మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్

మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్

 (11-1-17 న విహంగ వార్షికోత్సవం సందర్భంగా)

సరైన వనరులు ,సాంకేతిక పరిజ్ఞానం లేని సమయం లో తెలుగులో ఒక వెబ్ మహిళా మాసపత్రికను స్థాపించి దిగ్విజయంగా ఆరేళ్ళు నడిపి విహంగ రెక్కలకు గట్టితనం చేకూర్చిన సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత గారిని మనసారా అభినoదిస్తున్నాను .పత్రిక మహిళలకు ప్రత్యేకం కనుక వారి సమస్యలు, చిక్కుముడులు, బాధ్యతలు ,సంఘంలో స్థానం ఆకాశంలో సగం అయినా దక్కని హక్కులూ వంటి వాటిని అందరి దృష్టికి తెస్తూ సరైన న్యాయం కోసం పదం కలుపుతూ కదం తొక్కిస్తూ విహంగ అందరి దృష్టినీ ఆకర్షించింది .వినోదం విజ్ఞానం ,యాత్రా సాహిత్యం లేఖలూ ,సాహిత్య వ్యాసాలూ ,పుస్తక సమీక్షలూ అన్నిటికీ సమానమైన స్థానం కల్పిస్తూ  పత్రికా నిర్వహణ జరిగింది .

హేమలత గారితో నాకు పరిచయం విజయవాడలో సుమారు 5 ఏళ్ళ క్రితం జరిగింది . శ్రీ గంధం వేంకాస్వామి శర్మగారి కధా సంపుటి ‘’అమృత హస్తాలు ‘’పై శ్రీ అలిసేటి నాగరాజు పరిశోధన చేసి పుస్తకం ప్రచురి౦చి ఆవిష్కరణ జరిపినపుడు శ్రీ శర్మగారు నాకూ ఆహ్వానం పంపి తప్పక రమ్మని ఫోన్ చేస్తే వెళ్లాను .

అప్పుడు హేమలత గారు నన్ను పలకరించి నేను నడుపుతున్న సరసభారతి బ్లాగ్ బాగా ఉందని తాను రెగ్యులర్ గా చూస్తున్నానని అందులో నా ఫోటోను బట్టి గుర్తుపట్టానని చెప్పారు .తాను విహంగ అనే మహిళా వెబ్ మాసపత్రికను నిర్వహిస్తున్నానని ,వెబ్ సాహిత్యం పై పరిశోధనకూడా చేస్తున్నాని తెలియ జేసి విహంగను చూసి అభిప్రాయం చెప్పమని ,వీలైతే ఏదైనా రాస్తే మరీ సంతోషిస్తానని అన్నారు .సరే అన్నాను .20 12 ఏప్రిల్ లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక వ్యాసం మెయిల్ చేశాను .బాగుందని విహంగలో వేసి ,ప్రతినెలా ఒక వ్యాసం వ్రాయమని కోరారు . సాంఘిక సేవలో తరించినవారు ,విలువైన సాహిత్యాన్ని  సృష్టిoచినవారు , మహిళాహక్కులకోసం  ఉద్యమాలు నిర్వహించిన వారు  జాతీయోద్యమ నాయకులు ,అధికారం లో ఉన్నవారు అయిన ప్రపంచ వ్యాప్త మహిళ గురించి  ప్రతినెల ఒక ఆర్టికల్ రాస్తూనే ఉన్నాను .విహంగ లో ప్రచురిస్తూనే ఉన్నారు .

వైవిధ్యానికి ప్రాధాన్యత నిస్తూ ,ఎవరి దృష్టి లోనూ పడని దాదాపు 60 మంది మహిళామతల్లుల గురించి  విహంగకు రాసి ఉంటాను .అందులో కొన్ని నేను రాసి సరసభారతి తరఫున ప్రచురించిన ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకంలో చోటు చేసుకొన్నాయి కూడా .నేను రాసిన పుస్తకాలపై సమీక్షలూ చేయిస్తూ హేమలత గారు నా రచనలు రిసెర్చ్ వర్క్ లాగా ఉన్నాయని అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నారు..

క్రమంగా మాసపత్రిక వారపత్రిక గా మారి మరిన్ని అందాలు నింపుకొని ,అలరిస్తూ క్రమం తప్పకుండా సాహితీ విహంగం ఎగురుతూనే ఉంది.మనసులకు హాయి ,ఆనందాలను పంచుతూనే ఉంది. అందరి అభిమానాన్ని పొందుతూనే చేరువౌతూనే ఉంది. ఈ విజయ యాత్ర ఇలానే అనంతంగా కొనసాగాలని కోరుతూ నిర్వహణలో నైపుణ్యం ,వాసి , వన్నెచూపిస్తున్న శ్రీమతి హేమలత గారిని అభినందిస్తున్నాను .

         – గబ్బిట దుర్గా ప్రసాద్

————————————————————————————————



గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి 101 వ సమావేశం సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం

https://plus.google.com/photos/115752370674452071762/album/6376806161454194209/6376806164444335762

సరసభారతి 101 వ సమావేశంగా సరసభారతి ,,ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం ,మరియు ,అపరత్యాగ బ్రహ్మ మహా వాగ్గేయకారులు ,గాన గంధర్వ స్వర్గీయ శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారి దేవాలయం లో పుష్యబహుళ పంచమి మంగళవారం 17-1-17 సాయంత్రం 6-30 గం .లకుశ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన నిర్వ హించడం జరిగింది. . రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో అయిదుగురు గాయనీమణులు త్యాగ రాజపంచరత్న కీర్తనలు ,,బాలమురళీ కృష్ణ కృతులు గానం చేసి స్వర నివాళి సమర్పించారు. .
శ్రీ బాల మురళి మరణించిన నెల రోజుల లోపుననే , దాదాపు ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ”స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ స్మారక పురస్కారం ”ను సరసభారతి ఏర్పాటు చేసి,, మా అమ్మాయి శ్రీమతి కోమలి ,విజయ లక్ష్మి ,శ్రీ సాంబావదాని(అమెరికా ) దంపతుల సౌజన్యం తో ఈ కార్యక్రమం లో గానం చేసిన గాయనీమణులు ఒక్కొక్కరికి 1,11 6 రూపాయలు నగదు పారితోషికాన్ని అందజేయడం జరిగింది. గాత్ర కచేరి సభకు చొప్పరపు కొండలు, సంగీత , సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

త్యాగరాజ ఆరాధన -జ్యోతి వార్త-17-1-17

jyoti

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నాద బ్రహ్మ ద్వయం – నాద బ్రహ్మ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ

 

నాద బ్రహ్మ ద్వయం

నాద బ్రహ్మ ,సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని ,అపర త్యాగ బ్రహ్మ ,నాదోపాసకుడు ,మహా వాగ్గేయకారుడు స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభను స్వర  నివాళిగా సరసభారతి ,ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్తంగా పుష్య బహుళ పంచమి 17-1-17 మంగళవారం సాయంత్రం 6-30 గం.లకు ఉయ్యూరు లో శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లోనిర్వ హిస్తూ ,బాలమురళీ కృష్ణ  మరణించిన నెల రోజుల లోపునే బహుశా ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ఏ సాహితీ సంస్థ ఏర్పాటు చేయని ‘’స్వర్గీయ మంగళంపల్లి బాల మురళీ  కృష్ణ  స్మారక నగదు పురస్కారం ‘’ను సరసభారతి ఏర్పాటు చేసి  ,మా అమ్మాయి శ్రీమతి కోమలి విజయ లక్ష్మి ,శ్రీ సాంబావధాని (అమెరికా )దంపతుల సౌజన్యం తో ,రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లోగాన౦ చేస్తున్న గాయనీ మణులకు అందజేస్తున్న సందర్భంగా ,ఆ ‘’నాద బ్రహ్మ ద్వయం ‘’జీవిత విశేషాలను సంక్షిప్తం గా అంద జేస్తున్నాను .

నాద  బ్రహ్మ త్యాగ రాజ స్వామి

శ్రీ సర్వ జిత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్టి సోమవారం ప్రకాశం జిల్లా కంభం తాలూకా కాకర్ల గ్రామం లో శ్రీ కాకర్ల  రామబ్రహ్మం ,శ్రీమతి సీతమ్మ దంపతులకు శ్రీ త్యాగరాజ స్వామి ఆ త్యాగరాజ శివుని అనుగ్రహం తో జన్మించారు .వీరిది వైదిక బ్రాహ్మణ కుటుంబం ,మురికి నాడు శాఖ .తండ్రి తంజావూర్ రాజు శరభోజి ఆస్థాన ఉద్యోగి .తాత గిరిరాజకవి .అందుకే త్యాగయ్య ‘’గిరిరాజ సుతా తనయా ‘’అనే కృతి బంగాళా రాగం లో రాశారు .కుటుంబం  ఆంధ్ర దేశం నుండి తమిళనాడుకు మొదట ఆరు పల్లెల కూడలి ‘’తిరువారూర్ ‘’కు తర్వాత పంచ నదీ సంగమం ‘’తిరువయ్యూర్ ‘’కు చేరింది .ఇక్కడే త్యాగయ్య సంస్కృతం వేద,వేదాంగాలు నేర్చారు .వీరి సంగీత గురువు శ్రీ శొంఠి వెంకట రమణయ్య .

త్యాగయ్యగారు 96కోట్ల శ్రీ రామనామం జపించి శ్రీ రామ దర్శనం పొందిన మహానుభావులు .త్యాగ బ్రహ్మ మహా వైణికులు కూడా .మొదటి భార్య శ్రీమతి పార్వతి చనిపోతే ,ఆమె చెల్లెలు శ్రీమతి  కమలను ద్వితీయం చేసుకొన్నారు .కూతురు సేతామహలక్ష్మి .ఆమెకు ఒక కుమారుడు జన్మించి చనిపోయాడు .త్యాగయ్య గారు 13 వ ఏటనే తోడి రాగం లో ‘’నమో రాఘవా ‘’కీర్తన రాశారు .నారద మహర్షి త్యాగయ్యగారికి ‘’స్వరార్ణవం ‘’అనే సంగీత గ్రంధం అనుగ్రహించాడు ఈ విషయాన్ని ‘’సాధించెనే మనసా ‘’ లోను ‘’స్వరరాగ సుధా రసము ‘’కృతిలోను చెప్పారు .జీవిత కాలం లో 24వేల  రచనలు చేసినట్లు తెలుస్తుంది .కాని వారివి తెలుగు కృతులు 711 కృతులు .సంస్కృతం లోనూ రచించారు  .ప్రహ్లాద భక్త విజయం ,నౌకా చరిత్ర అనే రెండు సంగీత నాటకాలు రాశారు . అందరు దేవుళ్ళను తన శ్రీరామునిలోనే దర్శించుకొన్న పుణ్యాత్ములు త్యాగయ్య .చివరి దశలో ‘’నాద బ్రహ్మానంద ‘’దీక్షానామం ధరించి రామగానం లోనే గడిపారు .శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి నాడు 80 వ ఏట త్యాగ బ్రహ్మ నాదైక్యమయ్యారు .కనుక ఆయన కు ఇది 250 వ జయంతి .170 వ వర్ధంతి . వర్ధ౦తి రోజునే  త్యాగ రాజ ఆరాధనోత్సవాలు తిరువయ్యూర్ లోను, దేశమంతటా ఘనం గా జరుగుతాయి .త్యాగబ్రహ్మ౦గారి శిష్యులలో మూడవ తరం వారు శ్రీ సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,నాల్గవ తరం  వారు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు.

శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మ అనే సంగీత విద్వాంసురాలు, చెన్నపట్నం నివాసి త్యాగరాజ స్వామికి మహా భక్తురాలు .ఆమె ఒకసారి తిరువయ్యూర్ వచ్చి శిధిలమై పోతున్న త్యాగరాజస్వామి సమాధిని చూసి చలించి పోయి ,తంజావూర్ రాజుద్వారా ,రెవిన్యు అధికారుల ద్వారా స్థలాన్ని కొని ,శుభ్రం చేయించి మద్రాస్ లోని తన ఖరీదైన మేడను అమ్మి ఆ డబ్బుతో  త్యాగరాజస్వామికి గుడి, చుట్టూ గోడలుకట్టించింది .27-10-19 21 లో శంకుస్థాపన చేసి నాలుగేళ్ళలో నిర్మించి 7-1-19 25 న కుంభాభి షేకం చేయించింది .మండపం ,పాకశాల నిర్మించటానికి ధనంలేక తన నగలు,సంపద అన్నీ అమ్మేసింది.మహానటుడు చిత్తూరు నాగయ్యగారిని కలిసి సత్రం నిర్మించమని కోరగా ఆయన మహా వితరణ శీలికనుక వెంటనే సత్రం నిర్మించి అందజేశారు .

త్యాగ రాజ కీర్తనలు 1-తాత్వికం 2-కీర్తనం 3-నిత్యానుస్టానం అని మూడు రాకాలు అని విశ్లేషకులు భావించారు .నలిని కాంతి ,జయంతి శ్రీ వంటి 100 కొత్త రాగాలను త్యాగబ్రహ్మ సృష్టించారు .త్యాగరాజ పంచరత్న కీర్తనలను సామూహికంగా ఆరాధనోత్సవం నాడు గానం చేస్తారు .ఇవి అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ ,విజ్ఞానమయ ,ఆనందమయ కోశాలను మెట్లుగా ఎక్కే భావ పరంపర గా భావిస్తారు .ఉత్సవ సంప్రదాయ కీర్తనలు  ఉత్సవాలనాడు గానం చేస్తారు.జీవన్ముక్తుడైన నాద బ్రహ్మ ,గానబ్రహ్మ ,కవిబ్రహ్మ ,జ్ఞాన బ్రహ్మ అయిన త్యాగ బ్రహ్మ గారు’’బ్రహ్మొహం ‘’ అంటూ పాడిన చివరి కృతి ధన్యాసి రాగం లోని ‘’శ్యామసు౦దరాంగ-సకల శక్తియు నీవేరా-  తామస రహిత ,గుణ సాంద్ర –ధరను వెలయు శ్రీరామ చంద్ర –దుస్ట దనుజ విహార ,శిష్టజన హృదయ విహార –ఇష్ట దైవము నీవేరా ,ఇలను త్యాగ రాజు వేరా ‘’.ఇదే ఆయన చరమగీతం –(శ్వాన్ సాంగ్) ‘’.త్యాగరాజహంస పరమహంసలో చేరిపోయింది .

తెలుగునాట పుట్టి ,తమిళదేశం చేరి అక్కడ శ్యామాశాస్త్రి ,ముత్తుస్వామి దీక్షితులవంటి సంగీత దిగ్గజాలతో కర్నాటక సంగీత త్రయం అనిపించి , వారిలో శిఖరాయమానం గా ప్రకాశించి తమిళనాట తెలుగు భాషా వైభవాన్ని చాటి, కీర్తి పతాకను ఎగరవేసిన నాద బ్రహ్మ త్యాగరాజ స్వామి .

మరో  నాద బ్రహ్మ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ

 

 

మురళీ కృష్ణ బాలమురళి అవటం

తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకర గుప్తం గ్రామం లో శ్రీ మంగళం పల్లి పట్టాభి రామయ్య ,శ్రీ మతి సూర్య కాంతం దంపతులకు శ్రీ బాలమురళీ కృష్ణ 6-7-1930 న జన్మించారు .పుట్టిన 15 రోజులలోనే తల్లిని పోగొట్టుకొన్న దురదృస్టవంతులాయన ..తండ్రిగారు తల్లీ గురువు  సర్వమూ అయి కంటికి రెప్పలా పెంచారు .రాత్రిళ్ళు తండ్రి పక్కలో పడుకొని ఆయన దగ్గరే సరళస్వరాలు ,జ౦ట స్వరాలు ,వర్ణాలు కీర్తనలు నేర్చారు .1939 జులై 6 న  9 వ ఏట లోబెజవాడలో దుర్గా పురం లోని శరభయ్య గుడులలో మందిర ప్రారంభోత్సవ సందర్భం గాశ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి గురువు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారి సద్గురు ఆరాధనోత్సవాలలో శ్రీ ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గారి హరికధ ఏర్పాటు చేశారు .ఆయన రాక ఆలస్యమైతే ఒక అరగంట కచేరి చేయమని తండ్రి గారు ఆశీర్వ దించి  వేదిక ఎక్కి౦చారు .కచేరీ సాగింది .భాగవతార్ వచ్చి మూడుగంటలపాటు ఈ మురళీ కృష్ణ గానం తన్మయంగా వింటూనే ఉండిపోయారు .శ్రోతలు తన్మయత్వం చెందారు. మంత్ర ముగ్ధులయ్యారు .దాసుగారు ‘’ఇంక నేను హరి కధలు చెప్పను .ఈ కుర్రాడిని  ఈ నాటినుంచి బాలమురళీ కృష్ణఅని పిలుద్దాం ‘’అని దీవించారు అప్పటినుంచి మురళీ కృష్ణ బాలమురళీ కృష్ణ అయ్యారు .  బహుశా ఇప్పుడేనేమోశ్రోతగా ఉన్న  శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు తటాలున వేదిక ఎక్కి బాలమురళి ని ప్రశంసిస్తూ మూడు పద్యాలు చెప్పి ఆశీర్వది౦చారట .అందులో ఒక పద్యం ‘’నా వలెనే వృద్దుడవై –నావలెనే కీర్తిగాంచి –నావలెనే శ్రీ దేవి పద భక్తుడవై –భూ వలయము తిరుగు మోయి ‘’  .

త్యాగరాజస్వామి ఆశీర్వాదం

11 వ ఏట తిరువయ్యూరు లో శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవాలకు గురువు పారుపల్లి వారితో బాలమురళి వెళ్ళారు .అక్కడ తాను పాడాల్సిన సమయాన్ని శిష్యుడికిచ్చారు గురువుపారుపల్లి .అంతే జంకూ గొంకూ లేకుండా అనాయాసంగా కచేరీ చేసి అందరి నుంచి అపూర్వ స్పందన అందుకొన్నారు .ఆ సభలో ఉన్న శ్రీమతి బెంగుళూరు నాగ రత్నమ్మగారు బాలమురళి చేయి పట్టుకొని అక్కడేఉన్న శ్రీ త్యాగరాజస్వామి  విగ్రహం పాదాల వద్దకు తీసుకొని వెళ్లి నమస్కారం చేయించి ‘’ఏ నర దృష్టీ సోకకుండా ,జనఘోష లేకుండా ఈ పిల్లవాడిని కాపాడు స్వామీ ‘’అని ప్రార్ధించారు.

కృతి రచనకు శ్రీకారం

14 వ ఏట బెజవాడ సత్యనారాయణ పురం లోని వీరింటి ఎదురుగా ఉన్న దూబ గుంట వారి సత్రం లో కుర్తాలం పీఠాధిపతి శ్రీ శ్రీ విమలానంద భారతీ స్వామి విడిది చేసి ఉన్నారు .బాలమురళి వారిని దర్శించి ఆశీస్సుల౦దు కొని 4 30 బాణీలలో 72 మేళకర్త రాగాలకుఒక్కొక్క కృతి చొప్పున కీర్తన రచనకు శ్రీకారం చుట్టి ,రచించి ‘’జనకరాజ కృతి ‘’అని ఆ గ్రంధానికి పేరు పెట్టారు .యతి ,ప్రాస ,కవితా లక్షణాలను కృతి కీర్తన ,పాట ,పదం జావళీ లలోని భేదాలను ,సృజన రహస్యాలను నేర్పిన తొలిగురువు శరభయ్య గుడుల లో దేవీ ఉపాసకులు పండితులు శ్రీ అప్పయ్య శాస్త్రిగారు .

ఆకాశవాణి ఆర్టిస్ట్

14 వ ఏటనే తమ అపూర్వ సంగీత వైదుష్యం తో ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయ్యారు .1940  నుండి రేడియో ప్రస్థానం కొన సాగించారు . 22 వ ఏట విజయవాడ కేంద్రం లో సంగీత పర్య వేక్షణ శాఖ లో  చేరారు .శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు శ్రీ బాలమురళి ఆనాటి రేడియో సంగీత త్రయం .ఉదయం పూట కార్యక్రమం లో భక్తికి సంబంధించిన ది ఉండాలని చెప్పి మొట్ట మొదటి సారిగా ‘’భక్తి రంజని ‘’ప్రవేశ పెట్టింది బాలమురళీయే .సంగీతం నాటకం,స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ శాఖలు ప్రొడ్యూసర్ పోస్ట్ లు ఏర్పాటు చేయించి ,సమర్ధులను నియమింప జేసిన ఘనత బాలమురళి దే.ఎంకిపాటలు ,రామదాసు ,అన్నమయ్య ,త్యాగరాజు ,సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలకు రాగాలు కూర్చి గానం చేసి చేయించి  శ్రోతలకు పరిచయం చేసి వినిపించారు .’’ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది ‘’అనే అన్నమయ్య కీర్తనకు మొదటి సారిగా స్వర పరచి గానం చేశారు .ఎన్నో తత్వాలకు స్వరకర్త బాలమురళి .’’ఏమీ సేతురా లింగా ‘’వంటివెన్నో ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు .ప్రయాగ రంగ దాసు కీర్తన-‘’రాముడుద్భవించినాడు రఘుకులమ్మున ‘’అనేది ఆయన నోట అపురూప గీతమైంది ‘’పిబరే రామ రసం రసనే ‘’,’’స్థిరసా నహి నహిరే ‘’వంటి సదాశివ బ్రాహ్మేంద్ర కీర్తనలకు స్వర రాగ స్పర్శ కల్పించి చిరస్మరణీయం చేశారు .జయ దేవుని అష్టపదులు స్వాతి తిరుణాల్ కీర్తనలు ,శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల కృతులు ఆయన గానం లో అమృతమయమయ్యాయి .గాయత్రీ రామాయణం ,అమర నారాయణ కీర్తనలను స్వరపరచి ,పాడి, జీవం పోసిన నాదానంద మూర్తి బాలమురళి .ఆయన కాలం లో వచ్చిన యక్షగానాలు ,సంగీత రూపకాలు రసరమ్యాలు .కబీర్ గానటించి సమర్పించిన సంగీత రూపకం శ్రీ  బందా కనకలింగేశ్వర రావు గారి ప్రశంసలను పొందింది .ఆకాశ వాణిలో 9 విభాగాలలో అత్యుత్తమ శ్రేణి సాధించి పెట్టిన ఘనత బాలమురళి దే.అందుకే ఆయన ఆకాశవాణిలో పని చేసిన కాలం ‘’స్వర్ణ యుగం ‘’అన్నారు .

సంగీత కళాశాల స్థాపన –ప్రిన్సిపాల్

విజయవాడలో సంగీత కళాశాల  స్థాపించ వలసిన  అవసరాన్ని గుర్తించి  ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని విధాలా ప్రయత్నం చేసి శ్రీ అన్నవరపు రామస్వామి వంటి వారి సహకారం తో కళాశాల స్థాపనను చేయి౦చ గలిగారు బాలమురళి.  29 ఏళ్ళకే మొట్టమొదటి ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు చేబట్టారు .విద్వత్తుకు తగిన ప్రతిఫలం ఇది .అయితే ఒక్క ఏడాది మాత్రమే పని చేసి 30 వ ఏట రాజీనామా చేసి మద్రాస్ వెళ్ళిపోయారు .విజయవాడలో సత్యనారాయణ పురం లో ‘’మంగళం పల్లి వారి వీధి ‘’ని పురపాలక సంఘం ఏర్పరచి గౌరవించింది .

తమిళనాట విరిసిన తెలుగు తేజం

సర్వశ్రీ సెమ్మంగుడి ,జి యెన్ బాలసుబ్రహ్మణ్యం ,ఎం ఎస్ సుబ్బు లక్ష్మి పట్టమ్మాళ్ వంటి తమిళ సంగీత దిగ్గజాలున్న మద్రాస్ మహా నగరం లో ప్రవేశించిన బాలమురళి అందరినీ మించి స్వీయ ప్రతిభా పాటవాలతో ,అసలు త్యాగరాజ కృతి ని ఎలా పాడి భావాన్ని వెలువరించాలో చూపి అందరి హృదయాలను గెలిచి నిలబడి జయ కేతనం ఎగర వేశారు .ఆనాటి త్యాగ రాజుగారిలా   ఈ నాటి అపర త్యాగబ్రహ్మ తెలుగుకు పట్టాభి షేకం చేశారు .దేశ విదేశాలలో 25 వేల కచేరీలు చేశారంటే మానవ మాత్రునికి సాధ్యమా అని పిస్తుంది .’’వేదిక ఎక్కే దాకా నేను బాల మురళీ నే ‘’కచేరీ ప్రారంభించగానే నేను నేనుకాను .అమ్మ వారు నన్ను నడిపిస్తుంది ‘’అన్నారు ఆయన  మాతో మూడేళ్లక్రితం మద్రాస్ లో వారింటికి వెళ్లి కలిసి మాట్లాడినప్పుడు .అది సత్యమే ..

రాగ సృష్టి

త్రిశక్తి ,ఓంకారి ,లవంగి ,రోహిణి ,కాళిదాస,తరణి ,సర్వశ్రీ ,మనోహర  సుముఖ ,వల్లభి ,ప్రతి మధ్యమావతి, మహతి వంటిఅపూర్వ రాగాల సృష్టికర్త బాలమురళి .అంతే కాదు అవతలివాడిలో ఉన్న ప్రతిభను గుర్తించి అతడిని పైకి తెచ్చే సృష్టికర్త కూడా .శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ మాటలలో  ‘’ఈలపాటలో సిద్ధహస్తుడనని నన్ను గుర్తించి పిలిపించి ఇంట్లో ఉంచుకొని ,తనతో కచేరీలకుతీసుకు వెళ్లి అన్నీ నేర్చు కోనేట్లు  చేసి,కన్నకోడుకులా చూసి నాకు సంగీత భిక్ష పెట్టి నన్ను తీర్చిదిద్దినది బాలమురళీ కృష్ణ గారే ‘’అని పొంగిపోయి చెప్పారు .అందుకే బాలమురళి ని ‘’సృష్టి కర్త ‘’అన్నారాయన .   అలాగే శ్రీ డి .వి ,మోహన కృష్ణ ప్రతిభకూ తగిన ప్రతిఫలం కలిపించారు .

రచన

7 2 మేళ కర్త రాగాలకు 430 బాణీలలో ఒక్కొక్క కృతిని కూర్చి ‘’జనక రాజ కృతి మంజరి ‘’గ్గ్రంథంగా వెలువరించారు బాలమురళి .తన స్వీయ కృతులను ‘’సూర్య కాంతి ‘’పుస్తక౦ గా  తెచ్చారు .ఎన్నో తిల్లానాలకు ప్రాణం పోశారు బాలమురళి అంటే తిల్లానా అని ‘’అల్లానా ‘’అని ఆశ్చర్య పోతాం .

 

.       పురస్కారాలు

బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు మరియు పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:

సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి.కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ,పద్మ భూషణ్ ,పద్మవిభూషణ్ పురస్కారాలు అందజేసింది .ఆయన 75 వ జన్మ దినోత్సవం లో   తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీమతి జయలలిత పాల్గొని బాలమురళి కి ‘’భారత రత్న ‘’ఇవ్వాలని కోరింది .ఆవిడ పేరుమీద ‘’జయజయలలితే ‘’అనే కొత్త రాగాన్ని సృష్టించి పాటరాసి పాడి ఆమెకు అంకితమిచ్చారు  బాలమురళి .ఉత్తమ శాస్త్రీయ ,ఉత్తమ నేపధ్యగాయక ,ఉత్తమ సంగీత దర్శక పురస్కారాలు అంటే మూడు జాతీయ పురస్కారాలు అందుకొన్న ఏకైక వ్యక్తి బాలమురళి  ‘.

సినీ వినీలాకాశం లో

1957 లో బాలమురళి ఎస్ వరలక్ష్మి నిర్మించిన సతీ సావిత్రి చిత్రానికి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పని చేశారు .భక్త ప్రహ్లాదలో నారద పాత్ర పోషించారు .నర్తన శాలలో ‘’సలలిత రాగ సుధారస సారం ‘’గుప్పెడు మనసులు లో ‘’మౌనమే నీ బాస ఓ మూగమనసా’మేఘ సందేశం లో ‘’పాడనా వాణికల్యాణి రాణిగా’’ ముత్యాలముగ్గు అందాలరాముడు ,రామాంజనేయ యుద్ధం  కర్ణ మొదలైన వాటిలో కమ్మని పాటలు పాడారు .కన్నడ చిత్రం ‘’మధ్వా చార్య  ‘’,కు సంగీత దర్శకత్వం వహింఛి ఉత్తమ సంగీత దర్శక అవార్డ్ పొందారు .హంసగీతే కన్నడ చిత్రం లో పాడిన పాటకు  ఉత్తమ నేపధ్యగాయక జాతీయ స్థాయి బహుమతి అందుకున్నారు .సంస్కృతం లో జి .వి. అయ్యర్ తీసిన శంకరాచార్య చిత్రానికి సంగీతం కూర్చారు .’’సందేని సిందూరం ‘’మళయాళ చిత్రం లో కూడా నటించారు . బాల మురళి పాడిన చివరి సినిమాపాట ‘’ప్రభ ‘’అనే తమిళ చిత్రం లో శ్రీదేవి అనే యువ రచయిత్రి రాసి,ఎస్ జే .జనని స్వరపరచిన ‘’పూవే పేసుం –పూవే పూవిన్ ,వాసం నాలం వీనుం వానం ,మరైత్తమేగం తూలియాగ కరైందు పోగుం’’అన్న పాట . ఇది ఆయన చనిపోయేనాటికి ఇంకా రిలీజ్ కాలేదు .,

ప్రత్యేకతలు

మృదంగం వీణ వయోలిన్ వయోలా కంజీర మొదలైన 9 వాయిద్యాలలో బాలమురళి టాప్.తనగాత్రానికి తానే ఏకకాలం లో వయోలిన్ ,మృదంగం వాయిస్తూ రికార్డ్ చేశారు .జి .యెన్. బి .కచేరి కి వయోలిన్ తో సహకారంఅందించారు బాలమురళి . భీమ సేన్ జోషి ,చోరాసియా ,కిశోరీ అమో౦కర్ వంటి ఉత్తరాది సంగీతదిగ్గజాలతో సమానంగా ధాటీగా జుగల్ బందీ నిర్వహించి రికార్డ్ సృష్టించారు .ప్రయోగాలు చేయటం లోనూ అగ్రేసరులే ఆయన . ఫ్రెంచి పాట విని రాసుకొని 10 నిమిషాల్లోపాడి ఆశ్చర్య పరచిన మేధావి .దాన్ని వయోలిన్ పై వాయించమంటే వాయించిన ప్రతిభాశాలి .కలకత్తా లో బెంగాలీ పాటపాడితే విని  75 ఏళ్ళ ఆవిడ వచ్చి ఆనందంగా కౌగిలించుకొని గంతులేస్తూ ‘’గురుదేవ్ టాగూర్ బ్రతికి వచ్చి పాడినట్లు ఉంది ‘’అని మెచ్చుకొన్నది .రవీంద్రుని వద్ద ఆ పాట నేర్చుకొన్న వారిలో బ్రతికి ఉన్నది ఆమె ఒక్కరే నట ,రవీంద్ర సంగీతం భద్రం చేసుకోవటానికి బాలమురళి చేత 30 పాటలు పాడించి రికార్డ్ చేసుకొన్నారు .టాగూర్ తానే సంగీతం కూర్చాడు .ఎవరూ మార్చటానికి వీలు లేదు .రవీంద్రుని శాంతి నికేతన్ బాల మురళి కి మొట్టమొదటిసారిగా ‘’డాక్ట రేట్ ‘’బిరుదు ఇచ్చి సత్కరించింది  .సంగీతం వ్యాధినివారకం అని అనేక ప్రయోగాలు చేసి మ్యూజిక్ ధేరపి కి మార్గ దర్శి అయ్యారు .తమిళనాడు ముఖ్యమంత్రి ఎం .జి .రామ చంద్రన్ జబ్బు పడి కోమాలో ఉంటె వైద్యులు ఇక లాభం లేదని పెదవి విరిస్తే, వెళ్లి చూసి 9 నిమిషాలు మ్యూజిక్ రికార్డ్ చేసి ఇచ్చి దాన్ని వినిపిస్తే హాయిగా ప్రాణం విడుస్తారని చెప్పి బాలమురళి వెళ్ళిపోయారు .మర్నాడు వచ్చి చూస్తే ఎం .జి. ఆర్. కొమాలోంచి బయటపడి హాయిగా కనిపించారట .అవాక్కయ్యారు మురళి .

డా నేడునూరిగంగాధారం గారికి అన్నమయ్య పదాల రాగి రేకులు దొరికితే తీసుకొని వచ్చి బాలమురళి కి ఇచ్చారు అప్పటికి అన్నమయ్య పదాలున్నాయికాని సంగీతం లేదు .బాలమురళి వాటికి సంగీతం కూర్చి మొదటిసారిగా ఆకాశవాణి భక్తీ రంజని కార్యక్రమం లో పాడి వినిపించారు .మద్రాస్ లో  హెచ్. ఏ. ఎల్ .మాజీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రూపొందించిన పోర్టబుల్ ఎలెక్ట్రానిక్ తంబురా ను కచేరీలో వాడిన మొదటి గాయకుడు బాలమురళీ యే .

ఒక సారితిరునల్వేలి లో కచేరీ చేసి కన్యాకుమారికి వెడుతూ ఉంటె దారిలో ఒక పవిత్ర నదికనిపిస్తే నెత్తిన జలం చల్లుకొందామని నీటిలో దిగితే షాక్ కొట్టినట్లు అయిందట. మరో సారి ప్రయత్నం చేసినా అలానే జరిగిందట .ఆయన తో వచ్చినవారికి ఎవరికీ ఏమీ కాలేదు .ఆ విషయం గ్రామస్తులకు తెలియ జేశారు. వారు అక్కడ త్రవ్వితే శ్రీ దుర్గా౦బిక విగ్రహం దొరికింది .దాన్ని ప్రతిష్టించి గుడి కట్టించటానికి బాలమురళి ఉచితంగా కచేరీలు చేసి ధనం సమకూర్చి ఇచ్చారు బాల మురళి పేర ఆడిటోరియం కట్టి ,రాజ గోపురం లో బాలమురళి విగ్రహం ప్రతిష్టించి కృతజ్ఞత తెలియ జేశారట .మద్రాస్ ఆకాశవాణి లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా  ఉంటూనే సంగీతకచేరీలు చేశారు బాలమురళి .తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసులు, తమిళనాడు ప్రభుత్వ కలైమణి గౌరవం పొందారు .ఆయన జీవితం పై పుస్తకాలు వచ్చాయి .

బాలమురళీయం

శ్రీ బాలమురళి గాత్రం ,శ్రీ అన్నవరపు  రామస్వామి వయోలిన్ ,శ్రీ దండమూడి రామమోహనరావు మృదంగం త్రివేణీ సంగమమై శ్రోతలను రసగంగలో స్నానం చేయిస్తుంది .ముగ్గురూ ఎన్నో వేలకచేరీలు కలిసి చేసి రికార్డ్ సృష్టించారు .ఈ త్రయానికి సాటి లేదు అనిపించారు .’’త్యాగరాజ ఆరాధనోత్సవాలను ఎందుకు వ్యతిరేకిస్తారు మీరు’’ ?అని అడిగితే ‘’’’ఆరాధన అంటే మృతి చెందిన రోజు చేసేది .కొత్త చీరలతో సింగారించుకొని ,ఒంటినిండా నగలు దిగేసుకొని వెళ్లి పాడటం సబబుకాదు .కావాలంటే త్యాగయ్య గారు పుట్టిన రోజున ఇంత హడావిడిగా చేసుకోండి పాడండి .’’అన్నారు .అందుకేనేమో అమెరికాలో ఒహాయు రాష్ట్రం లో ప్రతి ఏడాది ఎప్రిల్ నెలలో దేశం లోని అన్ని రాష్ట్రాలనుండి గాయకులూ వచ్చి భక్తిగా త్యాగరాజ సభపెద్ద ఎత్తున నిర్వహించి  గానం చేసి తరిస్తారట .అందులో పాల్గొనటానికి మూడు ,నాలుగు రౌండ్ల ప్రిలిమినరీలు జరుగుతాయట. అందులో క్వాలిఫై అయిన వారే వెళ్లి పాడాట .

‘’  ‘’పంచ ప్రాణాలూ సప్తస్వరాలే ‘’అన్నట్లుగా జీవించారు బాలమురళి .పాట అనుకోవటం,రాగం కూర్చటం ,పాడటం అప్పటికప్పుడు చేసే ‘’సంగీత సర్వజ్ఞుడు ‘’బాలమురళి .ఆయన ‘’తిల్లాన ‘’ఒక తుళ్ళింత ఒక ద్రిల్లింత .ఊగిపోవాల్సిందే .సంగతులు ,సరిగమలు సహజంగా అమరిపోతాయి .సంగీతం పాడుతూ తాను ఆనందిస్తూ,రసజ్నులను ఆనందింప జేయటం, నవ్వుతూ పాడటం బాలమురళి ప్రత్యేకత .ఏ స్థాయిలోనైనా గీర రాకుండా పాడగలిగే దమ్ము ఆయనది. పర్వీన్ సుల్తాన్ తో సరిసాటి .’’అమ్మా !పుట్టగానే మురళీగానమిచ్చి ‘’అంటూ కన్నతల్లిని, పుట్టిన ఊరు శంకర గుప్తం ను గుర్తుఉండి పోయేట్లు ‘’సూర్య కాంతి ‘’రాగాన్ని సృష్టించి దాన్ని ‘’విడువ విడువ నింక ‘’అన్న అన్నమయ్య కీర్తనతో ప్రకాశింప జేసిన సంగీత భానుడు బాలమురళి .

‘’నా కీర్తనలో రాగం భోగం ,మొహం ,స్నేహం ,దోబూచులాడుతాయి .ఆర్తి ,ఆవేదన ,ఆరాటం ,ఆకాంక్ష ,తపన మిళితమై ఉంటాయి ‘’అన్న వాగ్గేయకారుడు బాలమురళి .నాదం లో ఆనందాన్ని పొంది ,పొందించిన నాద బ్రహ్మ. బ్రహ్మానందాన్ని అందించినవారు .అందుకే ఆయన్ను ‘’స్టార్ వాల్యు ఉన్న సంగీత విద్వాంసుడు ‘’అన్నారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .సంకుచిత పరిధిలో ఉన్న సంగీత సరస్వతిని ‘’భారతీయ సంగీతం ‘’గా మార్చి కొత్తమార్గం తొక్కించిన మార్గ దర్శి బాలమురళి .’’సంగీతం నాకు రాదు ,తెలియదు .కాని సంగీతానికి నేను తెలుసు .అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంతకాలం  నేను వాహిక గా ఉంటాను .పాట నా నోట పలుకు తుంది  .నేనొక సంగీత పరికరాన్ని (instrument ) ‘అన్నారాయన .

ఇంత గొప్ప వాగ్గేయకారుడు ,అపర త్యాగబ్రహ్మ, నాదోపాసకులు, గాన గాంధర్వ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ 22-12-16-న 86 వ ఏట  ఏనాడూ ఇంటిదగ్గర కచేరీకి సాధన చేయనివారు మూడు రోజులుగా నెమ్మదిగా సంగీత సాధన చేస్తూ ,అందరినీ చూసుకొంటూ తనకిస్టులైనశ్రీ అన్నవరపు రామస్వామి గారి చేతులను తన చేతులతోపట్టుకొని తుది శ్వాస విడిచారు .హంస పరమహంసలో చేరింది .అందుకే  ఆంధ్ర జ్యోతి దినపత్రిక  ఆయన మరణం పై ‘’ఆధార షడ్జమం అంతర్ధానమైంది .తేనెలు కురిపించే తెలుగు పంచమం మూగ బోయింది . నిషాదం విషాదమైంది .సప్త స్వరాలూ అశ్రు సాగరాలయ్యాయి .మూడు స్వరాల మహతీ రాగం సృస్టికర్తనే కోల్పోయి ,విలపించింది త్రుళ్ళిపడేతిల్లానా ఊపిరి పోయింది .ప్రతిమధ్యమావతి తుది జోలపాడింది .వయోలిన్ ,వయోలా ,వీణ ,మృదంగం అనాధలైనాయి .కర్నాటక సంగీత సామ్రాజ్యం సామ్రాట్టు లేని రాజ్యమైంది .సరిగమలు నివ్వెర పోగా ,గమకాలు తడబడగా, మధుర మంజుల బాలమురళీ గానం మూగబోయింది ‘’అని గొప్పగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించింది .

Inline image 1Inline image 2

పుష్యబహుళపంచమి శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం సందర్భంగా

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-1-17 –ఉయ్యూరు

 

 

Posted in మహానుభావులు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 38-పద్మ విభూషణ్ –గోపీనాధ కవిరాజ్ (1887 -1976 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

38-పద్మ విభూషణ్ –గోపీనాధ కవిరాజ్ (1887 -1976 )

బెంగాల్ తత్వ వేత్త వైకుంఠ నాద కుమారుడే గోపీనాధ కవి రాజ్ .ప్రస్తుత బంగ్లాదేశ్ లోని ఢాకా జిల్లా ధర్మరాయ్ గ్రామం లో  జన్మించాడు .అక్కడే ప్రాధమిక విద్య పూర్తీ చేసి ఢాకా లోని కె.ఎల్.జూబిలీ హై స్కూల్ లో 7 వ తరగతిలో చేరి 10 వ తరగతి పాసై నాడు .ఇంటిపేరు బాగ్చి .కవి రాజ్ ఆయన బిరుదు .

1906  లో జైపూర్ చేరి నాలుగేళ్ళుమహారాజా కాలేజి లో  చదివి డిగ్రీ పాసయ్యాడు .అలహాబాద్ యూని వర్సిటీనుండి ఎం .ఏ. పొందాడు గురువులు మధుసూదన ఓఝా ,షాశ్ధర్ తర్క చూడామణి .తరువాత వారణాసిలోని దేవనాధ పురం చేరి ఎం .ఏ.డిస్టింక్షన్ లో  పాసైనాడు .వారణాసి లో చివరి ఏడాది చదువు ఆర్ధర్ వెనిస్ వద్ద సాగింది . ఆయన ఈయన్ను వారణాసి సంస్క్రుతకాలేజి సరస్వతిభవన్ లైబ్రరీ కి లైబ్రేరియన్ గానియమించాడు  ఈ కాలం లో తంత్ర శాస్త్రం పై దృష్టి పెట్టాడు .వారణాసిలో అనేక తంత్ర శాస్త్రాలను అధ్యయనం చేశాడు .1918 లో శ్రీ విశుద్ధానంద భారతి స్వామిని దర్శించి ,ఆయన టిబెట్ దగ్గర జ్ఞాన్ గంజ్ లో చూపిన యోగ విన్యాసాలకు ఆశ్చర్యపడ్డాడు .

1924 లో సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ అయి,తర్వాత వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి ప్రిన్సిపాల్ అయ్యాడు .సరస్వతి భవన్ గ్రంధమాలకు ఎడిటర్ అయ్యాడు .రిసెర్చ్ మీద అమితాసక్తి ఉండటం ,స్వీయ ఆధ్యాత్మికానుభవ సాధనకోసం స్వచ్చందంగా 1937 లోగురువు విశుద్ధానంద మరణం తర్వాత  పదవీ విరమణ చేశాడు .తర్వాత పూర్తికాలాన్ని తంత్ర సాధన ,పరిశోధనలో గడిపాడు .వారణాసి లోని గురువుగారి ఆశ్రమ సంరక్షణ చేస్తూ ,కాశీ పై అమిత భక్తితో అక్కడే ఉండిపోయాడు .పద్మ విభూషణ్ స్వీకరించటానికి మాత్రమే కాశీని వదిలి వెళ్ళాడు అంతే .అనిర్వణ్అనే విద్వా౦సునితో కలిసి కాశ్మీర్ శైవ మతాన్ని అధ్యయనం చేయటానికే కాలం వెచ్చించాడు .జీవిత చరమాంకం లో1928 లో మొదటి సారి దర్శించిన   మాతా ఆనంద మాయికి  గాఢ  భక్తుడైపోయాడు .

సంస్కృత భాషా సేవకు 1934 లో మహా మహోపాధ్యాయ బిరుదును పొందాడు .తర్వాత వారణాసిలోని వారణాసీయసంస్కృత విశ్వ విద్యాలయం లో నూతనం గా ఏర్పాటు చేసిన ‘’యోగ –తంత్ర డిపార్ట్ మెంట్ కు అధిపతి గా 1964 నుండి 1969 వరకు పని చేశాడు .ఆరోగ్యం సహకరించక పదవికి రాజీనామా చేసి భాడైని ప్రాంతం లో ఉన్న మాతా ఆనంద మాయి ఆశ్రమం లో గడిపాడు . .

తూర్పు బెంగాల్ లో  విద్వద్ వంశానికి  చెందిన కుసుమ కుమారి ని 1900 లో వివాహమాడి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు  .గోపీనాధ కవిరాజ్ 1-భారతీయ సంస్కృతీ ఔర్ సాధన 2-తాన్త్రిక్ వాజ్మి మే శాక్త దృష్టి 3-శ్రీ కృష్ణ ప్రసంగ 4-కాశీకీ సారస్వత్ సాధన 5-పత్రావళి 6-స్వ సంవేదన్ 7-అఖండ మహాయోగేర్ పదే 8-విశుద్ధానంద ప్రసంగ 9-తాన్త్రిక్ సాహిత్య 10-సాదు దర్శన్ ఏవం  సత్ ప్రసంగ .గోపీ నాద కవి రాజ్ పై నాలుగు గ్రంధాలు వెలువడినాయి .

మహా మహోపాధ్యాయ ,పద్మ విభూషణ్ లతోపాటు కవి రాజ్ డి.లిట్,.,సాహిత్య వాచస్పతి ,దేశికోత్తమ ,,సాహిత్య అకాడెమి పురస్కారం ,సాహిత్య అకాడెమి ఫెలోషిప్ అందుకున్నాడు .

12-6-1976 న కవిరాజ్ 89 వ ఏట పరమపదించాడు .కేంద్ర ప్రభుత్వం ఆయన గౌరవార్ధం ప్రత్యేక స్టాంప్ విడుదల చేసింది .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వర్గీయ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ స్మారక నగదు పురస్కార ప్రదానం

Inline image 1  Inline image 2

సరసభారతి 101 వ సమావేశంగా సరసభారతి ,,ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ,ఆరాధనోత్సవం ,మరియు ,అపరత్యాగ బ్రహ్మ మహా వాగ్గేయకారులు ,గాన గంధర్వ స్వర్గీయ శ్రీ  మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  గారి సంస్మరణ సభ శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారి దేవాలయం లో పుష్యబహుళ పంచమి మంగళవారం 17-1-17 సాయంత్రం 6-30 గం  .లకుశ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన  నిర్వ హింపబడుతోంది . రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి ఆధ్వర్యం లో అయిదుగురు గాయనీమణులు త్యాగ రాజపంచరత్న కీర్తనలు ,,బాలమురళీ  కృష్ణ కృతులు గానం చేసి స్వర నివాళి సమర్పిస్తారు .

  శ్రీ బాల మురళి మరణించిన నెల రోజుల లోపుననే , దాదాపు ప్రపంచం లోనే మొట్ట మొదటి సారిగా ”స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ స్మారక పురస్కారం ”ను సరసభారతి ఏర్పాటు చేసి,, మా అమ్మాయి శ్రీమతి కోమలి ,విజయ లక్ష్మి ,శ్రీ సాంబావదాని(అమెరికా ) దంపతుల సౌజన్యం తో ఈ కార్యక్రమం లో గానం చేసిన గాయనీమణులు ఒక్కొక్కరికి 1,11 6 రూపాయలు నగదు పారితోషికాన్ని అంద  జేస్తోంది .ఈ తొలి  నగదు పురస్కారాన్ని స్పాన్సర్ చేసిన వారికి , తొలిపురస్కారాన్ని అందుకో బోతున్న  ,గాయనీమణులకు హార్దిక శుభాభినందనలు  .
  సంగీత ,సాహిత్యాభిమానులందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
                                               గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
                                                జోశ్యుల శ్యామలాదేవి -రోటరీ క్లబ్ అధ్యక్షులు
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 )

విష్ణు తీర్ధ అనబడే అడవి జయ తీర్ధాచార్య  1756 లో జన్మించి 50 సంవత్సరాలుమాత్రమే జీవించి 1806 లో మరణించారు .మహా విద్వాంసుడు, ముని, కవి,మధ్వాచార్య మత గ్రంధ వ్యాఖ్యానకర్త .సావానూర్ దగ్గర సిద్దాపురం లో జన్మించాడు .గురువు సత్యవ్రత తీర్ధ వద్ద సన్యాస స్వీకారం చేశాడు .గురువుగారితో కలిసి బృందావనం సందర్శించి ,కొప్పల్ కు 6 మైళ్ళ దూరం లో ఉన్న మదునూర్ లో తన బృందావనం లో చేరాడు .19 ఉద్గ్రంధాలు రాశాడు అందులో ముఖ్యమైనవి –భాగవత సారోద్ధార ,ఆజ్ఞాపత్ర ,ఆత్మ సుఖ బోధిని ,షోడశి ,చతుర్దశి ,అధ్యాత్మామృత తరంగిణి.

 

37-జాతీయ పండిత పురస్కార గ్రహీత ,ఆధునిక పాణిని  –శివరామ దత్తాత్రేయ జోషి (1926 -2013 )

మహారాష్ట్రలోనికొంకన్ తీర రత్నగిరి కి  చెందిన సంస్కృత మహా విద్వాంసుడు మహా వ్యాకరణ వేత్త శివరామ దత్తాత్రేయ జోషి .కుటుంబం సంస్కృత పండిత కుటుంబం .చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన అభాగ్యుడు .1958 లో కళావతి భగవత్ అనే సహచర విద్యార్ధిని వివాహం చేసుకొన్నాడు .87 ఏళ్ళ వయసులో జోషి 29-7-2013 న మరణించాడు .

ప్రాధమిక విద్య పూనా లో  బాబాయి మహేశ్వర శాస్త్రి  జోషి వద్ద నేర్చాడు .20 ఏళ్ళకే సంస్కృత వ్యాకరణాన్నిమదధించి సారం గ్రోలాడు .బెంగాల్ ,బరోడా ,పూనా యూని వర్సిటీలనుండి అనేక డిగ్రీలు సాధించాడు.పూణే సంస్క్రుతకాలేజిలో లెక్చరర్ గా జీవితం ప్రారంభించి 1947-55 లో ప్రిన్సిపాల్ గా  సేవ చేశాడు .1950 లో డేనియల్ ఇంగాల్స్ వద్ద  టీచర్ గా చేరి ,తన విద్యా సంపత్తితో అభిమానం పొంది ,సంప్రదాయ పద్ధతిలో సంస్కృతం అభ్యసించటం వలన 19 55 లో బి ఏ .చదివి డిగ్రీ పొంది హార్వర్డ్ యూని వర్సిటీలో ఫెలోషిప్ సాధించాడు .1960లో హార్వర్డ్ నుంచి ఇంగాల్స్ గైడ్ గా ‘’సంస్కృత నిఘంటు అర్ధ విచారణ’’(సాంస్క్రిట్ లెక్సికల్ సెమాంటిక్స్ )పై పరిశోధన చేసి పి. హెచ్.డి . పొందాడు.

1960  లో ఇండియాకు తిరిగివచ్చి పూనా దక్కన్ కాలేజిలో సంస్కృత నిఘంటు విభాగం లో చేరాడు .1964 లో పూనా యూని వర్సిటి లో ‘’సెంటర్ ఆఫ్  అడ్వాన్సేడ్ స్టడీ ఇన్ సాంస్క్రిట్’’ లో రీడర్ గా పని చేశాడు .1970  లో సంస్కృత ,ప్రాకృత భాషాశాఖాధ్యక్షుడైనాడు  .1974 నుంచి 1987 వరకు  సెంటర్ ఫర్  అడ్వాన్సేడ్ స్టడీ ఇన్ సాంస్క్రిట్  కు డైరెక్టర్ గా ఉన్నాడు .1987 నుంచి దక్కన్ కాలేజి సంస్క్రుతనిఘంటు ప్రాజెక్ట్ లో పని చేశాడు .1971 నుంచి ఒక ఏడాది హార్వర్డ్ యూని వర్సిటి లోను ,1976-77 లో నాగోయా యూని వర్సిటి విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .

జోషి పతంజలి మహా భాష్యానికి 11 భాగాల వ్యాఖ్యానం రాశాడు .పాణిని వ్యాకరణానికి 15 భాగాల వ్యాఖ్యానమూ రచించాడు .1991లో భారత రాష్ట్ర పతి చేత జాతీయ పండిత పురస్కారాన్ని అందుకున్నాడు. ‘’ఆధునిక పాణిని’’ గా జోషీని భావిస్తారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-17 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 35-సంస్కృత చలన చిత్ర దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

Inline image 1   Inline image 1

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

35-సంస్కృత చలన చిత్ర  దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 )

సంస్కృతాన్ని రచనలద్వారా వ్యాప్తి చెందించిన వారినీ, నాటక ప్రదర్శనల ద్వారా వ్యాప్తి చెందించిన ఎందరి గురించో తెలుసుకొన్నాం .ఇప్పుడు మహానుభావుల చలన చిత్రాలను సంస్కృతం లో నిర్మించిన సంస్కృత భాషా వ్యాప్తి చేసిన డా.జి.వి.అయ్యర్ జీవిత విశేషాలను గురించి తెలుసుకొందాం .

గణపతి వెంకట రమణ అయ్యర్ అంటే ఎవరికీ తెలియదు .జి వి అయ్యర్ అంటే చాలామందికి తెలుసు .సంస్కృత చలన చిత్ర నటుడు దర్శకుడు అయిన అయ్యర్ 3-9-1917 న కర్ణాటకలోమైసూర్ జిల్లా నంజన్ గూడ లో జన్మించాడు .భారతీయ చలన చిత్ర దర్శకులలో సంస్కృత చలన చిత్రాలను నిర్మించి దర్శకత్వం చేసిన ఒకే ఒక్కడు అయ్యర్ .అందుకనే ఆయనను ‘’ ‘’కన్నడ భీష్మ’’ అంటారు .8 వ ఏటనే గుబ్బి వీరన్న దియేటర్ గ్రూప్ లో చేరి నటుడయ్యాడు.’’రాధారమణ’’ సినిమాలో మొదటి సారిగా నటించి సినీ నటుడయ్యాడు .తరువాత మహా కవి కాళిదాసు  ,సోదరి ,హేమావతి ,హరి భక్త ,బేదర కన్నప్ప మొదలైన సినిమాలలో నటించాడు .

అయ్యర్ ఆ తర్వాత స్వంతంగా సినిమాలకు దర్శకత్వం చేయాలని భావించి ‘’హంస గీతే ‘’అనే కన్నడ  సినిమాను డైరెక్ట్ చేశాడు .దీనికి డా మంగళం పల్లి బాల మురళీ కృష్ణ సంగీత దర్శకత్వం చేశారు. టి .జి .లింగప్ప ,బి .వి.కారంత్ మొదలైన వారు నటించారు .ఈసినిమా విపరీతం గా విజయం సాధించి అందరికి  మంచి పేరు తెచ్చింది అయ్యర్ కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది .ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు .కదా ,స్క్రీన్ ప్లే ,డైలాగ్స్అన్నీ తానే సమకూర్చుకొని  అయ్యర్ .వరుసగా చాలా కన్నడ సినిమాలు తీశాడు,డైరెక్ట్ చేశాడు  .ఆయన గొప్ప చిత్రం ‘’రణధీర్ కంఠీరవ’’.1970  వరకు కమ్మర్షియల్ చిత్రాలే తీశాడు .

కన్నడ ,సంస్కృతాలలో గొప్ప పాండిత్యం ఉన్న అయ్యర్ దృష్టి సంస్కృత చిత్రాపై పడింది .1983 లో మొట్టమొదటి సారిగా ‘’ఆది శంకరాచార్య ‘’సంస్కృత సినిమా డైరెక్ట్ చేశాడు .ఈ సినిమా జాతీయ స్థాయి లో ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే,ఉత్తమ సినిమాటోగ్రఫీ,ఉత్తమ ఆడియోగ్రఫీ  లకు బహుమతులను అందుకున్నది .కళాఖండం గా ఈ సంస్కృత చిత్రం చిర స్థాయిగా నిలిచి పోయింది .అయ్యర్ ప్రతిభ అందర్నీ అప్రతిభులను చేసింది .ఈ సినిమా అయ్యర్ పై గొప్ప ప్రభావం చూపింది .ఈ సినిమా తీసిన తర్వాత అయ్యర్ జీవన విధానమే మారిపోయి చెప్పులు వేసుకోవటం కూడా మానేశాడు .

తర్వాత కన్నడం లో ‘’మాధవా చార్య ‘’తమిళం లో ‘’రామానుజాచార్య ‘’సినిమాలు తీశాడు అయ్యర్ .1933 లో సంస్కృతం లో రెండవ సినిమాగా ‘’భగవద్గీత ‘’తీశాడు .ఇది ఉత్తమ చిత్రం గా జాతీయ స్థాయిలో బహుమతి పొందింది .ఇది ‘’బగోటా ఫిలిం ఫెస్టివల్ ‘’లో ప్రదర్శింప బడింది .

అయ్యర్ కొన్ని టెలివిజన్ సీరియల్స్ తీశాడు అందులో ‘’నాట్య రాణి శాంతల ‘’అనేది హోయసల రాణి శాంతల పై నిర్మించిన చారిత్రాత్మక సీరియల్ .ఆమెను వైష్ణవ రాజు కిచ్చి వివాహం చేశారు .దీన్ని హిందీ,కన్నడ భాషలలో లోనూ తీశారు .

స్వామి వివేకానంద జీవితాన్నిహిందీ  చలన చిత్రంగా నిర్మించాలనినిశ్చ యించుకొన్న అయ్యర్ మిదున్ చక్రవర్తిని శ్రీ రామ కృష్ణ పరమ హంస  పాత్రకు ఎంపిక చేసి నటి౦ప చేశాడు .మిదున్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా జాతీయ బహుమతి వచ్చింది .మిదున్ –పరమహంసగా తన నటనా విశ్వ రూపాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నాడు .సర్వదమన బెనర్జీ వివేకానండునిగా నటించాడు. హేమామాలినికూడా ఉంది . కాని ఈ సినిమా కమ్మర్షియల్ సక్సెస్   పొందలేదు.

సంజయ దత్తును రావణాసుర పాత్రగా రామాయణాన్ని తీయాలని సంకల్పించాడు అయ్యర్ .దురదృష్ట వశాత్తు అయ్యర్ 21-12- 2003 న 87వ ఏట అకస్మాత్తు గా మరణించాడు . బెంగళూర్ దగ్గర కేంగేరి లో దొడ్డ అలదమార దగ్గరున్న భరద్వాజ ఆశ్రమం లో అయ్యర్ అంత్యక్రియలు నిర్వహించారు .

అయ్యర్ మొత్తం  మీద  రెండు సంస్కృత ,ఒక హిందీ ,ఒక తమిళ చిత్రాలను ,23 కన్నడ చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించాడు .2001 లో కృష్ణ లీల తీయాలని ప్రయత్నించాడు .10 సినిమాలో అయ్యర్ నటుడుగా నటించి రాణించాడు .

Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-17-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి

హర్యానాలో జగద్రిఅంటే నేటి హర్యానాలో  1943 –లో జన్మించి 1915 లో 82 వ ఏట మరణించిన ‘’చులికీకృత పాణిని వ్యాకరణ పారావారాన్నిధి’’హరనామ దత్త శాస్త్రి .తండ్రి మురారి దత్తు .వారణాసిలో సంస్కృతం చదివి’’ భాష్యాచార్య ‘’అంటే సంస్కృత భాషా శాస్త్రం వ్యాకరణ శాస్త్రనియమాలను క్షుణ్ణంగా బోధించ గలిగే సామర్ధ్యం ఉన్న మహా పండితుడు అయ్యాడు .తరువాత రాజస్థాన్ లోని’’ చురు ‘’  లో పాణిని వ్యాకరణ బోధనలో మహా నిష్ణాతుడనే పేరు పొందాడు .చూరులో తానే తనతాత గారి పేరుమీద ‘’పండిట్ హరనామ దత్త శాస్త్రి సంస్కృత పాఠశాల’’  నిర్మించి పాణిని వ్యాకరణ బోధనకు ప్రాశస్త్యం తెచ్చాడు .ఆయన శిష్యులలో ప్రసిద్ధమైనవారు శ్రీ గిరిధర్ శర్మ చతుర్వేది ,విద్యావాచాస్పతి బాలచంద్ర జి ,పండిట్ రామానంద జీ మహా రాజ్ ,పండిట్ జైదేవ్ జి మిశ్ర ,పండిట్ విలాస రాయ్ జీ ఉన్నారు .

తాత  హరనాధ దత్త జీవిత విశేషాలపై  పై శిష్యుడు విద్యా వాచస్పతి విద్యాధర శాస్త్రి ‘’హరనామామృతం ‘’అనే సంస్కృత మహాకావ్యం రచించాడు . .ఆధునిక సంస్కృత కావ్యం ఎలా ఉండాలో కవి తన రచన ద్వారా తెలియజేశాడు .ఇందులో 16 కా౦డలున్నాయి . ఆయన జీవిత విశేషాలు,యాత్రలు ,పాఠశాల స్థాపన, విద్యా వ్యాప్తి ,సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణం వగైరాలు చాలా కవితాత్మకంగా వర్ణించాడు కవి  .

Inline image 1

సశేషం

కనుమ పండుగ శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-17 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

15-1-17 ఆదివారం ఉదయం కనుమ నాడు మా ఇంట్లో శ్రీమతి మల్లికాంబ గారు కుమార్తె శ్రీమతి జయలక్ష్మి

15-1-17 ఆదివారం ఉదయం కనుమ నాడు మా ఇంట్లో శ్రీమతి మల్లికాంబ గారు కుమార్తె శ్రీమతి జయలక్ష్మి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982  )

కృష్ణ కాంత హా౦డీక్ అస్సాం రాష్ట్రం లో జోర్హాట్ నగరం లో ‘’టాల్ అహం ‘’వంశం లో20-7-1898 న  జన్మించాడు. తండ్రి రాజ బహదూర్ తారాకాంత హాండీక్.గౌహతిలోని కాటన్ కాలేజి , కలకత్తా సంస్కృత కాలేజి ,కలకత్తా ,ఆక్సఫర్డ్ బెర్లిన్  యూని వర్సిటీలలో 1913 నుంచి 1927 వరకు  లో చదివి గ్రీక్ ,లాటిన్ ,ఫ్రెంచ్, జెర్మని ,రష్యన్ ,ఇటాలియన్ ,స్పానిష్ మొదలైన 8 విదేశీ భాషలలోను ,సంస్కృత , ప్రాకృత ,పాళీ మొదలైన 5 స్వదేశీ భాషలలోనుమొత్తం 13 భాషలలో  భాషా వేత్త అయ్యాడు .

హా౦డీక్- గౌహతి యూని వర్సిటి వ్యవస్థాపక వైస్ చాన్సెలర్ గా 1948- నుండి 57 వరకు తొమ్మిదేళ్ళు పని చేశాడు .దీనికి ముందు జోర్హట్ లో జే. బి .కాలేజి వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా1930- నుండి 48 వరకు 8 ఏళ్ళు ఉన్నాడు .జోర్హాట్ లో హేమలత హా౦డీక్ మెమోరియల్ ఇన్ స్టి ట్యూట్ ను స్థాపించాడు . అనేక విద్యా సంస్థల స్థాపనకు చేయూత నిచ్చాడు. విద్యా వ్యాప్తికి హాండీక్ కృషి అద్వితీయం .తాను సేకరించిన 11 ప్రపంచ భాషలలోని అరుదైన గ్రంధాలను గౌహతి యూని వర్సిటికి ధారాదత్తం చేసి అందరికి అందుబాటులోకి తెచ్చాడు .వీటి కాపీ రైట్ హక్కులను పూనా లోని దక్కన్ కాలేజి పి. జి. అండ్ రిసెర్చ్ సెంటర్ కు ,మహారాష్ట్ర లోని జైన సంరక్షా సంఘ్ కు ,అహమ్మదాబాద్ లోని ప్రాకృత టెస్ట్ సొసైటీకి అందజేశాడు .

1937 లో గౌహతి లో జరిగిన అస్సాం సాహిత్య సభకు 39 ఏళ్ళ వయసులో హాండీక్ అధ్యక్షునిగా వ్యవహరించి తన దక్షతను నిరూపించుకొన్నాడు .1951 లో లక్నో లో జరిగిన 16 వ ఆల్ ఇండియా ఓరి యెంటల్ కాన్ఫ రెన్స్ లో క్లాసికల్ సాంస్క్రిట్ విభాగానికి ప్రెసిడెంట్ గా ఉన్నాడు .1961 లో శ్రీనగర్ లో జరిగిన ఈ సభకు జనరల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు .7-6-1982 న  94 వ ఏట మరణించాడు .ముఖ్యమైన మూడు  గ్రంధ రచనలను చేశాడు -1-శ్రీ హర్షుని నైషధ చరిత -2-యశస్టికా అండ్ ఇండియన్ కల్చర్ 3-ప్రవర సేనాస్ సేతు బంధ .

అస్సాం  కు చెందిన సంస్కృత విద్వాంసుడు ,ఇండాలజిస్ట్ ,బహుభాషా వేత్త ,వితరణ శీలి అయిన కృష్ణ కాంత హాండీక్ సేవలకు భారత ప్రభుత్వం 1955 లో పద్మశ్రీ ,1967 లో పద్మ భూషణ్ పురస్కారాలు అందజేసి, సత్కరించి, గౌరవించింది.

Inline image 1

సశేషం

కనుమ శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్  -15-1-17 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమృతం ,అలాంటిదే ఫన్ బకెట్

హాస్య సాహితీ బంధు వులకు కనుము శుభాకాంక్షలు -ప్రతిరోజురాత్రి 9-30కు ఈ టివి లో అమృతం మళ్ళీ సీరియల్ గా  వస్తోంది .హాస్యానికి అమాయకత్వాన్ని జోడించి కిచెప్పిన గొప్ప సీరియల్ అది .చాలా విజయవంతం అయింది .దాన్ని” విజయ గుర్రం” పై నడిపించిన” గుణ్ణం” గారికి, అద్భుత పాత్రపోషణ చేసిన నటులకు, డైలాగ్ రచయితకు అభినందన శతం .హాస్యాన్ని ఈ సీరియల్ చిరంజీవి ని చేసింది .కనుక  పడుకొనే ముందు  ఒక సారి అమృతం రోజూ చూసి మనసు హాయిగా నవ్వుకొని నిద్రపోండి .

 అలాగే తెలుగు వన్ లో వచ్చే ”ఫన్  బకెట్ ”కూడా కొత్త ఒరవడి సృష్టించింది .కంప్యూటర్ యుగానికి జోడించి ఇందులోనూ అమాయక చక్రవర్తులనూ పరిచయం చేసి సభ్య హాస్యాన్ని నటులు దర్శకుడు కురిపించారు . హాయైన హాస్యాన్ని అనుభవించి ప్రోత్సహించండి .దీన్ని ”యు ట్యూబ్ ”లోనూ చూడవచ్చు .
  ”మహాతల్లి ”అనే సీరియల్ కూడా ఒకే ఒక అమ్మాయి మిగిలిన వారిని పాత్రలు చేసి చక్కగా నటిస్తూ హాస్యపు జల్లు కురిపిస్తోంది .నటన యెంత తేలికో ఈ సీరియల్ చూస్తే తెలుస్తుంది .
 మరో నవ్వు సీరియల్ ”చికాగో సుబ్బారావు ”సరదాగా సమకాలీనంగా సాగే హాస్య కధనం .కొత్తవాళ్లలోని టేలెంట్ కు ఇది అద్ధం  పడుతోంది ”.తల్లి ”ని” సుబ్బారావు”ను యు ట్యూబ్ లో చూడచ్చు .
 ఈ సీరియళ్లు తీసినవారుకాని ,నటించి దర్శకత్వం చేసిన వారు కానీ, రాసిన వారుకాని, నాకు ఎవరూ తెలిసిన వారు కాదు, బంధువులూ కారు అని గుర్తించండి .ప్రతిభ ,ఆనందమే వీటిని చూడమని మీకు చెప్పటానికి నన్ను ప్రోత్సహించాయి  . హాస్యో రక్షతి రక్షితః -దుర్గా ప్రసాద్ .
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు

2-1-1925 న కాశ్మీర్ లోని శ్రీ నగర్ లో నీలకంఠ గుర్తు జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో  అడ్వాన్సేడ్ సాంస్క్రిట్ వ్యాకరణం ,భాషా సాహిత్యాలలో పాండిత్యాన్ని పండిట్ లాల్ కాల్ లాంగూ ,,పండిట్ హరిభట్ట శాస్త్రి ,పండిట్ సర్వ దనద హాన్డూ,పండిట్ మహేశ్వర నాద నెహ్రు ,పండిట్ జానకి నాధ దార్ వంటి ప్రసిద్ధ గురువుల వద్ద అభ్యసించాడు .సంస్కృతం లో వరుసగా ప్రజ్న ,విశారద ,శాస్త్రి డిగ్రీలను శ్రీనగర్ సంస్కృత యూని వర్సిటి నుండి పొందాడు .ప్రభాకర్ డిగ్రీ సాధించాక ,సంస్కృతం లో బి. ఏ .కూడా అందుకొన్నాడు . సంస్కృత శైవ సాహిత్యాన్ని పండిట్ బాలాజీ నాధ ,పండిట్ స్వామి, లక్ష్మణ్ జు ల వద్ద అభ్యసించి ప్రావీణ్యం సాధించాడు .

కాశ్మీర్ లోని త్రాల్ లో  ఉన్న ప్రభుత్వ సంస్కృత విద్యాలయం లో సంస్కృత టీచర్ గా ఉద్యోగం ప్రారంభించి ఉద్యోగం చేస్తూనే సంస్కృత  హిందీలలో ఎం .ఏ .చదివి పాసైనాడు . జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ రిసెర్చ్ ,ప్రచురణ విభాగం లో సోయేర్ కాలేజి,అమర్ సింగ్ కాలేజి లలకు  పని చేశాడు . ‘’గుర్తు’’ 18-12-2008 న అల్జీమర్స్ వ్యాధి తో మరణించాడు అనేక తీపి’’ గుర్తు’’లను మిగిల్చి .

గుర్తు సాధించిన సాహితీ విజయాలు అద్భుతమైనవి .సంస్కృత సాహిత్యం లోని చాలా వాటిని హిందీలోకి అనువదించాడు .అందులో ముఖ్యమైనవి –పరాత్రిశక వివరణ ను హిందీ వ్యాఖ్యానంతో ప్రచురించాడు .స్పందకారికను కల్లట వ్రుత్తి తోను ,హరేశ్వర మహాత్మ్యం ను ఆంగ్లానువాదం తోను ,పరమార్ధ సారం ను హిందీ వ్యాఖ్యతో ,సాంబ పంచాశిక ను క్షేమరాజ వ్యాఖ్యతోను ,ఉత్పలదేవుని శివ స్తోత్రావలి ని క్షేమరాజ వ్యాఖ్యానం తో ,సంస్కృత హిందీ భాషలలో ,క్షేమరాజు రాసిన పర ప్రవేశిక కు కాశ్మీరీ భాషలో వివరణ ,కాశ్మీర శైవ దర్శన బృహత్ కోశం ను రెండుభాగాలుగా ‘’నీలకంఠ గుర్తు’’ గుర్తుండి పోయేలా వెలువరించాడు ,కీర్తి గుర్తు మిగిల్చాడు .

సశేషం

సంక్రాంతి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-1-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 31-పద్మశ్రీ వేద కుమారి ఘాయ్

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

31-పద్మశ్రీ వేద కుమారి  ఘాయ్

16-12-19 31 న జమ్మూలో ప్రతాప్ మొహల్లా లో జన్మించిన వేద కుమారి ఘాయ్ పాఠ శాల విద్య జమ్మూలోనే పూర్తి చేసి ,పంజాబ్ యూని వర్సిటి నుంచి 1953  సంస్కృతం లో ఎం .ఏ .పాసై,భారతీయ ప్రాచీన చరిత్ర ,సంస్కృతీ లో కూడా 1958 లో ఎం. ఏ ,పాసై ,బెనారస్ హిందూ యూని వర్సిటి నుండి సంస్కృతం లో 1960 లో పి .హెచ్. డి.సాధించింది .సంస్కృత విద్వాంసుడైన రాం ప్రతాప్ ను వివాహమాడింది .

జమ్మూలోని పెరేడ్ లో ఉన్న మహిళా ప్రభుత్వ కళాశాలలో సంస్కృత లెక్చరర్ గా వ్రుత్తి లో ప్రవేశించి ,జమ్మూ యూని వర్సిటి లోని పోస్ట్ గ్రాడ్యు యేట్ స్థాయి సంస్కృత శాఖ హెడ్ గా 31-12-1991 న రిటైర్ అయ్యేవరకు పని చేసింది .1966 -67.లోను, 1978 -80కాలం లోను   డెన్మార్క్ లోని కోపెంహాగ్ యూని వర్సిటి ఇన్ స్టి ట్యూట్ లో లెక్చరర్ గా సంస్కృత పాణిని వ్యాకరణాన్ని ,సాహిత్యాన్ని బోధించింది .ఆమె డోగ్రి భాష లో మహా విద్వాంసురాలు .హిందీలోను పండితురాలు .సాంఘిక సేవలోను వేదకుమారి ముందున్నది .అమరనాధ దేవాలయం బోర్డ్ లో ఆమె సభ్యురాలు కూడా .

వేదకుమారి ఘాయ్  సంస్కృత విద్వత్తు కు కేంద్రప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందజేసి సత్కరించింది .భారత రాష్ట్రపతి గౌరవ పురస్కారమూ అందుకున్నది .సామాజిక సేవకు గుర్తింపు లభించి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్వర్ణ పతాకాన్ని అందజేసింది .1997 లో సంస్కృత సేవకు ప్రెసిడెంట్ అవార్డ్ లభించింది .2005 లో ‘’డోగ్రా రత్న ‘’,2009 లో జీవిత సాఫల్య పురస్కారం ,2010 లో ’’స్త్రీ శక్తి పురస్కారం ‘’అందుకున్న విదుషీమణి వేద కుమారి ఘాయ్ .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-1-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

త్యాగరాజ ,బాలమురళి లకు స్వర నివాళి -సరసభారతి -101 వ సమావేశం

సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవం ,అపరత్యాగరాజు స్వర్గీయ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ –స్వర నివాళి

సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 101 వ సమావేశంగా సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ఆరాధనోత్సవం ,అపర త్యాగ రాజు స్వర్గీయ శ్రీ బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ 17-1-17 మంగళవారం సాయంత్రం 6-30 గం లకు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో నిర్వ హింపబడుతోంది .సరసభారతి  గౌరవాధ్యక్షురాలు ,రోటరీ క్లబ్ ప్రెసిడెంట్,సంగీత మర్మజ్ఞులు  శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి గారి ఆధ్వర్యంలో ప్రముఖ గాయకులు శ్రీమతి శాంతిశ్రీ ,శ్రీమతి విజయ ,మరియు ఔత్సాహిక గాయకులు  శ్రీమతి పద్మజ ,మొదలైన వారు  పంచరత్న కీర్తనలు గానం చేసి ,స్వర నివాళి సమర్పిస్తారు .సంగీత ,సాహిత్యాభిమాను లందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .

సంక్రాంతి శుభాకాంక్షలతో

గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బర్మాదేశంలో తెలుగుభోధన.

ఎర్ర నాయుడు గారికి ఈ group లో గల తెలుగు బాంధవులకు, మేధావులందరికి నమస్కారం. తెలుగు తీరైన భాష. పలకడం తేలిక. కేవలం పెదాలు, నాలుక ఉపయోగించి దాదాపుగ అన్ని పదాలు పలకొచ్చు. ముక్కు, చెవులు, నాభి నుండి ఊపిరి మొదలైన వాట్ని ఉపయోగించి అధిక శక్తి నుపయోగించ నవసరం లేకుండ పలకొచ్చు. ఉదాహరణకు “ష” అనే పలుకుకు ఇంగ్లీష్  special,ocean,patient, shall, shunt, shirt ,mission, machine లో ఎన్ని spellings ఉన్నాయో గమనించండి. అలాగే  “పంతులు” అనే పదం తమిళంలో రాస్తే “బంతులు” “పందులు” “బందులు” “పంతులు” అని 4 రకాలుగ చదవచ్చు. భాషే కాకుండ తెలుగు లిపి కూడ తెలివిగ రూపొందించబడిందని అనిపిస్తుంది.

ఉదాహరణకు అన్ని గుడి అక్షరాలకు వలె “యి”కి గుడి గుర్తు ఉండదు. ఒక వేళ గుడి గుర్తు ఉంటే  “య” లో ని సున్న పొరబాటున చిన్నదిగ రాస్తే  “మి” అని చది వే అవకాశం ఉంది. బహుశా అందుకని గుడి తీసి వేసి ఉంటారు. కన్నడ లో ఇప్పటికీ వారు “యి” కి వాడతారు. అలాగే “ద-ధ” “ప-ఫ” వంటి కొన్ని అల్ప, మహా ప్రాణులకు ఏక రూపాక్షరాలుంటాయి. ఐతే “బ-భ”  లలో “బ” తలకట్టుండదు.ఒక వేళ తలకట్టుంటే కొద్ది తేడాతో (రాతలో)”చ” గ పొరబడే అవకాశముంది. అలాగే “మనయవరలకత”లకు మాత్రమే ఒత్తు అక్షరాలు వేరుగ ఉంటాయి. మిగిలిన వాటికి తలకట్టు రహిత అక్షరాలనే ఒత్తు అక్షరాలుగ ఉన్నాయి.ఎందుకంటే వాడుకలో 80%—90% ద్విత్వ, సంయుక్తాక్షరాలు ఈ అక్షరాలలోనే ఉంటాయి. అంటే ఎక్కువగా పునరావృతమయ్యే ఒత్తక్షరాలకు అక్షరమంతా రాసి సమయంవృథా చేయకుండు నట్లు లిపి రూపకల్పన జరిగినట్లుగ మనం భావించవచ్చు. అలాగే మీరు జాగ్రత్తగ గమనించండి గుణింతాలకు ఉపయోగించే అచ్చుల గుర్తులన్నీ కూడ ఆ అచ్చులలోనే నిబిడీకృతమై ఉన్నాయి. ఈ మెయిల్ కింద పొందుపరిచిన చార్టును గమనించండి మీకే అర్థం ఔతుంది. ఈ ప్రక్రియ మనకు తెలిసిన( తమిళ, కన్నడ, మళయాళ, హిందీ) భాషలలో కనబడదు. మన తెలుగు లోనే కనబడుతుంది. కేవలం మనతెలుగే కాకుండ ఏ ఇతర భాషలనైన తేలికగ నేర్చుకొనే వెసులుబాటుతో లిపి రూపకల్పన జరిగిందని కొందరంటారు.  విశ్వభాషగ పరిగణింపబడే సంస్క ృతం కంప్యూటర్ భాష అనువైనదిగ చెబుతారు. మరి అలాంటి సంస్క ృత భాష అక్షరాలకంటే కూడ ఇంకా ఎక్కువ మన తెలుగులో ఉన్నాయంటారు. అందుకే గాబోలు తెలుగు వాడు ప్రపంచంలోని ఏ భాషనైనా సులభంగా నేర్చు కొని వారిలాగే పలకగలుగుతున్నాడనిపిస్తుంది.

ఇన్ని విశిష్ఠతలున్న మనతెలుగు భాషను మన చిన్నారులకు నేర్పలేక పోతున్నామంటే నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. తప్పుల్లేకుండ ప్రశ్నపత్రాన్నే  రూపొందించుకోలేక పోతున్న మనం టెక్స్ట్ బుక్ప్ నెలా రూపొందించుకొంటాం. కాకపోతే ఉద్యోగార్థులు ప్రశ్నలకు సమాధానాలు రాస్తారు కాబట్టి తప్పులు దొరుకుతున్నాయి. మరి టెక్స్ట బుక్సో. మరి అదే పిల్లలు మూగజీవాల్లా బలైపోతున్నారు. అసలైన మేధావులు అడుగున ఉండి పోయి  సూడో మేధావులు అందలెక్కడం వలననే ఇలాంటి పాట్లు జరుగుతున్నాయి.ఒకటో తరగతి తెలుగు వాచకం మీకు అందుబాటులో ఉంటే ఒక సారి చూడండి. “ఇ”  వేరు దాని గుణింతపు గుర్తు గుడి(ం) వేరన్నట్లుగ  ముందు గుడి(ం)మీద తరువాత “ఇ”మీదపాఠాలు రూపొందించారు. రెండవ తరగతిలోనే గుణింత సహిత సంయుక్తాక్షర ప్రక్రియ ఒక తంతులా పూర్తి చేశారు. మూడో తరగతి చివరగాని ఆ ప్రక్రియ అర్థం కాదు.ఇవి కొన్ని ఉదాహరణలు  మాత్రమే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వయోజన శాఖ వారు రూపొందించిన “చదువుకొందాం-1 & 2” చూడండి. అచ్చుల గుర్తులు పరిచయం చేసేటప్పుడు ఔత్వం(ౌ) గుర్తే పరిచయబడలేదు. మరి వారికి చదువెలా అబ్బుతుంది. ఇక అద్యాపకుల ప్రతిభ పైనే విద్యార్థుల భవిత ఆధారపడుతుంది. ఐతే తుపాకే పుచ్చుదైతే సైనికుడేం చేయగల్గుతాడు.

అందుకనే నేను అన్నీ సమీక్ష చేసుకొని ఒక క్రమ పద్ధతిలో పాఠాలు తయారు చేశాను. అంటే  అచ్చుల క్రమంలో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడిదీర్ఘం……… విధంగా రూపొందించాను
1.పాఠం- అచ్చులు హల్లుల పరిచయం+100 పైగా పదాలు
2.పాఠం-పై పాఠం అక్షరాలు+ దీర్ఘాక్షరాలు వాటి పదాలు
3.పాఠం-అచ్చులు+హల్లులు+దీర్ఘాక్షరాలు+గుడి అక్షరాలు పదాలు
ఇ లా 14 పాఠాలుంటాయి. నేనిప్పటికే పెద్దవారిపై అమలు పరచి చూశాను. రోజుకు 2 గం॥ చొ॥న  30 రోజులలో చదవ గల్గుతున్నారు. పిల్లలకైతే మరో 15 రోజులు పట్టవచ్చు. వారికి రాయడం కూడ అభ్యాసం చేయించాలి కాబట్టి. ఈ క్రింద 4 పట్టికలు పొందు పరుస్తున్నాను. చూడండి. 1వది సమగ్ర వర్ణ పట్టిక. జాగ్రత్తగ గమనించండి.అందులో అచ్చుల్లోనే గుణింత గుర్తులు నిబిడీకృతమై ఉండడం, సారూప్యత లేని గుణింతాక్షరాలు వేరే రంగులో చూపడం, తేడాగా ఉండే “మనయవరలకత” ల  ఒత్తక్షరాలు చూపడం జరిగింది.2,3 పాఠాలు దీర్ఘం, గుడి అక్షర పదాల పట్టికలు

భవదీయుడు
ఆనంద నాయుడు.వై
ఏలూరు.

Posted in సేకరణలు | Tagged | Leave a comment

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే )

నాకూ ఓ చాన్స్ ఇవ్వండి (సరదా కోసమే )

మాంచి నిద్రలో ఉన్నా .సెల్ మోగింది .ఎవరో గ్రీటింగ్స్ చెబుతున్నారేమోనని ఎత్తా .’’సార్ నమస్తే ‘’అంది అవతలి ఆడ గొంతు .’’నమస్తే అమ్మా ఎవరు మీరు ఏంకావాలి ?’’అన్నా .’’రేపు మీరు సంక్రాంతి కవి సమ్మేళనం పెడుతున్నారని తెలిసింది .నాకూ ఒక చాన్స్ ఇవ్వండి ప్లీజ్ ‘’అన్నది ఆమె .’’అమ్మా మీ పేరు వగైరా చెప్పండి ‘’అన్నా .’’నా పేరు జాకీ రాణి .చాలా సభల్లో కవిత్వం వినిపించా .ఏ టాపిక్ అయినా దంచేస్స్తా .’’అంది .’’దంపుడూ ,రుబ్బుడూ వద్దుకాని ,నీతో నాకు ఇదివరకు పరిచయం లేదు కదా అందుకని అడిగా .దేనిమీదైనా రాస్తానన్నావు కనుక నాలుగు లైన్లు ‘’ఆటో ‘’మీద వినిపించు అన్నా .’’ఒకే సార్ –వినండి –‘’తోలుతుంటే వాడు ఆటో –చెప్పాలనిపిస్తుంది రైటో –వాడు చెప్పే రేటో –వింటే రక్త పోటో ‘’.అన్నది  ‘’ఎలా ఉంది  సార్’’అడిగింది .’’నీ కవిత వింటే గుండె పొటే’’అని ఫోన్ పెట్టేశా .కాసేపు మాగన్నుగా కునికా .మళ్ళీ రింగ్ రింగ్ .’’ఎవరు ?’’అడిగా .’’నేను త్రిజటా రావు సార్.మీ కవి సమ్మేళనం లో నాకు చాన్స్ ఇవ్వండి ‘’అన్నది అవతలి గొంతు .’’ఇంతకీ మీరు పురుషా స్త్రీయా ?’’సందేహం గా అడిగా ‘’మగోణ్ణే. సబ్జెక్ట్ మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా ‘’అన్నాడు అదేదో సినిమాలో వేణుమాధవ్ ఇంటర్వ్యు లో ఎం ఎస్  నారాయణ ను అడిగినట్లు .’’నీ కెందుకు శ్రమకాని అబ్బాయా .’’నోట్ల రద్దు మీద కవిత గుద్దు ‘’అన్నా ‘’పెద్దనోట్లు రద్దు –మోదీకేమో బలే ముద్దు –మనకేమో నెత్తిన పిడి గుద్దు.’’అన్నాడు .’’బానేఉంది .’’అన్నా .’’మరి నా చాన్సో ‘’అన్నాడు ‘’ఇస్తే నీకు ముద్దు –నాకు మాత్రం సభికులనుంచి పిడి గుద్దు’’అన్నా ఠపీ మని ఫోన్ పెట్టేశాడు .ఇంతలో మరోకాల్ ‘’నేనండీ అరుణ తార .కవి సమ్మేళనాలెన్నిటిలోనో పార్టిసిపేట్ చేశా. చాన్సిస్తే రాస్తా .’’అన్నది .’’నీ భావ ధార వదులు తల్లీ ‘’అన్నా.’’నిఘంటువు లో  ఉండకూడదు పేరు మగ –అదంటే నాకు పరమ పగ -.మగోడు లేకుంటే ఏమిటి వగ –వాడ్ని ఎందుకు పొగుడుతారు తెగ ‘’అన్నది ‘’ఇక చాలు అమ్మా .’’ఇస్తే చాన్స్ నీకు మా వాళ్ళతో నాకు పొగ –ఇక కక్కకమ్మ నీ అక్కసు తెగ సెగ ‘’అని ఫోన్ పెట్టేశా .

లేచి కాఫీ తాగి సేద దీర్చుకొంటుంటే  మళ్ళీ సెల్ మోత .’’హలో ‘’అన్నా .’’నేను సార్ భావకవి బలాదూర్ ను.కవి సమ్మేళనం లో నాకు ఎల్లానూ చాన్స్ ఇస్తారనుకోండి .ఇంతకీ సబ్జెక్ట్ ఏమిటి సార్?అడిగాడు ‘’కోడి పందాలు ‘’అన్నా .’’అయితే పందెం కోడిలా రెచ్చిపోతా –వినండి –‘’మేపిన కోడిని కొక్కొరకో –పందెం వేస్తారు కొక్కొరకో –కత్తులు ఉండవంట కొక్కొరకో –ధ్రిల్ ఏముంటుంది కొక్కొరకో ‘’అన్నాడు ‘’నువ్వు ఆపక పోతే కొక్కొరకో –పోలీస్  కంప్లైంట్ ఇస్తా కోక్కోరకో ‘’అనగానే ఫోన్ బంద్. మరో నిమిషం లో ఫోన్ బాంగ్ ‘’అయ్యా నేను పద్య కవి పరమేశాన్ని .మీ సమ్మేళనం లోనాకూ చాన్స్ –‘’అన్నది అవతలి గొంతు ‘’సరే పరమేశం జీ .దేని మీద పద్య స్వారి చేస్తారు ?’’అడిగా .’’ఏదైనా నల్లేరు పై బండీ లా నడిపిస్తాను ‘’అన్నాడు .’’అయితే అమరావతి పై చెప్పండి సాంపిల్ గా ‘’అన్నా .’’దేవేంద్రుని రాజ దాని అమరావతి –దాని వగలు సోయగాలు చూస్తుంటే పోయేను మతి –అప్సరసల పొందు తీర్చేను జీవన గతి –ఆ ఆనందం చెరగని  స్మ్రుతి ‘’అని ‘’ఎలా ఉంది సార్?’’అన్నాడు ‘’అయ్యా! కళ్ళముందున్న నవ్యాంధ్ర రాజధాని ని వదిలేసి , సొల్లు కార్చుకొనే ఆ అమరావాతి పై చెప్పారు .సమకాలీనం లో జీవించండి .’’అన్నా .’’అరే సార్.ఇక్కడో అమరావతి ఉందా ?’’అన్నాడు ‘’’ఊహాలోకం లో సంచరిస్తే మతి –లేకుంటే ఇంటికాడ పెళ్ళాం పిల్లలు అధోగతి ‘’అన్నా .ఫోన్ పెట్టేశాడని చెప్పక్కరలేదను కొంటాను .

కాసేపు పేపర్ తిరగేశా .ఇంతలో రింగ్ రింగ్ ‘’ఎవరూ ‘’అన్నా’’నేను సార్ మినీ కవితల మీసాల్రావు ‘’అన్నాడు .’’మిమ్మల్ని గురించి వినలేదండీ .మీ పరిచయం .’’అన్నా .చెప్పి,సాంపిల్ గా ‘’ఆకాశం లో మేఘం –కిందనేమో దాహం –అది కురవదు –ఇట దాహం తీరదు ‘’అన్నాడు. ‘’ కవితలో కవిత్వం ఉండదు –చాన్సిస్తే నేను ఉండను’’అన్నా .మరికొంత సేపటికి మరో మోత ‘’నా పేరు  నానీల నాని .చాన్సిస్తారా ?’’డైరెక్ట్ క్వశ్చన్ .’’ఓకే .మాదిరి కవిత చెప్పండి ‘’ఒకే .’’నానీ-నేనీ-కానీ –పోనీ –అనీ  –‘’అని ఆపేశాడు .’’అబ్బో .’’వినీ వినీ –పైకి పోనీ ‘’అన్నా.అర్ధం చేసుకోన్నాడో ఏమో మారు మాట లేదు .కొంతసేపటికి మరో ఫోన్ ‘’హలో ఎవరూ ‘’అన్నా .’బ్రదర్ -’నేను వీరవిప్లవ కవి పరపర రావు ‘’అన్నది అవతలి గొంతు ‘’బ్రదరూ  !నాకు విప్లవసాహిత్యం తో పరిచయం లేదు ఆనాయకులేవరో తెలీదు నువ్వు  రాంగ్ నంబర్ కు ఫోన్ చేశావేమొ బ్రదర్  ?’’అన్నా .’’మేం అడవుల్లో తిరుగుతున్నామన్నా  జనజీవన స్రవంతి లో వార్తలన్నీ తెలుసుకొంటాం .అడవి రాముళ్ళం.మీ కవితా సమ్మేళనం లో అజ్ఞాతంగా పాల్గొంటాను .అవకాశాం ఇస్తారా ?’’దేని పై కవిత్వం చెబుతావు బ్రదర్  ?’’అడిగా .’’బుజాన బుల్లెట్టు –కాళ్ళకు జాకెట్టు –నెత్తి మీద పాకెట్టు –నన్ను చూస్తె షాక్కొట్టు’’అన్నాడు రొప్పుతూ .’’బ్రదర్ .’’ఒకమాట చెబుతాను విను బ్రదర్ .నీకు ఇంకా ఆసాహిత్యం వంట బట్టినట్లు లేదు .ఎదోకుతూహలపడి అడిగినట్లున్నావు .మీవాళ్ళు రాస్తే బుల్లెట్ల వర్షం కురిసేట్లు ఉంటు౦ది  నీ కవితలో పొంతన లేదు కవిత్వం ప్రాక్టీస్ చెయ్యి ‘’అన్నా .’’నిజమే బ్రదర్ .నువ్వు అన్నాక నా కవిత నాకే రోతగా ఉంది .ఏదో ఆత్రపడ్డాను ‘’అన్నాడు .’’బ్రదర్ ! కవిత్వం లో ప్రవేశించాలనుకొన్న నీ భావనకు సాల్యూట్ .బాగా రాస్తే నేనే ఆహ్వానం పంపిస్తా నువ్వు అడగకుండా ‘’అన్నాను ‘’ఒకే బ్రదర్ లాల్ సాల్యూట్ ‘’అంటూ బూట్ల శబ్దం తో ఫోన్ ఆగి పోయింది .

ఇంతలో మా బామ్మర్ది బ్రహ్మం ఆదరా బాదరా రోప్పుకుంటూ వచ్చాడు .’’బావా ! నేను లేకుండా కవి సమ్మేళనమా?ఎంత అవమానమెంత అవమానము ?అన్నాడు పాత ఎన్టీ ఆర్ స్టైల్ లో .’’నువ్వూ కవిత్వం కక్కుతావా ?అఘోరించు ’’అన్నా’’శుభం పలకరా మంకేన్నా అంటే అదేదో అన్నట్లు ఈ దీవనలేమిటి బా! .పండగ ముందు .’’అన్నాడు .’’బామ్మర్ది అంటే సొతంత్రం రా .నే ననాలి నువ్వు పడాలి అది రూలు ‘’అన్నాను  .’’కవిత్వ విషయం ఏంటి బా !’’అన్నాడు .’’ఇ౦కా ఆలొచి౦చలేదు .ఆలోచిస్తుంటే కురుపు సలపరింతలాగా ఫోన్లమీద ఫోన్లు .నువ్వు దేనిమీదైనా ప్రిపేర్ అయ్యావా ?’’’’మనం ఆల్రెడీ రెడీ .’’అన్నాడు .’’ఒక నమూనా వదులు’’అన్నా –సరే బావా !నవ్వ కూడదు .’’అన్నాడు ‘కానీ !’’అన్నా ‘’ స్వచ్చ భారత్ కోసం చీపురుతో రోడ్లన్నీ ఊడవ లేక అలసిమోడీ  -పెద్దనోట్లను ‘’రద్దు చీపురు’’తోఅర్ధ రాత్రి  ఊడ్చి పారేశాడు –డబ్బు తెలుపైందో లేదోకాని –నల్లకుబేరులు  బేర్ మన్నారో లేదో తెలీదుకాని –సామాన్యులు ‘’బావురు’’మన్నారు .పోపుల డబ్బా డబ్బులు బ్యాంక్ లో చేరాయి కాని –నల్లదనం మరింత నలుపెక్కిందని వింటున్నాం –ఫలితాలకోసం రెండు నెలలు ఆగినా –ఎదురు చూపేకాని ఆశల ముందు చూపు కనిపించట్లేదు –ఎవరికోసం ఈ రద్దు ?అమెరికా సలహాతోనా ?అంతు తెలియని అజ్ఞాత వ్యక్తుల ప్రేరణ తోనా ?ప్రజల జీవితాలతో ఆడుకో వద్దు –చూస్తూనే ఉన్నాంగా ఎన్నో దేశాల భవితవ్యం –మనదైన భావన ఉండాలి ప్రతి చర్య వెనకా –అప్పుడే వస్తుంది ఎంచక్కా ప్రగతి చక చకా ‘’అని గుక్క తిప్పుకోకుండా వదిలాడు .’’ఒరే !నీ లో ఇంత కవిత్వం అజ్ఞాతం గా దాగుందా –బాగుంది –నువ్వే ఈ కవిసమ్మేళనాన్ని నిర్వ హించు ‘’అన్నా .’’బావో ! నా నెత్తిన అంత భారం పెట్టకు .ఏదో నీ నీడ లో వాడిని ‘’అన్నాడు .’’ఎంత కాలం నీడ ?వెలుగులోకి రా ఈ సారైనా ‘’అన్నా .’’ముసిముసి నవ్వులతో వాళ్ళక్క దగ్గిరికి వంటి౦ట్లోకి పండగ సరుకు భక్షి౦చటానికి రంయి మని దౌడు తీశాడు బామ్మర్ది బ్రహ్మం .

Inline image 3

రేపటి  సంక్రాంతి శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్-13-1-17 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విహంగ సాహితీ పురస్కారం

15978039_1531116513583941_3146486525061878728_n

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంక్రాతి శుభాకాంక్షలు


Inline image 2Inline image 3
Inline image 4

Inline image 5
 
Inline image 6
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నెల నెల వెన్నెల – ఓ అద్భుతం – 05.02.2017 ఆహ్వానం

2xray xray

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వివేకానందుని తోలి ఆంగ్లప్రసంగం హైదరాబాద్ లోనే చికాగోలో కాదు

image-5

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విహంగ సాహితీ పురస్కార

శ్రీమతి పుట్ల హేమలనిర్వహిస్తున్న  మహిళా వెబ్ మాసపత్రిక ”విహంగ ”కు గత 5 ఏళ్లుగా ప్రతినెలా ప్రపంచప్రసిధ్ధ మహిళనొకరు గురించి రాస్తున్నందున 11-1-17 రాజమండ్రి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ ప్రాంగణం లో జరిపిన 6 వ వార్షికోత్సవ జాతీయ సెమినార్ లో వైస్ చాన్సెలర్ శ్రీ ఎస్వీ సత్యనారాయణ గారించే సత్కారం చేయించి అందజేసిన ”102_9751 ”పత్రం . నా అంతర్జాల రచనకు అందుకొన్న మొట్ట మొదటి పురస్కారం ఇది .ఈ ఆనందం అందరితో పంచుకొంటున్నాను -దుర్గా ప్రసాద్

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

11-1-17 బుధవారం సాయంత్రం రాజమండ్రిలో ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారింట్లో మేమిద్దరం ,మామనవడు చరణ్

11-1-17 బుధవారం సాయంత్రం రాజమండ్రిలో ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారింట్లో మేమిద్దరం ,మామనవడు చరణ్

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

11-1-17 బుధవారం 6వ వార్షికోత్సవ జాతీయ సెమినార్

మతి పుట్లహేమలత ఎడిటర్మ గా నిర్వహిస్తున్న వెబ్ మాస పత్రిక ”విహంగ ”కు అంతర్జాలంలో గత 5 ఏళ్ళనుండి ప్రతినెల ఒక ప్రముఖ మహిళా పై వ్యాసం రాస్తున్నందున

లో రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ ఆవరణలో వైస్ చాన్సెలర్ శ్రీ ఎస్ .వి సత్యనారాయణ గారిచే సత్కారం అందజేసిన చిత్రాలు .

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్

భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్

4-3-1956  న భారత దేశం లోని బెంగాల్ రాష్ట్రం లో జన్మించిన తోరు దత్ 30-8-1877 న అతి చిన్నవయసు 21 ఏళ్ళకే మరణించింది.’’ఇండో –ఇంగ్లీష్ సాహిత్య కీట్స్’’అని ఆమెను అందరూ భావిస్తారు .తోకచుక్క లాగా ఒక్కసారి కవిత్వం తో మిరుమిట్లు గొలిపి అదృశ్యమైంది .జాన్ కీట్స్ మహాకవి క్షయ వ్యాధి బారినపడినట్లే, ఈమెకూడా ఆ వ్యాధితోనే  చనిపోవటమూ యాదృచ్ఛి కమే .ఆమె పెద్దక్క ఆరు చనిపోయినప్పుడు  ఆమె నోటివెంట వచ్చిన మాటలు అత్యంత కవితాత్మకం గా ఉన్నాయి .సంస్కృతం ఇంగ్లీష్ ఫ్రెంచ్ మూడు భాషల్లో ఆమె సృజన వికసించింది .నిజంగా ఆమె ఇండో –ఆంగ్లికన్ సాహిత్యానికి మార్గ దర్శి .ఇంగ్లీష్ లో ఇండియన్లు రాసే కొత్త శకానికి తోరు దత్ తెర తీసింది   వికసించిన ఈ లేత పుష్పం అంత త్వరలో నే వాడి పోవటం దురదృష్టం .

భాషా శాస్త్ర పండితుడు ,కవి గోవిన్ చందర్ దత్ ,అత్యున్నత సంస్కారమున్న క్షేత్రమణి దంపతుల మేధో విలసిత కుటుంబం లో ,అపురూపమైన తోరు దత్  జన్మించింది .ఈ కుటుంబ నేపధ్యం తోరు దత్ సాహిత్యం పై అత్యంత ప్రభావాన్ని చూపింది .వారింటి ఉద్యానవనం గాలి లోనే కవిత్వపరిమళం విలసిల్లింది  .ఆమె బాబాయిలు ముగ్గురూ హరి చందర్ ,ఉమేష్ చందర్ ,గ్రీస్ చందర్ ‘’దత్ ఫామిలీ ఆల్బం ‘’లో కవిత్వం ఒలికి౦చినవారే .  సంతానం లో చిన్నపిల్ల తోరు అతి సుకుమారి ,మహా మేధో సంపన్నురాలు ..పైవాళ్ళి ద్దరూ అబ్జు ,ఆరు దత్ లు .తండ్రి తోరు పై చిన్నకవిత రాసి  ఆమె స్వభా వాన్ని  ఆవిష్కరించాడు –

 “Puny and elf-like, with disheveled tresses,

Self-willed and shy ne’er heeding that I call,

Intent to pay her tenderest addresses

To bird or cat, – but most intelligent…”

తండ్రి తన మానసిక బలం పై  చూపిన ప్రభావాన్ని తోరు గుర్తించింది .దానిని ఆమె జ్ఞాపకమూ చేసుకొన్నది –‘’నాన్న లేకపోతే నాకు మంచి కవిత్వానికి చెడు కవిత్వానికి మధ్య ఉన్న తేడా తెలిసేదికాదు .ఆయన అంత శ్రమపడి చిన్నప్పటి నుంచి మమ్మల్ని తీర్చి దిద్దాడు .ఆయన లేకపోతె మా భవిష్యత్తు ఎలా ఉండేదో ‘’అన్నది .ఆమె జీవితం లో సంతోషం, బాధ ,ఎడబాటు  ,సృజన వగైరా సంఘటనలు తన ప్రమేయం లేకుండానే త్వరత్వరగా జరిగిపోయాయి .తోరు 6 ఏళ్ళ వయసులో కుటుంబం 1862 లో క్రిస్టియన్ మతం తీసుకొన్నది .దీనితో తాత్కాలికంగా తలిదండ్రుల మధ్యపొర పొచ్చాలొచ్చాయి .ఆమె తల్లి మనసు మార్చుకొని తండ్రిని చేరి ,క్రిస్టియానిటీ స్వీకరించటమే కాక ‘’ది బ్లడ్ ఆఫ్ జీసెస్ ‘’ను బెంగాలి భాషలోకి అనువదించి రెండుభాషలలో తనకున్న సామర్ధ్యాన్ని తెలియ జేసింది .9 వ ఏట విధి బలీయమై ఆమె అన్న అబ్జు అకస్మాత్తుగా చనిపోయి మనసుపై తీవ్ర శరాఘాతం చేశాడు .ఇద్దరు ఆడపిల్లలు దీన్ని తట్టుకోలేక అల్లల్లాడి పోయారు. బాధఉపశామనానికి  ఆరు ,తోరు లిద్దరూ సాహిత్యం పై దృష్టి నిలిపి, మిల్టన్ మహాకవి రాసిన ‘’పేరడైజ్ లాస్ట్ ‘’పదేపదే చదివారు.

నాలుగేళ్లతర్వాత కుటుంబం కలకత్తా నుంచి యూరప్ వెళ్ళింది .అక్కడ సోదరి లిద్దరి మేధ బహు ముఖీనంగా వికసించి౦ది .మొదట్లో వాళ్ళు ఫ్రాన్స్ ఆగ్నేయభాగం నైస్ లో ఉన్నారు .అక్కడ స్కూల్ లో చేరి ఫ్రెంచ్ నేర్చి అందులో ప్రావీణ్యం సాధఛి సృజనకు ఉపయోగించుకొన్నారు .కొద్దికాలమే అక్కడ ఉండి ఇటలీకి,తర్వాత ఇంగ్లాండ్ కు  వెళ్ళారు .లండన్ లో సంగీతం నేరవటం తో  వారి లలిత కళాభిరుచి వేయి రెట్లు వికసించింది .ప్రపంచపు కొత్త భావోద్వేగాలు వారిని ఆకర్షింఛి కొత్తద్వారాలు తెరిచాయి .కేంబ్రిడ్జి లో ఉన్న రెండేళ్లలో వారి వ్యక్తిత్వాలు మరింతగా కుసుమింఛి వికసించాయి ..ఇక్కడే తోరు కు మేరీ మార్టిన్ అనే అమ్మాయి పరిచయమై స్నేహం జీవితాంతం కొనసాగింది .మేరీ తో కొనసాగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో తోరు కవితా వికాస విలసనాలు స్పష్టంగా తెలుస్తాయి . చిన్నారి తోరు జీవితానందం తో ఆమె మేధ కూడా వికసించటం గమనిస్తాం .వాళ్ళమాటలలో, రాతలలో పూలు ,పక్షులు ,కళాదృష్టి అనారోగ్యం పాండిత్య ప్రకర్ష అన్నీ చూడచ్చు .

1873 లో వాళ్ళు ఇండియాకు తిరిగొచ్చాక ఇద్దరూ సాహిత్యాన్వేషణ లోనే గడిపారు .ఈకాలం లో తోరు ఫ్రెంచ్  కవితలను ఇంగ్లీష్ లోకిఅనువదింఛి ‘’ఎ షీఫ్ గ్లీనేడ్ ఫ్రం ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’అని పేరు పెట్టి1876 మార్చి లో ప్రచురించింది ..ఇలాంటిదే సంస్కృతం లోనూ తేవాలనే అభిప్రాయం కలిగి తండ్రి దగ్గరే సంస్కృతం నేర్చింది  . .   .  .

సాహిత్య విజయాలు

వచనం లోకంటే కవిత్వం లో ఆమె ప్రతిభ బాగా రాణించింది .రాసిన కవిత్వం 1-‘’ఎ షీఫ్ గ్ల్లీనేడ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్ ‘’,2-ఎన్శేంట్ బాలడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందూస్థాన్’’రెండే అయినా అందరి దృష్టినీ ఆకర్షించాయి .ఆమె కవిత్వం లో సున్నితమైన వర్ణన, భావ గీతం ,పాటవం ఉంటాయ.ఆమె జీవితకాలం లో ప్రచురితమైన ఒకే ఒకటి ‘’ఎ షీఫ్ ‘’.అందులో అహంభావం లేని నిరాడంబర కవిత్వం తగిన గెటప్ ఉన్నాయి .1876 ఆగస్ట్ సంచిక ‘ది ఎక్సామినర్ ‘’లో ఈ పుస్తక సమీక్ష ప్రచురించారు .సమీక్షకుడు ఎడ్మండ్ గాస్ ‘’162 అనువాదకవితలున్న ఈ పుస్తకం తోరు దత్ లోని అభినివేశాన్ని ,అత్యద్భుత ప్రదర్శనను తెలియ జేస్తుంది .ఆశ్చర్యకరమైన ,అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది ‘’అన్నాడు .ఫ్రెంచ్ కవితలను ఎన్నుకోవటానికి తోరు దత్ ఫ్రెంచ్ సాహిత్యం లోని కాల్పనిక కవిత్వానికి ప్రాధాన్య మిచ్చింది .సంధియుగపు కవులైన చీనియర్ ,కొరియర్ ,లార్టైన్ ,లానే లే కాక రోమా౦టిక్స్ కాని  ,మోరో, డూపాంట్  ,వాల్మోర్ ల కవిత్వాలనూ తీసుకొన్నది .ఫ్రాన్స్ లో రోమా౦టిజం ఇంగ్లాండ్ లో లాగానే 18 శతాబ్ది చివర 19 శతాబ్ది మొదట్లో వచ్చింది .ఏనిబందనలు లేని స్వతంత్ర సరళ సూటి వ్యక్తీకరణ ఊహ దీని లక్షణం .అందుకే హృదయాలను తాకి ,ఆనందం కలిగించి , దేశభక్తి ప్రబోధాత్మకమై ఏకాంతం ,ప్రక్షాళన ,నిరాశా ,భ్రమ ,ప్రవాసం ,నిర్బంధ భావాలున్న కవిత్వానికే  ఆమె ప్రాముఖ్యమిచ్చింది.మాతృకలోని నాడిని పట్టుకొని అర్ధం చేసుకొని దాన్ని చక్కగా అనువాదం చేయటం ఆమె ప్రత్యేకత .అందుకే విశ్లేషకుడు గాస్ ‘’ఆధునిక ఫ్రెంచ్ కవిత్వం అంతా పూర్తిగా కనుమరుగైనా,నశించినా ,అందులోని అనేకకవితలను పునర్నిర్మించలేక పోయినా ఏమీ ఫర్వాలేదు వాటిలో చాలాభాగం భారతీయ అనువాదం (ఇండియన్ వెర్షన్ )లో దొరుకుతుంది ‘’అన్నాడు .నిజానికి ఆమె గుడ్డిగా అనువాదం చేయలేదు .ఏ విధమైన సంకోచం లేకుండా ఆమె ఫ్రెంచ్ పదాలను ,పద బంధాలనుతీసేసి  వాటికి మరింత స్పష్టమైన తగిన వాటితో మార్పు చేసి స్వతంత్రం తో అనువాద౦ చేసి సొగసు చేకూర్చింది . మూలం లోని లయను చాలా జాగ్రత్తగా అనువాదం లోకి తెచ్చింది. అది ఆమె గొప్పతనం .

యూరప్ లో చదివి శిక్షణ పొందినా ,తోరు దత్ హృదయం మాత్రం భారతీయమే .చిన్నప్పుడు తల్లి  రామాయణ ,మహాభారత ,పురాణ కధలను చెప్పి మనసులో గాఢ ముద్ర వేసింది .స్వయం గా సంస్కృత కావ్యాలను చదవటం వలన ఆకధలలోని ఆంతర్యం,లోతు  ఆమెకు స్పష్టంగా అవగాహన కల్గించింది .అందుకే ఆమె ‘’ఎన్శేంట్ బాలడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందూ స్థాన్’’రాయటానికి పూనుకొని విజయవంతంగా ర్తి చేసి 1882 లో ముద్రించి ము౦దు మాటలను ఎడ్మండ్ గాస్ తో రాయించింది  .’’ఇంగ్లీష్ లో గొప్ప రచన ‘’అని విమర్శకులు మెచ్చుకొన్నారు .’’భారతీయ ఆత్మను ఆంగ్ల కవితా మాధ్యమం లో  పడమటి దేశాల వారికి ఎరుక పరచిన మొట్టమొదటి పుస్తకం ఇది ‘’అని సాహిత్య విమర్శకుడు లోకితా బసు అన్నాడు .   చక్కని వైవిధ్యం కధనం సుందర కవిత్వం తో గొప్ప విందు అనిపించింది .ఇందులో  సావిత్రి ,లక్ష్మణుడు ,ప్రహ్లాదుడు ,,సింధు మొదలైన వారి కధలున్నాయి .మొత్తం 3 ముద్రణలు పొందింది ‘’షీఫ్ ‘’కాని తనసాహితీ విజయాలను చూసుకొనే అదృష్టం ఆమెకు దక్కలేదు .ఎనిమిది కవితలను పెద్దక్క అనువాదం చేసింది .

తోరు దత్ రెండునవలలు 1-బియాంకా( ది స్పానిష్ య౦గ్ వుమన్ )2-లె జర్నల్ డిమాడెమోడిల్లెడిఆర్వెస్’’రాసింది .మొదటిది అసంపూర్తి రోమాన్స్ ఇంగ్లీష్ నవల .రెండవదిమార్గరెట్ అనే ఆమె డైరీ రూపం లో ఫ్రెంచ్ భాషలో రాసినది .అంటే ఫ్రెంచ్ భాషలోనూ రాసిన మొట్టమొదటి భారతీయ రచయిత్రి తోరు దత్ అని తెలుస్తుంది .ఈ రెండూ ఆమెచనిపోయిన తరువాత ఆమె దగ్గరున్న పేపర్ల గుట్టలో దొరికాయి .భావ గర్భితంగా కవితాత్మక కధనం తో సరళంగా రాసిన రచనలు ఈ రెండు .తోరు కు భారతీయ సాంస్కృతికవారసత్వమ౦టేగర్వపడుతుంది .అందులోని  ,జానపద ,పురాణ ,,ఇతిహాస కధలన్నాచెప్పలేనంత ఇష్టం.ఆంగ్ల విద్య నేర్చినా,ఆమెజీవిత విధానమ౦తా భారతీయమే . ఇ.జె.ధాంసన్ఆమెను గురించి చెబుతూ , “Toru Dutt remains one of the most astonishing woman that ever lived …. Fiery and unconquerable of soul. These poems are sufficient to place Toru Dutt in the small class of women who have written English verse that can stand.’’అన్నాడు . ఆమె రాసిన ‘’కాసురీన ట్రీ’’(సరుగుడు చెట్టు )కవిత ఆధునిక భారతీయ సాహిత్యం లో బాగా ప్రసిద్ధి చెందింది .ఆచెట్టు జ్ఞాపకాలతో తన బాల్యాన్ని నెమరేసుకోవటం దీని ప్రత్యేకత .ఈకవిత మనదేశం లో ఇంగ్లీష్ పుస్తకాలో బోధనాంశంగా ఉండేది .

తోరు చనిపోయాక తండ్రికి 1887 లో ‘’బాలడ్స్ ‘’రచన దొరికి ముద్రించాడు .ఆమె నవల ‘’లె జర్నల్ ‘’ను పృధ్వీంద్ర ముఖర్జీ బెంగాలీ భాషలోని అనువాదం చేశాడు .ఇది ‘’బసుమతి ‘’అనే బెంగాల్ పత్రికలో సీరియల్ గా వచ్చింది .ఇంగ్లీష్ అనువాదమూ సీరియలైజ్ అయింది .తోరుకు జర్మన్ భాషలోనూ ప్రావీణ్యం ఉంది .బ్రిటిష్ వారు భారతీయులపై చూపిస్తున్న దాష్టీకం ,పెత్తనం పై తోరు తీవ్రంగా విమర్శించింది .నిత్యం దినపత్రికలు చదివి ఇండియాలో జరిగే విషయాలన్నీ తెలుసుకొని భారతీయులపై  బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న దారుణ విధానాలవల్ల ఆ జాతిపై ఆమె కు  క్రోధం పెరిగింది .ఒక భారతీయునిపై ఇంగ్లీష్ వాడి కుక్కలు వెంటబడి బాధ పెడితే,ఆత్మ రక్షణ కోసం ప్రయత్నిస్తే, వాడు కేసుపెడితే, 3 వారాల జైలు శిక్ష విధిస్తే, ఆమె పేపర్ లో తీవ్రంగా తన అసమ్మతి తెలియ జేస్తూ ‘’ఇంగ్లీష్ వారి దృష్టిలో భారతీయులు ఎంత చులకనగా ఉన్నారో ఈ ఉదంతం తెలియ జేస్తుంది’’అన్నది మరో సారి 9 మంది బెంగాలీలను చంపి అనేకమందిని గాయపరచిన బ్రిటిష్ సైనికుల అరాచకాన్ని పేపర్ లో ఎండ గట్టింది .ఆడంబరాలు గిట్టని ఆమె ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియా వచ్చినప్పుడు కలకత్తా మైదానం లో పెద్ద ఎత్తున మందుగుండు సామాను కాల్చటాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది  .డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ కలకత్తా వచ్చినప్పుడు స్వాగత సత్కారాలకు 9 000రూపాయలు ఖర్చు చేయటాన్ని ప్రశ్నించింది  .అన్న ,అక్క క్షయ వ్యాధి సోకి మరణించారు .తోరుకూ అది సోకిఆమె 1887 లో మరణించింది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-1-17 –ఉయ్యూరు .

 

.

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం జయశంకర్‌ జిల్లా

నల్లగుట్టలో ఆదిమానవుడి ఆనవాళ్లు: సహజసిద్ధమైన శివలింగం జయశంకర్‌ జిల్లా గణపురం మండలంలోని మైలారం నల్గగుట్ట గుహల్లో ఆదివానవుడి ఆనవాళ్లు, సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆకృతి వెలుగు చూశాయి. By: Garrapalli Rajashekhar Updated: Monday, January 9, 2017, 13:40 [IST] Subscribe to Oneindia Telugu జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ జిల్లా గణపురం మండలంలోని మైలారం నల్గగుట్ట గుహల్లో ఆదివానవుడి ఆనవాళ్లు, సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆకృతి వెలుగు చూశాయి. పర్యాటక శాఖ నేతృత్వంలో హైదరాబాద్‌కు చెందిన నెటిజన్‌ బృందానికి చెందిన 40 మంది ఈ గుహల్లో ఆదివారం పరిశీలించారు. తాళ్ల సహాయంతో ఆక్సిజన్‌ సిలిండర్లు పెట్టుకొని సుమారు 20 మీటర్ల లోతుకు దిగారు. ఆదిమానవుల ఆవశేషాల, వారు వాడిన కుండపెంకులు, జంతువులకు సంబంధించిన ఎముకలు లభించాయి. గుహల్లో ఆదిమానవులు నిర్మించుకున్న రాతి గోడలు ఉన్నాయని బృందంలోని సభ్యులైన అరవింద్‌ ఆర్య, అంకిరెడ్డి, వెంక్‌గౌడ్‌ తెలిపారు. ఈ గుహలను అధ్యయంన చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ క్రిస్టియానా తమను పంపిచారని తెలిపారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర గుహలు విస్తరించి ఉన్నాయని చెప్పారు. తమ అధ్యయనాన్ని పర్యాటక శాఖకు నివేదికగా అందిస్తామన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య

1893 లో కర్నాటక రాష్ట్రం లో బిజాపూర్ జిల్లా లో కృష్ణానదీ తీరాన ఉన్న గలగలి గ్రామం లో రామాచార్య జన్మించాడు .సంస్కృతం లో మహా పండితుడు . రెండు మహాకావ్యాలు రాసిన మహాకవి .1981 లో 88 వ ఏట మరణించాడు  .ఆయన గురుపరంపర –గలగలి కూర్మాచార్య, కృష్ణా కార్య ,సత్యధ్యానతీర్ధ స్వామీజీ .

రామాచార్య 1-యదు వంశ మహాకావ్యం 2-స్వరాజ్య రాత్నాకరః అనే రెండు మహాకావ్యాలను రచించాడు ఈ రెండూ కాక దేవీ వాసంతి ,కోహం అనే గద్య రచనలు చేశాడు .లఘుకావ్యాలుగా 1- దేవ మందిర క్రందనం 2-ముని-మేనక సంవాదః రచించాడు .పాహిమాం మురళీధర ,వెంకటేశశతకం గీతాలను ‘’సతి చింతామణి ‘’అనే సంస్కృత నవలను రాశాడు .కృష్ణకవి రాసిన అలంకార ముక్తావళి ,సత్యనాద తీర్ధ రచించిన రుగ్ భాష్య టీకా ప్రకాశ ,నరహరి తీర్ధ రచన యమక భారత టీకా ,పద్మనాభ తీర్ధుని శ్రీ గీతా తాత్పర్య నిర్ణయ ప్రకాశిక ,ఆనంద తీర్ధుని ఆహ్నిక కౌస్తుభ మొదలైన గ్రంధాలకు సంపాదకుడిగా పని చేశాడు .

ప్రయాగలోని భారతీయ సంస్కృత సంస్థాన పరిషత్ రామా చార్యకు ‘’మహా మహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరిస్తే,ఎడిటోరియల్ బోర్డ్ ఆఫ్ సంస్కృతం ‘’సాహిత్య రత్న ‘’ను,సనాతన ధర్మ మండలి ‘’అభినవ బాణ ‘’ను,అఖిల భారత సాహిత్య సమ్మేళనం లో ‘’కవికుల తిలక’’బిరుదు నిచ్చి సన్మానించాయి .సంస్కృత సేవకు రామాచార్య  రాష్ట్రపతి పురస్కారాన్నీ అందుకొన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశి నే వైకుంఠ ఏకాదశి అంటారు .ఏకాదశి అంటే ఒక తిదిమాత్రమేకాడు ,ఒక దేవత పేరు ,10 ఇంద్రియాలను అదుపులో పెట్టేది ,ఉపవాసాలకు ముఖ్యమైన రోజు ,విష్ణువుకు పరమ ప్రీతి కరమైన రోజు . ఏడాదికి  శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశులు 24 .అధికమాసమైతే 26 వస్తాయి . ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి.భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి ,కార్తీక శుద్ధ ఏకాదశి బోధన లేక ఉత్ధాన  ఏకాదశి .మాఘ శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి .సూర్యుడు ధనుర్మాసం లో ఉన్నకాలం లో మార్గశిర లేక పుష్యమాసం లో వచ్చేదే ముక్కోటి ఏకాదశి .3 కోట్ల దేవతలతో కలిసి శ్రీ మన్నారాయణుడు ఈ రోజునే దర్శన మిస్తాడు .అందుకే ఆ పేరు .ఈ రోజు ఉపవాసం ఉంటె 3 కోట్ల ఏకాదశులలో చేసే ఉపవాస ఫలితం ,పుణ్యం వైకుంఠ ఏకాదశి నాడు చేస్తే లభిస్తుంది .

మనదేవతల సంఖ్య 33 కోట్లు .కాని ‘’అసహస్రాత్ ‘’అనే వేద ప్రమాణాన్ని బట్టి అసంఖ్యాకం అని అర్ధం అంటే అంతా దేవతామయమే .విష్ణు మయమే .ఒక్కడే పరమాత్మ ఇన్ని రూపాలలో ఉన్నాడని భావం .ఇక్కడ 3  కధలు తెలుసు కొందాం .ఒక మన్వంతరం లో ‘’వికు౦ఠ’’అనే తల్లికి  విష్ణువు కుమారుడిగా పుట్టాడు .అందుకే’’ వైకుంఠుడు’’అంటారు .రెండోకద –కృత యుగం లో చంద్రావతి నగరాన్ని’’ మురుడు’’అనే రాక్షసుడు పాలిస్తూ దేవతలను క్షోభ పెట్టాడు .అప్పుడు వైకుంఠంనుంచి విష్ణువు దిగి వచ్చి వాడిని చంపటానికి ప్రత్యేక అస్త్రం కావాలని బదరికాశ్రమం లోహైమావతి అనే  ఒక గుహలో ప్రవేశించాడు .ముర ఇక్కడే విష్ణువు దాక్కున్నాడని తెలిసి గుహలోకి ప్రవేశించాడు .అప్పుడు విష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి కంటి చూపుతో మురాసురుని కాల్చేసింది .సంతోషించిన విష్ణువు ఆమె కు ‘’ఏకాదశి ‘’అని పేరు పెట్టి  వరం కోరుకోమంటే ,ఏకాదశినాడు ఉపవాసం ఉన్నవారి పాపాలను సంహరించాలని కోరింది తధాస్తు అంటూ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి మోక్షం కలుగుతుందని  మురారి వరమిచ్చాడు .(వ్రత చూడామణి ).ఈ ఏకాదశినాడు మురాసురుడు బియ్యం లో దాక్కుంటాడని అందుకే బియ్యం తో చేసిన పదార్ధాలు తినరాదని ,తులసి నీరు తాగుతూ ఉపవాసం ఉండాలని అంటారు .ముర అంటే తామసిక రాజసిక గుణాలకు ,అరిషడ్వర్గాలకు ప్రతీక . ఉపవాసం చేస్తే సత్వ గుణం పెరిగి ముక్తికి మార్గం అవుతుంది .3 వ కధ-కు౦భుని కొడుకైన మద మన్యుడు అనే రాక్షసుడు శివునికై తపస్సు చేసి ‘’అయోనిజ ‘’వల్లనే తాను చనిపోయే వరం పొందాడు .లోక కంటకం గా వాడు ప్రవర్తిస్తుంటే  విష్ణువు వాడిని సంహరించటానికి ‘’సింహా వతి ‘’అనే గుహలో ప్రవేశించాడు .ఆ గుహ అంచుల స్వామి శరీరం రాపిడి చెంది ఏకాదశి అనే స్త్రీ గా మారి ఆమె శక్తితో మదమన్యుడిని సంహరించాడు .

మధ్యలో ఈ అ౦చు లేమిటి?అవే జాగ్రత్ స్వప్న సుషుప్తి లు .కుట నుంచి కోటి శబ్దం పుట్టింది కుట అంటే కౌటిల్యం లేక వంకర .అంచులకు కోటి అనే పేరుంది .బాలకృష్ణుడు కొన గోట గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబెట్టాడు  అని మనం విన్నాం .  కనుక పై మూడు అవస్థల అంచుల్ని తాకి మనల్ని పునీతుల్ని చేసేది అని ముక్కోటి ఏకాదశి పరమార్ధం .

ఒక సారి శ్రీరంగం వెడదాం

‘’శ్రీ రంగ ద్వారస్థ భగవదాలోకన మహోత్సవం –ముక్కోటి ఏకాదశి ‘’అని పంచాగ కర్తలు రాస్తారు . శ్రీరంగం లో రంగ నాద స్వామి దక్షిణాభి ముఖం గా శయనించి  ఉంటాడు .ముక్కోటి నాడు ఉత్తర ద్వారం దగ్గర దర్శనం కలుగ జేస్తారు .స్వామిని వజ్రాలు అలంకరించిన వస్త్రాలతో అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణం లో ఉత్తర ద్వారం దగ్గర దర్శన మిప్పిస్తారు .ఇక్కడ 21 రోజుల ఉత్సవం చేస్తారు .ఉదయం పూట చేసే పూజను ‘’పాగల్ పట్టు ‘’అని రాత్రి చేసే పూజను ‘’ఇర పట్టు ‘’అంటారు .

అసలు శ్రీరంగం లో రంగ నాధుడు ఎలా వెలిశాడు?

ప్రళయం తర్వాత బ్రహ్మకు విష్ణు మూర్తి ఆది శేషునిపై పవళించి దేవేరులతో సకల దేవతలతో దర్శన మిచ్చి ‘’జ్యోతిశ్శాస్త్రం’’బోధించాడు .తరువాత బ్రహ్మ కోరిక మేరకు ‘’విమానం ‘’లో వెలిశాడు .ఆ మూర్తి స్వరూపమే శ్రీ రంగ నాధుడు . ఆ మూర్తి ఇక్ష్వాకు రాజులకు లభించింది .ఇక్ష్వాకు వంశ రాజుల ఇలవేలుపు రంగనాధుడు .ఆ వంశం లో శ్రీరాముని వరకు రంగనాధుని పూజించారు .శ్రీరాముడు అవతార సమాప్తి చేసేటప్పుడు ఆ మూర్తి ని విభీషణుడికి ఇచ్చాడు .దాన్ని లంకకు తీసుకు వెడుతూ దారిలో సంధ్యావందన కాలం అయిందని ,ఒక బాలుడి రూపం లో ఉన్న వినాయకుడికి అప్పగించి దాన్ని కిందపెట్టావద్దని బతిమాలి చెప్పాడు .కాని బరువు మోయలేక వాడు కింద పెట్టేశాడు .విభీషణుడు వచ్చి నెత్తీ నోరు కొట్టుకొన్నాడు .అక్కడే ఆలయం కట్టి ప్రతిష్టించి పూజించి ప్రతి ముక్కోటికీ వచ్చి దర్శనం చేసుకొనేవాడు .

ఉత్తర ద్వార దర్శనం దేనికి?

ధనుర్మాసం ప్రారంభం  లో మూసి ఉన్న స్వర్గ ద్వారాలు తెరుచుకొంటాయి .దేవతలకు 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి అని మనకు తెలుసు .దక్షిణాయణ౦  నుంచి ఉత్తరాయణ పుణ్య కాలానికి అంటే చీకటి లో నుంచి వెలుగులోకి అంటే పగలులోకి దేవతలు ప్రవేశిస్తారన్నమాట .స్వర్గ ద్వారాలు తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది .అందుకే ఉత్తర ద్వార దర్శనం .దేవతలు ఈ రోజు దివి నుండి భువికి దిగి వస్తారు .వైకుంఠ ద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచిక .ఈ  రోజు విష్ణు దర్శనం మోక్ష ప్రాప్తి .

ఇందులో శాస్త్రీయ భావన

ఉత్తర ద్వార దర్శనం అంటే ఆకాశం లో శ్రవణా నక్షత్ర మండలం లో 3 కోట్ల నక్షత్రాలు అంటే దేవతలు వెంట రాగా విశ్వ వ్యాపితుడైన శ్రీమన్నారాయుణుడిని దర్శించటం అన్నమాట .

మనిషి ముఖానికి ఎదురుగా ఉండేది తూర్పు (ఉదయం ) .వీపు వైపు పడమర .కాళ్ళ వైపు దక్షిణం .శిరసు వైపు ఉత్తరం .కనుక హృదయ కుహరం లో స్వామిని దర్శించాలని అర్ధం .-‘’నిహిత గుహా యాం విభ్రాజితే ‘’

ఉపవాసం ఎందుకు ?

శాస్త్రీయం గా దీనికి సమాధానం తెలుసుకొందాం –చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు రోజుకు 12 డిగ్రీల చొప్పున తిరుగుతాడు .పాడ్యమి నుంచి పౌర్ణమికి 180డిగ్రీలు. పౌర్ణమి నుంచి అమావాస్య కు 180డిగ్రీలు .మొత్తం 360డిగ్రీలు .దీనితో ఒక ఆవర్తనం పూర్తి అవుతుంది .ఏకాదశి తిదినాటికి 120 నుంచి 132 డిగ్రీలు ఉంటుంది.దీన్ని ‘’త్రికోణ ‘’సమయం అంటారు .పౌర్ణమి ,అమావాస్యలలో చంద్రుని ప్రభావం సముద్రం మీద అంటే నీటి మీద ఎక్కువ అని తెలిసిన విషయమే .అప్పుడే సముద్రానికి ఆటూపోటూ వస్తాయి .  మనశరీరం లో 80 శాతం నీరే .కనుక ఏకాదశినాడు చంద్ర ప్రభావం మన పొట్ట మీద బాగా ఉంటుంది .పొట్టలో ఆహారం ఉంటే చంద్ర కిరణాలు పడి జీర్ణ శక్తిని దెబ్బ తీస్తాయి .అందుకే ఉపవాసం చేయాలి .

ఉపవాసం తో పాటు ఇంకా ఏమేం చేయాలి ?

ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారు ఝాముననే ‘’ఉసిరిక ‘’ముద్దతో శరీరం అంతా పూసుకొని సూర్యోదయానికి ముందే తలారా స్నానం చేయాలి .ఉపవాసముండాలి .తులసి దళాలు వేసిన నీటిని మాత్రమే త్రాగాలి .మౌనంగా ఉండటం మేలు .విష్ణు సహస్ర పారాయణ ఉత్తమం .సాధ్యమైనంత వరకూ ఎవరినీ తాకకుండా ఉండటం మంచిది .రాత్రి హరినామ స్మరణ తో జాగరణ చేయాలి .

పుత్రద ఏకాదశి

ముక్కోటి ఏకాదశిని ‘’పుత్రద ఏకాదశి ‘’అనీ పిలుస్తారు .ఒకప్పుడు సుకేతుడు అనే మహా రాజు భాద్రావతి  నగరాన్ని పాలిస్తున్నాడు .భార్య చంపక .పుత్ర సంతానం కోసం దంపతులు ఎన్నో తీర్ధ యాత్రలు చేశారు .అప్పుడు కొందరు ఋషులు వారిని ఏకాదశీ వ్రతాన్ని చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు .వ్రత విధానం వారి వలన తెలుసుకొని ఏకాదశీ వ్రతం చేసి ,భగవానుని అనుగ్రహం వలన పుత్రసంతానం పొందారు .అందుకే పుత్రద ఏకాదశి అనే పేరొచ్చింది .

తిరుమల ,భద్రాచలం లలో ఉత్తర ద్వారా దర్శనాలకు ప్రత్యేకత ఉంది .మిగిలిన అన్ని వైష్ణవాలయాలలో  స్వాములకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి తరింప జేసి ,మోక్ష ప్రాప్తి కలిగిస్తారు .

Inline image 1Inline image 2Inline image 3

8-1-17 ఆదివారం   ముక్కోటి ఏకాదశి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-17 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 )

2-1-1947 న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్  లో జన్మించిన రహస్ బిహారీ ద్వివేది సంస్కృతం లో ఆచార్య (ఎం.ఏ .)సాహిత్య రత్న ,ఎం .లిట్ డిగ్రీలు పొందాడు .1960లో వచ్చినసంస్కృత  ఇతిహాస పద్యాల (ఎపిక్ పోయెమ్స్ )పై పరిశోధన చేసి జబల్పూర్  రాణి దుర్గావతి యూని వర్సిటి నుండి 1977లో పి హెచ్ డి.అందుకొన్నాడు  .తరువాత జబల్ పూర్ యూని వర్సిటి లో సంస్కృత ఆచార్యునిగా చేరి ,తన సర్వీస్ కాలం లో 16 మందికి డాక్టోరల్ డిగ్రీ సాధించటానికి మార్గ దర్శకం వహించాడు .విద్యా తృష్ణ తీరక’’ విద్యా వాచస్పతి ‘’ డిగ్రీని కూడా అందుకొన్నాడు .

సంస్కృత ,హిందీ ,ఇంగ్లీష్ భాషలలో చాలా గ్రంధాలు రాశాడు .వివిధ అంశాలపై 50 కి పైగా పరిశోధనా పత్రాలను రచించాడు .ముఖ్యమైన రచనలు -1-సంస్కృత మహాకావ్యోం కా సమలోచానాత్మక్ అధ్యయన్(१९६१-१९७०)అంటే 7 వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై విశ్లేషణాత్మక పరిశోధన 2-పి హెచ్ డికోసం రాసిన దిసీస్ ‘’1947-1970 కాలం లోని సంస్కృత ఇతిహాసపద్యాలు’’లో 156 శ్లోకాలను ఉదాహరించాడు .3-అర్వాచీన సంస్కృత మహాకావ్యాను శీలనం .అంటే ఆధునిక సంస్కృత ఇతిహాసాల సమీక్ష అనే 134 పేజీల రచన 4-సాహిత్య విమర్శ (రిసెర్చ్ పత్రాల సంపుటి )5-స్వస్తి సందేశ్ 6-స్వరిత సందేశ్ 7-సంస్కృత వాణి మయే విజ్ఞాన్8-తీర్ధ భారతం (భారతీయ యాత్రా స్థలాలపై  కవిత్వం )

రహస బిహారీ ద్వివేది కి 2012 లోసంస్కృత సేవకు  భారత రాస్ట్రపతి గౌరవ పురస్కారం అందజేశారు .2016 లో ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ ‘’వాల్మీకి పురస్కారం ‘’అందజేసి సత్కరించింది .

సశేషం

రేపు 8-1-17 ఆదివారం ముక్కోటి (వైకుంఠ ఏకాదశి )ఏకాదశి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-17 –ఉయ్యూరు

 

 

 

Inline image 1

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గ్రంథావిష్కరణల సభకు ఆహ్వానం (ఊగిసలాడకె మనసా & స్వజయ సారథి)

బాటసారి రచించిన ‘ఊగిసలాడకె మనసా’ (నిజ జీవిత నవలిక) మరియు

నేను రచించిన ‘స్వజయ సారథి’ (స్ఫూర్తి కవితలు) పుస్తకాల ఆవిష్కరణకు సాహితీ ప్రియులందరినీ ఆహ్వానిస్తున్నాము.

స్థలం: రవీంద్రభారతి, హైదరాబాద్
తేదీ: జనవరి 20,
సమయం: సాయంత్రం 5 గం నుండి 8 గంల వరకు

ఆహ్వాన పత్రిక జత చేసాను.

పెద్దల ఆశీస్సులు, చిన్నల అభిమానం కోరుకుంటూ

మీ,

రవీణ చవాన్

మొబైల్: 9922 927 527

పూణే

invitation

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ముక్కోటి అంటే ఏమిటి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్ 02/12/2016 గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జనవరి

ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్

                                                          ఐర్లాండ్ దేశ క్వేకర్ స్త్రీవాద ఉద్యమాలలో అగ్రగామి అన్నాహస్లాం ఐర్లాండ్ లోని కౌంటి పార్క్ లోని యౌఘల్ లో 1829 లో జెన్ ,అబ్రహాం ఫిషర్ దంపతుల 17 గురు సంతానం లో 16 వది గా జన్మించి ,మహిళా ఓటు ఉద్యమ నాయకురాలైంది .తండ్రి ఫిషర్ క్వేకర్ కుటుంబానికి చెందిన వ్యాపారి .ఐర్లాండ్ మహా కరువు సమయం లో ఈ కుటుంబం ప్రజలను ఆదుకొన్న తీరు చిరస్మరణీయమైనది .ఎన్నో సేవా కార్యక్రమాలు ,దాన ధర్మాలు చేసిన కుటుంబం .పొటాటో ఉద్యమం లో సూప్ కిచెన్ లలో అన్నా ఎంతో సహాయపడింది .స్థానిక బాలికలకు స్వంత కాళ్ళ పై నిలబడి రాబడి పొందటానికి కుటీర పరిశ్రమలు స్థాపించారు .లేసుల తయారీ క్రోచేటింగ్ ,అల్లిక పనులలో శిక్షణ నిచ్చింది
.                                                                అరవై ఏళ్ళకు పైగా స్త్రీ విద్యా వ్యాప్తికి ,విముక్తికి కేథలిక్ మిషన్ తోకలిసి తీవ్ర పోరాటం చేసింది . .అమెరికాలోని ఆమె స్నేహితురాలు క్వేకర్ ఉద్యమ నాయకురాలైన సుసాన్ బి .ఆంధోని లా పురుషులతోపాటు స్త్రీకి సమాన హక్కు ,బానిసత్వ నిర్మూలన నియంతృత్వానికి వ్యతిరేక భావ వ్యాప్తితో పెరిగింది . క్వేకర్ బోర్డింగ్ స్కూల్ లలో చదివింది .యార్క్ షైర్లోని ఆక్వర్త్ స్కూల్ లో విద్యాబోధన చేసింది .అక్కడే ధామస్ అస్లాంతో పరిచయమైంది .ఇద్దరు ప్రేమించుకొని సంతానం కనకూడదు అనే ఒప్పందం పై వివాహం చేసుకొన్నారు .
భర్త కు కూడా స్త్రీ విద్యా వ్యాప్తి ,పురుషులతో సమానం గా స్త్రీ హక్కులు ఉండాలన్న భావాలు బలంగా ఉన్నాయి .హస్లాం కూడా క్వేకర్ కుటుంబం లోనే జన్మించటం వలన 1868 నుండి మహిళా సమస్యలపై ,స్త్రీ ఓటు  హక్కుపై ఎన్నో వ్యాసాలూ రాశాడు .1868 లో ‘’వివాహ సమస్య ‘’అనే కరపత్రం రాసి ముద్రించాడు .అందులో పరిమిత సంతానం అవసరాన్ని ,గర్భనిరోధానికి సూచనలను అపకారం చేయని మందుల గురించి రాశాడు .19 వ శతాబ్దపు ఐర్లాండ్ స్త్రీ ఉద్యమనాయకురాలిగా అగ్రస్థానం పొందింది అన్నా .1876 లో’’ డబ్లిన్ వుమెన్స్ సఫ్రేజ్అసోసియేషన్’’ ను ఈ దంపతులు స్థాపించారు ,దీనితో ఐర్లాండ్ లో స్త్రీ ఓటు హక్కు ఉద్యమం మంచి ఊపునందుకొన్నది .

                                                               1989 లో ఇస బెల్లా టాడ్ ను సెక్రెటరి చేసింది .ఐరిష్ హోం రూల్ ను సమర్ది౦చలేదుకాని ‘’వుమెన్స్ లిబరల్ యూనియనిస్ట్ అసోసియేషన్ ‘’కు డబ్లిన్ లో శాఖ ఏర్పాటు చేయటానికి సహకరించింది .ఈ పోరాటఫలితంగా 1896 లో ఐర్లాండ్ మహిళలు ‘’పూర్ లా గార్డియన్ ‘’గా పేదల న్యాయ అధికార సంస్థలలో మెంబర్లుగా ’ ఎన్నిక అవటానికి అధికారం లభించింది .1900 నాటికి ఈ లా సంస్థలు 100 అయ్యాయి .1898 లోనే అన్నాహస్లాం అర్హత గల మహిళలను వీటికై పోటీ చేయమని తీవ్రంగా ప్రచారం చేసింది .స్త్రీలకూ స్థానిక ప్రభుత్వ సంస్థలలో ,అర్బన్ రూరల్ జిల్లా కౌన్సిలర్ల ఓటింగ్ లో పాల్గొనే హక్కు లభించింది .1913 లో అన్నాసేక్రేటరిగా స్వచ్చందంగా పదవీ విరమణ చేసి గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకో బడింది .
1864 ‘’ అంటు వ్యాధుల చట్టం ‘’ను ఉపసంహరి౦చమని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చింది అన్నా హస్లానా . ఈచట్టం సైన్యం విడిది చేసిన చోట వ్యభిచారులపై ప్రభుత్వ నియంత్రణకు అవకాశం కల్పించింది . ఈ నియంత్రణ మొదట మూడునెలలే ఉంటుందని చెప్పిన ప్రభుత్వం సంవత్సర కాలానికి పొడిగించింది .దీనివలన మిలిటరీ వలన సెక్స్ వ్యాధులు సమాజం లో విజ్రుంభించకుండా చేయాలన్నది ప్రభుత్వ సంకల్ప౦ . ఆడవారిపై మందులతో చికిత్స కూడా భాగమైంది .ఇది వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయటంలో భాగమేనని,ఫ్యామిలీ లైఫ్ కు స్వస్తి చెప్పి వ్యభిచారాన్ని వ్యాపారంగా మార్చటమేనని అన్నా దీన్ని వ్యతిరేకించింది .చివరికి ప్రభుత్వంలొంగి 18 ఏళ్ళ ఆమె పోరాటం ఫలించి చట్టాన్ని ఉపసంహరించింది .
18 74 లో ‘’వుమెన్స్ ఆడ్వోకేట్ ‘’అనే మహిళా పత్రికను స్థాపించి నిర్వహించింది .డబ్లిన్ వుమెన్స్ సఫ్రేజ్ అసోసియేషన్ ఏర్పరచి చివరికి ఐరిష్ వుమెన్స్ సఫ్రేజ్ గా మార్చింది .కొందరు మిలిటెంట్ ఉద్యమంగా మార్చినా , ఆమె మాత్రం ఐరిష్ వుమెన్స్ ఫ్రాన్చేజ్ సెక్రటరిగానే ఉండి పోయింది .

                                                                             పురుషులతో సమానంగా స్త్రీలకు ఓటు హక్కు కోసం అన్నా 1866 లో 1499 మంది చేత సంతకాలు చేయించి సేకరించి ప్రభుత్వానికి అందజేసింది .1867 లో పురుషుల ఓటు అన్నివర్గాలకూ విస్తరించినా స్త్రీలకు హక్కు రాలేదు .1892 లో ఆమె పోరాటం ఫలించి స్త్రీలకూ ఓటు హక్కు కల్పించటమేకాక స్థానిక సంస్థలలో మహిళలు పోటీ చేయటానికి అవకాశం లభించింది .1916 లో భర్త ధామస్ అస్లాం తన ‘’ హంస గీతి’’ని ‘’సంలాస్ట్ వర్డ్స్ ఆన్ వుమెన్స్ ఫ్రాంచైజ్ ‘’ను చనిపోవటానికి ఒక ఏడాది ముందు ప్రదర్శించాడు . భర్త ఉద్యమాన్ని అన్నా కొనసాగించింది

                                                                                  1918డిసెంబర్ నాటికి అన్నా 90 ఏళ్ళ వయసులో తోటి స్త్రీలతో కలిసి మొదటి జనరల్ ఎన్నికలలో డబ్లిన్ లోని సెయింట్ స్టీఫెన్స్ గ్రీన్ పోలింగ్ కేంద్రం లో ఓటు వేయటానికి వెడితే ఆమె పై ఆనందం తో పుష్పవృష్టి కురిపించి తమ ఆత్మ గౌరవాన్ని ఉద్దీపనం చేసి ఐక్యతను సాధించిన ఆ మాతృ మూర్తికి హార్దిక స్వాగతం పలికారు .సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అన్నా హస్లాం చేసిన స్త్రీ విముక్తి పోరాటాన్ని అభినందించి ఆదరించారు .1922 లో మొదటి ఐరిష్ స్వతంత్ర దేశం ఏర్పడగానే 21 ఏళ్ళు దాటిన స్త్రీ పురుషులందరికీ ఓటు హక్కు కల్పించింది .అదే ఏడాది ఈ విజయాన్ని కన్నులారా చూసి సంతోషించి సంతృప్తి చెందిన అన్నా హస్లాం మరణించింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

————————————————————————————————————————————

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 )

20-10-1956 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోజన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ ,బెనారస్ విశ్వ విద్యాలయం నుంఛి  సోషియాలజీ లో ఎం .ఏ .తోపాటు సాహిత్యాచార్య ,ఆచార్య డిగ్రీలను లింగ్విస్టిక్స్ లో సంపూర్ణానంద్ సంస్కృత కాలేజి నుంచి అందుకున్నాడు .అదేయూని వర్సిటి నుండి పి.హెచ్ .డి.,డి.లిట్ లూ పొందాడు .సంపూర్ణానంద యూని వర్సిటి లో ఆధునిక భాషా శాఖలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ గా చేరి ,అందులోని యోగ సాధనా కేంద్ర ,శంకరాచార్య మండప్ లకు డిప్యూటీ డైరెక్టర్ గా పని చేశాడు .ఎందరో విద్యార్ధులకు రిసెర్చ్ గైడ్ గా వ్యవహరించి పరిశోధనలకు సహకరించాడు .

బౌద్ధ దర్శన మీమాంస ,చిత్ర చంపూ కావ్యస్య ససమీక్షణం సంపాదనం ,సంస్కృత ధ్వని విజ్ఞానం ,కావ్య శాస్త్రీయ పారిభాషిక్ శబ్దో౦కి నిరుక్తి (హిందీ )మొదలైన గ్రంధాలు రచించాడు ద్వివేది .ఆకాశవాణికి వార్తా సంపాదకుడిగా ,రాష్ట్రీయ ,మీర్జాపూర్ శ్రీ వేణీమాధవ పూర్ ట్రస్ట్ కు ట్రస్టీ గా ,కాశీ విశ్వేశ్వర దేవాలయ ఆచార్యునిగా ఉన్నాడు . జనవార్త హిందీ దైనిక్ పత్రికకు వారణాసి విలేకరిగా,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ క్రమ శిక్షణ కమిటీ మెంబర్ గా సేవ చేశాడు .ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్చభారత్ అభియాన్ కు ప్రచారకుడిగా కమిటీ మెంబర్ గా ఉన్నాడు .

విద్యా ప్రాభవానికి తగిన పురస్కారాలు బిరుదులూ ద్వివేదీ అందుకున్నాడు .కేరళ ప్రజ్హాస్సి రాజా చారిటబుల్ ట్రస్ట్ ‘’ఆచార్య రత్న ‘’బిరుదునిచ్చి సన్మానించింది .చత్రపతి శివాజీ సమ్మాన్ ‘’వేద పండిత పురస్కారం ‘’అంద జేసింది .20 11 లో ‘’కాశీ గౌరవ అలంకార్ ‘’లభించింది .అదే ఏడాది భారత ప్రభుత్వం శ్రీ దేవీ ప్రసాద్ ద్వివేదీ కి ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందజేసి గౌరవించి సత్కరించింది.

Inline image 1

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 )

కలకత్తా కన్జర్వేటివ్ హిందూ సంఘనాయకుడు ,మహా సంస్కృత విద్వాంసుడు రాదా కాంత దేవ్ మహా రాజా నవ కృష్ణ దేవ్ పెంపుడు కుమారుడూ ,రాజ్యానికి వారసుడు .సంస్కృత ,పర్షియన్ అరబిక్ భాషలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు .’’శబ్ద కల్పద్రుమ ‘’అనే సంస్కృత-సంస్కృత నిఘంటువును కూర్చినవాడు రాధాకాంత దేవ్ .దీని టాగూర్ వంశానికి చెందిన హర కుమార్ టాగూర్ అనే మరో ప్రసద్ధ సంస్కృత విద్వాంసుడు సహాయకారిగా ఉన్నాడు .ఈశ్వర చంద్ర గుప్త గారి పత్రిక ‘’సంబద్ ప్రభాకర్ ‘’లో  దేవ్ చాలా ప్రయోజనాత్మకమైన వ్యాసాలు రాశాడు .హిందువులు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ,బాలికలకూ విద్య చాలావసరమని ప్రచారం చేశాడు .ఇన్ని మంచి భావాలున్నా దేవ్ సనాతన సంప్రదాయవాది .సతీ సహగమనం వాళ్ళ వంశం లో లేక పోయినా ప్రభుత్వం దాన్ని నిషేధించాలని ప్రయత్నించినపుడు వ్యతిరేకించాడు .లార్డ్ విలియం బెంటిక్ బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు 1829 డిసెంబర్ లో ఒక రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా సతీ సహగమనాన్ని రద్దు చేసినపుడు  దేవ్ తనతోటి ఇతర సనాతన హిందువులతోకలిసి తండ్రి గోపీ మోహన దేవ్ స్థాపించిన ‘’ధర్మ సభ సంస్థ ‘’ద్వారా వ్యతిరేక ప్రదర్శనలు చేసి గవర్నర్ జనరల్ కు నిషేధ అజ్ఞను రద్దు చేయమని విజ్ఞాపన పత్రం సమర్పించాడు .8 3 ఏళ్ళు జీవించిన రాధా కాంత  దేవ్ 1867 లో మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 82 వ జన్మ దినోత్సవం

నమస్తే గోపాల కృష్ణ గారు -10-1-17 మంగళవారం మీ 82 వ జన్మ దినోత్సవం సందర్భంగా మా కుటుంబం ,సరసభారతి తరఫున హార్దిక శుభాకాంక్షలు . మంచి ఆరోగ్యం తో  ఆధ్యాత్మిక ,ధార్మిక సేవాకార్యక్రమాలతో వర్ధిల్లాలని, భగవంతుడు మీకు,,మీ కుటుంబానికి సదా రక్షగా ఉండాలని  మా ఆకాంక్ష . సంక్రాంతి శుభాకాంక్షలనూ ముందే అందజేస్తున్నాను -దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం )

3-బాలికా పంచాశికా –

ఇది కూడా 53 ముక్తకాలవంటి శ్లోకాలున్న లఘుకావ్యం .సమాజ స్వరూప చిత్రణలో ఆమె విశ్వ రూపం చూడవచ్చు .చివరి పంక్తి ‘’యఏతజ్జానీహి బాలికే ‘’(బాలా ఇది తెలుసుకో )అనే మకుటం .ఉద్వేగం ఉత్సాహం అన్యాయాన్ని సహించలేని స్థితి ఇందులో ఉన్నాయి .దీనికీ నాగరలిపి ,తెలుగు లిపి లో శ్లోకాలు, ఆంగ్లం లో వారమ్మాయి శ్రీమతి లలితా సుభాషిణి చక్కనిఅనువాదం ,కృతీ స్వీకర్త డా .రామానుజా చార్యులవారే స్వయం గా చేసిన తెలుగు అనువాదం ఉన్నాయి .ఈ కావ్యాన్ని కేవలం 24 గంటల వ్యవధిలో రాసినట్లు ప్రభావతీ దేవి గారు చెప్పుకున్నారు .

ముందుగా తన గురు దేవులకు ‘’సుబ్రహ్మణ్య సమారంభాం శ్రీ రామ స్వామి మాధ్యమాం-భీమ సేన నృసి౦హా౦ తాం వందే గురు పరంపరం ‘’అంటూ భక్త్య౦జలి ఘటించారు .

మొదటి శ్లోకం లోనే పెద్ద బాంబే పేల్చేశారు –‘’నాస్తి మాతృ సమా దేవీ –నాస్తి భ ర్త్రుసమో యమః –నాస్తి సుహ్రుత్సమో బన్ధుః- ఏతజ్జానీ హి బాలికే ‘’

భావం –అమ్మకు సాటి దైవం లేదు భర్తకు సాటి యముడూ –‘’లేడు ,మిత్రుని వంటి బంధువూ లేడు.లోకంపోకడ తెలుసుకో  బాలికా .

6 వ శ్లోక౦ –‘’పుత్రక్షేమార్ధినీ మాతా –సుఖం త్యజతి సర్వదా –భ్రుశం స్నిహ్యత్య మూన్ దృష్ట్వా – ఏతజ్జానీ హి బాలికా

భావం –పిల్లల సుఖం కోసం తన సుఖాన్ని త్యాగం చేసి బిడ్డ  సంపూర్ణ -తుస్టి కి ఆనందించే అమ్మ సంగతి తెలుసుకో బాలికా

9-‘’యత యోపి భవా పేతాః-జననీం చానమన్-అకుర్వన్ మృత సంస్కారాన్ —‘’

భావం –బంధ విముక్తులైన సన్యాసులు కూడా అమ్మప్రేమకు దాసోహమై ,ఆమెకు మృత సంస్కారాలు చేశారు –అలాంటి అమ్మ స్థానం తెలుసుకో అంటూ శంకరా చార్య వృత్తాంతాన్ని పరోక్షంగా చెప్పారు .

16-‘’ జన్మ దత్వా పిత పుత్రాన్ –యది నా వేక్షతే తదా –మృత తుల్యోహి స జ్ఞేయః –‘’

భావం –పిల్లల్ని కనగానే కాదు ,ప్రేమగా పెంచినవాడే తండ్రి –కానప్పుడు చచ్చినవాడితో సమానం అని లోక ప్రవృత్తిని చూపారు .

20-అంగా దంగా త్సుతో జాత –ఇతీదం వచనం పితా –యది నాద్రియతే తంతు –‘’

భావం –పుత్రుని గాఢా శ్లేషణం తో పులకించని తండ్రిమృతప్రాయుడే అంటూ శాకుంతలం లో శకుంతల దుష్యంతుని తో అన్నమాటల భావాన్ని పొందు పరచారు (పుత్ర గాత్ర పరిష్వంగ సుఖమ్ము మేలు )

22-‘’చాతుర్వర్ణ్యం మయా సృస్ట –మితీదం తు హరేర్వచః –అదృశ్వోయుజ్యతే నైవ —‘’

భావం –నాలుగే కులాలనునాడు  కృష్ణుడు చెబితే నేడు నాలుగు వందలై నాయి .అందుకే కులం ఒక చీడపురుగు

25- ‘’ఉద్యోగ పాఠశాలాసు –సర్వత్రాసన రక్షణం –తేన విజ్నో విన స్టార్ధః—‘’

భావం –ఉద్యోగం విద్యార్జన లలో రిజర్వేషన్ల వలన తెలివి తేటలకు స్థానం లేదు .

30-‘’విరుద్ధ వచనైః క్రుత్యైః-యో హితం స హరిణా తుల్యః —

భావం –సమ్మెలు ,ధర్నాలు చేస్తూ సామాన్యుని చంపే వైద్యుడు శ్రీహరి తో యెట్లా సమానమౌతాడని ప్రశ్నించారు –వైద్యో నారాయణోహరిఃఅన్నదానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ‘’’’హరీ’’, ‘’మని’’ అనిపిస్తున్నారు ‘’అని భావం .

35 –కామ క్రోధ జనిశ్చాయం –ఈర్ష్యా దాస్య సహోదరీ –గూఢ హాని కరో హ్యేషః—‘’

భావం –‘’బాధ’’ గురువు తలిదండ్రులు కామక్రోధాలు .సోదరి ఈర్ష్య .గూఢ హాని వ్రుత్తి ‘’అని బోధగురువులకంటే బాధ గురువులెక్కువై చేటు తెస్తున్నారని జ్ఞానోదయం చేశారు .అలాగే ఉపదేశ ధర్మం వదిలేసి సమదృష్టి లేక పక్షపాత దృష్టి తో ఉన్న వాడే నేటి గురువుగా చలామణి లో ఉన్నాడని మరో శ్లోకం లో దెప్పారు .మరో దానిలో డబ్బూ’’ పొగడ్తల డప్పూ’’లతో శిష్యుడు గురువును కొనేస్తున్నాడు ,గురువూ శిష్య వశుడై పోతున్నాడని ఆవేదన చెందారు .

40-‘’పాశ్చాత్య వనితాః దృష్ట్వా –అస్మన్నాగరకాధమాః-లజ్జా హీనాశ్చ బాదంతే—‘’

భావం –పాశ్చాత్య  దేశాల నుండి వచ్చే స్త్రీ పురుష యాత్రికులను లజ్జా హీనులైన మన పౌరులు బాదిస్తున్నారని ‘’మూర్ఖాః’’అనే ఈకవితలో ఆవేదన చెందారు .అందుకే వారు మనదేశానికి రావటం తగ్గించేశారు అని మరో కవిత చెప్పారు .దీనికే కొనసాగింపుగా –

44 –శ్లోకం –విదేశీ యేష్విదం కృత్యం –విదిత్వా దోష సంయుతం –పరాభవాన త ముఖాః—‘’

భావం –విదేశీయులను ఈ విధంగా మన వారు అవమానిస్తుంటే  మన నాయకులు తల ది౦చు కొంటున్నారు అమ్మాయీ తెలుసుకో .

4 5 –‘’హిందూ ధర్మస్య రక్షార్ధం –యతనీయం వివేకిభిః-తద్వినాశే జగన్నాశః –‘’

భావం –హిందూ ధర్మాన్ని అందరూ కలిసి రక్షించాలి .అది నశిస్తే జగత్తే నశిస్తుంది అని తెలుసుకోవాలి .

అనైక మత్యం మన స్వంతం ,అమర్యాద మనరాజ్యం స్వమతా క్షేపం మన నైజం అయింది మన లక్షణమేమితో తెలుసుకో .అని మరో శ్లోకం లో ఎరుక కలిగించారు

4 9-శ్లోకం –‘’మంత్రేషు పరి వాదాశ్చ –వేదానామవమాననా –అస్మాకం తు స్వభావోహి –స్వభావో దురతిక్రమః ‘’

భావం –మంత్రాలను వెక్కిరించటం, వేదాలను అవమానించటం ,మనందరి స్వభావ మై పోయింది .దాన్ని దాటి రావాలి

53-చివరి శ్లోకం –‘’ప్రభుత్వంరక్షక భటః –న్యాయాదీ శ్చ భూమిపాః-ధర్మ౦ సర్వే పి రక్షంతు –నైకో పి స్యాదధర్మగః ‘’

భావం –అధర్మం నశించి ప్రభుత్వ రక్షక భటులు న్యాయాదీసులు ,అధికారులు అందరూ ధర్మాన్ని రక్షించాలని అంటూ ముగించారు .’’ధర్మో  రక్షతి  రక్షితః ‘’అన్న ఆర్యోక్తిని గుర్తుకు తెచ్చారు .

‘’ సంస్కృతం లో ఆదర్శ వాదం తో కూడిన స్త్రీ వాదసాహిత్యంలేని లోటును ప్రభావతీ దేవి పూరించి పురుషాధిక్య సమాజానికి సవాల్ విసిరారు’’అని శ్రీ బండారు దత్తాత్రేయ గారు రాసిన ముందు మాటలు నూటికి నూరు పాళ్ళు యదార్ధం .ఆధునిక భావాలకు నిలువెత్తు స్వరూపంగా దేవి భాసి౦చారు  .

4-  చివరి పుస్తకం-శశిరేఖా  పరిణయం అనే 3 అంకాల రూపకం –

దీని పై స్పందించిన డా శివనూరి విశ్వనాధ శర్మగారు సంస్కృతం లో దేవిగారికి ఆశీరభినందనలు రాసి చివరగా

‘’శశి రేఖా విజయాఖ్య౦ రూపకమేవ తత్ప్రభావతీ దేవ్యా –రచితం రమణీయ తయా ప్రహసనమిహ రాజతాం సతం ‘’ అని మెచ్చుకొన్నారు .దీన్ని ప్రహసనం అన్నారు .

ఆమె బోధ గురువు డా బి నరసింహా చార్య ఆంగ్లం లో ;;శ్రీ ‘’అనే పేరుతొ ముందుమాట రాశారు . సంస్కృత రూపకం సమాజాన్ని చిత్రిస్తుందని ,ఇది దశ రూపకాలలో నాటిక విభాగానికి చెందినదని ,నాయిక శశిరేఖకు ఇందులో ప్రాధాన్యం ఉండటమే ఈ పేరు కు తగినదని ,ఇది విడంబన తరహా రూపకమని ,ఇందులో శశి రేఖ తో  పాటు నారదుడు,విలేపన ,అజ్ఞానం అనే పాత్రలున్నాయని ,త్రిమూర్తులు సెల్ ఫోన్ లో సంభాషి౦చుకొంటారని ,ఈ రూపకం దేవి గారి సృజన అని ,ఇందులో వైదర్భి శైలి ఉందని ,హీరోయిన్ శశిరేఖా మూడులోకాలూ తిరిగి త్రిమూర్తులతో సహా అందరినీ  ప్రశ్నలతో వేధించి ,తన లక్ష్య సాధనకు ధర్నాలు సమ్మెలు చేస్తుందని కనుక ఈ రూపకం సంప్రదాయ బద్ధమై కొత్త విషయానికి ఆధారమైనదని ఇందులో సమాజ క్షేమమే ముఖ్యమని రుజువు చేసిందని ,రచన సరళ సుందరం గా పాత్రోచితంగా జరిగిందని ,కద ప్లాట్ రచయిత్రి స్వంతమని ,,ఇందులో అద్భుత రసం చిప్పిలిందని సెంటిమెంట్ కు ప్రాదాన్యముందని ,యూనిటీ ఆఫ్ యాక్షన్,ప్లేస్ ,టైం ఉందని ,కాని కృత్రిమంగా ఉందని పించిందని అయినా హాయిగా చూసి చదివి ఆనందించ దగ్గ లక్షణం ఉందని ప్రేక్షకుల హృదయాలలోకి సూటిగా దూసుకు పోయే లక్షణం దీనిలో ఉందని  ఫెమినిజం పై రచయిత్రి కున్న అభిమానం అంతస్రవంతిలా సాగటం గుర్తించాలని అణగ తొక్క  బడిన వారి పక్షాన నిలి వారికి సానుభూతి చూపించటం హర్షించదగినదని సుప్రభాతాలతో మొదలైన దేవి సంస్కృత సాహిత్య యాత్ర అనేక దశలలో విస్తరిల్లి మహాకావ్య నిర్మాతగా వర్ధిల్లిందని కీర్తించారు  .డా  ఎస్ జి రామానుజా చార్యులు ఆమెను ‘’చైతన్య స్పూర్తి ‘’అని ఆశీర్వ దించారు . పుస్తకం లో ఈ రూపకానికి తెలుగు అనువాదమూ ఉండటం తో అందులోని భావం అందరూ గ్రహించే వీలు కలిగింది .చివరగా ప్రభావతీ దేవిగారి మనోభావం 54 వ శ్లోకం లో చక్కగా వివరించారు .మొత్తం రూపకం లో సంభాషణలే కాక 5 4 శ్లోకాలున్నాయి .అవీ సందర్భోచితంగా అమరాయి .

‘’న భవతు మత యుద్దో మాస్తు శాఠ్య ప్రకోపకః –న భవతు నర మేధో శ్రున్మాతిర్మస్తునృపాం

భావతువిమాలి చిత్తః సర్వదా తోష దాయీ –సకల సుజన మిత్రం ధర్మ వ్రుత్తోస్తు రాజా ‘’

భావం –మత యుద్ధాలు జరుగ కూడదు తీవ్రవాదం ప్రకోపించరాదు .నరమేధం జరగ రాదు .ఆకలి చావులు ఉండకూడదు .పాలకులు నిర్మల మనసుతో ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తూ అందరికి మిత్రులై ధర్మ చరితులై నడుచుకోవాలి .ఇదీ ఆమె ఈ రూపకం లో కోరుకొన్న ఉన్నత భావ లహరి .అలా జరగాలని జరుగుతుందని ఆశిద్దాం .

గొప్ప ప్రతిభా ,కవితా సామర్ధ్యం, ఊహ ,వర్ణన నైపుణ్యం .,సంస్కృతాంధ్ర సాహిత్యాలలో లోతైన అవగాహనా ,పురాణ వేద శాస్త్రాలలో నిష్ణాతృత్వం ఉన్న  శ్రీమతి ప్రభావతీ దేవిగారు  శాశ్వత కావ్యం ఆధునికభావాలతో సంప్రదాయంగా రచించి వాసి కెక్కాలని కోరుతున్నాను .వారిని ఈ తరానికి పరిచయం చేయటం నాధర్మగా అదృష్టంగా భావిస్తున్నాను .

‘’కవితా కన్యక గుణములు కవికన్న రసజ్నుడెరుగు కవి ఏమెరుగున్ –భువిలో కన్యక గుణములు ధవుడెరుగును కాక కన్న తండ్రే మెరుగున్’’అన్న పద్యాన్ని తన ‘’నామాట ‘’లో  కోట్ చేసి, రసజ్ఞులు తన కావ్యాలను చదివి ఆన౦దిస్తే తాను ఆనందంగా మరో కావ్యారంభం చేస్తానన్నారు ప్రభావతీ దేవి .శుభం భూయాత్ .

Inline image 1Inline image 2Inline image 3Inline image 4

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-1-17 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2

ప్రభావతీదేవి ప్రతిభా సర్వస్వం- ‘సహస్ర ఫణాః’’గా వేయిపడగలు సంస్కృతానువాదం ‘’.

విశ్వనాధ వేయిపడగలు అంటే  ఆయన ‘’మేగ్నం ఓపస్’’ గా భావింపబడే ఆధునిక నవలేతి హాసం .వెయ్యి పేజీల బృహత్ నవల .దీనిని సంస్కృతం లోకి తర్జుమా చేయమని గురుస్థానీయులు శ్రీ ఏలూరి పాటి అనంతరామయ్యగారు సూచించటం వెంటనే ఆకార్యక్రమాన్ని చేబట్టి దిగ్విజయంగా పూర్తి చేయటం శ్రీమతి ప్రభావతీదేవికే చెల్లింది .అది ప్రభావతీ మేధో సర్వస్వమే అయింది .డిసెంబర్ 28 వ తేదీన వారి అపార్ట్ మెంట్ కు మేము వెళ్ళినప్పుడు వేయిపడగలు వ్రాత ప్రతి ఆమె టేబుల్ పై దర్శన మిచ్చింది .ముత్యాలవంటి స్వదస్తూరితో చక్కని వరుసక్రమం లో ఆమె వెయ్యి పేజీలలో సంస్కృతం లోకి అనువాదం చేశారు .ముచ్చటవేసింది ఆ సంస్కృత ప్రతి చూడగానే .ఫోటోలు తీశాను .పుస్తకం ఆవిష్కరణ జరిగిందని విన్నానే ఎలా చేశారు అని అడిగితే డి. టి. పి. చేసిన సుమారు వంద పేజీల స్పైరల్ బైండింగ్ చూపించి దానినే ఆవిష్కరించామని చెప్పారు .దీని ఫోటో కూడా తీసుకొన్నాను .’’అనువాదం లో మీ స్త్రీవాద ప్రభావం పాత్రలపై పడిందా’’ ?అని అడిగాను’’లేదు .ఏపాత్రనూ నేను ముట్టుకోలేదు.విశ్వనాధ వారు ఏది ఎలాచేప్పారో దాన్ని తు చ తప్పకుండా సంస్కృతం లో రాశాను .కనుక పాత్రలపై నా ప్రభావం పడే అవకాశం లేదు, నేను తీసుకోనూ లేదు’’అని చెప్పారు .’’ఇంతటి బృహద్రచన అనువాదం చేయటానికి ఏంతో ఓపికా సమయం కావాలి కదా .ఎంతకాలం లో రాశారు ?అని అడిగితే’’ఏలూరి పాటి గురువు గారి ఆదేశం, ఆశీస్సు ,ప్రోత్సాహం ఉండటం వలన ఎక్కడా ఆగకుండా జయప్రదంగా 2001 లో ప్రారంభించి మూడేళ్ళలో 20 04 కు పూర్తి చేశాను ‘’అన్నారు ..’’ఆయన ఆదేశం పై రాశానని అన్నారు కదా అసలు ఆ నవలపై మీకు అంతకు ముందు ఎలాంటి అభిప్రాయం ఉంది ?’’అని అడిగితే ‘’ఆ నవల గురించి వినటమేకాని ,పూర్తిగా చదవలేదు కాని అనువాదం కోసం చదవటం మొదలు పెడితే అద్భుతం అని పించింది .రెట్టించిన ఉత్సాహం తో రాసుకుంటూ వెళ్ళిపోయాను ‘’అన్నారు .’’మరి ఈ కాలానికి సంస్క్రుతానువాదం పనికొస్తుందా ?’’అని అడిగా .’’అది కాలం నిర్ణయిస్తుంది .మన ప్రయత్నం మనం చేయాలి ‘’అని చెప్పారు ‘’.అందులోని ఏ పాత్రలు మీకు నచ్చాయి ?అని ప్రశ్నిస్తే ‘’మంగమ్మా ,భర్త లు బాగా నచ్చిన పాత్రలు.కారణం జవం జీవం ఉన్నపాత్రలు కనుక  ‘’అని ఠకీమని చెప్పారు .’’అందరికి ధర్మారావు అరుంధతి నచ్చుతారు కదా “’అన్నాను .’’వారివిషయం ఏమోకాని ధర్మా రావు విశ్వనాధ వారి ‘’టైలర్ మేడ్ షర్ట్ ‘’(ఈ మాట ఆమె అనలేదు కాని ఆమె భావానికి నేను పెట్టిన పేరు మాత్రమె )అని పిస్తాడు నాకు .మొదటి అరుంధతి అభిమాన పాత్ర .రెండో అరుంధతి నచ్చలేదు ‘’అన్నారు .’’అనువాదానికి న్యాయం చేశారని అనుకొంటారా’’ ?అనగానే ‘’నూటికి నూరు శాత౦ న్యాయం చేశాననే సంతృప్తి, సంతోషం నాకున్నాయి .’’అని ధీమాగా అన్నారు . ‘’నవల ముద్రణ ఎందుకు చేయలేకపోయారు “”?అని అడిగా ‘’నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటం ,అమెరికాలో ఎక్కువ కాలం ఉంటూ ఉండటం డి .టి .పి. చేసిన కాగితాలలో తప్పులు సరి చేయటానికి సంస్కృతం తెలిసిన వారు దొరకక పోవటమే ముఖ్య కారణాలు .2010 లోముద్రణకు ఇస్తే ఇ౦తవరకుఅది పూర్తి కాలేదు ‘’అని కొంత నిర్వేదంగా అన్నారు .నేను ఆమెకు చెప్పలేదుకాని సద్గురు శివానంద చారిటబుల్ ట్రస్ట్ వారికి కాని వారణాసి లోని సంస్కృత విద్యా సంస్థాన్ వారికి కాని ఇచ్చి ఉంటె ఎప్పుడో సంస్కృత వేయిపడగలు వెలుగు చూసి ఉండేదేమో అని పించింది .ఏమైనా’’ స్త్రీ సాహసం ‘’గా ప్రభావతీ దేవి గారు తెలుగు వారంతా గర్వపడే గొప్పపని గా’’ సహస్ర ఫణాః’’నుతెలుగువారికి అందించి ధన్యులయ్యారు .

2-‘’కృతో వా మానుష్యం ‘’.(మానవత్వం  ఎక్కడ ?’’)

ప్రభావతీ దేవిగారి మరొక సృజన ‘’కృతోవా మానుష్యంఖండకావ్యం . ‘’52 శ్లోకాల ఈ కవిత్వాన్ని నాగర లిపి, తెలుగు లిపిలో నూ ఇచ్చి ఇంగ్లీష్ లోకి ఆమె కుమార్తె శ్రీమతి లలితా సుహాసిని అనువదిస్తే ,శ్రీ ఏలూరి పాటి అనంతరామయ్యగారు తెలుగు అనువాదమూ చేసి మరింత శోభ చేకూర్చారు .ఈ  చతుర్వేణీ సంగమ కవితా ధార మధురం,సుందరం ఆలోచనా స్పందనం .ఇందులో లోకం లోని అన్యాయాలను ఎత్తి చూపి మానుష్యం యెటు పోతోంది అని ప్రశ్నించారు ప్రభావతీ దేవి .ఈ అన్యాయాలలో బ్రిటిష్ వారు చేసినవే కాక సమకాలీన కాలం లో పాకిస్తాన్ ,నేటి క్రికెట్ చేసే అన్యాయాలనూ ఏకరువు పెట్టారు . ఆతంక వాదుల ఆకతాయి తనం బాలబలాత్కారాలు ,గురుకుల విద్యార్దుల వధలు ,జైళ్ళల్లో చావులు ,అయోగ్యుల పదవీ అందలం, మతోన్మాదం రక్తపాతం వంటి సమస్యలలెన్నిటినో  స్పృశించి  తన లోకజ్ఞాత అచాటుకొన్నారు .సోదరులు ఆడపడుచులను ఆదుకోవటం లేదని బాధ పడుతారు .శ్రీ శ్రీకి లోకబాదే తనబాద అయినట్లు దేవిగారికీ అంతే .ఈ కృతిని తమ స్నేహితులు బి .జే .పి .సీనియర్ నాయకులు కేంద్రమంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారికి అంకిత మిచ్చారు .శిఖరిణీ వృత్తం లో రాసిన ఈ  శ్లోకాలు ఆమె చేతి పెంపుడు నెమలి లా నాట్యమాడాయి ..ఇందులోని కొన్ని సొగసులు చూద్దాం

మొదటి శ్లోకం-‘’ పవిత్రం త్వన్నామ ప్రధమ పదమాభాతి చ విధేః-ద్వితీయం సోపానం భవతి భవతాం దర్శన విధిః

భావద్విస్సల్లాపో నయతి నియతే రంతిమ పదం –క్రుతార్దాం త్వత్ స్నేహే తదియ భగవాన్ చిన్తయతుమాం ‘’

భావం – పవిత్రమైన నీపేరు పవిత్రతకు మొదటి మెట్టు గా  ఉండి,నిన్ను దర్శించటం రెండవ మెట్టు అయింది నీతో సంభాషణ భాగ్యానికి చివరి స్థానానికి చేరుస్తుంది .నన్ను నీ స్నేహం కృతార్దురాలిని చేస్తుంది .కనుక భగవాన్ !నన్ను గురించి ఎప్పడూ నువ్వు ఆలోచిస్తూ ఉండు .

19 వశ్లోకం –‘ఇమే ప్రౌఢా బాలాఃభ్రమర సరణాసక్త మతయః –సరోషాఃనిర్లజ్జాః స్వహిత పర నిస్టాః పరవశాః

అహంకారేణాంధాః స తు కర్తుం చ కుశలాః –పిత్రూన్ నిర్ భర్ త్సైతేసుఖమివ హి జీవంతి తనయాః .

భావం –తాడి చెట్లలాగా ఎదిగి వీదుల వెంట బలాదూర్ తిరుగుతూతమబాగే చూసుకొనే పరాన్నభుక్కులైన ఈ కుర్రాళ్ళకు ముక్కుమీద కోపం సిగ్గు లేనితనం పొగరుతో కళ్ళు మూసుకు పోయి కన్నవారిపై కస్సూ బుస్సు మంటూ సుఖంగానే బతుకు తున్నారు .

24-‘’వర్షేస్మిన్ వృషనామ్నిమూఢ మతయః కార్తీక మాసే చతు-ర్దశ్యా మధ్య తిదౌచ దక్షిణ మహా యానే గురౌ వాసరే

అస్మద్భారతదేశ ముఖ్య నగరే ,ధిల్ల్యాంసభాయాం ప్రగే-సార్ధైకాదశ వాదనేచ సమయే గ్న్యస్త్రాణ్య ముంచన్ శఠాః’’

భావం -13-12-20 01 గురువారం పగలు 11 -30 కి ధిల్లీ పార్లమెంట్ వద్ద మూఢ బుద్ధులైన ఆతంక వాదులు బాంబులు ప్రయోగించారు అని తిదివార నక్షత్రాలతో సహా తెలియ జేశారు  .

27- వ శ్లోకం లో నాటి ప్రధాని వాజ్ పాయ్ పాకిస్తాన్ కు గౌరవ ప్రదమైన మాటలతో యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ,ఆ మోసగాళ్ళు భారత సైన్యం పై విరుచుకు పడి నరమేధం సృష్టించారు. మానవత్వం ఎక్కడుంది ఆపపేరైనా ఎక్కడుంది అని ప్రశ్నించారు .

47 వ శ్లోకం –‘’ప్రజా తంత్రే తదపి చ భవెత్సేక్యులరితో –న హిందూ నే సాయీ జిన యవన భేదో న తు పరం

మహాన్త స్సంక్షోభా మత విషయకా రక్త సరితః –కుతో వా మానుష్యం బత తదభిదానం  చ భవతి .

భావం –ప్రజా స్వామ్యమైన మన మతా తీత రాజ్యం లో హిందూ ముస్లిం క్రైస్తవ జైన భేదం లేదు .కానీ మత సంబంధ కొట్లాటలు కాట్లాలకు అంతు  లేదు .రక్తం ఏరులై ప్రవహిస్తోంది .మానవత్వమెక్కడ దాని అడ్రస్ ఎక్కడుంది ?

52-‘’అయం కాంగ్రెస్ నేతా లయగమన రక్తో మునివరః –అయం లంపాకానా౦ ప్రతినిధి రయం సాదు చరితః

హతో రాగ్యా దుస్టైరదివ సమయే లోక పురతః –కుతో వా మానుష్యం బత తదభిధానం చ భవతి

Inline image 1Inline image 2‘’

భావం –కాంగ్రెస్ పార్టీ నాయకుడు ,దైవ భక్తుడు ,లంబాడీ ప్రజల ప్రతినిధి ,ఉత్తమ నడవడిక గలవాడు అయిన రాగ్యా నాయక్ నుపట్టపగలే అంతా చూస్తుండగా దుర్మార్గుల చేతిలో బలై పోయాడు .ఇంకెక్కడి మానవత్వం ?దాని చిరునామా యేడ?

ఏ సమస్యనైనా హాయిగాసులభంగా సుందరం గాశిఖరిణి లో మలిచి వన్నె తెచ్చి ,ఇంత తేలికగా సంస్కృతం లో రాయవచ్చా అని ఆశ్చర్య పరచారు ప్రభావతీ దేవి .ఈ కావ్యం మానవత్వానికి ఎత్తిన విజయ పతాక అని పిస్తుంది .

Inline image 3Inline image 4Inline image 5

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-1-17 –ఉయ్యూరు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు గారి తమ్ముడు శ్రీ శంకర నారాయణ గీసిన పోర్ట్రైట్ లు

narsapur-1 narsapur-2 balamurali-krishna-mangalampalli నరసాపురం లో ఆయనకు బాపు గారి పురస్కారం అందజేయటం ఆయన చిత్రించిన మంగళం పల్లి బాలమురళీ కృష్ణ చిత్రం మీకోసం

Posted in సమయం - సందర్భం | Tagged , | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి

ఆకాశం లో సగభాగం అయిన మహిళలు సాధించ రానిది ఏమీ ఉండదు అని నిరూపించిన  తెలుగింటి ఆడపడుచు డా అయ్యగారి ప్రభావతీ దేవి .చురుకైన మేధ,తలిదండ్రుల వారసత్వం ,తీర్చి దిద్దిన గురుదేవులు ,స్వయం కృషి ,పట్టుదల ,సాహసం తనను తానునిరూపించుకోవాలనే మనో నిశ్చయం వలన శ్రీమతి ప్రభావతీ దేవి గారు అనుకున్నవన్నీ సాధించారు . స్వయం సిద్ధ అయిన ఆమె జీవితం స్పూర్తి దాయకం .

దేవీ విలాసం –తాత తండ్రిల వారసత్వం

విద్వాత్కవులు ,పురాణ పరమేష్టి,ఆంద్ర వ్యాసులు ,సంస్క్రుతకళాశాల ప్రిన్సిపాల్ ,డీన్ శ్రీ  ఏలూరిపాటి అనంతరామయ్యగారు శ్రీమతి ప్రభావతీ దేవి గారి గురించి రాసిన ‘’దేవీ విలాసం ‘’వలన ఈమె  దేశభక్తుడు  ,స్వాతంత్రోద్యమం లో జైలుకు వెళ్లి,దానికి సంబంధించిన ఏ విధమైన ప్రతి ఫలం ప్రభుత్వం నుంచి ఆశించని త్యాగ శీలి అయిన శ్రీ  అయ్యగారి సుబ్బారావు గారి కుమార్తె అని , తల్లి శ్రీమతి శ్యామలంబ అని ,తండ్రి  ప్రయాగలో ఒక పుష్కర కాలం ఉండి సంస్కృతం ,హిందీ లలో ప్రావీణ్యం సాధించారని ,తాతగారు కుమార స్వామిగారు చతురాశ్రమ నిష్టా గరిస్టులని,వీరి సన్యాసాశ్రమ నామం ‘’కేశవానంద సరస్వతి ‘’అని స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కొత్త పేట తాలూకా బండారులంక అని ,తాత ,దండ్రుల సంస్కృత భాషాభిమానం, అభినివేశం ఈమెకు సంక్రమించిందని తెలుస్తోంది .తండ్రికి ఈ కుమార్తెపై ఆ శ్రీదేవి మీద  భక్తి ఉన్నంత వాత్సల్యం ఉండేది ‘.ప్రాణం కన్నా ఎక్కువగా పెంచారు .వారి వ్యక్తిత్వమే ఈదేవిగారికి అబ్బింది  .తండ్రి గొప్ప గణిత శాస్త్రాభిమాని .ఆయన స్వయంగా రూపొందించి గ్రంధస్థం చేసిన ‘’దీరమ్స్ ‘’చాలా ఉన్నాయి  ప్రభావతీ దేవిగారి అన్నగారు శ్రీ భుజంగరావు ఆల్విన్ సంస్థలో ఉద్యోగించి స్వచ్చంద పదవీ విరమణ చేసిన కమ్యూనిస్ట్ అభిమాని .తనకు పదవీ విరమణ సమయం లో కంపెనీ ఇచ్చిన ధనాన్నంతా పార్టీకే సమర్పించి ,సఫిల్ గూడా లో ఉంటున్నత్యాగి .

దేవి విద్యా సోపానం

ప్రభావతీ దేవి 29-6-1955 లో జన్మించారు .  1988 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి  చదివి తెలుగు ఎం.ఏ.పొందారు . 1991 లో  ఇంగ్లీష్ లో ఎం ఏ .ను ప్రైవేట్ గా చదివి సాధించి ,తర్వాత అదే యూని వర్సిటీ ఆర్ట్స్ కాలేజిలో చదివి సంస్కృతం లోనూ ఎం. ఏ .అందుకొన్నారు .’’సంస్కృతాంధ్ర భాగవతాస్టమ స్కంధాను శీలనం ‘’పై ఎం .ఫిల్ పట్టా పొందారు .విద్యాదాహం తీరని దేవి 1996 లో జర్నలిజం కోర్సు చేసి, హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం లో ‘’జ్యోతిషం ‘’డిప్లొమా తరగతులకు హాజరై జ్యోతిషం నేర్చారు కాని జాతకాలు వేయరు చెప్పరు .హిందీ తమిళ ,ఉర్దూలను అభ్యసించిన వీరు సెంట్రల్ ఇన్ స్టి ట్యూట్ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ లో 1998 లోస్పానిష్ భాషలో ప్రిలిమినరి కోర్సు చేశారు .ఆచార్య బూరగడ్డ నరసింహా చార్య వద్ద ఉస్మానియాలో ‘’సంస్కృత వాజ్మాయే నీతి కావ్యాని ‘’అనే విషయం పై పరిశోధన చేసి 2004 లో పి .హెచ్ .డి.పొందారు .

ఉద్యోగ సోపానం

ప్రభావతీ దేవి గారికి నాట్యం వ్రుత్తి కాదు కాని పాఠ శాల వార్షికోత్సవాలలో నాట్యం చేసేవారు .శ్రీ కృష్ణుడు వీరి అభిమాన పాత్ర .కాళిదాసు శకుంతల సంస్కృత నాటక౦ లో శకుంతల పాత్ర ,మరికొన్ని సంస్కృత నాటకాలలో ముఖ్య పాత్రలనూ పోషించారు .ఉపాధ్యాయ వ్రుత్తి పై అభిమానం ఉండటం తో కొంతకాలం రంగా రెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో తెలుగు పండితులుగా పని చేసి స్వచ్చందం గా విరమించి , సికందరాబాద్ మెహబూబ్ డిగ్రీ కాలేజి లో సంస్కృతం లెక్చరర్ గా1996 లో చేరి  పని చేస్తూ ,సంస్కృత పరి చర్య చేస్తూ 2007 లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు .2010 నుంచి అమెరికాలో ఉంటున్నారు .1988 లో హైదరాబాద్ లో ఆంద్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యం లో నేషనల్ ఓరియెంటల్ కాన్ఫ రెన్స్ లో 1-శ్రీ రాయప్రోలు సుబ్బా రావు ‘’అమలిన శృంగార తత్త్వం లోని ఔచిత్యం 2-సంస్కృత వాజ్మాయే ప్రహేళిక ‘’అనే రెండు పరిశోధన పత్రాలను సమర్పించారు ..1988 లో తిరుపతి లో జరిగిన విశ్వ హిందూపరిషత్ ధర్మ సమ్మేళనం లో ‘’హిందూ ధర్మ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ‘’పేపర్ ను,2002మార్చి  లో వారణాసి లో జరిగిన అఖిల భారత సంస్కృత సమ్మేళనం లో ‘’వైదిక ,లౌకిక సాహిత్య కరణా దృస్టౌ నారి ‘’పేపర్ ను సమర్పించారు .

దేవి సామాజిక సేవ

బహుముఖ ప్రజ్ఞాశీలి శ్రీమతి ప్రభావతీదేవి కి విద్యా తృష్ణ తోపాటు సాంఘిక సేవాభిలాష కూడా ఎక్కువే .తండ్రినుంచి సంక్రమించిన స్వతంత్ర దృక్పధం ఆమెను అన్నిరంగాలలో అగ్రేసర స్థానం లో నిలబెట్టింది .తండ్రి కాంగ్రెస్, అన్న కమ్యూనిస్ట్ అయితే దేవి గారు భారతీయ జనతాపార్టీ లో చేరి 1990 నుండి రెండేళ్ళు రంగా రెడ్డి జిల్లా స్త్రీ విభాగం లో అవిరామం గా పనిచేశారు .1993 లో భా జ.పా .కార్య వర్గసభ్యురాలిగా సేవలందించారు .ఆ భావ ధారఉన్న సంస్థలకు తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు .సఫిల్ గుడా లయన్స్ క్లబ్ చార్టర్ మెంబర్ గా ,ప్రెసిడెంట్ గా ఒక దశాబ్దం పైగాఉండి వివిధ సేవాకార్యక్రమాలను చేబట్టి నిర్వహించారు . బోలారం మహా కాళీ దేవాలయ ధర్మ కర్త్రుత్వసంఘ సభ్యురాలుగా చాలాకాలం ఉన్నారు .స్మార్తం క్షుణ్ణంగా అభ్యసించి కావాలనుకొనే వారికీ పౌరోహిత్యమూ నిర్వహిస్తున్నారు .

వివాహ బంధం

శ్రీ ఏలూరి పాటి వారి ‘’దేవీ విలాసం ‘’వలన ప్రభావతీ దేవిగారుసౌదీ అరేబియాలో ఇంజినీర్ గా పని చేసి ప్రస్తుత౦ అమెరికాలో సివిల్ ఇంజనీర్ గా ప్రముఖ పదవిలో ఉన్న పని  శ్రీ రాచపూడి హర గోపాల శర్మగారిని వివాహమాడి,సుగాత్రీ శర్మ ,లలితా సుహాసినీ అనేకుమార్తెలను ,కళ్యాణ చక్రవర్తి అనే కుమారుని ఆ దంపతులు సంతానంగా పొందారని.అందరకూ వివాహాలు చేసి బాధ్యతలు తీర్చుకున్నారని తెలుస్తోంది .

దేవి వ్యక్తిత్వ వికాసం

బహుముఖీన వ్యక్తిత్వ వైదుష్యాలు పెంచుకొంటూ పిల్లల విద్యాభి వృద్ధికి దోహదపడుతూ ,అన్ని రంగాలో అనుక్షణం ప్రశంసనీయకృషి చేస్తూ తన తన గురు పండితాదులకు   చేసే సేవనిరుపమానం అంటారు అనంత రామయ్యగారు  .ఒక చేతి తో చేసే దాతృత్వం రెండో చేతికి తెలియ కుండా చేసే గుణ సంపన్నురాలు .పాఠ శాల వ వార్షికోత్సవాలకు హాజరవుతూ వారి వికాసానికి దోహద పడుతూ ఆమె చేస్తున్న సేవ ఆమె నిరహంకార వ్యక్తిత్వానికి దర్పణం .ప్రాచీన పద్ధతిలో శాస్త్రాధ్యయనం చేసిన వారంటే ఆమెకు ప్రత్యేక గౌరవం .శ్రీ కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్య శాస్త్ర గురువుగా ,శ్రీ రామ స్వామి శాస్త్రి ఘన పాఠి గారు వ్యాకరణ శాస్త్ర గురువుగా ,ఆమె ప్రత్యేకంగా చెప్పుకొని గౌరవిస్తారు .అలాగే ఉస్మానియా లో తన గురువు, మార్గ దర్శి శ్రీ బి నరసింహాచార్య అంటే వల్లమాలిన భక్తీ వినయం ప్రదర్శిస్తారు .ఆమె ఆరాధ్యదైవం శ్రీ లలితా పరా భట్టారిక ను అనునిత్యం పూజింఛి సహస్రనామ పారాయణ చేయనిదే ప్రభావతీ దేవిగారు ఆహారం స్వీకరించరు .పారాయణ సమయం లో ఎవ్వరితోనూ మాట్లాడని దీక్ష ఆమెది దేవి ముందు చేసిన ప్రతిజ్ఞ అతిక్రమించదు .ప్రతి ఏడాది ఆమె నిర్వహించే చండీ హోమం రుద్రాభిషేకం చూసి తీరవలసి౦దేకాని మాటలతో  వర్ణించేది కాదంటారు ఏలూరి పాటి వారు .’’ఒకరు చెప్పింది చేయదు తనకు తోచింది చేయక మానదు .వట్టి ‘’చండిక ‘’‘’అంటారాయన .ఆపదలలో ఉన్న వారిని ఆడుకోవటానికి ఎంత దూరమైనా వెడుతుంది ఎంత ఖర్చైనా పెడుతుంది .సామాన్యులకు ఆమె మాట సుగ్రీవాజ్న .గుణ గ్రాహిణి,ఏక సంథ గ్రాహిణి .సంస్కృత సాహిత్య శాస్త్రం లో రసవంతాలైన శ్లోకాలెన్నో ఆమె జుహ్వాగ్రం పై నర్తిస్తాయి .ఆకాశవాణి కేంద్రం లో అమరవాణి కార్యక్రమాలలో ఆమె చేసిన ప్రసంగాలు ,స్వీయ కవితలు సమ్మోహనాలు, చిరస్మరణీయాలు అంటారు అనంతరామయ్యగారు .హైదరాబాద్ దూర దర్శిని లో ప్రసారమైన ‘’పద్యాల తో’’రణం’’కార్యక్రమం లో మూడు సార్లు ఆమె స్థాన నిర్ణేతగా వ్యవహరించి సమర్ధత చాటారు .అదే సంస్థ లో ఎర్రా ప్రగడ కవిత్వం పై ముఖా ముఖి కార్యక్రమం లోనూ పాల్గొన్నారు . ఒక ఓరియెంటల్ కార్యక్రమం లో ‘’అమలిన శృంగారం ‘’వాదాన్ని ఆక్షేపించి వచ్చిన ప్రతివాదాన్నీ ఎదుర్కొని సమాధానం చెప్పి నెగ్గిన తీరు మర్చి పోలేనిదంటారు శ్రీ  ఏలూరి పాటి .నల్లకుంట శంకర మఠం మొదలైన దేవతా స్థానాలలో ‘’దేవీ భాగవత సప్త శతి ‘’,మొదలైన ఆధ్యాత్మిక గ్రంధాలలోని పరమాద్భుత విశేషాలను వివరిస్తూ చేసిన ప్రసంగాలు స్తవనీయాలు ‘.పురుషాధిక్యాన్ని ధిక్కరించే తత్త్వం శ్రీ దేవిగారిది .శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ ,శ్రీ గరికపాటి నరసింహారావు శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ లవంటి లబ్ధ ప్రతిష్టులైన అవధానుల  తెలుగు సంస్కృత కవి  సమ్మేళనాలలో  పృచ్చకులుగా వ్యవహరించారు .శ్రీమతి ప్రభావతీ దేవిగారికి శ్రీ పుష్పగిరి పీఠాదిపతుల అమోఘ ఆశీస్సులున్నాయి.

రచనా ప్రభావతీయం

అభిజ్ఞాన శాకుంతలం పై సమీక్ష రాశారు .ఆంద్ర భూమి దినపత్రికలో 2001 -2002 కాలం లో శ్రీకృష్ణ కర్ణామృతం ‘’ధారావాహిక గా ప్రభావతీదేవి గారు రచించారు.1987 లో ‘’శ్రీ బోలారం మహా కాళీ సుప్రభాతం 2-2001 లో ‘’కుతోవా మానుష్యం ‘’?(మానవత్వం ఎక్కడ )3-2004 లో శశిరేఖా విజయం అనే నాటకం  4-బాలికా పంచాశికా 5కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి ‘’వేయి పడగలు ‘’నవల ను సంస్కృతం లోకి ‘’సహస్ర ఫణాః’’పేరుతొ అనువదించారు .దీని వ్రాత ప్రతి ఆవిష్కరి౦పబడింది .పుస్తక రూపం లో ఇంకా వెలువడలేదు .6 ‘గురు ధిక్కారం –శిష్య వాత్సల్యం’’ కూడా ముద్రణ పొందాలి .

దేవీ పురస్కార వైభవం

ప్రభావతీ దేవిగారి ప్రతిభకు తగిన పురస్కారాలు లభించాయి .1977 లో ‘’మధుర కవయిత్రి ‘’బిరుదును కంటోన్ మెంట్ టీచర్స్ యూనియన్ ప్రదానం చేసింది .1987 లో ‘’భారతీ ప్రభ ‘’బిరుదునిచ్చి ‘’సువర్ణ కంకణం ‘’బహూకరించి బోలారం మహా కాళి దేవాలయం సత్కరించింది .2003 లో ‘’గీర్వాణ భాషా సుభాషా ‘’నవ్య కళాసాగర్ సాహిత్య సంస్థ ప్రసిద్ధరచయిత శ్రీ పోతుకూచి సాంబశివరావు ,చేత సువర్ణ కంకణం ను రైల్వే మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా అంద జేసింది

ఆధారం –1-శ్రీమతి ప్రభావతీ దేవి గారి సంస్కృత రచన ‘’కుతోవా మానుష్యం ‘’లో శ్రీఏలూరి పాటి అనంత రామయ్య గారి వ్యాసం ‘’దేవీ విలాసం ‘’.

2-డా.బి నరసింహా చార్య గారిని నాకు ఫోన్ లో పరిచయం చేసిన వారు మా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు(అమెరికా ) .ఆచార్యులగారు తమ పుస్తకాలను నాకు పంపారు .వారితో సంభాషించేటప్పుడు వారు శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి వైదుష్యాన్ని ఆమె వేయి పడగలు ను సంస్కృతం లో కి అనువదించటాన్ని,ఆమెఅద్భత కవితా సామర్ధ్యాన్ని  తెలియజేసి ఆమె పై కూడా 3 వ గీర్వాణం లో నన్నుతప్పక  రాయమని ప్రోత్సహింఛి ఆమె ఫోన్ నంబర్ ఇచ్చారు .వారితో సంభాషించాను .ఆమె వ్యక్తిత్వం నచ్చింది .ఫోన్ లోనే ఇంటర్వ్యు చేశాను .కొన్ని వివరాలు చెప్పారు .శ్రీ ఏలూరి పాటివారు విపులంగా తనను గురించి రాశారని ఆ పుస్తకం తనవద్ద ప్రస్తుతం లేదని చెప్పారు .ఆమె మెయిల్ అడ్రస్ కు సరసభారతి టపాలు పంపుతున్నాను .రెండవ గీర్వాణం ,మాణిక్యాలు ,సీతారామయ్య, దైవ చిత్తం ,మా అన్నయ్య పుస్తకాలు పోస్ట్ లో పంపాను డిసెంబర్ 26  న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆమె తనకు పుస్తకాలు అందాయని మెయిల్ రాశారు .సమాధానం గామేము హైదరాబాద్ లో నాచారం దగ్గర మల్లాపూర్ లో ఉన్నామని రాశాను .వెంటనే మమ్మల్ని మాకు దగ్గరలోనే ఉన్న మెట్టుగూడాలోని తమ అపార్ట్ మెంట్  కు రమ్మని ఆహ్వానించారు .సరేనని వెళ్లాం .గీర్వాణం మొదటిభాగం కూడా అప్పుడు వారికి అందజేశాను .అప్పుడు ఆమె రచనలు మూడు పుస్తకాలు ఇచ్చారు . నేను ఆమెను ఇంటర్వ్యు కూడా చేశాను. అన్నిటికీ చక్కని సంతృప్తికర సమాధానాలు చెప్పారు తమ పౌరోహిత్య పాటవాన్ని సెల్ ద్వారా రికార్డ్ చేసింది వినిపించారు . ఇవన్నీ కూడా ఈ రచనకు ఆధారాలే .దీనికి కంతటికీ కారణ భూతులైన  శ్రీ మైనేని శ్రీ నరసింహా చార్య శ్రీమతి ప్రభావతీ దేవి గార్లకు కృతజ్ఞతలు .

డా .శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి గీర్వాణ కవితా వైదుష్యాన్ని తరువాత తెలుసుకొందాం .

Inline image 1

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-1-17 –ఆదివారం

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

2-1-17 సోమవారం సాయంత్రం విజయవాడ పుస్తక మహోత్సవం లో మంగళం పల్లి బాలమురళీ కృష్ణ సంస్మరణ సభ -అతిధులు సర్వశ్రీ అన్నవరపు రామస్వామి గొల్లపూడి మారుతీ రావు ,ఈల శివ ప్రసాద్ ,మల్లాది సూరిబాబు ,డి.వి మోహన కృష్ణ భూసారం వెంకటేశ్వర రావు

2-1-17 సోమవారం సాయంత్రం విజయవాడ పుస్తక మహోత్సవం లో మంగళం పల్లి బాలమురళీ కృష్ణ సంస్మరణ సభ -అతిధులు సర్వశ్రీ అన్నవరపు రామస్వామి గొల్లపూడి మారుతీ రావు ,ఈల శివ ప్రసాద్ ,మల్లాది సూరిబాబు ,డి.వి మోహన కృష్ణ భూసారం వెంకటేశ్వర రావు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

5 3 ఏళ్ళ క్రితం 1963 ల్లో నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా సర్వీస్ ప్రారంభించినపుడు నా మొదటి బాచ్ ఎస్ ఎస్ ఎల్ సి విద్యార్థిని,తర్వాత బందరులో హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయి ,కృష్ణా జిల్లా హెడ్ మ్మాస్టర్స్ అసోసియేషన్ కు మా ప్రోద్బలం తో ప్రెసిడెంట్ గాపని చేసిన శ్రీ మతి కొల్లి భారతి ఆత్మీయం గా తన కుమారుని వివాహంకానూరు ధనేకుల కళ్యాణ మండపం లో 21-12-16 బుధవారం రాత్రి జరుగుతుంది రమ్మని గౌరవంగా ఆహ్వానించగా వెళ్లి ,ఆమెకు సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక అందజేసిన చిత్రాలు .ఇందులో శ్రీ ఆదినారాయణ ,విశ్వం సుగుణకుమారి ,శర్మ రాజు మొదలైన రిటైర్డ్ హెడ్ మాస్టర్లు కూడా ఉన్నారు -దుర్గా ప్రసాద్

5 3 ఏళ్ళ క్రితం 1963 ల్లో నేను మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా సర్వీస్ ప్రారంభించినపుడు నా మొదటి బాచ్ ఎస్ ఎస్ ఎల్ సి విద్యార్థిని,తర్వాత బందరులో హెడ్ మిస్ట్రెస్ గా చేసి రిటైర్ అయి ,కృష్ణా జిల్లా హెడ్ మ్మాస్టర్స్ అసోసియేషన్ కు మా ప్రోద్బలం తో ప్రెసిడెంట్ గాపని చేసిన శ్రీ మతి కొల్లి భారతి ఆత్మీయం గా తన కుమారుని వివాహంకానూరు ధనేకుల కళ్యాణ మండపం లో 21-12-16 బుధవారం రాత్రి జరుగుతుంది రమ్మని గౌరవంగా ఆహ్వానించగా వెళ్లి ,ఆమెకు సరసభారతి పుస్తకాలు జ్ఞాపిక అందజేసిన చిత్రాలు .ఇందులో శ్రీ ఆదినారాయణ ,విశ్వం సుగుణకుమారి ,శర్మ రాజు మొదలైన రిటైర్డ్ హెడ్ మాస్టర్లు కూడా ఉన్నారు -దుర్గా ప్రసాద్

 

Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1-1-2017ఆదివారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో లడ్డూలతో ప్రత్యేక ప్రభాతఃపూజ,గోదాశ్రీ రంగ నాయకులకు కు౦కుమ పూజ , -వీధుల్లో సంక్రాంతి ముగ్గులు ,నగర సంకీర్తన బృందం ,శ్రీ విష్ణ్వాలయం లో అమ్మవార్లు అయ్యవార్లు ,అర్చకస్వామి

1-1-2017ఆదివారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో లడ్డూలతో ప్రత్యేక ప్రభాతఃపూజ,గోదాశ్రీ రంగ నాయకులకు కు౦కుమ పూజ , -వీధుల్లో సంక్రాంతి ముగ్గులు ,నగర సంకీర్తన బృందం ,శ్రీ విష్ణ్వాలయం లో అమ్మవార్లు అయ్యవార్లు ,అర్చకస్వామి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

విశ్వనాధ వారి ”వేయిపడగలు ”నవలను సంస్కృతం లో ”సహస్ర ఫణాః”గా అనువదించిన ఉస్మానియా యూని వర్సిటి రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ డా.శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి హైదరాబాద్ -మెట్టు గూడా లోని అపార్ట్ మెంట్ లో 28-12-16 బుధవారం సాయంత్రం మేమిద్దరం ,మా పెద్దకోడలు శ్రీమతి సమత,మా మనవ రాలు ఛి రమ్య Translate

విశ్వనాధ వారి ”వేయిపడగలు ”నవలను సంస్కృతం లో ”సహస్ర ఫణాః”గా అనువదించిన ఉస్మానియా యూని వర్సిటి రిటైర్డ్ సంస్కృత లెక్చరర్ డా.శ్రీమతి అయ్యగారి ప్రభావతీ దేవి గారి హైదరాబాద్ -మెట్టు గూడా లోని అపార్ట్ మెంట్ లో 28-12-16 బుధవారం సాయంత్రం మేమిద్దరం ,మా పెద్దకోడలు శ్రీమతి సమత,మా మనవ రాలు ఛి రమ్య
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Photo:
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మాపెద్ద మేనల్లుడు ఛి వేలూరి అశోక్ షష్ఠి పూర్తి మహోత్సవం హైదరాబాద్ లోయర్ టాంక్ బండ్ ఫంక్షన్ హాల్ లో 30-12-16 శుక్రవారం ఉదయం జరిగిన సందర్భంగా చిత్రమాలిక

మాపెద్ద మేనల్లుడు ఛి వేలూరి అశోక్ షష్ఠి పూర్తి మహోత్సవం హైదరాబాద్ లోయర్ టాంక్ బండ్ ఫంక్షన్ హాల్ లో 30-12-16 శుక్రవారం ఉదయం జరిగిన సందర్భంగా చిత్రమాలిక

 

Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo: Photo:
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం )

16 వ శతాబ్ది ఉత్తరార్ధం లో జీవించిన సంస్కృత విద్వాంసుడు దామోదర భట్టు ‘’యంత్ర చింతామణి ‘’లేక ‘’కల్ప చింతామణి ‘’అనే గ్రంధాన్ని రాశాడు ఇది పూర్తిగా ‘’అభిచార ‘’పద్ధతులను తెలియ జేస్తుంది ఈ గ్రంధం ఆధారంగానే ప్రాంతీయ భాషలలో దానికి సంబంధిన పుస్తకాలు ప్రచురితమయ్యాయి .ఈ గ్రంధాన్ని మొట్టమొదటి సారిగా అధ్యయనం చేసి ,1939లో ఫ్రెంచ్ భాష లోకి అనువదించినవాడు జీన్ మార్కేస్ రివేర్రీ ‘.ఇటీవలికాలం లో హన్స్ జార్జ్ టూర్స్టిగ్ దీనిపై విపులమైన వ్యాఖ్యానం రాశాడు .గుడున్ బూహేన్మాన్ ఈ గ్రంధాన్ని సంక్షిప్తం చేసి ‘’యంత్రాస్ అండ్ మండలాస్ ‘’పేరిట ప్రచురించింది .

25-స్వామి దయానంద సరస్వతి గురువు –విరజానంద  దండీశ (1777 -1868)

పంజాబ్ లోని జలంధర్ దగ్గరున్న కర్తార్ పూర్ లో 1778 లో మొహియాల్ వంశం లో విరజానంద జన్మించాడు .చిన్నప్పుడే 5 వ ఏట మసూచిక౦  వచ్చి కంటి చూపు పోయింది .ప్రాధమిక సంస్కృత పాఠాలు నేర్పిన తండ్రి చనిపోయాడు .ఆదుకోవాల్సిన అన్నా వదిన ల దాష్టీకం భరించలేక ఇంటి నుండి వెళ్లి పోయాడు .దేశాటనం చేస్తూ హృషీకేష్ చేరి అక్కడే తపస్సు ధ్యానం తో గడిపాడు .దైవ ఘటన వలన విరజానంద హరిద్వార్ చేరాడు .అక్కడ పూర్ణ నాద్ అనే యోగి,సంస్కృత పండితుడు  విరజానంద్ కు సన్యాసం ఇచ్చి ,సంస్కృత వ్యాకరణం బోధించి ,ఆర్ష సంప్రదాయాన్ని బాగా వంట పట్టించి ,హిందూత్వాన్ని బలంగా హృదయం లో నాటాడు .అన్ని సంస్కృత సాహిత్య  శాఖలలో ఆరి తేరి కొంతకాలం విద్యా బోధనా చేశాడు విరజానంద .

విద్యలకు కాణాచి అయిన కాశీ చేరి 10 ఏళ్ళు గడిపి మీమాంస ,ఆయుర్వేద ,వేదాలను క్షుణ్ణంగా అభ్యసింఛి గొప్ప విద్వాంసుడై కాశీ లోని విద్వాంసులలో ముఖ్యుడయ్యాడు . గయ కు వెళ్లి ఉపనిషత్తులపై సాధికారత సాధించి ,కలకత్తా వచ్చి దేశం లోనే ప్రముఖ సంస్కృత విద్వాంసుడనే ఖ్యాతి పొందాడు .తనకున్న సంస్కృత వ్యాకరణ సాహిత్య పాండిత్యం తో మంత్రముగ్ధమైన స్వర౦ తో    సమ్మోహపరచాడు . నగరం లో నుంచి బయటపడి గంగానది ఒడ్డున గడియా  ఘాట్ వద్ద నివాసమేర్పరచుకొని ఉండగా ఆల్వార్ మహా రాజు విరజానంద్ ను దర్శించి ,ప్రభావానికి లోనై ,ఆహ్వానించగా ఆల్వార్ వెళ్లి ఆస్థానం లో ఉండి ,రాజు కోరికపై ‘’శబ్ద బోధ ‘’రాశాడు దీని వ్రాత ప్రతి ఆల్వార్ లైబ్రరీలో భద్రపరచబడి ఇప్పటికీ అతి విలువైనది గా పరిగణింప బడుతోంది .ఆల్వార్ నుండి సోరోన్ ,అక్కడి నుంచి మధురకు విరజానంద చేరుకొన్నాడు.

మధుర లో ఒకపాఠ శాల స్థాపించి నడిపాడు .దేశం లోని పలు ప్రాంతాలనుండి విద్యార్ధులు వచ్చి చేరి చదువుకున్నారు .ఈ సంస్థ నిర్వహణ రాజుల విరాళాలతో నిర్వహించబడింది .అదే సమయం లో సరైన గురువుకోసం దయానంద సరస్వతి దేశమంతటా అన్వేషిస్తూ మధుర చేరాడు .అక్కడ పూర్ణ శర్మ  స్వామి అనే యోగి వలన తగిన గురువు విరజానంద ఒక్కడే అని తెలుసుకొన్నాడు 1860  లో మధురలో విరజానంద ను దర్శించాడు .విద్య పరమార్ధం ఏమిటి అని విరజానంద దయానందను అడిగి ,ఆయన ‘’కౌముది ‘’సారస్వత ‘’అనే రెండు ప్రముఖ వ్యాకరణ గ్రంధాలు ఆపోసన పట్టాడని తెలుసుకొని ఆరెండిటిని  యమునా నదిలో విసిరేసి తనదగ్గరకు రమ్మన్నాడు విరజానంద .

విరజానంద నే గురువుగా భావించి ఆయన చెప్పినట్లే చేసి కాళ్ళపై పడ్డాడు దయానంద .  అంధుడైనా విరజానంద విద్యా బోధన చాలా క్రమ శిక్షణతో నడిచేది .శిష్యుల అనుమానాలను పుస్తకం లేకుండానే తీర్చగల సర్వ సమర్ధుడు విరజానంద గురువు .దయానంద ను తీర్చి దిద్ది తనంతటి వాడిని చేశాడు .విరజానంద  దయానంద  ను హిందూమత పునరుద్ధరణ మే తన గురు దక్షిణగా కోరాడు .ఆర్ష ,వేద సాహిత్య వ్యాప్తికి  అంకిత మవమని శిష్యుని ఆదేశించాడు .గుర్వాజ్నను శిరసావహించి దయానంద మహర్షి వేద ఆర్ష సాహిత్య వ్యాప్తి చేస్తూ హిందూమతాన్ని పునరుద్ధరించటానికి జీవితం ధార పోశాడు .విరజానంద 90 వ ఏట 14-9-1868 న మహా సమాధి చెందాడు .గురువు మరణానికి  స్పందిస్తూ శిష్యుడు స్వామి దయానంద ‘’ఇవాళ వేద వ్యాకరణ తేజో భానుడు అస్తమించాడు ‘’అన్నాడు .కేంద్ర ప్రభుత్వం 14-9-1971 న విరజానంద స్మారక పోస్టల్ స్టాంప్  విడుదల చేసి గౌరవించింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-17 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment