన్నాను కొందరిని ప్రత్యక్షంగా ఎరుగుదును . నిజంగా వీరందరి పూర్వా పరాలు నాకు పూర్తిగా తెలియనే  తెలియవు .అయినా వారిని గురించి చెప్పాలనే తాపత్రయం ఉండటం వలన సాహసం చేస్తున్నాను .వారి పేర్లనైనా స్మరించటం ధర్మం అని ప్రయత్నిస్తున్నాను .  ఇందులో తప్పులు ఉండచ్చు .సరైన సమాచారం ఇవ్వలేక పోవచ్చు  పెద్దమనసుతో మన్నిస్తారని కోరుకుంటున్నాను .మీకు తెలిసినవారెవరైనా ఉన్నా నేను మర్చి పోయిన వారున్నా తెలియ జేయండి . ముఖ్యంగా మునిసిపల్ సర్వీస్ లో ఉన్నవారు ప్రయివేట్ స్కూల  హెడ్ మాస్టర్లలో నాకు తెలిసిన వారు వ్రేళ్లమీద లెక్క పెట్టవచ్చునేమో -ఇది  ఆరంభమే అంతం కాదని తెలియ జేస్తున్నాను  .  ముందుగా శ్రీ వెంపటి పురుషోత్తం గారు ప్రధానోపాధ్యాయులుగా ప్రాతస్మరణీయులు .శాసన మండలికి ఉపాధ్యాయ ప్రటిందీహి గ ఎన్నికై విద్యా సేవ చేశారని విన్నాను . ఆ తర్వాత నేను చదివిన ఉయ్యూరు హై స్కూల్ హెడ్ మాస్టర్స్ గురించి చెప్పాలి .నేను 1953 లో 8 వక్లాస్ లోకి ఎంట్రన్స్ పరీక్ష రాసి చేరాను .అప్పుడు హెడ్ మాస్టారు శ్రీ బులుసు గౌరీపతి  శాస్త్రి గారనిజ్ఞాపక0 .కుదమట్టంగా ముతక ఖద్దరు పంచ లాల్చీ  తో ఉండేవారు వెడల్పు ముఖం . చామన ఛాయ  .అసెంబ్లీలో ఏదైనా పిల్లలకు చెప్పాలంటే ”ఓ చిన్న అనౌన్స్ మెంటోయ్ ”అనేవారు అది వారి ఊతపదం నవ్వు కొనేవాళ్ళం .ఆయనతర్వాత శ్రీ ఆచంట సత్యనారాయణ గారు వచ్చారు మా తొమ్మిదోక్లాస్ లో ఆయన ఎర్రగా గ్లాస్కో పంచ లాల్ఛీ తో నెహ్రూగారి చారల అరకోటు  తో గుబురు మీసాలతో హుందాగా ఉండేవారు  ఇంగ్లీష్  లెక్కలలో దిట్ట .కానీ ఒకసారి ”గోంగూర పాట ”క్లాస్ లో ఆయనపాడితే విద్యార్థినులు చెంప పగలకొట్టారని విన్నా .కటకటాల మేష్టారి ఇంట్లో ఉండేవారు . అసలు ఉయ్యూరు స్కూల్ 1951 లో ప్రారంభించినవారు శ్రీ వై  గోపాలరావు అనే హెడ్మాస్టర్ .ఈయన కమ్యూనిస్ట్ అభిమాని .తర్వాత గొడవర్రు హై స్కూల్ లో పని చేసి అక్కడ  క్వేశ్చిన్ పేపర్ల లీకు లో ఇరుక్కునికి సస్పెండయి  బయట పడ్డారు నాకు బాగా పరిచయం వెడల్పు ముఖం తెల్లని పంచె లాల్చీ తో ఉండేవారు లెక్కలు ఇంగిలీషు లో నిధి అంటారు .చివరికి ఉయ్యూరులోనే చనిపోయారు . వాళ్ళబ్బాయికి కంపాష నేట్ గ్రౌండ్స్ పై జిల్లా పరిషత్ లో గుమాస్తా ఉద్యోగమిస్తే చక్రం తిప్పి దున్నిపారేశాడు ”అన్నివిధాలా”   తర్వాత శ్రీ కె వి ఎస్ ఎల్ నరసింహారావుగారు ఈయనఉన్నప్పుడే నేను ఎనిమిదిలో చేరాను ,ఈయన పెంటపాడు వాస్తవ్యులు .ఈ జిల్లాలో స్థిరపడిపోయారు కవి,నటుడు గాయకుడు నాటక రచయిత నాట్యం చేసేవారుకూడా .అందుకని ”నాట్యాచార్య ”అనేవారు . నేను  తర్వాత మారి గౌరీనాధ శాస్త్రిగారు వచ్చారని గుర్తు . ఆయన రాసిన ”పాకీ వాణ్ణం డోయ్  బాబూ పాకీ వాణ్ణండి ”పాట బాగా పాప్యులర్ వార్షికోత్సవానికి దాన్ని వేషం వేయించి పాడించేవారు .వీరితో కలిసి ఇదే స్కూల్లో పని చేసిన అదృష్టం నాది .జూనియర్ కాలేజీ ఆకునూరులో లెక్చరర్ అయి ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు నేనంటే పిచ్చ అభిమానం .ఆయన నడక నాట్యం చేస్తున్నట్లుండేది భారీగా పొడవుగా మంచి మీస కట్టుతో తెల్ల ఖద్దరు పంచ చొక్కాతో ఉండేవారు నవ్వు ముఖమే .ఆయనే తనగురించి తాను ”జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ ”అని చెప్పుకునేవారు  మాకు ఫామిలీ ఫ్రెండ్ కూడా .గొప్ప సాయి భక్తులు ఎన్నో పుస్తకాలు రాశారు .సాహితీయామండలికి సరసభారతి ఆప్తులు . ఆయన్ను సన్మానించిన అదృష్ట వంతుడిని ..వీరి తోడల్లుడుగారు శ్రీ టి .తరుణీ రావు గారు మంచి పేరున్న హెడ్మాస్టర్ .తాడంకి లో పని చేశారు .తర్వాత జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా  రిటైరయ్యారు .మంచి బాడ్  మింటన్ ,వాలీ బాల్  సెంట్రల్  ప్లేయర్  షాట్ దిగకపోతే కోపంతో బాత్ విరగ్గొట్టేవారు అయితే టీమ్ నడిపించటం లో నేర్పరి
  అవనిగడ్డలో గొప్ప హెడ్మాస్టర్లు పనిచేశారు  వారిలో నా స్నేహితుడు పెద్దిభొట్ల ఆదినారాయణ మామగారి అన్నగాఋ శ్రీ ఏడిద సత్యనారాయణ గారికి  మంచిపేరుండేది  . కూన పులి సుబ్రహ్మణ్యం గారు ఇంగువ కృష్ణ మూర్తిగారు రాయసం సుబ్బారావు గారు కామన్   ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరీ శ్రీ టి వి సుబ్బారావు   పెడన హై  స్కూల్ హెడ్ మాస్టర్  చాలాకాలం కామన్ ఎక్సామినేషన్ బోర్డు సెక్రెటరిగా సమర్ధవంతం గా నిర్వహించిన  శ్రీ విష్ణు వర్ధనరావు  సబ్ జెక్ట్ లోనూ పేరున్నవారు లావుగా వెడల్పు ముఖం తో మల్లుపంచె తెల్ల చొక్కాతో ఉండేవారు సీరియస్ ముఖం ఆయనతో మాట్లాడటం అంటే భయం అనేవారు .
  పామర్రులో చాలా కాలం హెచ్ ఏం గా పని చేసిన శ్రీ రావు సాహెబ్ సుబ్బారావు గారికీ పేరుబాగానే ఉంది .రావు సాహెబ్ అనేది బిరుదేమో !ఆయన గురించి ఒకమాట చెప్పుకొనేవారు .గుమాస్తా ఏదైనా సంతకం కోసం వస్తే ”ఎద్దుచ్చా ?మేక  పెంటికా
“?అని అడిగేవారట .ఎద్దుచ్చ అంటే పొడుగు సంతకమా అని మేక పెంటిక అంటే పొట్టి సంతకమా అని భావం ట .అక్కడే చాలాకాలం పని చేసిన శ్రీ ఆరికపూడి పూర్ణ చంద్ర రావు గారు చెవుల నిండా బొచ్చుతో భారీ పర్సనాలిటీ తో ఖద్దరు వస్త్ర ధారణతో ఆకర్షణీయంగా ఉండేవారు . టీచర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ గా చాలాకాలమున్నారు .నేను సర్వీస్ లో చేరిన కొత్తలో . ఆయన ఒంటెత్తు పోకడలు నచ్చక మెజారిటీ టీచర్లు ఆయన్ను వ్యతిరేకించగా గిల్డ్ రెండు గా చీలింది .అప్పుడు శ్రీ తూమాటి కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ అయ్యారు అప్పటికి ఆయన మోపిదేవి హెడ్మాస్టర్ నా సర్వీస్ సైన్స్ మాస్టర్ గా అక్కడే  ప్రారంభం .  .చక్కని పలువరుసతో ఎత్తుగా తగినంత బలంగా ఖద్దరు పంచె ,లాల్చీ  ఉత్తరీయం చేతిలో తాళం చెవుల గుత్తి తో కనిపించేవారు బోళామనిషి క్షణాలమీద కోపం వచ్చేది .నేనంటే మహా అభిమానం .ఒక ఏడాది అక్కడ పని చేసి ఉయ్యూరుకు ప్రయత్నిస్తుంటే తెలిసి ”మా అమ్మాయి ప్రభావతి ఎస్ ఎస్ ఎల్ సి కి వచ్చింది మీ బోధనా నాకు  అమ్మాయికీ ఇష్టం మీరు వెళ్ళటానికి వీల్లేదు మీరు ప్రయత్నం చేసినా ఆపేస్తా .అనటం తో ఆ అభిమానానికి పులకించి ఉండి పోయా . తర్వాతెప్పుడో కాటూరు హెడ్ మాస్టర్ గా అయన ఉన్నప్పుడు నేను మానికొండలో సైన్స్ టీసీగార్ గా ఉండగా నన్ను కాటూరు వేయించుకోవాలని కమిటీ వారికి చెప్పి ,నర్రా వెంకటరత్నం లాంటి వాళ్ళు అడ్డుపడ్డా   నాకోసం మానికొండ వచ్చి అక్కడ లేనని ఉయ్యూరు వచ్చానని తెలిసి ఉయ్యూరు మా ఇంటికి వచ్చి విషయం చెప్పి రిక్వెస్ట్ రాయించుకొని నాలుగు రోజుల్లో ఆర్డర్ తెప్పించిన ఉన్నత వ్యక్తిత్వం .తర్వాత గజిటెడ్ హెడ్ మాన్స్టర్ గా ప్రొమోషన్ పొందారు .అప్పుడూ ఎక్కడ కనిపించినా రిక్షా దిగి పలకరించిన  సంస్కారం ఆయనది . వాళ్ళమ్మాయి అబ్బాయి ఇద్దరూ మోపిదేవిలో నా శిష్యులే . బి పి  ఉన్నట్లుగా ప్రవర్తించేవారు క్షణిక కోపం . యిట్టె చల్లారేది . తర్వాత చనిపోయారు   ఈయన బంధువే తూమాటి  వెంకటరామయ్య  నల్లగా తెల్ల పంచ చొక్కాతో ముదునూరు,ఘంటసాలలో హెడ్ గా పని చేసిన  వారుండేవారు . లెక్కలు ఇంగ్లీష్ లలో దిట్ట ఎన్నో సెమినార్లలో కలిసేవార0 .సబ్ జెక్ట్లపై అధారిటీ .పెద్దమనిషిగా మంచిపేరు .
   శ్రీ మోచర్ల పూర్ణ చంద్ర రావు పామర్రులో ,నున్నలో చేశారు భారీ పర్సనాలిటీ .తెల్ల ఖద్దరు పంచ లాల్చీ  స్ఫోటకమాచల ముఖం తో   ఉత్తరీయం తో చాలా హుందా గా ఉండేవారు .వీరిదగ్గర పామర్రులో పని చేశాను .మంచి వాలీబాల్  బాడ్  మింటన్       ప్లేయర్ .పంచె మోకాళ్ల    పైకి ఎగకట్టి ఆడేవారు .సరదాగా మాట్లాడేవారు క్రమశిక్షణ బాగా పాటించేవారు .రోజూ బంద రు నుంచే వచ్చినా ఏనాడు లేటుగా వచ్చేవారుకాదు  పామర్రులో పనిచేసిన మరో ప్రసిద్ధ హెడ్ మాస్టర్ శ్రీ వేమూరి రామ కృష్ణయ్యగారు . ఎర్రగా  అంచుప0చ  తెల్ల చొక్కా ఉత్తరీయం తో నవ్వు ముఖం తో ఉండేవారు మహా సహన శీలి . కాశీనాధుని నాగేశ్వరరావు గారి ఎలకుర్రు వాస్తవ్యులు గొప్ప స్థితిపరులు .వారబ్బాయి హర్ష నా దగ్గర పామర్రులో టెన్త్ చదివాడు . వీరికి కోపం అంటే ఏమిటో తెలీదు .ఎవ్వరికీ అపకారం తలపెట్టేవారుకాదు . ఇంగ్లీష్     లో నిధి .స్టాఫ్ మీటింగ్  లు గంటలకు గంటలు పెట్టేవారు .విసుగ్గా ఉండేది ఆయనకు తెలియని విషయం లేదు .పి  శ్రీరామ  మూర్తిగారి అభిమాని కానీ మిగతావారిలా బయట పడేవారుకాదు .ఆయన వ్యక్తిత్వానికి అందరూ జోహారు పలికేవారు . తరవాత ఉయ్యూరు హెడ్ మాస్టర్ గా కూడా పని చేశారు అప్పుడు మా పెద్దబ్బాయి శాస్త్రి టెన్త్ చదివాడు . ధర్మ రాజు అనేవారు రామకృష్ణయ్యగారిని . పామర్రులో పని చేసిన మరో హెడ్మాస్టారు శ్రీ హయగ్రీవంగారు .సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ .రూల్స్ బాగా తెలిసినవారు లౌక్యులు .తెల్లపంచె చొక్కాతో నిండు కుండలాఉండేవారు బెజవాడ కాపురం . ఒకటి రెండుసార్లు నాకోసం ఉయ్యూరువస్తే ఆయనకు గారెలు ఇస్తామని చెబితే మా ఆవిడ వండింది ఇష్టంగా తిన్నారు అందుకని ఆవిడ ”గారెలమాస్టారు ”అనేది
  శ్రీ ఇంగువ కృష్ణ మూర్తి గారు ,శ్రీ పి  .సీతారామ శర్మగారు అంటే నా మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి బావగారు మల్లుపఞ్చ కొక్కాతో ఉండేవారు గొప్ప ఇంగ్లీష్    టీచర్ గా పేరు బందరులో ఉండేవారు  శ్రీ పచ్చళ్ళ శర్మ అనే వారు ఇద్దరు హెడ్ మాస్టర్లు ఉండేవారు ఆరుగొలను ,లో పని చేసిన జ్ఞాపకం .
  మొవ్వ కు చెందిన శ్రీ మొవ్వ వెంకట కృష్ణా రావు గారు ఎప్పుడు ముతక  ఖద్దరు  పంచ లాల్ఛీ ఉత్తరీయంతో ఉండేవారు .దేవుడుమేస్టారు  అనేవారు . నేను మోపిదేవిలో పని చేస్తున్న కొత్తలో ఒక సారి ఆయనమిత్రులైన మా హెడ్మాస్టారు తూమాటి వారిని కలవటానికి వచ్చారు .మా హెచ్ ఏం నా గురించి నా ఎదుటే ఆయనకు చాలామంచిగా పొగుడుతూ చెప్పారు .ఆయన ”కోటేశ్వర రావు ! ఇది పాలపొంగు కొత్త కదా .మొదట్లో బానే పని చేసినట్టే కనిపిస్తారు .తర్వాత ఆపొంగు ఉండదు ”అన్నారు ఏమాత్రం సంకోచం లేకుండా .వెంటనే కోటేశ్వరరావు ”ఇదుగో చెబుతున్నాను చూడు .మా ప్రసాద్ గారు జీవితాంతం ఇదే నిబద్ధతతతో పని చేస్తారని గ్యారంటీ ”అన్నారు నాకు ఆశ్చర్య మేసింది నేను చేరి రెండు నెలలు కూడా దాటి ఉండదు ఇంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలిగారు అని ఆశ్చర్య పోయా .కానీ అదే నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది .కొద్దో గొప్పో పేరు తెచ్చుకున్నానంటే ఇదే కారణం .
  మోపిదేవిలో నేను చేరేసరికి సోషల్ మేష్టారు శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారు పెదప్రోలు వాసి మంచి ఆస్తిపరులు .తర్వాత కొన్ని నెలలకే ప్రమోషన్ వచ్చి హెడ్ మాస్టారై  వెళ్లిపోయారు   .కానీ కుటుంబం అక్కడే ఉంది ఆతిధ్యానికి పెద్దపేరు నన్ను లెక్కల మేష్టారు శ్రీ జమ్మలమడక రమణారావుగారినీ వారం రోజులు వారింట పెళ్లి భోజనాలవంటి సకల మర్యాదలతో మాకు ఆతిధ్యమిచ్చారు గొప్ప సంస్కారి .నలగని తెల్లని మిల్లు పంచె చొక్కా తో ,పై పంచె తో ఎర్రగా కుది మట్టంగా  ఉండేవారు చతురోక్తులతో అలరించేవారు  .తర్వాత పడమట హెడ్ మాస్టారై  మా అందరి అభ్యర్ధనతో గిల్డ్ ప్రెసిడెంట్ అయి జిల్లాలోనే ఆదర్శ హెడ్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు . ఆయన చెల్లెలు తమ్ముడు మోపిదేవిలో నా శిష్యులు . పెదప్రోలు వారే శ్రీ పింగళి ఆంజనేయులు గారు  ఇక్కడినుంచే హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ తో వెళ్లారు .అలాగే లెక్కలమేస్టారు బదిలీయై అవనిగడ్డకు వెళ్లిన  శ్రీ నరసింహ మూర్తిగారికి మంచి టీచర్ గా  పేరు తర్వాత హెడ్ మాష్టర్ అయ్యారు చామన చాయగా పంచ చొక్కాతో నవ్వు ముఖం తో ఉండేవారు రెండేళ్ల క్రితం మోపిదేవి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం లో వారిని చూశాను . పెదప్రోలువాసే వేమూరి  మార్కం డేయులు గారు .ముతక ఖద్దరుపంచె చొక్కాలో ఎర్రగా ఉండేవారు .నూజివీడు హై  స్కూల్ హెడ్ గా రిటరయ్యారు .ఈజీ  గోయింగ్ అనేవారు .గుర్రప్పందాల పిచ్చ ఎక్కువని చెప్పుకొనేవారు .ఉయ్యూరు కాపురం వాళ్ళబ్బాయిలు అమరనాధ్ ,అమ్మాయిలూ మాకు బాగా పరిచయం .మరికొందరి గురించి తర్వాత .
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి -43

మల్లినాథుని రఘువీర చరితం
  5 వసర్గలో శ్రీరాముని వీర విక్రమపరాక్రమ0 తో రాక్షస  సంహార గాథ   వర్ణన చేశాడు మల్లినాథుడు . రాక్షసులు మెరుపులమధ్య నల్లమబ్బుల్లాగా కనిపించారు .ఖర రాక్షస సమూహంతో రాముని భీకర పోరాటం గొప్పగా వర్ణించాడు .రాముని బాణాలకు రాక్షసులు రక్తం కారకుండా చచ్చారని సూరి రాశాడు . వాళ్ళశరీరం లో బాణం దూసుకు పోవటం ,బయటికి రావటం  ఒకే సారి జరిగిపోయాయట .  .రామబాణాలు యమ దూతలు అనిపించాయట . కొందరు రాక్షసుల తలకాయలు కాళ్ళు ,అరచేతులు అడ్రస్ దొరకలేదట .త్రిశురలనూ అదే పరాక్రమంతో రాముడు సంహరించాడు రావణుడు స్వయంగావచ్చి చూసి తనబలగానికి జరిగిన నష్టం తెలుసుకొన్నడ్డు మారీచుడిని ఒకడినే రావణుడు నమ్మాడట . రాముడు అప్పటికే ఈ రాక్ష దళనాయకులను చంపేశాడు . దేవతలు ,మునులు రాముని వీరత్వాన్ని బహుధా పొగిడారు .శూర్పణఖ శత్రువులను చూసి భయపడక వారి సంహారం ఆలోచించమని చెప్పింది .రావణుడినే బంగారు లేడి రూపం లో సీత మనసును  ఆకర్షించమని  ఏదో మిషకల్పించి రామ సోదరులను సీతకు దూరం చేస్తే పని సులువౌతుందని హితవు చెప్పింది  .ఈ పన్నాగాన్ని మారీచుడు  హర్షించలేదు  శీలవతి,రామపత్ని  సీతను అపహరించటం వినాశనమని చెప్పాడు.రావణుడు లోక రావణుడు కనుక వాడి మాట పెడ  చెవిని బెట్టి తాను  చెప్పినట్లు చేయాల్సిందేనని బెదిరించాడు ..అప్పుడు మారీచుడు బంగారు మచ్చల మాయలేడి వేషం ధరించి సాయంకాంతిలో ధగధగ మెరిసిపోతూ కనిపించి చూసేవారికెవరికైనా పరవశం కలిగేట్లున్నాడు .మాయలేడి వర్ణన మల్లినాథుడు 10 శ్లోకాలలో రమణీయంగా వర్ణించాడు ..లేడిని చూసిన సీత వ్యామోహం తో దాన్నితీసుకురమ్మన గానే  పట్టటానికి వెంటనే  వెళ్ళాడు .మధ్యలో  ఒక బాణాన్ని దానిపై సంధించాడు . ఆదెబ్బకు గిలగిలా తన్నుకుంటూ అది ”హా సీతా హా లక్ష్మణా ”అని మగగొంతుకతో మాయగా అరిచింది .అది రాక్షసమాయని లక్ష్మణుడికి తెలిసి ఆమె కు చెప్పినా నమ్మక తనభర్త రాముడు ప్రమాదం లో ఉన్నాడనుకొని నమ్మి అతనిని  సహాయంగా వెళ్ళమని బలవంత పెట్టింది .ఎంతకూ కదలకపోతే చాలా నీచంగా మాట్లాడింది .–”నాహం వయస్య మిహిరవ్యపాతోదినాశ్రియహ్ పావక మావి శ0త్యాహ”   ఇక ఆగలేక అతడు వెళ్ళగానే రావణుడు వచ్చి సీతను బలవంతంగా ఎత్తుకుపోయాడు  .దారిలో జటాయువు రావణ బారినుండి సీతను రక్షించే ప్రయత్నం చేశాడుకాని విఫలుడయ్యాడు   .సీత దుఃఖం తో విలపిస్తుంటే ప్రపంచమంతా దుఃఖం తో శోకం తో కన్నీళ్లతో విలపించింది అన్నాడు మల్లినాథుడు ..
  7 వ  సర్గ  లో  రామ లక్ష్మణుల దిగులు విచారం వర్ణితం  .సీతాపహరం తో రాముని వియోగ వేదన వర్ణనాతీతమై ఆమె స్మృతులను నెమరేసుకొంటూ తిరిగాడు తమ్ముడితో . .సీతా వియోగాన్ని భరించలేకఆమె ప్రతి లతా చెట్టు  పక్షి ,నెమలితో స్నేహంగా మెలిగిన దృశ్యాలను జ్ఞాపకం చేసుకొంటూ మరింత కుమిలి పోయాడు  ”అభిసంగ విహ్వలుడనైననన్ను ఎడబాసి ఉండవద్దన్నాడు మరింత గా మానసికంగా కుంగి  స్వీయనిందను  మోపుకొంటూ సీతను క్షమించమని రెండు చేతులూ ఎత్తి  నమస్కరించి ప్రార్ధించాడు రాముడు అని రాశాడు మల్లినాథుడు ..దుఃఖం లో మునిగి వివేకం కోల్పోవద్దని  లక్ష్మణుడు అన్నతో అన్నాడు . సీతాన్వేషణలో సోదరులిద్దరూ దండకారణ్యం లో అడుగడుగు వెతుకుతుకు ముందుకు వెళ్లగా అవసాన దశలో ఉన్న జటాయువు కన్పించి రావణుని సీతాపహరణాన్ని వివరించాడు .
  క్రమంగా రాముని మానసిక స్థితి మారి ఆగ్రహం తో రగిలిపోయాడు .రావణుడు సీతను ఎత్తుకు పోయి ఇంకా వాడు బతికి ఉండటం  చూసి తన విల్లు ఏమీ చేయలేక అవమానం తో వంగిపోయింది అనుకొన్నాడని మల్లినాథుని రాసిన శ్లోకం మెచ్చదగింది .భావ లోలత్వానికి గురికావద్దని తమ్ముడు చెబుతూనే ఉన్నాడు మానవ జీవితం లో సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి నిబ్బరంగా ఉండాలి .వివేకమున్నవాడు బాధపడడు  కర్తవ్యమ్ ఆలోచిస్తాడు .దైవ నిర్ణయాన్ని  శిరసా  వహించమని , విధికి ఎవరైనా తలవంచాల్సిందేనని ధైర్యం చెప్పాడు ..సీత కాలి  ఆభరణమైన కడియాలు కనిపించగానే మళ్ళీ గొల్లుమన్నాడు.  జ్ఞాపకాలలో కూరుకు పోయాడు . మళ్ళీ తమ్ముడు అన్నకు దుఃఖం కానీ సుఖం కానీ శాశ్వతం కాదు అని ”తలంటాల్సి ”వచ్చింది .
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -104 మేడూరు నుండి అద్దాడకు బదిలీ

నా దారి తీరు -104

మేడూరు నుండి అద్దాడకు బదిలీ
 మేడూరు వదలాలననే కోరికకు మరో బలమైన కారణం ఒకటి ఉంది ఇది నూజి వీడు  డివిజన్ పరిధిలో ఉంది .కానీ డివిజన్ లో ఎక్కడా భాష సైన్స్ విషయాలలో అభి వృద్ధి  స్కూల్  కాంప్లెక్స్  ఓరియెంటేషన్ మొదలైనవి ఎక్కడా జరగలేదు .ఒక్కసారి మాత్రం బాలానందం మేష్టారు అని పిలువబడే డా ముసునూరు వెంకటేశ్వరరావు అనే హెడ్మాష్టర్ ఇంగిలీషు లెక్చరర్ ,ప్రిన్సిపాల్ గారి మేనల్లుడు శ్రీ విష్ణుదాసు గారు తాడంకి హై స్కూల్  లో  ఇంగ్లీష్   టీచింగ్ పై ట్రెయినింగ్ క్లాస్ నిర్వహించారు ఆయనతో అదే మొదటి పరిచయం తరువాత ఆయన నూజివీడు స్కూల్ లో సోషల్ మే స్టర్ అవటం మంచి బాడ్ మింటన్ ,వాలీ బాల్  ప్లేయర్ అవటం తో గ్రిగ్ స్పోర్ట్స్ లో కలిసేవాళ్ళం .
  కానీ  గుడివాడ డివిజన్ లో శ్రీమతి ఇందీవరం గారనే ఆమె ఉపవిద్యా శాఖాధికారి గా చాలా మంచి పనులు చేస్తున్నారని ,ఎన్నో విషయాలలో ఆ డివిజన్ ను ముందుకు తీసుకు వెడుతున్నారని    సృజనకు మంచి ప్రోత్సాహమిస్తున్నారని తరచూ ఉపాధ్యాయులతో హెడ్ మాస్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దుతున్నారని హెడ్మాస్టర్స్ కాన్ఫరెన్స్ లోను ,స్పాట్ వాల్యూ యేషన్    లోను తోటి హెడ్మాస్టర్లు టీచర్స్ చెప్పగా వినేవాడిని అందుకని యాక్టివిటీ ఎక్కువగా ఉండే ఆ డివిజన్ లో ఉయ్యూరుకు దగ్గర స్కూల్ కు  వెడితే బాగుంటుంది అనిపించింది .
  జులైనెలలో నూజివీడు డివిజన్ ఉపవిద్యాశాఖాధికారి గా ఎవరో కొత్త ఆవిడ వచ్చిందని ,ఆవిడ అదేనెలలో మేడూరు స్కూల్ ఇన్స్పెక్షన్ కు రావాలని అనుకొంటున్నారని తెలిసింది .ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ జరిగి రెండేళ్లు దాటింది .కనుక స్టాఫ్ ను సమావేశ పరచి ఇన్స్పెక్షన్ కు సిద్ధమౌదామా అని అడిగాను . ఎకాడమిక్ ఇయర్ ప్రారంభమే కనుక త్వరగా అయిపోతే అందరికీ మంచిదని అనుకున్నాం .అయిన ఖర్చు అంతా టీచర్ల జీతాల ఆధారంగా లెక్కవేసి కట్టుకోవాలని నిర్ణయించాం  లెసన్ ప్లాన చార్టులు మోడళ్ళు  అలంకరణ  వగైరాలతో సిద్ధమవమని చెప్పి గుమాస్తా శ0 కరరావు ను నూజివీడు పంపించి ఆవిడతో మా స్కూల్ స్పెక్షన్ కు సిద్ధమేనని చెప్పించాను .ఆవిడా సంతోషంగా ఒప్పుకుని షెడ్యూల్   పంపారు .డేట్స్ జ్ఞాపకం లేవు కానీ రెండు రోజుల ఇన్స్పెక్షన్ . దీనికి చుట్టు  ప్రక్కల హై స్కూల్స్ నుంచి  సబ్జెక్ట్  ఎక్సపర్ట్ లనూ వ్రాతపూర్వకం గా పిలిపించాం .స్కూల్ రికార్డ్ లన్నీ పకడ్బందీ చేయించా .సైన్స్ లో గేమ్స్ లో పనికి రాని  ఆర్టికల్స్ ను తీసెయ్యటానికి రైటాఫ్ లిస్ట్ లు తయారు  చేయించాను   వీటిని డి వై యి ఓ అంగీకరించి సర్టిఫై చేస్తేనే తొలగించాలి ఒక్కోటి మూడు కాయీలు తయారు చేయాలి
   మొదటి రాజు ఇన్స్పెక్షన్  కు ఆమె గుమాస్తా  తో సహా నూజి వీడు నుండివచ్చారు .రాగానే ఫార్మాలిటీ ప్రకారం కాఫీ టిఫిన్ ఆమెకూ గుమాస్తాకు పానెల్ మెంబర్లకు ఏర్పాటు చేయించాం అందరూ సంతృప్తిగా తిని మొదలు పెట్టారు కొబ్బరి చెట్లున్నాయికనుక ఆరగా ఆరగా కొబ్బరి బొండాలు కొట్టించితాగ్గించాం ..మధ్యాహ్న భోజనాలూ శుస్టుగా నే ఏర్పాటు చేయించాం కడుపు నిండా తిన్నారు .ఆ సగం క్లాసుల ఇన్స్పెక్షన్ అయింది . డ్రిల్లు  తో సహా అన్నీ చూశారామె .రికార్డ్ లన్నీ గుమాస్తా చూశాడు .ఆతను సరే నంటే ఆమె ఫైనల్ సంతకం పెడతారు .లాగ్ బుక్ విజిటర్స్ బుక్ అకౌంట్ బుక్స్ అన్నీ చూసి రామమోహనరావు గారి విగ్రహ ప్రతిష్టాపనకు మురిసిపోయారామె .సాయంత్రం మళ్ళీ నూజి వీడు వెళ్లినట్లు గుర్తు .
  రెండవ రోజు న మిగిలిన క్లాసులు సబ్ జెక్ట్ లు చూడటం పూర్తి అయింది మర్యాదలన్నీ మామూలే  .ఆమె పేరు గుర్తులేదుకాని కొంచెం నల్లగా పట్టు చీరెలో కుదిమట్టంగా చిరునవ్వుతో ఉన్నారు క్రిస్టియన్ .పేరు మనపేరు లానే ఉన్నగుర్తు .
  రెండవ రోజు పని పూర్తి అవగానే సాయంత్రం  స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేశాను ఆమె సమక్షం లో .ముందుగా పానెల్ మెంబర్లు తాము టీచర్స్ విషయం లో సబ్ జెక్ట్ బోధనా విషయం లో గమనించిన విషయాలు చెప్పారు సూచనలు ఉంటె సూచించారు .చివరికి డెప్యూటీ ఎడ్యుకేషనల్  ఆఫీసర్ అయిన ఆమె మాట్లాడుతూ స్కూల్ అన్ని విధాలా అభి వృద్ధిలో ఉందని ఇన్నిరకాల ఈవెంట్స్ తానూ పని చేసివచ్చిన ఏలూరు లోకూడా చూడలేదని హెడ్ మాస్టారు చాలా విషయాలలో ముందుండి సహచరులను నడిపిస్తున్నారని ,స్టాఫ్ సహకారం అత్యద్భుతమని ,అకౌంట్స్ చాలా పెర్ ఫెక్ట్ గా ఉన్నాయని  హెడ్ మాస్టారి కృషికి జిల్లావ్యాప్తంగా గుర్తింపు వచ్చేట్లు చేస్తానని ,ఇంత మంచి స్కూల్ ను విజిట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఇక ఎక్కడికి వెళ్లినా మేడూరు హై స్కూల్ ను మోడల్ గ పెట్టుకొని హెడ్ మాస్టర్లకు టీచర్లకు చెబుతానని మహా ఆనందంగా తెలిపారు చప్పట్లు మోగించారు అందరూ  ఆవిడకు శాలువా ఒక జ్ఞాపిక స్కూల్ తరఫున బహూకరించిన జ్ఞాపకం . గుమాస్తా మామూలు మామూలే . రెండురోజుల్లో ఏడాదిభారం ఒక్క సారిగా తీరి పోయినందుకు అందరూ రిలీఫ్ పొందాం .
  పామర్రులో నాతోపాటు సైన్స్ అసిస్టెంట్ గా పని చేసి కాటూరు హెడ్ మాస్టర్ గ ఉన్న పామర్రు నేటివ్ శ్రీ నందిపాటి  .వీరారెడ్డి గారు ఉయ్యూరు దగ్గర కాటూరు హెచ్ ఏం గా ఉన్నారు .అయన రోజూ పామఱ్ఱునుంచి ఉయ్యూరువచ్చి,మళ్ళీ అక్కడినుంచి బస్ లో కాటూరువెళ్ళాలి .కలిసినప్పుడల్లా కష్టంగా ఉందనే వారు .మంచి హాస్యప్రియత్వం తో ఎప్పుడూ నోట్లో క్రేన్ వక్కపొడితో ఉండేవారు .ఆయనతో మాట్లాడటం సరదా గా ఉండేది నాకు సీనియర్ . ఆయన అడ్డాడ ,అడ్డాడలో పనిచేస్తున్న వీర0 కిలాకు నేటివ్ రామారావుగారు  నేనూ ముగ్గురం ట్రయాంగిల్ లింక్ తో రిక్వెస్ట్ పెట్టుకొని  ట్రాన్స్ఫర్ అవుదామని ఒక సారి ఆలోచన వచ్చింది .అప్పటికి రెడ్డిగారికి రెండేళ్లు మాత్రమే ఉంది రిటైర్ అవటానికి .కనుక ఆయన ఈలోగా బదిలీ ఎందుకు  కాటూరులోనే హాయిగా రిటైరవుతాన్న అభి ప్రాయం చెప్పారు .కనుక ఇక కుదరదు అనుకొన్నాను .    ఆగస్టు మొదటివారం లో ఒక ఆదివారం రోజు ఉదయమే రామారావు గారు మాఇంటికి వచ్చి మేమిద్దరం మ్యూచువల్ పెట్టుకొని తాను  మేడూరుకు  నేను అద్దాడకూ బదిలీ అవుదాం ఇష్టమేనా అని అడిగారు .వెదక బోయిన తీగ కాలికే తగిలినట్లయింది .అంతే ఇక ఆలోచించకుండా సరేనని ,బదిలీ అయ్యేదాకా ఎవరికీ తెలియరాదని అత్యంత సీక్రెసీ మెయింటేన్ చేయాలని  ఈ బదిలీ నేనేమీ ప్రయత్నం చేయనని ఎవరినీ కలవనని రూపాయి కూడా చేతి చమురు వదిలించుకోనని  అన్నీ ఆయనే చేయించి ఆర్డర్ తెస్తే ఓకే అనీ చెప్పాను .అన్ని హామీలు అయ్యాక రిక్వెస్ట్ మ్యూచువల్ లెటర్ ఇచ్చాను . మేడూరు వచ్చి ఏడాదిపైన మూడు నెలలే అయింది మళ్ళీ నన్ను మార్చరుఅని లోపల ఉంది .కానీ కొ0డకు వెంట్రకకట్టాం కదా  .అయితే మంచిది అవకపోయినా మంచిదే .
  రామారావు కు జిల్లాపరిషత్ లో పలుకుబడి ఉపయోగించి మా ఇద్దరి మ్యూచువల్ ట్రాన్స్ ఫార్ ఆర్డర్ వారం రోజుల్లో వచ్చేట్లు చేశాడు . ఈ వార్త తెలిసి స్కూల్ స్టాఫ్ గగ్గోలు పెట్టింది . అంతాబాగానే ఉందిగా ఇన్ని మంచి పనులు చేసి అందరిచేతా ప్రశ0సలు పొంది ఇప్పుడు ఎవరికీ కనీసం రామమోహనరావుగారి అబ్బాయికి గారికి కూడా చెప్పకుండా వెళ్లి పోవటం ఏమిటి అన్నారు .సర్పంచ్ గారికి రామారావు గారు రావటం ఇష్టం లేదు .మీరుఊ  అంటే  నిమిషాలమీద ఆర్డర్ కాన్సిల్ చేయిస్తారు అన్నారు . ఆయన వచ్చి ఆ మాటే అన్నారు. నేను శాంతంగా ”రామారావు మేడూరుకు దగ్గర వాడు .మీ అందరికి పరిచర్యమున్నవాడు . అడ్డాడలో  ఐదారేళ్లు  పనిచేసి రోజూ  ప్రయాణం చేయలేక నన్ను అడిగితె నాకు మేడూరైనా అడ్డాడ అయినా ఒక్కటేకదా ఆయనకు కొంత ఉపశమనం కదా అని ఒప్పుకున్నాను” అని తప్పుకున్నాను . ఆర్డర్ వచ్చిన మర్నాడు సాయంత్రమే వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు .అందరూ ఆధారంగా మాట్లాడారు నా గురించి . ఇక గుడ్ బై చెప్పి వచ్చేశాను . ఇది ఆగస్టు 13 వ తేదీ అనిగుర్తు . జాయింగ్ టైం రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కు ఉండదు  .కనుక వెంటనే  అడ్డాడ లో మర్నాడు  ఉదయమే చేరాలి . సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మా ఇంట్లో కూడా ఎవరికీ తెలియదు .  పామర్రులో సైన్స్  మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలకు అద్దాడకు ఇన్విజిలేటర్ గా వెళ్లాను .శ్రీ మిక్కిలి నేని వెంకటేశ్వరరావు గారు హెడ్ మాస్టారు .మంచి బిల్డింగులు లాబ్ ,ఆటస్థలం చిన్న స్కూలు . అంతకు మించి నాకు దాని గురించి తెలీదు .హెడ్మాస్టారు చాలా క్రమశిక్షణతో పరీక్షలు నిర్వహించటం బాగా గుర్తు .స్టాఫ్ ఎవరెవరున్నారో  కూడా తెలీదు .అలాంటి స్కూల్ లో చేరబోతున్నానన్నమాట . .ఏమైతే నేమి గుడివాడ డివిజన్ స్కూల్ లో పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది    ఇది నా రెండవ మ్యూచువల్ ట్రాన్స్ ఫర్  .ఒకసారి అనుకోకుండా ఉయ్యూరునుంచి గన్నవరం హై స్కూల్ కు దసరా సెలవల్లో మార్చారు .మాంచి వరదల భీభత్సం .బుడమేరుపొంగి బస్సులు నడవటం లేదు .  బెజవాడ వెళ్లి అక్కడినుంచి గన్నవరం వెళ్లి జాయినయ్యాను .ఒకవారం పని చేశాక నాకు ముందుపనిచేసిన కృష్ణ పామర్రు వెళ్లి ఉండలేక రిక్వెస్ట్ మ్యూచువల్ అడిగితె ఇచ్చా నేను పామర్రుకు ఆత ను గన్నవరానికి వెళ్లాం .అప్పుడూ ప్రయత్నమంతా కృష్ణదే .  దసరా సెలవల తర్వాత గట్టిగా పది రోజులు కూడా గన్నవరం లో పని చేయకుండానే నాకిష్టమైన పామర్రు వచ్చాను .     

             సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -42

 మల్లినాథుని స్వీయ రచనలు -1

మహా వ్యాఖ్యాన కర్త ఒక్కోసారి మహాకవిగా మారిపోతుండటం అరుదైన విషయమని పిస్తుంది . -వైశ్య వంశ సుధాకరం 2-రఘువీర చరిత0 3-ఉదార కావ్యం 4-భక్తి రహస్యం 5-నక్షత్ర పాతా ధ్యాయం  అనే అయిదు మల్లినాథ సూరి రచనలు లోకం లో ప్రసిద్ధి చెందాయి . కనుక విమర్శనా విశ్లేషణ వ్యాఖ్యానాలతో అగ్రభాగాన ఉన్న మల్లినాథుడు కవిగా కూడా సమున్నత స్థానం లో ఉన్నాడని తెలుస్తుంది ఈ ఐదింటిలో మొదటి రెండు మాత్రమే లభ్యమౌతున్నాయి .ఈ రెండిటిపై  సంక్షిప్తంగా విశేషాలు తెలుసుకొందాం

     వైశ్య వంశ సుధాకరం
కాంచీపురం లో వైశ్యులకు  , వ్యాపారులకు మధ్య జరిగిన వివాదం  పరిష్కరించటానికి తన తీర్పుగా మల్లినాథ సూరి ఈ కావ్యం రాశాడు .ఈ వివాదం 1426 లో రెండవ ప్రౌఢ దేవరాయలు రాజ్య పాలన చేస్తున్న సమయం లో వచ్చింది . రాజు మల్లినాథుని ఈ సమస్యను పరిష్కరించమని కోరగా మల్లినాథుడు ఈకావ్యం రాసి తీర్పు ప్రకటించాడు కనుక మల్లినాధునికాలం దీని ఆధారంగా 1430 గా భావించారు .దురదృష్టవశాత్తు ఈ కావ్యం మొత్తంలో అతి కొద్దిభాగమే వ్రాత ప్రతిగా లభ్యమైంది .అది సరళ సంస్కృత వచనం లో తెలుగు వచనం కోవలో  రాయబడిఉంది  .”చాతుర్వర్ణ నిర్ణయా నామ దశమోధ్యాయహ్ ” అందులోని ముఖ్య సారాంశాన్ని తెలుసుకొందాం .
  ఇందులో మల్లినాథుడు వైశ్య శబ్దానికి పర్యాయపదాలు చెప్పాడు అవి నాగర ,ఉరుజ ,త్రీయ ,కోమటి . ఆయన ఉద్దేశ్యం ప్రకారం వాణి ,కోమటి వాళ్ళు వర్ణ సంక్రమణం వలన పుట్టినవారు .కనుక వాళ్ళు అన్ని నగర పట్టణాలలో వస్తువులను అమ్మటానికి అర్హత ,హక్కు కలవాళ్ళు  అమరకోశం నుంచి కొన్ని ప్రకారణాలను ఉదహరిస్తూ నాలుగు వర్ణాలవారి స్వాభావ లక్షణాలను తెలిపాడు .వైశ్య అనే పద శబ్దోత్పత్తిప్రకారం వైజాతి అంటే ద్విజాతి ,అని అర్ధం చెప్పాడు –”అత  ఏవ విజాతిత్వా స్థాపనాత్ అమరసింహా క్తా వివర్ణత్వ స్థాపనం చ ఉపపద్యతా ఏవ -తదాచ శాసనోక్త విజాతీయ శుద్ధ కన్యాయాం జనితోభయ జాతి వంశ్యహ్ వైశ్యోక్తం  విజాతీయహ్ -అమర సింహోక్త వివరణా పృథగ్ జానో వైజాతిరితిసిద్ధం ” (వైశ్య వర్ణస్య సుధాకరహ్ )   కోమటి వారు రెండు వర్ణాల సాంకర్యం వలన పుట్టారుకనుక ద్విజాతి అని పిలువబడ్డారని అందుకే వారిలో  భేదం ఏర్పడిందని చెప్పాడు.  కనుక వైజాతిఅనేది  వైశ్యాతి అయిందని అమరసింహుని అభిప్రాయం అన్నాడు –  ”ద్వై గాతి రితి జాతిద్వయ సాంకర్య  సంభవేన వైజాతి కోమటీనాం  వంశ వైశ్యోక్త  విజాతీయత్వ స్థాపనం శాసనోక్త భేదగలం స్థాపన ”
  వైశ్య ,నాగర ,వణిక,పదాలమధ్య  ఉన్న అర్ధం లో ఏకత్వాన్ని అమరకోశంలోని అనేక ప్రకారణాల నాధారంగా మల్లినాథుడు సాధించి  చెప్పాడు . మరొక విషయమూ తెలియ జేశాడు .సూటిగా చూడబడిన వస్తువు యొక్క జ్ఞాపకం, దాన్ని పరోక్షంగా జ్ఞాపకమని చెప్పినదానికంటే బలవత్తరమైనది అనే సిద్ధాంతాన్ని చాలా చక్కగా ఉపయోగించాడు  -”అనుమితి స్మృత్యపేక్షయా ప్రత్యక్ష క  స్మ్రుతి కృతే ప్రాబల్యమితి  న్యాయ సిద్ధం ”. మల్లినాథుని ఈ రచనలో సంస్కృతం తోబాటు  కొన్నిఅంటే 11,12,13 లతో బాటు 14 మొదటిభాగం  తెలుగు ప్రకారణాలుగా  కూడా ఉండటం విశేషం .మనుస్మృతి ,పద్మపురాణం  భాగవతం ,ధర్మపాల చరితం మరికొన్ని స్మృతులనుండి తన భావ స్థాపనకు బలంగా అవసరమైనవాటిని ఉటంకించాడు సూరి .
              రఘువీర చరిత మహాకావ్యం
రఘువీర చరితం అనే మహాకావ్యం రాసి మల్లినాథుడు తాను  వ్యాఖ్యాన చక్రవర్తిని మాత్రమేకాదు మహా కవిని అని రుజువు చేసుకొన్నాడు .సంస్కృత మహా కావ్యానికి ఉండవలసిన సర్వ లక్షణాలతో దీన్ని నిర్మించాడు .దీనికి మూలాధారం వాల్మీకి రామాయణమే ..ఈకావ్యం శ్రీరాముడుతండ్రికిచ్చిన మాటపై వనవాసం కోసం  దండకారణ్యం ప్రవేశించటం తో ప్రారంభమౌతుంది ..శ్రీరామ పట్టాభిషేకం తో పరిసమాప్త మౌతుంది .చివరలోపట్టాభిషేకానికి హాజరైన వారందరూ శ్రీరాముని నుండి వీడ్కోలు పొంది వెళ్ళటం ఉంది . ఈ కావ్యం 7 సర్గల కావ్యం ..మొత్తం 1 ,4,62 శ్లోకాలున్నాయి .మొదటి సర్గలో చల్లని మలయమారుతం వర్ణన ఉంది ఆశ్రమ జీవిత పవిత్రత సర్వత్రా గోచరి0చి అన్నింటిపై ప్రభావం చూపినట్లు అనిపిస్తుంది .అరణ్య ప్రవేశంలోనే విశ్వామిత్రుడు శ్రీరాముని దయ కారుణ్య  సహన శీలాదిఉత్తమ గుణాలను ,పరశురాముని గర్వ భంగాన్ని  ప్రస్తుతిస్తాడు  .రాముని ప్రతిధర్మ  కార్యం లో నీడలా లక్ష్మణుని కృత్యమూ ఉంటుంది -.అప్పుడు మహర్షి విశ్వామిత్రుడు శ్రీరాముని వీర విక్రమ శౌర్య పరాక్రమాలు లోకం లో ప్రతిస్థాపితమవ్వాలన్న ఆ కాంక్షను వ్యక్తం చేస్తాడు ..రాముని స్తుతించి అరణ్యవాసులైన తాపసుల పవిత్ర జీవనానికి యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా కొనసాగించటానికి ,వాళ్ళను ఆటంక పరచే రాక్షస ప్రమాదం నుండి రక్షించి  రాజుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చమని చెప్పాడు  ..సీతారాములు మునుముందుకు సాగుతూ ఉంటారు శరభంగ మహర్షి దర్శనం చేసి సుతీక్షణ ముని ఆశ్రమం చేరి ఆశీస్సులు అందుకొంటారు ఇక్కడ ఆశ్రమవర్ణనను మహాద్భుతంగా గొప్ప శ్లోకాలలో మల్లినాధకవి చేశాడు .సుతీక్షణమహర్షి రాముని  గుణగణాలను  కులక శ్లోకాలలో బహుధా ప్రశంసించాడు  రాముడు  సాధించాల్సిన లక్ష్యాలను   మహర్షి వివరంగా ఆదేశించి తెలియజేశాడు అవి బాధితుల యెడ దయ ,కారుణ్యం ,మంచిని కాపాడటం ,,దుష్టత్వాన్ని అంతమొందించటం  అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకాన్ని కాపాడటం ,యుద్ధాలలో విజయం సాధించటం . ఇక్ష్వాకు వంశ రాజుల వ్రతాలు అంటే నియమ నిబంధనలు పాటించమని బోధించాడు-”ఆర్తనుకమ్పా సాధూనాం రక్షణం ఖలనిగ్రహః -రణేషు విజయశ్చేతి  వ్రతాని నియతానివహ్ ”
  తర్వాతి మూడు కులక శ్లోకాలలో అరణ్య స్వాభావిక శోభను ,విశ్వామిత్రుడు క్షణాలలో నిర్మించిన సుందర ఆశ్రమ వర్ణన ఉంటుంది  ..అందరూకలిసి అగస్త్యమహర్షిని సందర్శిస్తారు .మహర్షి వీరి దక్షిణంవైపు ప్రయాణంలో కనిపించే పంచవటి మొదలైన వాటి గురించి వివరిస్తాడు ..దారిలో సంపాతి ని చూసి పంచవటి చేరుతారు . ఇక్కడి ప్రకృతి  అందానికి రాముడు పరవశుడౌతాడు .ఇక్కడ గలగలా పారే గోదావరి నది పులకింతలు పెడుతుంది .గోదావరీ తీరం లో సాయం వేళ గడపటం ఏ సర్గలో ఉంటుంది. కావ్య మర్యాద ననుసరించి అనేక వర్ణనలు చేశాడు కవి మల్లినాథ సూరి .సీతారాముల శృంగార వర్ణనా గొప్పగా చేశాడు .శూర్పణఖ రాకతో ఈ  సర్గ  సమాప్తమౌతుంది  .
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-17- కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -103 మేడూరు ఉద్యోగం -4

నా దారి తీరు -103

                 మేడూరు ఉద్యోగం -4
రామ మోహనరావు గారి విగ్రహ ప్రతిష్ట
 వేసవి సెలవుల తర్వాత  బడులు తెరిచే నాటికి  శ్రీ యలమంచిలి రామ మోహనరావు గారి ఫైబర్ బస్ట్ విగ్రహం తయారైంది .మా వాళ్ళు వెళ్లి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు . నేనూ చూశాను .రావాల్సి నంత కవళికలు రాలేదని పించింది  నాకు అంతగా నచ్చలేదు . కానీ అంతకంటే సమయం లేదు .వారి కుటుంబ సభ్యులు కూడా పెదవి విరిచారని ఉయ్యూరయ్య ఉవాచ .ఇక చేసేదేమీ లేదు . ఆవిష్కరణ జూన్ చివరివారం లో ఆయన మరణించిన నాడు అని నిర్ణయించాం . తేదీ సరిగ్గా గుర్తులేదు .నేనూ స్టాఫ్ సెక్రెటరీ మరో ఇద్దరం కలిసి రుద్రపాక వెళ్లి జిల్లా పరిషత్ చై ర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారిని కలిసి ఆహ్వానించాం తప్పక వస్తామన్నారు .సంతోషంగా తిరిగి వచ్చి ఏర్పాట్ల పై దృష్టిపెట్టాం .విగ్రహానికి సుమారు 6 అడుగుల ఎత్తు  దిమ్మ కట్టించటం ,దానికి నగిషీల పని అంతా  ఉయ్యూరయ్య చూశాడు . పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చిన జ్ఞాపకం . తెలిసిన వారందరికీ ఆహ్వానపత్రాలు పంపాము మండలం లోని అన్ని పాఠశాలలకు ఆహ్వానాలు వెళ్లాయి ఇక్కడ పని చేసి రిటరైన వారికి  వేరొక చోట పని చేస్తున్నవారికి ఎవరినీ వదిలిపెట్టకుండా పూర్వపు టీచర్స్ అటెండెన్స్ ఆధారం గా పంపాము .దాదాపు నాలుగైదు వందల మంది వస్తారని లెక్కవేశాము సర్పంచులకు మండల ప్రెసిడెంట్ లకు కూడా వెళ్లాయి ఆహ్వానాలు . వీరందరికి సాయంత్రం రాగానే టిఫిన్ టీ  ఇవ్వటం రాత్రికి డిన్నర్ కూడా ఏర్పాటు చేసిన గుర్తు . స్కూల్ అలంకరణ అంతా డ్రాయింగ్ మాస్టర్ ప్రసాద్ చూశాడు వచ్చిన వారిని ఆహ్వానించటానికి నేనూ లెక్కల ప్రసాద్ డ్రిల్ మాష్టర్  సుబ్బారావు,లాబ్ అసిస్టెంట్ ప్రసాద్ ,ఉయ్యూరయ్య శంకరరావు లు చూసాం కమిటీలను ఏర్పరచి బాధ్యతలు అప్పగించాను ఎవరూ ఇందులో నా ప్రమేయం లేదే అనుకోకూడదని నా తలంపు .అందరూ ఇన్వాల్వ్ అయేట్లు ఏర్పాట్లు చేసాం
  ఆవిష్కరణ రోజు రానే వచ్చింది .చైర్మన్ గారు సమయానికే వచ్చారు . ఆహ్వానితులందరూ వచ్చారు రామమోహనరావు గారబ్బాయి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు .వారి బాబాయి కెసిపి రైతు పేరు గుర్తులేదు  ఆయనకూడా అతిధులు వేదిక నెక్కించాం వారి కుటుంబ సభ్యులనూ సగౌరవంగా ఇంటికి వెళ్లి అంతకు ముందే ఆహ్వానించాం .అందరి రాకతో విద్యార్థినీ విద్యార్థులతో ప్రాంగణం కళకళ లాడింది .విగ్రహానికి శాటిన్ కలర్ వస్త్రం తో ఆచ్చాదన (ముసుగు )విషయం డ్రాయింగ్ మాస్టారు తెరపాటు చేశాడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరింప జేయటం నా  సర్వీస్ లో ఇదే మొదటిది .ముసుగు వేయాలని డ్రాయింగ్ మాస్టర్ చెప్పేదాకా నాకు తెలియదు . అనేక మంది రిటైరైన హెడ్ మాస్టర్లు మేస్టార్లు ఆయన పై ఉన్న అభిమానంతో వచ్చారు .అందరినీ ఆహ్వానించి అల్పాహారాలు అందజేశాక సభ ప్రారంభించాం .
   చైర్మన్ గారి తో శ్రీ యలమంచిలి రామమోహనరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించామని కోరగా వచ్చి హర్ష ధ్వానాల మధ్య  ఆవిష్కరించారు కొబ్బరికాయ కొట్టి విగ్రహానికి హారతి పట్టారు కుటుంబ సభ్యులు కూడా వారి వెనుక నిలబడ్డారు . .నా జీవితం లో ఒక గొప్ప ఘనకార్యం చేశానని సంబర పడ్డాను
 చైర్మన్ కోటేశ్వరరావు గారు రామ మోహనరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించటం తన అ దృష్టం దీనికి పూనుకున్న పాఠ  శాల హెడ్ మాస్టారు అయన నాయకత్వం లో పని చేసిన ఉపాధ్యాయ బృందం అభినందనీయులు  అంటూ  తమకూ, రామ మోహనరావు గారికీ ఉన్న సుదీర్ఘ పరిచయాన్ని ఆయన నిస్వార్ధ జీవిత విశేషాలను ,త్యాగాలను పాఠశాల అభి వృద్ధికి గ్రామాభి వృద్ధికి వారి కృషినీ ప్రశంసిస్తూ వారి జీవితాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించారు , తరువాత నేను మాట్లాడుతూ ఆవిష్కరణ పూర్వా పరాలను స్టాఫ్ సహకారాన్ని గ్రామస్తుల అభిమానుల వదాన్యతను తెలియ జేశాను ఇతర ప్రముఖులు రిటైర్ హెడ్ మాస్టర్లు అభిమాన రాజకీయ నాయకులు తక్కువ సమయం లో వారి గొప్పతనాన్ని వివరించారు . సభ తర్వాత అతిధులకు భోజనాలు ఏర్పాటు జరిగింది .చైర్మన్ గారితో సహా అందరూ భోజనం చేసి వెళ్లినట్లు జ్ఞాపకం . ఆవిష్కరణ గ్రాండ్ సక్సెస్ .
   మేడూరు గ్రామకరణం శ్రీ కిండి  శేషగిరిరావు గారు నాకు ఇక్కడ పరిచయమైనా నాటి నుంచి అన్ని విషయాలలో సహాయకారిగా ఉన్నారు ఆయన ఉయ్యూరు షబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో దస్తావేజులు  రాసేవారుగా ప్రసిద్ధులు .ఊళ్ళో బ్రాహ్మణ సంఘ నాయకులు . ని చేతిలో డబ్బుతో  మంచిపనులు చాలా ఖర్చు చేసేవారు స్కూల్ ఫంక్షన్ లకు పిలిస్తే ఏదో ఒక రూపం లో విద్యార్థులకు సాయం చేసేవారు .పెద్ద ఆస్తిపరులేమీ కాదు ఎప్పుడూ తెల్ల ఖద్దరుపైజమా లాల్చీ తో   నల్లగా పొడుగ్గా భారీగా నుదుట యెర్ర కుంకుమ బొట్టుతో  నవ్వుతూ కనిపించేవారు .కార్తీకమాసం లో మామిడి తోటలో కార్తీక వనభోజనం ఏర్పాటు చేయమని స్టాఫ్ సెక్రెటరీకి తెలుగు శర్మగారికీ చెప్పగా బాగా ఏర్పాటు చేశారు .ఒక ఆదివారం జరిపాము .తర్వాత శేషగిరిరావు గారు ఏర్పాటు చేసిదానికి  బ్రాహ్మణ మేష్టర్లను ఊరిలోని బ్రాహ్మణులను పిలిచి వనసమారాధన చేస్తే ఉయ్యూరునుంచి వచ్చి పాల్గొన్నా .కానీ వీళ్లంతా పేకాటతో కాలక్షేపం చేయటం నాకు అస్సలు నచ్చలేదు . ఉయ్యూరులో మేము  విష్ణ్వాలయం లో జరిపే బ్రాహ్మణ సంఘ వన భోజనానికి శేషగిరిరావు గారు కూడా వచ్చేవారు .ఆయన తమ్ముడు ఉయ్యూరులో పని చేసేవాడు . రావుగారి భార్య మండలం లో టీచర్ .ఇల్లు పురాతన  మట్టి గోడల మండువా పెంకుటిల్లు .మా ఇంట్లోలాగానే ఎప్పుడు కూలి పోతుందో అనిపించేది .ఒకటి రెండుసార్లు  వీరింట భోజనం చేశా మంచి ఆతిధ్యమిచ్చేవారు .. నేను బదిలీ అయి ఇక్కడినుంచి వెళ్ళిపోయినా ప్రతికార్తీక వనభోజనానికి పిలిచేవారు రెండువందల రూపాయలు ఇచ్చేవాడిని . మహా పెద్దమనిషి .మర్యాదస్తులు .అంతకంటే మేడూరులో నాకెవరూ పరిచయం కాలేదు .రిటరైన ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ ప్రతి నవంబర్ లో ట్రెజరీలో ఇవ్వాలి వాళ్ళు బతికి ఉన్నట్లు గెజిటెడ్ ఆఫిసర్ సర్టిఫై చేయాలి అందుకని చాలామంది వచ్చి సంతకం పెట్టించుకునేవారు  శేషగిరిరావుగారి అమ్మాయి తమ్ముదురామారావు గారి కూతురు ఉయ్యూరు కాలేజీలో చదివేవారు .ఆతర్వాత పదేళ్లకు రామారావుగారు చనిపోయారు
      విగ్రహావిష్కరణ అవగానే బాధ్యతలు అప్పగించిన వారిని లెక్కలు పూర్తి చేసి రెడీగా ఉంచమని  స్టాఫ్ మీటింగ్ లో లెక్కలు చెప్పి అందరి సంతకాలు తీసుకోవాలని చెప్పాను .ఇదిగో అంటూ ఆలస్యం చేశారు .డబ్బు విషయం లో నేను అలసత్వాన్ని సహించను .కనుక ఒక రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టి ఆలోపల లెక్క అప్పగించాలని ఒత్తిడి తెచ్చాను .వాళ్లకు మింగుడు పడలేదు .లెక్కలెందుకండి అందరికీ తెలిసిందేకదా అన్నారు అదేమీ కుదరదు అణా  పైసలతో సహా యెంత వసూలైంది దేనికి ఎంత ఖర్చయింది పూర్తి వివరాలు చెప్పాల్సిందే అన్నాను .కొందరు గొణిగారు .ఎవరేమనుకున్నా నా పద్ధతి నాదే  దీనికి తిరుగు లేదన్నాను .అనుకొన్న రోజు స్టాఫ్ మీటింగ్ పెట్టి వాళ్ళతో లెక్కలు రాయించి అందరికి చెప్పించాను . ఒకటి రెండు వేలు మిగిలినాజ్ఞాపకం .దీన్నేమి చేయాలని అడిగాను అందరూ కామన్  గుడ్ ఫండ్ కు జమ చేయమని సలహా చెప్పారు .అలాగే చేసాం అందరితో  జమాఖర్చుల పై సంతకాలు పెట్టించాను .ఇది అగ్రనాయకులు నచ్చలేదని భోగట్టా .నేను దేనికీ భయపడను .ఈ ఊరుకాకపోతే మరో ఊరు .నా కాళ్ళు ఎప్పుడూ చెప్పుల్లోనే ఉంటాయి .
  అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయాలి ఇదివరకు రాసిందే  ఇది . నేను దీనికి ముందు మైలవరం దగ్గర చిలుకూరివారి గూడెం (పుల్లూరు )హై స్కూల్ లో పని చేస్తుండగా అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ వి హనుమంతరావు గారి బామ్మర్ది హైదరాబాద్ లో భారత్ డైనమిక్ లిమిటెడ్ లో  కెమిస్ట్ గా పని చేస్తున్న మా తమ్ముడు మోహన్ కు అటెండర్ గా ఉండేవాడు .అతడు ఎప్పుడూ మా వాడిని సార్ మీ కేదైనా సహాయం కా వాలంటే మా బావ తో చేయిస్తాననేవాడట .ఒకసారి మావాడు నీకు ట్రాన్స్ ఫర్ కావాలంటే చెప్పు హనుమంతరావు తో చేయిస్తానన్నాడు .పుల్లూరు నాకు బాగా నచ్చింది ఎన్నో మంచిపనులు అక్కడ చేశాను .కనుక అక్కడినుంచికదలా లని లేదుకమిటీ వాళ్లకూ నేనంటే  గౌరవం  ఆదరణ  ఉన్నాయి  కానీ మా వాడు అయిదారు సార్లు చెప్పాక సరే అన్నా .అనటం మావాడు వాడి అటెండర్ కు చెప్పటం వాడు హనుమంతరావు చెవిలో ఊదటం జరిగిపోయి నాకు తెలియ కుండానే హనుమంతరావు ఇచ్చిన బదిలీ రికమండేషన్ లెటర్ ఉయ్యూరు మా ఇంటికి రావటం జరిగి నేను దాన్నుచ్చుకుని చర్మన్ గారిని కలవటం .ఉయ్యూరుకాని చుట్టుపక్కలకాని వేయమని అడగటం ఉయ్యూరు తప్ప ఎక్కడా పని చేయరా మీరు అనినవ్వటం మేడూరుకు వారం లోపలే ట్రాన్స్ఫర్ అవటం జరిగిపోయాయి .కనుక ఒకరకంగా ఇష్టం తో వచ్చిన వాడినే .కానీ ముందే చెప్పినట్లు సంకుచితత్వం ఉన్న చోట ఉండలేను . అందుకని విగ్రహావిష్కరణ ఉదంతం మనసును కలత చెందించింది .సమయం కోసం ఎదురు చూస్తున్నాను
ఇక్కడ మరో విషయమూ చెప్పాలి .నా ముందు మేడూరులో పని చేసిన హెడ్ మాస్టర్ జి ఎస్ యెన్ చౌదరి నాకు బీఎడ్ ట్రెయింగ్ మేట్ హాస్టల్ మేట్ కూడా రాజమండ్రిలో .అంతకు ముందు అతని స్థానం లో నేను మానికొండకు సైన్స్ మాస్టర్ గా వెళ్ళా .ఘన చరిత్ర ఉన్నవాడు .  స్కూల్ ఫండ్స్ లో ఎక్యుములేటెడ్ ఫండ్ అని ఉంటుంది .దాని జోలికి ఎవరూ వెళ్లరాదని ఫండమెంటల్ రూల్ ఉంది .ఒక వేళ అందులో అత్యవసర సమయాల్లో తీసి ఖర్చు పెట్టాలంటే రిజల్యూ షన్  రాసి దాని కమిటీతో సంతకం చేయించి హెడ్ మాస్టర్ జిల్లాపరిషత్ కు పంపి అక్కడ ఆమోదం పొంది ఆర్డర్ వస్తేనే తీసి ఖర్చుపెట్టి మళ్ళీ దాన్ని నింపాలి .కానీ మా చౌదరి ఇవేమీ లెక్క చేయకుండా మొత్తం నాకిపారేశాడు  అదేదో సినిమాలో జూ ఏంటి ఆర్ బ్రహ్మానందం తో రమాప్రభ నయన తారలతో ”మా గురువుగారిని  కంప్లీట్ గా నాకి పారేశారన్నమాట ”అన్నట్లు నాకి పారేశాడు ..నేను వచ్చాక చూస్తే ఖాళీ .ఏమయ్యా ఉయ్యూరయ్యా ఇదేంటి అంటే ఆయన మీలాగా లెక్కలు మాతో రాయించేవాడుకాదు ఏమి జరిగిందో జరుగుతోందో మాకే  కాదు బ్రహ్మ దేవుడికి కూడా తెలీదు అని నెమ్మదిగా చెప్పాడు .కమిటీ వాళ్ళనూ లెక్క చేసేవాడుకాడట . కమ్మవారుగా ”మూసుకు ”కూర్చున్నారు రహస్యం బయట పడకూడదని .నా దగ్గర అప్పుడుడప్పుడు సర్పంచ్ వెళ్లగక్కేవాడు అతి రహస్యం బట్టబయలు అని సామెత .తర్వాత ఇక్కడినుంచి పునాదిపాడువెళ్లి అక్కడా అంతా  నాకేసి చివరికి సస్పెండయ్యి ,ఏదో కిరికిరి చేసి బయటపడ్డాడు . ఇక్కడ నన్ను అందరూ ఆదరిస్తున్నా ఏదో  కూపం లో ఉన్నట్లు అనిపించేది కనుక నేను ఇక్కడ నుంచి అంతా మంచిగా ఉన్నప్పుడే చల్లగా జారుకొంటే మంచిది అని నిర్ణయించుకున్నాను . వెయిటింగ్ ఫర్  ఆపార్ట్యూ నిటి .
     కానీ ఇక్కడ పిల్లలకు సైకిళ్ళు పార్కింగ్ చేయటానికి చోటు లేదు .ఎక్కువమంది చుట్టూ ప్రక్కల నుంచి సైకిళ్ళ మీద వస్తారు . దీనికి పరిష్కారం ఆలోచించాలనిపించింది స్టాఫ్ మీటింగ్ లో చెప్పాను .మంచి ఆలోచన అన్నారు మరి ఫండ్స్ ఎలా ?ఉయ్యూరు కె సిపి ,రోటరీ క్లబ్ లు ఇలాంటి కార్య క్రమాలు చేయటం లో ముందు ఉంది . నేను పెనమకూరు లో సైన్స్ మేస్టారుగా ఉన్నప్పుడు హెడ్మాస్టర్ తో చెప్పి అక్కడ బోరింగ్ వేసి రక్షిత నీటి సరఫరా అవసరం చెప్పి ,కె సిపి వాళ్ళ మా ,గ్రామస్తుల సహకారం తో చేయగలిగాము అది జ్ఞాపకమొచ్చి కెసిపి తొబాగా టచ్ ఉన్న రామమోహనరావు గారి తమ్ముడిని సంప్రదించి ,అందరం కలిసి ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారినీ మిగిలిన అధికారులను కలిసి మా ప్రపోజల్ ముందుపెట్టాం . వెంటనే అంగీకరించి వాళ్ళే ఖర్చు పెట్టి హెడ్మాస్టర్ గది  వెనకాల పడమటిభాగం లో గోడ వెంబడి రేకుల షెడ్ వేసి మా కోరిక తీర్చి వచ్చి ఆవిష్కరణ చేశారు . ఇదొక మైలురాయి నాకు ..అయినా వెళ్లాలనే కోరిక తగ్గలేదు
   సశేషం
      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-15-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -41

 వరద రాజా ;;తార్కిక రక్షా ”కు మల్లినాథుని ”నిష్క0ట ”వ్యాఖ్య -2
  మల్లినాథుడు మరొక అభ్యంతరాన్ని లేవదీశాడు .దైవం అనంతత్వం యొక్క ప్రజ్ఞానం కాదు .-”తదుత్తాచ ప్రమాతృతా ”(తార్కిక రక్షా వృత్తి )అని చెప్పి ప్రజ్ఞానం యొక్క నిర్వచనం చెప్పాడు . ప్రజ్ఞాని  లక్షణం  ప్రజ్ఞానం కలిగివుండటమే .దీని అర్ధం ప్రజ్ఞాని ప్రజ్ఞానానికి సంబంధించిన సంపూర్ణ సరైన ప్రజ్ఞానం కలిగిఉండటమేకాని దానికి గుర్తుకాని సంస్థకాని ఏజెన్సీ కానీ కాదు .కనుక దైవం ప్రజ్ఞాని .కొందరు దైవం ప్రజ్ఞానం కాదని దీనికి కారణం తెలుసుకొన్నవాడు దాని పరికరం ఒకటి కాదు కనుక  వైరుధ్యం ఏర్పడుతుందికనుక అంటారు  .దీన్ని ముందే ఊహించిన మల్లినాథుడు ”మన దృక్పధం నిర్దుష్టమైన  సాక్ష్యం  రుజువు సరైన జ్ఞానం తో పరి వెస్టించి ఉంటుంది కానీ దాని ప్రతినిధిపై కాదు .కనుక చెప్పబడిన ప్రకారణలో వైవిధ్యమే లేదు ”అన్నాడు .-”తద యోగ్యవ్యవ చ్చేదః -ప్రామాణ్యం గౌతమేమతే ”  మల్లినాథుడు ప్రజ్ఞాని అయినవాడు తన  స్వ  విజ్ఞానం పైనే ఆధారపడతారు కనుక సరైన విజ్ఞాన ప్రజ్ఞానాలు అన్నీ ఆయనవే .
   ఈ రెండూ వైరుధ్యాలుకావు .ప్రపంచ జ్ఞాన విషయాలలో సరైన రుజువు ఏదో ఒక ప్రతినిధిని ఆశ్రయించే ఉంటుంది .ఆధారం లేదు .కనుక వైరుధ్యమే లేదు పై వాదాన్ని ఆమోదిస్తే దైవం యొక్క అనిశ్చిత్వం సరైన జ్ఞానానికి అయిదవ మార్గం లేక సాధనమవుతుంది .దైవం మన నాలుగు రకాల అవగాహనకు లలో చేర్చటానికి కుదరదు .కారణం దైవం ప్రత్యక్ష అవగాహనవలననే తెలియ దగినవాడు .దైవం సూటి సరైన విజ్ఞానం  తోనే వ్యాపించి ఉంటాడు అన్నాడు లాల్యే పండితుడు -God is included in the category of direct perception . He is permeated by the direct valid knowledge ;”.
  వరద రాజుని  మరొక వృత్తి ప్రకరణం లో ,చర్య లేక క్రియ అది కర్మ యొక్క చర్య వలన అందులో కోరిన ఫలితం లేకపోయినా రుజువు చేయబడుతుంది అన్నాడు .-”ఇచ్చాది  జన్య ఫలాంతరస్యా భావేపి కరణవ్యాపార విషయత్వ మాత్రేణ కర్మత్వోపపత్తే”
తెలుసుకొనే స్థితిలో చర్య ఉంటుంది .దీన్ని  సూచించే గుర్తు(ఇండికేటరి  మార్క్ ) ఏది ? క్రియ అనేదాని అర్ధం పూర్తిగా దాని ధాతువు మీదనే ఆధారపడితే అప్పుడు అనిశ్చితం ఏర్పడి అది సముచ్చయం వగైరాల పై తప్పనిసరిగా ఆధార పడాల్సి వస్తుంది .చర్య స్పందన పై ఆధారపడితే ,అలా చెప్పటానికి సాక్ష్యం ఉండదు ..ఈ ప్రకారణాలలో మల్లినాథుని గతితార్కిక తర్క ప్రతిభా  సర్వస్వము, నైపుణ్యం విశ్వ రూప సందర్శనమై భాసించింది .ఈ వ్యాఖ్యానం లో మల్లినాథుడు ఇతరుల తప్పుడు  

గుర్తింపు ,పోలికలపై చాలా అసహనం ప్రదర్శించాడు .-”అయమప్యేకః కిరణావళీ గ్రంథ ఆత్మా ప్రకరణాస్య ఇతి కైశిచ్చ దుత్తుంగ తుండే రాఖ్యాతం చ తదవ్యాకరణా పరిజ్ఞాన వంచనా సాహస విలాస ఏవే త్యాస్తం  -ఇంద్రియాలింగాది జ్ఞాన కరణా వ్యాపార విషయత్వమేవ  తత్ఫల జ్ఞాన కర్మత్వా మిత్యర్ధహ్ ”    మల్లినాథుడు ప్రజ్ఞాన0  యొక్క
 కారణం ,దానిఫలితం  భావం దాని చిహ్నం ఒకటే అయినట్లుగా  ఒకటేఅవుతుంది అని భావించాడు .సరాసరి భావం లేక జ్ఞానం ను విస్మరి0చైనా దానితాలూకు చిహ్నం మిగిలే ఉంటుంది అని ఎవరైనా వాదించవచ్చు .
  మల్లినాథుడు వెళ్ళటం అనే పని ఒక గ్రామానికి చేరటానికి  ఫలితం అంటాడు సూరి . ఇచ్చిన ఉదాహరణలో ఫలితలోపం లేదు .అది జ్ఞానం, చర్యయొక్క స్థితి  దాని అర్ధం ధాతుజన్యమా?మొదటి ప్రత్యామ్నాయం లో రూపం ,ఆసాధన.విజ్ఞానం ఎన్నటికీ చర్య కానేకాదు  అడి రూపానికున్న ఒక గుణం లేక లక్షణం  -జ్ఞానం న క్రియా  గుణత్వాత్ రూప విదిత్యర్ధః  ”
 అది గుణం అనటానికి సూరి కారణం చెప్పాడు .దాని ఉనికి అశక్తత లేక నిరసన .మిగతాది అంతా దాని చర్యపై అసక్తత వగైరా .విజ్ఞానం గుణం లేక లక్షణం .ఎందుకంటె అదే ఫలితంకనుక అది అంతర్గతం గా అనంత విషయం తో సంతోషం ఆనందం లాగా  సంబంధం కలిగి ఉంటుంది . రెండవ ప్రత్యామ్నాయంగా స్పందన విషయం లో అతిక్ట్రమణ (ట్రాన్స్ గ్రేస్షన్  )లేక దుర్వినియోగం ఉన్నది .ఈ సందర్భం లో వరద రాజు ఉదయన రచన నుంచి ఒకదాన్ని ఉదహరించారు -”అనేకాన్యా దసిదేవీ —– ”(తార్కిక రక్షా )
  ఈ చిన్న వ్యాఖ్యాన గ్రంధం లో మల్లినాథుడు న్యాయ శాస్త్ర కోవిదులైన అనేక కవుల రచనలను ఉదహరించారు .అంటే ఎంతటి విస్తృత పరిశీలనం చేసి తార్కిక రక్షా కు నిష్క0టక  వ్యాఖ్య రాశాడో తెలుస్తుంది .కొన్నిటిని మాత్రం తెలుసుకొందాం –
1 అక్ష చరణాః 2-అక్షపాదః 3-అమర 4-ఆచార్య 5-ఉదయనుడు 6-కణాదుడు 7-కిరణావళికారుడు 8-ఉదయణాచార్యుడు 9-కోచిత్ 100-గురు 11-గురుమత0 12-చార్వాక 13 నైయాయిక 14-న్యాయ చార్య 15-పక్షిలా 16-పీలుపాక వాది17-ప్రభాకర 18-బుద్ధ 19-బౌద్ధ 20-భట్టపాద 21- భాట్ట 22-భాష్యకార 23-భూషణ 24-భూషా పీయ 25-మీమాంసకులు 26-మను 27-కాచస్పతి 28-వాచస్పత్య పర్య 29-వృత్తిక కారులు 30-వైశేషికాదేశీ 31-శబరుడు 32-వృద్ధ 33-శాక్య 34-శాబ్దిక 35-సాండా ఖ్య 36-గౌతమ 37-సూత్రకార మొదలైన 40 తర్క  న్యాయ శాస్త్ర గ్రంధాలను మల్లినాథుడు అవలోడనం చేసి ,సార   సంగ్రహం చేసి చిన్నపామైనా పెద్దకర్రతో కొట్టినట్లు విపుల వ్యాఖ్యానం రాశాడు ఆ మనీషకు జేజేలు  .
  ఇంతటితో మల్లినాథుని వ్యాఖ్యానాలకు సమాప్తిపలికి తర్వాత ఆయన స్వ0త     రచనల ను  వాటి వైశిష్ట్యాలను తెలుసుకొందాం .
   సశేషం
    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్

షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్

Inline image 1  Inline image 2

49 NERS                                       BONNIE E CONE

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ వారం

వీక్లీ  అమెరికా -6-మనవడు సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్  వారం

                  8-5-17నుండి 14-5-17 వరకు
 ఈనెల 6 వ తేదీకి అమెరికావచ్చి నెల , 7 వ తేదీకి షార్లెట్ వచ్చి నెలా అయింది . 8 వ తేదీ సోమవారం ఫిష్ బుక్ లో పద్మశ్రీ పోతుకూచి సాంబశివరావు గారు అంతకు ముందు రోజు డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు పలకరించారు .మైనేని గారుపంపిన వెనిగళ్ల కోమలగారి అనువాద రచన ”కాళరాత్రి ”చేరింది ..రెండుపూటలా నడక .సాయంత్రం మా అమ్మాయి ఆఫీసు నుంచి వచ్చేసరికి భోజనాలు చేసి సిద్ధంగా ఉంటె” బలి” కి తీసుకు వెళ్ళింది హాలు అరగంట ప్రయాణ దూరం .టికెట్ పెద్దవాళ్లకు 17, పిల్లలకు 11 డాలర్లు .మొత్తం 75 బొక్క .నాకు ఒక్క అంగుళం కూడా నచ్చలేదు .రొయ్యలమీసాల నాజర్ ను చూస్తే డోకు వచ్చింది .ప్రభాస్ డైలాగ్ పల్లెటూరి బైతు మాటలాగా చాలా రఫ్ గా ఉంది . బాగ్రౌండ్ సంగీతం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది .  సంగీతం పాటలూ అసలు నచ్చలేదు . రాణా  శెభాష్ అనిపించాడు . ఈ కధకు అన్నికోట్లు కుమ్మరించటం పరమ దండగ . దీనికంటే శాతకర్ణి వెయ్యి రె ట్లు ,పూర్వపు శోభన్ బాబు ”వీరాభిమన్యు ”పదివేల రేట్లు నయం సినిమా నుంచిరాగానే ఒక కవిత గీకాను  –”డబ్బు -టైము  -బుర్ర-మనసు -విశ్రాంతి -వినోదం -వివేకం -విచక్షణ -విజ్ఞానం -సెల్యులాయిడ్ ఇలా” బహు ”బలి-బాహు బలి . ఇది నా  అభిప్రాయం .చూసేవాళ్ళనీ కనకవర్షం కురిపించేవారినీ ఏమీ అనలేను .ఒక్కటి మాత్రం నిజం అసలు ఏమీ లేని కథను అంత భారీ ఖర్చుతో తీసి రెట్టింపు పైగా డబ్బు 15 00 కోట్లు పిండటం రాజమౌళి వ్యాపార దక్షతకు నిదర్శనం
  మనవళ్లు స్కూల్ ట్రిప్ లో మంగళవారం కొలంబియా వెళ్లి సాయంత్రానికి వచ్చారు . మధ్యాహ్నం ఏమీ తోచక ”మీ గొట్టం”-యూ ట్యూబ్ తిరగేస్తుంటే ఆకెళ్ళ రాసి డైరెక్ట్ చేసిన పద్యనాటకం ”అల్లసాని పెద్దన ”కనిపిస్తే పెట్టాను అద్భుతం అని పించింది .”బలికి బలైన” మనసు ఆనంద తాండవమే చేసింది మనసంతా ఆర్ద్రత తో నిండిపోయింది  పర్గెషన్ అంటారే అది జరిగి తేలికపడింది బుర్ర  హాయిగా ఊపిరి పీల్చుకున్నాను . తర్వాత ఆకెళ్ళ తో ఇంటర్వ్యూ చూశాను .చాలాహుందాగా ,నిజాయితీగా వినయం గా ఆత్మ విశ్వాసం గా చెప్పారాయన .బెజవాడ బుక్ ఎక్సిబిషన్ లో ఈ జనవరి 10 తేదీ సాయంత్రం రచయితలతో సమావేశం ఉందని తప్పక రమ్మని నాకు శ్రీ పూర్ణ చాంద్ ఫోన్ చేసి చెప్పగా వెళ్లాను .అక్కడే మొదటి సారిగా ఆకెళ్ళ ను చూశాను తనను గురించిన పరిచయం లో ఆయన బాగా తనను ఆవిష్కరించుకొన్నారు .తన కదా నవల నాటక సినీ సాహిత్య కృషిని 15 నిమిషాలలో చెప్పేశారు .నేనూ తర్వాత నా గురించి చెప్పాను . మా ఇద్దరితోపాటు మరో పాతిక మందికి మాట్లాడే అవకాశానిచ్చి ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ డి విజయభాస్కర్ బుక్ ఎక్సిబిషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ బాబ్జీ ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్య దర్శులు శ్రీ గుత్తికొండ  సుబ్బారావు డా జి వి పూర్ణ చ0ద్ మొదలైన పెద్దల సమక్షం లో సన్మానం చేశారు . ఇవన్నీ గుర్తుకు వచ్చాయి .
  కోమలగారు ఇంగిలీషు లో రాసుకున్న ”మై లైఫ్ ”పుస్తకాన్ని పంపిస్తున్నట్లు గోపాలకృష్ణ గారి నుంచి మెయిల్ వచ్చింది మర్నాడే అందింది . బుధవారం సాయంత్రం గుంటూరు కు చెందిన రిటైర్డ్ పశువుల డాక్టర్ శ్రీ తాళ్ళూరి వెంకట ,పుట్టపర్తి  నివాసి ,బిల్డర్ శ్రీ సూరపనేని నారాయణప్ప గార్లు ఇంటికి వచ్చారు శతకత్రయం ఇద్దరికీ ఇచ్చాను .తరచూ కలుసుకొందామనుకొన్నాం .
  గురువారం కిరణ్ ప్రభ  ఆకేళ్లతో  తో చేసిన ఇంటర్వ్యూ ఆమని ఇంటర్వ్యూ చూసాం .రమణ ,చరణ్ ,భవానిగారు మంకు శ్రీను గార్లతో ఫోన్ లో మాట్లాడాము
12-వ తేదీ శుక్రవారం మా పెద్దమనవడు చి సంకల్ప్ అంటే  మా పెద్దబ్బాయిశాస్త్రి కొడుకు ఎంఎస్ .కోర్స్ పూర్తయిన సందర్భంగా షార్లెట్ యూని వర్సిటీ  లో జరిగిన గ్రాడ్యుయేషన్ కు మేమిద్దరం మా అమ్మాయి వెళ్లాం . సుమారు 45 నిమిషాల ప్రయాణం .మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటకు ప్రారంభమైంది .ముందు  బాండ్  వాయిద్యం తర్వాత ఛాన్సలర్ ఫిలిప్ ఎల్ డూబోస్  ప్రసంగం ,తర్వాత బోర్డు ఆఫ్ ట్రస్టీ మాటలు ,దానివెనుక కొంతమంది ప్రముఖుల ఉపన్యాసాలు జరిగాయి ..హామిల్టన్  సెంటర్ హాల్ లో లో జరిగిన ఈ జరిమానికి వేలాది తలిదండ్రులు గాలరీలనిండా కూర్చుని నుంచొని వీక్షించారు వారందరి ఆనందం  వర్ణనాతీతము .ముందుగా డాక్టరేట్ లకు మెడలో పతకంవేసి  సర్టిఫికెట్ ఇచ్చారు . ఆతర్వాత ఏం ఎస్ వాళ్లకు వరుసగా షేక్ హాండ్ లతో సరిపుచ్చారు .ఆతర్వాత బాచెలర్స్ కు .ఇదంతా రెండుంబావు గంటలలో అత్యంత క్రమశిక్షణతో వేడుకగా జరిగింది ..మా మనవడు సంకల్ప్ ”డేటా సైన్స్ అండ్ బిజినెస్ ఎనలిటిక్స్ ”లో ఏం ఎస్ చేశాడిక్కడ  మా అమ్మాయి వాళ్ళున్న షార్లెట్ లోని యూ ని వర్సిటీ ఆఫ్ షార్లెట్ లో సీట్ వస్తే డిసెంబరు26 న  2015   హైదరాబాద్ నుంచి  బయల్దేరి వచ్చి ఇందులో చేరాడు .సుమారు ఒకటిన్నర ఏడాది చదువుతో పూర్తయింది కోర్స్ చివరి పరీక్ష ఈ నెల 10 న జరిగింది .అదికూడా పాసయ్యాక సర్టిఫికెట్ ఇస్తారు .మనకు డిగ్రీ పాసయ్యాక  కాంవో కేషన్ జరిపి సర్టిఫికెట్ ఇవ్వటం అలవాటు    మనకు భిన్నం ఇది . ఏం ఎస్ ఇక్కడ చేసిన వారిలో ఆంద్ర ప్ప్రదేశ్ కు చెందినవాళ్లు మా వాడితో సహా దాదాపు 25 మంది ఉన్నారు
   మా అల్లుడు ఫ్లారిడాలోని నోవా యూని వర్సిటీ నుండి ఆన్ లైన్ ఏం ఎస్ చేశాడు   మేము మొదటిసారి2002 లో  అమెరికాకు టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ కు మా పెద్ద మనవడుఅంటే అమ్మాయి పెద్దకొడుకు శ్రీకేత్ పుట్టిన మూడు నెలలకు వచ్చాము అప్పుడు  మా అల్లుడి ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ కోసం మేమిద్దరం మా అమ్మాయి అల్లుడు మనవడు హూస్టన్ నుంచి ఫ్లయిట్ లో లాడర్ డేల్  కు వెళ్లి అక్కడ హోటల్ లో రూమ్ తీసుకొని మర్నాడు జరిగిన గ్రాడ్యుయేషన్ లో పాల్గొన్నాం .మియామీలో డాల్ఫీన్ సర్కస్ చూసాం . ఇలా అల్లుడి ,మనవాడి గ్రాడ్యుయేషన్ లలో పాల్గొనే అవకాశం వచ్చి ఆనందంగా ఉంది మాకు .
  .ఇప్పుడు ఈ యూని వర్సిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకొందాం . 1000 ఎకరాల విస్తీర్ణం లో ఇది వ్యాపించి ఉంది .అన్ని కోర్సులూ ఉన్నాయి రైల్వే స్టేషన్ కూడా కాంపస్ లోకి వచ్చింది .జూన్ లో ప్రారంభమవుతుంది .ఈ  వర్సిటీ   కి
’49 ERS”అనే నిక్ నేమ్  అనే మారు పేరుంది .దీనికి కారణం 1949 సంవత్సరం యొక్క ప్రాధాన్యమే .ఒకప్పుడు ఆఫ్ -కాంపస్ గా ప్రారంభమైన యూని  వర్సిటీ 1949  లో మూత పడి మరణం చెంది ఉండాల్సింది అప్పుడు” బొన్నే  కోన్ ”అనే వితరణ శీలి  ఆమె బృందమూకలిసి నార్త్ కరోలీనా లెజిస్లేచర్ ను షార్లెట్ లో ఉన్నత విద్యలకోసం శాశ్వత  వ్యవస్థ ఉండాలని చెప్పి ఒప్పించి దాని ఆమోదంతో షార్లెట్ కాలేజీని 1949 లో స్థాపించారు ..అంతేకాకుండా ఈ యూని  వర్సిటీ 49 నంబరు హైవే మీద ఉండటం మరో ప్రాముఖ్యమైన విషయం ..అంతే కాదు అమెరికాలోని నార్త్ కరోలీనాలోని షార్లెట్ లో బంగారు గనులు బాగా ఉన్నాయి .కాలిఫోర్నియాలో ”గోల్డ్ రష్”కంటే ముందే ఇక్కడ బంగారు గనుల త్రవ్వకం జరిగింది .ఇవన్నీ కలిసి వచ్చేట్లుగా యూని వర్సిటీ కాంపస్ లో” కాటో  కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్” , అండ్ కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్లాజ”ప్రాంగణం లో కూర్చుని పళ్లెం లో బంగారు రజను ను నీటితో శుద్ధి చేస్తున్నట్లున్న ఒక బంగారు గని కార్మికుని బ్రాన్జ్ విగ్రహాన్నిఏర్పాటు చేశారు .ఇది ఈ ప్రాంతం  గోల్డ్ మైనింగ్  సెంటర్ అనే చారిత్రిక సత్యాన్ని ,అదీకాక  ,1949 సంవత్సరం  ఈ యూనివర్సిటీ   అభివృద్ధిని నాటకీయంగా  మలుపు తిప్పిన సంవత్సరమని గుర్తు చేస్తుంది .ఆ స్టాథ్యూ లో జీవకళ ఉట్టిపడుతుంది . దీని ఫోటో కింద జమ చేశాను చూడండి  .యూని వర్సిటీ చరిత్రను ఇంతగా మలుపుతిప్పిన బొన్నీ  కోన్ అనే మహిళా మాణిక్యం గురించి తెలుసుకోకపోతే చరిత్ర క్షమించదు .
  బొన్నీ ఇ .కోన్ 1907 లో లో జన్మించింది  1946 నుంచి ఈ యూనివర్సిటీ సంస్థాపకురాలు.ఇక్కడే టీచర్ గా పని చేసి ,1947 లో షార్లెట్ సెంటర్ ఆఫ్ ది  యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలీనా కు డైరెక్టర్ అయి0ది . ఈ సంస్థ మూతపడి చనిపోయే స్థితిలో ఉంటె కోన్ లెజిస్లేచర్ ను ఒప్పించి 1949 లో షార్లెట్ కాలేజీ స్థాపనతో  జీవింపజేసి  దానికి ప్రెసిడెంట్ గా ఉన్నది . 1963 లో రాష్ట్ర ప్రభుత్వ ఆసరాతో  1963లో 4 ఏళ్ళు వికసించింది . 1965   లో కాలేజీని యూని వర్సిటీ స్థాయికి తీసుకురావటానికి తీవ్రం గా కృషి చేసి సఫలమనోరధురాలైంది కోన్ ..అప్పుడామె స్తూడెంట్ ఎఫైర్స్ కు వైస్ ఛాన్సలర్ గా సేవ ప్రారంభించి రిటైర్ అయ్యేదాకా ఉంది 8-3-2003 న బొన్నీ కోన్ శాశ్వతయోగా ఈ లోకానికి దూరమైంది .తనజీవితాన్ని త్యాగం చేసి ప్రాణం పోసి ప్రాణాధికంగా ఆరాధించిన  యూనివర్సిటీ కాంపస్ లో 2004 స్ప్రింగ్ లో కోన్  భౌతిక శరీరాన్ని ఖననం చేశారు . కానీ ఆమె ఆత్మ ఈ  యూని వర్సిటీ లో నే పరిభ్రమిస్తూ వివిధ సంక్షేమకార్యక్రమాలను అభి వృద్ధినీ చూస్తూ సంతృప్తి చెందుతూ ఉంటుందని భావిస్తారు
  ఈ యూనివర్సిటీ మొదటి చాన్సలర్ డీన్ డబ్ల్యు కొల్వర్డ్ . 1966 లో ఈ పదవిలో చేరి 12  ఏళ్ళు పనిచేసి ఇందులో అనేక కాలేజీలు హాస్టళ్లు ,కట్టించి గ్రాడ్యుయేట్ వర్క్ ప్రారంభించి దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేశాడు ఆయన కృషితోనే యూనివర్సిటీ రీసెర్చ్ పార్క్ ,యూనివర్సిటీ అర్బన్ ఇన్ ష్టి ట్యూట్ లు ఏర్పడి అర్బన్ వాతావరణమున్న షార్లెట్ విద్యార్థులకు బహుముఖాలుగా తోడ్పడ్డాయి ..ఈయన 1913 లో జన్మించి 2007 లో మరణించాడు.
  ప్రాస్తుతం ఛాన్సలర్ ఫిలిప్ ఎల్. డుబోయిస్
  శనివారం సాయంత్రం కాకినాడ వాసి  రిటైర్డ్ ఎస్ బి ఐ .ఉద్యోగి పుట్టపర్తి ప్రస్తుత నివాసి శ్రీ అప్పారావుగారు మా ఇంటికి వచ్చారు .ఆయన పూర్తిగా సత్యసాయి భక్తులు . అక్కడే సేవలో గడుపుతారు మన శతకాలిచ్చాను మా అమ్మాయికి బాగా పరిచయం  ఆయన్ను కారులో వారి అబ్బాయి ఇంట్లో దింపివచ్చాము . .మా మనవడు చి హర్షకు 20015 ఆగస్టు లో యాక్సిడెంట్ అయిందని తెలిసి మా అమ్మాయి ఉండ లేక ఆగలేక  ఆగమేఘాలమీద మర్నాడే  బాయల్దేరి ఇండియావచ్చి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి రాగానే ఆయన కాకినాడ నుంచి ఫోన్ చేశారట మా అమ్మాయికి .ఆయన మనసు మంచిది గొప్ప సాయి భక్తులు కనుక  సెంటిమెంట్ గా ఫీలయి మా హర్షకు ఏమీ కాదు గండ0  నుంచి బయట పడతాడు అని గట్టిగా నమ్మానని  చెప్పింది చెపుతుందిఎప్పుడూ .
  మా అమ్మాయి గొల్లపూడికాలం చూడమని చెబితే కొన్ని చూశా చాలా బాగా ఉన్నాయి .ఆయనలాగా విషయాన్ని  కరెంట్ టాపిక్  ను అంత అర్ధవంతంగా సుత్తిలేకుండా సూటిగా నిష్పక్షపాతంగా చెప్పే వాడు లేదని నా నమ్మకం ఆయన హావ భావాలు  ఊగటాలు స్ట్రెస్సులు ,ఊనికలు ఒత్తి చెప్పటాలు నాకు భలే ఇష్టం .ఆకెళ్ళ గొల్లపూడి గురించి నేను చూసినవి మైనేనిగారిని చూడమని రాస్తే చూసి చాలా ఎంజాయ్ చేశానని రాశారు . . రాత్రి చంద్ర మోహన్ ఇంటర్వ్యూ చూసాం నిష్పక్షపాతంగా చెప్పాడు .
  14 ఆదివారం ఉదయం మల్లినాథ 40 రాశా .మధ్యాహ్నం  సంగీత గురువు శ్రీ రామాచారి గారి ఇంటర్వ్యూ యూ ట్యూబ్ లో చూశా.అద్భుతం .ఆయన ఎంత ఉదారంగా స్వచ్చంద సేవ చేస్తున్నారో తెలిస్తే చలించి పోతాం అందరూ కూడాల్సిందే  మధ్యాహ్నం” కాళ రాత్రి ”చదివేశాను బాగుంది . ఇదొక్కటే ఈవారం చదివిన పుస్తకం ..మరిన్ని విషయాలు వచ్చే వీక్లీ  లో .
ఫోటోలు జత చేశాను చూడండి
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -40

  తార్కిక రక్ష పై మల్లినాథుని ”నిష్క0టక ”వ్యాఖ్య -2
సాధన పై మల్లినాథుని వివరణ చాలా సమ్మతంగా ఉంది -”కిమ్ చ ఈశ్వర ప్రమయానిత్య సర్వార్ధ గోచరయా-ప్రమా వ్యాప్తేహ్ తన్నిరాశోనార్ధ వత్వం ద్రష్టవ్యం ”దేవుడు అనే బయటి వాడి జ్ఞానం ,ప్రతిదీ ఆయన విషయమే .ప్రమేయాలన్నీ ”ప్రమా” లో  వ్యాప్తి చెంది ఉన్నవే అన్నాడు మల్లినాథుడు ..ప్రమేయం నిర్వచనం విషయం లో అతి అనువర్తనం (అప్లికేషన్ )ను పరిహరించటానికి నిర్వచనం లో సాధన అనేపదం తప్పక ఉండాలి అన్నాడు  .ఇది సత్య సమర్ధనంగా ఆమోదయోగ్యం గా ఉన్నది .ఇదికాక మల్లినాథుడు మరింత ముందుకు వెళ్లి  మరొక తాజా చర్చను తెచ్చాడు ..ఇదీ చాలా ఆమోదయోగ్యంగానే ఉంది .-”ప్రమాణామావి సంవాదిజ్ఞానమర్ధం క్రియాస్తితిహ్ (తార్కిక రక్ష)   .వరద రాజు బౌద్ధుల అభిప్రాయాలను ముందుంచుతూ ,”అవిసంవాది ”  ని  అది అనుమాన ప్రమాణం తో సాధింపబడదు అని వ్యతిరేకించాడు ..బౌద్ధుల ఆలోచన ప్రకారం ప్రతిదీ అనిశ్చితంగా వికల్పమే ,అనుమితి కారణాలైన వాటితో సహా.వికల్పం అనేదితప్పనిసరిగా విషంవాది  అవుతుంది కనుక అనుమానం అనుకొనే ప్రశ్నే లేదు .ఈ  సందర్భం లో ల మల్లినాథుడు ”ఉదయనుడు”రాసిన దాన్ని   ఆధారంగా చూపించాడు -”కిమ్ చేత్యం ప్రలపతో బౌద్ధస్య మూర్ధని భగవతాపి -వృద్ధేన దుర్ధర్షే మహానయం వజ్రపాతః కృత ఇత్యాహ ”(తార్కిక రక్ష)ప్రభాకరుడు   చెప్పిన ప్రమాణం అనేది అనుభూతి అన్నదాన్ని వరద రాజు ఆక్షేపించారు .ఇందులో అసంగత్వం లేక అస్థిరత ఉందన్నాడు .వాళ్ళు వేద విజ్ఞానాన్నిచెల్లుబాటయ్యేది అని  అంగీకరించారుకాని  ప్రమాణ విషయం లో స్మృతిని దూరంగా పెట్టారు .ఇక్కడే మల్లినాథుని వ్యాఖ్య మహా ఆసక్తికరంగా ఉంటుంది -తదే  తత్తర గాది రూఠస్య తురగావిస్మరణం యద్ వేదప్రమాణాన్య సాధనే ప్రవృత్తస్య మీమాంస గురో స్తస్మాద్ ఇతి ”.ఒక్కోసారి వరద రాజు కొన్నిటిని ఆమోదించాడు . ప్రత్యక్ష ,అనుమాన ,ఉపమాన ,శబ్ద, క్రమం ఏర్పరచటం లో సరైన తార్కిక సమర్ధన చేయలేక పోయాడు .కానీ మల్లినాథుడు వీటి వరుసక్రమాన్ని చాలా చక్కగా సమర్ధించి చూపాడు -”తత్ర సర్వ ప్రమాణోప జీవ్యత్వాత్ ప్రత్యక్షస్య ప్రాధామ్యం తదితర ప్రమాణో ప జీ వ్యత్వాత్ ప్రత్యక్ష నా0తర్దమనుమానస్య పృథక్ప్రమావ్యదాఠర్య సూచనార్ధ ముపమానస్య శబ్దాత్ ప్రాధామ్యే  పరిశేషా చ్ఛబ్ద స్యాంతే  నివేశ ఇతి ”(తార్కిక రక్ష )
  మల్లినాథుని మరికొన్ని వాదాలు తెలుసుకొందాం -మల్లినాథుడు”నను ఈశ్వరస్య కృతః ప్రమాణాని ”మొదలైన వాటిపై  మరొక ప్రశ్న లేవనెత్తి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు .దైవ0  సరైన జ్ఞాన పరివ్యాప్తుడు అని ఎలా చెప్పగలం ? అయన గురించిన జ్ఞానం ఉత్పత్తి కాదు ,కారణం అది ఫలితం  ప్రయోజనం కాదు ..కనుక జ్ఞాన పరివ్యాప్తుడుకాదు .ఈ విషయంపై వాదం లేవదీస్తూ రచయిత ప్రమాణం కు నిర్వచనం చెప్పాడు ”మితిహ్ సమ్యక్ పరీచ్ఛా త్తిరితి ” .అర్ధవంతమైన జ్ఞానం సరైన నిశ్చయం ..అది ఫలితం కాకపోయినా  దైవజ్ఞానము అనేది సరైన ఖచ్చితమైన  జ్ఞానమే కారణం అది ఖచ్చితమైన అనుభవం కనుక
   సశేషం
    మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గొల్లపూడి

గొల్లపూడి

అమెరికా వచ్చి నెలదాటినా యూ ట్యూబ్ లో కామెడీ సీన్లు ,ఫన్   బకెట్ లు తప్ప పెద్దగా రాత్రిపూట చూసినవేవీ లేవు . ”బలి ”కి బలైన మర్నాడు ఫ్రస్ట్రేటెడ్  ఉమన్ చూస్తుండగా  ఒక్కసారిగా  దృష్టి  వేరేవాటిపై పడితే ఆకెళ్ళ రాసి దర్శకత్వం చేసిన ”అల్లసానిపెద్దన”పద్యనాటకం కంటబడి వెంటనే చూశా .చాలా అద్భుతమనిపించి ”బలి ” పాల బడిన నాకు గొప్ప రిలీఫ్ ఇచ్చింది  మనసు  ఆనంద  తాండవమే చేసింది .తర్వాత ఆకెళ్ళ తో ఇంటర్వ్యూ చూశా .ఆయనలో ఎంత నిజాయితీ నిక్కచ్చితనం ఉందో  అర్ధమయింది . ఆయన శ్రీనాధ నాటకం కోసం వెతికా దొరకలేదు . మొన్నరాత్రి మా అమ్మాయి గొల్లపూడి ఇంటర్వ్యూ చూశావా అని అడిగింది .చూడలేదన్నాను చూడమంది . ఉయ్యూరులో ఉండగా ఎప్పుడూ ఇలాంటి వాటి జోలికి పోలేదు .రాత  ,చదువు తో సరిపోయేది . మా అబ్బాయి రమణ గొల్లపూడి కాలం పెట్టి వినేవాడు ఏదో ఒకటి రెండు సార్లు అటూ ఇటూ  వెడుతూ విన్నానేమోకాని పెద్దగా దృష్టిపెట్టలేదు .
అయితే మారుతీరావు తో సుమారు ఏడెనిమిదేళ్లు గా పరిచయం ఉంది .ఆయన రచనలు నటన  నాకూ మా శ్రీమతికి బాగా ఇష్టం . ఆయన ”రోమన్ హాలిడే” కథా  సంపుటి నాకు పిచ్చపిచ్చగా నచ్చి సుమారు 15 ఏళ్ళక్రితం 45 పేజీల వ్యాసం రాశాను నాకోసమే . తర్వాత మద్రాస్ లో ఉండే మా బంధువు శ్రీ నోరి రామకృష్ణయ్య గారితో పరిచయం వలన ఫోన్ సంభాషణలవల్లా ఆయన మారుతీ రావు తనకు మార్కింగ్ వాక్ మేట్ అని రోజూ కలుస్తామని చెప్పేవారు .నేను  రాసిన ఈ వ్యాసాన్ని ఫోటోస్టాట్ తీసి రామకృష్ణయ్యగారికి పోస్ట్ లో పంపించి ఆయనకు నచ్చితే మారుతీ రావు కు ఇమ్మని రాశా .ఆయన  చదివి బాగా నచ్చిందని గొల్లపూడి ఇచ్చానని ఆయన చదివి చాలా సంతోషించాడని ఫోన్ లో చెప్పి , మారుతీరావ్ ఫోన్ చేసి నాతో మాట్లాడు తాడు అని చెప్పారు .అన్నట్లే ఒక రోజు ఉదయమే గొల్లపూడి ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా నాతో మా శ్రీమతితో మాట్లాడాడు . అందరికీ గర్వంగా చెప్పుకున్నాం .తర్వాత నేను ఆ స్క్రిప్ట్ ను  సరసభారతి బ్లాగ్ లో రాశా . ఆయన దాన్ని సి డి చేయించి పంపమంటే పంపాను .నా మెయిల్స్ కూడా పంపేవాడిని అప్పుడప్పుడు సమాధానం రాసేవాడు సరస భారతి పుస్తకాలు ప్రచురించటం ప్రారంభించాక రామ కృష్ణయ్యగారితో మరోకాపీ ని గొల్లపూడి ఇమ్మని నా సంతకం తో పంపేవాడిని ఆయన జాగ్రత్తగా అన్నీ అంద  జేసినట్లు ఫోన్ చేసేవారు .  తర్వాత రావు విశాఖ కు మకాం మార్చినట్లు కృష్ణయ్యగారు చెప్పారు అక్కడికే పుస్తకం ఆవిష్కరణ అవగానే పంపేవాడిని .
  బహుశా 2015 మార్చి లో ననుకొంటా మారుతీరావు ఒక సాయంత్రం ఫోన్ చేసి ”నిన్ననే మద్రాస్ లో   రామకృష్ణయ్య గారితో  మాట్లాడి ఇవాళ హైదరాబాద్ వచ్చాను ఎందుకో మీతో మాట్లాడాలని పించింది అందుకని చేశాను .అని పదినిమిషాలు ఆత్మీయంగా మాట్లాడారు . ఆ వారం లో జరిగిన సరసభారతి ఉగాది వేడుకలలో ఈ విషయం సభా ముఖంగా అందరికీ తెలియ జేసి గర్వపడ్డాను . కానీ నామనసులో ”మారుతీరావు కు  మనం ఇన్నిపుస్తకాలు ఆయన చదవాలని ఆత్మీయంగా పంపామే .ఆయన మర్యాదకైనా కనీసం ఒక్కటి కూడా తన  పుస్తకం నాకు పంపలేదే ”అని బాధ గా ఉండేది . ఇది పొసెసివ్ నెసో ,స్వార్థమో సంకచితభావమో ఆకాంక్షో  కోరికో ఆశో  అత్యాశో  చెప్పలేను . ఒక ఉగాదికి ఆయన్ను పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిధిగా ,ఉగాదిపురస్కార ప్రదానం తీసుకోవలసిందిగా ఫోన్ చేశా మెయిల్స్ కూడా రాశా .వస్తానని చెప్పారు .కానీ చివరికి కొత్త సినిమా ఒప్పుకున్నందువలన రాలేనని రాశారు . బెజవాడలో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు రచయితల సమావేశం లోనూ అంతకు ముందు ఒకటి రెండు సభల్లోనూ కలిశాను ఫోటోలు పంపమంటే పంపాను కూడా .
   కానీ సుమారు రెండేళ్లక్రితం వరకు ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారెవరో నాకు తెలియదు .ఒక రోజు కొరియర్ లో ఆరేడు పుస్తకాలు వారి నుంచి నాకు వచ్చాయి .వాటిలోని ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వారితో ”నా అడ్రస్ మీకు ఎలా దొరికింది నాకు ఇన్ని పుస్తకాలు ఎందుకు పంపారు ?”అని అడిగా సాహితీ ప్రియులెవరో  తెలుసుకోవటం నా కు ఇష్టం .మీ అడ్రస్ సంపాదించి పుస్తకాలు పంపాను చదివి అభిప్రాయం రాయండి ”అన్నారు .ఆ సౌజన్యానికి కరిగిపోయాయి వెంటనే చదివి ఫోన్ లో వారికి నా అభిప్రాయం తెలియజేసి సరసభారతి అప్పటిదాకా ప్రచురించిన పుస్తకాలన్నీ కొరియర్ లో పంపాను అందినట్లు ఫోన్ చేసి అభినందించారు .ఇలా మా ఇద్దరిమధ్యా ఫోన్ భాషణం కొనసాగింది అప్పటినుంచి నేనూ గీర్వాణకవుల కవితా గీర్వాణం రెండు భాగాలు కొలచల సీతారామయ్య గారిపై పుస్తకం వగైరాలు పంపాను .  సంస్కృత కవులపై నేను చేస్తున్న కృషిని మెచ్చుకొంటూ మాట్లాడారు . దానిపై ప్రముఖ విశాఖ సాహితీ పత్రిక”ప్రసన్నభారతి ” లో వ్యాసం కూడా రాశారు .న్యాయంగా ఆయన ముందు నావి హనుమంతుని ముందు  కుప్పి గంతులు ..అమెరికా వచ్చేముందు మార్చి 15 న నేనూ మా శ్రీమతి మనవడు చరణ్ విశాఖవెళ్లి డా శ్రీ రాచకొండ నరసింహ శర్మగారిని శ్రీమతిగారిని చూసి  సాయంత్రం వేదుల వారిని చూద్దామని అనుకొంటుండగా వారే ఫోన్ చేసి తప్పక రమ్మని చెప్పగా వెళ్లి సందర్శించాం . ఆయన మా ఇద్దర్నీ చూసి పులకించిపోయారు .మేము ఆదంపతులకు సన్మానం చేద్దామని నూతనవస్త్రాలు శాలువాలు తీసుకు వెడితే వారు ”మీరు మాఅతిధులు .ముందు మీకు మేము సన్మానం చేస్తాం .తర్వాతే మీరు ”అని నన్ను ఆపి తామిద్దరూ మా ఇద్దరికీ నూతనవస్త్రాలు శాలువా కప్పి సత్కారం చేసిన సంస్కారం వారిది .తర్వాత మేమూ చేసాం శాస్త్రిగారి టేబుల్ పై నా గీర్వాణం రెండుభాగాలు ముచ్చటైన అట్టలతో దర్శనమిచ్చాయి .వారు నాతో ”మీ పుస్తకాలలో విష్యం మీరు రాసిన తీరు బ్రహ్మానందంగా నచ్చాయి వాటిలో రోజుకు ఒకటైనా చదవకుండా ఉండలేక పోతున్నాను .అంత రీడబిలిటీ ఉంది మిగతావాళ్లూరాస్తే దీన్నే కీకారణ్యం చేసేవారు మీరు మహా గొప్పగా మనసుకు హత్తుకునేలా సరదాగా చదువుకోనివిషయం   తెలుసుకునేలా రీసెర్చ్ చేసేవారికిరిఫరెన్స్ పుస్తకాలుగా ఉన్నాయి మీ కృషి బహు  గొప్పది మీ రెండో పుస్తకం కోసం వేయికళ్లతో ఎదురు చూశా .అన్నారు .   అక్కడే విశాఖ సాహితీ సంస్థ నిర్వాహకులు శ్రీ ఏం ఎస్ ఆర్ ప్రసాద్ గారు ఇంకొకరు కలిశారు .  వీరుకూడా తమ ప్రచురణలు 6 పుస్తకాలు నాకు ఇచ్చారు .అందులో  శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రీ గారిపై శ్రీమతి చర్ల సుశీలమ్మగారిపై  పుస్తకం  ఆమె కుమార్తె నిడదవోలు మహిళాశ్రమం నడిపే చర్ల సరళ గారి  రచనలు ఉన్నాయి .శ్రీపాద ,సుశీలగార్లపై వెంటనే వ్యాసాలూ నెట్ లో రాశాను  నిడదవోలు ఆవిడతోఫాన్ చేసిమాట్లాడాను ఆమె  యెంతో  సంతోషించారు ఉయ్యూరు రావాలనికొరగా వస్తానన్నారు ఆమెకూ సరసభారతి పుస్తకాలు కొరియర్ లో పంపాను  ఇవన్నీ చూస్తుంటే మారుతీరావు నాకు పుస్తక0 ఒక్కటి కూడా పంపనందుకు మనసు  తొలిచేస్తున్నట్లుంది .. గతం గతః
  నిన్న మధ్యాహ్నం ” యూ ట్యూబ్ లో మారుతీ రావు కాలం పెట్టి విన్నా .ఈ పూటా విన్నా .అద్భుతం అనిపించాయి .బాలమురళి కృష్ణ సంగీత కచేరీ చేస్తూ ఎంత ఆనందిస్తూ మనల్ని ఆనందింప జేస్తారో మారుతీరావు కూడా అంతే ఫీలింగ్ తో ,హావభావాలతో చక్కని రిపిటీషన్ లతో ,నొక్కి చెప్పటం తో గత వర్తమాన భవిష్యత్తులు తరచటం లో  ఇంగ్లీష్  ను  కూడా అవసరమైన చోట వాడటం లో తెలుగులోకంటే ఇంగిలీషు లో ఇంకా బలంగా చెప్పటం లో తెలుగు భాషకు ప్రాణం పోయటం లో భారతీయ సంసంస్కృతికి పట్టం కట్టటం లో  పాశ్చాత్త్య  నాటకాల పోకడలను ఆదరణను వ్యక్తీకరించి మననాటకాలు వృద్ధి లోకి రావటానికి చేయాల్సిన ప్రణాళిక వివరణలో  పెద్దల యెడ విధేయతను వ్యక్తం చేయటం లో ,సమకాలీన రాజకీయ డొల్లతనాన్ని  ఏకి  పారేయటం లో నచ్చినదాన్ని నిష్పక్షపాతంగా  మెచ్చటం  లో తెలుగు కధకులను కధలను ఛానల్ ద్వారా వివరించి ప్రాణ ప్రతిష్ట చేయటం లో మారుతీ రావు కు సరిపోలిన వారు లేరు .కథ , నాటకం వ్యాసం విమర్శ నవల సినీ సంభాషణలు స్క్రీన్ ప్లే  నాటక రచన నటనా సినీనటన లలో ఆయన స్థాయి అందుకొనగలవారు లేరు . విషయవివరణలో ఆయన ముందుకూ వెనక్కూ వెడుతూ అతి సూటిగా శ్రోతల ప్రేక్షకుల గుండెలను తాకేట్లు చేసే స్వీయ  వ్యక్తిత్వం ప్రతిభా గొల్లపూడిది . ఆయన కాలం బ్రహ్మం గారి నేటి  కాల జ్ఞానం అని పిస్తుందినాకు .
   మా గోపాలకృష్ణగారికి ఈ కాలం ,ఆకెళ్ళ నాటకం ఇంట్రవ్యూ చూడమని  రాస్తే  చూసి పరమానంద భరితులయ్యానని రాశారు..
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17-కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లనాధ సూరి మనీష -39
   వరద రాజ విరచత తార్కిక రక్ష కు మల్లినాథుని ”నిష్కంటక ”వ్యాఖ్య -1
కవి, మహా వ్యాఖ్యాత అయిన మల్లినాథ సూరి న్యాయ శాస్త్రం లోనూ అమోఘ పాండిత్యం ఉన్నవాడని తెలిస్తే మహదాశ్చర్యమేస్తుంది అన్నాడు లాల్యే పండితుడు .వ్యాకరణం మల్లినాథుని నాలుకపై నాట్యమే చేస్తుందని మనకు తెలుసు .ఇప్పడు ఆయన న్యాయ లేక తర్క శాస్త్ర పాండితీ గరిమను తరచి చూద్దాం .దీనిలో ఆయనప్రతిభ తార్కిక రక్ష పై రాసిన వ్యాఖ్యానం వలన స్పష్టమవుతుంది .దీన్ని రాసిన వాడు వరద రాజకవి .ఈ కవి 12  లేక 14 వశతాబ్ది మధ్యకాలం వాడు ..యితడు ఆంద్ర కవి అని ”హిస్టరీ ఆఫ్  సాంస్క్రిట్ లిటరేచర్ ”రాసిన విద్యాభూషణుడు పేర్కొన్నాడు .కొందరుమాత్రం కాశ్మీర దేశస్తుడు అన్నారు . ఏ  వాడైతేనేమి అతడు  తార్కిక రక్ష రాశాడనేది నిర్వివాదం . దీనికి ఆయనే ”సార సంగ్రహ ”అనే వ్యాఖ్యానమూ రాశాడు .ఈ రెండిటిపై మల్లినాథుడు ”నిష్క0టక ”అనే వ్యాఖ్యానం రచించాడు .   వరద రాజకవి భట్టోజి శిష్యుడు .భట్టోజి రాసిన ”సిద్ధాంత కౌముది ;;ని మధ్య  సిద్ధాంత కౌముది ,లఘు సిదాంత కౌముది అనే రెండు సంక్షిప్త గ్రంధాలుగా చేశాడు .”వ్యవహార నిర్ణయం” అనేదికూడా రాశాడని అంటారు . 18 వ శతాబ్దికి చెందిన మరో వరద రాజకవి ”వ్యవహార మాల ”రాశాడని కానే పండితుడు చెప్పాడు .
   మల్లినాథుని నిష్కంటక లో 1- వర్గాలు 2-చెల్లుబాటయ్యే తార్కికం 3-8 నిర్వచనాలతో సూటి అవగాహన లేక జ్ఞానం అని మూడు భాగాలున్నాయి ..మల్లినాధుడు అనుమాన ప్రమాణం లేక అనుమితి ,ఉపాధి లను పూర్తిగా చర్చించాడు భట్ట వాదాలకు చెందిన వాటిని మల్లినాథుడు త్రోసిపుచ్చాడు ..ప్రభాకరుని ”అభావాన్ని కూడా తిరస్కరించాడు .న్యాయ సూత్రాలు రాసిన గౌతముని మార్గం లో సూరి ప్రయాణించాడు దానిపైనే ఆధారపడ్డాడు .”హేత్వాభాస ”వంటి కొన్ని అవాస్తవాలు లేక భ్రమలను ఉన్నవాటికి అదనంగా సూరి కలిపాడుకూడా.అయితే దురదృష్ట వశాత్తు మల్లినాథుని పూర్తి వ్యాఖ్యానం లభ్యం కాలేదు .మొదటి అధ్యాయాన్ని మాత్రమే విపి  ద్వివేది ప్రచురించాడు ..తార్కిక రక్ష పై వ్యాఖ్యానిస్తూనే మల్లినాథుడు తర్కం పై భూషణ ,న్యాయ కుసుమాంజలి టీక ప్రభాకర ,శా లికనాధ ,శ్లోక వార్తికాకర ,తథాగత ,ఉదయన మొదలైన ఇతరులు రాసిన లేక ఇతర  గ్రంథాలనుండి    అవసరమైనవాటిని  కూడా పేర్కొన్నాడు ..అదనపు వివరణలు ఇచ్చినా సూరి, మూల గ్రంధానికి పరిమితమై మాత్రమే రాశాడు   .ఈ విషయం పై ప్రసిద్ధ పరిశోధకుడు ప్రొఫెసర్ ఇ .ఆర్ .శ్రీకంఠ శర్మ విలువైన వ్యాసం రాశాడు అందులోని కొన్ని విషయాలను లాల్యే  తెలియ జేశాడు .
   వ్యాకరణ వివరణలను మల్లినాథుడు ”షోడశ పదార్ధ ‘ 16  విషయాలపై ఇచ్చాడు వీటిని వరద రాజుకూడా చెప్పాడు .వీటికి ఒక ప్రత్యేక వరుస క్రమాన్ని మల్లినాథుడు తెలియ జేయటం విశేషం -అదే ”ప్రమాణం వినా ప్రమేయాది సిద్ధే -విషయ  వినా ప్రమాణ ప్రవృత్తే -అసందిగ్ధస్య ప్రతి ఇత్సవాత్ -సందిగ్ధస్యాపి నిష్ప్రయోజనం అప్రతి పితిస్త్స త్వాత్ ప్రతిపత్తేశ్చదృష్టాంత ముఖత్వాత్ -అవయవాది నియమస్య సిద్ధదాం తాను సరిత్వాత్ -ప్రమాణ కరణా శరీర నిర్వర్తకాంగేత్వాత్  ప్రమాణానుగ్రాహకత్వాత్ –

తత్ఫల త్వాత్ -తస్యాపి కదా సాధ్యత్వే వాదస్య -తత్వ నిర్ణేయ ఫాలేత్వాత్ ”(తార్కిక రక్ష కారిక పై సూరి వ్యాఖ్య )

 ప్రమాణ0  పై వరద రాజునిర్వచన వివరణలో మల్లినాథుని విధానం సంక్షిప్తంగా అతి స్పష్టంగా అర్ధవంతంగా ఉంది -”సాధనాశ్రయాయో రణ్యతరత్వే  సతి ప్రామాణ్యత్వాత్ ”.ఆశ్రయ పదం ఆవ్యాప్తిని నిర్వచనంలో తొలగించి0ది .దైవం సాధనకాకాపోయినా ప్రమాణమే ”ప్రమా ”  అంటే విఙ్నానానికి అది పునాది (సబ్  స్ట్రాంటం). వరద రాజు

సాధన అవసరం లేదని దీనికి కారణం ప్రమాణాన్ని ప్రభావితం చేయటానికి ఉన్న వ్యాప్యత్వం వలన ప్రమేయం తొలగింపబడ లేనిదని అన్నాడు ..సాధనను సమర్ధిస్తూ ప్రమేయం ఉంటేనే సుఖ దుఃఖాలుంటాయన్నాడు వీటి నిర్వచనాలను ప్రయోగించటానికి సాధన శబ్దం నిర్వచనం లో ఒక భాగమై వివరిస్తుంది అంటాడు.
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా    .

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి

 

 

షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి

  Inline image 1
వైశాఖ బహుళ దశమి 21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో 17-5-17 బుధవారం నుండి 21-5-17 ఆదివారం వరకు ఉదయం 7-30 గం  నుండి 9-30 గం  వరకు 5 రోజులు నా 55 వ శ్రీ సుదరకాండ పారాయణ ,నిత్యం శ్రీ సువర్చలా0జనేయస్వామి వారలకు అష్టోత్తర సహస్రనామ పూజ  శ్రీ సువర్చలాన్జనేయ శతక పఠన0  నిర్వహింప బడుతుంది .
 21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి  నాడు  ఉదయం 9-30 నుండి 11గం  వరకు మంత్ర సహిత  ,తంత్ర రహితంగా సంకల్ప  భూశుద్ధి ,విష్వక్సేనారాధన ,పుణ్యాహ ,బ్రహ్మాద్యస్ట దిక్పాలక  ,నవగ్రహ పూజ ,రక్షాబంధన  ,కన్యావరణ మధుపర్క ,మంగళాష్టక ,చూర్ణికా ,మహా సంకల్ప ,ప్రవర అక్షతారోపణ లతో శ్రీ సువర్చలాంజ  నేయ స్వామి వారల శాంతికళ్యాణం మా దంపతులచే నిర్వహింపబడుతుంది ,
                       గబ్బిట దుర్గా ప్రసాద్ -13-5-17 -షార్లెట్ -అమెరికా 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మా పెద్దమనవడుచి సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ ఫోటోలు -షార్లెట్ యూని వర్సిటి -12-5-17

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

అమెరికా పూల ఆనందం

This gallery contains 12 photos.

More Galleries | Tagged | Leave a comment

మల్లినాథ సూరి మనీష -38

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -38

 పాకం పై వ్యాఖ్యానం -2(చివరిభాగం )
 వాక్యం లోని పదాలు ఒక దానితో ఒకటి సాఫల్య ,ఆనుకూల్య దగ్గర  సంబధం కలిగి ఉంటె ఒక కొత్త భావం ఆవిష్కరింపబడుతుంది అదే తాత్పర్యం .అదొక ప్రత్యేక ప్రయోజనం .సముచ్ఛయమైన ”దద్నా  జుహోతి ”లో పెరుగులు  అనే అర్ధం మరొక చోటు నుండి పొందాల్సి ఉంటుంది .అది పునరుక్తి అవుతుంది అది పెరుగు కు త్యాగానికి అసాధ్యమైన సంబంధమవుతుంది ఇదే తాత్పర్యం తనభావానికి మద్దతుగా మల్లినాథుడు రుయ్యకుని భావాన్ని తెలియబరచాడు -”పదార్ధ వాగమసమనంతర భావినీ సమన్వయ శిక్త స్తాత్పర్యం ”ఇక్కడ సమన్వయ అనే మాట చాలా ముఖ్యమైనది .అంటే వేరే  భావం వచ్చే అవకాశముంది కనుక ..తాత్పర్యం సాధారణంగా అర్ధవంతమై సూచనగా ఉండాలి .
 కనుక అలంకారాలలో తాత్పర్యం ప్రధాన భూమిక వహిస్తుంది .ఈ కీలక భావాన్నే మల్లినాథుడు చాలా విస్పష్టంగా తెలియ బరచాడు .అలాగే ”ఉపచార”అనే పదం అలంకారశాస్త్రం లో తరచుగా వాడబడే పదం పి .వి .Kane  పండితుడు ఉపచారా పదానికి చాలా అర్ధాలు చెప్పాడు ..ఉపచారను రూపకం గా భావించాడు .కారణం ఇది రెండు వస్తువులు విభిన్నంగా ఉండి సాధారణం గా అనుమానాన్ని మరుగు పరచి అసామాన్య పోలికను బలపరుస్తుందికనుక .kaneపండితుడు ఈ భావాన్నే మిగిలిన అలంకారికులు కూడా ఉపయోగించారని చెప్పాడు ..కానీ ”తరళ ”వ్యాఖ్యానం లో మల్లినాథుడు మరింత చిన్న నిర్వచనాన్ని ”ఉపచార ”కు ఇచ్చాడు -”అత త్వస్య తత్వేనవ్యపదేశహ ”-”భిన్నత్వేన  ప్రతీయ మానయోరేవే యారోపణమూపచారః ”న్యాయ వార్తికలో ఇవ్వబడినదానికి ఈ నిర్వచనం అతి దగ్గరలో ఉంది .”.వీటన్నిటిని బట్టి చూస్తే విద్యాధరుని ”ఏకావలి ”అనే కంఠాభరణం  మల్లినాథుని తరళ వ్యాఖ్య అనే మెరుగు చేత మరింత ప్రకాశించింది అని స్పష్టం గా  చెప్పవచ్చు ”అన్నాడుడా  పి జి..లాల్యే   పండితుడు .
  ఇంతటితో  విద్యాధరుని  ఏకావలి కి మల్లినాథ సూరి వ్రాసిన తరళ  వ్యాఖ్యానం పై వివరణ పూర్తయింది .
  తరువాత వరద రాజపండితుడు రాసిన ”తర్క రక్ష”కు మల్లినాథ సూరి రాసిన ”నిష్క0టక ”వ్యాఖ్యాన విషయాలను తెలుసు కొందాం .
 సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా .
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -102 మేడూరులో ఉద్యోగం -3

నా  దారి తీరు -102

             మేడూరులో ఉద్యోగం -3
సీనియర్ గుమాస్తా వెంకటరామయ్య రిటైర్ అయ్యారు .ఆయన బదులు సమితినుంచి లోయ శంకరరావు అనే కుర్రాడు వచ్చాడు .చాకు .కాంగ్రెస్ నాయకులతో బాగా పరిచయమున్నవాడు .పని వేగం గా నిర్దుష్టంగా చేసేవాడు .జిల్లాపరిషత్ లో కూడా మంచి పరిచయాలుండటం తో పంపిన బిల్లులు కావాల్సిన ఆర్దర్లు త్వరగా సాంక్షనై  వచ్చేవి ..ఇద్దరు ముగ్గురు లెక్కలమేస్టార్లు బదిలీ అయి కొత్తవారు చేరుతుండటం తో ఇబ్బందిగా ఉండేది పదవతరగతి పిల్లల్ని పరీక్షకు తయారు చేయటం లో లెక్కల ప్రసాద్ బాధ్యత ఎక్కువయ్యింది అయినా చాలా సమర్ధంగా చేశాడు . లైబ్రరీ పై అంతస్తులో ఉండేది .చాలాపుస్తకాలు ఇక్కడే చదివాను . దానికి అనుబంధంగా హాలు ఉండేది .ఎవరైనా మేష్టారు సెలవు పెడితే ఎక్స్ట్రా వర్క్ గా పిల్లల్ని లై బ్రరీకి పంపి పుస్తకాలు మేగజైన్లు చదివించేవాళ్ళం .ఇది నేను రాకముందు నుంచే ఉంది . డ్రాయింగ్ మాస్టర్ కాటూరి ప్రసాద్ కాటూరు వాడు మాతో పాటే ఉయ్యూరు నుంచి వచ్చేవాడు మంచి ఆర్ట్ ఉన్నది. మరో మొహంజదారో నాటకం ,అక్కినేని ఆదుర్తి తీసిన ఆర్ట్ సినిమాలు సుడిగుండాలు ,మరోప్రపంచం  లకు సంభాషణా రచయిత మోదుకూరి జాన్సన్ దగ్గర పని చేసినవాడు పాటలు రాసేవాడు బాగా పాడేవాడు .జాన్సన్ తో తన అనుభవాలు చెప్పేవాడు ..ఈయనను ఎలా బాగా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తున్నాను  .లైబ్రరీహాల్ లో గోడలమీద మంచి సూక్తులు ,పద్యాలు రాయించటం తో మొదలుపెట్టి భారత దేశం మాప్ వేయించి ,సైన్స్  రూమ్ లో మానవ శరీర బాగాలు  పీరియాడిక్ టేబుల్ వేయించి అతని కళను సద్వినియోగం చేయించాను ..
  ప్రతి సెక్షన్ వాళ్ళూ ఒక జాతీయ నాయకుని ఫోటో తమక్లాసు రూమ్ లో స్వంత   ఖర్చులతో క్లాస్ టీచర్ల సహకారం తో పెట్టించాను .సైన్స్ రూమ్ లో సైన్టిస్ట్ ల ఫోటోలు ,ట్యూబ్ లైట్ల అమరిక చేయించాను ..పెద్ద బావికి మోటారు ఉండేది ఆ నీరు కొబ్బరి చెట్లకు పారించటం ,గార్డెన్ లో కూరగాయలు పండించటం అవి వేలం వేసి డబ్బు జమ చేయటం ఉయ్యూరయ్యే చేసేవాడు . కొబ్బరి చెట్ల  పోషణ బాధ్యతా అతనిదే .స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే లను ఘనంగా నిర్వ హించేవాళ్ళం .ఆడపిల్లలు ఎక్కువమందిఉన్నా పాటలు పాడేవాళ్లు ఉండేవారుకాదు . పమిడిముక్కలలోడా కృష్ణారావు గారు మేడూరు వారే .ఆయన అక్కడ ఒక కాన్వెంట్ నడిపేవారు భార్య ప్రిన్సిపాల్. ఆయన్ను ఫంక్షన్ లకు పిలిస్తే వచ్చేవారు ..సంస్కారమున్న మనిషి .తెలుగు దేశం పార్టీలో పెద్ద లీడర్ కూడా . పమిడిముక్కల నుండి వచ్చే డ్రిల్ మాస్టారు రిటైరయ్యారు  ఆ సందర్భం గా స్టాఫ్ ఆయనకు సన్మానం చేసి వీడ్కోలు సభ నిర్వహించాము ఆయన ఆటలలో బాగా ఆడినవారికి బహుమతులు ఇవ్వటానికి కొంత డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్ కు ఇచ్చారు .ఈ వ్యవహారం తెలుగు మేష్టారు చూసేవాడు . డ్రిల్ మాస్టారు చాలా సంతోషంగా మా అందరికీ పెద్ద పార్టీ కూడా ఇచ్చారు ..మేడూరులో ఎల్ ఐసీ ఏజెంట్ ఒకాయన ఉండేవాడు మంచివాడు చిన్నతరగతులకు ట్యూషన్ చెప్పేవాడు .మేడూరు పోస్ట్ మాస్టారు బాగా సహకరించేవాడు . అప్పుడు పబ్లిక్ పరీక్ష  ఆన్సర్ పేపర్లు పోస్టాఫీస్ ద్వారా ఎవరికి అంటే ఏ సెంటర్ కి పంపమంటే ఆ సెంటర్ కు పంపేవాళ్ళం ఇక్కడ పోస్ట్ మధ్యాహ్నం 2 కు క్లోజ్ .ఈ లోపల బండిల్ తయారుకాకపోతే మర్నాడు పోస్టులో పంపేవాడు ..నాకు అనుమానం వచ్చేది . నేను అక్కడినుంచి వచ్చాక డబ్బు బాగా తినేశాడని ఆరోపణవచ్చి ,రుజువై సస్పెండ య్యాడు .అతనికొడుకు అప్పుడు బడిలో చదివే వాడు తర్వాత అనేక ఉద్యోగాలు చేసి ప్రస్తుతం బెజవాడ  వన్ టౌన్ పోస్టాఫీజు లో పని చేస్తూ అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు
      వార్షికోత్సవం జరపటానికి అన్నితరగతులవారికి వక్తృత్వ వ్యాస రచన క్విజ్ పోటీలు నిర్వహించాం .ప్రతి క్లాసులో ఎక్కువ శాతం హాజరున్న వారికీ ,సంచాయికలో ఎక్కువ డబ్బు పొదుపు చేసినవారికి  పైతరగతులలో  క్రింది తరగతులలో   మంచి క్రమశిక్షణతో మెలగినవారికి ఉత్తమ విద్యార్థి పురస్కారం ఇచ్చాము ఆటలు క్రీడలలో పోటీలు పెట్టి జూనియర్స్ ,సీనియర్స్ కు వేరుగా ,అలానే ఉపాధ్యాయుల మధ్య బాడ్ మింటన్ వాలీ బాల్ పోటీలు పెట్టి వారికీ బహుమతులు ఇచ్చాము .క్రీడా విషయాలన్నీ డ్రిల్ మేష్టారు సుబ్బారావు గారే చూసేవాడు .వార్షి కోత్సవానికి మేడూరు వాసి రేడియోలో పాడీ  పంట నిర్వాహకులు యలమంచిలి హనుమంతరావు గారిని ఆహ్వానించాం ..వారు స్ఫూర్తి  దాయక ప్రసంగం చేశారు .ఎందరో దాతలు ఫిక్సెడ్ డిపాజిట్లు చేశారు ..ఆ  వడ్డీ  డబ్బులు బాంక్ నుంచి తీసి ఎవరికోసం నిర్దేశింప బడిందో వార్షికోత్సవం రోజున అంద  జేయటం అలవాటు అలానే చేసాం .ప్రతి తరగతిలో  ఫస్ట్  సెకండ్ థర్డ్  వచ్చినవారికి మంచి విలువైన పుస్తకాలు కొని బహూకరించాం
   పద వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర కోస్తున్నాయి .హయగ్రీవం గారు హెడ్ మాస్టర్ గా ఉండగా ఉయ్యూరునుంచి మేము వాచర్లుగా వచ్చాము .అంతా యమా డి ప్లిన్ గా కనిపించేది .కానీ కాపీలు తెగ కొట్టేవాళ్ళు .ఎప్పుడూ వీళ్ళ పాస్  శాతం 80పైన ఉండేది నేను డేగ చూపుతో అన్నీ కనిపెట్టి లాగేసి అక్రమం జరక్కుండా చూశాను నా రూమ్ లో కానీ అందరూ అలా ఉండరు . ఆ ఏడు కఠినంగా మేస్టార్లు అందరం  ఒకే మాటమీద ఉండటం తో శాతం 50 కి పడిపోయింది .వాపు తప్ప బలుపుకాదు ఇప్పుడు  నేనే పరీక్ష నిర్వహించాలి .కనుక అతి జాగ్రత్తగా ఉన్నాను .శంకర రావు ను కూడా లైన్ లో పెట్టాల్సి వచ్చింది . ఇక్కడికి ఆగినపర్రు విద్యార్థులు కూడా వచ్చి పరీక్ష రాశారు .ఆ మేస్టార్లు వాచర్లుగా వచ్చారు వారిని మేడూరు పిల్లలున్న రూమ్ లకు వేయాలి అందులో ఒక సైన్స్ మేష్టారు బాగా ట్యూషన్లు చెప్పేవాడు .ఆయన చాలా లూజుగా ఉన్నట్లు మొదటి రోజే గమనించి అత్య0త  జాగ్రత్తగా ఉండి”  రేకాడ ”కుండా చేశాను పరీక్ష హాలులోకి ప్రవేశించేముందే అందర్నీ పూర్తిగా చెక్ చేసి పంపేవాళ్ళం నేనూ డిపార్ట్ మెంట్ ఆఫీసరూ అయినా ”ఎక్కడో ”దాచి దొరికి పోయేవారు .ఆ ఏడాది ఏం ఆర్ ఓ కూడా విజిటింగ్ కు వచ్చేవాడు డిపార్ట్ మెంట్ వాళ్ళుకాక .చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు . రెండుమూడుసార్లు విజిట్ కు వచ్చాడు నాకు సంతోషంగా ఉండేది .పరీక్షలన్నీ బాగానే జరిగాయి అనుకొన్నసమయం లో చివరి పరీక్ష సోషల్ -2 లో యెంత జాగ్రత్తపడ్డా ఒక మేడూరు కుర్రాడే కాపీ తీసి పట్టుబడి సస్పెన్డ్ అయ్యాడు .నెత్తీ నోరూ కొట్టుకుంటూనే ఉన్నా0 అందరం .ఇదొక లోపం తప్ప అంతా  సవ్యంగా జరిగింది   ,
  అలాగే ఏడవతరగతి పరీక్షలూ నిష్పక్షపాతంగా జరిపాను . ఇలా కఠినంగా ఉండటం సర్పంచ్ కి ఇష్టం లేదన్నట్లు వార్తలు విన్నాను ఎవరికోసమో పనిచేయం కదా మన ఆత్మా తృప్తికే డ్యూటీ . మేడూరు లో పని చేస్తుండగానే మా పెద్దబ్బాయి శాస్త్రికి చి సౌ ములగలేటి   సమతకు వివాహం జరిగింది .ఆ అమ్మాయి మా ఇంటికి పెద్దకోడలు .చలాకీ గా ఉండేది అలాంటి అమ్మాయి కోడలుగా రావాలని అనుకొన్నాం .అలాగే ఆ అమ్మాయి చాలా బాధ్యతగా ఉంటుంది అన్నివిషయాలలో . మేడూరు స్టాఫ్ అందరూ బెజవాడ వచ్చారు పెళ్ళికి . ఇక్కడ ఉండగానే మ్యూజిక్ వాల్ క్లాక్ కొన్నాం బెజవాడ వెళ్లి . హెడ్ మాస్టార్ల లిస్ట్ ఉన్న బోర్డు లు ,ఏడు ,పది  పాస్    శాతం  ఫాస్ట్ వచ్చిన వారిపేర్లు రాయించాను .స్కూల్ యెట్ ఏ గ్లాన్స్ కూడా
    మేడూరి రామమోహనరావు గారు అనే యలమంచిలి రామమోహన రావు  గారు బాడీనిర్మాత వితరణ శీలి  జూన్ నాటికి మరణించి సంవత్సరం అవుతోందని ,ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేయాలని స్టాఫ్ లో ఆలోచన వచ్చింది .బాగుంది అని ముందు స్టాఫ్ మెంబర్లు చందాలు వేసుకొని మిగిలినవారి వద్ద వసూలు చేయాలని నిర్ణయించాను నేను వెయ్యి నూట పదహార్లు వేశాను ,అలాగే జీతం బట్టి లేక వారిష్టం ప్రకారం చందాలు వేశారు . దీనికి రసీదు పుస్తకాలు వేయించాం .సర్పంచ్ వగైరాలూ బాగా సహకరించాం .అయితే విగ్రహం తయారు చేసేదెవరు అనేది ప్రశ్న అయింది ఎవరికీ ఏమీ తెలియదన్నారు .అప్పుడు తెనాలిలో అక్కలమంగయ్య అనే ఆయన కొడుకు బాగా చేస్తాడని ఒక సారి వెళ్లి కనుక్కోమని చెప్పాను దీనికి సుబ్బారావు లాబ్ అసిస్టెంట్ ప్రసాద్ స్టాఫ్ సెక్రెటరీలకు బాధ్యత అప్పగించాం వాళ్ళు వెళ్ళిమాట్లాడి చేస్తానని అనగానే అడ్వాంస్ ఇచ్చారు . కొంత షేప్ వచ్చాక మళ్ళీ చూసి రమ్మని పంపాము బాగా నే వచ్చింది అన్నారు ఫోటోలు తీయించి వారి కుటుంబ సభ్యులకు చూపించి వారి ఆమోదమూ పొందాం .మేడూరులో పని చేసి వెళ్లినవారందరికీ ముందుగానే ఆహ్వానపత్రాలు పంపాము అందులో ఆయనపై అభిమానం ఉన్నవారందరూ డబ్బులు పంపారు కంచు విగ్రహం చాలా ఖరీదు అని భావించి బస్ట్ సైజు తో తేలిక విగ్రహానికి ఆర్డర్ ఇచ్చాము .విగ్రహం జూన్ 10 నాటికి అందజేయాలని చెప్పాం సరేనన్నాడు శిల్పి .
         సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -36

ఏకావాలి పైవ్యాఖ్యానం లో మల్లినాథుని ప్రత్యేకతలు

ఇప్పటిదాకా మనం అలంకారాలపై మల్లినాథుని వ్యాఖ్యలను పరిశీలించాక  ఆయనలోని సునిశిత  , సూక్ష్మ పరిశీలానా దృష్టికి ఆశ్చర్య చకితులమవుతాం ..ఇప్పుడు ఏకావళిపై సూరి రాసిన తరళ  వ్యాఖ్యానం లోని కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకొందాం . ఆయన పాండిత్యగరిమ  ,పారదర్శకత వ్యాఖ్యానం లో  ప్రస్ఫు ట మై అబ్బురపడతాం .వ్యాకరణ సిద్ధాంతాలపై ఆయనకున్న ప్రస్ఫు ట అవగాహనకు ఆశ్చర్య పడతాం
  తరళ  వ్యాఖ్యానం లో అతి సూక్ష్మ కీలక భావనలను ఆయన అతి సునాయాసం గా అత్యంత స్పష్టంగా వివరించాడు .క్రియ యొక్క ప్రాముఖ్యత ఒక పదం లోలేక సమ్మేళనం లో ముఖ్యంగా కానీ గౌణంగాకాని కానీ సహాయకారిగా ఉంటె  క్రియను సంభావించని లోపం వలన అది ప్రాముఖ్యత చెందుతుంది దీన్నే అవిధేయతా విదేయాంశ అన్నాడు .తద్ధితాలలో లోకూడా ఇలాంటి లోపమే ఉంటుంది .దీనికి ఆపవాదు  ఉదాహరణ ఇస్తూ ,క్రియ యొక్క ప్రధాన స్వభావం కొన్ని విభక్తులలో లోపం కాదు నరసింహ భారతి లో భారతి యొక్క ప్రాధాన్యత తద్ధితమైన నరసింహ వలన తగ్గలేదు అని చెప్పాడు .-”నరసింహీ భారతీత్యుక్తే నరసింహ సంబంధ భారతీ పరత్వం ప్రతీయతే న తు నరసింహ పరత్వం ప్రకృత్యార్ధ ప్రాధాన్యక్కారేణ ప్రత్యయేన్ స్వార్ధ ప్రాధాన్య ప్రకాశనా దిత్యర్ధహ్ ”
  మల్లినాథుడు మరో ఉదాహరణ  ఇచ్చాడు .వైశ్వ దేవిక్  ఆమీక్షా ” అంటే పెరుగు మజ్జిగ మిశ్రమం   వైశ్వ దేవికి  నైవేద్యం అని అర్ధం .ఇక్కడ ఆమీక్ష అనేది ఒక ప్రత్యేక పదార్ధం దేవునికి నైవేద్యగా తయారు చేయటం .ఇది తద్ధితమైన అన్  ను వైశ్వ దేవి ని బలీయం చేసింది -నరసింహ భారతి లో భారతి నరసింహ శబ్దానికి సమందించి నట్లుగా . దీన్ని మల్లినాథుడు ఇలా వివరించాడు -”విభక్తిరహి ప్రతిపాడుకాదుత్పన్నా తదర్థస్య విశేషతః సామాన్యతో వా సంబంధం బోధయ0 తీ న తస్య విధేయస్య ప్రాధాన్యం తాత్పర్య విషయతారూప0 తిరోధతే -తద్ధితస్తు తస్యేదామితి  తత్సంబంధ న్య ర్ధాంతరే విహితస్యే వ  ప్రాధాన్యం గమయనన్  ప్రకృత్యార్ధ ప్రాధాన్యం వ్యాహన్తీ త్వన్యాయ వ్యతిరేకా భ్యామ వగమ్యత ఇత్యర్ధహ్ ”
  మూలానికి   విభక్తి తగిలిస్తే అది దానికి సామాన్యంగా కానీ ప్రత్యేకంగా కానీ సంబందాన్నిస్తుంది   తాత్పర్యం లో భేదం రాదు తద్ధితమ్ కనుక తస్య ఇదం తో కలిస్తే ప్రాధానమైనదాని  ప్రత్యేకత తెలుపుతుంది .ఇవి దన్తమ్కు రుణాత్మక చర్చలద్వారా సాధించాలి నరసింహ భారతిలో భారతి ప్రధానమై నరసింహకు విశేశార్ధాన్నిచ్చింది దీన్ని మల్లినాథుని వృత్తి లో స్పష్టంగా వివరించాడు -”అక్లాండం ముఖం చంద్ర ఇతి ప్రయోగే శబ్దాదన్య దాత్వేపి విశేష్య ముఖ చంద్ర గతోక్త ర్ష హేతు త్వె న తద్ది శేషణ యో  సకలంకత్వా కళంకాన్వయో ర్వి ధేయత్వాత్  ప్రాధాన్యం తాత్పర్య విషయత్వ రూపం వివేప్యయో రముఖ చంద్రయో నృ దామన్యో రప్రదాన్యం చార్యా సిధ్య నృవాద  సమ ర్య రూపాదవగమ్యతా   ఇత్యర్ధహ్ -వృత్తో   తు  నైవం ”
ముఖం కళంకరహితం .చంద్రుడు కళంక  సహితుడు .కనుక ముఖం చంద్రునికంటే ప్రకాశయానం .ఇది విద్యానువాదం వలన బలీయమైంది .నరసింహస్య బదులు నరసింహి  అని ఉంటె విశేషణం క్రియగా భాసించదు .ఈ విధంగా మల్లినాథుని తరళ  వ్యాఖ్యానం లో కీలక భావనలపై అతి సంక్షిప్త స్పష్ట నిర్వచనాలున్నాయి .ఈ నిర్వచనాలు ఏకావలికి రాసిన వృత్తి లోనూ కనిపిస్తాయి .కొద్దీ తేడా ఉంటుంది వివరణలో .వృత్తిని వక్రీకరించకుండా నిర్వచనాలను మరింత సరళం చేసి పునర్మించాడు .
   తరువాత ఒకసారి” పాకం ”లో మునుగుదాం
    సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -101 మేడూరులో ఉద్యోగం -2

నా దారి తీరు -101   మేడూరులో ఉద్యోగం -2

డూరులో ఉద్యోగం -2 ఒకవారం రోజులు రోజంతా అందరు మేష్టర్ల క్లాసులకు వెళ్లి పావుగంటలోపల సమయమే ఉండి ఎవరెవరు ఎలా బోధిస్తున్నారో పరిశీలించాను . లెక్కలమేస్టారు  ప్రసాద్ ,తెలుగుమేస్టర్  శర్మ  హిందీపండిట్ సావిత్రి గార్లు తప్ప అంతమంది లో ఎవరూ ఆప్ టు ది మార్క్ గా అనిపించలేదు .వీళ్లంతా రామమోహనరావు గారి జమానాలోవాళ్ళు . వాళ్ళదగ్గర అతివినయంగా ఉండటమే తప్ప బోధనలో మెళకువలు లేవు .మరో తమాషా నేను గమనించింది సాయంకాలానికి రామ మోహన రావు గారబ్బాయి దగ్గరకు స్కూల్   లోని అన్నివిషయాలూ చేరేసే వాళ్ళు .వీళ్ళనే గడప పూజారులు అనేవాళ్ళం  గుమాస్తా  ఉయ్యూరయ్య నిఖార్సైన మనిషి .లెక్క అంతా పకడ్బందీ స్కూల్ అకౌంట్ డబ్బులు కూడా అతని చేతికే ఇచ్చాను .ఎక్కడా తేడా రాదు .అంత నమ్మకం .గొల్లలు అతనే  రిటైరయ్యాక మేడూరు సర్పంచ్ గా ఎన్నికై మంచి పనులు చేశాడు . అంతా  బాగానే ఉంది కానీ ఎక్కడో ఇరుకు గదిలో నేనున్నట్లు ఫీలయ్యాను . నాకు స్వతంత్రం గా ఉండి  అన్నిపనులు సమర్ధంగా చేయటం ఇప్పటిదాకా అలవాటు .ఇక్కడ సాంస్కృతిక విషయాలేమిటో టీచర్లకూ పిల్లలకూ తెలియదు .ఇంతవరకు అల్లాంటివి ఇక్కడ జరగ లేదని చెప్పేవారు . అయినా నా పద్ధతిలో  వీటిని అధిగమించి నడపాలని నిర్ణయానికొచ్చాను .ముందుగా ప్రతిరెండవ  బుధవారం మిగతా చోట్ల చేసినట్లే సాయంత్రం చివరి పిరియడ్ లో వాటిని క్లాస్ టీచర్ల చేత నిర్వహించే పధ్ధతి మొదలుపెట్టాను వక్తృత్వ వ్యాసరచన క్విజ్ పోటీలు గా వీటిని చేయించాను  సైన్స్ క్లబ్ అంటే కూడా వీళ్లకు తెలీదు సైన్స్ మేష్టర్లతో దాన్ని ఏర్పాటు చేయించి సైన్స్ రూమ్ లో నెలకొక ప్రోగ్రామ్ చేయించాను .ప్రసిద్ధులైన సైన్టిస్ట్ ల జీవితాలను వారి పరిశోధనలను ఒకరిద్దరు విద్యార్థుల చేత సైన్స్ టీచర్ పర్య వేక్షణలో తయారు చేయించి మాట్లాడించాను .ఇవి విద్యార్థులలో బాగా క్లిక్ అయి నాపై విశ్వాసం కలిగించాయి ..అంతా బాగానే ఉంది అనిపించిన సమయం లో ఒక తమాషా జరిగింది .

   ఒక రోజు ఉయ్యూరు నుంచి బస్ లో వచ్చి నడిచి స్కూల్ కు వస్తుండగా రోడ్డుమీద చాక్ పీసు తో నాకూ హిందీ పంతులమ్మకు అక్రమ సంబంధం అంటగట్టే రాతలు కనిపించాయి  రోడ్డుకు అడ్డంగా రెండుమూడు చోట్ల ఉన్నాయి చదివి కామ్ గా స్కూల్ లోకి వెళ్లి నా పని నేను చేసుకుంటున్నాను . అసెంబ్లీ అయింది క్లాసులు మొదలయ్యాయి .ఒక గంట తర్వాత డ్రిల్ మేస్టర్ సుబ్బారావు గారు నా దగ్గర కొచ్చి ”హెడ్ మాస్టారూ !రోడ్డు మీద ఎలా ఛండాలంగా రాశారో చూశారా ?”అని అడిగాడు .నేను ”ఏమో నండీ తలవంచుకుని నేను రోజూ లాగానే వచ్చాను .ఏమీ చూడలేదు .అని చిన్న అబద్ధం ఆడాను.  అసలు విషయం చెప్పాడు . అప్పుడు నేను ”నేను మగాడిని .సర్దుకు పోవచ్చు ఆమె లేడీ టీచర్ ఆమె చదివివుంటే యెంత బాధ పడుతుందో ఆలోచించండి . మా ఇద్దరి ప్రవర్తన పై స్టాఫ్ లోకాని పిల్లలలో కానీ ఊరిజనం లో ఏమాత్రం అనుమానం ఉందని భావి0చినా  నేను ఈక్షణమే సెలవు పెట్టి వెళ్ళిపోతాను .ప్రెసిడెంట్ గారికి చెప్పి ఆయనకు ఇష్టమైన వారిని వేయించుకోమని చెప్పండి నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా బాధ లేదు ”అన్నాను ..వెంటనే ”కాదు సార్ !ఇలాంటివి ఉపేక్షిస్తే చాలాప్రమాదం .మీకయ్యింది .రేపు వేరెవరికైనా అవచ్చు ఆడపిల్లలపై రాయచ్చు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ”అన్నాడు .”బడి డిసిప్లిన్ చూసేది మీరు కనుక మీరూ లెక్కలమేస్టారు  స్టాఫ్ సెక్రెటరీ ,శర్మగారు కలిసి కూర్చుని చర్చించి అసలు రాసిన వాళ్ళు ఎవరో ఏ ఉద్దేశ్యం తో రాశారో కనుక్కుని  తేల్చండి  వాళ్ళ పేర్లు నాకు ఇస్తే క్రమ శిక్షణ చర్య తీసుకుంటాను .ముందుగా హిందీ పంతులమ్మగారికి మనందరి తరఫున సారీ చెప్పి తర్వాత పనిలో దిగండి ”అన్నాను . మంచి ఆలోచన అని అని ఆపనిలో దిగి దోషుల్ని తేల్చి నాదగ్గరకు పంపించి వాళ్ళూ వచ్చారు . ఇద్దరో ముగ్గురో ఉన్నారు పిల్లలు .వాళ్ళు ఎవరో తమతో చేయించారని నిజం చెప్పారు .కూపీ లాగితే అక్కడ రిటైర్ అయిన హిందీ పంతులు ట్యూషన్ కింగ్ పని అని తేలింది .అందరిదగ్గర క్షమాపణ ఉత్తరాలు రాయించి ,తలిదండ్రులను పిలిపించి ఇది మొదటి తప్పుకానుక వదిలేస్తున్నాను కానీ మా స్టాఫ్ కి ఇది చాలదు ఇంకా మీకుకఠిన మైన పనిష్ మెంట్ ఇవ్వాలంటున్నారు అని బెదిరించి తలో నాలుగు డ్రిల్ మిస్టర్ చేత పీకించి వదిలేశా .ఉడత ఊపులు ఊపుదామని ప్రయత్నం .స్టాఫ్ మీటింగ్ పెట్టి జరిగిన విషయం వివరించి హిందీపంతులమ్మగారికి అందరం క్షమాపణ చెప్పాం .ఆమె కన్నీరు మున్నీరు గా ఏడ్చింది .మేమిద్దరం బ్రాహ్మణులం అవటం రోజూ బస్ లో ఉయ్యూరు నుంచి రావటం ,ఆమె మా ఇంటిదగ్గరే రాజా గారి కోటలోని ఇంట్లో అద్దెకుండటం ఇంతటి సీన్ ను క్రియేట్ చేయించింది .మళ్ళీ ఇలాంటి దేదీ నేనుండగా జరగలేదు .అందరం మర్చిపోయి మాపనులు మేము చేసుకు పోతున్నాం .సర్పంచ్ కూడా వచ్చి జరిగిన దానికి బాధపడి పునరావృత్తం కాకుండా జాగ్రత్త తీసుకుంటానని హామీ ఇచ్చారు . మళ్లీ  గాడిలో పడింది స్కూల్ .
  సోషల్ మేష్టారు మస్తాన్ గార్ని పిలిచి ”మాక్ పార్లమెంట్ ”జరిపించమన్నాను .ఆయన అలాంటి మాట తానింతవరకు  వినలేదని చెప్పాడు .అప్పుడు దానికి కావలసిన అన్ని విషయాలూ నేనే సేకరించి ఆయనకు ఇచ్చి ఎలా నడపాలో నేర్పించి పిల్లలకు శిక్షణ నిప్పించి నెల రోజుల్లో పిల్లల్ని తయారు చేయించి నిర్వ హింప జేశాను అద్భుతంగా చేశారు పిల్లలు ప్రశ్నోత్తరాలు ,బిల్లు ప్రవేశపెట్టడం చర్చ బిల్ పాస్ చేయించటం అన్నీ పార్లమెంట్ లో జరిగినట్లు జరిపించాను .బ్రహ్మానంద పడ్డారు విద్యార్థులు తలిదండ్రులు మేస్టార్లు .అక్కడ ఒక చరిత్ర సృష్టించాను ..వీటితో నేనేది చెప్పినా చేయటానికి అందరూ సిద్ధమయ్యారు .
  మేడూరుకు దగ్గరలోనే ఐలూరు పుణ్య క్షేత్రం ఉంది  -.దీన్ని ఉభయ రామ లింగేశ్వర  క్షేత్రం అంటారు .ఇక్కడా కృష్ణకు అవతలి ఒడ్డున గుంటూరు జిల్లా చిలుమూరు లో శ్రీరాముడు శివలింగ ప్రతిష్టాపన చేశాడు ఏకకాలం లో కృష్ణానది దానిప్రక్కనే ప్రవహిస్తుంది  ఐలూరు కు ఫీల్డ్ ట్రిప్ ఎప్పుడైనా వెళ్ళారా అని అడిగా స్టాఫ్ ని .అలాంటి వాసనే మాకు తెలీదుఅన్నారు .ఆశ్చర్యం వేసింది .సరే దీన్నీ సాధించాలి అనుకోని ఒక రోజు మధ్యాహ్నం ఉదయం పూట  బడి అవగానే పిల్లలని తీసుకు వెళ్లే ఏర్పాటు చేసాం .నది ఒడ్డున కూర్చుని ఏదైనా ఫలహారం  తింటే  బాగుంటుంది అనిపించి సెక్రెటరీకి ఆ బాధ్యత అప్పగించాను .ఈ వార్త ఊర్లో సంచలం కలిగించి మహిళలు ఒక బృందంగా ఏర్పడి అందరికి కావలసిన పులిహోర తయారు చేయించి  పెట్టుకు తినటానికి గిన్నెలు గరిటెలు కాగితాలు మంచి పండిన అరటిపళ్ళు వాళ్ళే సిద్ధం చేసి మాకు ముందే తెలియబరచి రిక్షాలో మాతో పంపించే  ఏర్పాటు  చేశారు . ఇందులో ఉయ్యూరయ్య పాత్ర బాగా ఉంది మంచి చెయ్యాలనుకొంటే  కలిసి వచ్చేవారెప్పుడూ ఉంటారు . అందరం బృందాలుగా క్లాస్ వారీగా వెనక ముందు టీచర్లతో నడక సాగించి ఒక అరగంటా ముప్పావు గంటలో ఐలూరు కృష్ణా నది ఒడ్డుకు చేరి సేద తీరి వెంట తెచ్చినవి పిల్లకు మేష్టర్లకు అందరికీ పంచి సంతృప్తి కలిగించాం .ఇక్కడి దేవాలయ చరిత్రను నేను తెలుగు మేష్టారు  అందరికి వివరించాం తర్వాత దేవాలయాన్ని  సందర్శించి మళ్ళీ బడికి నడిచి వెళ్లాం . ఈ ఫీల్డ్ ట్రిప్ గొప్ప స్పందన కలిగించింది ఊర్లో . ఏపనికైనా సహాయ సహకారాలు అందిస్తామని ముందుకొచ్చారు ..
   పిల్లల తో  బాడ్ మింటన్  వాలీబాల్ కబాడీ  బేస్ బాల్ ఖో ఆటలలో డ్రిల్లు మేష్టర్లు మంచి శిక్షణ ఇచ్చి తయారు చేశారు .ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడించాం గ్రిగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు పంపించాం .బాడ్మింటన్ లో ప్రయిజు వచ్చిందని జ్ఞాపకం . టీచర్స్ కూడా గేమ్స్ ఆడి పాల్గొన్నాం .బాడ్ మింటన్ లో నేను లెఫ్ట్ ఫ్ర0ట్ .శర్మగారు సెంటర్ .బాక్ .సుబ్బారావు  ప్రసాదరావు .వాలీ బాల్  కూడా బాగా ఆడేవాళ్ళం నేను ఈ రెండిటిలో ఎప్పుడు సర్వీస్ చేసిన కనీసం మూడు పాయింట్లయినా వచ్చేవి .జనం ఈలలు చప్పట్లతో ఆభినందించేవారు
  స్కూల్ పరీక్షలు మొహమాటం లేకుండా కాపీ కొట్టకుండా చాలా పకడ్బందీ గా నిర్వహించాం దీనికి లెక్కలమేస్టారు   ప్రసాద్ సహాయం అద్వితీయం అతనికే కొన్ని నిర్దిష్ట భావాలున్నాయి అందుకే మా ఇద్దరికీ కెమిస్ట్రీ బాగా కుదిరింది . ఇన్ని విషయాలు బాగానే ఉన్నా క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశరావు విపరీతమైన తాగు బోతు ,బడిపక్కనే ఇల్లు  .గంటకో అరగంటకు ఎవరికీ తెలీకుండా మందుకొట్టి వచ్చేవాడు మాటలు తడ  బడేవి  కళ్ళు చింత నిప్పులు బక్కపలచగా ఉండేవాడు తోస్తే పడిపోయే రకం .అతన్ని కంట్రోల్ పెట్టటం శక్యం కావటం లేదు .అంతకు పూర్వం హెడ్ మాస్టర్లు కూడా ఏమీ పీక లేక వదిలేశారు .అతని కులమూ ఇబ్బంది కలిగించేది ఏ చర్య తీసుకోవలన్నా .మనమే సర్దుకు పోవటం . మనిషి మంచివాడు పిల్లాడు తొమ్మిది చదువుతున్నాడు చురుకైన వాడు . బెదిరించేవాడిని స్టాఫ్ఆర్దర్ వేస్తానని అది రికార్డ్ అయితే జీవితం  జీతం ఖాళీ అని పైవాళ్లకు రాస్తానని హెచ్చరించేవాడిని .చెప్పిన పని చేస్తాడు ఇదొక్కటే లోపం బలహీనత . పామర్రులో సైన్స్ మాస్టర్ గా పని చేస్తుండగా ఇద్దరు డ్రిల్లు మేస్టార్లు తెగ తాగి వచ్చేవారు .ఒకడు రోడ్డుకడ్డంగా నిలబడి బస్సులు ఆపేవాడు .మరోడుఫుల్ గా మందుకొట్టి తెగవాగేవాడు ఇతను నేనంటే బాగా అభిమాన0గా ఉండేవాడు   .సముద్రం ఒడ్డు  చినగొల్లపాలెం వాడు .అక్కడ రాజకీయ నాయకుడు ఏటూరి బలరామ మూర్తి ఇతనికి కాపు ఏడు గడ .కనుక చైర్మన్లు కానీ ఇంకెవరూ ఇతని జోలికి వచ్చేవాళ్ళు కాదు మనిషి బంగారం   .ఖాళీగా  ఉన్నప్పుడల్లా అతని రూమ్ లో కూచునేవాడిని .కాఫీలు ఆరగాఆ రగా తెప్పించేవాడు .భార్యబంగారు  తల్లి .మంచి టీచర్ . ఈ ఇద్దరు ”డ్రిల్లులు” మను షులు మంచివాళ్ళే గుణం ”గుడి సేటిది ”టైప్  మేడూరునుంచి పామర్రుకు జంపయ్యాను సారీ .  ఉపేక్షతప్ప నాకు క్రాఫ్ట్ మేస్టార్ విషయం లో ఏ ఉపాయము కనిపించలేదు . ఇలాంటి వారిమధ్య పని చేయటం ఎంబరాస్మెంట్ గా  ఉంది .తరుణోపాయంకోసం మనసులో అన్వేషిస్తున్నాను .
                సశేషం
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-17 కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -35

  ఏకావలి లో అలంకార చర్చ(చివరిభాగం )  

పర్క్యాయోక్తి  అలంకారం-పర్యాయోక్తి అలంకార నిర్వచనం లో విద్యాధరుడు పూర్తిగా అలంకార సర్వస్వాన్నే  అనుసరించాడు  -”గమ్యత్సా పి భంగ  గ్య0త రేణాభి  దానం పర్యోక్తం ”
  ఈ అలంకారం తెలియాల్సిన దాన్ని ఏదో ఒక విధానం లో తెలియ జేస్తే పర్యాయోక్తి .అంటే ఫలం ,ప్రభావం ,ప్రయోజనం  మొదలైనవి తెలియాల్సిన లేక గమ్యం కు కారణాలు అవుతాయి. దీనిపై మల్లినాథుని  వ్యాఖ్యానం చాలా స్పష్టంగా ఉంది .-”యత్ర ప్రస్తుత కార్య కధనాత్ ప్రస్తుతమేవ కారణం గమ్యతే -తత్ర కార్యద్వారా కారణ  స్యేవ పర్యాయేణ భంగ యంత రేణోక్త త్వాత్ పర్యాయోక్త  మిత్యర్ధహ్ ”అన్నాడు
  ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది -ఒకే వస్తువు వివరణగా సూచనగా ఎలా ఉంటుంది?కారణాన్ని సూచిస్తే ఫలిత0 ద్వారా తెలియ జేయవచ్చు కారణం కూడా సంబద్ధమైనదే అప్పుడు అది అప్రస్తుత ప్రశంస తో భేదిస్తుంది ..ఇక్కడ విద్యాధరుడు సూచింపబడిన అర్ధం లేక భావం బలవత్తరమైతే అప్పుడు అది ఒకరకమైన ధ్వని అని పిస్తుంది ”యత్ పునరిహకార్యస్యేవ వర్ణనం తత్కారణా పేక్ష యస్య చమత్కారాతిశయ కారిత్వాత్ ”(ధ్వన్యాలోక0 )    ఇక్కడ అతని వ్యాఖ్య ధ్వన్యాలోకం లోని వ్యాఖ్యను పోలి ఉంది కనుక మల్లినాథుడు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు .సంబద్ధమైన కారణం సంబద్ధమైన ఫలితాన్ని సూచిస్తే అది పర్యాయోక్తి అవుతుందన్నారు .అంటే ఫలితం కారణాన్ని మరొక విధంగా తెలియ జేస్తుంది .ఫలితం ద్వారా చెప్పబడే కారణం యొక్క వర్ణన  ,సూటిగా వర్ణించినదానికంటే మరింత రమ్యంగా ఉంటుంది .
  మల్లి నాధుడు కొన్ని అలంకారాలతో పోలికలు భేదాలు చర్చించి ఇదే విధంగా స్పష్టం చేశాడు .కొన్ని ఉదాహరణలు చూద్దాం –
విరోధ ,విశేషోక్తి అలంకారాల మధ్య తేడాలను వివరిస్తూ రెండు వస్తువులు ఒకే సమాన బలం తో  ఒకదానికొకటి వ్యతిరేకంగా చెప్పబడితే అది విరోధా భాస  అన్నాడు .విశేషోక్తి లో ఫలితం దాగి ఉండి కారణం లేకుండా అంగీకరింపబడకుండా ఉంటె విశేషోక్తి అవుతుంది .కానీ కారణం లేకుండా ఫలితం అంగీకరింపబడదు -”అతః ప్రతినియత్ బాధ్య బాధ్యక భావాపన్నో విరోధో విశేషోక్త్యో -విరోధాలంకారే తు విశేష భావాదుభయొహ్  పరస్పర బాధ క భావాపన్న ఇత్యనయోరపి భిన్న విషయత్వ మేవేత్యర్ధహ్ ”
 ఇలాగే రూపకాన్ని ఉత్రేక్ష ,అతిశయోక్తి ల మధ్య భేదాన్ని కూడా ఇంత స్పష్టంగానూ వివరించాడు .ఈ రెండు బృందాలలో ఉన్న భేదం ఆరోప ,అధ్యారోపాల  ఆధారంగా ఏర్పడినవే అన్నాడు .భేదం లేనిది వస్తువును మింగేసి అనుభవానికి వస్తే అధ్యవాస్యా అవుతుంది అలాంటి మింగుడు లేకపోతె ఆరోపణ అవుతుంది -”ఆరోపాన్యత్రాన్యస్యా వాపః -యధా ముఖం ఇత్యాన్న ముఖే చంద్రత్వస్య  ఏతే నాద్యావశ్య మూలో త్ప్రేక్షా తిశయోక్తి భ్యాం భేదః -విషయని గరణేనా భేద-ప్రతిపత్తి రధ్యావసాయః -విషయాని ఘరానా మంత రేణా  భేద ప్రతి పత్తి  రారోప  ఇత్యన్యో  భేదాదితి”
   ”ఏకాదశ వివర్త రూపకాల”కు సమాసోక్తికి మధ్య ఉన్న ముఖ్య విలక్షణతనుమల్లినాథ సూరి వివరించిన విధానాన్ని డా త్రివేది ఎలా తెలియజేశాడా లాల్యే పండితుడు చెప్పాడు -”మొదటి దానిలో పోలిక చెప్పే విషయి  విషయ0  పై ఆరోపింపబడి ఒక చోట చెప్పి వేరొక చోట సూచనగా ఉంటుంది అప్రస్తుతమైన విషయి  ప్రస్తుతమైన విషయాన్ని తన ధై న రూపం లో రంగుల్లో తెలియ జేస్తుంది .రెండవదానిలో అప్రస్తుతం సామాన్య గుణం తో సూచింపబడి ప్రస్తుతాన్ని బలీయం చేయదు కానీ దాని వేరే మాటలతో ఆవిష్కరిస్తుంది .మరో రకంగా రూపకం లో విషయి  ప్రస్తుతం పై ఆరోపించబడుతుంది .సమాసోక్తి లో అప్రస్తుతం యొక్క  ప్రవర్తన ప్రస్తుతం పై ఆరోపింపబడి  ”వ్యంజనమ్ ”కు కారణమవుతుంది .
  మల్లినాథుడు ఆపహ్నుతి ,వ్యాజోక్తి లమధ్య విలక్షణాలనూ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పాడు ..పోలిక దాగి ఉంటె ఆపహ్నుతి . దాగి ఉన్నదాన్ని పోలికతో చెబితే వ్యాజోక్తి .-”యత్రాహ్నవ  ముఖేన సాదృశ్యం ప్రతిపాద్యతే తత్రాపహ్నవః -యాత్ర సాదృస్యోప జీవనే నాపహ్నవః క్రియతే తత్ర వ్యా జోక్తిః ”(ఏకావాలి ).తుల్య యోగితా విషయం లో మల్లినాథుని వివరణ సూటిగా సుత్తి లేకుండా ఉంది .దీన్ని పట్టికలో ఇలా చూఅచ్చు
  ఔ పమ్య  గర్భాలంకారః
|
పదార్ధ గతః                 వాక్యార్ధ గతః ,

–     |

సమాసపూర్వకం            వ్యాస పూర్వకం
దీపకః                                    తుల్య యోగితా

పోలిక దాగ్గిఉన్నా  ధ్వనికి అవకాశం లేదు సూచింపబడిన భావం  సూటిగా అర్ధాన్ని బలీయం చేసి అది ప్రాధాన్యం కోల్పోయి అపరాఅంగికమై గూనీ భూత వ్యంగ్యం లో ఒక అరకం అవుతుంది మరో చోట దీపకం తుల్య యోగితాల ప్రధాన లక్షణ భేదం వివరణ ఉంది సమాన లక్షణం ప్రాకృతానికి కానీ అప్రకృతానికి కానీ సమీపం లో ఉంటుంది  . 
  సూరి దృష్టాంత ,నిదర్శనాలంకారాలమధ్య భేద లక్షణాలన్నీ అదే స్ఫూర్తి తో చెప్పాడు  .రెండు వాక్యాలు రెండు విభిన్న భావాలను సంబంధం లేనివాటిని చెబితే దృష్టాంతం .రెండువాక్యాలు ఒకే  భావాన్ని విధి మొదలైన ఆదేశాలతో చెబితే అర్థవాదం తో ఉంటె నిదర్శనాలంకారం -”యత్ర పరస్పర నిరపేక్షా ర్ధ త్వేన  వాక్యార్ధ భేదస్తత్ర దృష్టాంత -యాత్ర సాపేక్షార్ధత్వే న విద్యర్ధ వాదయోరివ వాక్యయో  రేఖ వాక్యతా తత్ర నిదర్శనేతి  భేదః
    అలంకారాలతో సూక్షం భేదాలను మల్లినాథుడు గమనించాడు -”ప్రత్యాయ్యప్రత్యాయక భావోనుమానం -సమర్ధ సమర్ధకా భావే నిరపేక్ష యో తతస్టే  న హేతుర్వేర్యార్దంతరన్యాసః -కేవలం సామాన్యయోహ్ కేవలావ శేష యోర్వా నిరపేక్షయోరేవ హేతు త్వే దృష్టాంత -కార్యకారణా రూపవాక్యార్ధ యోస్తు సాపేక్షార్హే తుత్వే  వాక్యార్ధ హేతుకం కావ్యలింగమితి ”అని స్పష్టపరచాడు
 నిరూపించింది ,నిరూపించబడినదానిమధ్య సంబంధం ఉంటె అనుమానాలంకారం .కారణం ఒక సామాన్యం తో విశేషం విశేషం తో సామాన్యం సమర్ధిస్తే అర్ధాంతరన్యాసం .సామాన్య విశేష వాక్యాలు భావాలు వేరుగా స్వతంత్రంగా ఉంటె దృష్టాంతాలంకారం .రెండువాక్యాలలోని భావం కార్య కారణాలు గా ఉంటె కావ్యలింగాలంకారం అవుతుంది అని సందేహ రహితంగా ఏకావాలి లోని అలంకార చర్చలో వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి వివరించాడని  త్రివేదీ తెలియజేసినట్లుడా  పి .జి .లాల్యే పండితుడు మనకు చెప్పాడు . ఇంతటితో అలంకార చందన చర్చ కు సమాప్తి పలికి  ఏకావాలి పై మల్లినాథుని వ్యాఖ్యానం లోని ముఖ్య విషయాలను తరువాత తెలుసుకొందాం .
     అన్నమయ్య   జయంతి శుభాకంక్షలతో
Inline image 1
   సశేషం
 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -34

  ఏకావాలి లో అలంకార చర్చ
సమాసోక్తి అలంకారం -ఒకే పదం రెండు విషయాలను తెలియ జేయటమే సమాసోక్తి అలంకారం .ఇందులో సంబద్ధమైనది  తెలియ జేయబడి  అసంబద్ధమైనది  సూచింపబడుతుంది .ఇతరమైనదేదోదాని గుణం  ఆపాదింపబడుతుంది -”విశేషణ సామ్య మాత్ర గమ్యత్వేన రూప సమారోపా యోగాదం ప్రస్తుతస్య విషయం వాంఛే దకత్వ మాత్రం నతు తాదాత్మ్యే నావ చ్చేదకత్వమేవేతి సర్వాలంఘ రో త్తీ ర్ణేయం సమాసోక్తి రిత్యర్ధహ్ ”   

అసంబద్ధమైన దాని ప్రవర్తన ”అప్రకృత0 ”కప్పి వేయబడి లేక సంబద్ధమైనది ప్రకృతం పనిలో పోలికవలన కానీ ,లేక విశేషణాలవలనకాని కప్పబడుతుంది .రూపక ,ఉపమా సమాసోక్తి ల మధ్య విచక్షణత ఒక్కోసారి తెలియ బడుతుంది మల్లినాథుడి భావనలో మొదటి రెండు కలయికలో రూపకం బలీయంగాను ,చివరి రెండిటికలయికలో సమాసోక్తి బలీయం గాను ఉంటుంది -”ఏవం సమాసోక్త్యే క దేశా వివర్తి రూపకాయోహ్ సమావేశే రూపకం బలీయ ఇత్యుక్తమ్ .-ఉపమా సమాసోక్తి సమవాయే తు సమాసోక్తి రేవ బలీద సీతి ”
”ఏకా దేశ  వివర్తి రూపకం ”అనేది ఒక విషయం చూపబడి ,చూపే బడిన దానితో సాక్ష్యాధార పోలిక కనిపించకపోతే ఏర్పడుతుంది సూచింప బడిన రూపకాన్ని మరో చోట ఉన్న వర్ణనతో అక్కడ శబ్దాలతో చెప్పబడక పోయినా మనం గుర్తించాలీ .ఉపమాలంకారం లో ఒకదానికొకటి పోలిక  బంధింపడి గ్రహించే వీలుంటుంది .కానీ సమాసోక్తిలో ఒక దాని ప్రవర్తన మరొకదానిలో  ఆపాదింపబడుతుంది .అసంబద్ధమైన దానిలో సంబద్ధమైన దాని ప్రవర్తన ఆపాదింపబడుతుందని భావం కానీ సంబద్ధమైన దానిపై అసంబద్ధమైన దాని ప్రవర్తన  ఆచ్చాదింపబడదు
విరోధాలంకారం -రెండు విషయాలలో వ్యతిరేకత స్పష్టంగా ఉంటే  అది విరోధాలంకారం .రెండు విషయాలలో సామాన్యత ,గుణం ,క్రియ ,పదార్ధం లలో వ్యతిరేకత కనిపిస్తున్నా ఒకటిగానే ఉండాలి ‘–యత్ర ధర్మయోహ్ సమానాధికరణ్య నిబ0ధో విరోధః స్ఫు రతి తత్ర విరోధాలంకారః -యత్ర తు వైయాది కరుణ్యనిబంధనో విరోధస్తత్రా సన్మత్యాది రిత్యర్ధహ”
అర్ధాంతరన్యాసాలంకారం -ఏకావాలి లో ఒక ప్రత్యేక అసంబద్ధ  ప్రతిపాదన మరొక సామాన్య ప్రతిపాదన తో సమర్ధింపబడినప్పుడుకానీ సాధారణాన్ని విశేషణం తోకాని సమర్ధించి చెప్పటాన్ని  అర్ధాంతర న్యాసం అవుతుందని చెప్పాడు .మామూలు భాషలో సామాన్యాన్ని విశేషం తోకాని విశేషణాన్నిసామాన్యం తో కానీ సమర్ధించి చెప్పటం అన్నమాట .”యత్ర ప్రస్తుతస్య సామాన్య విశేషస్య ,వా పూర్వ పంచాద్వా నిర్దిష్టస్య తదితరేణ సమర్ధన మర్దాన్తరన్యాస ఇత్యర్ధహ్ ”
  మల్లినాథుడు సామాన్యానికి ,అనుమితి (ఇన్ఫరెన్స్ )కు ఉన్న విలక్షణత ను (డిస్టింక్షన్ )గుర్తించాడు ఆయన పద్ధతిలో ఈ అలంకారం అనుమితి తో భేదిస్తుంది .ఒక నిర్దిష్ట విషయం సూచింపబడిన వ్యాప్తి ద్వారా తెలియబడుతుంది -”ఆప్రతీత ప్రత్యాయన మనుమానే ,ప్రతీతస్య సమర్ధన మత్రేతి  భేద ఇత్యర్ధహ్ ”అన్నాడు మల్లినాథ సూరి .
   సశేషం
  నృసింహ జయంతి శుభాకాంక్షలతో
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-9-5-17 -కాంప్-షార్లెట్-అమెరికా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ

టు కిల్ ఏ మేకింగ్ బర్ద్ నవలలో విఖ్యాతమైన -హార్పర్ లీ

 అమెరికాలోని అలబామా రాష్ట్రం లో మన్రోవిల్ లో 28-4-1926 లో జన్మించిన నెల్లీ హార్పర్ లీ అక్కడే ఎక్కువ కాలం గడిపిహార్పర్ లీ కలం పేరుతొ రచనలు చేసింది తల్లి గృహిణి .తండ్రి న్యూస్ పేపర్ ఎడిటర్ ,అలబామా స్టేట్ లెజిస్లేచర్ మెంబర్ .లీ లాయర్ అయి తెల్లవాడిని చంపారని అభియోగం మోపబడిన ఇద్దరు నల్లవారి తరఫున వాదించింది .అయినా కేసు ఓడిపోయి తండ్రీ కొడుకు అయినా ఆ దోషులు ఉరి తీయ బడ్డారు తనకుటుంబం ,చుట్టూ ప్రక్కలవారినీ బాగా గమనిస్తూ రచనలు చేసేది అలీస్ ఫించ్ లీ ,లూయీ లీ కాన్నర్ ఎడ్విన్ లీ అనే మూడు పుస్తకాలను 1911 నుంచి 1951 లోపు రాసింది
  మన్రో కౌంటీ హై స్కూల్ లో చేరి ఆంగ్ల సాహిత్యం పై అభిమాని అయింది గ్రాడ్యుయేట్ అయి మాంట్ గోమరి లోని హాంటింగ్డన్  మహిళా కాలేజీ చేరి తర్వాత తస్కలూసా లోని అలబామా యూనివర్సిటీ కి బదిలీ అయి లా చాలాకాలం చదివి  యూనివర్సిటీ న్యూస్ పేపర్ లో రచనలు చేస్తూ డిగ్రీ మాత్రం పూర్తి చేయలేదు 1948 లోలండన్  ఆక్స్ ఫర్డ్ ,యూనివర్సిటీలో యూరోపియన్ నాగరికత పై జరిగిన  సమ్మర్ క్లాస్ లకు హాజరైంది .కానీ దీనివలన ఫలితాంకనపడక మళ్ళీ లా కోర్సులో చేరింది
  1949 లో న్యూయార్క్ చేరి ఎయిర్ లైన్ రిజర్వేషన్ ఏజెంట్ అయి ఖాళీ సమయం లో ఫిక్షన్ రాసింది .అనేక పెద్ద కథలు రాసి పేరు తెచ్చుకున్నది .అప్పుడే ఆమెకు స్నేహితుడు ఒకాయన ఒక సంవత్సర జీతాన్ని పంపి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఆ కాలం లో కావలసినంత రచన చేసుకోమని రాశాడు 31 ఏళ్ళవయసులో 1957 లో ”గో సెట్ ఏ వాచ్ మన్ ”నవల రాసి ఏజెంట్ ద్వారా పబ్లిషర్ కు పంపింది .జె బి లిప్పిన్ కాట్ ఆ రచన చదివి అందులో ప్రతివాక్యం లో జీవం ఉందని పొగిడికొన్నాడు కానీ మెస్ హోహఫ్ కు నచ్చక ఎప్పటికప్పుడు మార్పులూ చేర్పులూ చేస్తూనే ఉండి చివరకు ”టు కిల్ ఏ మాకింగ్ బర్ద్ ”నవలగా రెండేళ్ల తర్వాత బయట పడింది ఈ నవలపై ఆమె I never expected any sort of success with Mockingbird. I was hoping for a quick and merciful death at the hands of the reviewers but, at the same time, I sort of hoped someone would like it enough to give me encouragement. Public encouragement. I hoped for a little, as I said, but I got rather a whole lot, and in some ways this was just about as frightening as the quick, merciful death I’d expected.

— Harper Lee, quoted in Newquist, 1964[14]
అని తన నిర్వేదాన్ని తెలియ బరచింది .రచయితా పబ్లిషర్ లమధ్య అనేక సార్లు చర్చలు జరిగేవి మార్పులకు ఆమె సుముఖంగా లేకపోతె వాళ్ళు చాలాబాగా నచ్చ చెప్పేవారు అలా ఆ నవల తుది రూపానికి చేరి1960 లో ప్రచురణ పొందింది .అమ్మకాలు జోరుగా సాగి బెస్ట్ సెల్లర్ అయిపులిటీజర్ బహుమతి పొందింది . 1999

లో లైబ్రరీజర్నేల్ ఆ నవలను ”ఈ శతాబ్దపు ఉత్తమ నవల ”అని ఎన్నికద్వారా తేల్చింది ఇదిఒక రకం గా ఆమె జీవిత చరిత్రే .పూర్తి యదార్ధ సంఘటనల తోనే రాసింది అందుకే జీవత్వం తో తొణికిసలాడింది

  తర్వాత కాన్సాస్ లోని హొల్కొంబ్ కు వెళ్లి అక్కడ ఒకకుటుంబ హత్య విషయాన్ని శోధించి ”ఇన్ కోల్డ్ బ్లడ్ ”నవలారాసి  1966 లో అచ్చేసింది — మాకింగ్ బర్ద్ ప్రచురణతర్వాత 2016 లో చనిపోయే దాకా బహిరంగ సమావేశాలలో పాల్గొనటం కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ లీ చేయనే లేదు .ది లాన్గ్ గుడ్ బై నవల రాస్తూ కాలక్షేపం చేసింది దీన్ని ముద్రించలేదు .అలాగే అలబామా మర్డరర్ పై రాసినా అదీ నచ్చక అచ్చు వేయలేదు  మాకింగ్ బర్ద్ సినిమా తీశారు దానికి అకాడెమి అవార్డు వచ్చింది ..నవలను ఇంట గొప్పగా ఇంతకూ ముందెవ్వరూ సినిమా కధగా మలచలేదు ”అని రాసింది .నటుడు గ్రెగరీ పెక్ తోను ఆతనికుటుంబం తోను లీ కుటుంబం చివరిదాకా  స్నేహ  సంబంధాలు కొనసాగించారు మన బాలీవుడ్ నటుడు దేవానంద్ ను గ్రెగరీ పెక్ అనేవారు పెక్ కు ఆస్కార్ అవార్డు ఆటి కస్ ఫించ్ పాత్రకు ఇచ్చారు 1966 లో ప్రెసిడెంట్ జాన్సన్ లీ ను ”నేషనల్ కౌన్సిల్ ఆన్ ది ఆర్ట్స్ ”కు ఎంపిక చేశాడు 1910 లో ప్రెసిడెంట్ ఒబామా ”నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ ”అంద  జేశాడు 2013 లో హార్పర్ లీ తన నవల మాకింగ్ బర్ద్ కాపీ హక్కులను స్వాధీనం చేయమని తన ఏజెంట్ అల్లుడిపై కోర్ట్ లో దావా వేసింది ఇరుపక్షాల వాదనలు విని జడ్జి రాజీ కుదిర్చి పరిష్కరించాడు 2014 లో మన్రో హైకోర్టు లో మ్యూజియం తనకు తెలియకుండా అనుమతి లేకుండా తననవలా ప్రదర్శన చేస్తోందనివ్యాజ్యం వేసింది
   2015 లో ”గో సెట్ ఏ వాచ్ మన్ ”నవల ప్రచురణకు కోర్ట్ అనుమతించింది 89 ఏళ్ళవయసులో 19-2-2016 న హార్పర్ లీ మరణించింది .రెండే రెండునావాలాలు అయిదే అయిదు వ్యాసాలూ మాత్రమే రాసినా హార్పర్ లీ అమెరికా సాహిత్యం లో గొప్ప నవలాకారిణిగా గుర్తింపు పొందింది
Inline image 1Inline image 2Inline image 3
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -100 మేడూరు లో ఉద్యోగం

సాహితీ బంధువులకు – ఈ వ్యాసం రాసి సుమారు 9 నెలలయింది .కంటిన్యుటీ తెలియాలని దీన్ని మళ్ళీ పంపిస్తున్నాను .ఈ రోజు నుంచి దీని తర్వాతి విషయాలు రాస్తాను -దుర్గాప్రసాద్ -8-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

నా దారి తీరు -100

మేడూరు లో ఉద్యోగం

2-9-1989 న చిలుకూరి వారి గూడెం లో చేరిన నేను 22-8-90 సాయంత్రం విధులనుండి విడుదలై ,రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ కనుక జాయినింగ్ టైం ఉండదు కనుక మర్నాడే  మేడూరు హైస్కూల్ లో 23-8-90 ఉదయం చేరాను .

సుమారు సంవత్సర కాలమే చిలుకూరి వారి గూడెం లో పని చేసినా ,ఆ స్కూల్ అన్నా ఆ ఊరు అన్నా విపరీతమైన అభిమానం ఏర్పడింది .మళ్ళీ ఎప్పుడైనా అక్కడే చేయాలని అనిపించేది .అంతమంచి వాతావరణం ఏర్పడి ,అనుబంధం శాశ్వతమయింది .అందుకే ఈబాద .రాను పోనూ ప్రయాణపు ఇబ్బంది తప్ప అక్కడనాకు యే ఇబ్బందీలేదు స్టాఫ్ సహకారం ,పిల్లల ప్రవర్తన కమిటీ వాళ్ళ చేయూత అన్నీ అందుకొని స్కూల్ రూపు రేఖలనే మార్చగాలిగాను .ఇంత గొప్ప అభి వృద్ధి చేయగాలుగుతానని నాకే తెలియదు అన్నీ కుదిరి అలా జరిగింది .ఇందులో నాకు సహకరించిన లెక్కల మేష్టారు శ్రీ పురుషోత్తమా చారి సెకండరీ మాస్టారు శ్రీ శేషగిరి రావు హాస్టల్ వార్డెన్ శ్రీ రాఘవుల చేయూత జీవితం లో మరువ లేనిది .నేను అక్కడి నుంచి బదిలీ అయి వచ్చినా, వీళ్ళు నాతో ,మా కుటుంబం తో అదే బాంధవ్యాన్ని కొనసాగించారు .లెక్కల మాస్టారి తల్లిగారు భార్య నా యెడల చూపిన ఆప్యాయత మరువలేను .పై మూర్తిత్రయం బెజవాడ వైపు వచ్చినప్పుడల్లా ఉయ్యూరు వచ్చి మా ఆతిధ్యం పొంది వెళ్ళేవారు వాళ్ళను చూస్తే మహదానందంగా ఉండేది .పూర్వం మానికొండలో రాజుగారు గరుడాచలం గారు ,రాఘవ రావు లు యెంత అభిమానంగా ఉండేవారో అదే ఇప్పుడు కనిపించింది .జననాంతర సౌహృదం అనిపిస్తుంది ఆలోచిస్తే .అలాగే మేము మైలవరం వైపు వెళ్ళినా వాళ్ళను కలిసి మాట్లాడకుండా ఉండే వాళ్ళం కాదు .మా మూడో వాడు మూర్తి చిలుకూరి వారి గూడెం దగ్గర రామ చంద్రాపురం లో ఆర్ ఏం పి డాక్టర్ గా ఉన్నప్పుడు ,మైలవరం దగ్గర గణపవరం లో ఉన్నప్పుడు కారు మీదమా అక్కయ్య బావలతో  మైలవరం లో రాఘవులుగారిని పుల్లూరులో ఆచార్యుల గారి ఫామిలీ ని అక్కడికొచ్చిన శేష గిరి రాగారినీ చూసి కిన్నెర సాని ,భద్రాచలం ,నెమలి ,జమలాపురం ఒక సారి వెళ్లాం మరో సారి మా అమ్మాయి మేము కలిసి వెళ్లి వీళ్ళందర్నీ చూశాం .అలా చాలాకాలం కొనసాగింది .

తర్వాత శేషగిరి రావు గారు నన్ను మళ్ళీ చిలుకూరి వారి గూడెం ట్రాన్స్ ఫర్ చేయించే ప్రయత్నం శాసనసభ్యులు శ్రీ కోమటి భాస్కర రావు గారిద్వారా చేస్తానని రిక్వెస్ట్ రాసి ఇమ్మని ,రెండు మూడు సార్లు నేను అడ్డాడలో ఉండగా వచ్చి అడిగారు .అది ఇక జరగని పని అని ఆయన్ను సమాధాన పరచి పంపేవాడిని .ఆయనకు హెడ్మాస్టర్ బండి రామారావు కు కెమిస్ట్రీ కుదరలేదని ఆయన మాటల్లో తేలింది స్కూల్ డబ్బు స్వాహా చేస్తున్నాడని కూడా చెప్పిన జ్ఞాపకం గుడివాడలో ఆయన బ్రహ్మాండమైన ఇల్లు కట్టి గృహప్రవేశానికి స్వయంగా ఆహ్వానిస్తే వెళ్లాను అక్కడ లెక్కలమేస్టారు వార్దేన్ గారు మళ్ళీ కలిశారు .తర్వాత శేషగిరి రావు గారికి హార్ట్ ఎటాక్ వచ్చిందని లేక్కలమేస్టార్ ఫోన్ చేస్తే బెజవాడ విజయ టాకీస్ ఎదురుగా ఉన్న హాస్పిటల్ లో ఇన్సెంటివ్ కేర్ లో ఉండగా చూసొచ్చాను .కాని ఆయన ఆతర్వాత రెండుమూడు రోజులకే చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు గుడివాడలో కార్యక్రమాలు చేశారు కాని నేను వెళ్ళలేక పోయాను వీరు భొట్ల శేషగిరిరావు గారి అన్నగారికి ఉయ్యూరు లో ఉన్న వేమూరు దుర్గ,సుబ్రహ్మణ్యం గార్ల అమ్మాయినిచ్చి ద్వితీయం చేశారు .ఆ సందర్భం గా రెండు వైపులవారూ నన్ను సంప్రదించి మంచి చెడ్డలుతెలుసుకొన్నారు ఈ విధంగా ఉయ్యూరు బంధం ఆయనకు ఏర్పడింది

లెక్కల మాస్టారు ఏం .పురుషోత్తమా చారి గారి తో స్నేహం అసలెన్నటికీ మరుపు రాదు ఆయన కుటుంబం తో నూ అంతే .ఇదెక్కడి బంధమో ఆశ్చర్యమేస్తుంది .ఆచారి గారి తల్లిగారి ఆరోగ్యం బాగా ఉండేదికాదు భార్య చాలా సన్నగా అనారోగ్యంగా నే ఉండేవారు .కాని ఆదరణకు స్నేహానికి వాళ్ళనే చెప్పుకోవాలి ఆడపిల్ల మగ పిల్లాడు చిన్నక్లాసులు చదువుతున్నారు .దాదాపు 8 ఏళ్ళక్రితం ఆచారి గారు చనిపోయారని వాళ్ళబ్బాయి ఫోన్ చేశాడు .వెళ్ళలేక పోయాను .తర్వాత వాళ్ళ అమ్మాయి వివాహం మైలవరం లో చేస్తున్నామని శుభలేఖ పంపి వాళ్ళబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు  .అదే ముహూర్తానికి బెజవాడలో మల్లాది వెంకటేశ్వర్లు కూతురు వివాహం .వివాహం చూసి అక్షంతలు వేసి దీనికి హాజరైన దంటు వారబ్బాయి ,వెంపటి శర్మగారబ్బాయిలను చాలా రోజుల తర్వాత చూశాం .అక్కడికి మమ్మల్నిద్దర్నీ చూడటానికి వచ్చినఆత్మీయులు కవి కధకులు  శ్రీ గంధం వేంకాస్వామి శర్మ గారిని చూశాం అప్పటికే 85 ఏళ్ళ వృద్దు ఆయన .’’ఎందుకండీ శ్రమ పడి వచ్చారు ?మేమే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళం కదా ‘’అన్నాను .ఆయన నవ్వి ‘’మీ ఇద్దర్నీ చూస్తే పార్వతీ పరమేశ్వరులని పిస్తుంది అందుకే దర్శనం కోసం వచ్చాను ‘’అన్న ప్రేమాభిమాన మూర్తి వారు .ఇదే వారిని చూసిన చివరి సారి .ఆ తర్వాత మేము అమెరికా వెళ్ళటం అక్కడ మేము ఉండగానే వెంకాస్వామి శర్మగారు చనిపోవటం జరిగింది

సత్యనారాయణ పురం లో మల్లాది  వెంకటేశ్వర్లు కూతురు పెళ్లి నుంచి సరాసరి బస్ స్టాండ్ కు వెళ్లి మైలవరం బస్ ఎక్కి ఫంక్షన్ హాల్ కు చేరేసరికి సుమారు మధ్యాహ్నం 2 అయింది వేలాది మంది వచ్చి భోజనాలు చేసి వెడుతున్నారు మేము లేక్కలమాస్టారి భార్యను పలకరించి పెళ్లి కూతురు కు కానుక అందజేసి ఆశీర్వ దించి వాళ్ళబ్బాయి అబ్బాయాచారి మా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట వివాహ భోజనం చేసి మళ్ళీ బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరాం ఇన్ని జ్ఞాపకాలు మాకు లేక్కలమేస్తారి కుటుంబం తో ఉన్నాయి పిల్లలిద్దరూ మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోనే బి టేక్ చదివి బెంగుళూర్ లో ఉద్యోగాలలో ఉన్నారు మంచి అభివృద్ధి సాధించారు లెక్కల మేస్టారి మంచి మనసే ఈ అభివృద్ధికి కారణం వారి అమ్మగారి ఆశీస్సులు విశుద్ధ హృదయం తోడ్పాటుగా నిలిచాయి .

అంతకు ముందు మైలవరం గర్ల్స్ స్కూల్ హెడ్ మిస్త్రేస్ విజయ లక్ష్మి గారి పదవీ విరమణకు ఆహ్వానిస్తే నేనూ  వెళ్లాను అప్పుడు ఆచారిగారు కలిసి ఇంటికి తీసుకు వెళ్ళారు .

మేడూరు స్కూల్ విశేషాలు

ఉయ్యూరు లో 23-8-90 ఉదయం 7 గంటలకేఇంట్లో భోజనం చేసి సరాసరి బెజవాడ మేడూరు బస్ ఎక్కి ,తాడంకి కపిలేశ్వరపురం వీరంకిలాకు పమిడిముక్కల మీదుగా మేడూరు చేరాను .ఉదయం విధుల్లో చేరినట్లు సంతకం పెట్టాను .పెద్దస్కూల్ .సుమారు ౩౦౦ మంది పిల్లలు .అన్నీ రెండు సెక్షన్లు .స్టాఫ్ అందరూ కొత్త నా ముందు ఇక్కడ పనిచేసిన శ్రీ జి ఎస్ యెన్ చౌదరి కూడా బిఎడ్ లో నా ట్రెయినింగ్ మేట్ అవటం మరో తమాషా అతన్ని పునాది పాడు వేశారు .ఒక సారిస్కూల్ అంతా కలయ తిరిగా .మంచి బిల్డింగ్ లున్నాయి .పెద్ద ఆటస్థలం  మంచి లేబరేటరీ దానిలోనే పాఠాలు చెప్పటానికి వీలైన విశాలమైన హాలు ,పైన లైబ్రరీ కం కామన్ హాల్ ఉంది లైబ్రరీలో చాలా పుస్తకాలు మంచి పుస్తకాలు ఉన్నాయి లైబ్రేరియన్ శ్రీమతి  కోటమ్మ అనిజ్ఞాపకం ఇక్కడే ఉద్యోగం లో చేరి నాన్ స్టాప్  గా పని చేస్తోంది చాలా మంచి ఆవిడ అనిపించింది .పెద్దావిడే .స్కూల్ ముందు వెనకా ఆట స్థలం చుట్టూ కొబ్బరి చెట్లు బాగా ఉన్నాయి పెద్ద ఊటబావి దానికి ఎలక్ట్రిక్ మోటారు ఓవర్ హెడ్ వాటర్ టాంక్ అన్నీ ఉన్నాయి .కొబ్బరి  పోషణకు ప్రభుత్వం డబ్బు అందజేస్తుంది మూడు నేలలలకోసారి జమాఖర్చులు పంపాలి ఉయ్యూరయ్య అనే జూనియర్ గుమాస్తా స్కూల్ లెక్కా డొక్కా తోపాటు దీన్నీ చూస్తాడు .నమ్మకస్తుడు భయస్తుడు కమితీవారి తలలో నాలుక కూడా .కొంతా స్థలం లో వరిసాగు కూడా ఉంది గొప్ప  .సీనియర్ గుమాస్తా సుబ్రహ్మణ్యం గారని గుర్తు ఉయ్యూరులో మాధవరావు అనే ఆయన తోడల్లుడు .గంభీరంగా ఉంటాడు .సైన్స్ మేస్టర్ శ్రీసుబ్రహ్మణ్యం  నాతొ పెనమకూరులో చేశాడు .భార్య గ్రేడ్ టు తెలుగుపండిట్ .లెక్కల మాస్టారుశ్రీ ప్రసాద్ అని చాలా సమర్ధుడు ,మంచి టీచర్ .తలలో నాలుక .స్కూల్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్ ఆయనే ఇంకో పోస్ట్ లో ఎవరో ఒకరు రావటం వెళ్ళటం జరిగేది .కనుక బాధ్యతఅంతా ప్రసాద్ గారిమీదే ఉండేది .సీనియర్ తెలుగు మేష్టారు శర్మగారు .దగ్గరలో ముళ్ళపూడి వారు స్కూల్ ఫంక్షన్ లన్నీ ఈయనే నిర్వహించేవారు .వాళ్ళబ్బాయి టెన్త్ లో ఉన్నాడు చురుకైనవాడు పబ్లిక్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు నాకు బాగా ఇష్టమైన శిష్యుడు చాకు అంటామే అలాంటి షార్ప్ నెస్ ఉన్నవాడు ఆయన కుటుంబం లో అందరూ తెలుగు పండితులే ఒక అన్న పెనమకూరు లో తెలుగు పండిట్ .ఇంకో ఆయన కపిలేశ్వరపురం లో అలా .సోషల్ మేష్టారు మస్తాన్ గారు .ఇక్కడి వాడే  హిందీటీచర్ లేడీ .ఉయ్యూరు లనుండి వస్తారు కోటలో అద్దెకుంటున్నారు భర్త తమిరిశ దగ్గర సోషల్ మేష్టారు ఇద్దరు ఆడపిల్లలు .పేరు తూటుపల్లి సావిత్రి అనిజ్ఞాపకం .సెకండరీ గ్రేడ్ లలో లంకపల్లి ఆయన నల్లగా పొట్టిగా ఉండేశ్రీరామ మూర్తిగారు .మా మామయ్యా వాళ్ళ పొలం కౌలుకు చేస్తానని ఒకటి రెండు సార్లు ఉయ్యూరులో నన్ను చూశానని గుర్తు చేసుకొన్నారు  .ఈయనే స్టాఫ్ సెక్రటరి .అందర్నీ ఒప్పించగలిగే ఓర్పూ నేర్పూ ఉన్నవారు .భీష్మ పితామహుడు ఒకాయన రెడ్డియ్యగారు ఉండేవారు .క్రాఫ్ట్ మాస్టర్ ప్రకాశ రావు గార్డెనింగ్ .’’దేవదాసు ‘’.అటెండర్ అర్జున రావు .రుద్రపాక వాడు ఇక్కడే సెటిల్ అయ్యాడు నైట్ వాచ్ మన్ ఆ ఊరివాడే కోటయ్య .సీనియర్ డ్రిల్ మాస్టారు శ్రీ సుబ్బారావు కపిళేశ్వరపురం వాడు రెండో డ్రిల్ మాస్టారు పమిడిముక్కలనుంది వచ్చేవారు మెతక మనిషి .నా దగ్గరే రిటైర్ అయ్యాడుసహృదయుడు  లాబ్ అసిస్టంట్ ప్రసాద్ –అతనికొడుకు 9 లో ఉన్నాడు స్కూల్ లో సంచాయిక ‘’అనే పిల్లల పొదుపు పధకం నేనెక్కడ పని చేసినా సమర్ధంగా నిర్వహించాను ఇక్కడ దాన్ని ప్రసాద్ చూస్తున్నాడు .వార్షికోత్సవం నాటికి ఎవరు ఎక్కువ పొడుపు చేస్తే వారికి బహుమతి ఇచ్చేవాళ్ళం .బాగా తెలివిగలవాడు సహృదయుడు .కొద్దికాలానికి గుమాస్తా సుబ్రహ్మణ్యం గారు బదిలీ అయి, లోయ శంకర రావు వచ్చాడు జగజ్జన్త్రీ మాటల గారడీ వాడు పని కూడా స్పీడ్ గా చేసేవాడు బాగా రాజకీయ పలుకుబడి ఉన్న వాడు .నాకు బాగా ఉపయోగ పడ్డాడు .అలాగే కొద్దిమంది బదిలీ అవటం కొత్తవాళ్ళు రావటం జరిగేది .

సాయంకాలం స్టాఫ్ సెక్రెటరి స్టాఫ్ సమావేశం ఏర్పాటు చేశారు తేనీటి విందు ఇచ్చారు .నన్ను నేను పరిచయం చేసుకొని అందరి పరిచయం చెప్పించి ,అందరం కలిసి స్కూల్ అభి వృద్ధికి పని చేద్దాం యిలా చేస్తా అలా చేస్తా అని నేను చెప్పను సంవత్సరం చివరికి మనం ఏం చేశామో తెలుసుకొందాం అని చెప్పాను ఒక పావుగంటలో స్టాఫ్ మీటింగ్ పూర్తీ చేశాను స్కూల్ జనరల్ డిసిప్లిన్ అంతా డ్రిల్ మాస్టర్ సుబ్బా రావు గారే చూసేవారు .రోజూ సమయానికి అసెంబ్లీ నిర్వహించటం ,లేట్ గా వచ్చిన వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వటం అన్నీ పకడ్బందీ గా చేసేవాడు .టీచర్ లలో బాడ్మింటన్  ఆడే వాళ్ళలో నేనూ తెలుగు మాస్టారు డ్రిల్ మాస్టారు , సైన్స్ ,లెక్కల మేస్టార్లు ఉన్నాం మేమందరం వాలీబాల్ కూడా ఆడేవాల్లమే కనుక స్కూల్ అయ్యాక ఒక గంట ఆడుకొని అప్పుడు బయల్దేరేవాళ్ళం

మళ్ళీ ప్రయాణం తిప్పలు

మేడూరు ఉయ్యూరుకు దగ్గరే .సుమారు 15 కిలోమీటర్లు కాని రోడ్డు బాగుండదు బస్ ఫ్రీక్వెంసి లేదు .ఏదో రకంగా వీరంకి లాకు చేరితే అక్కడినుండి వెళ్ళాలంటే ‘’టంగు’’ తెగేది .ఏదో తంటాలుపడి పమిడిముక్కల చేరితే అక్కడి నుండి స్కూల్ పిల్లల సైకిల్ మీద ఎక్కి వెళ్ళాలి లేక పోతే లెఫ్ట్ అండ్ రైట్ రెండుకిలోమీటర్లు   అలాగే సాయంకాలం 5 గంటలకే మేడూరు నుంచి విజయవాడ బస్ .అది మిస్ అయితే ఆరున్నరకో ఏడుకొ కాని మళ్ళీ బస్ లేదు .ఇంటికి చేరేసరికి ఎనిమిది దాటేది .ఒక రకంగా నాపని’’ పెనం మీంచి పొయ్యిలోకి ‘’అన్నట్లు అయిందేమో అనిపించింది .

సాయంకాలం బస్ కోసం స్కూల్ దగ్గరే ఉన్న యలమంచిలి వెంకటేశ్వరరావు గారు అనే రిటైర్డ్ సెకండరీ గ్రేడ్ మాస్టారి అరుగులపై ఆయనతో కబుర్లు చెప్పుకోవటం ఆయన శ్రీ పి శ్రీరామ మూర్తి గారి మనిషి .కబుర్లు బాగానే చెప్పేవారు ఎన్నో పాత విషయాలు తవ్వుకొని మాట్లాడుకొనేవాళ్ళం అలాగే ఆ ఊళ్లోనే రిటైర్ అయిన ఒక హిందీ మాస్టారు కూడా ఉన్నారు ఆయనా వెంకటేశ్వర రావే ఆయన ఇక్కడ ట్యూషన్ కింగ్ .

శ్రీ యలమంచిలి రామమోహన రావు గారు

మేడూరు అన్నా మేడూరు స్కూల్ అన్నా శ్రీ యలమంచిలి రామమోహన రావు గారే జ్ఞాపకం వస్తారు ఎవరికైనా మేడూరు లోనే కాదు చుట్టూ ప్రక్క వంద గ్రామాలలో అంతటి మంచి మనిషి .లేరు .మేడూరు గ్రామ సర్పంచ్ గా దాదాపు 25 ఏళ్ళు పనిచేశారు స్కూల్ బిల్డింగ్ కు స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టించారు .పంచాయితీ భవనం పసువులాస్పత్రి వంటివి అన్నీ వారి వితరణ వలన వచ్చినవే  ఆయన గొప్ప సంస్కారి .మాంచి కాంగ్రెస్ అభిమాని నిజాయితీకి నిర్భీకతకు ప్రసిద్ధి .ఎప్పుడూ తన చేయి పైనే ఉండాలని కోరుకొనేవారు దాన ధర్మాలకు లెక్కేలేదు .శ్రీ కాకాని వెంకటరత్నం గారికి నమ్మిన బంటు ,కాకాని వారు యే ఎలక్షన్ లో నిలబడినా ఖర్చు అంతా రామ మోహన రావు గారిదే దానితో ఎలక్షన్ అయ్యాక ఈ యన పొలం నాలుగో ఐదో ఎకరాలుఖాళీ .అంతమాత్రం చేత వెనకడుగు వేసేవారుకాడు మళ్ళీ ఎన్నికకు మళ్ళీ రెడీ సుక్షేత్రమైన మాగాణి పొలం కాకాని వారికోసం ఎన్నికలార్పణం అయ్యేది .సర్పంచ్ గా గ్రామాన్ని సర్వతోముఖా భి వృద్ధి చేశారు కాని రోడ్డు సౌకర్యం ఎర్పరచుకోలేక పోయారు తారు రోడ్డు గతుకుల రోడ్డే గతి .రావు గారికి రాజకీయ ప్రమోషన్ రావాలని ఆశించారు జనం దానికి ఆయన ససేమిరా అనేవారు నేను శాసన సభకు నిలబడతాను అంటే కాకానికి నిలబడే సాహసం ఉండేదికాదు అంత సాహసం ఈ వీర భక్త హనుమాన్ చేయలేదు ఏనాడూ .చివరికి ఉయ్యూరు మండలానికి ఉపాధ్యక్షులుగా అందరి బలవంతం మీద పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .ఆయన కనబడినా ఆయన పేరు చెప్పినా ‘’చేయెత్తి మహానుభావుడు ‘’అని నమస్కరిస్తారు జనం అదీ ఆయన కున్న కీర్త ప్రతిష్ట ‘అలాంటి రామ మోహన రాగారు నేను మేదూరులో చేరటానికి సుమారు రెండు నెలల ముందు చనిపోయారు .వాళ్ళబ్బాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రావు  మేడూరు సర్పంచ్ .ఆయన తమ్ముడు ఉయ్యూరు షుగర్ ఫాక్ట్రరీ లోను ,చుట్టూ ప్రక్కలా ప్రసిద్ధుడైన చెరుకు రైతు .పేరు గుర్తు లేదు .స్కూల్ కు సలహా దారు కూడా  ఇదీ నేను చేరిన మేడూరు అక్కడి స్కూలు నేపధ్యం మిగతా వివరాలు తరువాత తెలియ జేస్తా .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -33

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -33

— ఏకావాలి లో  అలంకార  చర్చ

అతిశయోక్తి అలంకారం -అతిశయోక్తి అలంకారం  ఉత్ప్రేక్షను పోలి ఉంటుంది కనుక మల్లినాథుడు దీని గురించి  చర్చించే ముందు ఆసక్యికలిగించే చిరు  ఉపోద్ఘాతం రాశాడు.-”తదేవ మధ్యవసాయ ప్రధానోత్ప్రేక్షామ్ లక్షయిత్వా -సంప్రత్య ధ్యవసితం ప్రాధాన్యేనాతిశయోక్తి0 విభాగ పూర్వ కమాహ ”
 ఆద్యావసతి అంటే అధ్యవసాయ .అది  సాధన స్థితిలో ఉంటె అప్పుడు అతిశయోక్తిలో మొదటి రకం అవుతుంది ..కానీ ఉత్ప్రేక్ష అధ్యావసాయాలో సాధ్య రకం పై ఆధార పడి  ఉంటుంది .ఉత్ప్రేక్ష సాధ్యవత్వం ,విషయం ల కు సంబంధం కలిగి ఉంటుంది .కానీ అతిశయోక్తి సిద్టత్వ ,విషయాంగిర్ణత్వ లతో సంబంధం కలిగి ఉంటుంది .అతిశయోక్తిలో అధ్యావసిత  సిధత్వం అంటే సంబంధం తేడా లేక పోవటం వలన అంటే వస్తువు వేరొకటి కాకపోవటం వలన ఉంటుంది .తేడా ఏమిటి అంటే తేడా లేకపోవటమే . విద్యాధరుని గ్రంధం ఏకావాలి లో అతిశయోక్తి నాలుగు రకాలని చెప్పాడు .మల్లినాథుడు మాత్రం మమ్మటుడు చెప్పిన నాలుగు అతిశయోక్తుల్ని వ్యతిరేకించాడు .మమ్మటుని అతిశయోక్తులు -1-భేదం లో భేదం లేక పోవటం 2-భేదం లేకపోవటం లో తేడా ఉండటం 3-వేరొక అసాధ్యమైన అర్ధం ”యది” మొదలైనచిన్నభాగాలతో  (పార్టికిల్ ) తెలియజేయటం  4-ఫలితం కారణం ల క్రమం అతిక్రమించటం
  ఇక్కడ మల్లినాథుడు సంబంధ అసంబంద0 ల నాధారంగా రకాలు చెప్పాడు .ఆ వైవిధ్యాన్ని ఒప్పుకోకపోతే ఆ రెండూ వేరు అవ్వాలి లేక రకాలలో కలిసి పోయి ఉండాలి అన్నాడు .అందులో మొదటిది ప్రత్యేక విలక్షణత ఉండటం వలన సమర్ధించ సాధ్యంకాదు .రెండవ ప్రత్యామ్నాయం కూడా సమర్ధింపబడదు కారణం ఇందులో భేద పరచే విషయం చెప్పబడక పోవటమే .ఇక మూడవ రకానికి వస్తే మమ్మటుడికే అనుమానాస్పదంగా ఉంది కనుక మొదటి రెండు ఒప్పుకోదగ్గవి కావు .నాలుగవ దానికి అసలు అవకాశమే లేదు -”పుష్పం ప్రవాలోపహితం యది స్యాన్ -ముక్తాఫలం వాస్ఫుటా  విద్రు మాస్యాం-తతో నుకుర్యా ద్విపదస్య తస్యా – స్తా మ్రొష్ట పర్యస్త  రుచం స్మితస్య ”
 మొదటిది సంబంధం లేని దానిలో సంబంధంఉందని చెప్పే ఉదాహరణ  .ఇక్కడ ‘  పుష్పం ,ముత్యం లమధ్య ఏరకమైన సంబంధం లేక పోయినా ”యది” అనేదాని వల్ల  సంబంధ అవకాశం ఉందేమో నని పిస్తుంది .రెండవ ఉదాహరణలో అభేదాలలో ఉన్న భేదాల రకాలు తెలియ జేస్తుంది ..స0బంధ  రాహిత్యం ఏదో ఒక భావం వలన ఉందనిపించటం. దీన్ని పండితులే తేల్చి చెప్పాలి .కనుక మల్లినాథుడు ఐదురకాల అతిశయోక్తులను సమర్ధించాడు అయితే ఇందులో సామాన్యం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది దీనికి అలంకార సర్వస్వ కర్త సమాధానం చెప్పాడు -”అధ్యావసిత ప్రాధాన్యే అతిశయోక్తిహ్ ఇతి సర్వస్వ కారో క్త మేవేతి బృమః ”
దీపకాలంకారం -దీన్ని చాలా స్పష్టంగా మల్లినాథుడు వర్ణించి చెప్పాడు .-”యథావా లోకే దేవా సమీపే స్థాపితస్య దీపస్య -కుంభా స్తంభా ధ్రుప లంభో పకారక త్వం త ధాయ మప్యేకత్ర స్థితం సర్వం -దీపకాతీతి దీపక ముచ్యత ఇత్యర్ధహ ”
ప్రాయాజా అనేది జంతువుకు అర్ధం అయినా త్యాగానికి కూడా అర్ధంగా ఉండి ,దేవుని దగ్గర పెట్టిన దీపం దూరానికి కూడా   కాంతిని  ప్రసరింప జేసినట్లు దారిలోని అన్నివస్తువులను  కాంతి వంతమ్ చేసినట్లు దీపక అలంకారం సార్ధకమైంది దీపకం లో ఒకటికాని  ఎక్కువ  సంబంధిత వస్తువులు ఒక గుణం తో కలపబడి ఉంటా యి .తుల్య యోగితలో అన్ని వస్తువులు సంబంధం కలిగికాని సంబంధం లేకుండాకాని ఉంటాయి .
 శ్లేషాలంకారం -మల్లినాథుడు శ్లేషను ”పదం లో సామ్యత ఉండి అది వస్తువుకు విశేషణానికి సంబంధం కలిగి ఉంటె శ్లేష ”అన్నాడు .కనుక ఇది శబ్దాలంకారం .విద్యాధరుడు ,మల్లినాథుడు ఇద్దరూ కూడా శ్లేషకు ,శబ్ద శక్తి మూల ధ్వనికి  ఉన్న భేదాన్ని వివరించారు .రెండింటిలోనూ వస్తువు విశేషణం లలో రెండు అర్ధాలు ఉంటాయి కానీ శ్లేషలో ఆ రెండు సంబంధం కలిగికాని లేకుండాకాని ఉంటాయి .అక్కడ పదానికున్న భావం సందర్భాన్ని బట్టి కప్పేస్తుంది కానీ వేరొక సందర్భం లేని అర్ధాన్ని సంబంధ మున్నా అర్ధం తర్వాత  సూచిస్తుంది .సందర్భం లేనిదాన్ని రెండర్ధాలమాటవలన గ్రహించాలి .శబ్ద శ్లేషలో సంబధం ఉన్నది లేనిది రెండూకూడా  బంకా ,కర్రా లాగా అతుక్కు పోయి ఉంటాయి అర్ధ శ్లేష లో అవి రెండుఒకే కొమ్మకున్న  రెండు పళ్ళు లాగా ఉంటుంది . ”యత్రప్రయత్న స్వరాది భేదా ద్రవస్తుతో భిన్నయోరేవ శబ్దయెహ్ మిథః సంశ్లేష భేదత్వాతు -కాష్ఠవదే కట్వేనావభాసః శబ్ద శ్లేష ఇత్యర్ధహ-తత్రైక వృ0త  ఫలద్వయ పద  ఖండేక  శబ్దే అర్ధ ద్వయ శ్లేష సార్ధ శ్లేషహ  ఇత్యర్ధహ  ”
అప్రస్తుత ప్రశంస -ఇందులో సంబంధం లేని అప్రస్తుతం చెప్పబడి ప్రకృతం సూచింపబడుతుంది ప్రశంస అనే దాని అర్ధం పొగడటం కాదు చెప్పటం లేక వర్ణించటం -”యత్రసారూప్యాది సంబంధత్రమా వశేనా ప్రస్తుత కధనాత్ ప్రస్తుతం గమ్యతే సాప్రస్తుత ప్రశంసయ్యుత్యర్ధహ్ ” అని మల్లినాథుని నిర్వ చనం
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు )

వీక్లీ  అమెరికా -5 -2 చివరిభాగం (1-5-17 నుండి 7-5-17 వరకు )

  రెండు పుట్టిన రోజుల వారం -2
7 వ తేదీ ఆదివారం విషయాలు -నిన్న మైనేనిగారు నాకు మెయిల్ రాస్తూ డా ఇన్నయ్యగారి భార్య గారు ”ఈల్ వీజిల్ ”రాసిన ”నైట్ ”పుస్తకాన్ని తెలుగులోకి”కాళరాత్రి ”గా  అనువదించి ముద్రించారని తనకు పంపిన మూడు కాపీలలో ఒకటి పంపానని మంగళవారం అందుతుందని తెలియ జేశారు .దీ న్ని మా మనవుడు శ్రీకేత్ టెక్స్ట్ బుక్ గా చదివి నాకిస్తే నేనూ చదివి తెలుగులో డబ్బింగ్ చేద్దామనుకొని ఎందుకో చివర నచ్చక మానేశాను ఆ పని ఆమె చేసినందుకు అభినందనలు మా అమ్మాయి ఇంటి దగ్గర నిర్వహించే తెలుగు క్లాసులు ఈ రోజుతో అయిపోయాయి పరీక్ష పెట్టారు మళ్ళీ సెప్టెంబర్ లో బడులు తెరిచాకనే మళ్ళీ ప్రారంభం అప్పటిదాకా ఆటవిడుపు . ఇవాళ ఉదయం  వీక్లీ  5 మొదటిభాగం రాశాను .     మధ్యాహ్నం  భోజనాలయ్యాక రెండు గంటలకు బయల్దేరి హిందూ సెంటర్కు వెళ్లాం .అక్కడ షార్లెట్ సాయి సెంటర్ వాళ్ళు గాంధీ భవన్ లో శ్రీ సత్య సాయి మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మగారి జయంతిని జరిపారు శ్రీమతి జయ ముఖ్య భూమిక వహించింది.  పిల్లలతో చక్కని ప్రోగ్రాములు నిర్వ హింప జేశారు తలిదండ్రుల సహకారం పిల్లల కుతూహలం ,సెంటర్ లోని టీచర్ల శిక్షణ అన్నీ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి మా మనవాళ్ళు చి ఆశుతోష్ ,పీయూష్ లు కూడా పాత్ర పోషణ చేశారు  .
  సరిగ్గా మధ్యాహ్నం 3 కు ప్రార్ధన తో మొదలైంది .తర్వాత అందరూ సత్య అనిపిలిచే సత్య శంకర్ -బాబా కు తల్లికి ఉన్న చక్కని అనుబంధాన్ని తేలికమాటలతో అందరికీ అర్ధమయ్యేట్లు ఇంగ్లీష్  లో తెర మీద పిక్చర్లు చూపిస్తూ ప్రసంగించారు అతడు మంచి వక్త ,వాద్యకారుడు . భార్య సౌమ్య హార్మోనిస్టు  గాయకురాలు . కూతురు కూడా మంచిగాయని .ఈ కుటుంబం సాయి సెంటర్ కు వెన్నెముక అన్నివిషయాలలో –
”సాయి బాబా తాత  కొండలరాజు మనవడి లో  దైవ లక్షణాలు కనిపెట్టి చేయెత్తి నమస్కరించకుండా చేయి పట్టుకునేవాడు అదే నమస్కారం బాబా నిద్ర పోతుంటే వచ్చి పాదాలకు నమస్కరించేవాడటతాత .తాత కుఅన్నం వండేవాడు బాబా రసం బాగా కాచేవాడట ..పుట్టపర్తి అంటే పాము పుట్టపర్తి అనేవారట నాగ సంచారం ఎక్కువ కొండలు రాళ్లు రప్పలమయం బాబా చిన్నతనం లో .బాబాను చిన్నప్పటినుంచి బ్రహ్మ జ్ఞాని అనేవారట అందరూ .తల్లి నమ్మేదికాదట .ఒక్కోసారి ఆయన మహిమలు చూసి కంగారుతో అత్తగారికి చెప్పేది .ఆమె ఎవరికీ చెప్పకు నవ్వుతారు అనేది .. ఇంట్లో ఏ పండగ జరిగినా తన పుట్టిన రోజు అయినా సరే అందరికీ అన్నీ ఇప్పించి చివరికి తాను తీసుకునేవాడు సత్య నారాయణ రాజు అనే సత్య సాయి .దూరం గా అడవుల్లో ధ్యానం లో ఉన్న బాబా ను చూడటానికి తలిదండ్రులు వస్తే ”మాయ ”వచ్చింది అనేవాడు .అంటే తానూ సంసార బంధానికి దూరామని అర్ధం .బ్రహ్మజ్ఞానికి ఏ బంధాలు ఉండవని భావం .. తల్లితో ”నువ్వు ఈ ప్రపంచానికి చెందిన దానివి సర్వ ప్రపంచం నీదే ”అనేవాడు.
  దగ్గరున్న కొండపై మందిరం కడతాననేవాడు .అక్కడెందుకు పాములమయం ఇక్కడున్న బడి ని బాగు చేసి కొత్తది కట్టించు అని తల్లి చెబితే ముందర ఎలిమెంటరీ స్కూల్ కట్టించాడు .తర్వాత తల్లికోరికపై హైస్కూల్ కట్టించి ఆమెపేరుపెట్టించాడు .ప్రశాంతి మందిరం కట్టించినతర్వాత బాబా అక్కడే ఉండేవారు తల్లిదండ్రులు గ్రామం లోనే ఉండేవారు అందరు అప్పుడు రాగి సంకటే  తినేవారు . ప్రజలుసాయి గురించి చెడుమాటలు అంటూటే భరించ లేక కొడుక్కి చెబితే అప్పుడు అందర్నీ మందిరం లోనే ఉండే ఏర్పాటు చేశారు .ఒకసారి ప్రిన్సిపాల్ గోకక్ ఒక పిల్లాడు మందిరం లో అనేక పనులు చేసి ఆలస్యంగా వెడితే పంపించేశాడు వాడు ఏడుస్తూ కూర్చుంటే తానూ ప్రిన్సిపాల్ కు ఖాళీ ఉన్న సమయం లో వెళ్లి ”సారూ !మీ కన్నీ తెలుసు బిడ్డడు పను లన్నీ చేసి రావటం మూలాన కుసుసింత లేటుగా వచ్చిండు .తొ లి తప్పు కాయండి ”అని బతిమాలి ఆయన్ను ఒప్పించి కుర్రాడు వెళ్లేట్లు చేసిన మాతృమూర్తి అన్నాడు సత్య .తల్లి దండ్రులను తాతగారిని వీలున్నప్పుడల్లా వెళ్లి అంతకు ముందు చూసివచ్చేవారు సాయి .ఒక సారి తల్లికి తీవ్రంగా జ్వరం వచ్చి భరించలేక పోతుంటే సాయి వచ్చిమందు వేసి తగ్గించారట అప్పుడు ఆమెకు నమ్మకం కలిగిందట బాబా దైవ స్వరూపం అని . అలాగే చివరి సారి 19 72 లో ”స్వామీ స్వామీ ”అని కలవరించిందట వెంటనే ఆమె ముందు ఉన్నారట బాబా ”నాయనా నువ్వెవరవో నాకు ఎరుక పరచావు ధన్యోస్మి ”అంటూ చేతులు పట్టుకొని బాబా తల్లి ఈశ్వరమ్మగారు మరణించారని సత్య ప్రసంగం పూర్తి చేశాడు ఆసాంతం చాలా క్రమ పద్ధతిలో వివరించగా  అందరు  కరతాళ ధ్వనులతో అభినందించారు .
  తర్వాత 4-15 నుంచి నాలుగు ప్రదర్శనలు నిర్వహించారు .అందరూ పిల్లలే . వినాయక షణ్ముఖ ఈశ్వర రామ కృష్ణ సరస్వతి లక్ష్మి షిర్డీబాబ సత్యసాయి వేషాలతో మంచి దుస్తులు అలంకారాలు ఆయుధాలతో అలంకరించిన కుర్చీలలో కూర్చుని దేవతలంతా ఒక్కటే అనే భావాన్ని కలిగించారు .సాయి సర్వదేవతా స్వరూపుడు అనే భావం కలిగించారు దీనికి మంచి ట్రెయినింగ్ ఇచ్చి ,తీర్చి దిద్దిన లేడీ టీచర్ మానిని అభినందనీయురాలు డెకరేషన్ తో సహా అన్నీ ఆమె సమకూర్చింది తలిదండ్రులు వస్త్రాలు సమకూర్చారు .కాన్సెప్ట్ బాగుంది .పిల్లలతో తాము ఎందుకు ఏ పాత్ర వేసింది తెరమీద చెప్పగా చూపించి వైవిధ్యం కలిపించారు  .తర్వాత రీ సైక్లింగ్ విధానం పై నలుగురు ఆడపిల్లలు వివరించారు  చిలక పలుకుల్లా ఉన్నాయి ఫీల్ రాలేదని పించింది ..మూడోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోబాటు బాబా కాన్ఫిడెన్స్ కూడా ఉండాలన్న ధీరీ తో పిల్లలే రాసి ప్రదర్శించింది బాగానే ఉంది అందరూ బాగానే చేశారు .చివరిదైన నాలుగవది సత్య సాయి జియోపార్దీ ”.దీనిని హిందూ సెంటర్ లో తెలుగు నేర్పే టీచరూ  పిల్లల డాక్టర్  మంచి డాన్స్ టీచర్ అయినా సాయి కృష్ణ అనే ఆవిడ నేతృత్వం లో ప్రదర్శించారు .ఇందులో మా మనవాళ్ళు అశుతోష్ ,పీయూష్ లు కూడా ఉన్నారు ఇంటి దగ్గర ఏ వేషం వేస్తున్నార్రా అని అడిగితె ”సీక్రెట్ ”అక్కడే చూడాలి అన్నారు అంతటి సీక్రెసీ ని బృందం అంతా మెయిన్ న్టైన్ చేసింది.ఇది సాయిబాబా జీవితం పై క్విజ్ ప్రోగ్రామ్ . చిన్న ప్రశ్నలే తేలికైనవే .ప్రేక్షకులకే   సరైన సమాధానం చెబితే బాబా ఫోటో బహుమతిగా ఇచ్చారు తమాషా ఏమిటట ఇన్నేళ్ళుగా సాయి సెంటర్ నడిపేవాళ్లు ఆయనపై ఎన్నో ప్రసంగాలు విన్నవాళ్ళు కూడా ఆయన ఎప్పుడు ఏనెల ఏ తేదీ ఏ వారం పుట్టారని అడిగితె కరెక్ట్ సమాధానం చెప్పక పోవటం వింత అనిపించింది
  దీనితర్వాత మళ్ళీ ఒక అరగంట భజన .
  సాయంత్రం 6 నుంచి స్నాక్స్ టీ  ఏర్పాటు .ఎవరికి వారు తమకు చేతనయింది ఇంటి దగ్గర చేసుకొచ్చి ఇక్కడ అందరూ తినే ఏర్పాటు చేశారు .ఒక తెలుగమ్మాయి పుట్టినరోజు నిన్నయితే ఇవాళ అందరి సమక్షం లో”ఎగ్ లెస్  బర్త్ డే కేక్ ”కోయించి అందరికి పెట్టించారు.ఇదికాక రసగుల్లాలు పునుగులు ,మిరపకాయ బజ్జీ ,మరొక శ్వీటు ,పిజ్జాలు ,అటుకుల పులిహోర కర్బూజకాయ ముక్కలు, మరమరాలు, కాఫీ, టీ లతో అందరూ సుష్టుగా లాగించారు .అంతా  అయ్యేసరికి రాత్రి ఏడు అయింది .ఇంటికి వచ్చేసరికి ఏడున్నర . ఈ ఫోటోలు పెట్టి ఇదంతా రాసేసరికి రాత్రి 10 .. ఇంతటితో ఈ వారానికి స్వస్తి .
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ జయంతి -7-5-17 ఆదివారం షార్లెట్ సాయి సెంటర్

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -5-1 (1-5-17 నుండి 7-5-17 వరకు )

వీక్లీ  అమెరికా -5-1 (1-5-17 నుండి 7-5-17 వరకు )
రెండు పుట్టిన రోజులవారం

1-5-17 సోమవారం ఉదయం నిద్ర మంచం మీద నించి ఇంకా కేవకుండానే ఉయ్యూరు నుంచి మా మనవడు చరణ్ ఫోన్ చేసి”తాతా ! ఉయ్యూరు ను ,మమ్మల్ని మర్చిపోయావు ఫోన్ చేయటం లేదు ”అని నేరం వేశాడు నవ్వుతూ .మధ్యాహ్నం అడ్డాడ శిష్యుడు భూషణం ఫోన్ చేసి అక్కడ నేను పని చేసినప్పుడు దివాకర్లవారు రాసిన ”భారతావతరణం ”పద్యనాటిక నేను వేయించటం అందులో తానూ నన్నయ పాత్ర వేయటం జ్ఞాపకం చేశాడు .నిజమే అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఎస్ సి వాళ్ళు .వాళ్లకు మాటలు పలకటమే రాదు కానీ సాహసంగా తీసుకొని వాళ్ళతో పద్యాలు ప్రాక్టీస్  చేయించి వేయించాను చాలా చక్కగా చెప్పారు .అదొక సాహసం . మల్లినాథ సూరి 29 వ ఎపిసోడ్ రాసి  సుమారు 5 నెలలయింది .మళ్ళీ ఇవాళ మొదలుపెట్టి 30 వ ఎపిసోడ్ రాశాను .

సాయంత్రం డా ఎల్లాప్రగడ రామ మోహన రావు గారు” కారీ ”నుంచి ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా మాట్లాడారు .మైనేనిగారికి ఊరగాయలు పంపించానని ఆయన చాలా అల్ప సంతోషి అని ,తనకు క్లాస్ మేట్ అని ఏరా అనుకుంటామని  ఊరగాయలు పంపినందుకు తనకు వెయ్యి డాలర్లు పంపిస్తానన్నారని తానూ ‘ఏరా !నేను పచ్చళ్ళు అమ్ముకునే వాడిగా కనపడుతున్నానా ?”అన్నానని చెప్పి మైనేని గారి వితరణ శీలత్వం సరసభారతి పుస్తకాలలో బాగా నేను రాశానని ,డబ్బు ఎందరికో ఉంటుంది కానీ దాన్ని మంచిపనులు ఖర్చు చేసి వారు అరుదు అలాంటి ఆరుధై నవాడు మా గోపాలకృష్ణ అన్నారు . ఆ తర్వాత మా చిన్నతనాలలో ఊరగాయలు పెట్టటం ఒక ఖార్ఖానా గా ఆ పరిశ్రమలాగా ఉండేదని ఇద్దరం జ్ఞాపకం చేసుకున్నాం .ఇళ్లల్లో గజం ఎత్తు  జాడీలు ఉండేవని మామిడికాయలు తరగటం కలపటం వగైరా వేసవి కాలపు కుటీర పరిశ్రమగా ఉండేదని అనుకొన్నాం . ఈ విషయాలన్నీ మైనేని గారికి వెంటనే మెయిల్ రాశా .ఆయన  రావుగారు రేపల్లె లో తమ స్వంత  తోట లో కాసిన మామిడికాయ చింతకాయ గోంగూర ,నిమ్మకాయ పండు మిర్చి లతో ఊరగాయలు పెట్టిస్తారని వాటినే తమకు పంపారని రాశారు . వారిద్దరి సౌజన్యం గొప్పది అలాంటి వారు నాకు మిత్రులవటం నా అదృష్టం .

  లైబ్రరీ పుస్తకాల గడువు రెండువారాలు మాత్రమే .మామనవాడు పీయూష్ చేత ఆన్ లైన్ రెన్యూ చేయించా .మళ్ళీ మంగళవారం మధ్యాహ్నం భూషణం వాట్సాప్ చేశాడు విషయం ఏమీ లేదు .సాయంత్రం కోడూరి పావని కెంటకీ నుంచి ఫోన్ చేసి మాట్లాడింది .ఆ అమ్మాయి చాలా పద్ధతిగల పిల్ల .భూషణం విసిగిస్తున్నాడా సార్ అంది . తాము  జులైలో మరో చోటికి వెళ్లవచ్చని చెప్పింది .మా శ్రీమతి తోనూ మాట్లాడింది ఎండ బాగానే ఉంది రెండుపూటలా వాకింగ్ చేశాను . ”చెన్నై చంద్రమా ”అన్నట్లు షార్లెట్ సూర్యుడు రాత్రి 8 గంటలకూ కనిపించాడు . రాత్రి సునయన ప్రెసెంట్ చేస్తున్న ”ఫ్రస్ట్రేటెడ్  ఉమన్ ”యు ట్యూబ్ లో చూసాం . సరదాగా బాగుంది ఎన్నో సమస్యలపై తనదైన ధోరణిలో బాగా ప్రదర్శిస్తోంది . దాదాపు ఏక పాత్రాభినయం . కరెంట్ టాపిక్స్ పై మంచికథనాలు . ఎంత ఈజీ గా చేస్తోందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది ..మహా నటీమణులు చాలరుఅనిపించింది .చిన్నతనం లో బేబీ సునయన గా చాలా చేససిందని ప్రభావతి జ్ఞాపకం  చేసుకొన్నది ..మహాతల్లి  లూ  బాగుంటాయి  

  బుధవారం మా మనవడు చి హర్ష 6. 7 /10 మార్కులతో తెలంగాణా ఎస్ ఎస్ సి పాసయ్యాడు . 2015 ఆగస్టు 9 న పెద్ద యాక్సిడెంట్ అయి డివైడర్ కు తల తగిలి రెండు సార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరిగి  అన్నీ మర్చిపోయి క్రమ క్రమంగా కోలుకుని 10 పరీక్షలు రాయాల్సినవాడు 9 చదివి తర్వాత 10 కూడా చదివి ఈ ఏడాది టెన్త్ పాసవ్వటం అద్భుతం . అందుకే వాడి బ్రెయిన్ ఆప రేషన్ చేసిన డాక్టర్ వాడిని మిరకిల్ బాయ్ అంటాడు  నిజమే హోప్స్ లేవని చెప్పారు కానీ దైవ కృపవలన సమయానికి హాస్పిటల్లో చేర్చిన యువ దంపతుల చలువ వలన మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి కృప వలన బతికి బయట పడి  క్రమంగా అన్నీ గుర్తుకు వచ్చి చదివి పరీక్ష పాసవటం ఎనిమిదవ వింత యే . వాడు పాసయిన సంగతి అందరికి మెయిల్ లో తెలియబరచాను మైనేనిగారు శ్యామలాంద  ప్రసాద్ గారు ,వారణాసి సూర్యకుమారిగారు  బొడ్డ పాటి చంద్ర శేఖర్ మొదలైనవారు సంతోషం వెలిబుచ్చుతూ సమాధానమిచ్చారు .
  వైకింగ్ శకం పై మూడు ఎపిసోడ్లు రాశాను . ది నాజీ హోలోకాస్ట్ ,ఏ వరల్డ్ వితౌట్ జ్యుస్  ది  వైకింగ్స్ పుస్తకాలు చదివేశాను .ఉయ్యూరునుంచి తెచ్చుకొన్న ఆలంకారికులు చదివాను ఈవారం లో . గురువారం సాయంత్రం 6-30 కు మా మనవళ్లు 6 వతరగతి చదువుతున్న  స్కూల్  లో పిల్లల జంత్ర వాయిద్య ప్రదర్శన కు వెళ్లాం మా మనవడు చి ఆశుతోష్ ట్రంపెట్ వాయించాడు బృందంతో .చాలామంది పేరెంట్స్ చూడటానికి వచ్చారు
 మే  21 వ తేదీ జరిగే శ్రీ హనుమజ్జయ0తి  కార్యక్రమం తయారు చేసి ప్రింట్ చేయించమని రమణకు మెయిల్ లో పంపాను .శ్రీమతిశాంతిశ్రీ భక్తి సంగీత విభావరి డా శ్రీ ఆచంట శివరామ కృష్ణ మూర్తిగారి ధార్మిక ప్రసంగం ,శతకత్రయ ధారణ పోటీలు బహుమతుల ప్రదానం మిగిలిన వాటితో చేర్చాం
  శుక్రవారం హర్ష పాలిటెక్నీక్ ఎంట్రన్స్ బాగా రాస్శాడని శర్మ చెప్పాడు . ఆదివారం హిందూ సెంటర్ లోశ్రీ సత్యసాయి మాతృశ్రీ ఈశ్వరమ్మగారి జయంతి  కార్యక్రమ0 లో వేసే పిల్లల డ్రామాలో మా మనవాళ్ళు స్టేజ్ ప్రాక్టీ స్  కోసం విజ్జి పిల్లని రాత్రి 7 కు తీసుకువెళ్లి 10 కి తిరిగివచ్చింది .అంతకు ముందుకొక గంట ఇంట్లో తెలుగు స్పెషల్ క్లాస్ నిర్వ హించింది ఆఫీస్ నుంచి రాగానే .
  రాత్రి బాలమురళీ కృష్ణ సంగీతం ఎలాపడాలి గాత్ర ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి స్వర రాగ విషయాలలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి అనేవిషయాలపై ఇంగిలీషు లో చేసిన డిమాంస్ట్రేషన్ లెసన్ చూసాం యు ట్యూబ్ లో తర్వాత బృందావని రాగ తిల్లానా ఎలా పాడాలో నేర్పే తీరునూ చూసాం  బాలమురళి అంటే తిల్లానా స్పెషల్ .దీన్ని తమిళ విద్యార్థులకు నేర్పే  సిడి అది బాగుంది వాళ్ళు ఆయనతో చక్కగా పాడారు .ఇవి చూస్తే ఇలాంటి విషయాలపై బాలమురళికి ఉన్న సర్వజ్ఞత్వాన్ని  మన తెలుగు వాళ్ళు ఉపయోగించుకోలేక పోయారని పించింది .ఇలాంటి ఆయన పాఠాలు తెలుగులో ఉన్నాయో లేదో నాకు తెలియదు ఉంటె సంతోషం  .
  శనివారం  జ్యుల పై రెండు పుస్తకాలూ చదివి ఘోరకలి పేరిట 5 ఎపిసోడ్ లు రాశా . చి హర్ష పాలిటెక్నీక్ ఎంట్రన్స్ పరీక్షలో 45 మార్కులతో క్వాలిఫై అయినట్లు శర్మ మార్కుల మెమో తోసహా పంపాడు సంతోషించాము ఫోన్ చేసి మాట్లాడాం . అందరికి మెయిల్ ద్వారా విషయం తెలియ బరచాను .శ్రీ మైనేని  శ్రీ గాయత్రిప్రసాద్ గార్లు వెంటనే స్పందించి సంతోషం తెలిపారు
  సరసభారతి వీక్షకుల  సంఖ్య  ఈ ఉదయానికి 4 లక్షల 61 అయింది ఈ సంతోషవార్తనూ అందరికీ పంపాను  పవన్ రెండవ అమ్మాయి చి ప్రశాంతి పుట్టిన రోజును పిల్లలందరితో బయట నిర్వహించి రాత్రికి మమ్మల్ని ఇంటికి భోజనాలకుపిలిచాడు .మా కుటుంబం ,రాంకీ తమ్ముడు సాయి పవన్ కుటుంబం పవన్ మేనమామ కొడుకు కుటుంబం అతిధులం ..పవన్ భార్య రాధ అతిథిమర్యాద బాగా చేస్తుంది వాళ్ళత్త గారిని కంటికి రెప్పలాగా చూసుకుంటోంది ఆవిడ మా రెండవ బావగారు  వేలూరి వివేకానంద్ గారి అన్నగారైన ముకుందం గారి భార్య అంటే వదినగారు పవన్ ఆమె కుమారుడు ..పవన్ తండ్రి ముకుందం గారు చనిపోయి చాలా ఏళ్లయింది . వీరి బాగోగులు మా బావా అక్కయ్య చూశారు .  మంచి బంధుప్రేమ ఉన్నవాడు . భోజనంలో వంకాయ ,బెండకాయ కూరలు అల్లం చట్నీ ఆవకాయ ,బజ్జీలు గులాబ్జామ్ ,పెరుగు  పుచ్చ ముక్కలు ,మా అమ్మాయితీసుకు వెళ్లిన జున్ను ,పనస తొనలుతో సుష్టుగా భోజనం చేసాం . అన్నీ అదరహా . రాంకీ తమ్ముడు సాయి నా మెయిల్స్ పంపితే చదువుతానని అన్నాడు .వాళ్ళత్తగారు మామగారలకు మేంమంతా బాగా తెలుసునన్నారు విష్ణుభొట్ల ఇంటిపేరట . ఇంటికొచ్చి కొన్ని పంపాను . పవన్ తో డొమినికన్ ఆవిడ తన గురించి నాకేమీ సమాచారం పంపలేదని చెబితే తనకు పంపిందని తన గురించి రాయతగినంత గొప్ప విషయాలు లేవని తెలియ జేసిందని చెప్పాడు .సరదాగా ఒక అరగంట కబుర్లు చెప్పుకొని ఇంటికి రాత్రి 11 గంటలకు చేరాం .పవన్ ఇల్లు మా వాళ్ళ ఇంటికి చాలాదగ్గరే ఏడెనిమిది నిమిషాల కారు ప్రయాణమే  .మిగిలిన విషయాలు తర్వాత రెండో ఎపిసోడ్ లో రాస్తా ..
       మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మా బంధువు వేలూరి పవన్ కుమార్తె చి ప్రశాంతి పుట్టిన రోజు 6-5-17 రాత్రి వాళ్ళఇంట్లో విందు

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

ఘోరకలి -5(చివరిభాగం )

ఘోరకలి -5(చివరిభాగం )

                     బర్నింగ్ బుక్స్ బోన్ ఫైర్ -2

–అంతకు ముందు కొన్నివారాలుగా నిషేధిత పుస్తకాలను నాజీ ప్రభుత్వం సవాదేనం చేసుకొన్నది . మార్చ్ 12 న  స్టార్మ్ట్రూపర్స్ లోకల్ ట్రేడ్ యూనియన్ లైబ్రరీ ని తస్కరించి బోల్షెవిక్ ,పసిఫిస్ట్ ఏదీస్ట్  మార్క్సిస్టు పుస్తకాలు న్యూస్ పేపర్లు లోకల్ లైబ్రరీలనుంచి తొలగించాలని ఆదేశించింది .తర్వాత పబ్లిక్ లైబ్రేర్రలన్నీ వెయ్యి కళ్ళతో వెతికించి లాగించేసింది .హీదేం బెర్గ్ స్తూడెంట్ బాడీ విద్యార్థుల్ని తమదగ్గరున్న నిషేధ సాహిత్యాన్ని తొలగించమన్నది  తర్వాత బాన్ ,డార్మ్ స్టెడ్  డ్రేస్డైన్ ,ఫ్రీబర్గ్ ,గీసేన్  గూటింజెన్ ,విటెన్ బెర్గ్ మొదలైన 24 చోట్ల బుక్ బోన్ ఫైర్ పండగ చేశారు . ఏప్రిల్ ,మే లలో వేలాది లైబ్రరీ పుస్తకాలకు దహన సంస్కారం చేశారు  .వీటి స్థానం లో హిట్లర్ మీన్ కాంప్ పుస్తకాలను చేర్చారు లైబ్రరీలలో . ఫ్రాంక్ ఫర్ట్ లో రొమేన్ బెర్గ్ 15 వేలమంది చూస్తుండగా పుస్తక భోగిమంటలు వేశారు బెర్లిన్ ఒపెరాస్క్వేర్ లో 25 వేల విలువైన వెస్టర్న్ కాల్చర్కు చెందిన గ్రంధాలను అగ్నికి ఆహుతి చేశారు .ఇందులో 10 వేలు సెక్సువల్ ఇంస్టి ట్యూట్ కు చెందినవి  ప్రఖ్యాత జర్మన్ రచయితలైన షాలేం యాష్ ,హేన్రి బార్బస్ ,ఫ్రాంజ్ బోస్ ,జాన్ డాస్ పాసోస్ ,ఫరాయిడ్ ,అయిన్ స్టెయిన్ ,ఆంద్రీ గైడ్ ,ఎర్నెస్ట్ హేమిగ్వే ,హెలెన్ కెల్లర్ , లెనిన్ ,రోసా లక్సన్  బెర్గ్ అప్టాన్  సింక్లెర్ ,హేజీ వేల్స్ ,మొదలైన వారి అమూల్య గ్రంధాలు నాజీల అహంకారానికి అగ్ని జ్వాలకు ఆహుతయ్యాయి .ఈ బుక్ బర్ణింగ్  మంటలు ”సింబల్ ఆఫ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ”అని నాజీలు భుజాలు చరచుకొన్నారు ..ఈ దహన కాండలో ఎందరో ఎకాడమిస్ట్ లైబ్రేరియన్లు ,టీచర్లు  ,పాల్గొన్నారు .జెర్మనిస్ట్ అయిన మాక్స్ హెర్మన్ ఒక్కడే దీన్ని వ్యతిరేకించాడు  .ప్రాపగాండా మినిష్టర్ గోబెల్స్ ,అతని మంత్రిత్వ శాఖ ముందు నాయకత్వం వహించలేదు .కానీ తర్వాత సపోర్ట్ చేశాడు

    అనేక అసోసియేషన్లు నాజీ మూకలు ఈ సరస్వతీ మరణ హోమాన్ని జాతీయ పండగగా జరిపారు ..ఇదొక సంప్రదాయమే అయింది .ట్రక్కులనిండా నిషేధ పుస్తకాలు పెట్టి హిబ్రూ అని నిక్ నేం తగిలించి ,రెండు ఎద్దులతో లాగించి  కెన్నీ ట్రక్కులమీద ”చెత్త పుస్తకాలు ”అని పేరు రాసి  మరికొన్న ట్రక్కులను గుర్రాలతో లాగించి దానిమీద ”నేను ఈ పుస్తకాలు చదివిన గాడిదను ”అని పోస్టర్ అంటించి కుర్రాళ్ళు స్తూడెంట్లు అరుపులు కేకలతో ఊరేగి తగలబెట్టారు ..పిల్లలు యువకులు ముసలి ముతక అందరూ ఈ పాపం లో భాగస్వాములయ్యారు . దీనికి తోడు సంగీతం తో హోరెత్తించారు .ఇందులో పాల్గొన్నవారికి ఆ పుస్తకాలేమిటో ఎవరు రాశారో వాటిప్రాముఖ్యత ఏమిటో ఎవ్వరికీ తెలియదు అదీ మూక రాజ్యం అంటే ..హిట్లర్ చాలా అముఞ్చిపని చేస్తున్నాడని అభినందనలు ..నాజీల లిస్టులో శత్రువుల పేర్లు ఎక్కువ స్నేహితులపేర్లు అతి తక్కువ అదీ వైపరీత్యం .ఒపేరా స్క్వేర్ దగ్గర జరిగిన బుక్ బార్కింగ్ లో రచయితఆర్నార్డ్ జ్వీ గ్ తన పుస్తకాలు తగలబడుతుండగా స్వయం గా చూశాడు 1887 లో పుట్టిన ఆయన జర్మనీ తరఫున మొదటి వరుసలో యుద్ధం చేసి న యుద్ధ వీరుడు.
        సమాప్తం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-17-కాంప్-షార్లెట్-అమెరికా ..


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -4

ఘోరకలి -4

             బుక్  బర్ణింగ్ బోన్ ఫైర్
మనుషుల పనిపట్టి వారి సర్వ నాశనం చేసినట్లే హిట్లర్ తనకిష్టం లేని వారిరచనలను తగలబెట్టే ప్రయత్నం దేశవ్యాప్తంగాచేసి రికార్డ్ నెలకొల్పాడు .ఇదే” పుస్తక దహన భోగిమంటలు ”అనే బుక్ బర్ణింగ్ బోన్ ఫైర్ .ముఖ్యంగా హీబ్రూ బైబిల్ దహనం సోషలిస్టు సాహిత్య  దహనం ఇందులో భాగాలు .. ఈ దహనక్రియ పబ్లిక్ గా  బాండ్  మేళాలతో చప్పట్లు కేరింతలతో నడిబజార్లలో, యూని వర్సిటీ ఆవరణలో,సెంటర్ లలో  జరిపించాడు ..జ్యోవోయిష్ నాగరికత పూర్తిగా అంతమైపోవాలన్న  ఆరాటమే ఇది జ్యులు లేని ప్రపంచ నిర్మాణం సాధించాలన్న తపన . ఇదంతా ఒక  ఫా0టసీ . జ్యుల ను ఒక కల్పిత శత్రువుగా భావించి చీకట్లో చేసిన యుద్ధమే ఇది . జ్యులు ఏనాడూ జర్మనీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పని చేయలేదు ఆక్రమణలు చేయలేదు .ఆరకమైన సాహిత్యాన్నీ రాయలేదు . అందుకే యా0టి సెమిసిస్ట్ అనేది ఒక ఫా0టసీ అన్నారు . 1937 లో ”ది జ్యు  యాజ్ ఎ  క్రిమినల్ ”అనే పుస్తకాన్ని కిల్లర్ ,హాన్స్ ఆండర్సన్ లు రాశారు .అందులో ”స్పైరోకైతే బాక్తీరియా సిఫిలిస్ వ్యాధి కారణమైనట్లే జ్యులలో రాజకీయ ,రాజకీయేతర విషయాలలో నేర చరిత్ర రక్తం లోనే ఉన్నవాళ్లు మానవులకు జ్యులు పూర్తి వ్యతిరేకులు దుష్టత్వానికి మూర్తీభవించిన రూపం జ్యు .దేవుడికి వ్యతిరేకి .వాడి వాసనే చావుకు కారణం ”అని అభూత కల్పనలతో రాశారు  జాతి విద్వేషం కలగటానికి ఇది పూర్తిగా కారణాలలో ప్రధాన కారణమైంది
  క్రిస్టియానిటీ  జ్యుల మతమార్పిడిని సమర్ధించింది కానీ నాజీలు వ్యతిరేకించారు .ఇంతటి జాతి వ్యతిరేకతను నాజీలు కలిగించటానికి క్రైస్తవం కూడా బాగా దోహదం చేసింది .జ్యులనూ  జ్యుయిజాన్ని అగ్నికి ఆహుతి చేయాలన్నది హిట్లర్ సంకల్పం .వీళ్లకు ఈ భావం యూరోపియన్ కాలనీల నుండి వచ్చింది లక్షలాది ఇతరులను చంపి బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ బెల్జియం రాజ్యాలను ఏర్పరచుకున్నారు 1904 -1907 మధ్యఆగ్నేయ ఆఫ్రికాలో(నాంబియా )   హెరెరో ,నామాక్వా లను జర్మన్లు తుడిచిపెట్టేశారు కనుక ఇప్పుడు కూడా అలాంటిది సాధ్యమని కలలు కన్నారు .జ్యులకు మూలాలు బలంగా ఉన్నాయని ,బైబిల్ ,క్రిస్టియానిటీ ,లకు కారణం భూతులని కనుక కొత్త పరభుత్వానికి పాత వాళ్ళు అడ్డు అని భావించారు నాజీలు జ్యులు అంటే టెర్రర్ ..కనుక ఎన్ని లక్షలమంది అయినా సరే జర్మనీ యూరప్ దేశాలలోని జ్యులను అంతం చేయాలనే నిశ్చయించాడు హిట్లర్ .. 919-33 వరకు జర్మనీలో న్యాయం చట్టం ప్రజాస్వామ్యం చక్కగా వర్ధిల్లాయి.  జ్యులకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే పోలీస్ న్యాయస్థానం వారి హక్కులను కాపాడాయి . థర్డ్ రీచ్ పాలనవచ్చాక జ్యులకు హింస ప్రజ్వరిల్లింది .రౌడీలు వీధిమూకలు మిలిటరీలో ఎస్ ఏ రూపం లో దూరిపోయారు .వీళ్ళు సైన్యానికి అనుబంధ సంస్థ అయ్యారు  జ్యులకు అన్యాయం జరిగి ఫిర్యాదు చేస్తే ”జ్యులను రక్షించటం పోలీసుల ద్యూటీ కాదు ”అనే స్థితికి వచ్చింది .ధనికులైన జ్యులు అనేక వర్తక వాణిజ్య సంస్థలను  కంపెనీలను స్థాపించి నిర్వహించేవారు .వేలాది ఉద్యోగస్తులు పని చేసేవారు .అనేక యూనివర్సిటీలలో న్యాయస్థానాలలో సంస్థలలో విద్యాలయాలలో జ్యులు ఉన్నతపదవుల్లో ఉండేవారు ఇప్పడు దీన్ని సహించలేక నాజీలు ”యాంటీ కే పటలిస్ట్ ”విధానం అవలంబించారు .హిట్లర్ కు జ్యుల వల్లనే ఫ్రెంచ్ విప్లవం ,సమాన హక్కులు ,కమ్యూనిజం కేపటలిజం వచ్చాయని భ్రమ ఉండేది .ఇదంతా కూలదోసి నవ జర్మనీ ఏర్పరచాలనుకొన్నాడు ఆ విషయం స్పష్టంగామీన్ కాంప్ అనే 

తన చరిత్రలో చెప్పాడు -”సృష్టికర్త దేవుని ఆజ్ఞప్రకారం నేను జ్యులను వ్యతిరేకిస్తూ ,దేవునిపనిలో నడుస్తున్నాననుకొంటున్నా”అన్నాడు  .కేపిటలిజం కన్జర్వేటిజం కమ్యూనిజం బోల్షివిజం మార్క్సిజం ,సోషలిజం .లిబరలిజం ,పసిఫిజం ,కాస్మోపాలిటనిజం  మెటీరియలిజం  నాస్తికత, ప్రజాస్వామ్యం లు ఏర్పడ్డాయని తానునమ్మి ప్రజలచేత నమ్మించాడు హిట్లర్ .నిజానికి వీమర్ రిపబ్లిక్ లో సాహిత్య సంస్కృతులు మూడు పూలు ఆరుకాయలుగా వర్ధిల్లాయి .వినోదం కేబరే క్లబ్ డాన్స్ లైంగిక స్వాతంత్రం ,సైకో అనాలసిస్ , ఫెమినిజం ,హోమో సెక్సుయాలిటీ  అబార్షన్ జాజ్ సంగీతం బాహాస్ ఆర్కి టెక్చర్  ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్  ఇంప్రెషనిజం ,క్యూబిజం డాడాయిజం ఎక్స్ప్రెషనిజం లు వర్ధిల్లాయి అందుకే హిట్లర్ కు ”ఎక్కడో ”కాలింది .. 1933 వరకు నాజీలకు జీనోసైడ్ (జాతి విధ్వంసం ),ఎక్స్టెర్మి నేషన్(దుంపనాశనం )ఆలోచన రాలేదు . కొత్త జర్మన్ జాతిని జ్యుల  రక్త రహితంగా ఏర్పరచాలని ఆతర్వాత వచ్చింది అందుకే ఆ మారణ హోమాలు .దానికోసమే ప్రజాస్వామ్యాన్ని బలపరచిన వీమర్ డెమాక్రసి చట్ట న్యాయ వ్యవస్థ ,జర్మన్ ఉదారవాదం కమ్యూనిజం  విధ్వంస నిర్ణయం  హిట్లర్ ఛాన్సలర్ అయినా కొత్తలో ”ఆ వీడెన్ని  రోజులుంటా డు రెండునెలల్లో మూలకు తోసిపారెయ్యమా స్ప్రింగ్ దాకా ఉంటె గొప్పే ”అని ప్రగల్భాలు  పలికారు డెమొక్రాట్లు .అప్పటికి హిట్లర్ అధికారాలు పరిమితమే .క్రమంగా బలపడి ప్రెసిడెంట్ అయి సైన్యాధికారి అయి సర్వాధికారాలున్న ఫ్యురేర్ చక్రవర్తి అయి డెమొక్రసీని డిక్టేటర్షిప్ తో శాసించాడు ఏకు మేకయ్యాడు . .
   ఏది చేసినా హిట్లర్ పెద్ద ఆర్భాటం గా చేసేవాడు” లో కీ ”ఉండేదికాదు .బంద్ మేళాలు మార్చింగ్ లు హెయిల్ హిట్లర్ నినాదాలు దీపాలతో హోరెత్తించేవాడు సెబాస్టియన్ హాఫ్నర్ హిట్లర్ గురించి రాస్తూ ”అతడిదగ్గర మనిషి రక్తం మాంసం వాసన వచ్చేది .మనుషుల్ని తినే జంతువు. అతడి చూపు భయంకరం ”అన్నాడు ..బలపడిన హిట్లర్ స్వతంత్రముగా ఉన్న రాజకీయ ,సాంఘిక ,సాంస్కృతిక ,సంస్థల అధికారాలను రద్దు చేసిపారేశాడు దీన్ని సింక్రనైజేషన్ ;;అన్నాడు ..ట్రేడ్ యూనియన్ లను రద్దుచేసి జర్మన్ లేబర్ ఫ్ర0ట్ఏర్పరచి  కమ్యూనిస్ట్ సోషలిస్టు పార్టీ ఆఫీసులని కూలగొట్టి  ఏక పార్టీ నాజీ ఏకవ్యక్తి హిట్లర్ పాలన ప్రారంభించాడు  ఫ్రాన్స్  లో బాస్టిల్లే పతనం 1789 లో జరిగిన జులై 14 నుంచి అమలు చేశాడు ..నాజీలు అంటే టెర్రర్ అనుకున్న హిట్లర్ ఇప్పుడు అందరికీ టెర్రర్ అయ్యాడు ప్రజాస్వామ్య మూలాలన్నీ విధ్వంసం చేశాడు .ఆటలు సంగీతం డాన్స్ లలో జ్యులు లేకుండాచేసి నాజీ లతో ఆలోచనలతో నింపాడు .జర్మన్ ఆర్ట్ లో విదేశీయులు దూరారని భావించి ఇప్పుడు జర్మన్ ఆర్ట్ కు ప్రాణం పోశాడు .జర్మన్ ఆర్ట్ సోల్ అండ్ స్పిరిట్ అనేది హిట్లర్ నినాదం   దీనికోసమే పుస్తక దహన కార్యక్రమం .చేబట్టాడు .టౌన్హాల్ ముందు రాత్రి 9-30 కి విద్యార్థులతో టార్చ్ పెరేడ్ జరిపించి ఊరేగింపు జరిపి స్వస్తిక్ జెండాలతో ,రైట్ వింగ్ పారామిలిటరీ దళాలు నడుస్తుంటే ఎస్ ఎస్ ఎస్ ఏ వాళ్ళ కేరింతలతో అరుపులు ఆర్భాటాలతో ప్రొఫెసర్లు లెక్చరర్లు విద్యార్థులు కదం తొక్కుతూ నడిచి ,అప్పటికే మధ్యాహ్నం పెద్ద పెద్ద దుంగలతో 12అడుగుల ఎత్తు  ,6 అడుగుల వెడల్పుగ తయారై  కణకణ మండుతున్న అగ్ని వేదిక  భగభగ భోగి మంటలను  వెదజల్లుతుండగా వామపక్ష జర్నల్స్ ,న్యూస్  పేపర్లు ,కమ్యూనిస్ట్ సోషలిస్టు గ్రంధాలు పోస్టర్లు కరపత్రాలు జెండాలు మంటల్లో కేరింతలతో వేసి మండుతుండగా చూసి చప్పటలతో హర్షధ్వానాలు చేస్తూ ఆపైన సోషలిస్టు టోపీలను విసిరేసి మండుతుండగా ఆనందించి వీమర్ రిపబ్లిక్ బ్యానర్లనూ తగలెట్టి రాక్షసానందాన్ని సామూహికంగా అనుభవించారు .ఇదే  బర్ణింగ్  బుక్స్ బోన్ ఫైర్ .కు నాంది .తర్వాత ఎక్కడెక్కడ ఎలా మండించారో చూద్దాం
ఇన్‌లైన్ చిత్రం 1.
ఇన్‌లైన్ చిత్రం 2
   సశేషం
  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రసిద్ధులైన అయిదుగురు హవాయి మహిళలు-

ప్రసిద్ధులైన అయిదుగురు హవాయి మహిళలు-గబ్బిట దుర్గా ప్రసాద్

హవాయి ద్వీప దీపకాంతులై వెలుగులు చిమ్మిన అయిదుగురు ప్రసిద్ధ మహాళామణులను గురించి తెలుసుకొందాం ..

     1-మహిళా విద్య ఆరోగ్య దాయిని -క్వీన్ ఎమ్మా
 హవాయి  ప్రజల ఆరోగ్యం రోజు రోజుకూ  క్షీణించి పోతున్న సందర్భాన్ని గుర్తించి క్వీన్ ఎమ్మా కాలానికా మాకా 1859 లో క్వీన్స్ హాస్పిటల్ కట్టించి ప్రజలను కాపాడింది ..మసూచికం ,కలరా ఇన్ఫ్లు ఎంజా  వంటి వ్యాధులకు ఉచిత చికిత్స చేయించి ఆదుకున్నది .   1867 లో సెయింట్ఆండ్రోస్ బాలికా పాఠశాల స్థాపించి బాలికల విద్యకు మార్గదర్శి అయింది . గాత్ర సంగీతం  పియానో ,నాట్యంలలో ఆమె   అత్యధిక ప్రతిభావంతురాలు .
      2- పురుషులతో మహిళలకు సమాన హక్కులు ఇచ్చిన  -కా ఆహుమాను
హవాయి చరిత్రలో కా అహుమాను అత్యంత ప్రేరణాత్మక పాత్ర పోషించి మహిళాభివృద్ధికి దోహదం చేసింది . హవాయి సొసైటీలో ఆమెది అద్వితీయమైన పాత్ర . కామేహ మెహాకు అత్యంత నమ్మకం విధేయతకలిగి వుండి  రాణించింది . రాజు కామేహ మెహకు అత్యంత ఇష్టురాలైన భార్యగా దాదాపు ప్రధాన మంత్రి హోదాలో వుండి స్థానిక హవాయి స్త్రీల హక్కులకోసం అవిశ్రాంత కృషి చేసింది . మహారాజుతో మగవాళ్ళు తప్ప  వేరెవరు ప్రక్కన కూర్చుని భోజనం చేయని పరిస్థితి ఉండేది .ఈ పద్ధతిని మార్చేసి మగవారితో సమాన హోదాలో ఆడవారుకూడా కూర్చునే అర్హత కలిపించింది . మగవాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉన్న అన్ని కార్యకలాపాలలోను ఆడవారుకూడా  స్వేచ్ఛగా పాల్గొనే హక్కు  కల్పించి  కా అహుమాను మహిళా మార్గ దర్శిగా నిలిచింది .
    3-ప్రసిద్ధ ఎత్నో  బయాలజిస్ట్ -ఇసబెల్లా లోనా ఆబ్బట్

  మాలీ లోని హన్నాకు కు చెందిన ఎత్నో బయాలజిస్ట్ ఇసాబెల్లా కాకియా యు యాంగ్ లోనా అబ్బట్ హవాయిలో సైన్స్ లో పి .హెచ్ డి .పొందిన ప్రధమ మహిళ. చైనా ,హవాయిన్ మిశ్రమ జాతికి చెందిన ఈమె హవాయియన్ ఆల్గె ను తన హవాయియన్ తల్లి వలన విని గుర్తించి పరిశోధన చేసింది .  అకాడెమిక్ రికార్డ్ ప్రకారం ఆమె ఫసిఫిక్ ఆల్గె  పై ఎక్స్పర్ట్ .రెడ్ ఆల్గె అని పిలువబడే కుటుంబానికి చెందిన రోడో మేలాషియా తో సహా 200  స్పెసీస్  ను ఇసబెల్లా కనిపెట్టి రికార్డ్ సృష్టించింది . ఆమె కృషిని గుర్తించి రోడోమెలాషియా ను  ´´ఆబ్బొట్టెల్లా ´అని ఆమె పేరు తో గౌరవంగా పిలుస్తున్నారు . తన ప్రతిభా సర్వస్వ0 తో ఆమె ఎనిమిది గ్రంధాలు రాసింది . కాలిఫోర్నియా మాంటెరి పెనిన్సుల కు చెందిన మెరైన్ ఆల్గె  గ్రంధానికి సంపాదకత్వం వహించింది . సుమారు 150 రీసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించింది .

   4- సర్ఫింగ్ చాంపియన్ -రెల్  సన్
రెల్  కపోలియోకా ఎధు కాయ్ సన్ హవాయికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ సర్ఫింగ్ చాంపియన్ మాత్రమేకాక స్పోర్ట్స్ లో మార్గ దర్శి కూడా . చాలా ప్రశాంత చిత్తం తో దృఢ సంకల్పం తో ఉండే ఈమె చక్కని రైడింగ్ శైలికి ఆద్యురాలు . సర్ఫ్ కమ్యూనిటీ లో ఐక్యత సాధించి ,´ప్రో ఉమెన్స్ కాంపిటీటివ్ సర్ఫింగ్ సర్క్యూట్ ´ఏర్పడటానికి కృషి చేసింది . 1975 లో తనకు అత్యంత అభిమానమైన నార్త్ షోర్  లోని బీచ్ లో మొట్టమొదటి ఫీమేల్ లైఫ్ గార్డ్  అయింది .
 రెల్ ను అందరూ అభిమానంగా ´ఆంటీ రెల్ ´అని పిలుస్తారు . ఆమెకు వచ్చిన ´బ్రెస్ట్ కేన్సర్ ´ను ధైర్యం తో ఎదుర్కొని ఆరోగ్యం పొందినందుకు ఆమెను అందరూ గొప్పగా అభినందించి ఆరాధించారు . 1983లో డాక్టర్లు కేన్సర్ ను గుర్తించి ఆమె ఒక ఏడాదికన్నా ఎక్కువ కాలం బ్రతకదని తేల్చి చెప్పారు . 15 ఏళ్ళు అనుక్షణం మరణ యాతనతో పోరాడి గెలిచి 2-1-1998 న మరణించింది రెల్ -ది రియల్ హీరోయిన్ .
   5- అమెరికన్ కాంగ్రెస్ కు ఎన్నికైన ప్రధమ ఏషియన్ అమెరికన్ మహిళ-పాట్సి టి మింక్
అమెరికన్ కాంగ్రెస్ కు ఎన్నికైన మొదటి ఏషియన్ అమెరికన్ పాట్సి టోకెమోటో మింక్ . ఆమె స్థానికంగాను అమెరికాలోను సంచలనమే సృష్టించింది . 1960 లో పదివేల డెమొక్రాట్ నేషనల్ కన్వెన్షన్  ను ఉద్దేశించి టెలివిజన్ లో ప్రసంగించి అబ్బుర పరచింది . ఆ పార్టీలోని మూడువంతులు సభ్యులచేత సివిల్ రైట్స్ పై అభి వృద్ధికరమైన ఆలోచనలకు ఆమోదం తెలియ జేయించిన ఘనత ఆమెది . సివిల్ రైట్స్ కమిషన్ ను శాశ్వత కమీషన్ గా ఉంచటానికి ఆమె చేసిన కృషి బహుధా ప్రశంశనీయమైంది . ´ఫెడరాలిటీ  ఫండ్ ఎడ్యుయేషన్ ప్రోగ్రామ్ ´లో లింగ వివక్షతను  నిషేధించే ´టైటిల్ 9 ´గ్రంధాన్ని రాసింది . 1972 లో ప్రెసిడెన్షియల్ నామినేషన్ ఫర్ డెమొక్రాటిక్ పార్టీ కి మొదటి ఏషియన్ -అమెరికన్ మహిళ అయిన గౌరవం పొందింది .
                                                                                                           -గబ్బిట దుర్గాప్రసాద్
———————————————————————————————————————————
Posted in రచనలు | Tagged | Leave a comment

ఘోరకలి -3

ఘోరకలి -3

”Power tends to corrupt and absolute power corrupts absolutely ”అన్నాడు లార్డ్ జాన్ యాక్షన్ 18 87 లోనే .హిట్లర్ ఈ మాటలను రుజువు చేద్దామని కంకణం కట్టుకున్నాడు . దీనికి ఎన్నో మాయోపాయాలు నక్కజిత్తులు ,కపట నాటకాలు తడిగుడ్డతో గొంతులు కోయటాలు చేసిపారేశాడు పావులు చకచకా కదిపాడు అవతలి వాళ్ళను చిత్తైపోయేట్లు దిగ్భ్రము లోనయ్యేట్లు  నటుడు మహేష్ పోకిరిలో చెప్పిన మైండ్  బ్లాకయ్యేట్లు   చేశాడు శకునికి మించిన రాచకీయ జూదం ఆడాడు గోకర్ణ గజకర్ణ మాయల మరాఠీ విద్యలన్నీ ప్రదర్శించాడు .అదృష్టవంతులకే కాదు దురదృష్టవంతులకూ కాలం కలిసి వస్తుంది .జర్మన్ బజారులో పెయింటింగులు అమ్ముకుంటూ చింపి గుడ్డలు  కట్టుకొని నిలువ నీడ లేక  తిరిగినవాడికి అదృష్టం వరించి అందలమెక్కించింది . నహుషుడి లా కళ్ళు నెత్తికెక్కవా  ?గర్వం తో కళ్ళు మూసుకుపోవా.  ఉచ్ఛనీచాలు మర్చిపోయి పిచ్చ పిచ్చగా ప్రవర్తించి జర్మనీ ప్రజాస్వామిక పార్లమెంట్  మూడవ రీచ్ ను  ను చిదిపి ఛిద్రం చేసి వాళ్ళతోనే రాజాధి రాజమార్తా0డ,   చక్రవరి ఫురేర్   డిక్టేటర్  అనిపించుకున్నాడు దేనికీ ఎదురు లేకుండా సర్వాధికారాలు వారితోనే కట్ట బెట్టించుకొని థర్డ్ రీచ్  కి దిశా నిర్దేశం చేశాడు .ఎదురొస్తే ఖతం .దీనికి వంటపాడిన వాళ్ళు ఎస్ఎస్  దళం  ప్రచార సార్వ భౌమ గోబెల్స్ వగైరా .
  ఎర్నెస్ట్ రోహం ఎస్ ఎ.  ను బలమైన జర్మనీ సాధారణ సైన్యం ను  గడ గడ లాడించి ,హిట్లర్ అధికార ఆరోహణకు వీధి రౌడీలను  రివాల్యూషన ర్ల ను  అందించింది .వీళ్ళు  వ్యతిరేకుల  గొంతు  నొక్కేశారు . హిట్లర్ ఛాన్సలర్ అవగానే వీళ్ళను కరేపాకు ఏరేసినట్లు ఏరేశాడు . ఇది రోహీమ్ కు నచ్చలేదు .అతడు జర్మనీ అంతా ఎస్ ఎస్ఏ  చేతిలోకి వచ్చి జర్మన్ ఆర్మీని కంట్రోల్ చేయాలనుకున్నాడు .ఘటికుడైన హిట్లర్  వ్యాపార  మిలిటరీ సంస్థల తోడ్పాటు లేనిదే చక్రవర్తి కాలేనని గృహహించాడు .వాళ్ళతో మాట్లాడి ఎస్ ఏ వాళ్ళ పవర్ తగ్గించేశాడు .రోహీమ్ ను వదిలించుకోవడానికి రీన్ హార్డ్ హెడ్రిచ్ ని ఉసిగొల్పాడు .ఎస్ ఏ బలపడితే తమ ఉనికికి ప్రమాదమని గ్రహించాడు రోహీమ్ ను బలహీనపరిచే చర్యలన్నీ చేశాడు నాజీపార్టీలో ఒక సీక్రెట్ సెల్ ఏర్పాటు చేశాడు .వీళ్ళు సహజం గా హోమో సెక్సువల్స్ అన్నవిషయం అందరికీ తెలుసు .ఇదేదో తామే కనిపెట్టినట్లు పెద్ద బిల్డప్ ఇచ్చారు వ్యతిరేకులు .
   19 34 జూన్ 30 న వీళ్ళ భరతం పట్టటానికి మాస్టర్ ప్లాం వేశాడు హిట్లర్ అదే ”నైట్ ఆఫ్ ది లాంగ్ నైవ్స్ ”హిట్లర్ అనుచరులు బ్రయోన్ షార్ట్ ఎస్ ఏ లను చుట్టుముట్టి బజారులో కాల్చి చంపించాడు కొందరు ఇళ్లల్లోనే కైమా అయ్యారు మిగిలిన వాళ్ళు జైలుపాలయ్యారు రోహిన్ ను తెల్లవారుజామున హిట్లర్ ఆర్డర్ పై కస్టడీ లోకి తీసుకొని ఎక్సిక్యూట్ చేశారు .ఈ ఆకస్మిక హననం లో ఎంతమంది చచ్చారో తెలియదు కనీసం వందమందిని లేపేసి ఉంటారు .వీళ్ళ చావుపై విచారణ లేదు కారణం వీరంతా దేశ ద్రోహులని ముద్ర వేయటమే ..హిట్లర్ అండ్ కో కు ఆ రాత్రి శుభ రా త్రి .ఎస్ ఏ  లకు కాళరాత్రి .ఈ హత్యలు ఆగిపోక ముందే జనరల్ వీల్ హెల్మ్ వాన్ బ్లూమ్ బెర్గ్ సైన్యం పూర్తిగా ఫ్యుహెర్ హిట్లర్ ను సమర్ధిస్తున్నట్లు ప్రకటించాడు హీంలర్ కు ఘెట్టో ఆపరేషన్ అధికారం కట్టబెట్టాడు హెడ్రిచ్ కి రోజువారీ కార్యక్రమాలకు -హత్యలకు అధికారం వచ్చింది గోరింగ్ విమాన దళం అనబడే లూప్త్వాఫీ కి అధికారిఅయ్యాడు హిడేన్ బర్గ్ చనిపోయాక హిట్లర్ ప్రెసిడెంట్ ఛాన్సలర్ అయ్యాడు .అంటే సైన్యం కూడా హిట్లర్ చేతిలోకి వచ్చి సర్వ సత్తాక నియంత అయ్యాడు ఒకే దెబ్బకు ఎన్ని పిట్టాల్నో రాల్చేశాడు హిట్లర్ ..
               శుద్ధ జర్మనీ
  అధికారాలన్నీ హస్తగతమయ్యాక హిట్లర్ అనవసరమైన వాళ్ళను ఏరిపారెయ్యాలని జర్మన్ల శుద్ధ రక్తం కలుషితం కాకూడదని భావించాడు .హోమో సెక్సువల్స్ ను ముందు అరెస్ట్ చేయించి బహిష్కరణ (డిపోర్టేషన్)కాంప్ లకు తరలించాడు దీన్ని మతగురువులు సమర్ధించారు వీళ్ళవలన పబ్లిక్ హెల్త్ దెబ్బ తింటుందని గగ్గోలు పెట్టించాడు జర్మనీ అంతా గాలించి హోమోలను హోమో అని అనుమానమొచ్చింది వాళ్ళనూ అరెస్ట్ చేశారు .. తర్వాత చర్య ”జెహోవాస్ విట్నెస్ ”అంటే నాజీ పతాకమైన స్వస్తిక్ పతాకానికి సెల్యూట్  చేయనివారిని అగౌరవ పరచినవారినీ  హిట్లర్ కు విధేయత ప్రకటించనివారినీ  ,ఆర్మీలో  చేరనివారినీ ”రాజ ద్రోహులు ”(treasons) గా ముద్రవేసి బొక్కలో పెట్టారు .మతాన్నివదిలేసి రీచ్ కి కొందరు సాల్యూట్ కొడితే కొందరు వ్యతిరేకించి చువ్వలు లెక్కబెట్టారు .
           జిప్సీ ల హననం
 తరువాత ఘనమైన హిట్లర్ గారి ద్రుష్టి జిప్సీ లపై ప్రసరించింది .ఈ సంచార జాతికి థర్డ్ రీచ్ లో స్థానమే లేకుండా పోయింది .వాళ్ళు నల్లగా ఉండే సంచారులు వాళ్లకు స్వతంత్రం కావాలి ఎవరి కంట్రోల్ లోనూ ఉండని జాతి .వాళ్ళు సోషల్ ఆర్డర్ ను భంగపరచి ఆర్య రక్తాన్ని కలుషితం చేస్తున్నారని హిట్లర్ ఉవాచ . అందుకని 1930 లో నాజీలు జిప్సీ  సమస్యకు పరిష్కారం ఆలోచించింది స్థానిక పోలీసులు వారిపై దొంగతనం దోపిడీ ,సోమరితనం  అభియోగాలు మోపి అరెస్ట్ చేసే అధికారం ఇచ్చాడు .సహజం గా వాళ్ళకు జర్మనీ పౌరసత్వం ఉండదు కనుక వాళ్ళను దేశ బహిష్కరణ చేయటం తేలిక యింది .
           జ్యుల ఏరివేత
1935 లో నాజీ నేషనల్ కాన్ఫరెన్స్ నూరేం బెర్గ్ లో జరిగి మొదటిసారిగా జ్యుల కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఇక వరుస స్టేట్ మెంట్లు షురూ చేశారు .జర్మనీ వాళ్ళు కానీ జర్మన్ రక్తమున్నవారుకాని  జ్యుల తో వివాహ మాడటాన్ని  15-9-1935 న చట్టం ద్వారా రద్దు చేశారు పిల్లలు పుట్టే వయసున్న జ్యులు కాని   ఆడపిల్లలు   జ్యుల ఇళ్లల్లో పనిమనిషులుగా ఉండరాదని శాసించారు .చివరికి జ్యులు జర్మనీ జాతీయ జెండా ఎగుర వేయటాన్ని నిషేదించారు ..నవంబర్ 14 న జ్యుల పౌరసత్వాన్ని ఓటుహక్కును లాక్కుని   ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలనుంచి ఊడబెరికారు  .
                      వెర్రి వెయ్యి విధాలు
స్వచ్ఛ రక్త నినాదం జ్యులు జిప్సీలు ,ఇతర తక్కువ స్థాయి మనుషుల విషయంలోనే కాక రీచ్ పౌరుల విషయం లోనూ అవలంబించారు ..దీనికోసం దేశవ్యాప్తం గా  ”జాతి ఆరోగ్యం ”(రేషియల్ హైజీన్ )ప్రోగ్రామ్ అమలు జరిపారు .ఉత్తమ మానవ జాతిని సృష్టించటం ”అనే యుజెనిక్స్ ”ను అమలు చేశారు దీనికోసము వంశ చరిత్రలను త్రవ్వి తీశారు .జీన్ ఆధారంగా మానవ స్వభావాలుంటాయని ఈ శాస్త్రం చెబుతోంది .ఉదాహరణకు ”దాలా సోఫీల్లా ”అనే జీన్ ఉన్న వారి వంశం అంతా నౌకా రంగం లో రాణిస్తారు ”నోమాధిజం ”జీన్స్ ఉంటె ఇంటిపట్టున ఉండకుండా ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ఇది వారసత్వ లక్షణమై జిప్సీలు ,కోమాంఛెస్ తెగలు సంచార జాతులయ్యాయి ..ఇవాళ ఈ విషయాలు నవ్వు పుట్టిస్తాయికానీ హిట్లర్ కాలం లో ఇదేంటి అని ఎవరూ ప్రశ్నించలేదు .యుజెనిక్స్ అప్పుడు ఒక గొప్ప శాస్త్రమై నాజీకాలం లో విజృంభించింది  ..దీన్ని అడ్డం పెట్టుకొని నాజీలు  బలవంతపు  స్ట్రెయిలైజేషన్ అమలు చేసి అంటేలోపమున్న వ్యక్తులకు బలవంతంగా  సంతానోత్పత్తి లేకుండా చేసి జాతిని శుద్ధి చేసే ప్రయత్నం చేశారు .దీనికి అనుగుణంగా చట్టాన్ని 1933 జులై 14 న తెచ్చి అనువంశిక లోపాలు లేకుండా జాతి శుద్ధ రక్తం  కలుషితం కాకుండా చేస్తున్నట్లు ప్రకటించి ఇందిరా గాంధీ కాలం లో కొడుకు సంజయ గాంధీ ప్రవర్తించినట్లు బలవంతపు కుటుంబ నియంత్రణ చేసిపారేశారు .మానసిక బలహీనులు మానసిక రోగులు ,కొన్ని రకాల నరాల  జబ్బువాళ్ళు ,గుడ్డి  కుంటి క్రానిక్ ఆల్కహాలికులు అందరూ దీని బారిన పడ్డారు ..ఆతర్వాత తెలివిమీరిన ప్రభుత్వం వ్యక్తులకు అనుమతి లేకుండానే ,వాళ్ళకసలు తెలియ కుండానే స్టెరిలైజేషన్లు శత సహస్రాలుగా చేశారు .ఎలా చేశారో జర్మన్ చరిత్రకారుడు అలెక్సా0డర్ మిత్స్ రిలీచ్ ”వ్యక్తులు డాక్టర్ ఎదురుగా కుర్చీలలో కూర్చుని ఫారాలు ఫిలిప్ చేస్తుంటారు వారికి తెలియ కుండానే ఎక్స్ రే పరికరాలు వాళ్ళ కుర్చీలకిందనే పెట్టి వాళ్ళ జనానావయవాలపై మూడే మూడు నిమిషాలు కిరణ ప్రసారం చేయించి స్టెరిలైజేషన్ చేశారు ”అని రాశాడు . ఇంతకంటే ఘోరం -మాస్ స్టెరిలైజేషన్ కోసం ఒక ఇర్రిటేటింగ్ పదార్ధాన్ని స్త్రీల  గర్భాశయం లోకి   పంపి  అండ ఉత్పత్తి ని నాశనం చేసి పిల్లలు పుట్టకుండా చేయటం .ఈ పని నమ్మకమైన చెకప్ పేరిట డాక్టర్ల చేత ఇంజెక్షన్లు చేయించటం .ఇలా జరిగిందని పేషేంట్ కు అసలు తెలియని తెలియదు నమ్మక ద్రోహం అంటే ఇదే .ఇదేమీ కాకమ్మకబుర్లుకావు స్టెరిలైజేషన్ ప్రాజెక్ట్ లో పాల్గొన్న కార్ల్ బ్రాన్డ్ట్ చెప్పిందే -”పెద్దగా డబ్బు ఖర్చుకాని అతి తేలికైన ,త్వరగా జరిగే స్టెరిలైజేషన్ ను జర్మన్ రీచ్ కు వ్యతిరేకులైన రష్యన్లు ,పోల్స్ జ్యుల పై ప్రయోగించారు.ఇది శత్రు వులను ఓడించటమే కాక సంపూర్ణ శత్రు సంహారం చేస్తుంది ”అని నమ్మకంగా చెప్పాడు
             అర్ధ రాత్రి అంకమ్మ శివాలు
  1938 అక్టోబర్ 27 న హిట్లర్ జ్యులకు వ్యతిరేకంగా ఒక చట్టం తెచ్చి 18 వేలమంది జ్యులను జర్మనీ నుంచి బహిష్కరించాడు వీళ్ళు పోలాండ్ ,రష్యాలలో పుట్టినవాళ్ళు కనుక వాళ్ళు జర్మన్ పౌరులు కాదుఅన్నాడు .వాళ్ళ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కుక్కలని పిల్లుల్ని కుక్కినట్లు వాన్ లలో కుక్కి పశువులను సంతకు తోలుకు వెళ్లినట్లు సరిహద్దులలదాకా తీసుకొని వెళ్లి వాళ్ళమానాన వాళ్ళను వదిలేశారు .ఇందులో ఒక బాధితుడు జిండెల్ గ్రీన్ స్పీజిన్ ”ఎవరిదగ్గరా చిల్లిగవ్వ కూడా లేదు పదిమార్కులడబ్బుదాటి ఉంటె లాగేసుకున్నారు .ఇదేమిటి అంటే ఇదే  జర్మన్ చట్టం అన్నారు .ఎస్ ఎస్ మనుష్యులు మమ్మల్ని కొరడాలతో కొట్టారు  రక్తం కారిపోతున్నా  కనికరించలేదు మా సామాన్లన్నీ లాగేసుకున్నారు .అత్యంత ఆటవికంగా పాశవికం గా మా జీవితాలతో ఆటలాడారు ..జర్మనీలో ఇదే నేను చూసిన మొట్టమొదటి అమానుష చర్య ”అని  ఆతర్వాత గుర్తు చేసుకున్నాడు . అయ్యా అదీ హిట్లరయ్య నాజీ నియంత పాలన .
  జ్యుల నివాసాలపై పడి  దోచుకుని తగలబెట్టి భయపెట్టి చంపి విధ్వసం సృష్టించారు ఫైరింజన్ వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. వేలకొద్దీ జ్యుల ఆరాధనా స్థలానను ,7500 వ్యాపార సంస్థలను నాశనం చేశారు  లక్షలాది జ్యులను చంపారు .ఇంత  చేసిన హిట్లర్ ఆల్కల్ తాగేవాడుకాదు సిగరెట్ అలవాటులేదు పూర్తి శాకాహారి ,పెళ్లి పెటాకులు సంసారం చట్టబండలు లేనివాడు .మానవ సంబంధాలు తెలియనివాడు ప్రేమ  స్నేహం అంటే ఏమిటో తెలీనివాడు అంటే నమ్మగలమా నమ్మాలి ఇది నిజమే ..గోముఖ వ్యాఘ్రం సరైన పదమా ?ఇతని కేరక్టర్ ను చార్లీ చాప్లిన్ ”డి గ్రేట్ డిక్టేటర్ ”మూకీ చిత్రం లో అద్భుతంగా ఫన్నీగా పోషించి చూపాడు .
 ఇన్‌లైన్ చిత్రం 1
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-17 కాంప్-షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఘోరకలి -2

ఘోరకలి  -2

        మరో మృత్యుద్వారం -ఘెట్టో
నాజీ యుద్ధ తంత్రం యూరప్ అంతా మోహరించి జ్యుస్ ను అందరి లోనుంచి  వేరు చేయటం ప్రారంభించింది . వాళ్ళను తేలికగా గుర్తు పెట్టె వీలుగా జ్యులు ఎందరో ”ఎల్లో జ్యుఇష్ స్టార్ ”లను ధరించాలని ఆదేశించింది .వాళ్ళ ఐడెంటిటీ పేపర్లలో పెద్ద అక్షరం తో  ”j”ఉండేట్లు చేసింది వాళ్ళందరూ ప్రత్యేక నివేశన స్థలాలలోనే ఉండాలని శాసించింది .ఇవే ”ఘెట్టోలు ”.ఈ పనిని తాము ఆక్రమించుకున్న దేశాలనుంచి ముందుగా ప్రారంభించింది .వీటికోసం బాగా మురికి వాడలను ఎంపిక చేసింది దాని చుట్టూ గోడకాని బార్బెడ్ వైర్ ఫెన్స్ కానీ ఏర్పరచి ,,మైళ్ళ దూరాలలో ఉన్న జ్యు లను కాలినడకన నడిపించి ఇందులో పడేయించింది .అక్కడ అందరూ కిక్కిరిసిన గదులలో గాలి వెలుతురూ లేక సరైన మరుగుదొడ్లు లేక నీచ నికృష్ట జీవితం గడిపేట్లు చేసి అంటువ్యాధులు ప్రబలటానికి దోహదం చేసింది .చాలామంది టైఫాయిడ్ క్షయలతో బాధపడి చనిపోయారు .బొచ్చెలో ఇంత చాలీ చాలని రేషన్ కూడు పడేసి చావ లేక బతకా లేక త్రిశంకు స్వర్గం లో వేలాడేట్లు చేసింది ..డబ్బున్నవాళ్ళు ఇళ్ల నో  స్థలాలలో అమ్మి కానీ తనఖా పెట్టికానీ డబ్బు పొంది బయటినుంచి కావలసిన తిండి తెప్పించుకొనేవారు ..ఘెట్టో లో బతకాలీ  అంటే నాజీలు చెప్పిన ఏదో పని చేసిబతకాలి అదొక్కటే మార్గం ఇదీ బానిస బతుకే . విపరీతమైన ఎండా వానా చలి లో ఆడవ  చాకిరీ చేసి ,ఒళ్ళంతా గుల్ల చేసుకొని బతికారుపాపం .దీనితో నీరసం వచ్చి జబ్బులపాలయ్యేవారు .అక్కడ వాళ్లకు ఏమైందో తెలియదుకాని ఈ ఘెట్టోలనుంచి బతికి బయటపడిన వారు కనిపించనే లేదు .
          ఇంకో చావు తెలివి -ఆపరేషన్ బార్బరోస్సా
1941 స్ప్రింగ్ కాలం లో నియంత హిట్లర్ ”ఆపరేషన్ బార్బరోస్సా ”ప్రారంభించి సోవియట్ యూనియన్ పై దాడి చేశాడు .స్టాలిన్ తో అంతకు ముందు చేసుకున్న ఒడంబడికను గాలికొదిలేశారు హిట్లర్ ..ఇప్పుడుకూడా అతని సై నికాధికారులు వద్దనే వారించారు .ఇలా చేస్తే జర్మనీ సైన్యం చాలా చోట్ల మోహరించాల్సి వస్తుందని దానితో సైనిక పాటవం బలహీనమవుతుందని హెచ్చరించారు . రాజు కంటే మోండివాడు గొప్ప అన్నట్లు రాజూ చక్రవర్తి నియంత ఫురోర్ అయిన సర్వాధికారాలు చేతిలో ఉన్నహిట్లర్ మొండోడి కంటే గొప్పవాడై వాళ్ళమాట పట్టించుకోలేదు రుడాల్ఫ్ హెస్ కూడా వద్దన్నాడు .హిట్లర్ అతడిని విజయానికి తోడ్పడమన్నాడు .ఇంగ్లా0డ్ తో ఉన్న ఒప్పందం ప్రకారం పడమర భాగాలను అది కాపాడుతుందని తూర్పు వైపు జర్మన్ దాడికి ఇంగ్లాన్డ్ సహకరిస్తుందని నచ్చ చెప్పాడు .ఈ పని తానే  చేయాలని హెస్  రహస్యంగా పారాచూట్ లో ఇంగ్లాన్డ్ వెళ్లగా అతడు మానసికంగా బలహీనుడని భావించి జైల్లో పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం .జర్మనీ కి ఎంతో సేవ చేసి హిట్లర్ కు కుడిభుజంగా ఉన్న హెస్ ను హిట్లర్ తో నాజీలందరూ దేశద్రోహి అనే ముద్రవేసి అవహేళన చేసి అవమానించారు .అతడు చేసిన మంచి అంతా గాలిలో కలిసిపోయింది ..
  1941 జూన్ 22 న జర్మన్ సైన్యం రష్యా సరిహద్దులు దాటి లోపలి ప్రవేశించింది దీనితో ఆపరేషన్ బార్బరోస్సా ప్రారంభమైంది .వెంటనే స్టాలిన్ జర్మనీపై యుద్ధం ప్రకటించి కూటమిలో చేరాడు ..యుద్ధం లో రష్యా తో తలపడటమే కాదు హిట్లర్ మనసులో మరో ముఖ్య ఆలోచనా సుళ్ళు తిరుగుతోంది .బార్బరోస్సా నెపం తో జ్యుల సమస్యను పరిష్కరించాలని భావించాడు .కొన్ని యూనిట్లు ”Einsatzgruppen ”పేరుతొ సైన్యం వెంట వెళ్లాయి .ఈ యూనిట్లది  ఒకటే లక్ష్యం -జ్యులను ,పనికి మాలిన ,అక్కర లేని వాళ్ళను చంపేయటం . సరైన లక్ష్య నిర్దేశం తో ఈ యమభట యూనిట్లు  సామూహిక మరణాలను పకడ్బందీ గా చేసేశాయి .సెప్టెంబర్ 29 30 తేదీలలో యుక్రెయిన్ లోని ”బాబ యార్రవైన్  ”లో అత్యధిక సంఖ్యలో యూదులను ఊచ కోత  కోసేశారు ”Einsatzgruppen ”యూనిట్లు వేలాది యూదులను చుట్టు ముట్టి రవైన్ కుఅంటే లోయలోకి  ”తోలుకు ”వెళ్లారు . ఈ మృత్యు  దళాలన్నీ ఒకే రకంగా పని చేశాయి .ముందుగా జ్యుల  బట్టలు బలవంతంగా  విప్పించేశారు నగ్నం గా చేస్తే సిగ్గుతో ఎదురు తిరిగే ధైర్యం రాదనీ నాజీలనమ్మకం . ఆ బట్టల్ని రీచ్ లో కావాల్సినవారికి అమ్మేశారు .  ఈ ఘోరకలి ని చూసిన ఒక ప్రత్యక్ష సాఖికధనం -”లోయలో అడుగున అప్పటికే చంపబడిన జ్యు ల శరీరాలపై  అంటే శవాల గుట్టలపై  వీళ్ళను అతి వేగం గా పడుకో బెట్టారు .మార్క్ మాన్ వచ్చి ప్రతి జ్యు ను మెడపై పిస్టల్ తో కాల్చాడు .అతడు చావగానే మరో జ్యు ను ఆతర్వాత ఇంకో జ్యు ను నిరాటంకంగా వరుసబెట్టి కాల్చి చంపుతూనే ఉన్నాడు  .ఆడ ,మొగా పిల్లా జెల్లా అనే విచక్షణే లేదు .పసిపిల్లని తల్లి చంకలో ఎత్తుకొనేట్లు చేసి దారుణంగా చంపారు ఆ నికృష్టులు ”అని చెప్పాడు ..ఈ రెండు రోజుల్లో మృత్యుదళాలు 33,771 మంది యూదులను  చంపేశారు .బాబీ యార్ లోయ అంతా జ్యు ల మృత్యు కళేబరాలతో నిండి పోయింది .
   తర్వాత గాస్ చేంబర్లున్న మొబైల్ వాన్ లలో కూర్చోబెట్టి చంపారు వాన్లలో జ్యు లను కోళ్లను కుక్కినట్లు కుక్కి దాని డోర్ కు తాళం పేట్టి సీలు వేసి కార్బన్ మోనాక్సయిడ్ విషవాయువును వాన్ లోకి వదిలి అందరూ చచ్చే దాకా కాపలా కాశారు .ఇదో మృత్యుహేల పైశాచికానందం . ఈ మృత్యు యూనిట్లు రోజుకు ఒక లక్షమందిని చంపారంటే ముక్కున వేలేసుకొంటాం .నిజమే ఆ చావు  వాసన భరించలేక. .ఈ వేగం చాలలేదట మహా నియంత హిట్లర్ కు .. 1941  వేసవిలో ”యూరప్ లో ఉన్న జ్యు  కమ్యూనిటీ నంతా సంపూర్ణంగా అంతమొందించాలి ”అని హిట్లర్ తన అరమీసాలపై చెయ్యేసి శపథం చేశాడు .  కనుక ఇది అమలు చేయటానికి మరొక నరాంతక కీచక మార్గాన్ని అవలంబించాలని పధకం పన్నాడు . అతడి బుర్ర డెవిల్స్ వర్క్ షాప్ అయింది .
                      తుది  పరిష్కారం
 జ్యు  సమస్యకు అంతిమ పరిష్కారం కోసం ప్రణాళిక రీన్ హార్డ్ హెర్డ్రిచ్ కు హిట్లర్ అప్పగించాడు . 1942 జనవరి 20 న బెర్లిన్ పరిసరాల్లో ఉన్న వాన్నెసీ లో జరిగే మీటింగ్ లో దాన్ని హిట్లర్ ముందుంచాడు .ఈ పధకం ప్రకారం జ్యు లనందర్నీ సమావేశపరచటం ,వాళ్లకు ప్రయాణ సౌకర్యం కలిపించి రైళ్లలో ఎక్కించటం అక్కడినుంచి సమూల దుంపనాశనం చేసే కాంప్ (ఎక్స్టె ర్మి నేషన్ కాంప్ )లకు తరలించడం అక్కడ సామూహిక నరకం లోకి తోసెయ్యటం ఇందులో దశలవారీ పధ్ధతి .ఆ కాంప్ లు ప్రత్యేకంగా వేలాది మందిని అతి తక్కువ కాలం లో కిక్కురుమనకుండా ,పకడ్బందీగా  అత్యంత నైపుణ్య సామర్ధ్యాలతో చంపటానికి వీలుగా తయారు చేయించారు .చావు తెలివి తేటలంటే ఇవే మరి . ఇలాంటి మృత్యుకుహరాలను నాలుగు చెల్మ్నో ,బెలీజెక్ ,ట్రెబ్లింకా  శోబిబోర్ లలో ఏర్పాటు చేశారు.రెండు కాన్సంట్రేషన్ కాంప్ Auschwitz ,Majdanek లను కిల్లింగ్ సెంటర్లుగా మార్చారు ..ఇవి మనం చెప్పుకున్న ఏదనేషియా అంటే మెర్సీ కిల్లింగ్ సెంటర్ లను పోలినవే .ఇవన్నీ భయంకర అత్యంత మరణ సామర్ధ్యమున్న చావు కేంద్రాలే .షవర్ బాత్ లులాగా అనిపించే విషపు గ్యాస్ చేంబర్లు  శవదహనం క్షణాలమీద చేసే అతి విశాల దహన వేదికలతో భూలోక నరకాలుగా ఆఘ మేఘాలమీద తయారు చేయించారు .
   వాన్నెస్సే కాన్ఫరెన్స్ అయినఏడాదికే సోవియట్ యూనియన్ జర్మనీని తూ ర్పుయుద్ధం లో  చావు దెబ్బ తీసింది  2.-2-19 42 న  91 వేల  జర్మన్ సైన్యం స్టాలిన్గ్రాడ్ లో లొంగిపోయింది .అసలు 2,85 000 మందిలో యుద్ధం లో బతికినవాళ్లు వీళ్ళే. అత్యంత విశాల థర్డ్ రీచ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేద్దామనుకున్న నరరూప రాక్షస హిట్లర్ కు  ఈ అవమానం  అశనిఘాతమే అయింది  . యుద్ధం లో చావుదెబ్బతిన్నా జర్మన్ సైన్యం ,ఎస్ ఎస్ వాలంటీర్లు తుది పరిష్కారానికి పని చేస్తూనే ఉన్నారు .చావు రైళ్లు పరుగెత్తుతూనే ఉన్నాయి వేలాది మంది జ్యు లు తరలింపబడుతూనే ఉన్నారు ,గాస్ చేంబర్లు శవదహన వాటికలు ఇరవై నాలుగు గంటలూ పని చేస్తూ జ్యు హననం చేస్తూనే ఉన్నాయి .కాంపులలోని పెద్దపెద్ద ఇటుక చిమ్నీలనుంచి శవాల బూడిద ,పొగా  గాలిలోకి నిరంతరం చేరుతూ కారుకంపు కొడుతూనే ఉంది .ఈ ఫైనల్ సోల్యూ షన్ పితామహుడైన రీన్హర్ హి డ్రిచ్ ను జేక్ అభిమానులు పట్టుకొని చంపేసి పరిష్కారకర్త  జీవితాన్ని అనంత వాయువులోకలిపి పరిష్కరించారు ఎవడు తీసుకున్న గోతిలో వాడు పడటం సహజమే దీన్ని క్రూర ప్రతీకారం అన్నది జర్మన్ ఏ ఎస్ దళం .ఈ తుదిపరిష్కారాన్నే ”ఆపరేషన్ రీన్ హార్డ్ ”అన్నారు . రీన్ హార్డ్ హేడ్రిచ్  హత్యకు  ప్రతీకారం గా ఎస్ ఎస్ దళాలు 13 వందలమంది జేక్ లను విచక్షణా రహితంగా చంపేసి  లిడికో అనే చిన్న పట్టణాన్ని ధ్వంసం చేసి నేల మట్టం చేశారు.బెర్లిన్ లో 152 మంది జ్యు లను ఉరితీసి 3 వేలమంది జ్యు లను కాన్సెన్ట్రేషన్ కాంప్ లనుంచి పోలాండ్ లోని హనన కేంద్రాలకు తరలించారు
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2
ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4ఇన్‌లైన్ చిత్రం 5
   సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్కూల్ లో మా మనవడు చి ఆశుతోష్ ట్రంపెట్ కచేరి -4-5-17 సాయంత్రం

This gallery contains 8 photos.

More Galleries | Tagged | Leave a comment

ఘోరకలి -1 ,

ఘోరకలి -1         ,

జర్మనీలో హిట్లర్ నియంతకాలం లో జరిగిన దారుణ మానవ కాండ నరజాతి చరిత్రలో రక్తపు మరకలను మిగిల్చింది . అంతకు పూర్వం రష్యా చైనా లలో మానవ హననం జరిగింది కానీ ఇక్కడ పగా ద్వేషం జాతి నిర్మూలన తోపాటు పసిపిల్లలు వృద్ధులు ,పిచ్చివాళ్ళు అంగవైకల్యమున్నవారు ,,ముఖ్యం గా యూదులు ,జిప్సీ జాతులను భూమి మీదే లేకుండా చేయాలని ఆర్య రక్తమే స్వచ్ఛమైనది మిగతా రక్తం లేని స్వచ్ఛ ఆర్యరక్తపు జనాలతో  నూతన జర్మనీ నిర్మించాలన్న పగటి క లలతో ఇంతటి ఘోర కలి  సృష్టించారు .ఆ బీభత్సం జరిగి సుమారు 80 ఏళ్ళు అయినా ఎందరెందరో ఇప్పటిదాకా ఎన్నెనో రహస్యాలు వెలికి తీసి చరిత్ర కెక్కిస్తున్నా ,చదివిన ప్రతిసారీ గుండె చె రువైపోతూనే ఉంటుంది ఒళ్ళు గగుర్పాటు పొందుతూనే ఉంటుంది ఆ అభాగ్యులపట్ల కళ్ళు చెమరిస్తూనే ఉంటాయి ఆ నర రూప కిరాతుల అనాగరిక వికృత చేష్టలకు  బాధ్యులైన వారిపై కసి ద్వేషం ఉవ్వెత్తున ఉబుకు తూనే ఉంటుంది . రక్తం మరుగుతూనే ఉంటుంది ఇంతటి ఘోరకలి ఎప్పుడూ ఏదేశం లోనూ చూసి విని ఉండరు .
  హిట్లర్  స్టూడెంట్ లాండ్ ను వశ పరచుకున్నాక జెకోస్లో వేకియాపై ద్రుష్టి లేదన్నాడు.దాని సరిహద్దుల జోలికి రానని అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు  ఆత ను చెప్పేది ఒకటి చేసేది మరొకటి అబద్ధాలాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య -కాదుకాదు వెన్నుతో పుట్టిన విద్య . 1939 మార్చ్ 15 ఉదయం 6 గంటలకే జర్మనీ సైన్యం జెకోస్లోవేకియాపై దాడి చేశాయి .తమాషా ఏమిటంటే అక్కడ వారిని ఎదిరించినవారే లేరు . ముసలివాడైనా జేక్ ప్రెసిడెంట్ ఈమైల్హాచా ను బెదిరించి లొంగిపోయినట్లు సంతకం పెట్టించాడు హిట్లర్ . ఒక వేళ కాదని ఎదురు తిరిగితే జేక్ ప్రజల్ని చంపి ,నగరాలను విధ్వంసం  చేసి బూడిద కుప్ప చేస్తానని బెదిరించాడు ఇది హిట్లర్ సిగ్గులేని చేస్ట కు నిదర్శనం ..ఇలా జర్మన్ల రక్తపు బొట్టు చిందకుండా విజయం సాధించి మూడవ రీచ్ అనే జర్మనీ సామ్రాజ్యం లో కొత్త దేశాన్ని కలిపేశాడు 

దాస్టికం బుకాయింపు ,ఆగ్రహం బెదిరింపు లతో పొందిన విజయం అందుకే అతనిని ”బ్లఫ్ బ్లస్టర్ మాస్టర్ ”అంటారు . . 1939 ఆగస్టు 23న రష్యా నియంత స్టాలిన్ తో దాడి రహిత సంధి కుదుర్చుకొని రష్యాను తటస్థంగా ఉండేట్లు చేశాడు .ఫ్యూరర్ అని పిలువ బడే హిట్లర్ ..అందుకే అతనిని ‘ . ఇంతటి తో ఆగక చూపు పోలాండ్ పై పడింది .సైన్యాధికారులు సమయం కాదని వారిస్తున్నా ఉక్కు ,ఆయిల్ ,సరఫరాలు చాలా తక్కువగా ఉన్నాయని  ఉన్న ఆయుధ సామాగ్రి 6 వారాలకు మాత్రమే సరిపోతుందని చెప్పినా  పెడ  చెవిని పెట్టి ఆకస్మిక దాడులతో భయ భ్రా0తులను  చేసి చరిత్రలో పేరు పొందాలని భావించి సాధించిన ప్రతి విజయం మరోదానికి దారి చూపిస్తుందని కావలసినవన్నీ త్వరలోనే సమకూరుతాయని నచ్చ చెప్పి 1939 సెప్టెంబర్ 1 న పోలాండ్ పై 10 లక్షల సైన్యం తో విరుచుకు పడ్డాడు యుద్ధ టాంకులు  కాల్బలం లూప్త్ వాఫ్ అనే వైమానిక రక్షణ పై నుంచి ఇచ్చింది వణకిపోయిన పోలాండ్ లొంగిపోయింది .దీనితో తటస్థంగా ఇప్పటిదాకా ఉన్న బ్రిటన్ ఫ్రాన్స్ లు జర్మనీ పై యుద్ధ ప్రకటన చేసి ”అనుబంధ కూటమి ”గా మారాయి తర్వాత రష్యా అమెరికాలు దీనిలో చేరాయి ఇటలీ  జపాన్ లు జర్మనీ వైపు నిలబడి ”అక్ష కూటమి ”గా మారాయి .  .మళ్ళీ మామూలే హిట్లరయ్యకు మాట తప్పటం .చేసిన ఒప్పందాన్ని తూనా బొడ్డు  అని ఒట్టు తీసి గట్టున పెట్టి 1941 జూన్ 22 న హిట్లర్ రష్యాపై దాడి చేశాడు .జపాన్ అమెరికా వాళ్ళ పెరల్ హార్బర్ పై దాడి చేసింది .మొదట్లో దూకుడుగా దూసుకు పోయి,అజేయమగా ఉన్న  జర్మనీ పడమటి యూరప్ దేశాలను వరుసగా స్వాధీనం చేసుకొంటూ అప్రతిహతంగా ముందుకు పోతోంది డెన్మార్క్ నార్వే ,లక్సమ్  బర్గ్ బెల్జియం నెదర్లాన్డ్స్ చివరికి ఫ్రాన్స్ లు దాసోహమన్నాయి
       స్వచ్ఛ జర్మన్ రక్తం కోసం దారుణాలు
జర్మనీని స్వచ్ఛ జర్మన్ రక్తం తో నింపాలన్న హిట్లర్ ఆశయం ఎన్నడూ వదిలి పెట్టలేదు  కనుక ముందు ఎధునాసియా అంటే ” మెర్సీ  కిల్లింగ్”ను అమలుపరచాడు .అవయవ లోపంఉన్నవారు వికృతంగా ఉన్నవారు , మతి స్థిమితంలేనివారు పిచ్చివాళ్ళు వీరందరూ  మెర్సీ కిల్లింగ్ కు  బలయ్యారు   వీళ్ళతో ఆగలేదు పుట్టిన పసిపిల్లలమీదా దృష్టి పడింది ”సైన్టిఫిక్ రిజి స్ట్రే షన్ ఆఫ్ సివియర్ హెరెడిటరీ ఎయి ల్మెంట్స్ ”అనే సంస్థ రీసెర్చ్ నెపం తో తీవ్రం గా బాధపడుతున్న పిల్లకు మంచి మందు ఇచ్చి నయం చేస్తామని నమ్మబలికి ఈ రీసెర్చ్ కి సహాయంగా ప్రసూతి హాస్పత్రులు ,మిడ్ వైఫ్  లు ,లను సరైన పుట్టుక లేని బేబీలను గుర్తించి రిపోర్ట్ చేయమని చెప్పి జాబితాలు తయారు చేయించింది .వాళ్ళు చాంతాడంత లిస్ట్ లు తయారు చేసిచ్చారు . అవయవ లోపం  నరాల బలహీనత మానసికంగా కుంగిపోయిన వారూ ఉన్నారు .ఈ లిస్ట్ రీచ్ కమిటీకి చేరాక చూపు పెద్ద పిల్లలపై  పడివారి లిస్ట్ లు తయారు చేయించారు . ఈ రిపోర్ట్ లను ముగ్గురు పీనల్ డాక్టర్లు పరిశీలించి ఇందులో ఎవరు చావాలో ఎవరు బతకాలో నిర్ణయం చేసేవారు .కానీ చివరికి వాళ్లకు మందులు ఇచ్చిబాగు చేసినట్లుకాని అందులో బతికి బట్టకట్టిన వారు కానీ కలికానికి కూడా కనిపించేలేదని ఇదంతా నయవంచన అని తేలింది ఎవరూ మాట్లాడే వీలు లేదు మూ సుక్కొచోవటమే  ,
  పిల్లలనుంచి తలిదండ్రులను వేరు చేసి ”మీ పిల్లాడు కొత్త ట్రీట్ మెంట్ ప్రోగ్రామ్ ”లో ఉన్నాడు మంచి గట్టి మందులిచ్చి మీ వాడిని ఆరోగ్య వంతుడిని చేస్తారు ,,మంచి గొప్ప జీవితం లభిస్తుంది ”అని బ్లఫ్ మాస్టర్స్ పలికి వేరు చేసేవారు ఒక వేళ ఎవరైనా  తలిదండ్రులు  మేము ఇవ్వం మాపిల్లల్ని అన్నా ,అనుమానం తో ప్రశ్నలు వేసినా వారిని నయానా భయానా చెప్పి చివరికి ఒప్పుకునేదాకా బెదిరించేవారు .దీనిపై నిర్ణయం బాధ్యత పేరెంట్ లకు లేదు అదీ బ్లఫ్ మాస్టర్స్ చేతుల్లోనే ఉండేది .నిర్ణయాధికారం ఉందని మాత్రం పో జు కొట్టేవారు . సర్వం దైవా దీనం -సారీ నారీ అధీనం మరోసారి సారీ నాజీ అధీనం .అయ్యా ఈ ఇన్టేక్  ట్రీట్ మెంట్ సెంటర్లు నగరం నడి  బొడ్డున ఉన్నాయని కొంటె” తప్పులో”కాలేసినట్లే ఎక్కడో చాలా దూరం లోనిర్మాణుష్యప్రదేశం లో పల్లెల్లో ఉండేవి అంటే నమ్ముతారా ?అబద్ధాలమీద బతికింది నాజీ రెజీమ్ .
  కొన్ని వారాలతర్వాత పేరెంట్స్ కు వాళ్ళ పిల్లాడో పిల్లో చచ్చి పోయిందని నోటీస్ వచ్చేది .చావుకు కారణం న్యుమోనియా ,అపెండిక్స్ బద్దలవటం అని మాత్రమే తెలియ జేసేవాడు .అసలు కారణాలు వేరు బాబూ . వాళ్ళ డాక్టర్లే వాళ్ళని మర్డర్ చేశారు .రీచ్ కమిటీ పిల్లలు  ప్రాణాంతక  ఇంజెక్షన్లు ,విషవాయువు  ఆకలి , మూలం గానే చనిపోయారు .స్వయానా ఈ భయానక మరణాలను చూసిన డాక్టర్ హెర్మన్ ఫానిమిల్లర్ ”ఓక్ అనే ఆరోగ్య జర్మన్ ప్రజలకు  ఈ అభాగ్యులు  భారమని భావించాం .మేం  పిల్లల్ని చంపం ఇంజెక్షన్లతో విషంతో .మాది ఇంకా తేలికపద్ధతి చాలా సహజంగా ఉంటుంది ”అని  చెప్పి బెడ్ మీద ఉన్న పిల్లాడిని చచ్చిన ఎలుకను పట్టుకున్నట్లు పట్టుకుని విషపు నవ్వు నవ్వుతూ  ఈ వెధవ  చావుకు ఇంకా మూడునాలుగు రోజుల టైమ్ ఉంది ”అని ఒక డాక్టర్ స్వయానా చెప్పాడని రాశాడు ..ఇలాంటి చోట్ల వేలకొద్దీ జర్మన్ పిల్లలు ఈ డాక్టర్లనబడే కిరాతకులు చేతుల్లో అసువులు బాశారు .దీనికి కారణం ఒక్కటే ”రీచ్(హిట్లర్ జర్మనీ ) కు ఇలాంటి వాళ్ళు బతకటానికి అనర్హులన్న భావమే ఇక్కడ హీలర్స్ కిల్లర్స్ గా మారారు  ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న మెంటల్ పేషేంట్ లను ముందే హతమార్చారు ఈ హత ప్రక్రియకు ఒక కోడ్  ”ఆపరేషన్ T4”అని పేరుపెట్టారు .ఇది బెర్లిన్ హెడ్ క్వార్ట్రర్స్ –”టీర్ గార్టన్ స్ట్రాస్సీ -4 ”పేరు
  ఇక యువకులను చంపే ప్రోగ్రామ్ అమలుకు t 4 కిల్లింగ్ కేంద్రాలు 6 సెంటర్  లలో పెట్టారు . వాటిలో గాస్ చేంబర్లు షవర్ బాత్ ల రూపం లోనూ అనుబంధంగా   కళేబర దహన  వాటికలు ఉండేవి . ఒక క్రమపద్ధతిలో చంపటం అంతే  వేగంగా కాల్చిపారేయటం క్షణాలమీద జరిగిపోయేవి . 1941 ఆగస్టు లో ఈ హనన దహన ప్రోగ్రామ్ అంతమైంది .అప్పటిదాకా నిరంతరాయంగా 24 గంటలు ఏడు రోజు లూ జరిగింది .దాదాపు 80 వేల ప్రాణాలు వీరి ఆపరేషన్ 4 లో గాస్ కు మంటలకు ఆహుతయ్యాయి . కాదేదీ కవితకనర్హం ”అన్నాడు ఆతర్వాతెప్పుడో శ్రీ శ్రీ కానీ నాజీలు ”కాదేదీ చావుకనర్హం ”అని నమ్మారు ,రుజువు చేశారు ..నిజానికి ఈ నిరంతర హనన ప్రక్రియ ఆగిపోలేదు రెండవ ప్రపంచ యుద్ధకాలం లోను ఆ తర్వాతా కూడా జరిగింది ఈ కాలాన్ని ”వైల్డ్ ఎధునేషియా ”అన్నారు అంటే” ఆటవిక కారుణ్య హత్య ‘-వైల్డ్ మెర్సీ కిల్లింగ్ . కారణం ఇది అనధికారిక ,అవ్యవస్థిత మానవ మారణ హోమం .జర్మన్ కిల్లింగ్ సెంటర్ లలో ఈ మెర్సీ  కిల్లింగ్ సెంటర్ లలో ఎధు  నేషియా  ప్రోగ్రామ్  అధికారికంగా సమాప్తమయిన తర్వాత  ఎన్ని వేలమందిని చంపారో  లెక్కా డొక్కా లేదు
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3
  .
   సశేషం
  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి, మల్లినాథ సూరి మనీష -32

వ్యాఖ్యాన చక్రవర్తి,  మల్లినాథ సూరి మనీష -32

ఏకావాలి లో  అలంకార చర్చ
ఆపహ్నుతి  అలంకారం -దీనిలో రూపకాలంకారం లో ఉన్నట్లే ఆరోపం ఉంటుంది .అయితే ఇది అపహ్నవం  చేత సమర్ధింపబడుతుంది .కనుక వర్ణించబడే విషయం అలా ఉన్నట్లు కనబడదు అది ఒక ప్రత్యేకతతో మారిపోతుంది విద్యాధరుడు ఆపహ్నుతి లో మూడు రకాలు ఉన్నాయని చెప్పాడు -”ఆపహ్ను త్యా రొపః , ఆరోప్యా పహ్నవః -చలాది  శబ్దే రసత్యవం ప్రతిపాదనం చేతి త్రివిధోస్య బంధ ఇత్యర్ధహ ”అన్నాడు సూరి .మొదటి దానిలో ఆరోపం  రహస్యమైన దానితర్వాత వస్తుంది .రెండవ దానిలో దీనికి వ్యతిరేకంగా అంటే రహస్యం తర్వాత ఆరోపం వస్తుంది .మూడవ దానిలో రహస్యంగా ఉన్నదాన్ని చల ,ఆపదేశ వంటి శబ్దాలచేత సూచింపబడుతుంది దీని నేపధ్యంగా మల్లినాథుని నిర్వచనం సరళం గా ఉండి  ప్రత్యేకంగా కనిపిస్తుంది -”యత్యా రో ప్య మాణస్యా రోవిషయాపహ్నునేవనావ సాపాహ్నుతిః ”
 సహోక్తి-సహోక్తి   విషయం లో సూరి రుయ్యక భావం పై ఆధారపడ్డాడు ఇందులో సహా అంటే సూత్రాలోచన పాదాలమధ్య గౌణమైన సంబంధం కనుక వస్తువులమధ్య సంబంధం గా ఉండాలని లేదు అదివస్తువు  ఒకదానితో ఒకటి కలిసి పోవటం (ఇంట్రా ససెప్షన్ )పై ఆధార పడి  ఉంటుంది దీన్ని శ్లేష ద్వారా గుర్తించాలి ఇక్కడ రుయ్యకుని వివరణపై మల్లినాథుని వ్యాఖ్యానం దాన్ని గుర్తుకు తెస్తుంది .సహోక్తి లో ఉపమా న ,ఉపమేయాల సంబంధం ఉద్దేశ్య పూర్వకమైనదే ..సహా చేత సూచింపబడే వస్తువు ఉపమేయ స్థానం లో ఉండి వ్యక్తీకరించే క్రియ తో సంబంధంకలిగి ,రెండవ దాని అర్ధం సహలో చెప్పినట్లు  ఉద్దేశితమౌతుంది .-”ఇహ భావే ప్రకృతత్వాన్ ఉపమానోపమేయ భావో వైవక్షి కః -తత్ర సహార్ద నిర్దిష్టస్య అప్రాధాన్యా దుపమానా త్వమర్దాది తరస్య ప్రాధాన్యాద్యుపమేయ త్వం -యాత్రోపమానోపమేయ యో రేకస్య శబ్దహ -క్రియా సంబంధ ఇతరస్య సహార్ద నిర్దేశా ద్ గమ్యహ సా సహోక్తి రిత్యర్దా ”
ప్రతి వస్తూపమాలంకారం -అనేక వాక్యాలలో పోలిక ఉండటం దీనిప్రత్యేకత రెండు వాక్యాలుంటే వాటిలో లక్షణం లేక గుణం (యట్రి బ్యూ షన్ ) ఒకే రకంగా ఉంటుంది . దృష్టాంతం లో  మొదటిదానిలోని గుణం రెండవ దానిలోగుణం పోలికతో  ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఈ రెండు వేరు వేరు వాక్యాలలో చెప్పబడిన గుణాలు అసలైనదానికి దాని ప్రతిబింబాన్ని ఉన్న సంబంధంగా ఉంటాయి . మల్లి నాధుని వివరణ -”భిన్న యోరేవ వస్తు నో రత్యంత సదృశా యోరుభయత్ర  పృధంగా నిర్దేశో బింబ ప్రతి బింబ భావః ”కానీ ”యత్ర వస్తు స0బందేన ప్రతి బింబనం గమ్యతే సా నిదర్శనమే ”అన్నాడు .కొన్ని చోట్ల వస్తువుకు ,పోల్చబడేదానికి  ,సాధ్యం లేక సాధ్యం కాని    సంబంధాలు కొన్ని సందర్భాలలో ఉంటె   అది నిదర్శనాలంకారమవుతుంది-యత్ర పరస్పరని రక్షరాని రపేక్షర్ద త్వే న వాక్యార్ధ భేద స్తత్ర దృష్టాంతః -యత్ర సాపేక్షార్ధత్వే న విద్యర్ధ వాద యోరివ వాక్యయో  రేకవాక్య తా తత్ర నిదర్శనేతి  భేదః -ఉత్ప్రేక్షాలంకారం -ఉత్ప్రేక్షను విద్యాధరుడు తనపద్ధతిలో విచిత్రంగా నిర్వచించాడు .ఈ అలంకారం   శోషణం (అబ్సా ర్ప్షన్  ) లేక ఒకదానిలో ఒకటి దూసుకుపోవటం వలన అంటే ఆద్యావసయం వలన ఏర్పడుతుంది ఏకావాలి కర్త చక్కని నిర్వచనం చెప్పాడు -అభిన్న త్వే న ప్రతిభాసనమద్యావసాయహ్ ”అని అధ్యావసాయ కు అర్ధం చెప్పాడు వస్తువును పోల్చబడేది పూర్తిగా మింగేస్తే వచ్చేది ఆద్యావసయం 1-సిద్ధ 2 సాధ్య అని రెండురకాలన్నాడు విద్యాధరుడు.పోల్చబడినది వస్తువుతో ఉన్న సంబంధం తెలియబడితే వచ్చేది విషయ పై విషయం ఆరోపిస్తే వచ్చేది   .ఇదే అతిశయోక్తి ఆధారం .విషయం విషయిల సంబంధం వేరుగా ఉంటె కొత్త భావం అందులో స్ఫురిస్తుంది .ఇక్కడ అనుమానం  తర్కం ఊష సహాయ పడుతుంది .మల్లినాథుడు ఉత్ప్రేక్షకు కొత్త నిర్వచనమిచ్చాడు -”స0 భావన మాయోత్ప్రేక్షా ప్రకృతస్య పరేణ యాత్ అని మమ్మటుడు చెప్పనడానికి సూరి ”అప్రకృత గుణ క్రియాభి సంబంధాత్ ప్రకృతస్య  ప్రాకృతత్వే న స0భావన ముత్ప్రేక్ష్యో త్య ర్ధః ”
అధ్యావసాయ లోని సిద్ధ ,సాధ్యలనూ మల్లినాథుడు  విస్తరించి చెప్పాడు .-”యత్ర వైశ్య విషయిణో ర్ధ యో రూపాదానం తత్ర భేద వదవ భాసా దభేదో నావ బాసతే -విషయిణో సత్యతా ప్రతీతేహ్ -తథాపి విషయస్య తదా వ్యపదేశత ద్ధర్మ యోగి త్వాభ్యామ భేదోద్యవసీయతే సంభావ్యతా ఇతి వ్యాపార ప్రాధాన్యా ధ్యా వసాయః సాధ్య ఇత్యర్దహ”
  అధ్యావసాయ  సిద్ధ ఎప్పుడు అవుతుందిఅంటే విషయం శబ్దాలతో చెప్పబడక పోలిక చెప్పబడే దానితో మింగివేయబడితే అప్పుడు పోలిక వస్తువు అధ్యావాసిత అయి కప్పి వేయబడి స్పష్టమౌతుంది . సాధ్య ఎప్పుడౌతుంది అంటే -వస్తువు పోలిక చెప్పబడే దానితో తాదాత్మ్యంగా చెప్పబడితే అప్పుడు సాధ్య అవుతుంది -”యత్ర తుతస్యానుపాదానం తత్ర విషయిణా ఏవోయాదాన మహిమ్నా తస్య వస్తు తో సత్య స్యాపి సత్యతా ప్రతీతౌ విషయస్య తదాత్మా నాధ్యా వసిత ప్రాధాన్యే ”జ్ఞాతోదర ”ఇత్యర్ధ ధరమ్ ప్రతి జ్ఞానస్యేవా ద్యావసాయ స్యాద్య వసితం ప్రత్యుప సర్జన త్వం ప్రతీయతే -ఏతదేవాద్యావస్యా వయస్య సిద్ధాంతం నామ ”
  ఉత్ప్రేక్షలో ఉపమాన ఉపమేయాలు లేక విషయం విషయ లను గుర్తించటం  పూర్తికాకపోతే సాధ్య అవుతుంది .కానీ అతిశయోక్తిలో గుర్తించటం పూర్తి అయితే సిద్ధ అవుతుంది ఏకావాలి మల్లినాథుని నిర్వచనం లో ”గుణాభి సంబంధా ”అనే దాన్ని ఉపయోగించాడు ఇక్కడ గుణ అంటే క్రియ అనే అర్ధం లో వాడాడని గమనించాలి  .మరికొన్ని అలంకారాలు తర్వాత తెలుసుకొందాం .
  సశేషం
   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలంగాణ సాహిత్య అకాడెమి

ఇన్‌లైన్ చిత్రం 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వైకింగ్ శకం -3

వైకింగ్ శకం -3

1014 లో శ్వీన్ ఫోర్క్ బియర్డ్ లంకా షైర్ లోని  గెయిన్స్ బర్గ్ లో ఫిబ్రవరి 3 చనిపోయాడు  డెన్మార్క్ లో ఖననం చేశారు . ఏదెల్  రెడ్ నురాజుగా  పిలవగాశ్వీన్ కొడుకు  క్నాట్   ది  గ్రేట్ ను  తరిమికొట్టి సోదరుడు హరాల్డ్ -2 ను డెన్మార్క్ రాజును చేశాడు క్లాన్  టార్ఫ్  బ్రియాన్ బోరు ,హై కింగ్ ఆఫ్ ఐర్లాండ్ యుద్ధాలలో లీన్ స్టర్  రాజును  డబ్లిన్ రాజు సిల్క్ బియర్డ్  ఎరల్  ఆఫ్ ఆర్కెని ఐలాండ్స్ లాడ్  వేసేం ల సాయం తో ఓడించి చివరికి తానె చనిపోయాడు . 1015  లో క్నాట్  ఇంగ్లాన్డ్ కు 200 షిప్పులతో 10 వేల  సైన్యం తో  తిరిగివచ్చాడు . 1016   ఆషింగ్టన్ యుద్ధం లో ఏదెలా రెడ్ సాయాన్ని దుంప నాశనం చేసి థేమ్స్ నదికి ఉత్తరాన ఉన్న ఇంగ్లాన్డ్ ను స్వాధీనం చేసుకొని దేనిలా వెళ్ళాడు .ఏదేరాల్డ్ చనిపోగా పాత సెయింట్ పీటర్ పాల్ కాధెడ్రల్ లో  ఉంచారు . 1017లో క్నాట్   ది  గ్రేట్ ఇంగ్లాన్డ్ రాజుగా పట్టాభి షిక్తుడయ్యాడు .తర్వాత డెన్మార్క్ రాజు క్నాట్   తమ్ముడు హెరాల్డ్ చనిపోగా డెన్మార్క్ వచ్చేసి  దానికీ రాజయ్యాడు . 1027 లో రోమ్  సందర్శించి రెండవ కాన్రాడ్ కారోనేషన్ కు హాజరయ్యాడు . 1028 లో క్నట్  ఇంగ్లాన్డ్  డెన్మార్క్ నార్వే లకు రాజుగా గుర్తింపు పొందాడు .అంటే విశాల బ్రిటిష్ సామ్రాజ్యానికి వైకింగ్ కింగ్   చక్రవర్తి అనిపించుకున్నాడు . 7ఏళ్ళు పాలించి 1035 లో చనిపోతే వెస్ట్ మినిష్టర్ కెదెడ్రల్ లో అంత్యక్రియలు జరిపారు .కొడుకు హెరాల్డ్ హేర్  ఫుట్ ఇంగ్లాన్డ్ రాజయి 1040లో చనిపోయాడు మూడవ కెనాట్ 10 42 వరకు రాజు నార్వే జార్చుకున్నాడు 1040లో ఆర్దాక్న్తట్  ఇంగ్లాన్డ్ రాజుగా హెరాల్డ్ మరణం తర్వాత అయ్యాడు . 1042 లో హెర్లాడ్ ది కన్ఫెస్సర్ రాజయ్యాడు నార్వే రాజుగా హరాల్డ్ హార్ డ్రాతా ఉన్నాడు ఇతనికజిన్ డెన్మార్క్ రాజై 1066 దాకా ఉన్నాడు డెన్మార్క్ రాజు హరాల్డ్ శ్వీన్ యేస్ట్రర్ సన్ 1074 దాకా రాజ్యమేలాడు . 1066 లో కన్ఫెస్సర్ చనిపోగా ఎడ్వార్డ్ భార్య తమ్ముడు గా డ్ విన్సన్ తాత్కాలిక రాజయ్యాడు .హరాల్డ్ హర్ డ్రాడా ఇంగ్లాన్డ్ పై దాడి చేసి ఓడిపోయాడు  స్టామ్ఫోర్డ్  బ్రిడ్జ్ బాటిల్ లో చనిపోయాడు వైకింగ్ రాజు  రోల్లో మునిముని మనవడు విలియం నార్మాండి ఇంగ్లాన్డ్ ను 7 వేల  మంది సైన్యం తో ముట్టడించి హరాల్డ్ ను ఓడించి చంపి క్రిస్మస్ రోజున వెస్ట్ మినిష్టర్ అబ్బే లో ఇంగ్లాండ్ రాజయ్యాడు . 1069 లోనార్వే రాజు  శ్వీన్ యేస్త్రిడ్సన్  తమ్ముడు ఆస్ బోరన్  ”యార్క్ ”అన్వేషణకు మద్దతిచ్చి విలియం కు వ్యతిరేకంగా పెద్ద సైన్యం తయారు చేయించాడు .కానీ అతని అన్వేషణ పూర్తికాలేదు 1094 లో చివరి  డబ్లిన్ వైకింగ్ కింగ్ గాడ్ఫ్రెడ్  తొలగింపబడ్డాడు 1098లో నార్వే రాజు మాగ్నస్ బేర్ లెగ్స్ ఆర్కనీ  హెబ్రీడ్స్ కు  అన్వేషణకు వెళ్లి స్కాటిష్ రాజుచేత రికగ్నిషన్ పొందాడు . 1263 లో వెస్టర్న్  ఐల్స్ లో వైకింగులపాలనపై  స్కాట్ ల తిరుగుబాటుకు ప్రతిగా వైకింగ్ రాజు నాలుగవ హాక్సన్ లార్గ్స్ లో యుద్ధం చేసి ఓడిపోయాడు .చరిత్రలో వైకింగ్ ల చివరి దండ  యాత్ర ఇదే .దీనితో సుమారు 500 ఏళ్ళ వైకింగ్ శకం సమాప్తమైంది .

  వైకింగ్ అనే మాట విక్  అనే పదం నుంచి వచ్చింది దీని అర్ధం ఇరుకైన అగాధం .దీనికి చెందిన వాళ్ళని భావం .వికేం అనే నార్వీజియన్ పదం పాత నార్సేలోని వికిన్ నుంచి వచ్చి అక్కడ నివ సించినవారు అనే అర్ధం రూఢి అయింది వికింగ్ అనే పదం పాత ఆంగ్లో సాక్సన్ కవితలో ఉంది  జర్మన్లు వీరిని ”యాస్కోమిన్ని ”లేక యాష్ మెన్ అన్నారు అంటే  యాష్ అనే కలపతో పడవలు తయారు చేసేవారని అర్ధం బైజాన్టియన్లు ”వారంగియాన్స్ ”అన్నారు .అంటే మాటకు కట్టుబడేవారని నమ్మకస్తులని భావం .ఫ్రాంక్స్  ఇంగిలీషు వాళ్ళు వీళ్ళని నార్దర్న్ మెన్ లేక డేన్స్ అన్నారు .
గమ్యాలా ఉప్సల లో 2 వేల  ఏళ్ళనుంచి 2 నుంచి 3 వేలమంది మట్టిలో కూరుకు పోయిన మట్టి దిబ్బలున్నాయి 40 అడుగుల ఎత్తు తో ఇవి కట్టబడ్డాయి వీరు శ్వీడాన్ వైకింగులు   భావింపబడ్డారు డెన్మార్క్ లోని ఆల్ బోర్గ్ దగ్గర లిన్దోమ్ హుజీ 600  రాతినావలు వైకింగ్ కాలానివి కనిపించాయి . బ్రాన్జ్ యుగానికి చెందిన వైకింగ్ ల మట్టి సమాధులున్నాయి నార్త్ సి ఒక బ్రిడ్జిలాగా స్కాండినేవియాకు ఉపయోగ పడింది రేవన్  యుద్ధ వీరుని కి వైకింగ్ సంప్రదాయ సైనిక లా0చనాలతో పాతిపెట్టబడిన సమాధులను ఇటీవలకాలం లో త్రవ్వకాలలో కనుగొన్నారు
we are the pilgrims master -we shall go -always a little further -it may be -beyond that last blue mountain barred with snow -across that angry or that glimmering sea (golden journey to( s’amarkhand )కవిత వాళ్ళ ధైర్య సాహసాలకు ప్రతీక .హవామాల్ ”అనే పెద్దలు చెప్పిన సుద్దిమాటలు లో ఒక వైకింగ్ హీరో ఎలా జీవించి ఎలా మరణించాలో  వర్ణించబడింది –
”a coward believes he will live for ever -if he holds back in the battle -but in old age he shall have no peace -though spears have spared his limbs -cattle die  kindred die -every man is mortal -but the good name never dies -of one whohas done well.”
యూరప్ అంతా పోలార్ వేల్స్ పై మోజెక్కువ .గ్రీన్ లాండ్ వైకింగ్ లు అతి విలువైన నాణ్యమైన ఒకమాది రి సైజులో ఉండే నార్వాల్ వే ల్ అంటే బాగా ఇష్టపడ్డారు.వైకింగ్ యుగం లో అవి ఆర్కిటిక్ సముద్రం గ్రీన్ లాండ్ ,కెనాడాల లో బాగా ఉండేవి దీని మాంసం సి విటమిన్ కు బదులుగా వాడతారు దాని చర్మతో తాళ్లు పేనేవారు .దాని  దంతం అన్నిటికంటే మహా విలువైనది  ఎర కు బాగా పనికొచ్చేది ఇవి చాలా మిస్టీరియస్ జంతువులు . ఎప్పుడు ఎలా మీద పడతాయో తెలీదు 16 అడుగుల పొడవుండి 3,500 పౌండ్ల బరువుంటాయి వంకర తిరిగిన 10 అడుగుల దంతం 20పౌండ్ల బరువుతో తమాషాగా ఉంటుంది  ఆడది కనిపిస్తే మొ గా ఆడ నీటిపైకొచ్చి టస్క్లతో శృంగారం చేసుకొంటాయి .అప్పుడు ఫెన్సింగ్ కట్టినట్లే ఉంటుంది .మాధ్యయగపు గ్రీకులు  ఒక తెల్ల గుర్రం నుదుటిపైనా ఉన్న ఒకే కొమ్ముతో  స్వచ్ఛతకు చిహ్నంగా ఉండేదని నమ్మేవారు దాన్ని కన్యలు మాత్రమే మచ్చిక చేయగలరని దాని కొమ్ములతో కప్పులు తయారు చేసి అందులో ఏదైనా పోసుకొని త్రాగితే విషా నికి విరుగుడు  ఆవు తుందని  నమ్మకం కొమ్మును పొడి చేసి వైద్యం లో వాడితే సర్వ రోగాలకు మందు అని కూడా .కనుక నార్వాల్ వేల్స్ టాస్క్ కు యెంత విలువ ఉందొ ఆలోచించండి .వీటి టస్క్ ”బంగారం కంటే అతి విలువైనది ”అందుకే వైకింగ్ లకు దీని వేట  తెల్ల ఎలుగుబంటి ఫర్,  హంటింగ్ ఫాల్కన్ లపై మోజెక్కువ వీటిని పట్టి చక్రవర్తులు అమ్మేవారు డబ్బో డబ్బు .
  వైకింగ్ ల అన్వేషణలో గ్రీన్లాండ్ లోని చెట్లతో నిండియున్న భాగాన్ని మార్కులాండ్ అంటే వుడ్ లాండ్ గా రాళ్ళతోఉన్న భాగాన్ని హాల్  లాండ్ అంటే స్టోన్ లాండ్ అనీ పిలిచారు బెర్రీలు  ద్రాక్ష ప0డే దాన్ని న్యూ ఫౌండ్ లాండ్ అన్నారు అమెరికాలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న స్థానిక ఆటవికులు నార్త్  అమెరికన్ ఇండియన్స్ అయిన ఇనూట్ లను    స్క్రేలింగర్ లు అంటే ”అగ్లిమెన్ ”అన్నారు
  వైకింగ్ రాజు క్నాట్ కు ఇంగ్లాన్డ్ అంటే మహా అభిమానం    ఇవాళ ఐరోపాలో డాలర్ కు బదులు ”యూరో ;;ఉన్నది దీని ఆ వైభవం మొట్ట మొదట తెచ్చినవాడు క్నా ట్ .అతడు ”ఎడ్గార్ ది  పీస్ ఫుల్ ”పవిత్ర గ్రంధం నుంచి ఒక ఆకు తీసి ఇంగ్లాడ్  స్కాండినేవియన్ నాణాలను ప్రామాణికం చేశాడు ..కనుక 11 వ శతాబ్దిలో” సెంటర్ ఆఫ్ మానిటరీ యూనియన్”జర్మనీ కాదు ,ఫ్రాన్స్ కాదు ఇంగ్లాన్డ్ మాత్రమే అని గ్రహించాలి .ఔన్స్ యొక్క బరువునూ ప్రామాణికం చేసి బంగారం,వెండి  తూకం లో  తన సామ్రాజ్యం లో అంతా అమలు చేశాడు . అప్పుడు అది బైజాన్టిన్ సామ్రాజ్యపు ప్రమాణానికి సరిపోయింది .దీనితో యూరప్ అంతా ఒకే రకమైన మిడీవల్ సింగిల్ మార్కెట్ విధానం అమలైంది క్నాట్  ది  గ్రేట్ వైకింగ్ ఎంపరర్ వలన .. ఇతని చక్రవర్తి కిరీటం అష్టభుజాకారంగా 8 ఇరవై రెండుకేరట్ల బంగారు రేకులతో వజ్ర వైఢూర్యాలు ముత్యాలతో ధగధగా లాడింది . అప్పటికి ఇంకా వజ్రాలను సానబెట్టటం తెలియదు అందుకే నదిలోని గులక రాళ్ళలాగా వాటిని పొది గారు ..అతని సామ్రాజ్యం అతి విశాలమైనది .ఇంత ఘాన చరిత్ర ఉంది వైకింగులకు .
ఇన్‌లైన్ చిత్రం 1ఇన్‌లైన్ చిత్రం 2ఇన్‌లైన్ చిత్రం 3ఇన్‌లైన్ చిత్రం 4
  మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment