ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -223 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -223

82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ 3

  తీవ్ర వాదుల పార్టీల కార్యక్రమాలు బాగా వేగంగా ఊపు నందుకోన్నాయి .డిప్రెషన్ ,ఇన్ ఫ్లేషన్ పరిస్థితులను మరీ దిగ జార్చాయి .19 18 లో జర్మని కరెన్సీ లో డాలరు కు 4 మార్క్ లు వస్తే, 1922 లో డాలర్ కొనాలంటే 75 మార్కు లు  1922 లో 100 మార్క్ లు చెల్లించాల్సి వచ్చింది  .ఆ తర్వాత కూడా ప్రతి నెలా మార్క్ పతనం కొనసాగింది .1923జులై  కు పరిస్థితి  మరీ దిగ జారిపోయి 1 50 000అయి,ఆగస్ట్ నాటికి మిలియన్ మార్క్ లకు దేకింది. కరెన్సీ పతనం నాజీలకు బాగా కలిసి వచ్చింది . ఆహార కొరత ,నిరుద్యోగం ,సాధారణ దివాలా ,కూడా వాళ్లకు పంట పండించింది .ఈ గండాలనుంచి దరి చేర్చటానికి ప్రజల్ని ఆదుకోవటానికి నాజీ పార్టీ ఒక్కటే సరైనది అనే అభిప్రాయం బాగా కలిగించారు దేశాన్ని దివాలా స్థానం నుంచి ఉద్ధరించటానికి ,ప్రాంతీయ అలజడులు అంతర్జాతీయ దాడుల నుండి కాపాడ గలిగే పార్టీ నాజీ పార్టీ ఒక్కటే అనే గట్టి నమ్మకాన్ని హోరెత్తే ప్రచారం తో కలిగించారు .వేర్సేల్లీస్ ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్ ను బాగా ప్రచారం చేసి శక్తి వంతమైన జర్మనీ నిర్మాణం చేయాలన్న ఆలోచనకు మద్దతు సంపాదించారు .ప్రజల్ని ఎలా మాటలమాయతో మభ్యపెట్ట వచ్చో హిట్లర్ కు బాగా తెలుసు .ముఖ్యంగా ప్రజల ఫ్రస్ట్రేషన్ తో ఎలా ఆడుకోవచ్చో తెలుసు ..వాళ్ళకోరికలు తీరుస్తానని , జర్మనీ కీర్తి విశ్వ వ్యాప్తమవుతుందని పూర్తీ నమ్మకం కలిగించాడు .రహస్య క్రూర పోలీసు దళాలతో ,దారి తప్పిన ప్రజల్ని దారిలోకి తెచ్చుకొన్నాడు .విప్లవానికి పరిస్థితి తిబాగా పక్వమై౦దని గ్రహించి పార్టీని సివిల్ వార్ కు పురిగొల్పాడు .1923 నవంబర్ లో బ్రవేరియాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం లాక్కోవాలని ప్రయత్నించాడు .సరైన ప్రయత్నం ,ముందు జాగ్రత్తలు తీసుకోక పోవటం వలన అది ఫలించలేదు .సైనిక తిరుగుబాటు జరుగుతుందని ఊహించాడుకాని జరగలేదు పైగా హిట్లర్ అరెస్ట్ అయ్యాడు  . .ఇదొక పెద్ద అపజయం .

ఇప్పటికి 35 ఏళ్ళు వచ్చాయి హిట్లర్ దొర గారికి .జర్మనీ లో ప్రతి వారి నోటినుంచి హిట్లర్ హిట్లర్ అనే నామం మంత్రోచ్చారణగా వినిపించి మహా ప్రసిద్దుడైపోయాడు .ఆయన పై జరిగిన 9 నెలల విచారణ ,జైలు జీవితం హిట్లర్ ను త్యాగ వీరుని చేశాయి .జైలు లో ఉండగానే ‘’మీన్ కాంఫ్ ‘’లో చాలా భాగం రాశాడు .అదే నాజీలకు పవిత్ర బైబిల్ అయింది..జైల్లో ఉంటూ పార్టీ నాయకులతో సంప్రదిస్తూ పార్టీని మరింత పదును పెట్టాడు .హిట్లర్ కు క్షమా భిక్ష ఇచ్చి విడుదల చేశాక తన స్థానాన్ని పదిల పరచుకొనే ప్రయత్నం గట్టిగా చేశాడు .అయిదేళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి తనకు అడ్డు వస్తారను కొనే వాళ్ళనందర్నీపురుగుల్ని నలిపినట్లు నలిపి పారేశాడు .తనకున్న లేబర్ వ్యతిరేక విధానాలతో ముఖ్య పారిశ్రామిక వేత్తల మద్దతు సంపాదించాడు .సైనికాధికారులూ అతన్ని సమర్ధించి మరింత శక్తి వంతుడిని చేశారు .దేశం లోని అసంతృప్తిని బాగా కాష్ చేసుకొని తన అధికారానికి  అవకాశ వాదం తో అధికార పీఠం పై కూర్చోవటానికి రాచ బాట వేసుకొన్నాడు.

 45 వ ఏట అధికారం చేతిలో ఉంటే దేనినైనా సాధించవచ్చు ననుకొన్నాడు .ముందుగా రాజ్యాధికారం పొందాలి కనుక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేశాడు .మాటల గారడీ ,ట్రిక్కులు ,ఆశలు కల్పించి ఎన్నికల ప్రచారం నిర్వహించాడు ఇల్లు లేనివాళ్ళకు ఇల్లు ,నిరుద్యోగికి ఉద్యోగం ,అతి ముఖ్యంగా అదో జగత్ సహోదరులు తనలాగే పైకి వచ్చే అన్ని రకాల అవకాశాలు కల్పిస్తానని ఆశ పెట్టాడు .అన్నీ కలిసి వచ్చాయి .అతనికి వ్యతిరేకంగా ఉన్న లెఫ్ట్, రైట్ నాయకులు ఒక్కటికాలేక పోయారు .చట్టప్రకారం రాజ్య భోజ్యానికి చేసిన కుట్ర ఫలించింది .45 వ ఏట ఎందుకూ పనికి రాని ఒక పోస్ట్ కార్డ్ పెయింటర్  ,వియన్నా వీధుల్లో తిండికి ,నిద్రకు అలమటించి తిరిగినవాడు అయిన హిట్లర్ –రిపబ్లిక్ ప్రెసిడెంట్ ముసలి యుద్ధ వీరుడు మార్షల్ హీన్దేన్ బర్గ్ పై ఒత్తిడి తెచ్చి తనను చాన్సలర్ నియమంచమని కోరాడు .1933 జనవరి 30 అయిన ఆ దుర్దినం నుంచి అతనిమాట ,చర్య పరమ భీకరంగా మారి జర్మనీకి అన్నివిధాల తానేప్రభువును అనే స్థితిలోకి వచ్చి ,యూరప్ అంతా తానే పరిపాలిస్తానని భయపెట్టాడు .’’To day Europe tomorrow the whole world ‘’అనే స్లోగన్ తో అందర్ని కంగు తినిపించాడు .

   చాన్సలర్ నుండి డైరెక్టర్ కు వెంటనే ఎదిగిపోయాడు .తన సహచరులు గోరింగ్ ,గోబెల్ల్స్ కు సర్వాధికారాలు ఇచ్చి విపక్ష వర్గాన్ని ఏవిధంగా నైనా అణచి  నాశనం చేసి పారేయ్యమన్నాడు  .హిట్లర్ వాణి అయిన గోరింగ్ పార్టీ అధినేత,డైరెక్టర్ కూడా  అయి నరకాసుర పాలన చేబట్టారు .గోబెల్స్ పబ్లిక్ యెన్ లైటేన్ మెంట్  మంత్రిగా ముఖ్య ప్రాప గాండ చేశాడు .రీచ్ స్టాగ్ బిల్డింగ్ ను తగల బెట్టించిన ఈ ఇద్దరు ప్రభుద్దులు కమ్యూనిస్ట్ లే ఆ పని చేశారని   ప్రచారం చేశారు .అందుకే అప్పటినుంచి అసత్య ప్రచారాలను ‘’గోబెల్స్ ప్రచారం ‘’అనటం ఆనవాయితీ అయింది ప్రపంచం లో .దీనితో అన్ని ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికినాంది అయింది . స్వీయస్వేచ్చా  ,వాక్ స్వాతంత్ర్యం  ,పత్రికా స్వాతంత్ర్యం  ,పోస్టల్ కమ్యూని కేషన్ లో ఉన్న రహస్య౦ అన్నిటికి భంగం కలిగించి స్వేచ్చకు సంకెళ్ళు వేశారు .     .తన నిర్వాకాన్ని తెలియ జేస్తూ గోరింగ్ బోరింగ్ గా ‘’నా చర్యలు న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండవు .న్యాయం పై నాకు చింత లేదు .నా సంకల్పం సర్వ నాశనం ,దు౦పనాశనం, నిర్మూలనమే ‘’అని నిర్లజ్జగా ప్రకటించాడు .రీచ్ వ్యవస్థ చేసే దురాగత ప్రజా వ్యతిరేక చర్యల నుంచి రక్షి౦చటానికే  అనే బూటకం తో హిట్లర్ రాజ్యాంగాన్ని కూడా ప్రక్కకు పెట్టేశాడు .విశ్లేషకుడు అలాన్ బులాక్స్ వివరించినట్లు ‘’కొత్త రాజ్యం లోని సంపత్తిని అంతటినీ వీధి రౌడీ గాంగ్ లు స్వాధీన పరచుకొని పెత్తనం చేశారు .మురికి నాయాళ్ళు అందలమెక్కారు ‘’.1933 జులై 14 న జర్మనీలో నాజీ పార్టీ ఒక్కటే రాజ్యాంగ బద్ధమైన పార్టీ అనే చట్టాన్ని తెచ్చాడు .దీనితో పెట్రేగిపోయిన నాజీ మూకలు భీభత్సం ,హత్యాకాండ, దమన కాండ ,లతో రక్తపు టేరులు పారించారు .హిట్లర్ ఇప్పుడు ‘’ఫ్యూహ్రేర్ ‘’ అంటే సర్వాధికార నియంత అయ్యాడు .రాజ్య పాలకుడిగా సైన్యం పైనా అధికారం పొందాడు .సైనికు లందరి చేత ఎలాంటి భేషజం లేకుండా ‘’హిట్లరే మా నాయకుడు ,ఆయనకే లొంగి ఉంటాము’’అనే పవిత్ర శపథం చేయింఛి జర్మనీ సామ్రాజ్యానికి అరివీర భయంకరుడయ్యాడు  .తన దేశాన్ని లోబరుచుకొన్న గట్టర్ హీరో హిట్లర్ ఇప్పుడు ఉపఖండాన్ని జయి౦చాలనే ఉబలాటం లో ఉన్నాడు .

మొదటి ప్రయత్నంగా లీగ్ ఆఫ్ నేషన్స్ కు గొళ్ళెం పెట్టాడు .మొదట్లో బ్రిటన్ గొణిగినా తర్వాత జర్మనీకి  కొత్తాయుధ వితరణ ఇచ్చింది .అంతర్జాతీయ పరిస్థితి ని హిట్లర్ బాగా అవగాహన చేసుకొని దాన్ని ప్రయోజనం గా చేసుకొనే ప్రయత్నం చేశాడు .శత్రువుల బలహీనత లను పసిగట్టే మేధావి హిట్లర్ .వారి విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకొనే మహా తెలివి తేటలున్న వాడు .తన దేశం జర్మనీ లోని విభేదాలను తుంగలోతొక్కి అధికారానికి వచ్చినవాడుకనుక సామ దాన భేద దందోపాయాలన్నీ తెలుసు. ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ ప్రయోగించాలో తెలిసిన కౌటిల్యుడు .ఇంగ్లాండ్ ను ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా చేశాడు .ఫ్రాన్స్ ను  పోలాండ్ కు వ్యతిరేకం చేశాడు .రష్యాను పశ్చిమ దేశాలకు వ్యతిరేకిని చేశాడు .జెనీవాలో జరిగిన ఆయుధ విసర్జన సమావేశం ఫలప్రదం కాకుండా అడ్డుపుల్ల వేశాడు .జర్మనీలో నిర్బంధ సైనిక విధానం అమలు పరచి అందర్నీ సైన్యం లో చేర్చే ప్రయత్నం చేశాడు .విద్య ,వ్యాపారం వాణిజ్యం ,జర్నలిజం దియేటర్ లలో బాగా స్థిర పడి ఉన్న జ్యూలన్దర్నీ దేశ బహిష్కారం చేసి  వారి స్థానాలలో తన ‘’చెంచా గాళ్ళ’’ను కూర్చోబెట్టాడు .ఏది ప్రసారం చేయాలో ఏది కూడదో నిర్ణయిస్తూ సమాచార వ్యవస్థను స్వాధీనం చేసుకొన్నాడు .దీనితో  విధ్వంసానికి కోట గోడ కట్టాడు. దేశ ద్రోహ గ్రంధాలు అనే ముద్ర వేసి విలువైన  సాహిత్యాన్ని అంతా తగుల బెట్టించాడు . ముందుగ  కమ్యూనిస్ట్ సానుభూతి రచనలను, తర్వాత జ్యూ ల ఫ్రాయిడ్ యొక్క ,హీన్ యొక్క రచనలన్నీ తగలబెట్టించి భోగి మంటలు వేయించి ఆనందంగా చలి కాచుకొన్నాడు .ఆర్య వ్యతిరేకమైనవన్నీ భస్మీపటల మైపోయాయి .ఇంతటితో ఆగక సోషల్ డెమొక్రాట్ ల ,యుద్ధ వీరుల ,అసమ్మతి సైంటిస్ట్ ల ,అధిక అధికారం చెలాయించే వారిపై రాసిన విమర్శల నన్నిటినీ తగలబెట్టి వినోదం పంచుకొన్నారు ఆ కిరాయి మూకాసురులు .

     1936 లో యూరప్ సమస్యలతో సతమత మైంది .ఫాసిస్ట్ ఇటలి సంధిని ఉల్లంఘించి ఇతోపియాను బాంబుల దాడితో నామ రూపాలు లేకుండా చేసింది .లీగ్ చేతగాక ముసోలినే సమర్ధించి దెబ్బతిన్న  దేశాన్ని వదిలేసింది ..స్పెయిన్ లో అంతర్యుద్ధం  చెల రేగింది .తిరుగు బాటు దారులను  జర్మని ఇటలీలు వెనకేసుకొస్తే లాయలిస్ట్ లకు జనరల్ ఫ్రాంకో ,రష్యాలు మద్దతు నిచ్చారు .బ్రిటన్ అమెరికాలు దూరంగా ఉండి పోయాయి .పరిస్థితులన్నిటిని జాగ్రత్తగా గమనించిన హిట్లర్ ఇప్పుడు అంతర్జాతీయరాజకీయ  గాంబ్లింగ్ ఆడాడు .తన జర్మన్ సైన్యాన్ని రీన్ లాండ్ పైకి ఉరికించాడు .దీనితో జర్మని పూర్వపు ఒప్పందాలన్నిటినీ ఉల్లంఘిస్తుంది అని చాటి చెప్పాడన్నమాట .మిగిలిన దేశాలు లీగ్ కు ఫిర్యాదు చేశాయి .కానిఇదివరకటిలాగానే  ఏమీ చేయలేక పోయింది లీగ్ .1937 జనవరిలో ఫ్రాన్స్ ,గ్రేట్ బ్రిటన్ లు స్పెయిన్ లో పోరాడుతున్న విదేశీ వాలంటీర్లు అందరిని వెనక్కి రావాలని కోరాయి .ఇటలీ జర్మనీలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి .స్పానిష్ ఫాసిస్ట్ లకు హిట్లర్ ఇంకా ఎక్కువ సాయం చేయాలని నిర్ణయించాడు .ఇంకాస్త ముందుకెళ్ళి వేర్సైల్లిస్ ఒప్పందాన్ని తప్పు పట్టి జర్మనీకి జరిగిన అన్యాయాన్ని చాటుతూ కోల్పోయిన కాలనీలన్నిటిని తిరిగి ఇచ్చేయాలని కోరాడు

 .

Inline image 1

            సశేషం

       మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-24-7-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -222 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -222

82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -2

  ఈ జాతీయ భావం ,నాయకత్వ లక్షణం హిట్లర్ కు 24 ఏళ్ళు రాక ముందే మనసులో బలపడ్డాయి .వియన్నీస్ వర్కర్లు పెద్ద ప్రజా ప్రదర్శన చేసినప్పుడే ఈ మూక జనం బలమైన  శక్తి సంపన్నమైన దేనికీ లొంగని పాలకుడికి విధేయంగా  ఉంటారని అనుకొన్నాడు  .పడగొట్టే వాడికంటే పరిపాలకుడికే జై కొడతారని ఊహించాడు .ఈ జనం భయపెట్టినకొద్దీ లొంగి ఉంటారని ,వాళ్ళస్వాతంత్రేచ్చ కాల రాచినా వాళ్ళు ఏమీ అనుకోరని తలచాడు .ప్రజల దృష్టిని ఏదో ఒక దానిపై ఏకీ కృతం చేస్తే వాళ్ళ ద్రుష్టి మరో దాని పైకి పోదని అనుకొన్నాడు .అప్పుడు వాళ్ళను విడదీయ టం కష్టమే అని అర్ధం చేసుకొన్నాడు ..మేధావి నాయకుడు వివిధ వ్యతిరేకుల్ని ఒకే కేటగిరీ లోకి తెచ్చి పిడికిలి లో బిగిస్తాడని అభిప్రాయ పడ్డాడు .అబద్ధాలు బాగా చెప్పాలి .యెంత తప్పు చేస్సినా ఒప్పుకోకుండా దబాయించాలి .రిజర్వేషన్ లను ఆపెయ్యటానికి సందేహించ రాదు .మూకల్ని బాగా అవినీతి పరులను చేయటం తేలిక .,వాళ్ళు సహజం గా చిన్న చిన్న అబద్ధాలు చెబుతారు అలాంటి వాళ్ళతో పెద్దవి బొంకి౦ చటానికి మరింత పెద్ద తప్పుల్ని చేయించటానికి  శ్రమ పడక్కర లేదు ..బల ప్రయోగం తో మూకను ఒప్పించ వచ్చు .ఎంత గట్టిగా నొక్కి చెబితే అ౦త  బాగా నమ్ముతారు .నెత్తిన మొట్టిన కొద్దీ వంగి వంగి సలాం చేస్తారు .’’అని ‘’హిట్లరోపనిషత్’’ విప్పి చెప్పాడు .’’the driving force which has brought about revolutions has never been  a body of scientific teaching  ,but always a devotion to which  has inspired them and a kind of hysteria which urged them into action –who ever wishes to win over the masses must know this key ,It is not objectivity  but a determined will backed up by power where necessary ‘’అన్నాడు .దీనిపై విశ్లేషకులు స్పందిస్తూ ‘’the greatest damage in history Hitler fused the cool cynicism of Machiaivelli  with the agitating oratory of a mob spell binder ,plus a compulsive ruthlessness that was all his own ‘’అని చెప్పారు .

 24 వ ఏట అధికార దాహం తో ఉన్న హిట్లర్ వియన్నాను వదిలాడు .24 ఏళ్ళతర్వాత మళ్ళీ అక్కడ విజేతగా  కాలు పెట్టాడు. 1913 లో మ్యూనిచ్ కి స్ప్రింగ్ లో వెళ్ళాడు .ఇంతకాలం ఎలా పొట్ట పోషించు కున్నాడో ఎవరికీ తెలియదు .కొన్ని పెయింటింగ్ లు వేసి అమ్మి జీవించి ఉండవచ్చు .పిచ్చి పట్టిన  వాడుగా రోడ్లమ్మట పగలూ రాత్రి తన సమ్మోహన స్వరం తో జనాలను చైతన్యం చేస్తూ తిరిగి ఉండవచ్చు .పాత చరిత్ర తవ్వి తీసి నార్డిక్ సుప్రీమసి ని జాగృతం చేస్తూ ట్యుటానిక్ మైదాలజిని గొప్ప చేస్సి చెప్పుతూ జర్మనీ ని కొత్త సైన్యం తో సమాయత్త పరిచి ఉండ వచ్చు .1914 ఆగస్ట్ 14 న  అతని కల మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం తో నెర వేరే అవకాశాలు లభింఛి బవేరియన్ సైన్యం లో పేరు నమోదు చేసు కొన్నాడు .

   సైనికుడిగా హిట్లర్ పాత్ర ఏమిటో తెలియదుకాని తన స్థానాన్ని పదిలం చేసుకొన్నాడు . యుద్ధం పూర్తీ  అయేసరికి హిట్లర్ ఒక కార్పోరల్ గానే ఉన్నాడు .అతని ముఖ్యమైన పని ఉత్తరాల బట్వాడా మాత్రమే . దీనికే’’ ఐరన్ క్రాస్ ‘’బహుమతి పొందాడు .జర్మని ఓడిపోవటం అతనికి పాలకుల నిర్వాకం పై మరింత ద్వేషం పుట్టించింది .సంధి పత్రం పై సంతకం చేసిన వాళ్ళను విద్రోహులు అన్నాడు .జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అంటే ఆతనికి ఎలర్జీ .మూక జనం పై ద్వేషం తోనే యుద్ధానికి దిగాడు .దీనిపై ‘’డేర్ ఫ్యూహ్రేర్ ‘’పుస్తకం లో  కాన్రాడ్ హీడేన్ ‘’నాయకుల పై ఏహ్యం తోనే వదిలాడు .తాను  నీచ జనం అన్నవాళ్ళకు భయపడి ఒణికి లొంగిపోయారు ‘’అని ఎద్దేవా చేశాడు అని రాశాడు .ఉన్నత వర్గాలపై ద్వేషం పెంచుకొన్నాడు .పది పన్నెండు వేల సోషలిస్ట్ ఉద్యమకారుల్ని గాస్ తోనో  విషం తోనో అధినాయకులు చంప లేక ఊచ కోత కోయలేక  పోయిన వాజమ్మలు దద్దమ్మలు అని ఆక్రోశించాడు .అదే వాళ్ళు చేసి అతిపెద్ద ద్రోహం తప్పు బ్లండర్ అన్నాడు .

   అప్పటికే ప్రజాస్వామ్య వ్యతిరేక వాదుల ఉద్యమాలలో ప్రదర్శనలలో బాగా పాల్గొన్న హిట్లర్ ఇక తన స్వప్రయోజనం కోసం ప్రాపగాండా ప్రారంభించాడు .జర్మన్ నేషనల్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ అంటే ‘’నాజీ పార్టీ ‘’లో చేరాడు. దాని గుర్తు స్వస్తికం .రౌడీల, ధగ్గుల ముఠాలను ఇందులో చేర్చుకొని  ఊరేగింపులు , ఉద్యమాలను చెదర గొట్టటం, బెదిరించటం చేయించాడు .వ్యతిరేకుల్ని భయ  భ్రాంతుల్ని చేయించాడు   .ఒక మీటింగ్ లో తాను అన్ని రకాల సమావేశాలను ,ఉపన్యాసాలను అడ్డుకొంటానని  శ్రోతలను దీనిద్వారా భయ భ్రాంతులకు   గురి చేస్తానని ప్రేక్షకులకు తెలియ జేశాడు .నాజీ మూక తో ప్రతిపక్షానికి దడ పుట్టించాడు .’’మా దండు రాజకీయ పోరాటానికి కే తప్ప డిబేటింగ్ సొసైటీలకు కాదు ‘అని తేల్చి చెప్పాడు .రోమన్ ఇంపీరియ లిజానికి గుర్తుగా ముసోలిని ప్రవేశ పెట్టిన ఫాసిస్ట్ సాల్యూట్ ను హిట్లర్ కూడా ప్రవేశ పెట్టి ,ముసోలిని ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ ప్రజల్లో వెర్రి ఆవేశాన్ని రగిలించాడు .’’మేము పోరాటాన్ని బోధిస్తాం .పార్లమెంటరీ పద్ధతికి తీవ్ర వ్యతిరేకం గా పోరాటం సాగిస్తాం .దీనితో జర్మనీ పూర్తిగా కూలి పోవచ్చు లేక ఒక కొత్త హీరో ఆవిర్భవించి దాని భవితను నిర్ణయించ వచ్చు .ఆనాయకుని బూట్లు మురికిగా ఉండచ్చు కాని అతనికి ఉక్కు పిడికిలి ,సంకల్పం ఉంటాయి .అతను ఊక దంపుడు ఉపన్యాసాలకు స్వస్తి చెప్పి స్వస్తిక మార్కు గుర్తు తో జాతిని కార్యోన్ముఖం చేస్తాడు ‘’అని ఉద్రేక పూర్వకంగా ప్రసంగించాడు .రెచ్చగొట్టాడు .తన దారికి తెచ్చుకొన్నాడు .

      సశేషం

                  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-16 –ఉయ్యూరు



గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -221 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -221

82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్

  స్కూల్ లో చదవని ఆస్ట్రియన్ అడాల్ఫ్ హిట్లర్ వియన్నా మురికి వాడలవాడు, చెదిరి పోయిన జర్మనీని క్రూర ప్రపంచ శక్తిగా ఉద్ధరించి అసలే జబ్బుతో ఉన్న యూరప్ ను కోలుకోలేని సంక్షోభం లోకి నెట్టినవాడు .20-4-1889 న ఆస్ట్రియా బవేరియా దేశ సరిహద్దు లో ఉన్న  బ్రానువా అనే చిన్న పట్నం లో పుట్టాడు .తండ్రి ఆలోయిస్ అనే ఒక రైతు కన్నెపిల్ల మేరియా శికిల్ గ్రుబర్ కు అక్రమ సంతానంగా పుట్టినవాడు.తల్లిపేరును 30 వ ఏడాదివరకు కొనసాగించి తర్వాత హిట్లర్ గా మార్చుకొన్నాడు .హిట్లర్ లేక హీడ్లర్ లేక హీట్లర్ కుటుంబం  తరతరాలుగా సంచారులే .కాని హిట్లర్ తల్లి వైపు వాళ్ళు పోల్జులు తరతరాలుగా పొలం కూలీలు .హిట్లర్ తండ్రి చిన్న ఆఫీసర్ .మూడు సార్లు పెళ్లి చేసుకొన్నాడు .మొదటి పెళ్ళాం అతనికంటే 14 ఏళ్ళు పెద్దది .పిల్లలు లేరు. 16 ఏళ్ళ తర్వాత పెళ్లి రద్దు చేసుకొని  ఒక హోటల్ లో వంట చేసే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక కొడుకు కు తండ్రి అయ్యాడు .ఏడాది తర్వాత ఆమె టి బి వచ్చి చనిపోయింది .ఆమె చనిపోయిన ఆరు నెలల తర్వాత  సెకండ్ కజిన్ నుతనకంటే 23 ఏళ్ళ చిన్నదైన అమ్మాయిని  ముచ్చట గా మూడో పెళ్లి చేసుకొని 5 గురు పిల్లలను కన్నాడు .ఇందులో ముగ్గురు బాల్యం లోనే చనిపోయారు .మూడో పెళ్లి కి మూడో కొడుకే అడాల్ఫ్ హిట్లర్ .తండ్రి రెండవ పెళ్ళాం హాఫ్ సిస్టర్ ఏంజెలా రాబాల్ తో మాత్రమే హిట్లర్ కు అనుబంధం ఉండేది .ఆమె కూతురు జీలి తో విచిత్రంగా విషాదంగా ప్రేమలో పడ్డాడు హిట్లర్ .

   ఆరవ ఏట స్కూల్ లో చేరి ఇతర ఆస్ట్రియన్ పల్లెటూరి పిల్లలలాగానే అరవై వ ఏడు లోకి ప్రవేశిస్తున్న తండ్రిని తండ్రిగా కాక తాత అనే భావం తో చూశాడు .సాధారణ చదువే చదివి ,తాను సివిల్ సర్విస్ ఉద్యోగం కోసం చదవనని   పెయింటర్ అవుతానని చాలెంజ్ చేశాడు .మొదట్లో కొడుకు ఇంటికి సున్నాలు రంగులు వేసే వాడు అవుతాడేమోనని అసంతృప్తి చూపి విపరీతంగా కోప్పడ్డాడు. కాని ఫలితం లేక పోయింది .ఆయన కోపం బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయింది .ఇదే హిట్లర్ మొదటి విజయం .దీన్ని ప్రయోజనం గా భావించి లింజ్ లో సెకండరి స్కూల్ లో చేరి ,చదవనని భీష్మిస్తే సర్టిఫికేట్ ఇవ్వటానికి నిరాకరించారు .’’నాకు ఏది సంతోషంగా ఉందేదో  దాన్నే చదివాను .ఇష్టం లేని దానివైపు కన్నెత్తి కూడా చూడలేదు ‘’అని హిట్లర్ తన జీవిత చరిత్ర ‘’మీన్ కాంఫ్ అంటే ‘’నా పోరాటం’’ లో రాశాడు .1903 లో తండ్రి చనిపోగా ,రెండేళ్ళ తర్వాత స్కూల్ మానేశాడు .అతని ప్రోగ్రెస్ కార్డ్ లో అన్నీ ‘’అత్తిసెరు ‘’మార్కులే కనిపిస్తాయి .ఫ్రీ హాండ్ డ్రాయింగ్ మాత్రం బాగా ఉంది. రాత దరిద్రపు గొట్టు .జర్మనీ గురించి ఆయనకు తెలిసింది సంతృప్తికరంగా లేదని ఆ రిపోర్ట్ సారాంశం .

    స్కూల్ లో నూ తలిదండ్రుల పరంగానూ క్రమ శిక్షణ లేని హిట్లర్ లింజ్ కు దగ్గర లో ఉన్న ఉర్ఫార్ లో జులాయిలా తిరుగుతూ యే పనీ చేయని సోంబేరి అయ్యాడు .తానేం కావాలో తెలియక  ఇతరుల పై అనుమానం పెంచుకొని ,ఎవరితోనూ స్నేహం చేయక , యే సంస్థలోనూ చేరక  ఎవరి తీర్పుకూ ఇష్టపడకుండా కాలక్షేపం చేశాడు .కొన్ని నెలలు మ్యూనిచ్ ఆర్ట్ కాలేజిలో చేరి  చదివాడు  .18 వ ఏట తల్లి ఆసరాతో వియన్నా ఫైన్ ఆర్ట్స్ లో చేరుదామను కొన్నాడు  .ఎందరో  ఆర్టిస్ట్ నిష్ణాతులను కలిసినా ఎవరూ చేర్చుకోలేదు .మరుసటి ఏడాదీ ప్రయత్నించి దారుణంగా విఫలుడయ్యాడు .పరీక్ష రాయటానికి కూడా ఎవరూ ఒప్పుకోలేదు  .జీనియస్ ఆర్టిస్ట్ లందరూ తనలాగా తిరస్కరింప బడిన వారే అని తనను  తాను   ఓదార్చు కొన్నాడు .ఇరవై ఏళ్ళు వచ్చేలోపే  తల్లీ చనిపోయింది .ఏం చేయాలో,ఎక్కడికి వెళ్ళాలో  పాలుపోలేదు .’’’’నార సంచీలో ఉన్న బట్టలు సర్దుకొని ,మొక్కవోని దైర్యం తో వియన్నాకు బయల్దేరాను .నేను’ఏదో కావాలి ‘’అనే నిశ్చయం నా మనసంతా నిండి పోయింది .కాని సివిల్ ఉద్యోగిని మాత్రం కాకూడదు అని గట్టిగా నిర్ణయించుకొన్నాను ‘’అని రాసుకొన్నాడు హిట్లర్ .

  వియన్నా లో  అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు .తర్వాత తిండి తినటానికి సరి పడడబ్బును పెయింటింగ్ ద్వారా సంపాదించానని గర్వంగా చెప్పుకొన్నాడు .కాని ‘’గురుడికి ‘’మనిషి బొమ్మ వేయటమే రాదు .ఒక చిన్న సృజనాత్మకమైన బొమ్మా వేయే లేక పోయాడు .ల్యాండ్ స్కేపులు బిల్డింగ్ లను కాపీచేశాడు .వియన్నా పై పోస్ట్ కార్డ్ భావాలు గిలికాడు .ఈ తిరుగులాటలో బోహిమియన్ దేశ ద్రిమ్మరి తో అనుకోకుండా పరిచయమైంది .కొద్ది రోజుల్లోనే వాడితో పోట్లాడి వదిలించుకొన్నాడు.మంచు ఆటలలో పెన్నీలు సంపాదిస్తూ ,రైల్వే స్టేషన్ లో సామాన్లు మోస్తూ ,కార్పెట్ల దుమ్ము దులుపుతూ ,తాగు బోతుల దగ్గర అడుక్కొంటూ ఏదో కొంత సంపాదిస్తూ బతికేస్తున్నాడు .పార్క్ బెంచీలమీద పడుకొంటూ ,చేతిలో ‘’గవ్వలు’’ఆడుతుంటే చిన్న మురికి గదిలో ఉంటూ వచ్చాడు .ఉచితంగా ఇచ్చే సూప్ కప్ కోసం బారులు తీరిన క్యూలో  గంటల  తరబడి నిలబడే వాడు .ఒక్కో సారి అదృష్టం కలిసొస్తే బ్రెడ్ తో హార్స్ సాసేజ్ దొరికేది .

   హిట్లర్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండేవాడు కాదు .ముఖం మృదువుగా గుండ్రంగా ఉండేది.రంగు పాస్టేగా ఉండేది .జుట్టు దువ్వ కుండా ,నుదుటిమీద పడుతూ ఉండేది .పొడుగాటి జుట్టు .21 కే గడ్డం మీసం మొలిచి క్రిస్టియన్ లలో ఒక విపరీతమైన వాడుగా కనిపించేవాడని స్నేహితులు చెప్పారు .అతనిపరిస్థితి  చూసి స్నేహితులు హిట్లర్ ను బాధిత పీడిత జన బాంధవుడు అనుకొన్నారు .కాని వారిని ద్వేషిం ఛి అసహ్యించుకొనే వాడని  పాపం వాళ్లకు తెలియదు .  ‘’వర్కర్లు మురికి తో రోతపుట్టిస్తారు .ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు .పొట్టకు కూడు   తాగుడు ,అమ్మాయిలూ తప్ప  వాళ్లకు ఇంకేమీ అక్కర్లేదు  .ఏ విషయం పైనా ఈ మూక  జనాలకు అవగాహన ,నిర్ణయాలు ఉండవు ‘’అని’’హిట్లర్ గురూజీ’’సూక్తులు పలికాడు  .కార్మిక సంస్థలలో హిట్లర్ సభ్యత్వం తీసుకోలేదు ,ఉద్యమాలలో చేరలేదు .’’పేదజనం నిరంతరంగా పెరిగే ప్రజల్ని భయపెట్టే బెదిరించే సైన్యం’’అన్నాడు .’’ఏ వ్యక్తీ అయినా తన గమ్యం చేరాడు అంటే దానికి అతని ఒరిజినాలిటి బ్రూటాలిటీ యే కారణం ‘’ అని గర్వంగా ప్రకటించాడు .

  హిట్లర్ కు ఒరిజినాలిటీ కంటే బ్రూటాలిటి పై మోజేక్కువ దాన్నే ఆయుధంగా చేసుకొని గద్దె నెక్కాడు. అధికారం చెలాయించాడు ,ప్రపంచాన్ని భయపెట్టాడు .సాధారణ అసంతృప్తి అంతా కలిసి లేబర్ ను ,లిబరల్స్ సాంఘిక ప్రజాస్వామ్య వాదులు  ముఖ్యంగా యూదులు  అంటే ద్వేషాన్ని ఆయనలో రెచ్చగొట్టి పాశవికంగా ప్రవర్తి౦ చేన్చేట్లు చేసింది .హిట్లర్ కున్న’’ యాంటి సెమిటిజం’’ ఆయనకు పగటి కల ఫాంటసి అయి ఆయన రక్తమా౦సాలలో జీర్ణమై ,అంతరాత్మకు చోదక శక్తియై కోప ద్వేష కారణమై నడిపించింది .సామాన్య జ్యూ ను ,నల్లజుట్టుతో ,పతనం చెందించే యువకుడిగా చిత్రించాడు .తన చరిత్ర మీన్ కాంఫ్ లో ‘’యూదులే నీగ్రోలను రీన్ లాండ్ కు తెల్లజాతిని జారత్వం లోకి దించటానికి తెచ్చినవారు.’’అని రాశాడు .ఇలాంటి యూదు జాతితో కలిసి ఉండలేక పోయాననుకొన్నాడు ..తానూ అత్యంత ఉన్నత జాతి వాడినని కాలరెగరేసి చెప్పుకొన్నాడు .అందుకే సమానత్వాన్ని బోధించే వాళ్ళందర్నీ ద్వేషించాడు హిట్లర్ .మార్క్స్ ను కొంత చదివాడుకనుక జ్యూలు అందరూ కమ్యూనిస్ట్ లే అనే పొరబాటు అభిప్రాయానికి వచ్చాడు .కనుక హిట్లర్ కున్న యాంటి సేమిటిజానికి మానవత్వ వాదులు అంతర్జాతీయ వాదులు ,సంస్కర్తలు ,మేధావులు  ,ప్రక్రుతి సిద్ధ తేడాలు సహజం అనే యాంటి సేమిటిజాన్నిప్రశ్నించేవారు అంటే ద్వేషం నర నరానా జీర్ణించుకు పోయింది .మేధావులు సమర్ధించే జ్యూలు కొన్ని జాతులు సర్వోత్క్రుస్త మైనవి అనే అభిప్రాయ౦ తో మానవ అస్తిత్వ మూలాలనే కూల్చేయాలనుకొనే వారి ని  అంగీకరించ లేదు.

అలాన్ బులాక్ రాసిన ‘’హిట్లర్ యే స్టడి ఇన్ టిరనీ ‘’పుస్తకం లో ‘’మీన్ కాంఫ్ అనే తన స్వీయ చరిత్రలో పేజీ లన్నిటి లోను పిచ్చివాడి ప్రపంచమే కనిపిస్తుంది .అందులో మనుషుల నీడలే కనిపిస్తాయి .జ్యూలు మనుషులే కాదు .తననొక పురాణ పురుషుడుగా అభి వర్ణించు కొన్నాడు .ఆయన  అవినీతికి మారు రూపం .ఈ కోణం నుంచే ప్రపంచాన్ని చూశాడు .కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపి౦చి నట్లు ఆయనకు ప్రపంచమంతా ద్వేషం కోపం అనుమానం భయంగ  మాత్రమే   కనిపించింది  . ప్రతి అన్యాయానికి  తనకు ఇష్టం లేని  ఆధునికతకు సంగీతానికి ఆర్ట్ కు  జ్యూలే కారణంగా కనిపించారు హిట్లర్ కు . పోర్నోగ్రఫీ కి వ్యభిచారానికి జాతి వ్యతిరేక ప్రెస్ విమర్శకు ,సోషలిజం పేరుతొ మాస్ జనాల పై ఒత్తిడికి ,చివరికి తన వైఫల్యాలకు యూదులే ముఖ్య కారణమనుకొన్నాడు .మూడవ నెపోలియన్ తనను ఆస్ట్రియా నుంచి సాగనంపి పాన్ జర్మన్ గా మార్చటానికీ వాళ్ళే కారణం అనేభ్రమ ఆయన్ను పీడించి ఆడించి ఓడించింది ‘’అని రాశాడు .బలహీన ప్రపంచ పౌరుడు ఒకఫెనటిక్ ,యాంటి సెమెటిక్ యోధుడిని చేసింది .

Inline image 1

   సశేషం

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-16 –ఉయ్యూరు

  

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ గారు మా ఇంట్లో

ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ గారు మా ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

జులై 24 ఆంద్రభూమి మెరుపు పేజీ లో …..

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -220 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –4 (చివరిభాగం )

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -220

81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –4 (చివరిభాగం )

 తరువాతి సంవత్సరాలలో రాజకీయాలపై మాట్లాడి వివాదాలకు కేంద్రమయ్యాడు ఆయన సెక్సువల్ స్కాన్దల్స్ కు వచ్చిననత ప్రచారం దీనికీ వచ్చింది .ఫాసిజం ఓడిపోయి 1942లో రెండవ కూటమి ఏర్పడాలని చెప్పాడు .అప్పుడు హెన్రి వాలెస్ వామపక్షం లో ఉన్నాడు .రష్యాతో అవగాహనకు రావాలని సూచించాడు .చాప్లిన్ ను కమ్యూనిస్ట్ గానో లేక దాని సానుభూతి పరుడిగానో భావించారు .అసలే సుమారు ఇరవై ఏళ్ళనుంచి అమెరికాలో ఉంటూ డబ్బు మేటలు వేస్తూ ఉన్నా పౌరసత్వం తీసుకోకపోవటం ఈ అనుమానం మరీఎక్కువైంది .దీనికి ఆయన సమాధానం ‘’నేను అంతర్జాతీయ వాదిని,అన్ని దేశాలకూ చెందిన వాడిని .అందుకే నేను యే దేశం లోనూ పౌరసత్వం తీసుకోలేదు ‘’అన్నాడు .’’మాన్సూర్ వేర్దాక్స్ ‘’ప్రదర్శించినపుడు చిన్న ట్రాంప్ వేషం నుంచి బ్యాంక్ క్లెర్క్ వేషం లోకి మారి సుఖంగా బతకాలంటే తాను ధనం కూడబెట్టి ,దానితో కుటుంబాన్ని పోషించుకోవాలని భావించి సంపన్ను లైన ఆడవాళ్ళను పెళ్లి చేసుకొంటూ వాళ్ళను హత్య చేస్తూ జీవించే వాడి కధను చెప్పాడు .మొదట దీనికి ‘’లేడీ కిల్లర్ ‘’పేరు పెట్టాడు .ఈ సినిమాను బడా వ్యాపారస్తుల పై క్రూర పారబుల్ .ఇందులోని ముఖ్యపాత్ర ఆనాటి కాలం లోని భావాలను వెల్లడించిందని ,సంక్షోభం నుండి తనలాంటి వాళ్ళు పుట్టారని ,డిప్రెషన్ యొక్క మానసిక రుగ్మతకు అతడు ఒక ప్రత్యెక ఉదాహరణ అని చాప్లిన్ చెప్పాడు .విధానం, హత్య ,మార్బిడ్ గా ఉంది .దీని పరిష్కారం తర్క బద్ధ్యంగా కామిక్ గా ఉంది .’’ఈ సినిమా చాప్లిన్ సుదీర్ఘ వ్రుత్తి లో ఒక లాండ్ మార్క్ మాత్రమె కాక అమెరికన్ సినీ పరిశ్రమలో పెద్ద ముందడుగు అని జేమ్స్ ఆగీ అన్నాడు .దీనితో చాలామంది ఏకీభవించలేదు .సినిమా చాలా సింబాలిక్ గా ఉంది ,అర్ధం కావటం కస్ట౦  బాడ్ టేస్ట్ కు ఉదాహరణ అన్నారు .కేధలిక్ వార్ వెటరన్స్ పికెట్ చేశారు .చాలా సినిమాహాళ్ళు దీన్ని ప్రదర్శించటానికి నిరాకరించారు .కాని యూరప్ లో దీనికి అనేక అవార్డులు వచ్చాయి .ఆర్ధికంగా ఆయనకు పెద్ద బొక్క .ఇదే చాప్లిన్ జీవితం లో మొదటి ఫైల్యూర్ .ఇంకేముంది చాప్లిన్ పని ఖాళీ అన్నారు .

         ‘’ మోషన్ పిక్చర్ల వల్ల అభివృద్ధి చెందిన జీనియస్ ‘’అని బెర్నార్డ్ షా మెచ్చిన చాప్లిన్  నిరాశ పడకుండా మళ్ళీ శక్తిని ఉత్తేజాన్ని ని౦పుకొని కొత్త పాత్రలో ‘’లైం లైట్ ‘’లో 63 వ ఏట ప్రకాశించాడు.రచన నటన దర్శకత్వం తోపాటు బాలెట్ కూడా చేశాడు .’’ఈ పాత్ర ఒక రకంగా ఆయన జీవిత చరిత్ర .ఇందులో ఒక కమెడియన్ మూల జీవిత ఫిలాసఫీ  జీవితం ప్రేమ,ప్రేక్షకులు ,హాస్యం మొదలైన వాటిపై అభిప్రాయాలు, భావోద్విగ్న అనుభవాలు తో,ఐడియాలతో నిండిన సినిమా .’’అని’’ది సాటర్ డే రివ్యు ‘’రాసింది..’’ఇది మానవత్వం పై సినిమాటిక్ కవిత్వం ‘’అన్నాడు ఓటిస్ .ఎల్ గుర్నేసి –‘’న్యు యార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ‘’లో .ఆయనే ‘’if it does not scan mathematically ,it touches the heart with dramatic images of longing’’అనీ చెప్పాడు .మిగిలినవారు అహంకారం తోచేసిన మాటల అల్లిక ,పాత పధ్ధతి ,పాత సెంటిమెంట్ లతో ముంచేశాడు అన్నారు .చాప్లిన్ అపజయాన్ని జయంగా మార్చి నిలబడ్డాడు పెద్ద హీరో లాగా

   అందరూ ప్రేమించే చాప్లిన్ కు ,ప్రజలుఅనుమానించిన చాప్లిన్ కు తేడా ఉంది  .నిర్బంధ సమాజం లో  వ్యక్తిత్వాన్ని బెదిరిస్తున్న శక్తులను ఇది వరకు బయట పెడితే, ఇప్పుడు సీరియస్ గా ఉన్న ఆలోచనా పరుడిగా కనిపించాడు .ఇప్పుడూ జనం ఆయన్ను అనుసరించారు ,మాట విన్నారు .’’my adversaries was suffering from delusion of intelligence ‘’అని చెప్పుకొన్నాడు .లైం లైట్  విడుదలయ్యాక కుటుంబం తో దూర దేశాల టూర్ కు వెళ్ళాడు .షిప్ యెక్క బోతుండగా అమెరికన్ అటార్నీ జనరల్ వచ్చి మళ్ళీ అమెరికాలో కాలుపెట్ట వద్దని ,ఆయన రాజకీయ నైతిక జీవితం పై నేర పరిశోధన జరుపుతున్నామని తెలియ జేశాడు .దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వెల్లువెత్తింది .1953 ఏప్రిల్ 17 న స్విట్జర్లాండ్ నుంచి తానూ అయిష్టంగా నే తన నిజాయితీ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న అమెరికా అధికారుల తీరుపై  ఏవ గింపు తో  అమెరికా నివాసాన్ని వదిలేస్తున్నానని చెప్పాడు .రేడియో ద్వారా ప్రపంచమంతా ప్రసారమైన ఈ స్టేట్ మంట్ పై ఎల్మేర్ డేవిస్ వ్యాఖ్యానిస్తూ ‘’ ఇక్కడ నలభై ఏళ్ళకు పైగా నివసించిన నటుడు బాగా లబ్దిపొంది  ,ఈ దేశాన్ని వదిలేస్తానంటే మేము భయ పడాల్సిన అవసరం లేదు .అటార్నీ మెక్ గ్రానీ  చర్యను మరిచి పోవచ్చేమోకాని అమెరికాలో ఎదిగి ,ప్రఖ్యాతుడై అమెరికాకు పేరుప్రతిష్టలు నటనతో తెచ్చిన మహానటుడు చార్లీ చాప్లిన్ ను మాత్రం మర్చి పోలేము ‘’అన్నాడు .

తీర్పు ఎలా వచ్చినా చాప్లిన్ ఆ పేజీలలో ప్రత్యెక స్థానం పొందుతాడు .తన సృజన తో కొత్త మాధ్యమం లో ప్రజా సమస్యలను అందరి దృష్టికి తెచ్చిన గొప్పనటుడు దర్శకుడు చాప్లిన్ అన్నది నిర్వివాదం .రాజకీయ కారణం తోకూడా సేలిబ్రేటి అయ్యాడు చర్చిల్ ,రూజ్ వెల్ట్ ,హిట్లర్ లతో సమాన స్థాయి పొందాడు  .’’ది గ్రేట్ గాడ్ పాన్ ‘’లో రాబర్ట్ పెయిన్ ‘’ .Chaplin’s descent from the goat footed demi-god through Deburuau, Grimaldi and the great clowns of the past to his position as the greatest jester of his day –half God half man and always vagabond ,brother to St.Francis and the moon ‘’అని గొప్పగా విశ్లేషించి మెచ్చాడు .చాప్లిన్ చిరుతప్పుల్ని మర్చిపోతే ,సినీ తెర మీద ఆయన నీడ జీవం తో కదులుతూ ,మనకు విషయ ప్రచారం చేస్తూ ,మనకు తెలియని ఇంకా పుట్టని ఎన్నో ప్రేమ ,ఆశ  మానవత్వాల విషయాలను తవ్వి పోస్తూనే ఉంటాడు.

 చాప్లిన్ కోటబుల్ కోట్స్ చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి .కొన్ని చూద్దాం –life is a tragedy when seen in closeup  but a comedy in long shot ‘

2-A day without laughter is a day wasted ‘

3-we think too much and feel too little

In 1998, the film critic Andrew Sarris called Chaplin “arguably the single most important artist produced by the cinema, certainly its most extraordinary performer and probably still its most universal icon”.[414] He is described by the British Film Institute as “a towering figure in world culture”,[415] and was included in Time magazine’s list of the “100 Most Important People of the 20th Century” for the “laughter [he brought] to millions” and because he “more or less invented global recognizability and helped turn an industry into an art”.[416]

As a filmmaker, Chaplin is considered a pioneer and one of the most influential figures of the early twentieth century.[1] He is often credited as one of the medium’s first artists.[422] Film historian Mark Cousins has written that Chaplin “changed not only the imagery of cinema, but also its sociology and grammar” and claims that Chaplin was as important to the development of comedy as a genre as D.W. Griffith was to drama.[423]He was the first to popularise feature-length comedy and to slow down the pace of action, adding pathos and subtlety to it.[424][425] Although his work is mostly classified as slapstick, Chaplin’s drama A Woman of Paris (1923) was a major influence on Ernst Lubitsch‘s film The Marriage Circle (1924) and thus played a part in the development of “sophisticated comedy”.[426] According to David Robinson, Chaplin’s innovations were “rapidly assimilated to become part of the common practice of film craft.”[427] Filmmakers who cited Chaplin as an influence include Federico Fellini (who called Chaplin “a sort of Adam, from whom we are all descended”),[339] Jacques Tati (“Without him I would never have made a film”),[339] René Clair (“He inspired practically every filmmaker”),[338] Michael Powell,[428] Billy Wilder,[429] Vittorio De Sica,[430] and Richard Attenborough.[431] Russian filmmaker Andrei Tarkovsky praised Chaplin as “the only person to have gone down into cinematic history without any shadow of a doubt. The films he left behind can never grow old.”[432]

In the 21st century, several of Chaplin’s films are still regarded as classics and among the greatest ever made. The 2012 Sight & Sound poll, which compiles “top ten” ballots from film critics and directors to determine each group’s most acclaimed films, saw City Lights rank among the critics’ top 50, Modern Times inside the top 100, and The Great Dictatorand The Gold Rush placed in the top 250.[437] The top 100 films as voted on by directors included Modern Times at number 22, City Lights at number 30, and The Gold Rush at number 91.[438] Every one of Chaplin’s features received a vote.[439] In 2007, the American Film Institute named City Lights the 11th greatest American film of all time, while The Gold Rush and Modern Times again ranked in the top 100.[440] Books about Chaplin continue to be published regularly, and he is a popular subject for media scholars and film archivists.[441] Many of Chaplin’s film have had a DVD and Blu-Ray release.[44

చాప్లిన్ స్మృతి చిహ్నాలు ఎన్నో వెలిశాయి ఆయన పుట్టిన లండన్ లో ట్రాంప్ ఆకారపు విగ్రహాన్ని జాన్ డబుల్ డే శిల్పించాగా 1981 లో ఆవిష్కరించారు .ఒక వీధికి ‘’చార్లీ చాప్లిన్ వాక్ ‘’అని పెరేట్టారు .స్విట్జర్లాండ్ లోని ఆయన స్వగ్రుహాన్ని నేషనల్ మ్యూజియంగా మార్చారు .ప్లానెట్ 3623 కు చాప్లిన్ పేరుపెట్టారు .పారిస్ లో ఆయన పేర ఆఫీసుంది .జీవితం చివరి రోజుల్లో ఎన్నో అవార్డులు రివార్డ్ లు అందుకొన్నాడు .లండన్ లో న్యు యియర్ ఆనర్ నైట్ హుడ్ ఆనర్ ,ఆక్స్ ఫర్డ్ నుంచి డి.లిట్.,ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి లీజియన్ ఆనర్ ,వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ లయన్ ఆనర్ ,జీవిత సాఫల్య పురస్కారం ,మూడు అకాడెమి అవార్డులు , బెస్ట్ స్కోర్ అవార్డ్  బెస్ట్ యాక్టర్ బెస్ట్ స్క్రీన్ ప్లే బెస్ట్ పిక్చర్  బెస్ట్ డైరెక్షన్ లకు అవార్డులు ,కాక ఇంకా ఎన్నో పొందాడు ఆయన సినిమాలు ఆరింటిని –ది ఇమ్మిగ్రేషన్ ,ది కిడ్ ,సిటి  లైట్ ,గోల్డ్ రష్  మోడరన్ టైమ్స్ ,ది గ్రేట్ డిక్టేటర్ లను ,  , నేషనల్ ఫిలిం రిజిస్ట్రి ‘’లో భద్ర పరచారు .చాప్లిన్ డైరెక్ట్ చేసినవి 11 సినిమాలు .

Inline image 1  Inline image 3

Inline image 2
Inline image 4Inline image 5
Inline image 6  Inline image 7Inline image 8

 సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ .-23-7-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -219 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -219

81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –3

   మరొక విచిత్రమైన కేసులో ప్రతివాదిగా మారాడు చాప్లిన్ .జోన్ బెర్రీ అనే స్టేజి సహాయ నటి తన బిడ్డకు చాప్లిన్ తండ్రి అని కోర్టుకెక్కింది  .తర్వాత కొంతకాలాని చాప్లిన్ ఆమెతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని జర్మన్ డైరెక్టర్ మాక్స్ రీన్ హార్స్ట్ దగ్గరకు పంపాడని తెలిసింది .ఒక ఏడాదిలోనే ఆమె విపరీతమైన కోరికలకు విసిగి పోయాడు .ఆమె నెమ్మదిగా చాప్లిన్ ఇంట్లో ప్రవేశించి చంపేస్తానని  .ఆత్మ హత్య చేసుకొంటానని బెదిరించింది .ఆమె దేశదిమ్మరితనానికి అరెస్ట్ అయింది .ఆమెకు పిల్లాడు పుట్టాక రక్త పరీక్షలలో ఆమె ఆరోపించినట్లు చాప్లిన్ కొడుకు కాదని రుజువైంది .కాని ఆమెతో ఆయనకున్న సాన్నిహిత్యం వలన కోర్టు ఆ పిల్లాడి పోషణ భారం చాప్లిన్ దేనని తీర్పు ఇచ్చింది .

  బారీ కేసు మధ్యలో ఉండగా చాప్లిన్ నాలుగో పెళ్లి అభిమానులను కలవర పరచింది  .నాలుగో పెళ్లి కూతురూ బాగా చిన్న పిల్లే.ఆమె ఎవరో కాదు ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ 18 ఏళ్ళ కూతురు .ఈ పెళ్లి ని తండ్రి ఒప్పుకోలేదు .పైగా తనకూ కూతురుకు సంబంధమే లేదు పొమ్మన్నాడు. అల్లుడు చాప్లిన్ మామ నీల్ వయసు వాడు .1943 లో జూన్ నాలుగున జరిగిన పెళ్లి నాటికి  చాప్లిన్ వయసు 54 ,కొత్త పెళ్లి కూతురు ఊనా వయసు కేవలం 18 ఏళ్ళు .ఆమెలో చాప్లిన్ మంచి జీవిత భాగస్వామిని చూడటమేకాక దాంపత్య సౌఖ్యాన్ని బాగా అనుభవించాడు .ఈ పెళ్లి తర్వత ఆయనపై స్కా౦డల్స్ ఆగిపోయాయి .ఇప్పటిదాకా పడిన అపనిందల సుడి గుండాల నుంచి బయట పడి సిటిజన్ షిప్ రాని లోటు దీనితో తీరి,సుఖమయ ఆనందమయ జీవితం గడుపుతున్నాడు .ఈ ఇద్దరికి ఒక కొడుకు యూరప్ లో ఉండగా పుట్టాడు .

   వివాదాలను శత్రువులను చాప్లిన్  సృష్టించు కొంటున్నాడు తన ప్రవర్తన, పనికి రాని ఎమోషన్ ,రాజకీయాలతో .పూర్వపు పనులన్నీ గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. లండన్ వీధుల్లో గూడు లేక కూడు లేక తిరిగిన రోజుల్ని మర్చిపోలేదు. 1922 తర్వాత ఈ అధోజగత్ సహోదరుల గురించి డాక్యు  మెంటరీలు తీశాడు .ఇందులో మొదటిది ‘’వుమెన్ ఆఫ్ పారిస్ ‘’ఇందులో తానుకనిపించడు కాని ఇతివృత్తం బలీయంగా దర్శనమిస్తుంది .’’ది గోల్డ్ రష్ ‘’ను స్వయంగా దర్శకత్వం వహించాడు .ఇది ఆయన మేగ్నం ఓపస్ అన్నారు .అందులో విషాదాన్ని హాస్యం తో జోడించాడు .ఈ కధను ఎందుకూ పనికిరాని ఒక క్లౌన్ తో అసంబధంగా  వ్యంగ్య భరితంగా సస్పెన్స్ తో చెప్పించాడు ..’’సిటి లైట్స్ ‘’అన్ని లెక్కల్నీ తారు మారు చేసింది  .మాట్లాడే సినిమాలు తీశాక మూడేళ్ళకు మళ్ళీ మూకీ లు తీసి అయిదుమిలియన్ డాలర్లు లాభం పొందాడు .మళ్ళీ సంప్రదాయాన్ని మార్చి హాస్యానికి ట్రాజేడి కలిపాడు .సిటీ లైట్స్ లో ఒక గుడ్డి పిల్ల ఒక తాగుబోతు ,డిప్రెషన్ తో ఉన్న మిలియనీర్ దగ్గరుండే ఒక సంచారిని ప్రేమిస్తుంది  .ఆమెకు చూపు తెప్పించటం కోసం అతడు ప్రయత్నించి సాధించి ఆమెకు చూపురాగానే ఆమెను కోల్పోతాడు .ముగింపు సందిగ్ధంగా ,తప్పనిసరిఅనిపిస్తుంది .తీవ్రమైన స్వీయ సానుభూతి ఎక్కడా తగ్గకుండా తర్వాత వచ్చే కామిక్ సీన్లు నిలబెట్టాయి .

      ఇప్పుడు చాప్లిన్ అనేక రకాల సృజన శీలి అయ్యాడు ..సీనరిస్ట్ ,డైరెక్టర్ ,నటుడూ గా ఉన్నాడు .సంగీత దర్శకుడూ అయ్యాడు .సిటి లైట్స్ తర్వాత వాటికి కదా సంగీతం ఆయనే కూర్చాడు .సీరియస్ విషయం డామినేట్ చేయకుండా ఆచార వ్యవహారాలపై వ్యంగ్య విమర్శలతో తీశాడు .మళ్ళీ ‘’మోడరన్ టైమ్స్ ‘’మూకీ తీశాడు ..ఇది పారిశ్రామిక వేత్తల మితి మీరిన వస్తు ఉత్పత్తి ,విపరీత చేస్టలపై గొప్ప సెటైర్ …ది గ్రేట్ డిక్టేటర్ ‘’లో హిట్లర్ వేషం ధరించి అతని ఆయుధ పిచ్చిని ,క్రౌర్యాన్ని ఎండగట్టాడు .జ్యూయిష్ బార్బర్ గా తానుతీసిన అన్నిసినిమాలకు భిన్నంగా మొదటి సారి నోరు విప్పి మాట్లాడాడు .కొందరు చాలా ఎక్కువగా వాగాడు అన్నారు .చివరికి వచ్చే మోనోలాగ్ ను తీవ్రంగా విమర్శించారు .క్లౌన్ క్లౌన్ గానే ఉండాలికాని ఈ హిత బోద ఏమిటి అన్నారు .దీనికి సమాధానం గాచాప్లిన్ ‘’I am a human being who wants to see this country a real democracy ,free from the infernal regimentation which is crawling over the rest of the world ‘’అని సమాధానం చెప్పి నోరు మూయించాడు .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-16 –ఉయ్యూరు  .

  

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -218 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -218

81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –2

ఎస్సానే లో ఉన్న ఏడాదే చాప్లిన్ ‘’the immortal and world famous –character of the tramp –the tragic ,comic vagabond so perfectly symbolizing the universal underdog –came into being –possibly the most significant artistic arch type of this century ‘’అనిపించాడు మ్యూచువల్ ఫిలిమ్స్ లో ఈ పాత్రను 12 సినిమాలలో పోషించి చిరంజీవి ని చేశాడు .కధను బట్టి తన పాత్రకు వివిధ కొణాలో న్యాయం చేసి మూకాభినయం తో అమరునిగా ఆ పాత్రను నిలిపాడు .1916 -17 యుద్ధం లో గాయపడ్డ లక్షలాది ప్రపంచ జనాలకు  ఈ పాత్ర ద్వారా ఆనందాన్ని పంచి తానూ విపరీతంగా అభిమానం పొందాడు .’ఫ్లోర్ వాకర్  ‘’,ది కౌంట్ ‘’,’’ది ఇమ్మిగ్రంట్ ‘’,ఈజీ స్ట్రీట్ ‘’సినిమాలు క్లాసిక్స్ ..ప్రింట్ లు బాగా లేక పోయినా ఇప్పటికీ చాప్లిన్ ఫెస్టివల్స్ లో ప్రదర్శిస్తూ నే ఉన్నారు .ఆయనంటే పడనీ వాళ్ళు మాత్రం ఆయన అమెరికాలో బాగా డబ్బు దండు కొన్నప్పటికీ ,అక్కడ పౌరుడుగా నమోదుకాలేదని  కనీసం పేరు రాయించుకొనే ప్రయత్నమూ చేయలేదని అంటారు .పని తప్పించుకొనే స్లాకర్ అని ఇంగ్లాండ్ వాళ్ళు అంటారు. ఆయన .ఇంకా బ్రిటిష్ పౌరసత్వాన్ని ఉంచుకొన్నాడు .అసలు విషయం ఆయన ఆర్మీ ఫిజికల్ రిక్వైర్ మెంట్ ను పాస్ కాలేక పోయాడు రెండు నెలల బాండ్ సెల్లింగ్ వినోదం ఆయన విమర్శకులను శాంత పరచ లేక పోయింది

   ఇదే సమయం లో ఫస్ట్ నేషనల్ తో మిలియన్ డాలర్లు  పది హేను వేల డాలర్ల బోనస్  కాంట్రాక్ట్ పై సంతకం  చేశాడు  చాప్లిన్  ఇప్పుడే తానే నిర్మాత ,తనదే స్వంత స్టూడియో లాభాలలో వాటా కూడా ..ఈ కాలం లో ‘’షోల్డర్ ఆర్మ్స్ ‘’ది కిడ్ ‘’వంటి అత్యంత ప్రముఖు సినిమాలతో సేలిబ్రేటి అయ్యాడు . ది కిడ్ లో’’ జాకీ కూగాన్’’ అనే కుర్రనటుడిని పరిచయం చేసి అతనితో అద్భుత నటన రాబట్టాడు .౩౦వ ఏడు వచ్చేదాకా చాప్లిన్ జీవితం ప్రశాంతంగా ,కుంభ కోణాలు లేనివాడుగా గడిచి పోయింది .దేనిపైనా సీరియస్ గా జోక్యం లేనివాడుగానే ఉన్నాడు .ఎడ్నాపర్వియన్స్ ను దేశస్థాయిలో నటిగా గుర్తింపు తెప్పించాడు .ఆమెను వివాహం చేసుకొంటాడని అందరూ అనుకొన్నారు .కాని మనవాడు  అందం ,డబ్బు ,కీర్తి  ఉన్నా బ్రహ్మ చారిగానే ఉండి పోయాడు .కానిపదహారేళ్ళ పడుచు ,నాటక సినీ నటి మిల్డ్రెడ్ హారిస్ పొగడ్తలకు ఆకర్షణకు లొంగిపోయాడు .అకస్మాత్తుగా 23-10-1918న ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు .పిల్లపుట్టాక మూడు రోజులే కాపురం చేశారు .పడుచు పెళ్ళాంనుంచి దూరమై ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యా రోపణలతో ,డబ్బు వ్యవహారం లో పట్టుదలలు పోయి చివరికి విడాకులు పొందారు  .క్రమంగా ఎమోషనల్ గా అస్థిర చిత్తం తో ఉంటున్నాడు .అహంకారం పెరిగింది .తాను  సాధించిన దానికి ప్రత్యేక విలువలు కావాలని కోరుకోనేవాడు .ఆయన ప్రేక్షకులు ఎప్పుడూ ఆయన్ను నిరాశ పరచ లేదు .19 21 లో  పేపర్ వాళ్ళ ఊహాగానాలకుదూరంగానూ  తగ్గిన తన సృజనకు పదును పెట్టుకోవటానికి  యూరప్ వెళ్ళాడు .అక్కడ ఆయనకు ‘’తిరిగొచ్చిన హీరో ‘’గా అపూర్వ స్వాగతం పలికారు .

   చాప్లిన్ వింత స్వభావం చెదురుమదురు బాధ్యతా రాహిత్య పరంపరలు అన్నీ కలిసి ఆయన స్వీయ జీవితాన్ని కష్టాల పాలు చేశాయి . .యాభై లలో ఆయన శృంగారం వివాహ జీవితం అడ్డూ ఆపూ లేకుండా గడిచింది .1924 లో తరచుగా లీటా గ్రే అనే లోలితా మెక్ ముర్రే తో కనిపించేవాడు .ఈమెకూడా పాత పడుచు పెళ్ళాం లాగా 16 ఏళ్ళ కన్నె పిల్లే  .మళ్ళీ అకస్మాత్తు పెళ్లి 1924 లో ,అయి పొసగని సంసారమై చార్లెస్ స్పెన్సర్ జూనియర్ కు తండ్రి అయి మరుసటి ఏడాది రెండోకొడుకు సిడ్నీ ఎర్లె పుట్టాక పేపర్లు మళ్ళీ వీల్లిద్దరిమధ్య గొడవలున్నాయని గాసిప్పులు ప్రచారం చేశాయి .ఇదంతా అబద్ధం అని బుకాయించారు ఇద్దరూ .తర్వాత లీటాతనను భర్త లైంగికంగా వేధిస్తున్నాడని బజారున పడితే చాప్లిన్ అసలామె కుటుంబమే మంచిదికాదని తనను అమాయకంగా ముగ్గులో దింపారని తన నుంచి భారీగా డబ్బు రాబట్టుకోవ టానికి చేసిన కుట్రా ,ద్రోహమని  ఆరోపణ చేశాడు .42 పేజీల ఆరోపణ పత్రాన్ని ఆమె విడుదల చేస్తే వేలాది మంది డబ్బులిచ్చి కొనుక్కున్నారు .ఆర్టిస్ట్ ప్రైవేట్ జీవితాన్ని వీధిలోకి లాగ కూడదని ,దాన్ని నటన తో చ ముడి పెట్ట రాదనీ ఆక్రోశించాడు .ఆడవాళ్ళ క్లబ్బులు అన్నీ చాప్లిన్ కు వ్యతిరేకంగా మొహరించాయి .చివరికి అతని సినిమాలను కొన్నిటిని బాన్ చేశారు .ఈ ఒత్తిడిని చాప్లిన్ తట్టు కోలేక పోయాడు .భంగ పడిన చాప్లిన్ ఆమెతో ఆరు లక్షల డాలర్లకు ,ఇద్దరు పిల్లలపోషణకు  ట్రస్ట్ పేరిట రెండు లక్షల డాలర్లకు రాజీ కుదుర్చుకొన్నాడు .అటార్నీ ఫీజు కూడా కలుపుకొంటే ‘’ఈసున్నం’’  మొత్తం ఒక మిలియన్ డాలర్లకు దేకింది  …లీటాకు  మాంచి జాక్ పాట్ పాక్ట్ కుదిరి చాప్లిన్ జేబు కు పెద్ద బొక్క పడింది .ఈ పెళ్లి పెటాకులైన లీటా ఆ తర్వాత మరో రెండు పెళ్ళిళ్ళు చేసుకొణి లాభ పడింది . .

ప్రపంచం తీరును ఇప్పుడిప్పుడే గమనిస్తున్నాడు చాప్లిన్ .బంగారు బాతు గా ఆయన్ను భావించి ఎవరో ఒక అమ్మాయితో సంబంధం ఉందని పుకారు పుట్టించటం ఆ రొంపి లోంచి బయట పడటానికి డబ్బుతో  పరిష్కరించు కోవటం పరి పాటై పోయి౦ది పాపం .పోలిష్ నటి పోలా నేగ్రి ,కలైర్ విండ్సర్ లతో జతకట్టాడని ఆరోపణ .క్లేర్ షెరిడాన్ అనే శిల్పిణి తో కలాపం సాగిస్తున్నాడనీ చాటింపు .పాలెట్టి గొడ్దార్డ్ తో అనుబంధం తో ఆయన కు ఊరట కలిగింది .ఎనిమిదేళ్ళు దీన్ని రహస్యంగా ఉంచాడు .ఇద్దరూ ఎప్పుడు ఎక్కడ పెళ్లి చేసుకొన్నారో అంతు చిక్కలేదు .తర్వాత ఇద్దరూ బహిరంగం గానే ఉన్నారు .1942 లో ఇద్దరూ విడిపోయాక ,విడాకులు పొందాక మాత్రమే వాళ్ళిద్దరి పెళ్లి  చైనాలోని కాంటన్ లో 1936 లో జరిగిందని వెల్లడించాడు .

Inline image 1Inline image 2Inline image 3

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-16- ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -217 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -217

81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్

  అనేక మంది నైతిక ప్రవర్తనను  అక్షేపించినవాడు , రాజకీయంగా వివాదాస్పదుడు ,ఉంటున్న దేశంనుండి బహిష్కరింప బడినవాడు ,చార్లీ చాప్లిన్ అని మనం పిలిచే చార్లెస్ చాప్లిన్ .విశ్వ వ్యాప్త కీర్తి ప్రతిష్టలు పొందిన ఏకైక నటుడు ముఖ్యంగా హాస్య నటుడు .నవ్వు, జాలి, కరుణ, అమాయకత్వం తో వెండి తెరను ఎకచ్చత్రాదిపత్యంగా యేలినవాడు .ఏది చేసినా ఏది చెప్పినా అత్యంత అతిశయోక్తిగా చెప్పాడు .చార్లీ చాప్లిన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమైన జనాలను నవ్వి౦ఛినట్లు యే ఇతర నటుడూ నవ్వించ లేదు అన్నది నిర్వివాదాంశం .అంతే కాదు ఆయన ఒక తరానికి చిహ్నమై భాసి౦చాడు .20 వ శతాబ్దిలో అందరివాడు గా అగ్రభాగాన ఉన్నాడు .మూకీచిత్రాల రాజాదిరాజు అయ్యాడు .ప్రేక్షక జనావళికి ఆరాధ్య దైవమయ్యాడు .ఆధునిక కాలం లో ఏకైక విశ్వ పౌరుడుగా గుర్తింపు పొందాడు మాక్స్ ఈస్ట్ మన్ అన్నట్లు ‘’In the history of Great Fame .,no chapter will be more astounding that in which this little modest actor of one role became in three short years known and loved by more men and more races ,and classes of men ,than an one ,even the great religious leaders ever had been before ‘’ అంతటి ప్రతిభా సంపన్నుడు ,ప్రభావ శీలి చాప్లిన్ .

16-4-1889 న లండన్ లో చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ పుట్టాడు .చాప్లిన్ అనేది పెట్టుకొన్న పేరు అంటారు తండ్రి సంగీత భవన గాయకుడు .తండ్రిపేరుకూడా చార్లెస్ చాప్లిన్ .ఫ్రెంచ్ జ్యూల కు చెందినవాడు తర్వాత ఆంగ్ల దేశీయుడైనాడు .తల్లి హన్నా కొంత ఐరిష్ కొంత స్పెయిన్ దేశాల రక్తం ఉన్నగాయకురాలు డాన్సర్ .పూర్వపు  భర్త వల్ల ముగ్గురు మగ పిల్లలను కన్నది .అందులో సిడ్నీ,చార్లీ కంటే నాలుగేళ్ళు  పెద్దవాడు .మారుటి తండ్రి పేరే పెట్టుకొన్నాడు  .చాప్లిన్ కుటుంబం ఎప్పుడూ ఆర్ధిక చిక్కుల్లో ఉండేది .తండ్రి పెద్ద తాగు బోతు.తల్లికి సంసారం ఏమై పోతుందో అనే దిగులు. ఈ ఇద్దరు పిల్లల్నిబజారులో పాడించి డబ్బు సంపాదించేవాడు తండ్రి  .అప్పటికి చార్లీకి మాట  ,ఆట ,నడక రాదు .అయినా తండ్రి చెప్పినట్లు చేసేవాడు .అయిదవ ఏట తల్లికి అకస్మాత్తుగా జబ్బు చేస్తే ఆమె  బదులు ప్రదర్శన ఇచ్చాడు  .ఆ లేత వయసులోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించి ఆతను ఉంటే తప్ప చూడరు అన్న భావన కలిగించాడు .ఎడాది తర్వాత తలి దండ్రులు విడిపోయారు .తండ్రి తాగుడుతో చనిపోయాడు .బాధ దిగులు తల్లి స్టేజి వృత్తిని దెబ్బతీశాయి .ఏమాత్రం ఆర్ధిక స్తోమత లేక గత్యంతరం లేక ఆమె కొడుకు లిద్దర్ని చారిటి హోం లో చేర్చింది..ఆమె ఆరోగ్యం బాగయ్యాక పిల్లల్నిద్దర్ని తెచ్చుకొని కుట్టు పని చేస్తూ పోషించింది .7 వ ఏట చాప్లిన్ బాలల మ్యూజిక్ హాల్ లో నటిస్తూ కొంత సంపాదిస్తూ తల్లికి ఆసరా అయ్యాడు .తర్వాత హీర్న్ బాయ్స్ కాలేజ్ లో రెండేళ్ళు చదివించే ఒప్పందం కుదిరింది .ఇక్కడ చదివిన చదువే ఆయనకు మిగిలింది .మళ్ళీ యే స్కూలు గుమ్మమూ తొక్క లేక పోయాడు చాప్లిన్ .

 అన్న సిడ్నీసముద్రం పై ఉద్యోగం తమ్ముడు చాప్లిన్ స్కూల్ చదువులో ఉండగా తల్లికి మానసిక జబ్బు వచ్చింది .మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్లు అయింది ఆకుటుంబ పరిస్తితి .తల్లిని మానసిక హాస్పిటల్ లో చేర్చారు .ఒంటరివాడైన చాప్లిన్ జీవితం వీధుల్లోనే గడిచింది .ఇతరులకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ యేవో కొన్ని పెన్నీలు సంపాదించి బతుకుతున్నాడు .తర్వాత ఎప్పుడో ఈ అనాధ కోటికి పడగ లెత్తినా కూడా డబ్బుకోసం ఇబ్బంది పడ్డాడు .దరిద్రం అంటే భయ పడ్డాడు .హాలీ వుడ్ విలాసాలకు ఎప్పుడూ అర్రులు చాచలేదు .లండన్ లో వీధుల్లో పెన్నీ లేకుండా తిరిగిన రోజులు ఎప్పుడూ ఆయన మనసులోంచి పోలేదు గాఢ ముద్ర వేసి నిలిచే ఉన్నాయి .  

 సిడ్నీ కొంత డబ్బు సంపాదించి తిరిగి వచ్చాడు తమ్ముడు చాప్లిన్ ను వెదికి పట్టుకొని ఆ డబ్బుతో ఇద్దరూ కలిసి ఏదైనా చేసి తమ ప్రజ్న నిరూపించుకోవాలనుకొన్నాడు .ఒక ఏజెంట్ గా మారి పదేళ్ళ తమ్ముడు చాప్లిన్ కు లండన్ హిప్పోడ్రోంలో నటించే అవకాశం కల్పించాడు  కొన్నేళ్ళకే అందులో చాప్లిన్ గొప్ప నటుడుగా ఎదిగి పోయి ఇంగ్లాండ్ లో  బాలనటు లలో ప్రముఖుడనిపించుకొన్నాడు .తల్లిని హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చి స్వస్థత హోం లో చేర్చారు కాని ఆమె పరిస్తితి ఏమీ మెరుగు పడలేదు .కొడుకుల్ని గుర్తించ లేని పరిస్తితిలో ఉంది .స్వరం మారి కౌమార దశకు చేరిన చాప్లిన్ ఇక తానూ బాల నటుడిగా కాక అనేక వినోద ప్రదర్శనలతో తన సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలని అనుకొన్నాడు ..మూకీ వినోద ప్రదర్శనగ్రూప్ ‘’ఫ్రెడ్ కార్నో కంపెని’’లో చేరి అన్నా తమ్ముళ్ళు  రాణించారు .

ఇంకా ఇరవై ఏళ్ళు కూడా రాకుండానే చాప్లిన్ అత్యంత ప్రఖ్యాతిగల హాస్య నటుడుగా అమెరికా వెళ్ళాడు .తానో టూరింగ్ ట్రూప్ లో తాగుడు తో నవ్వించే వికట నటుడుగా అందర్నీ ఆకర్షించాడు .20 ఏళ్ళకే వారానికి 50 డాలర్లు సంపాదించేవాడు .ఇతని నటనా సామర్ధ్యానికి అబ్బుర పడి కీ స్టోన్ ఫిలిమ్స్  వాళ్ళు వారానికి 150డాలర్ల జీతం తో ఆహ్వానించారు  .కార్నో కంపెనీతో కాంట్రాక్ట్ పూర్తికాగానే చాప్లిన్ కాలి ఫోర్నియా చేరాడు .అతి వేగంగా అభి వృద్ధి చెందుతున్న చిత్ర పరిశ్రమలో గొప్ప మార్పులు చోటు చేసుకొన్నాయి .మొదట్లో విజయాలు తర్వాతయూరో పియాన్ ల ఆధిపత్యం తో అమెరికన్ స్టుడియోలపై ప్రభావం చూపింది ..విడుదల తగ్గించేశారు .చిన్నసినిమాలు ఫీచర్ సినిమాలపై ద్రుష్టి పెట్టారు .సిసిల్ డిమిల్లీ ,సాన్  గోల్ద్విన్ జెస్సి లాస్కిమొదలైన వాళ్ళు ‘’స్క్వవుమన్ ‘’మొదలైన నాటకాలను సినిమాలుగా మార్చే ప్రయత్నం చేశారు .గ్రిఫ్ఫిత్ సెమి డాక్యుమెంటరి డ్రామా  ‘’ది బర్త్ ఆఫ్ యే నేషన్ ‘’ను తెరకెక్కించారు .కాని కామెడి పై ఇవేవీ ప్రభావం చూపలేక పోయాయి .ఒకటి రెండు రీళ్ళతో వారానికి ఒకటి తీయటం మొదలు పెట్టారు .మాక్ సేన్నేట్ అనే హాస్య నటుడు కీ స్టోన్ అధినేత గ్రిఫ్ఫిత్ నుండి మూవీ టెక్నిక్ ను నేర్చుకొన్నారు .పిచ్చపిచ్చగా ఇష్టం వచ్చి నట్లు అసంబద్ధంగా ,తలా తోకా లేకుండా తీసి పారేశాడు హాస్యం పేరుతొ అపహాస్యం సృష్టించాడు .సేన్నేట్ చాప్లిన్ లోని ఒరిజినాలిటి ని గుర్తించి ,అతనిలాగా నవ్వి౦చ గలవారేవ్వరూ లేరనే నిర్ణయానికి వచ్చాడు .

  చార్లీ చాప్లిన్ వేసుకొనే వికారపు డ్రెస్ కు ఒక ఫ్లాష్ బాక్ ఉంది .సాన్నేట్ చాప్లిన్ ను లొకేషన్ కు నవ్వు పుట్టించే డ్రెస్ వేసుకొని రమ్మన్నాడు .హడావిడిలో చేతికి ఏది అందుబాటులో ఉంటే దాన్నే ధరించి హడావిడిగా వెళ్ళాడు చాప్లిన్ .ఆ నాడు లావుగా ఉండే కమెడియన్ వేసుకొనే బాగీ పాంటు, మరో హాస్యగాడు వేసే కాళ్ళకు పెద్దసైజు ఉన్న బూట్లు ,   తలకంటే చిన్నదైన మాసిన డేర్బి, బక్కోడే అయినా బాగా బిగుతుగా ఉన్న కోటు ,,కొంకె లాంటి పేము కర్రా ,చిన్న టూత్ బ్రష్ మీసం తో అక్కడ ప్రత్యక్షమయ్యాడు .ఈ డ్రెస్ కోడ్  వేష ధారణ పై దియోదర్ హాఫ్ రాస్తూ ‘’personifies shabby gentility –the fallen aristocrat at grips with poverty .The cane is a symbol of attempted dignity ,the pert mustache  a sign of vanity ‘’అని విశ్లేషించాడు .ఆకర్షణీయ ,తరచుగా కనిపించే విషాద ఆకృతి ఇంకా రావాలి .మొదటి ఏడాదిలో నటించిన 35 సినిమాలలో ఆయన పాత్ర ఎందుకూ పనికి రాని అసమర్ధుడు ,జాలి లేని వాడు గా కనిపించినా గిలిగింతలు పెట్టె హాస్యం తో కడుపుబ్బా నవ్వించాడు .కేవలం 13 వారాల తర్వాత చాప్లి న్ నే స్వయంగా రచన చేసి ,దర్శకత్వం కూడా చేయమని కోరారు .కీ స్టోన్ కాంట్రాక్ట్ 12 నెలలు  హాయిగా గడిచి పోయింది .సంవత్సరం పూర్తికాగానే సేన్నేట్ వారానికి నాలుగు వందల డాలర్లు ఇస్తానని చెప్పాడు కాని పోటీ సంస్థ ఎస్సనే కంపెని వారానికి 1250డాలర్ల స్టైపెండ్ అంటే పది రెట్లు ఎక్కువ ఇస్తానని లాక్కు పోయింది .ఈ కంపెనీలో ఒక ఎదాదిపని చేయగానే చాప్లిన్ విలువ మళ్ళీ పది రెట్లు పెరిగింది .ఇప్పుడేమ్యూచువల్ కంపెని వారానికి పది వేల డాలర్లు ,సంవత్సరానికి లక్షా యాభై వేల డాలర్ల బోనస్ ఆఫర్ తో తీసుకొన్నది .అతికష్టం మీద చాప్లిన్ ను ఒప్పించి ఆయన లాస్ ఏంజెల్స్ లో మురికి కూపం ప్రదేశం లో మకామున్న  చిన్న హోటల్ నుంచి మంచి ప్రదేశానికి మార్పించింది .

Inline image 1  Inline image 2
Inline image 3

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చంద్ర శేఖరయ్య గారి కవితా చంద్ర హారం

చంద్ర శేఖరయ్య గారి కవితా చంద్ర హారం

శ్రీ బి చంద్ర శేఖరయ్య గారితో నాకు ముఖ పరిచయం లేదు .కాని వారు నా చిరునామాకు తమ మినీ కవితా సంపుటి ‘’చంద్ర హారం ‘’పంపగా ఇవాళే చేరింది .వెంటనే చదివాను .అందులోని కొన్ని మచ్చు  తునకలను మీకు పరిచయం చేయాలనే ఈ ప్రయత్నం .

వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనశ్రీ  చంద్ర శేఖరయ్య ప్రవృత్తి మాత్రం సాహితీ వ్యాసంగం .’’తెలుగు కళలకు వెలుగు సంతకం పలమనేరు రచయితల సంఘం ,తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి’’ లో ముఖ్య పాత్ర ధారి . గొప్ప కవి ,రచయితా లబ్ధ ప్రతిస్టులు .అయిన శ్రీ పలమనేరు బాలాజీ ఈ కవిని అభినందిస్తూ’’ సంఘం జీవితం ,వ్యక్తిత్వ వికాసం ,జనన మరణాలు సంస్కారం మానవ సంబంధాలు రైతు ,విద్యార్ధి, సాహిత్యం  మొదలైన సామాజిక అంశాలపై రాసిన ఈ కవితలతో కవితా లోకం లోకి తొలిఅడుగులు వేస్తున్నారని’’ ఆశీర్వ దించారు .’’అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా విధి నిర్వహిస్తున్న ఈకవి రచయితగా వెలుగు లోకి రావటం అభినందనీయం ‘’అన్నారు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు ,’’ఉపాధ్యాయ ‘’సంపాదకులు శ్రీ పి తులసీనాధం నాయుడు .ఈ కవితాసంపుటిని తమ తలిదండ్రులు స్వర్గీయ శ్రీమతి వీరమ్మ ,శ్రీ వి బసవయ్య గార్లకు అంకితమిచ్చి ఋణం తీర్చుకొన్నారు కవిగారు .ఒక రకంగా వారిద్దరికీ ఇది 163 రకాల స్వర్ణ పుష్ప ‘’కవితా చంద్ర హారమే ‘’.

‘’ ఆశించేది జీత౦  –అర్పించేది జీవితం ‘’అంటూ చక్కని తాత్వికతను ఒలకపోశారు .ఆఫీస్ ఉద్యోగాలపై కొరడా ఝలిపిస్తూ ‘’నిద్ర లేచి ఆఫీస్ కు వెడితే ఉదయం –మెలకువ వచ్చి ఇంటికి వెడితే సాయంత్రం ‘’అని వ్యంగ్య౦ గా అన్నారు .’’పుట్టినిల్లు జన్మ భూమి –మెట్టినిల్లు పుణ్య భూమి ‘’అంటూ అందరినీ ఉద్దేశించే చెప్పారు . దాంపత్యం  లో సరిగమలపై చెణుకుతూ’’’’పొద్దున్న పోరు రాత్రికి రాజీ – సమాంతర  రేఖలే జీవన సరళి ‘’అని ,’’వాటాలు కుదిరాయి –చర్చలు ఫలప్రదం ‘’అంటూ రాజకీయ బేర సారాలపై మరో చెణుకు విసిరారు .కరెంట్ కొత్త  కూడా హాయిని, ఉల్లాసాన్ని ఇస్తుందని చమత్కరిస్తూ ‘’పండు వెన్నెల పరిచయం –కరెంటు కోతకు ధాంక్స్ ‘’అంటారు .హీరో వర్షిప్ పై మరో వ్యంగ్యం –‘’ఇంటి నిండా నాయకుల ఫోటోలు –అమ్మా నాన్నలవి ?ఆల్బం లో వెతకాలి ‘’.మంచి పుస్తకం పై మంచి కవిత –‘’వెతకటానికి- గంటలు –చదవటానికి నిమిషాలు ‘’.సామాజిక బాధ్యతా గుర్తు చేస్తూ చేసిన హెచ్చరికే –‘’సమాజం నీకు రుణపడితే ప్రమోదం –సమాజానికి నీవు రుణ పడితే ప్రమాదం ‘’.మనిషికి స్నానం ఉల్లాసాన్నిస్తే జ్ఞానం ఉత్త్తేజాన్నిస్తుందని మంచి బోధ .

ఎంత విజయం సాధించినా మూలాలు మరచి పోవద్దని చెబుతూ –‘’విజయం వెనుక కృషి –చెట్టుకింది వేరు ‘’అన్నారు .అన్యోన్య  దాంపత్యం  పై మరో చురక –‘’బయట కాంబినేషన్ –ఇంట్లో డామినేషన్ –అన్యోన్యత ‘’.సెల్ ఫోన్ సత్య హరిశ్చంద్రుని బద్ధ శత్రువు గా కనిపించింది కవి హృదయానికి .పెళ్లి మీద మరో వ్యంగ్యాస్త్రమే –‘’స్వేచ్చగా ఎగిరే రెండు పక్షుల్ని –ఒకటిగా కట్టి పడేసే –పెళ్లి ‘’.ఆక్సిజన్ లాంటి అవకాశాన్ని వెతుక్కొని అభాండం లాంటి కలుషితం నుండి తప్పుకోవాలని హితవు .’’క్రాంతికి బులెట్ –శాంతికి బ్యాలెట్ ‘’అని శాంతి కరువైతే బులెట్ వాడకం తప్పదనే భావన చేశారు .’’చిత్త శుద్ది లక్ష్య సిద్ధికి రాచబాట ‘’అంటూ ,నాడు క్విట్ ఇండియా ఉద్యమం నేడు వెల్కం ఇండియా స్వాగతం అంటారు .మాటలు పటిక  బెల్లం అని చేతలు పక్కలో బల్లెం అని నేటి కుహనా రాజకీయ వేత్తల ప్రవర్తనపై చీదరింపు .కళ పై వ్యాఖ్యానిస్తూ ‘’ఆవిర్భ విస్తే కళకళ –అనుకరిస్తే వెల వెల ‘’అని అనుకరణ అభ్యాసం వరకే కాని ఎప్పుడూ కాదని సృజనే  యే కళకైనా పరమార్ధమని కళా మర్మజ్నునిలా బోధించారు .పర్యావరణ స్పృహ బాగా ఉన్న ఈ కవి –‘’పెంపొందిస్తే రక్షిస్తుంది –నశింప జేస్తే శిక్షిస్తుంది ‘’అని పౌర ధర్నాన్ని తెలియ జేశారు .నిజాన్ని గురించి చెబుతూ –‘’గొడ్డలిలా వేరు చేయ వద్దు –సూదిలా దగ్గరకు చేర్చు ‘’అని కలిసి ఉంటె కలదు సుఖం అని హిత బోధ చేశారు .’’తరువును పరి రక్షిస్తే కరువు పారి పోతుంది ‘’అని సూక్ష్మ౦గా చెప్పారు. వన సంరక్షణ  అత్యంత  అవసరమని తెలియ జేస్తూ .నీటిని వృధా చేస్తే మిగిలేది కన్నీరే అనేది మరో హెచ్చరిక .పుస్తకానికి విలువ ఇస్తే విజ్ఞానం విస్మరిస్తే అజ్ఞానం పెరుగుతుందని ధర్మ సూక్ష్మం చెప్పారు .

నేటి సంసారాలలో వికృతి ఎలా ఉందొ చెప్పే కవిత –‘’అయ్య గారింట్లో అగ్ని ప్రమాదం –అల్లుడు ,కోడలు మృతి –కొడుకు ,కూతురు క్షేమం ‘’ఇంటికి వచ్చిన కోడలు అల్లుడూ మసి అయ్యారని ,ఇంటివారైన కొడుకు కూతురు క్షుషీ అని  అర్ధం ‘’మోసానికి శ్వాస –దురాశ ‘’గొప్ప కవిత అల్పాక్షరాల్లో అనంతమైన వివరణ .వివక్షతపై స్పందిస్తూ –కుండ మైల పడితే విసిరి కొట్టటం  అదే బిందె అయితే కడిగి దాచుకోవటమే వివక్షత  అంటారు కవి .ఆడపిల్ల అవనికే చేటు అని భావించి భ్రూణ హత్యలు చేయిస్తున్న సమాజం పై –‘’గర్భస్థ శిశువు మగ  అయితే అండం –ఆడ అయితే పిండం ‘’అని బహు చక్కగా చెప్పారు .వ్యాపారికి అతి వృష్టి అనా వ్రుస్టీ అన్నీ సీజనే అంటారు .నేలా నీరు అగ్నీ అన్నీ కొంటున్నాం ఇక గాలి మాత్రమే మిగిలింది ‘అయినా ఫాన్లతో ,ఎ.సి.లతో దాన్నీ కొంటూనే ఉన్నామన్న సంగతి కవి మర్చి పోయి ఉంటారు .’’మృత్యువు మనిషిని స్ప్రుశిస్తే –అవయవ దానం తో మనసు మరణాన్ని జయించింది ‘’అని మరణానంతర జీవితాన్ని గొప్పగా చెప్పారు .నేటి మనిషి అల్పత్వాన్ని తెలియ జేస్తూ –‘’నాకు నేనే నచ్చను-నిన్నెలా మెచ్చుకొంటాను ?’’అన్నారు .కృతజ్ఞత చూపిస్తే ‘’మనిషి ‘’అవుతాడని కృతఘ్నత చూపితే ‘’మహిషి ‘’అవుతాడని సత్యం ఆవిష్కరించారు .ముష్టి వాడిని చీదరించుకొని అన్నదానానికి విరాళాలిచ్చే ప్రబుద్ధుల గురించిచెప్పారు .చదువు చెప్పి పరీక్షిస్తే ‘’గురువు ‘’అని  ,పరీక్ష పెట్టి గుణ పాఠం నేర్పితే ‘’ప్రభువు ‘’ అని గురు బోధ చేశారు .పుట్టిన బిడ్డ కూడా మనకు కర్తవ్య బోధ చేస్తుందట –‘’పుట్టిన బిడ్డ నేర్పుతోంది –పిడికిలి బిగించి కదలమని ‘’అని పిడికిలి బిగించి పుట్టిన శిశువు మనకు హిత బోధ చేస్తుందని చెప్పటం కవి నిశిత పరిశీలనకు దృష్టాంతం .మరో తాత్విక కవిత –‘’అమ్మ ఋణం తీర్చుకోవటమంటే –ఆకాశాన్ని మడిచి జేబులో పెట్టు కోవటమే ‘’చివరి కవిత మానవత్వ పరిమళ వ్యాప్తి కలిగించింది –‘’కొట్లలో వెదికినా –వేలల్లో కూడా మిగలటం లేదు –మానవత్వం ‘’అని వాపోయిన మానవతా హృదయం కవిగారిది .

శ్రీ చంద్ర శేఖరయ్య గారికి మంచి భావుకత ఉంది .మానసు లోని భావాలను తగిన మాటలతో చెప్పగల కవితా శక్తి ఉంది .చక్కని పదబంధం తో చెప్పగల నేర్పు ఉంది .ఈ చంద్ర హారం కవి గారి కవితా సామర్ధ్యానికి పుష్ప హారం .మరిన్ని కవితలు రాసి లబ్ధ ప్రతిస్టితులు కావాలని ఆకాంక్షిస్తున్నాను .వీరికి ఈ మధ్యనే మనం ఆవిష్కరించుకొన్న ‘’మా అన్నయ్య ‘’కవితా సంకలాన్ని బుక్ పోస్ట్ లో పంపిస్తున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1 of 17,890 Print all In new window ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -216 80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -3(చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -216

80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -3(చివరి భాగం )

1936 లో ఓ నీల్ కు వచ్చిన నోబెల్ బహుమతి  ఫిలిస్టైన్ లకు చెంప పెట్టు,ఆధునిక అమెరికన్  నాటక రచయిత ఓ నీల్ కు కు గొప్ప ప్రశంస .ఆరేళ్ళక్రితం సింక్లైర్ లెవిస్ ఇచ్చిన వివరణ గుర్తుకొచ్చి నీల్ కూడా ‘’ఈ అత్యున్నత పురస్కారం నాకు మాత్రమె కాదు అమెరికాలోని నా సహచరుల౦దరిదీ .ఈ నోబెల్ బహుమతి రాబోయే అమెరికా దియేటర్ కు చిహ్నం .నా నాటకాలకు రావటం అదృష్టం కాలమూ కలిసి రావటం .మొదటి ప్రపంచ యుద్ధానంతరంనాటకాలురాసిన అమెరికన్ మిత్ర రచయితలందరి పాత్ర ఇందులో ఉంది ‘’అని చాలా నిగర్వంగా ప్రకటించాడు .నీల్ చాలా వినయంగా ఈమాటలు అన్నప్పటికీ అప్పటికి ప్రపంచం మొత్తం మీద షేక్స్ పియర్ బెర్నార్డ్ షా ల తర్వాత ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందినవాడు ఓనీల్ మాత్రమే ..వారిద్దరి నాటకాల తర్వాతఇంగ్లీష్ నాటకాలలో  జనం అమితంగా చదివింది నీల్ నాటకాలనే .

అకస్మాత్తుగా నీల్ అదృష్టకాలం  రచనా శక్తి దెబ్బతిన్నాయి .శారీరకంగా సృజనాత్మకం గా తగ్గిపోయాడు .ఆయన పని ‘’ఆకాశంబున నుండి పాతాళం ‘’లోకి పడిపోయింది  .’’డేస్ వితౌట్ ఎండ్ ‘’తో బాగా ఇబ్బంది పడ్డాడు  .12 ఏళ్ళ తర్వాత ‘’ది ఐస్ మాన్ కమేత్ ‘’కూడా ఫైల్యూర్ అయింది .1946 లోమళ్ళీదియేటర్ కు వచ్చాడు .’’యే మూన్ ఫర్ ది మిషె గాటన్’’కూడా దెబ్బ తిన్నది .అప్పటికే ఒక మిలియన్ డాలర్లు సంపాదించిన నాటక రచయితనీల్ 50 వ ఏట జబ్బు పడి సంతోషం కోల్పోయాడు . కుటుంబ జీవితం ముక్కలైంది .కూతురు ఊనా హాస్యనటుడు చార్లీ చాప్లిన్ ను పెళ్లి చేసుకోవటం క్షమించ లేక పోయాడు. చిన్న కొడుకు షేన్ మత్తుమందుకు బానిసై ఆస్పత్రి పాలైనాడు .టీచర్ ,గ్రీక్ స్కాలర్ అయిన పెద్దకొడుకు1950 లో  ఆత్మ హత్య చేసుకొన్నాడు ..నీల్ వీటన్నిటి వలన మరింత ఆరోగ్యం కోల్పోయి చిక్కి శల్యావశిస్టమైనాడు .బతికి ఉన్న ఆస్థి పంజరమా అనిపించాడు .కళ్ళు నల్లబడి గుంతల్లా ఉన్నాయి .ఎముకల పోగుకు చర్మం  అంటింఛినట్లున్నాడు .56 వ ఏట కండరాల జబ్బు కూడా వచ్చి రాయటం అసాద్యమై పోయింది .తర్వాత చేతితో కలం పట్టుకోలేక పోయాడు .ఆస్పత్రి వైద్యం కూడా ఫలించలేదు .క్రమంగా శారీరక కార్యక్రమాలు బలహీన  పడ్డాయి .పార్కిన్సన్ వ్యాధి వచ్చిందని నిర్ధారించారు .ఆయన వ్యాధిని ‘’ప్రి సేనైల్ ఆర్టీరియల్ స్క్లేరో టిక్ కండిషన్ ‘’గా నిర్ణయించారు .ఆయన రాత అతి చిన్నక్షరాలుగా ఉండేది .ఇప్పుడు చెప్పి రాయిద్దామని ప్రయత్నించాడు.కాని ఇక తనకు సృజన శక్తి కరువైపోయిందని గ్రహించాడు .ఇరవై  ఏళ్ళ క్రితం రాయటం ప్రారంభించిన  చక్రీయ నాటకాలనన్నిటిని  తగల బెట్టించాడు .స్వీయ చరిత్ర లాంటి ‘’లాంగ్ డేస్ జర్నీ ఇంటూ నైట్ ‘’మాత్రం ఉంచాడు .దీన్ని తానూ మరణించిన 25 ఏళ్ళ తర్వాత మాత్రమే ప్రచురించ బడాలి అని కోరుకొన్నాడు .పాపం ఆయన ,ఆయన వ్యాధికి బందీ అయిపోయి పదేళ్ళు అలాగే బతికాడు .పూర్తిగా శక్తి హీనుడైపోయాడు .దీనికి తోడు బ్రాంకియల్ న్యుమోనియా వచ్చి ఆధునిక అమెరికన్ నాటక మార్గ దర్శి యూజీన్ ఓ నీల్ 65  వ ఏట  27-11 -1953 న మరణించాడు .

‘’టైం మాగజైన్ ‘’నీల్ గురించి రాస్తూ ‘’ఓ నీల్ కు ముందు అమెరికాలో దియేటర్ మాత్రమే ఉంది .ఓ నీల్ వచ్చాక అందులో నాటకం వచ్చింది ‘’అన్నది .గ్రీక్ ట్రాజెడీ అంతా విధికి తలొగ్గిన ట్రాజేడి.అదృష్టం అంతా నక్షత్ర ప్రభావం .షేక్స్పియర్ ట్రాజేడి పాత్రల ట్రాజేడి .మానవుని అదృష్టం అతని మనసుని బట్టి ఉంటుంది .బాధా చావుల వలన గ్రీకుల షేక్స్ పియరన్ ట్రాజేడిలలో ట్రాజేడి హీరోలు దేవతలను సంతృప్తి పరచి ముక్తి పొందారు .కాని ఓ నీల్ ప్రేక్షకులు మాత్రం దేవుడు ,మనసు ,విదిలపై అనుమానం ఉన్నవారు .నీల్ రాసినదంతా పర్సనల్ సైకాలజీ .మనిషి అదృష్టం జీన్స్ లో హార్మోన్స్ లో ఉంటాయని చెప్పాడు .ఆయన నాటకం ‘ది గ్రేట్ గాడ్ బ్రౌన్ ‘’లో ట్రాజిక్ హీరో ‘’మనిషి ముక్కలు ముక్కలై  జన్మిస్తాడు .దాన్నిఅతికించి  బాగుచేస్తూ జీవిస్తాడు .దేవుని దయ ఒక జిగురు మాత్రమే ‘’అంటాడు .’’మార్నింగ్ బికం ఎలెక్ట్రా ‘’నాటకం లో గ్రీక్ లెజెండ్ క్లైమాక్స్ ను సంప్రదాయ కేదార్సిస్ ను  చుట్టేసి ముఖ్య పాత్ర చేత ‘’నన్ను శిక్షించటానికి ఎవరూ మిగల్లేదు  నన్ను నేనే శిక్షించు కొంటాను ‘’‘’అని అరిపిస్తాడు  .

ఓ నీల్ నాటకాలు అపజయం పొంద టానికి అధిక ప్రయోజనమే తప్ప ,ఆయన మేధో దారిద్ర్యం మాత్రం కాదు .ఉన్నత శిఖరం నుంచి అప్పుడప్పుడు ఆయన జారిపోవటానికి కారణం అవి జనానికి అందుబాటులో లేవు అనే అభియోగాన్ని ఆయన త్రోసి పుచ్చాడు .కాని కారణం ఆయన ఆ ఉన్నత శిఖరం మీదనే ఉండిచనిపోవాలను కొన్నాడేకాని అందరూ ఎప్పుడూ ఎంతకాల౦  నడిచిన రోడ్డుమీదకు వచ్చిమాత్రం కాదు .’’పాతా దేవుడి మరణం ‘’సైన్స్ ,భౌతికత  ల అపజయం ఆయన్ను కలత పెట్టాయి .నీల్ పాత్రలపై జాన్ మేసన్ ‘’Neil’s characters were not merely in conflict with one another .They were with war with the agents were not indifferent to them .This link between mortals and forces shaping their lives was the mighty concern which gave a kind of majesty to the feeblest of his plays ‘’అని రాశాడు .’’నాటక సాహిత్యం లో ఆయన స్థానం ఏమిటో ఇంకా తేలలేదు కాని ఆయన రెచ్చగొట్టే ఆవిష్కర్త, (ప్రోవోకేటివ్ ఇన్వెంటర్).పాత సంప్రదాయాలను విచ్చిన్నం చేసినవాడు ,నవీన సంప్రదాయ నిర్మాత .కాని నేటికాలం లోఆయన చిన్న నాటకాలను మాత్రమె ఎవరో కొందరు ఎక్కడో అక్కడ ఆడుతూనే ఉన్నారు .షేక్స్ పియర్ ,షాల నాటకాలులాగా నీల్ పెద్ద నాటక ప్రదర్శనలు ఎక్కడా లేవు .ఆయన నాటక నైపుణ్యం ,స్థాయి ,ప్లాట్ ల స్పూర్తి ,పాత్రల ప్రామాణ్యత, విశ్వసనీయత లపై ఇంకా చాలా చర్చ జరగాలి .కాని ఆయన ప్రభావ ప్రాధాన్యత మాత్రం ప్రశ్నింప రానిది  ‘’అంటాడు రచయితా లూయీ అంటర్ మేయర్ .

20 వ శతాబ్ది అమెరికన్ నాటకాలలో నీల్ రాసిన ‘’లాంగ్ డే స్ జర్నీ  ఇంటూ నైట్ ‘’అత్యంత విలువైన నాటకమని పేరు పొందింది .అమెరికా ప్రాంతీయ భాషను నాటకాలలో వాడిన మొదటి నాటక కర్తనీల్ .ఆయన పాత్రలు ఎదురు తిరుగుతాయి పోట్లాడుతాయి కాని చివరికి నిరాశ నిస్పృహలతో ప్రక్కు తప్పుకొంటాయి .ఆఫ్రికన్ అమెరికన్ నటులపై నీల్ ప్రభావం అత్యధికం .పాల్ రిలే రోబ్ సన్ బాగా ప్రేరణ పొందాడు .వారెన్ బీట్టీ తీసిన ‘’రెడ్ ‘’సినిమాలో నీల్ పాత్రను జాక్నికల్సన్ పోషించాడు .కనెక్టికట్ లో నీల్ దియేటర్ ఏర్పాటు చేశారు .ఆయన న్యు ఇంగ్లాండ్ లో నివసించిన ఇల్లు జాతీయ చారిత్రిక ప్రదేశంగా గుర్తింప బడింది .ఆయన పేరుమీద చాలాకాలేజీలు సంస్థలు ఏర్పడ్డాయి .నీల్ 32 పెద్దనాటకాలను ,21 ఎకా౦కికలను తో  పాటు కొన్ని ఇతర రచనలూ చేశాడు .

O’Neill’s tragic view of life was perpetuated in his relationships with the three women he married—two of whom he divorced—and with his three children. His elder son, Eugene O’Neill, Jr. (by his first wife, Kathleen Jenkins), committed suicide at 40, while his younger son, Shane (by his second wife, Agnes Boulton), drifted into a life of emotional instability. His daughter, Oona (also by Agnes Boulton), was cut out of his life when, at 18, she infuriated him by marrying Charlie Chaplin, who was O’Neill’s age.

 

నీల్ ను అమెరికన్లు బాగానే ఆరాధించారు అంతకంటే ఎక్కువగా స్వీడన్లు ఆరాధించారు .కారణం ఆయన్ను ప్రేరేపించినవాడు స్వీడన్ నాటక కర్త ఆగస్ట్ స్త్రిండ్ బెర్గ్ అవటం కూడా ఒక కారణం .ఆయన విషాద కధలు నీల్ నాకాలలో ప్రతిధ్వనిస్తాయి .అమెరికా రంగ స్థలాన్ని ఒక సాహిత్య క్షేత్రంగా గుర్తించి నాటక రచన చేసిన మొదటి అమెరికన్ నాటక కర్త ఓ నీల్ .సాహిత్యం లో నాటకానికి అమెరికా లో నోబెల్ పొందిన మొదటి వాడు కూడా నీల్ ఒక్కడే .1920 లో అమెరికన్ దియేటర్ సాంస్కృతికంగా ప్రాచుర్యం పొందటానికి నీల్ ఒక ముఖ్య కారకుడు

 

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -215 80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -215

80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -2

28 ఏళ్ళ వయసులో నీల్ చేతినిండా స్క్రిప్ట్ లే .ప్రావిన్స్ టౌన్ కు వెళ్లి తన మొదటినాటక ప్రదర్శన’’బౌండ్ ఈస్ట్ ఫర్ కార్డిఫ్ ‘’ చూసుకొన్నాడు .వేర్ఫ్ దియేటర్ దీన్ని ప్రదర్శించింది బ్రహ్మాండమైన విజయం లభించింది .ఈ దియేటర్ తర్వాత న్యూయార్క్ గ్రీన్ విచ్ విలేజ్ కి మారి ప్రావిన్స్ టౌన్ ప్లేయర్స్ గా ప్రసిద్ధ మైంది .1917 నుండి 20 దాకా మూడేళ్ళు నీల్ రాసిన పది  ఏకాంకికలను ప్రదర్శించింది .అవే ‘’ఐల్ ‘’,ది మూన్ ఆఫ్ ది కర్రబీస్ ‘’,’’ది లాంగ్ వాయెజ్ హోం ‘’.ఈ మూడిటిని ‘’ది స్మార్ట్ సెట్ ‘’గా ముద్రించాడు .తరువాత పూర్తీ నిడివిగల నాటకం ‘’బియాండ్ ది హోరైజన్స్ ‘’19 20 లో ప్రదర్శించారు .అధిక ప్రేక్షకాదరణతో ఇది వంద కు పైగా ప్రదర్శనలు నిర్వహించారు .దీనికి మొదటిసారిగా పులిట్జర్ బహుమతి పొందాడు .దీనికి ముందటి నాటకాలు మోటుగా ఉన్నా అవి ‘’టైలర్ మేడ్ వినోదాలు అనిపించుకోలేదు .సామర్ధ్యంగా రాసినవే .అవి ఆకర్షణీయంగా లేకపోయినా ,సుఖాన్ని కలిగించక పోయినా చీకటిలో  ,హింసాత్మక ,వికార అందాన్ని ప్రదర్శించాయి .ఒక్కో సారి హీనంగా మరో సారి భయంకరంగా ఉన్నా అప్రధానంగా మాత్రం లేవు .ప్రపంచ బాధ ,అందులోని చెడు ను చూసి కుంగి పోలేదు .అతని హీరోలు ‘’నిస్సహాయులు ,విషాద వదనులు .’’అన్నా క్రిస్టీ ‘’కి రెండో సారి1922 లో  పులిట్జర్ ప్రైజ్ వచ్చింది .’’స్ట్రెంజ్ఇంటర్ లూడ్ ‘’నాటకం బహుళ ప్రజాదరణ పొంది దేశవ్యాప్తంగా నీల్ కీర్తి వ్యాపించి మూడో పులిట్జర్ పొందింది .రెండేళ్ళ తర్వాత అమెరికన్ రచయిత సింక్లైర్ లెవిస్ నోబుల్ బహుమతిని స్వీకరిస్తూ హుందాగా’’ ఈ ప్రైజ్ యూజేన్ ఓ నీల్ కు ఇచ్చిఉంటే చాలా గొప్పగా ఉండేది ..సమాజం లోని వికృతిని భయంకరంగా నేల బద్దలయేట్లు అగ్ని వర్షం కురిపించినట్లు ,తన నాటకాలను దాదాపుగా పది ఏళ్ళ నుంచి రాస్తూ కొత్త లోకాలను చూపిస్తున్నాడు’’అని మెచ్చుకొన్నాడు .విధ్వంసకర అగ్ని అనిపించాడు నీల్ .

నాటక రంగ సంప్రదాయాలనన్నిటిని తుంగలో తొక్కాడు .’’ది ఎ౦పరర్ జోన్స్ ‘’సుదీర్ఘ స్పీచ్ లకు స్వస్తి పలికింది .మోనోలాగ్ లతో రక్తి కట్టించాడు .పాతకాలపు ఫాంటసి నుంచి ఆధునిక వాస్తవికత కు నాటకాన్ని మార్చాడు .’’ది హేయిరీ ఏప్ ‘’లో ఫాంటసిని భావ వ్యక్తీకరణ వాద సిమ్బాలిజంగా మార్చాడు .’’ది గ్రేట్ గాడ్ బ్రౌన్ ‘’లో మాస్క్ లను ప్రవేశ పెట్టాడు .ఒరాస్ పాటల శబ్దాలతో ‘’లాజరస్ లాఫ్ద్ ‘’ను తీర్చి దిద్దాడు .పూర్వ గ్రీకు ట్రాజెడిలను ఆధునిక విధానాలతో శోభ కూర్చాడు .ఆయన నాటకాల లాగానే ఆయన జీవితమూ మారింది .అనేక మూడ్స్ లో అనేక ప్రదేశాలలో ఉన్నాడు .ఎక్కడా ఎక్కువ కాలం ఉండలేక పోయాడు.న్యు ఇంగ్లాండ్ ,బెర్మూడా ,ఫ్రాన్స్ ,సీ ఐలాండ్స్ ,టావో హౌస్ ,సాన్ ఫ్రాన్సిస్కో ,న్యూయార్క్, కేప్ కాడ్ లన్నీ తిరిగాడు మొదటి పెళ్లి  మూడేళ్లకే పెటాకులైతే 30 వ ఏట యాగ్నెస్  బోల్టన్ ను పెళ్ళాడి ఒక కొడుకు షేన్ ను కూతురు ఊనా కు తండ్రి అయ్యాడు .1929 లో విడాకు లిచ్చి 42 వ ఏట అందమైన నటి కార్లోటా  మాంటరి ని పెళ్లి చేసుకొని తోమ్మిదినాటకాల శ్రు౦ఖలానికి నాంది పలికాడు .1775 నుంచి 1932 వరకు అమెరికా కుటుంబం పొందిన ఉద్దాన పతనాలను వీటిలో గొప్పగా చూపించాడు .ఆరోగ్యం పూర్తిగా లభించి జుట్టుకొంచెం తెల్లబడి చలన పూర్వక పెదవులతో ,తీవ్ర ఆలోచన ఉన్న కనులతో ,ఎముకలు పొడుచుకు వచ్చే  దవడలతో అనేక ప్రశ్నల సమాహారంగా కనిపించేవాడు .

45 లో అభిమానులను ఆశ్చర్య పోయేట్లు ‘’ఆ వైల్డర్ నెస్ ‘’అనే సెంటిమెంటల్ కామెడి తో చేశాడు .భౌతిక సంపద మొహాన్ని తిరస్కరించాడు .’’ఆల్ గాడ్స్ చిల్లన్ గాట్ వింగ్స్ ‘’నాటకం జాతి అల్లర్లు సృస్తిస్తు౦దేమోనని భయ పడ్డారు .’’ది ఫైర్ ఉండరర్ ది  ఎల్మ్స్ ‘’కి బుజాలు తడుముకొన్న అవినీతి పరులు న్యు యార్క్ దియేటర్ లో ఆడనీకుండా అడ్డు పడి మూసేయించారు .బోస్టన్ లో కూడా జరగ నివ్వ లేదు .లాస్ ఏంజిల్స్ లో కొన్ని ప్రదర్శనలతర్వాత అందులో పాల్గొన్న నటుల౦దర్నీ  అరెస్ట్ చేశారు .

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-16 –ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -213 79- ఆధునికకవిత్వ మార్గ దర్శి –టి ఎస్ ఇలియట్—3(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -213

79-  ఆధునికకవిత్వ మార్గ దర్శి  –టి ఎస్ ఇలియట్—3(చివరిభాగం )

ఊసర క్షేత్ర రచనపై వచ్చిన విమర్శలకు సమాధానం గా ఇలియట్ ‘’one of the surest tests of a poet’s sensibility is the way in which a poet borrows ,.Immature poets imitate ,mature poets steal ,bad poets deface what they take ,and good poets make it into something better or at least something different ‘’అన్నాడు .నర్సరీ  రైమ్స్ లాగా పూర్తీ చేస్తూ పూర్తీ నిరాశతో వ్యంగ్య ప్రార్ధనగా ఉందనిపిస్తుంది . .ఆయన అనుచరులు సగం వర్ణనాత్మక సగం లిరికల్ శైలికి ముగ్ధులయ్యారు .అందరికి పరిచయం లేని సాహిత్యం ,ఎప్పటిదో అయిన ఫిలాసఫీ ,అరడజనుభాషలలోని కొటేషన్లు తో గందర గోళం కలిగించాడని కొందరు ,కాదు కాదు ఆయన కవిత్వం ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగించి ఊహలను గిలక్కోట్టాయిఅని కొందరు  అన్నారు .

తరువాత ఆయన చాలా మార్పుల తో రచన చేశాడు .నాటక రచన చేశాడు .రెచ్చగొట్టే వ్యాసాలూ రాశాడు .పుస్తక సమీక్షలు చేశాడు .’’పిల్లి ప్రేమికుల ‘’కోసం ‘’ఓల్డ్ పాస్యూమ్స్ బుక్ ఆఫ్ ప్రాక్టికల్ కాట్స్ ‘’రాశాడు .పెజియంట్ నాటకం గా ‘’ది రాక్ ‘’రాశాడు .సెయింట్ ధామస్ ఆత్మ బలిదానం పై ‘’మర్డర్ ఇన్ ది కేదేడ్రీల్’’రాశాడు . ఇలియట్ ను చూస్తె సంప్రదాయ బ్యాంకర్ అనిపిస్తాడుకాని కవి అనిపించడు..ఆరడుగుల అందగాడు .కాని సన్నగా అలసిపోయినట్లు ఉండేవాడు .డేగ చూపు .కొంచెం వంగి నడిచేవాడు .చక్కని గంభీర స్వరం తో తన కవితలలో చాలాభాగం చదివి రికార్డ్ చేశాడు .సిగ్గుపడుతూ సిగ్గుపడేవారి పక్షాన నిలిచాడు .కాని ఆయన సమక్షం ఎందుకో అందరికీ నచ్చేదికాదు దీనిపై ఎడ్వర్డ్ లియర్ కవి ఒక కవిత అల్లాడు –

‘’  How unpleasant to meet Mr.Eliot –with his features of clerical cut –and his brow so grim –and his mouth so prim –and his conversation so nicely –restricted to what precisely  -and if and perhaps and but –‘’

యాభై వచ్చేలోపు ‘’ఫోర్ క్వార్టర్స్ ‘’రాశాడు .ఇందులో గోప్పఫిలాసఫీ కుమ్మరించాడు .20 వ శతాబ్ది అత్యుత్తమ రచన అనిపించింది .సింఫనీ మాంత్రికుడు బీతొవెన్ సంగీత పరిధి దాటి సంగీతం కూర్చినట్లు ఉంది అన్నారు .  50 ఏళ్ళు దాటాక తుళ్ళిపడే శైలి టో రాశాడు .ఆయన రాసిన ‘’కాక టైల్ పార్టీ ‘’ఇంగ్లాండ్ ,అమెరికాలలో మంచి పేరు తెచ్చాయి .పూర్వపు యోధుడు ఇప్పుడు దైవ అన్వేషకుడుగా మారాడు .’’ట్రడిషన్ అండ్ ఇండి విడ్యువల్ టేలెంట్ ‘’అనేగొప్ప సాహిత్య విమర్శ గ్రంధం రాశాడు 60 వ ఏట ‘’కన్జర్వేటివ్ ఎల్డర్ స్టేట్స్ మన్’’అని పించుకొన్నాడు .ఈ వయసులోనే ఆధునిక కవిత్వానికి మార్గ దర్శనం చేసినందుకు నోబెల్ పురస్కారం అందుకొన్నాడు .ఈ సందర్భం గా ‘’the process of advancement is interesting one seems to become a myth ,a fabulous creature that does not exist ,one does not feel any different though ,it is not you get bigger to fit the world ,the world gets smaller to fit you ‘’అని ఫైల్లసాఫికల్ గా స్పందించాడు . నాలుగవ జార్జి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశాడు 65వ ఏట అందరూ చెప్పుకొనే కవిగా ,విమర్శకుడుగా ఇలియట్ ఎదిగిపోయాడు .అప్పటికే ఆయనపై డజను పుస్తకాలు వివరణాత్మకంగా విశ్లేశానాత్మకం గా వెలువడ్డాయి .వివాదాలకు కేంద్ర బిందువూ అయ్యాడు .ఆయన వివేకాన్ని ఎవరూ ప్రశ్నించలేదు .కవిత్వాన్ని గురించి ‘’ poetry may make us see the world afresh ,or some new part of it .It may make us from time to time  a little more aware of the deeper un named feelings to which we  rarely penetrate ‘’భాష్యం చెప్పాడు ఇలియట్ .70 లో ఇలియట్ పై ఒక సింపోజియం నిర్వహించారు .కొత్త క్రిటిక్స్ ను ఆయన లెమన్ స్క్వీజేడ్ క్రిటిక్స్ అన్నాడు –‘’good poetry must exhibit several qualities in proportion of which one is good sense ‘’అని కవిత్వ పరమావధి గురించి చెప్పాడు .’’సేలేక్టేడ్ ఎస్సేస్’’ లో కవిత్వం గురించి చాలా రాశాడు ‘’కవిత్వం ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూపిస్తుంది .కొత్త భాగాలను తెలియజేస్తుంది .లోతుల ఆవిష్కరణ చేస్తుంది నిజంగా దూసుకుపోయే సమర్ధత కవిత్వానికి ఉన్నది .ఆనందం తోబాటు జాగృతి కలిగిస్తుంది ‘’ ‘’అన్నాడు .ప్రపంచం లో ఎక్కడ యే రచన వచ్చినా దానిపై ఇలియట్ యేమని కామెంట్ చేశాడని అందరూ ఎదురు చూసేవాళ్ళు. ఆయన విమర్శకు అ౦త విలువ ఉండేది .

ఒక రకంగా చెప్పాలంటే ఇలియట్ ‘’ఊసర క్షేత్రం ‘’లో కవితా సస్య కేదారాలు పండించాడు .ప్రతి చోటా ఉన్న చావును ఆవిష్కరించాడు .కవితను ముక్కలు ముక్కలు చేసిరాశాడు .అందులో గుప్పించిన క్రియా సౌభాగ్యానికి మురిసిన వారున్నారు .శిధిల చిహ్నాలు చూపించాడు. బోలు మనుషుల నిజ రూపం కళ్ళ ముందు నిలిపాడు . కదలలేని కుళ్ళి కంపు కొడుతున్న  సమాజాన్ని చూపించాడు ‘’this is the way the world ends –this is the way the world ends –this is the way the world ends –not with a bang but a whimper ‘’అంటూ మూడు మాటలు గంట కొట్టినట్లు కొట్టి ప్రపంచ పరిసమాప్తి ని తెలియ జేశాడు .

చివరికాలం లో ‘’ఆల్కహాలిక్ ‘’ అయి ‘’రిం జిమ్ రిం జిమ్ ‘’అంటూ జిమ్ ను జాం మంటూ తెగ తాగేవాడు .4-1-1965 న ఇలియట్ మహా కవి మరణించాడు .ఆయన ద్విశాబ్ది కి లండన్ పోఎట్స్ కార్నర్ లో వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో ఒక పెద్ద శిలను ఉంచి గౌరవించారు .వర్జీనియా ఉల్ఫ్ ,జేమ్స్ జాయిస్ వంటి వారిని ప్రభావితం చేశాడు ఇలియట్ ‘’దం ,దాంతం,ధమత్వం ‘’మొదలైన భారతీయ పదాలను   వేస్ట్ లాండ్ లో చొప్పించి ఘనత చేకూర్చాడు .ఆధునిక ఆంగ్ల కవిత్వ మార్గదర్శి టి ఎస్ ఇలియట్ .

 

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం

శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం

 3-9-16 శనివారం మధ్యాహ్నం 3 గంలకు  సరసభారతి  పబ్లిక్ స్కూల్ వారితోకలిసి శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి(అమెరికా ) దంపతుల సౌజన్య సహకారాలతో కీ శే  శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యు ల గురు పూజోత్సవం ,పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తున్నాం  .ముఖ్యతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్  ,ఆత్మీయ అతిధులుగా   ,శ్రీ కోటగురు పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖరశాస్త్రి ,శ్రీ గాయత్రి ప్రసాద్ శ్రీ సీతారామాంజనేయులు గార్లు కుటుంబాలతో పాల్గొంటారు . ,శ్రీ కోట మాస్టారి చిత్రపటానికి పుష్పహార  సమర్పణ జరుగుతుంది  .

ఆనాటి కార్యక్రమం లో శ్రీమైనేని గోపాల కృష్ణ దంపతులు  ఏర్పాటు చేసిన కీ శే  శ్రీ కోట సూర్యనారాయణ శాస్స్త్రి మాస్టరు గారి ధర్మపత్ని స్వర్గీయ సీతమ్మ గారి   స్మారక నగదుబహుమతిని ప్రతిభ ,పేదరికం ఉన్న శాంతి నికేతన్ హైస్కూల్ బాలికకు  ,స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి మాస్టారు గారి స్మారక నగదు బహుమతి నిపబ్లిక్ స్కూల్ బాలునికి   చెరొక 10 ,000రూపాయలను సరసభారతి ద్వారా అందజేయబడుతుంది ,కోట సోదరులు తమ తలిదండ్రుల  జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన స్మారక నగదు పురస్కారం 10 000రూపాయలను పేదరికం  ప్రతిభా ఉన్నఇంటర్  విద్యార్ధికి వారి చేతులు మీదుగా అందింప జేయటం జరుగుంది .

రెండు రోజుల తర్వాత వచ్చే  5 వ దేదీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 3 వ తేదీ నే శ్రీ కోట సోదరులకు ,శాంతి నికేతన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మధుసూదన్ పిళ్లే దంపతులకు ,సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మిగారికి ,,ఇద్దరు పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులకు  సత్కారం జరుగుతుంది ..

   శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవ సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవానికి సాహిత్యాభిమానులు ,విద్యాభిమానులు విశేషంగా పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన

పూర్తీ వివరాలతో కూడిన ఆహ్వాన పత్రిక ఆగస్ట్ రెండవ వారం అందజేయ బడుతుంది    

                                          గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు

                     ఏం కె బాబు –ప్రిన్సిపాల్ –ఉయ్యూరు పబ్లిక్ స్కూల్    

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -212 789- ఆధునికకవిత్వ మార్గ దర్శి –టి ఎస్ ఇలియట్—2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -212

789-  ఆధునికకవిత్వ మార్గ దర్శి  –టి ఎస్ ఇలియట్—2

క్లాసిసిస్ట్ లలో ఇలియట్ అదో రకం .మొదటి రచనలలో రొమాంటిక్ కవిత్వమే కాక రొమాంటిక్ ప్రయోగాలు కూడా చేశాడు .19 వ ఏట లిరిక్స్ రాశాడు .హార్వర్డ్ నుంచి  గ్రాడ్యుయేట్ అవక ముందే ఫ్రెంచ్ సింబాలిస్ట్ ల పరిచయం కలిగింది .22వ ఏట హార్వర్డ్ పేపర్ ‘’ఆడ్వోకేట్ ‘’లో హ్యూమర్స్క్యు కవిత అచ్చయింది .తర్వాత రాసిన ‘’స్ప్లీన్ ‘’కవితలో వేరాలైన్ ,బాడర్లె సంగీతం ఎక్కువైంది .’’ప్లు ఫోర్క్’’లో ప్రత్యెక లక్షణాలు కనిపించాయి .అందులోని కొన్ని లైన్లు –

‘’And life ,a little bald and gray –languid ,fastidious ,and bland –waits ,,hat and gloves in hand –punctilious of tie and suit –on the doorstep of the Absolute ‘’తర్వాత సింబాలిక్ ప్రభావాన్ని గ్రహించాడు .అందుకే ‘’సింబాలిస్ట్ మువ్ మెంట్ ఇన్ లిటరేచర్ ‘’పుస్తకం లో ఇలియట్ ‘’లాఫోర్జ్ ,లిమ్బాడ్ లను  వినలేదుకాని ,వేరలిన్ ను ఇంకా చదవ లేదు .ఆయన్ను చదివాక కోర్బరీని తెలుసుకోలేదు .కనుక సైమంస్ పుస్తకం నన్ను మార్చింది అని చెప్పక తప్పదు’’అని రాశాడు .అండర్ గ్రాడ్యుయేట్ కవిగా ఉన్నప్పుడే తనమోడల్స్  కవితలను కేవలం పునః రచన చేయలేదు ఫ్రెంచ్ సింబాలిస్ట్ ల వస్తు భావ తీవ్రతలకు చెదిరిన స్థితులను  జాగృతం చేశాడు .మానసిక విశ్లేషణలను భావ వ్యక్తీకరణకు జోడించాడు  .ఇదంతా ఒక దీర్ఘ వలయాకారమైంది .ఆనాటి దిగజారుడు విధానాలను ఎలుగెత్తి చూపాడు .  శైలి విషయం లో ఇంకా నిర్దుస్టత రాలేదు .ఇంకా సగం పాండిత్యం ,సగం వ్యావహారికం గానే ఉంది .21 లో అతి ముఖ్యమైన కవిత ‘’ది లవ్ సాంగ్ ఆఫ్ జే ఆల్ఫ్రెడ్ ఫ్రూ ఫోర్క్ ‘’రాశాడు .””The symbolists had indicated a method ‘’of transmuting ideas into sensations ,of transforming an observation into a state of mind ‘’బాడర్లేర్ కొత్త  ప్రతీకల సముదాయాన్ని అందించాడు .సామాన్య జీవితం లోని ప్రతీకలనుకాకుండా వాటిని ఉద్ధరించి ,అసలు అర్ధానికి మరింత వివరణాత్మకం చేయాలి అన్నాడు ఇలియట్ .స్వాభావిక వ్యంగ్యాన్ని మరింత సాంద్రం చేశాడు .’’ఫ్రుటార్క్ అండ్ అదర్ అబ్సర్వేషన్స్’’కవితా సంపుటిలో వ్యంగ్యం తో టెక్నిక్ ను జటిలం చేసి రాశాడు .’’ది సేక్రేడ్ వుడ్ ‘’కవిత్వాన్ని వివరిస్తూ ‘’the use of poetry ‘’లో ‘’the essential advantage for a poet is not to have a beautiful world with which to deal –it is to be able to see beneath both beauty and ugliness –to see the boredom ,and the horror and the glory ‘’

ఇలియట్ అన్వేషణ34 వ ఏట వెలువడిన  ‘’వేస్ట్ లాండ్ ‘’లో ఫలవంతమైంది .17 వశతాబ్ది మెటాఫిజికల్ కవుల ,ప్రతీక కవుల వ్యంగ్యాన్ని కలబోసి రాశాడు దీన్ని .సెటైర్ ఉన్నా మూడ్ చాలా వాస్తవంగానే ఉంది .జ్ఞాపకాన్ని కోరికను కలిపి రాశాడు .ఇందులో ఆయనవాడిన జాతీయాలు ఆంగ్లకవిత్వం లో బహు నూతనమైనవి .కవిత వాడుక భాష ను ఆచూకీలతో మిశ్రమం చేసి రాశాడు .’’the verse was a curious amalgam ,colloquial speech joined to and jarred by recondite references ,blending with subtle emotions ,the horrifying and the ridiculous ‘’అని వివరించారు . అందుకే వేస్ట్ లాండ్ అనేక అర్దాల నిచ్చే కవిత అయింది .కొందరు దీన్ని అనేక కొటేషన్ ల అందమైన అల్లికగాఉండిచిన్న ఎపిక్ అయింది అన్నారు .మరొక వర్గ౦  సుదీర్ఘ మార్మిక పునః సృష్టి అన్నది  .మూడవ ముఠా దీన్ని క్రిస్టియానిటీ పై పునః విశ్వాస ప్రకటన అన్నది .నాల్గవ సమూహం ఈ కావ్యం ఊసర క్షత్ర మైన  సమకాలీన ప్రపంచ దిగ జారుడు, అవినీతి ,కి ఏకాంత నివాసానికి ,నైతిక విలువన దివాలా తనానికి   అద్దం పట్టింది అన్నది .హెమింగ్ వే వచనం లో ‘’ది సన్ ఆల్సో రైజేస్ ‘’రాసిన దాన్ని ఇలియట్ వేస్ట్లాండ్ లో కవిత్వ పరంగా చెప్పాడు .ఇదే’’ కోల్పోయిన తరానికి ‘’మాని ఫెస్టో .మేధావి వర్గం, యువత దీన్ని తమ బైబిల్ అన్నారు .లూయీ మాక్ నీస్ అనే విశ్లేషకుడు ‘’వేస్ట్ లాండ్  కవిత్వం యొక్క కీలక భావనలను పూర్తిగా మార్చేసింది  నిజం చెప్పాలంటే జీవితాన్నే మార్చేసింది .18 ఏళ్ళ వయసువారు ఎన్నో ఊసర క్షేత్రాలను చూశారు .అవన్నీ ఇందులో చిత్రరూపాలను పొందాయి .కనుక వీరికి అదొక మహాద్భుత కావ్యమైంది .మనసులలోకి దూరింది .ఇలియట్ మహా కవి చేసిన అద్భుత సృష్టి ‘’అన్నాడు .

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-18-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గురుపూర్ణిమ శుభా కాంక్షలు

సాహితీబంధువులకు 19-7-16 మంగళవారం గురుపూర్ణిమ అనే వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు

 గురుపూర్ణిమ సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో ఈ రోజు ఉదయం 10 గం లకుప్రత్యేకంగా  శాకాంబరీ పూజ ఏర్పాటు చేశాము  -దుర్గా ప్రసాద్
Inline image 1
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

14-7-16 గురువారం మేమిద్దరం మా అమ్మాయిఛి సౌ విజయలక్ష్మి , మనవళ్లుఛి ఆశుతోష్ ,పీయూష్ లతో మా రామారావు గూడెం అగ్రహారంలో పూర్వపు మా స్థలం లో శ్రీ కొలచన వరప్రసాద రావు శ్రీమతి భారతి దంపతులు నిర్మించిన శ్రీ భక్తాంజనేయ స్వామిదేవాలయం లో స్వామికి పూజ ,ద్వారకా తిరుమల సందర్శనం ,ఏలూరు -ముసునూరు మధ్య ఉన్న వేలుపు చర్ల లో మా బావమరిది స్వంత ఇంటికి వెళ్ళిన చిత్రాలు

14-7-16 గురువారం మేమిద్దరం మా అమ్మాయిఛి సౌ విజయలక్ష్మి , మనవళ్లుఛి ఆశుతోష్ ,పీయూష్ లతో మా రామారావు గూడెం అగ్రహారంలో పూర్వపు మా స్థలం లో శ్రీ కొలచన వరప్రసాద రావు శ్రీమతి భారతి దంపతులు నిర్మించిన శ్రీ భక్తాంజనేయ స్వామిదేవాలయం లో స్వామికి పూజ ,ద్వారకా తిరుమల సందర్శనం ,ఏలూరు -ముసునూరు మధ్య ఉన్న వేలుపు చర్ల లో మా బావమరిది స్వంత ఇంటికి వెళ్ళిన చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

17-7-16 ఆదివారం ఉదయం విజయవాడ మొగల్రాజ పురం సి ఆర్ లైబ్రరీలో శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారిచే ”మా అన్నయ్య ”పుస్తకావిష్కరణ మరియు స్పాన్సర్ శ్రీమతి మల్లికాంబ గారి పుట్టినింట్లో భోజనాల చిత్రమాలిక

17-7-16 ఆదివారం ఉదయం విజయవాడ మొగల్రాజ పురం సి ఆర్ లైబ్రరీలో శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారిచే ”మా అన్నయ్య ”పుస్తకావిష్కరణ మరియు స్పాన్సర్ శ్రీమతి మల్లికాంబ గారి పుట్టినింట్లో భోజనాల చిత్రమాలిక

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్యలో -నా కవిత -”మా శర్మన్నయ్య చిరంజీవి ”

మా అన్నయ్యలో -నా కవిత -”మా శర్మన్నయ్య చిరంజీవి ”sharmannayya 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య ”లోశ్రీ మైనేని గోపాలకృష్ణగారి కవిత -మార్గ దర్శి అన్నయ్య

మా అన్నయ్య ”లోశ్రీ మైనేని గోపాలకృష్ణగారి కవిత -మార్గ దర్శి అన్నయ్యmargadarshi 001

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య స్పాన్సర్ శ్రీమతి మల్లికగారి విశేషాలు ,పుస్తకం పై చలపాక అభిప్రాయం సరసభారతి దాతల వివరాలు ,ఏ పేజీలో ఏమి ఉంది

మా అన్నయ్య

స్పాన్సర్ శ్రీమతి మల్లికగారి విశేషాలు ,పుస్తకం పై చలపాక అభిప్రాయం సmallika3 001 page 001 chal1 001 chala2 001 mallika1 001 mallika2 001రసభారతి దాతల వివరాలు ,ఏ పేజీలో ఏమి ఉంది

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య పుస్తకం -అంకితం పొందిన కీశే తాడికొండ భోగ మల్లికార్జునరావుదంపతుల విశేషాలు

మా అన్నయ్య పుస్తకం -అంకితం పొందిన కీశే తాడికొండ భోగ మల్లికార్జునరావుదంపతుల విశేషాలుankitam8 001 ankitam9 001 ankitam10 001 ankitam1 001 ankitam2 001 ankitam3 001 ankitam4 001 ankitam5 001 ankitam6 001 ankitam7 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య పుస్తక ముఖ చిత్రాలు

మా అన్నయ్య పుస్తక ముఖ చిత్రాలుmaannayya4 001 maannayya1 001 maannayya2 001 maannayya3 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -211 789- ఆధునికకవిత్వ మార్గ దర్శి –టి ఎస్ ఇలియట్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -211

789-  ఆధునికకవిత్వ మార్గ దర్శి  –టి ఎస్ ఇలియట్

అరవై వ ఏట  నోబుల్ బహుమతి గ్రహీత ,అనేక విలువైన గ్రంధ రచయిత ,అద్భుత వ్యాసకర్త ,చురుకైన కరపత్ర రచయిత ,రాజీ లేని ఆధునిక కాల సీరియస్ కవి ,మార్గ దర్శి- హాస్య రచనలు రాయటం మొదలు పెట్టాడు .ఇది చాలా ఆశ్చర్య జనకమైంది .అంతకంటే ప్రత్యేకత మరొక్కటి ఉంది –అదే అప్పటిదాకా రాసిన అస్పష్ట గూడార్ధ రచన లనుంచి ముఖ్యంగా కవిత్వం నుండి వైదొలగి ,అద్భుత విజయవంతమైన వినోదాత్మక  ప్రసిద్ధి చెందిన నాటకాలు రాసి అట్లాంటిక్ సముద్రానికి అటూ ఇటూ పేరు ప్రఖ్యాతులను పొందినవాడు అమెరికాలో జన్మించి బ్రిటిష్ పౌరుడైన ధామస్ స్టి యార్న్స్ ఇలియట్ అంటే టి ఎస్ ఇలియట్ .26-9-1888 న అమెరికా లోని సెయింట్ లూయీకి చెందిన మిస్సోరిలో జన్మించాడు .ఆరుగురు సంతానం లో చివరివాడు .తండ్రిది న్యు ఇంగ్లాండ్ కు చెందిన ప్ప్యూరిటన్ వంశం .తాత బోస్టన్ నుంచి వచ్చి వాషింగ్టన్ యూని వర్సిటిని, మొదటి యునిట రేనియన్ చర్చిని సెయింట్ లూయీ లో   స్థాపించాడు .సివిల్ వార్ ముందు పారిపోయే బానిసల కోసం అండర్ గ్రౌండ్ రైల్వే ను ఏర్పాటు చేసిన వారిలో ఒకడు .తల్లి పౌర సేవకనాయకు రాలు  సంస్కర్త ,కవయిత్రి సవోనారాల అనే నాటక కవిత్వం రాసింది .ఆమె ప్రతిభ కొడుకు కు వారసత్వంగా లభించింది .అందుకే న్యు ఇంగ్లాండ్ లో ఇలియట్ ను చేర్చి చదివించారు .మిల్టన్ అకాడెమి ,హార్వర్డ్ యూని వర్సిటీలలో చదివి బి యే తర్వాత ఏం యే పాసై ఇంగ్లాండ్ వెళ్లి  సార్బొన్నేలో  ,ఆక్స్ ఫర్డ్ లో మెర్టన్ కాలేజి లో చదివి స్కూల్ మాస్టర్ గా పని చేశాడు .అయిష్టంగానే మేస్టర్ గిరీ నాలుగేళ్ళు బ్యాంక్ గుమాస్తాగా ఎనిమిదేళ్ళు  లాగాడు . 27 వయేటబాలట్ పై మోజున్న  వివిన్నే హైఘ్ ను పెళ్ళాడి  లండన్ పబ్లిషింగ్ హౌస్ లో మంచి ఉద్యోగం లో చేరి ,తర్వాత భాగస్వామి అయి ,1927లో బ్రిటిష్ పౌరుడయ్యాడు .కారణం అడిగిన వారికి ‘’ఇక్కడ బతుకుతున్నాను ,ఇక్కడే స్నేహితులతో సరదాగా గడుపుతున్నాను .చట్ట విరుద్ధంగా ఉండటం నాకిష్టం లేదు .పూర్తీ బాధ్యతా తో ఇక్కడే ఉండాలనుకోన్నాను ‘’అని బదులు చెప్పాడు .తానూ మత రీత్యా ఆంగ్లో కేధలిక్ నని ,రాజకీయాలలో రాయలిస్ట్ నని సాహిత్యం లో క్లాసిసిస్ట్ నని చెప్పుకొన్నాడు ఇలియట్ .

Inline image 1

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-16-7-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -210 78 – -భావ చిత్ర కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -3(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -210

78 –   -భావ చిత్ర  కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -3(చివరిభాగం )

సృజన సాహిత్య కుదుపులతో విపరీత ధోరణితో  పారిస్ లో కూడా తనసహాయకులను చికాకుపెడుతూ ,ఉద్దీపన కలిగించాడు .తన విపరీత పాండిత్యం తో కవులను మెడలో బిళ్ళల్లాగా చేసుకొని వినోదించాడు .ఈ కాలం లోనే కొత్త వగరు శైలిని ,సంభాషణా రూపం తో ,విరుద్ధ భావనలతో రూపొందించు కొన్నాడు .35 వ ఏట ‘’హఘ్ సేల్విన్ మాబర్లి ‘’అనే మిరుమిట్లు గొలిపే వ్యంగ్యం ,చమత్కారం ,రోత కలిగించే పుస్తకం ప్రచురించాడు .సాంకేతిక పరిణతి ఉన్న గొలుసులా ,వినసొంపైన భాగాలతో ,తెచ్చిపెట్టుకొన్న మొరటుతనం తో ,ఇంద్రియ పరోక్ష వివరాలతో కూడిన మహా ప్రవాహంగా మధ్యమధ్యలో సంబంధం లేని గుర్తుకొచ్చే విషయాలు అడ్డు పడుతుండగా కొత్త తరహా కవిత్వం చెప్పాడు .దీనినే ఇలియట్ కవి ‘’’a’positive document of sensibility .it is compact of a certain man in a certain place at a certain time ,and it is also the document of an epoch –it is genuine tragedy and comedy and it is in the best sense of Arnold’s worm phrase a ‘’criticism  of life’’అని విశ్లేషించాడు .

పౌండ్ రాసిన ‘’కాంటోస్ ‘’ఒక శృంఖల రచన .అందులో విడిపోతూ కలుస్తున్న ఆశావహ ఏక పాత్రాభినయాలు (మొనోలాగ్స్ )ఉన్నాయి వాటిని పాతికేళ్ళుగా రాస్తూనే ఉన్నాడు .కొందరు దాన్ని ఆయన సాహిత్య శిఖరారోహణం ,ఒక ఎపిక్ అన్నారు మరి కొందరు అర్ధం పర్ధం లేని సంబంధం లేని సాహిత్య దిగాజారుడుతనం అన్నారు .ఇది 100ఆధ్యాయాలు ..మొదటి 16 అధ్యాయాలు 1925 లో ,వెలువడితే మిగిలినవి ఆ తర్వాత 20 ఏళ్ళలో వచ్చాయి .1945 లో పౌండ్ పీసా  జైలు లో నిర్బంది౦చ బడినప్పుడు వచ్చిన 10 అధ్యాయాలను ‘’పీసాన్ కాంటోస్’’అన్నారు . ఈ మహా కావ్యాన్ని  చదవటానికి కుస్తీ పట్టినవాళ్ళు మింగుడు పడక అది కోడ్ భాషలో ఉందని దాన్ని చేదించి చెప్పే వివరణ ఉంటె కాని బుర్రకు యెక్కదని బుర్రలు పగలకొట్టుకొన్నారు .వాళ్ళు పొరబడ్డారు కాని పూర్తిగా అబద్ధం మాత్రం కాదు .సంపూర్నమైనదికాకపోయినా చాలా స్పష్టంగా నే ఉంటుంది .ఈ కావ్యాన్ని దున్నాలంటే యెన్ సైక్లో పీడియాలు ,పరభాషా డిక్షనరీలు ,సంస్కృతిక రాజకీయ చరిత్రలు ,పౌండ్ సమకాలికుల గురించి విస్మృత పుకార్లు ,ఆయన కున్న పరిచయాలు ,ఆయన రచనలలోని తికమకలు ,క్రమరాహిత్యాలు ,ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలు ఆధారాలుగా ఉండాల్సిందే .ఈ కాంటోస్ పై స్పందన వెను వెంటనే కాకుండా నిదానంగా ,భావోద్రేక రహితంగా వచ్చింది .దీనిపై రిచార్డ్ ఎబెర్ హార్ట్ రాస్తూ ‘’the student is recommended to read them about six times  before their flavor can diffuse through the blood ‘’పౌండ్ కున్న జాతీయాల వెదుకులాట ,ఆయనకున్న బహుభాషా పాండిత్యం మనకు అర్ధమై మనం కూడా తప్పకుండా ఉపయోగిస్తాం .

బాగా భాషా పాండిత్యం ఉన్న వాళ్ళే ఇందులోకి చొరబడగలరు .గ్రీకుల ,రినైసేన్స్ ల మొదటి ప్రపంచ యుద్ధకాలపు విషయాలు ‘’ఇంఫెర్నో ‘’లోను ,డబ్బు బాంక్ లావాదేవీలలో అవినీతిని ‘’ప్యురాగేటోరియో’’లో ,వాతావరణ అంతాన్ని ‘’పారాడిసో’’లో వర్ణించాడు .మన సంస్కృతికి పుట్టినిల్లు అయిన ప్రపంచం యొక్క యదార్ధ స్థితిని తీరం నుంచి గమనించి రాసిన సాటిలేని చరిత్ర  .ఎడ్వర్డ్ ఫిట్జరాల్ద్ ‘’there hangs a dismal mist of un resolved confusion ‘’అని చెప్పాడు .మామూలు భాషను కవిత్వం తో రంగరించటమే పౌండ్ శైలి అయింది .యేట్స్ కవి పౌండ్ ను ‘’సెక్స్ లెస్ అమెరికన్ ప్రొఫెసర్ ‘’గొప్ప మార్పు తెచ్చిన వాడు అంటూ ‘’a brilliant  improvisator who had more style than form, a style continually interrupted ,broken ,twisted into nervous obsession ,night mare ,stammering confusion ‘’అని తేల్చాడు .ఈ కన్ఫ్యూజన్ ఆయన శిష్యులు కూడాపడినా ఆయన శైలి తమ పాలిటి గాస్పెల్ –దైవ వాక్యం గా భావించారు .వాళ్లకు కావలసిన అత్యవసర విషయాలన్నీ పౌండ్ అందించాడు .ఆయన రాసిన ‘’స్పిరిట్ ఆఫ్ రోమాన్స్ ‘’,ఇన్స్టి గేషన్స్,పోలిట్ ఎస్సేస్ ,,సోషల్ క్రెడిట్ ,యాన్ ఇంపాక్ట్ ‘’మొదలైన రచనలన్నీ సంప్రదాయ రొమాంటిక్ విధానాలకు వ్యతిరేకాలే .

ఫ్రాన్స్  వదలి  ఇటలి  1924 లోచేరి  రివేర్రా దగ్గర  రాపల్లో లో ఉన్నాడు .1939 లో కొద్దికాలం అమెరికా వెళ్లి వచ్చాడు అక్కడ ఫాసిజాన్ని మెచ్చు కొని ముసోలిని జెఫర్సన్ తో పోల్చి వ్యతిరేకతను కొని తెచ్చుకొన్నాడు .ఆయన అనుయాయులు విస్తు పోయారు .చాలాకాలం అమెరికాకు దూరం గా ఉండటం వలన  మతి భ్రమణ వలన తమ’’గురూజీ  ‘’ఇక్కడి పరిస్తితులను తెలుసుకోకు౦డా గుప్పించిన కామెంట్ లన్నారు .విమర్శను తట్టుకోలేని రక్తం పౌండ్ ది .ఇటలీకి మళ్ళీ చేరి ఫాసిస్ట్ ధోరణి మితిమీరగా 1941 లో రోమ్ నుంచి షార్ట్ వేవ్ రెడియోద్వారా ప్రచారం చేశాడు  అమెరికాను ,దాని విధానాన్ని దుమ్మెత్తి పోశాడు . ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నాడని చెప్పాడు. చివరికి ఇవన్నీ అతన్ని అమెరికా దేశ ద్రోహి గా ముద్ర వేసే స్థితికి తెచ్చుకొన్నాడు 1945 లో పౌండ్ ను బంధించి అమెరికాకు చేర్చింది ప్రభుత్వం .వాషింగ్టన్ జైల్లో పెట్టి విచారణ చేసింది .విచారణకు నిరాకరించాడు .నలుగురు మానసిక వైద్యులు పరీక్షించి పౌండ్ మానసిక స్థితి ఆరోగ్యం గా లేదని రిపోర్ట్ ఇచ్చారు .మరణ శిక్ష పడితేకాని పిచ్చి కుదరదు అన్నారు .కాని  తర్వాత సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్లో 14 2- 1946న  మానసికరోగిగా అంటే ఉన్మాదిగా చేర్చి వైద్యం అందించారు ..12 ఏళ్ళు కేసు నడిచింది .పౌండ్ ఇక ఏమాత్రం విచారణకు నిలబడ లేడనిప్రజలు , ప్రజా సంఘాలు కవులు ,రచయితలూ వాల్ట్ విట్మన్ కవి నాయకత్వం లో పెద్దపెద్దనిరసనలు చేసి  విడుదల చేయమని ప్రబుత్వం పై ఒత్తిడి తెచ్చారు .1958 లో హాస్పిటల్ నుండి విడుదలై ఇటలీకి వెళ్ళిపోయాడు. ఇటలీ తన పెంపుడు తల్లి అంటూ ఫాసిస్ట్ పద్ధతిలో సెల్యూట్ చేసి ‘’అమెరికా ఒక పిచి వాళ్ళ శరణాలయం ‘’అని స్టేట్మెంట్ ఇచ్చాడు ,

63 వ ఏట ఇంకా నేరగానిగా విచారణ జరుగుతుండగానే పౌండ్ కు ‘’పిసాన్ కాంటోస్ ‘’రచనకు గాను వెయ్యి డాలర్ల బోలింజన్ ప్రైజ్ను ఫెల్లోస్  అందజేశారు .దీన్ని స్వీకరించటానికి ప్రభుత్వ అనుమతి అవసరమైంది .ఈ ఫెల్లోస్ లో ఎక్కువ మంది అమెరికన్ కవులే ఉన్నారు .వాళ్ళు పౌండ్ రాజకీయాలతో తమకు సంబంధం లేదని ,ఆయన కవిత్వానికిచ్చిన అవార్డ్, రివార్డ్ అనీ తెలియ జేశారు .కొన్ని నెలలు దీనిపై ప్రతిస్తంభన ఏర్పడింది .వస్తువా,విదానమా అనే ఈ వివాదం  యా౦ డ్రూమేల్లాన్ బెల్లిన్జేన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచేఉంది .పౌండ్ రాజకీయ భావనలు క్షణికోద్రేకమైనవే   కాని ఆయన చేసిన కవితా తపస్సు అద్వితీయమణి  అమోఘం అనితర సాధ్యం అని గుర్తించారు .ఆయన నవ రచయితలలో చాంపియన్ మాత్రమేకాదు మార్గ దర్శి .నిర్లఖ్యానికి పౌండ్ పూర్తీ వ్యతిరేకి ,దానిపై నిరంతర పోరాటం చేసినవాడు .’’పౌండ్ అంతం ఆయన ఆది ‘’అవుతుందని క్రిటిక్స్ అన్నారు .అయన రాసిన ‘’I am weathered the storms –I have beaten out my exile ‘’అనేది అందరికి ఆదర్శమైంది .పౌండ్ తన అనుయాయులకు కొత్తగా ఏదీ బోధించలేదు కాని వాళ్ళు కవిత్వాన్ని ఎలా చెప్పాలో ఉదాహరణ పూర్వకం గానిరూపించిన మార్గ దర్శి .కవిత్వాన్ని సంగీతం లో రంగ రించి రాశాడు .’’కౌంటర్ పాయింట్ ‘’కు ప్రాధాన్య మిచ్చాడు .అనువాదకుడుగా పౌండ్ గొప్ప చరిత్ర సృష్టించాడు .చవరికి మనచలం లాగా చెంపలేసుకొని ‘’the worst mistake I made was that stupid ,suburban prejudice of anti Semitism ‘’అన్నాడు పశ్చాత్తాపం తో . ‘’

పౌండ్ చెప్పిన కవితా సిద్ధాంతాలు –సామాన్య భాషలో సరైన మాటను ఉపయోగించి దానికి తళుకులు బెళుకులు అద్దకుండా రాయాలి .రిథం ను పాత పద్ధతిలో కాకుండా ,కొత్త రైమ్స్ ను కొత్త మూడ్స్ ననుసరించి ఫ్రీ వెర్స్ లో రాయాలి .కవిత్వ ఉత్పత్తి అస్పష్టంగా ఉండిపోవాలి .అంతర్జాతీయ భావనా పరమావధిగా రాయాలి .టెక్నిక్ కు ప్రాధ్యాన్యం ఎక్కువ ఉండాలి .కమ్యూనికేషన్ కంటే శైలికే అధిక ప్రాధాన్యమివ్వాలి .ఈ సెంటిమెంట్ కల్లోలం సృష్టించి ‘’ఫ్రీ వేర్స్ ఫ్యూరోర్  ‘’అని పించుకోన్నది .తన కాంటోస్ కు రాసిన సూచికే 320పేజీలు  ఉంది .ఇదంతా చైతన్య స్రవంతి అంటే స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ ‘’రచన అప్పటికి అది చాలా కొత్త . హ్యూమన్  కామెడీని అనేక గొంతుకలతో ,అనేక పరిమాణాలలో కోణాలలో చెప్పానని చెప్పుకొన్నాడు పౌండ్ .ఒక నిర్దుష్ట ప్రణాళిక తోనే రాశాడు ఆషామాషీ వ్యవహారం కాదు .ఇందులో వస్తువు వ్యతిరేక వస్తువు ,చరిత్ర పునరావృత్తాలు ,ఉంటాయి .కొన్ని కవితా పంక్తులు –‘’hang it all Robert Browining –there can be but the one ‘’Sordello ‘’and my Sordello –lo sordels sifo di Mintovans –so  shu –churned in the sea ‘’

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య పుస్తకావిష్కరణ సభ 17-7-16 -ఆదివారం ఉదయం 10గం లకు మొగలరాజ పురం సి ఆర్ లైబ్రరీ లో

ps

మా అన్నయ్య పుస్తకావిష్కరణ సభ 17-7-16 -ఆదివారం ఉదయం 10గం లకు మొగలరాజ పురం సి ఆర్ లైబ్రరీ లో

ahvanam

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సంకరం బడి సాహిత్య పీఠం తిరుపతి

004 003

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -209 78 – -భావ చిత్ర కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -209

78 –   -భావ చిత్ర  కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -2

వాల్ట్ విట్మన్ కవిని ఒకప్పుడు ద్వేషించినా ,ఇప్పుడు ఆయనతో సయోధ్య కుదుర్చుకొనే ప్రయత్నం చేశాడు ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’కవిత్వం రాసిన కుర్రాడు బాగా ఎదిగిపోయాడని మెచ్చి ,’’కొత్త కట్టె ను విరగ్గొట్టిన నువ్వు ఇప్పుడు ఆకర్రతో నగిషీలు చెప్పే సమయం వచ్చింది ‘’అని ప్రోత్సహించాడు .కొన్నేళ్ళకే ఎజ్రా పౌండ్ తనకు తగిన ప్రదేశాన్ని ఎంచుకొని ఇంగ్లాండ్ వెళ్లి మొదట్లో అక్కడి వారిని ఆకర్షించలేక పోయినా ,క్రమంగా వారి కి దగ్గరయ్యాడు .19 వ ఏట కొంచెం నెర్వస్ గా ,ఉద్రిక్తంగా ,కుదుపులతో రెడ్డిష్ బ్రౌన్ అమెరికన్ ‘’లాగా ఉండేవాడని వింధాం లెవిస్ రాశాడు .గ్లాసు నీటిలో నూనె చుక్క ‘’లాగా ఉండేవాడు .ఆయన ఎవరితోనూ కలవని రకం .ఆకట్టుకోవటానికి ప్రయత్నించే వాడు .దీనిలో మాత్రం విజయం సాధించాడు .ఆయన అహంకారం ,పాండిత్యాలు చరిత్రనే సృష్టించాయి .కళల లో నూతన పరిశోధనాలను వివరించి చెబుతూ విక్టోరియన్ యుగ లక్షణాలను ప్రేల్చి వేస్తూ ఉపన్యాసాలిస్తూ ,తానుచికాగో లో పెట్ట్టిన ’’పొయిట్రి ‘’మేగజైన్ కు ‘’యూరోపియన్  విలేకరి అయ్యాడు .అహంకార పూరిత ఎర్ర గడ్డం తో కంద గడ్డ లాంటి మొహం తో దూరం గాతిరుగుబాటు మాండరిన్ గా  ఉండే వాడు .శిష్యుల్నిఆకర్షిస్తూ  నిరాకరిస్తూఘాటుగా చివాట్లు పెడుతూ  ఉన్నా వినాశకరంగా ప్రవర్తించే వాడు మాత్రం కాదు  . పౌండ్ విమర్శలకు లాభ పాడినవాడు టి ఎస్ ఇలియట్ కవి .ఆయన సలహాపై తన ‘’వేస్ట్ లాండ్ ‘’కావ్యాన్ని సగానికి సగం తగ్గించి ఆకర్షణీయం చేశాడు .పౌండ్ రాసిన ‘’సేలక్టేడ్ పోయెమ్స్ ‘’కు ఇలియట్ ముందుమాటరాస్తూ ‘’అతని ప్రభావం చాలా గొప్పది .ఆయన కవిత్వాన్ని ఉపన్యాసం చేశాడు .తర్వాత కవిత్వాన్ని పాట ను చేశాడు .

1914లోసమకాలీన రొమాంటిక్ కవిత్వాన్ని నిరసించే  కవి బృందాన్ని పోగేసి ,వారికొక మేని ఫెస్టో తయారు చేసి ఆ గ్రూప్ కు’’ఇమేజిస్ట్ ‘’లని  ఒక పేరు కూడాపెట్టాడు  . వీళ్ళు భావ చిత్రాలకు ప్రాధాన్యమిచ్చి ,రోమా౦ టిజం బంధనాలలోంచి కవిత్వపు చెర విడిపించి నందుకే ఈ పేరు పెట్టాడు .ఇమేజిస్ట్ లు సాధారణ భాషను ,సరైన వర్ణనాత్మక పదాలతో రాస్తూ ,ఛందస్సు ను వదిలి  కొత్త లయ తో ,కొత్త మూడ్స్ తో అనిబద్ధ కవిత్వం రాస్తూ ,కఠిన స్పష్టమైన  కళంక రహిత,అనిర్దిష్ట  కవిత్వ సృష్టిచేశారు .ఈసిద్దా౦తాలవలననే ఉత్తమ కవిత్వం మాత్రమె కాక సాహిత్య సృష్టి జరుగుతుందని నమ్మారు . ఈ సిద్ధాంతాలు జనం లో కల్లోలం నిరసన  అవహేళన సృష్టించాయి .ముఖ్యంగా ఆమిలోవెల్ అనే కవయిత్రి ఇమేజిస్ట్ గా మారి పౌండ్ బాటలో నడిచి నూతన కవిత్వాన్ని రాసి ప్రసిద్ధి పొందింది .అయితే పౌండ్ తమ గ్రూపును ఆమె డామినేట్ చేసి రాస్తోందని,ఆమె కవిత్వం తాము ఆశించిన స్థాయిలో లేదని ప్రాణం లేని జీవి చిత్రంలా ఆమె కవిత్వం ఉందని  మండిపడ్డాడు .లోవెల్ భార్య అయిన ఈమె రాసింది ఇమేజిస్ట్ కవిత్వంకాదని దాన్ని ‘’అమీజిస్ట్ ‘’కవిత్వం అనాలని అన్నాడు .తాను ఏర్పరచిన గ్రూప్ నుంచి విడిపోయి ,ఆ సిద్ధాంతాలకు ఇక తానేమీ బాధ్యుడినికానని ప్రకటించాడు .తర్వాత ‘’దిలిటిల్ రివ్యు ‘’పత్రికకు ఎడిటర్ అయి మొదటి ప్రపంచ యుద్ధం అయ్యాక లండన్ వదిలి పారిస్ చేరాడు .

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య పుస్తకావిష్కరణ సభ 17-7-16 -ఆదివారం ఉదయం 10గం లకు మొగలరాజ పురం సి ఆర్ లైబ్రరీ లో

సరసభారతి 94వ సమావేశం గా రమ్య భారతి తోకలిసి 17-7-16 ఆదివారం ఉదయం ..”మా అన్నయ్య ”పుస్తకావిష్కరణ సభ జరుపుతున్నాం .సాహిత్యాభిమానులందరూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన

తేదీ సమయం ——–17-7-16 -ఆదివారం -ఉదయం 10 గం లకు
వేదిక –                 మొగలరాజాపురం లోని చండ్ర  రాజేశ్వర రావు లైబ్రరీ (సి ఆర్ లైబ్రరీ )
సభాధ్యక్షులు —       శ్రీ గబ్బిట  దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
ముఖ్య అతిధి ,ఆవిష్కర్త –     శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ -ప్రముఖ కదా రచయిత ,                                                           న్యాయవాది ,విమర్శకులు ‘
ఆత్మీయ అతిధి —–              శ్రీ కె .నిరుత్తమ రావు ,ప్రసిద్ధ రచయిత
పుస్తక పరిచయం                  శ్రీ కె ఆంజనేయ ప్రసాద్ ,కవి ,సాహితీ విమర్శకులు
పుస్తక ప్రాయోజకులు —         శ్రీమతి సీతంరాజు మల్లిక
కార్య క్రమ నిర్వహణ ——        శ్రీ చలపాక ప్రకాష్ -రమ్య భారతి సాంపాదకులు
సభా కార్యక్రమ సహకారం —-శ్రీమతి మాది రాజు శివ లక్ష్మీ -సరసభారతి కార్య దృష్టి
                                            మీ ఆగమనాభిలాషులు
                                           గబ్బిట దుర్గా ప్రసాద్
                                           చలపాక ప్రకాష్
Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

yoga vybhavam

yoga1 001 yoga3 001 yoga4 001 yoga5 001 yoga6 001 yoga7 001 yoga8 001 yoga 2 001

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -208 78 – -ప్రతీక కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 208

78 –   -ప్రతీక కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్

తన పోరబాట్లఅస్తిత్వంతో బతుకు విషాదం చేసుకొన్నఆధునిక అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ .రాజకీయ ప్రచారం లో ఉద్దండుడు.ఈ ప్రాపగాండా తో తనలోని ఆర్టిస్ట్ ను  వాచాలత్వం,  బూతులతో సన్నిహితులను దూరం చేసుకొని చివరికి దేహ ద్రోహ నేరం మోపబడి న విధి వంచితుడు .30-10-1885 న అమెరికాలోని ఇడాహోరాష్ట్రం లో హైలీ లో పుట్టాడు .ఆతనిది న్యు ఇంగ్లాండ్ వంశం .తల్లి లాంగ్ ఫెలో కవికి దూరపు చుట్టం .తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ,మొదటి ప్లాస్టర్డ్ హౌస్ నిర్మించిన మార్గ దర్శి .చిన్నతనం లోనే పెన్సిల్వేనియా కు తీసుకు పోబడి తూర్పు వాతావరణం లో పెంచబడ్డాడు  .15 ఏళ్ళకు అక్కడి యూని వర్సిటి లో చేరి కార్రిక్యులం లేని  తులనాత్మక సాహిత్యం చదివి జీర్ణించుకొన్నాడు .16 వయసులో స్పెషల్ స్టూడెంట్ గా నమోదయ్యాడు .18 వ ఏట న్యూయార్క్ హామిల్టన్ కాలేజి లో చేరి ,ఇరవైకే గ్రాడ్యుయేట్ అయి రోమాన్స్ లాంగ్వేజెస్ లో ఫెలో అయి పెన్సిల్వేనియా యూని వర్సిటిలో ,ప్రొఫెసర్ సమాన హోదా గల ఇంస్ట్రక్ట్క్తర్ అయ్యాడు .21 కె మాస్టర్ డిగ్రీ పొంది ,స్పెయిన్ ఇటలి ఫ్రాన్స్ లు తిరిగొచ్చాడు .ఒక ఏడాది స్పానిష్ నాటక రచయిత లోప్ డి వేగా పై పరిశోధన చేశాడు .1907 లో తిరిగి రాగా ఇండియానా రాష్ట్రం క్రాస్ ఫోర్డ్స్ విల్ లో వాబాష్ కాలేజి లో ఫాకల్టిలో చేరమని ఆహ్వానం అందుకొన్నాడు .ఆ టౌన్ సాహిత్య సంప్రదాయాలకు ,ముఖ్యంగా బెన్హర్ రాసిన ల్యు వాలెస్ చనిపోయిన ప్రదేశం గా గుర్తింపు పొందింది .నాలుగు నెలల తర్వాత బోహిమినియనిజం తో   సంప్రదాయ విరోధి అని నిందలు మోపి ఉద్యోగం ఊడ గొట్టారని పౌండ్ చెప్పుకొన్నాడు .

     పుట్టుకతోనేవిద్యా వేత్తగా  బోధనా  సామర్ధ్యంఉన్నా విఫలమైన టీచర్ గా నిరాశ చెంది , తన బహిష్కృత అమెరికన్ లకు చదువు నేర్పాలను కొని , యూరప్ కు  వెళ్లి  జేబులో ఎనభై డాలర్లతో జిబ్రాల్టర్ చేరి కొంత డబ్బు వడ్డీకిచ్చి దానితో బతుకుతూ గడిపాడు .ఇటలీ వెళ్లి మొదటి పుస్తకం ‘’ఎ ల్యూం స్పేంటి ‘’1908 లో వెనిస్ లో ప్రచురించాడు .ఇది చిన్నపుస్తకమే అయినా తన విద్యకు తగిన ఉన్నత రంగుల ప్రతి బి౦బాలతో పగిలిన అద్దం పెంకుల్లా ఉంది .కొన్ని నెలల తర్వాత లండన్ లో ఉన్నాడు. అక్కడ  ఆధునిక యువ రచయితలతో కలిసి ,వారి వైవిధ్య కార్యక్రమాలకు నాయకత్వం వహించి చైనా జపాన్ కవిత్వమైన ఫెనలోసా సంపుటికి ఎక్సి క్యూటర్ బాధ్యత చేబట్టాడు.25 వఏట మరో రెండు చిన్న పుస్తకాలు ‘’పర్సోనే ‘’’’,ఎక్సల్టేషన్స్ ‘’రాసి ముద్రించాడు  .తర్వాత ‘’కాన్జోని ,’’రిపోజిల్స్ ‘’కూడా రాసి మొత్తం అయిదు పుస్తకాలను 27 ఏళ్ళకే ప్రచురించాడు .29 కి డోరోతి షేక్స్ పియర్ ను పెళ్లి చేసుకొని ఒక కొడుకుకు తండ్రి అయ్యాడు .

   పౌండ్ రాసిన మొదటి  కవితలు ప్రాచీన ఫ్రెంచ్ ఆధునిక ఇంగ్లీష్ ప్రభావ సమ్మేళనాలే .ప్రోవెన్షియల్ కవులు,మధ్యయుగపు ప్రేమ గీతాలతో బ్రౌనింగ్ ,విలియం మారిస్ ,స్విన్ బరన్, ప్రి రాఫలైట్స్ కవిత్వాల రంగ రింపు ప్రాముఖ్య యాస తో ఉంది .మధ్యలో అనేక వైరుధ్యాలు ,కొత్తదనం తాజాదనం కృత్రిమ ఆకర్షణ తో ఉంది .బాలడ్స్ సేస్టినా,ఫ్రెంచ్ కవితల అనువాదం  పాత వాసనతో కొత్తగా,వాడుక భాషలో స్వీయ చైతన్య స్పూర్తితో ఉంది .ఉదాహరణకు –  ‘’come ,my songs ,let us speak of perfection –we shall get ourselves rather disliked –the gilded phaloi  of the crocuses –are thrusting at the spring air ‘’

 

Inline image 1Inline image 2

        సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-13-7-16-ఉయ్యూరు

 

 

‘’

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు(వ్యాసం)- విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -జులై -గబ్బిట దుర్గాప్రసాద్

ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

భారత దేశ స్వాతంత్ర్య సమరం లోబెంగాల్ రాష్ట్రం లోని చిట్టగాంగ్ జిల్లాకు కు ప్రత్యెక ప్రాధాన్యత ఉంది .అక్కడి వీర నారీమణులు సాయుధ పోరాటం చేసి చరిత్రకెక్కారు .వారిలో కల్పనా దత్తా ,ప్రీతి లతా వాడేదార్ ల గురించి తెలుసు కొందాం .

1- కల్పనా దత్తా

కల్పనా దత్ అనే పేరుతో పిలువ బడే కల్పనా దత్తా జాతీయ బెంగాలీ విప్లవ నారి .బెంగాల్ లో చిట్టగాంగ్ జిల్లా సిరిపూర్ గ్రామం లో 1913 జులై 27న జన్మించింది .చిట్టగాంగ్ లో చదివి మెట్రిక్ పాసై కలకత్తా చేరింది .బెతూనే కాలేజి లో సైన్స్ లో డిగ్రీ కోర్స్ లో చేరింది . అక్కడే వీణా దాస్, ప్రీతీ లాల్ వాడేకర్ ల ఆధ్వర్యం లో నడుస్తున్న చిన్న విప్లవ సంఘం ‘’చాత్రి సంఘం ‘’లో సభ్యురాలై చురుకైన కార్య కర్త అయింది .

1930 ఏప్రిల్ 18న జరిగిన చిట్టగాంగ్ ఆయుధ దోపిడీ లో చిట్టగాంగ్ లోని ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ తరఫున సూర్య సేన్ తో కలిసి పని చేసింది .1931లో సూర్య సేన్ కల్పనకు ,ప్రీతీలత కు చిట్టగాంగ్ లోని యూరోపియన్ క్లబ్ పై దాడి జరిపే బాధ్యతను అప్పగించాడు .కాని ఒక వారం ముందే ఆమె ఆ ప్రాంతం లో సంచరిస్తుండగా అనుమానమొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది .బెయిల్ పై విడుదలై సాయుధ పోరాటం కోసం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయింది .1923 ఫిబ్రవరి 17న వారి స్థావరాన్ని గుర్తించి పోలీసులు చుట్టుముట్టి సూర్య సేన్ ను అరెస్ట్ చేశారు .కల్పన వారికి అందకుండా తప్పించుకొన్నది .సుమారు పదేళ్ళ తర్వాత 19-5-1933న ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగలిగారు .చిట్టగాంగ్ ఆయుధ దోపిడీ పై రెండవ సారి జరిగిన విచారణ లో యావజ్జీవిత ఖైదు విధించారు .కాని 1939లో ఆరేళ్ళ తర్వాత విడుదల చేశారు .

కలకత్తా యూని వర్సిటీ నుండి1940లో సైన్స్ లో డిగ్రీ పొందింది .భారత కమ్యూనిస్ట్ పార్టీ లో చేరి 1943లో వచ్చిన బెంగాల్ కరువు ,ఆ తర్వాత బెంగాల్ విభజన లలో బాధితుల సేవాకార్యక్రమాలలో పాల్గొని ఆదుకోన్నది .అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరి పూర్ణ చాంద్ జోషి ని వివాహ మాడిఇద్దరు కుమారులను కన్నది .పెద్దకొడుకు చాంద్ జోషి గొప్ప జర్నలిస్ట్ .హిందూస్తాన్ టైమ్స్ లో పనిచేశాడు .ఆయన 1985లో రాసిన ‘’భి౦ద్రేన్ వాలే –మిత్ అండ్ రియాలిటి ‘’పుస్తకం బహుళ ప్రచారం పొందింది . ‘’చిట్టగాంగ్ ఆయుధ దోపిడీ జ్ఞాపకాలు ‘’అనే స్వీయ జీవిత చరిత్రను కల్పన రాసింది .ఇది 1945లో ఆంగ్లభాషలో అచ్చయింది .1946 బెంగాల్ శాసన సభకు జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చిట్టగాంగ్ నుంచి పోటీ చేసింది కాని గెలవలేదు .తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ లో చేరి ,అక్కడే రిటైర్ అయింది .8-2-1995న 82ఏళ్ళ వయసులో స్వాతంత్ర సమార యోధురాలు కల్పనా దత్త మరణించింది .

కల్పనా దత్తా పై సినిమా తీశారు .అందులే దీపికా పడుకొనే కల్పన పాత్ర ధరించింది .హిందీలో తీసిన ఈ సినిమా పేరు ‘’ఖేలేన్ హం జీ జాన్ సె ‘’.ఇందులో చిట్టగాంగ్ సాయుధ దోపిడీ ,ఆతర్వాత జరిగిన పరిణామాలు చిత్రించారు .పూర్వపు నాసా సైంటిస్ట్ వేదవ్రత పైన్ దర్శకత్వం వహించాడు .12-102012న ఈ సినిమా విడుదలైంది .

2-ప్రీతీ లతా వాడేదార్

మధ్యతరగతి వైద్య బ్రాహ్మణ కుటుంబం లో ఇప్పటి బంగ్లాదేశ్ లోఉన్న చిట్టగాంగ్ ఉపజిల్లా పాటియా లోని దాల్ఘాట్ గ్రామం లో 5-5-1911న ప్రీతిలతా వాడేదార్ జన్మించింది .తండ్రి జగబందు వాడేదర్ చిట్టగాంగ్ మునిసిపాలిటీ గుమాస్తా .తల్లి ప్రతిభా మాయి గృహిణి .వారి 6గురు సంతానం లో ప్రీతి రెండవది .ఇంట్లో ‘’రాణి ‘’అని ముద్దుగా పిలిచేవారు .తండ్రికి వంశ పారంపర్యంగా వచ్చిన ‘’దాస్ గుప్త’’ బిరుదు ఉంది .పిల్లకు తనకున్న శక్తి సామర్ధ్యాలతో ,ఆర్ధిక వనరులతో విద్య నేర్పించాడు .చిట్టగాంగ్ లోని డాక్టర్ ఖాస్ట గిర్ ప్రభుత్వ బాలికల పాఠ శాలలో చేర్పించాడు .మెట్రిక్ పాసై౦ది. అక్కడే టీచర్ గా ఉన్న విద్యార్ధుల అభిమానం పొందిన’’ ఉషాదీ’’ చెప్పే ఝాన్సి లక్ష్మీ బాయి చరిత్ర లతా ,ఆమె సహ విద్యార్ధులలో జాతీయ భావన ను ప్రేరేపించింది .ప్రీతి లో సాహసం ధైర్యం రావటానికి ఇదే కారణమైంది .కల్పనా దత్తా ఈమెకు సహ విద్యార్ధిని.ప్రీతికి కళా సాహిత్యాలు ప్రీతి పాత్రమైనాయి .ఢాకా లోని ఈడెన్ కాలేజి లో చేరి ఇంటర్ లో మొదటి స్థానం సాధించింది .అనేక సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది .. లీలానాగా నడిపే శ్రీ సంఘం లో దిపాలీ సంఘం ఆధ్వర్యం లో పని చేసింది .

కలకత్తా వెళ్లి బెతూనే కాలేజి లో చేరి రెండేళ్ళు ఫిలాసఫీ చదివి డిస్టింక్షన్ తో గ్రాడ్యుయేట్ అయింది . కాని బ్రిటిష్ అధికారులు ఆమె సర్టిఫికేట్ ను యూని వర్సిటీ జారీ చేయకుండా నిలిపేశారు .చనిపోయాక 2012లో ఆమెకూ,వీణా దాస్ కు మరణానంతర డిగ్రీ ప్రదానం చేశారు .డిగ్రీ తర్వాత చిట్టగాంగ్ చేరి నందన్ కానన్ అపర్ణాచరణ్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పని చేసింది . భారత స్వాతంత్రయుద్ధం వార్త విని తానూ పాల్గోనాలనినిర్ణయించు కొన్నది .సూర్య సేన్ ఆమె భావాలను గమనించి తమతో విప్లవ సంఘం తో కలిసిసాయుధ పోరాటం లో పని చేయమని ఆహ్వానించాడు .1932జూన్ 13న దాల్ఘట్ కాంప్ లో సూర్యా సేన్ ,నిర్మల్ సేన్ లను కలిసింది .సహా విప్లవ కారుడు వినోద్ బీహారీ చౌదరి ఆడవాళ్ళను చేర్చుకోవద్దని అభ్యంతరం పెట్టాడు .ఆయుధాలను చేరవేయటం లో అనుమానం రాకుండా ,పట్టుబడకుండా నైపుణ్యం గా చేర వేసే సామర్ధ్యం స్త్రీలకకేఉందని చెప్పి సూర్య సేన్ ఒప్పించి చేర్చుకొన్నాడు .

చిట్టగాంగ్ ఇన్స్పెక్టర్ జనరల్ క్రైగ్ ను హత్య చేయటానికి సూర్య సేన్ విప్లవ దళం నిర్ణయించింది . రామకృష్ణ బిశ్వాస్ ,కాళీ పాద చక్రవర్తి లకు సేన్ ఈ బాధ్యతఅప్పగించాడు . కాని వీళ్ళు పొరబాటున చందాపూర్ ఎస్పిని, త్రయాణీ ముఖర్జీని కాల్చి చంపారు .దీనికి బిశ్వాస్ ను చక్రవర్తిని ప్రభుత్వం 2-12-31న అరెస్ట్ చేసింది .విచారణ తర్వాత బిశ్వాస్ ను ప్రాణం పోయే దాకా ఉరితీసే శిక్ష విధించారు .చక్ర వర్తిని సెల్యులర్ జైలు కు ప్రవాసం పంపారు .చిట్టగాంగ్ నుంచి ఆలీపూర్ జైలు కు వెళ్ళటానికి కుటుంబ సభ్యుల వద్ద డబ్బు లేదు .కలకత్తాలో ఉంటున్న ప్రీతి లతను ఆలీపూర్ జైలు కు వెళ్లి బిశ్వాస్ ను కలుసుకోమని పంపారు .

సూర్య సేన్ బృందం తో కలిసి విప్లవ కార్యక్రమాలు చేస్తూనే ప్రీతి టెలిఫోన్ ,టేలిగ్రాఫ్ ఆఫీసులపై దాడి నిర్వహించింది .రిజర్వ్ పోలీస్ లనుజలాలాబాద్ పోరాటం లో పట్టుకొన్నది.విప్లవకారులకు ప్రేలుడు సామగ్రి అందజేసే బాధ్యతను ప్రీతీ లతా స్వీకరించి సమర్ధ వంతంగా నిర్వహించింది .’’కుక్కలకు ,ఇండియన్ లకు ప్రవేశం లేదు ‘’అని వ్రేలాడ దీసి ఉన్న ప్రహర్తాలి యూరోపియన్ క్లబ్ పై ఆ వాక్యం పై ఉన్న తీవ్ర ఆవేదన నిరసనలతో 1932లో దాడి చేయాలని సూర్య సేన్ ప్రణాళిక సిద్ధం చేశాడు .దీన్నిఅమలు చేయటానికి మహిళకు బాధ్యత ఇవ్వాలని సేన్ భావించాడు .కాని కల్పనా దత్త వారం రోజులు ముందే అరెస్ట్ అయింది .అందుకని ఈ బాధ్యతను ప్రీతిలతకు అప్పగించాడు సేన్ .ప్రీతిలత కొటోవాలి సముద్ర తీరం చేరి ఆయుధ విద్య లో శిక్షణ పొంది ఆరితేరి౦ది ..ప్లాన్ అంతా సిద్ధం చేసుకొన్నది .

డిసెంబర్ 23న దాడికి పక్కా ప్లాన్ సిద్ధమైంది .బృందానికి పొటాషియం సయనైడ్ ఇచ్చి పట్టుబడితే మింగేసి చనిపోమ్మని ఆజ్ఞలు జారీచేశాడు నాయకుడు సేన్ .దాడి చేసే రోజు న ప్రీతి పంజాబీ మగ వాడి దుస్తులు ధరించింది .ఆమె అనుచరులు కాళీ శంకర్ డే,శాంతిలాల్ చక్రవర్తి పంచాచొక్కా వేషం వేసుకొన్నారు .మహేంద్ర చౌదరి ,సుషీల్ డే,పన్నా సేన్ లు లుంగీ చొక్కా తో సిద్ధమయ్యారు . ఈ విప్లవ బృందం ఆ రాత్రి 10-45కు క్లబ్ దగ్గరకు చేరి,దాడి ప్రారంభించారు .అప్పుడు క్లబ్ లో 40మంది ఉన్నారు .విప్లవ బృదం మూడు గ్రూపులుగా చీలి దాడి చేయాలని భావించింది .క్లబ్ లోపల ఉన్న కొందరు పోలీస్ ఆఫీసర్లు తమ రివాల్వర్ లతోఎదురు కాల్పులు సాగించారు .ప్రీతిలత కు చిన్న బులెట్ గాయం అయింది .పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఈ దాడిలో సల్లివాన్ అనే ఇంటి పేరున్న స్త్రీ ,చనిపోయిందని నలుగురు మగాళ్ళు ఎందరో ఆడవాళ్ళు గాయపడ్డారని ఉంది .
గాయ పడిన ప్రీతి లతను వలపన్ని బ్రిటిష్ పోలీసులుపట్టుకొ బోయారు .

ఆమె సయనైడ్ మింగి అరెస్ట్ కాకుండానే వీర మరణం పొందింది .మర్నాడు ఆమె శవాన్ని గుర్తించి ప్రీతిలత చని పోయిందని తేల్చారు .ఆమె వస్తువులను సోదా చేస్తుంటే బిశ్వాస్ ఫోటో ,విప్లవ సాహిత్యం బుల్లెట్లు ఈ దాడి కి సిద్ధం చేసిన ప్లాన్ ప్రతి దొరికాయి .పోస్ట్ మార్టెం తర్వాత ఆమెకు తగిలిన బులెట్ గాయం చాలాస్వల్పమైనదని ,సయనైడ్ తీసుకోన్నందుకే చనిపోయిందని తెలిసింది .బెంగాల్ చీఫ్ సెక్రెటరి లండన్ లోని బ్రిటిష్ ప్రభుత్వాధికారులకు సందేశం పంపుతూ’’ ప్రీతి, టెర్రరిస్ట్ బిశ్వాస్ భార్య కాదని . దాల్ఘాట్ లో అరెస్ట్ ను తప్పించుకొ బోయే సమయం లో కెప్టెన్ కేమరాన్ పడిపోయినప్పుడు పోలీస్ కాల్పులలో మరణించిన నిర్మల్ సేన్ భార్య అని కొంత సమాచారం ఉంది’’ అని తెలియ జేశాడు .

బంగ్లా దేశ్ రచయిత సాలీనా హోస్సైన్ రాస్తూ ‘’ప్రీతీ జీవితం అందరికి ఆదర్శమని ,ఆమె జ్ఞాపకార్ధం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారని , ఆ ట్రస్ట్ ప్రీతిని బీకన్ లైట్ అంటే దారి దీపం అనీ అందిఅని చెప్పింది .ఆమె పుట్టిన రోజును ట్రస్ట్ బంగ్లా దేశ్, భారత దేశాలలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తోందని ,చిట్టగాంగ్ లో ఒక వీదికి ‘’ప్రీతిలత వాడేదార్ మార్గం ‘’అని పేరు పెట్టి గౌరవించారని ,2012లో ఆమె బస్ట్ సైజ్ కాంస్య విగ్రహాన్నిచారిత్రాత్మక యూరోపియన్ క్లబ్ దగ్గరున్న ప్రహర్తాలి రైల్వే స్కూల్ సమీపం లో ఏర్పాటు చేశారని ,రాసింది .2010లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘’ఖేలేన్ హం జీ జాన్ సే’’లో ప్రీతిలత పాత్రను విశాఖా సింగ్ పోషించింది .2012లో వచ్చిన చిట్టగాంగ్ హిందీ సినిమాలో ప్రీతిలత వాడేదర్ గా వేగా తమోషియానటించింది .
భారత స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న సమయం లో ఈ ఇద్దరు వీర విప్లవ నారీమణులను గురించి తెలుసుకొని ధన్యులమవుదాం .వారి బలిదానానికి నివాళు లర్పించి ఋణం తీర్చుకొందాం ..

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Share

– See more at: http://vihanga.com/?p=17320#sthash.3uf19uRp.dpuf

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -207 77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -5(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 207

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -5(చివరిభాగం )

  చాటర్లీన్ నవల ప్రభావం అత్యద్భుతమై విశ్వ వ్యాప్తమైంది .’’పిల్గ్రిం ఆఫ్ అపోకలిప్సే ‘’నవలలో అర్ధ శతాబ్ది కాలపు సెక్స్ స్వేచ్చ కై పోరాటం యే ఆంగ్ల రచనలలోను  లేని విధంగా రాశాడు లారెన్స్ ,సెక్స్ చిహ్నాలను యాంటి క్లైమాటిక్ గా వాడాడు ‘’అన్నాడు హోరేస్ గ్రెగరీ .అదొక సుదీర్ఘ పోరాటం .మహాకవి వాల్ట్ విట్మన్ ‘’సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్ ‘’నుండి ఆస్కార్ వైల్డ్ విచారణ ద్వారా ,తర్వాత ఫ్రాయిడ్ చివరి రచన ఇటలి ,పారిస్ లలో ప్రింట్ అయ్యేదాకా చివరికి ఈ నవల వరకు జరిగిన పోరాటం ,ఇప్పుడు 19 28 తో  పూర్తీ అయి విజయం సాధించింది .లారెన్స్ కు ఇక రెండేళ్ళ జీవితమే మిగిలి ఉంది .ఈ కాలం లో మరో నవల అది భౌతిక విచారణ తో ఉన్న నవల ‘’అపోక లేప్సి ‘’రాశాడు .సూర్యుని స్తుతి ,చాటర్లిన్ పై  విమర్శలకు కొన్ని సమాధానాలతో వంద కు పైగా కవితలతో,అరడజన్ తీవ్రమైన కధలతో ,ఒక సూపర్ నేచురల్ పిల్ల కద తో  దీన్ని ముగించాడు .ఈ కధే ప్రపంచ ప్రసిద్ధ హారర్ స్టోరీ లలో ఒకటి అయింది .భయంకరత్వానికి పరాకాష్ట అయింది .రచన రిలీఫ్ గా ఉన్నా ఒత్తిడిగా కూడా ఉంది లారెన్స్ కు .’’పాన్సీస్ ‘’పేరుతొ ఉన్న కవితా సంపుటిని హోం సెక్రెటరి సీజ్ చేశారు .అయన పెయింటింగ్ షోను పోలీసులు ఆపేశారు .అయినా మొక్కవోని ధైర్యం తో’’’సంపూర్ణ జీవితానికి ,ఏకీభావ జీవితంకోసం  ‘’రచన చేస్తూనే ఉన్నాడు .ఆరు నెలల తర్వాత ‘’మనిషికి ,పుష్పానికి ,జంతువుకు ,పక్షికి సర్వోన్నత విజయం అత్యంత స్పష్టంగా జీవించి ఉండటమే ‘’అని బోధించిన లారెన్స్ మరణించాడు .సూర్యారాధకుడైన మహా రచయిత’’బ్యూ సోలీల్ భవంతిని యడ్ ఆస్ట్రా కోసం కేటాయి౦చాననే వ్యంగ్యాన్ని అభినందిస్తూ తీవ్రం గా జబ్బు పడ్డాడు .పురాతన ప్రపంచ ప్రసిద్ధ వెనిస్ నగరం లో ఫ్రెంచ్ రేవేర్రా పైన 1 -3-1930న 45ఏళ్ళకే  చనిపోయాడు .

  లారెన్స్ మరణం తర్వాత ఆయనపై  రచనలు చాలా ప్రచురణ పొందాయి .ఆయనపై జీవిత చరిత్రలు, జ్ఞాపకాలు,ఉత్తర ప్రత్యుత్తరాలు  ,అంచనాలు ,పునర్ మూల్యా౦కనాలు ,సమర్ధనలు ,నిజ నిర్ధారణలు విరివిగా వెల్లువగా వెలువడ్డాయి .తమాషా ఏమిటంటే లారెన్స్ తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ పుస్తకం రాయటం .లారెన్స్ పై తుది నివేదిక రావాల్సిఉంది .సాహిత్యం లో ఆయన స్థానం ఏమిటో ద్రువీకరించాల్సి ఉంది .’’no one of his generation pursued the cry of sex so passionately  and so painfully ‘’అన్నది నిర్వివాదం .ఆయన ముట్టుకున్నది అంతా పోరాటం ,చావు ,పునరుద్ధానం గా పరిణమించింది .బూర్జువా విక్టోరియన్ నీతి ప్రభావాన్ని కోల్పెయే సమయం లో మెధలిస్టు లు పునర్వికాసాన్ని బోధించినట్లు లారెన్స్ యవ్వన గీత ను బోధించాడు .పవిత్ర బోధకుడు పాపకూపం లోకి జారి పోతున్నప్పుడు ఉత్తేజ  ఉత్సాహాలు కలిగించే మత బోధకుడిలాగా   ‘’పొంగే రక్తపు కనుగప్పు కళ ‘’(ది హాట్ బ్లడ్స్బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ )ను లారెన్స్  అమోఘ వాక్చాతుర్యం తో ప్రబోధించి ఎరుక పరచాడు’’అన్నాడు రచయితా లూయీ అంటర్ మేయర్ .

    If I had my way, I would build a lethal chamber as big as the Crystal Palace, with a military band playing softly, and a Cinematograph working brightly; then I’d go out in the back streets and main streets and bring them in, all the sick, the halt, and the maimed; I would lead them gently, and they would smile me a weary thanks; and the band would softly bubble out the “Hallelujah Chorus”.[16]

అని కలలు కంటూ లారెన్స్ స్నేహితుడికి జాబు రాశాడు .

In the deep, strange-scented shade of the great dark carob tree
I came down the steps with my pitcher
And must wait, must stand and wait, for there he was at the trough before me.
(From “Snake”)

  అన్నది ఆయన ప్రసిద్ధ ‘’ది స్నేక్ ‘’కవితలో ఒక భాగం .గ్రిగేరియన్ పీరియడ్ తర్వాత వచ్చిన లారెన్స్ రచనలను ఆధునిక రచనలని అన్నారు

O the stale old dogs who pretend to guard
the morals of the masses,
how smelly they make the great back-yard
wetting after everyone that passes.
(From “The Young and Their Moral Guardians”)

లారెన్స్ ప్రతి రచనలో అంతర్ ద్రుష్టి ఉంటుంది .వాల్ట్ విట్మన్ మెల్ విల్లి ,ఎడ్గార్  అల్లెన్ పో చాయాలలో రాసినా తనదైన విస్పష్ట స్వరం తో లారెన్స్ నినదించాడు .ఆయనపై సినిమాలు వచ్చాయి ఆయన నవలలను సినిమాలుగా తీశారు .12 నవలలు ,10 చిన్న కదల సంపుటాలు ,పది ఉత్తర ప్రత్యుత్తర సంకలనాలు ,16 కవితా సంపుటులు ,పది నాటకాలు ,12 నాన్ ఫిక్షన్ రచనలు ,నాలుగు యాత్రా సాహిత్యాలు ,ఆరు అనువాద రచనలు ,ఆరు వ్రాత ప్రతులు కాక  లారెన్స్ ఖాతాలో మూడు పెయింటింగ్స్ కూడా ఉన్నాయి .లారెన్స్ పేరులోనే ఏదో గొప్ప ఆకర్షణ ఉంది .పుస్తకం చదవటం మొదలు పెడితే పూర్తీ అయ్యేదాకా మరో దానిపై యావ ఉండక పోవటం. ఆయన రచనా ప్రభావం అనంతం అద్వితీయం అమోఘం  .

Inline image 1 Inline image 2     Inline image 3   Inline image 4 Inline image 5Inline image 6Inline image 7

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-16 –ఉయ్యూరు  .

 

 

‘’

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -206

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 206

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -4

అమెరికా ఆగ్నేయ భాగం లో ,మెక్సికో లో లారెన్స్ తనకు తాను నాయకుడు ,మత ప్రవక్త గా ప్రవర్తించాడు .సృజన శీలఆలోచనా పరులను ,ఆర్టిస్ట్ లను ,వర్కర్లను ఒక చోట చేర్చే ప్రయత్నం చేశాడు .భారతీయుడులాగా అవినీతి ఆశ్రిత పక్షపాతం ,నిరాశా లేని ప్రపంచాన్ని కలగన్నాడు .ఇక్కడే రూసో భావమైన ‘’బ్లడ్ స్ట్రీం కాన్షస్ నెస్ ‘’ను సమర్ధిస్తూ ఇరవై వ శతాబ్ది యాంత్రిక జీవితాన్ని నిరసించాడు .డార్క్ గాడ్స్  ‘’’’లాస్ట్ మాజిక్ ‘’లలో చిక్కుకొన్నా తన ప్రతిభ వ్యక్తమయే ‘’ది ప్లూమేడ్ సర్పెంట్ ‘’,’’మార్నింగ్ ఇన్ మెక్సికో ‘’నవలలు రాశాడు .వీటిలో ఆయనకున్న సూర్యారాధన ,మాయలు ,మంత్రాలు ,ప్రక్కృతి ఆరాధన అన్నీ చెప్పాడు . ప్రజాస్వామ్య వ్యతిరేకత ,అధికార కాంక్ష ,అరిస్టాక్రటిక్ మేధావులతో కలయిక ,అన్నీ ఆయన్ను ఫాసిస్ట్ అనుకూలుడు అని అనిపించాయి .

  క్రమంగా రచనలో స్పష్టత ,హృదయం లోకి సూటిగా దూసుకు పోయే లక్షణం పెరిగింది .జీవితం లో చివరి ఎనిమిదేళ్ళ రచనలు మహా అతి అయ్యాయి .ఇండియన్ ,కీటకం ,సూర్యాస్తమయం ,ఆవు లలో ఆయన దేన్నీ తీసుకొన్నా అదొక క్రియాశీల చిహ్నమై పోయి,ఆయన ప్రాణావశ్యక బాధ్యతా అయింది .’’మామూలు వస్తువులలో ఉన్న నిగూఢ అంతరార్ధాన్ని విడమర్చి చెప్పే నేర్పు లారెన్స్ సాధించాడు ,.తాత్కాలిక భావోద్రేకాల ప్రాముఖ్యతనూ  గుర్తించి వాటికి తీవ్రమైన ప్రాముఖ్యముందని వివరించాడు .ఆయన్ను విమర్శించేవారికి చేతి నిండా పనే ఉన్నా ఆయనమాత్రం సృజన రచయితలకు దివ్యానుభావాన్ని అందజేశాడు .చాల జటిలమైన విషయాలను రాయటం మొదలు పెట్టాడు ‘’రచనలో సంగీతం ప్రవహిస్తుంది .చిత్రం గీసి చూపిస్తున్నట్లు రాస్తాడు .చలనం లో లయ సృష్టిస్తాడు .రంగులు ఉపయోగించకుండానే చీకటి వెలుగులు సృష్టిస్తాడు .నాట్య విలాసం ఉంటుంది .పదాలను విడగోట్టుతూ ,తేలిపొయేట్లు చస్తాడు .ఒక్కోసారి అర్ధంకంటే శబ్దమాదుర్యానికే ప్రాణం పోస్తాడు .ఇలా చేయటానికి ఎంతో గుండె ధైర్యం కావాలి .ఉంది కనుకనే రాశాడు .ఒక్కో సారి విఫలుడు అవుతాడు .లారెన్స్ రచన  గోడలో పగులు లాగా ఉండి కొత్త ప్రపంచాన్నిదర్శింప జేస్తుంది ‘’అని చాలా గొప్పగా  మహోత్క్రుస్టంగా ఎనైస్ నిన్ అనే విశ్లేషకుడు ‘’లారెన్స్ యాన్ యాన్ ప్రొఫెషనల్ స్టడి ‘’‘లో రాశాడు .

   ఈ చంచల ప్రపంచం లో లారెన్స్ ఒక ముఖ్య ఆవాసాన్ని ,భార్య ఫ్రీడా యొక్క అత్యంత విశ్వాసాన్నిపొందటం మూలంగానే  ఇంత గొప్ప రచనలు చేయగలిగాడు .ఒక్కో సారి భార్య ఫ్రీడా కూడా శాంతినివ్వలేక పోయేది .పోట్లాటల మాటల యుద్ధాలు శారీరక హింస ,పరస్పర ఆరోపణలు  ఉన్నా మళ్ళీ కలిసిపోయేవారు . లారెంస్ వలన పిల్లలు కావాలని భార్య ఫ్రీడా కోరుకొనేది .లారెన్స్ కు అదంటే ఇష్టం లేదుపైగా ఆమాట అంటే విపరీతమైన కోపం వచ్చేది . .ఆమే అర్ధం చేసుకొని  రాజీ పడి సర్దుకొని భర్తనే పిల్లాడిలాగా చూసుకొ౦టూఅతని సృజనను ప్రోత్సహిస్తూ ఓదారుస్తూ ఉండేది .సాంఘిక స్థితిలో,శిక్షణలో ,స్వాభావంలో  ఇద్దరివీ  వేరు వేరు తరగతులే  .కాని అరిస్టో క్రాట్ కు కూతురైన ఆమె ,పరిస్తితులను అవగాహన చేసుకొని ఆతనికి సహచరి అయి ,నేలతల్లి లాంటి సహనాన్ని అలవరచుకొని ద్రుఢంగా,అత్యంత సాధారణ మహిళగా మెలగింది .ఆమె పై ఆధారపడి బతకటానికి భర్త లారెన్స్ కస్టపడి పోరాటం చేశాడు .స్త్రీల వలననే లారెన్స్ సాహిత్య ప్రేరణ పొందాడు .వారితోకలిసి పనిచేశాడు .సన్స్ అన్డ్ లవర్స్ నవలలో చాలా భాగం లారెన్స్ స్వీట్ హార్ట్ జెస్సీ చే౦బర్స్ కధలోని ఓడిపోయిన హీరోయిన్  రాసింది .రెండో నవల ‘’ట్రేస్ పాసర్స్ ‘’ను తనతో పనిచేసిన  ఇరవైల  వయసులో దగ్గరకు చేరిన హెలెన్ కోర్క్అనే టీచర్   రాసిన రాత ప్రతి నాధారంగా రాసిందే .ఆస్ట్రెలియన్ కద’’ది బాయ్ ఇన్ దిబుష్ ‘’అనేది స్కిన్నర్ రాసిన .’’ది హౌస్ ఆఫ్ ఎల్లిస్ ‘’కు, మారు రూపం .అలాగే కేధరిన్ కార్స్ వెల్ ,మేబెల్ డాడ్జ్  లుహాన్ అనే స్త్రీల జీవితాలనాదారమైన కదలనే రాశాడు .ఇతర స్త్రీలు లారెన్స్ ను తమ వాడిని చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారుకాని భార్య ఫ్రీడా ,వాళ్ళ నీడా పీడా పడ కుండా ఆయనకు కావాల్సిన మహిళగా రుజువు చేసుకొన్నది .

   40 వ పుట్టిన రోజు తర్వాత 1925 లో లారెన్స్ తిరిగి వచ్చే ఆశతో   అమెరికా వెళ్ళాడు .కాని ఆ ఆశ నిరాశే అయింది .సూర్య నమస్కారాలు సముద్ర స్నానాలపై  ఉన్న ఆరాటం అనేక ప్రదేశాలను తిప్పించింది .స్విట్జర్లాండ్ లోని ఫ్లారెన్స్ కు సమీపం లో జెనోవా దగ్గరకు చేరాడు .అక్కడినుంచి ఆస్ట్రియా ,జెర్మని ,బాలరిక్ ఐలాండ్స్ తిరిగి చివరికి ఫ్రాన్స్ వచ్చి ఇక్కడే ఉండిపోయాడు .ఇక్కడే చిరస్మరణీయ వచన రచనలను ,అత్యుత్తమమైన ,ఆయన కోపోద్రిక్తమైన కవితలను రాశాడు .లారెన్స్ కున్న శారీరక ,మానసిక నిరోధాలను (ఇన్హిబిషన్స్)అత్యున్నత స్థితిలో ‘’లేడీ చాటర్లీన్స్ లవర్ ‘’నవలలో ఆవిష్కరించాడు .ఇందులో సెక్స్ పై  కోరిక ,పవిత్ర ప్రేమ ల పై ద్వంద్వాలపై తెగించిన ఆరాటం ఉంటుంది . సమకాలీన సాహిత్యం లో దీనిపై వచ్చినంత వ్యతిరేకత దేనికీ రాలేదు .పశు ప్రేమతో కొన్ని అధ్యాయాలున్నా అందులో లోతైన సానుభూతి ఉంటుంది .అసలు దీనికి మొదట్లో లారెన్స్ పెట్టాలనుకొన్న పేరు ‘’టెండర్ నెస్ ‘’.ఈ పుస్తకాన్ని అశ్లీలం అని  సెన్సార్ చేశారు,నిషేధించారు’.కాని లారెన్స్ దీన్నిఆధునిక యుగం లోని  ముతక వికారం ,మానసిక బౌద్ధిక వంధ్యత్వాలు ,త్వరపరచే లింగ ఇంద్రియ జ్ఞానం ల  మధ్య సమతూకం తో రాశానని చెప్పుకొన్నాడు .అసలైన సౌందర్యం ,అసలైన మంచితనం మూలాలఅన్వేషణ అందులో ఉందన్నాడు .’’Lawrence laid sex and those basic words for it on the salver of his art and held them up before creation and prayed that both might be transmuted to the highest that man could use ‘’.

Inline image 1Inline image 2

 

   సశేషం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -205 77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 205

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -3

         మొదటి ప్రపంచ యుద్ధం లారెన్స్ జీవితం లో కొత్త చిక్కులు తెచ్చింది .మనిషి దీర్ఘ జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటే క్రమ ప్రకారం జరుగుతున్నసమూహ హత్యలు ఆయనను కలవర పర్చాయి .ఈపరిణామం మానవత మరణి౦చటానికే దారి తీస్తుందని హెచ్చరించాడు .భార్యతోకలిసి ఇంగ్లాండ్ దక్షిణ తీరం చిన్నదైన కార్న్ వాల్ టౌన్ ఆఫ్ జేన్నార్ స్వర్గ సౌఖ్య మిస్తుందని వెళ్ళాడు .అక్కడ యుద్ధ బాధిత పీడితజనం కోసం ఒక ఊహా స్వర్గం (యుటోపియ )నిర్మించే ఆలోచన చేశాడు .దీనికి పరితపించి చేయలేకపోయారు ఆ నాడు కాల్ రిడ్జ్ ,సూదీలకవులు .ఈసమయం లో లారెన్స్ చిన్న గడ్డాన్నిగుబురు వెంట్రుకలతో కప్పి పుచ్చాడు ,అది ఎర్రగా మరీ వికృతంగా కనిపించింది .దీన్నే ఒక స్నేహితుడు ‘’రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ ‘’అని పరిహసించాడు .ఇతర మనుషులలాగా పని చేసే వీలు దీని వలన కలుగుతుందని అర్ధం .ఆ ఊళ్ళో స్నేహితులెవరూ లేరు .ఒక వేళ స్నేహం చేద్దామని ఉన్నా గడ్డం ఆయన వంట చేస్తాడు ఇల్లూడుస్తాడు అంట్లు తోముతాడు అని తెలుసుకొని ఏదో గూఢ చారి మనిషేమోనని అనుమానించారు .యుద్ధ సమయమవటం ,భార్య జర్మన్ అవటం అనుమాలకు బలమైనది .ఆమె సోదరుడు మాన్ఫ్రేడ్ వాన్ రిచ్ తోఫెన్ జర్మనీలో ప్రసిద్ధ  పైలట్ కూడా .ఇవన్నీ లారెన్స్ లను   గూఢ చారులు అనటానికి బాగా తోడ్పడ్డాయి.ముందుగా లైట్లు తీసేయించారు. తర్వాత  ఇల్లు సోదా చేయించారు .చివరికి ఊరి లోని గేట్టి౦ చేశారు .భార్యకు విచారంకలిగితే భర్తకు పిచ్చ కోపం వచ్చింది .

      తరువాత రెండేళ్ళు వాళ్ళిద్దరూ ఒక ఇంటి నుంచి మరో ఇంటికి గెంటి  వేయబడుతూ చివరికి లండన్ చేరారు .అక్కడ కూడా బెర్క్ షైర్ ,డేర్బి షైర్ ,మిడ్లాండ్ హిల్స్ కు  మారారు  .యుద్ధ సమాప్తి కాగానే 1919 లో కాంటినేంట్ కు వెళ్ళారు .రచనపై రచన ఉత్పత్తి చేస్తున్నా నిత్య దరిద్రం వెంటాడుతోంది .అతని పుస్తకాలు అచ్చువేయటం రిస్క్ అనుకొన్నారు పబ్లిషర్లు .శారీరక బలం లేకపోయినా మానసిక ధైర్యం తో రాస్తూనే ఉన్నాడు .35 వ ఏట ‘’వుమెన్ ఇన్ లవ్ ‘’రాశాడు .దీన్ని రైన్ బో కు సీక్వెల్ అన్నాడు లారెన్స్ .ఇందులో లారెన్స్ హీరో శారీరక శృంగారానికి అతీతమైన ప్రేమ ను గురించి చెప్పాడు .సూటి మనస్తత్వం ఉండటం తో మరో ఆరేళ్ళు దేశ ద్రిమ్మరిగా తిరిగాడు .అస్తిత్వనిరూపణకోసం  ,రక్షణకోసం ఇంగ్లాండ్ ను 19 19 లో వదిలేసి ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాడు .వాస్తవం చెప్పాలంటే పారిపోయాడు .ఒక్కోసారి తననుంచి తానుపారిపోతున్నానేమో అనుకొన్నాడు .తనకు ఎక్కడా చోటు లేదని ఎవరూ ఆహ్వానించి ఆదరించరని తెలుసుకొన్నాడు  .తీరా ఒక చోటికి ఆశగా వెళ్ళినా కొన్ని రోజుల్లోనే అది మంచిది కాదు అనుకొనేవాడు .భ్రమల్లో తేలిపోయాడు .డార్క్ మాజిక్ లో కూరుకు పోయాడు .అల్టిమాతూలేకు వెళ్ళాలనుకోన్నవాడు బేడేన్   బేడేన్  కు ,అబ్రూజి హిల్స్ కు ,కాప్రి ,టావోర్మినా,సార్దీనియా ,ఆస్ట్రియా ,లను తిరిగి అర్ధప్రపంచం చుట్టి సిలోన్ ఆస్ట్రేలియా ,తాహితి, అమెరికాకు చేరాడు . .19 20 లో మేబెల్ దాడ్జ్ లుహాన్ ఆహ్వానం పై టావోస్,న్యు మెక్సికో ,చివరికి ఓల్డ్ మెక్సికో లో అడుగు పెట్టాడు .ఇక్కడ మూడేళ్ళు తీవ్రకల్లోల పరిస్థితులలో గడిపాడు .19 24 లో ప్రయత్నం చేసి ,కొన్ని నెలలలోనే న్యు వరల్డ్ చేరాడు .మెక్సికో సిటి లో ఉండగా 1925 ఫిబ్రవరిలో తీవ్రమైన క్షయ కు గురైనాడు .ఇంకా నలభై ఏళ్ళు రాకపోయినా ఇక బతకను అనుకొన్నాడు 

.Inline image 1Inline image 2

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-16- ఉయ్యూరు

 

‘’

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -204 77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 204

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -2

పంతులు ఉద్యోగం ,రచనల మధ్య నలుగుతున్నప్పుడే లారెన్స్ తల్లి చనిపోయింది .బంధ విముక్తి అయి౦ దనుకోలేదు .ఆమెపై ఆరాధన పెరిగి సుళ్ళు తిరుగుతోంది .ప్రపంచం తనముందు కరిగిపోతోంది అనిపించింది .తర్వాత తానూ కరగిపోయాడు .అన్నీ కోల్పోయాను అనుకొన్నాడు .చావు మిస్టరీ నుండి రక్షించాలి అని ,జీవితంలో వెంటాడే చావు భయం నుండి బయట పడాలని  భావించాడు .తరువాత రెండేళ్లలో ప్రేమింప బడటం కోసం చాలా అమ్మాయిల చుట్టూ తిరిగాడు .ఒకమ్మాయితో ఎంగేజ్మెంట్ దాకా వచ్చాడు కాని తల్లి జ్ఞాపకాలు ఇంకా బలమై పోయాయి .తల్లితో తప్ప అంతటి అనుబంధం వేరే యే అమ్మాయితోనూ అసాధ్యం అనిపించింది .శారీరక జబ్బు తోపాటు సైకో సోమాటిక్ లక్షణాలూపెరిగి వస్తున్న దగ్గు క్షయ లక్షణాలేమో అనుకొన్నాడు  .కొంత భయం, కాస్త విరామం కోసం టీచింగ్ మానేశాడు .కవితల్లో ,సంభాషణలలో దీన్ని వివరిస్తూ ‘’నేను మళ్ళీ బోధనలో ఉండాలని కల వస్తుంది అది దారుణమైన కల అనుకొంటా.’’అని రాశాడు .

   27 వయసులో’’ ఫ్రీడా వాన్ రిచ్ తోఫెన్ వీక్లీ ‘’అనే 32 ఏళ్ళ  జర్మన్ జన్మ కల  ముగ్గురు పిల్లలున్న తన మాజీ ప్రొఫెసర్ కూతురు తో ప్రేమలో పడ్డాడు .ఆమెలో పరిపక్వ మాతృత్వానికి ముగ్ధుడై తన ప్రేమను వ్యక్తం చేశాడు .ఆమె కూడా తల ఊపటం తో ఇద్దరూ జర్మనీ ఆస్ట్రియా ఇటలికి ‘’జంప్ జిలానీ’’ .ఏడాదిన్నర తర్వాత ఆమె విడాకులు పొందాక పెళ్లి చేసుకొన్నారు .ఈ లవ్ స్టోరీ మూడవ కవితా సంపుటి ‘’లవ్ పోయెమ్స్ అండ్ ఎమోరీస్ ‘’లో ను ‘’లుక్ వుయ్ హావ్ కం త్రూ ‘’అనే ఆటోబయాగ్రఫీ లోను దట్టించాడు.చివరికవితలు చాలా విషాద భరితం గా ఉంటాయి .ప్రేమ ద్వారా శాంతి కోసం తపిస్తున్న వాడు లారెన్స్ .28 వ ఏట ఇటాలియన్ లేక్ గార్డా లో ఉండగానే మూడవ నవల పూర్తీ చేశాడు  .అది బాదాకలిత ఆత్మా వేదన .’’శీలవతీ ,అంతస్శుద్ధి ఉన్న స్త్రీ దిగువతరగతిలో ఉంటుంది .ఆమెకు తన జీవితం లో  తృప్తి ఉండదు .మొదట్లో భర్తపై ఆరాధన ,దానిఫలితంగా పిల్లల పుట్టుక ,పిమ్మట వీరిపై మమకారం ,వీళ్ళు పెరిగి ప్రయోజకు లయ్యాక వాళ్ళపై విపరీతమైన ప్రేమ ,ఆలాంటి ప్రేమను కొడుకులు తల్లికి ఇవ్వక పోతే మానసిక క్షోభ ,మాత్రమేకాక ఆమె తమ జీవితాలలో అత్యంత శక్తి వంతు రాలవటం .ప్రేమించినదాన్ని పెళ్ళాడి కొడుకు తల్లికి వ్యతిరేకి అవటం .ఇలా ఒక సుదీర్ఘ సీరియల్ లా ఆమె జీవితం సాగి పోతూ ఉంటుంది అంతం ఉండదు .కొడుకు తన ఆత్మను వదిలి ,అమ్మ చేతుల్ని దులిపెసుకొని దూరమై పోతాడు .చివరికి పిల్లలు అన్నీ పోగొట్టుకొని దిగంబరులౌతారు ‘’ ఈ పుస్తకం పై మంచి రివ్యు ను రాస్తూ ‘’రెండు గొప్పముఖ్య  పాత్రలను అందమైన బంధం తో ముడి వేసే కద.విరామమెరుగని కొడుకు,నాయిక లక్షణాలున్న తల్లి ఇందులో ముఖ్యపాత్రలు .సోఫోక్లిస్ మళ్ళీ పుట్టి కొత్త కాలం లో భీభత్స సంఘర్షణ లను మహాద్భుత౦గా కళాత్మకంగా వర్ణించా డేమో ననిపిస్తుంది .

  29 వ ఏట మొదటి కదా సంపుటి ‘’ది ప్రష్యన్ ఆఫీసర్ ‘’ప్రచురించాడు .’’ది రెయన్ బో  ‘’నాలుగవ నవల .ఈ దశలోనే’’ అంతః ప్రేరణ మేధాస్సుకన్నా మిన్న ‘’అనే ఎరుక కలిగింది .’’నా గొప్ప మతం-రక్తం ,మాంసం ,లపై నమ్మకం ,అవి తెలివి తేటలకంటే గొప్పవి అని .బుద్ధి తో మనం తప్పులు చేస్తాం .కానిమన రక్తం అనుభవించేది నమ్మేది ఎప్పుడూ సత్యమైనదే అవుతుంది .లారెన్స్ ఇన్స్టింక్ట్ లు ఆయన మేధస్సుకొంటే గొప్పది కావచ్చుకాని ఆయన నమ్మకాలు మాత్రం ఇబ్బందుల్లో  ప్రజా వ్యతిరేకతలో పడేశాయి ఆయనను .రైన్ బో నవల చట్టవ్యతిరేకమై ,ఇంగ్లాండ్ లోని మూడు ప్రముఖ పత్రికలు లెస్బియనిజం ను ప్రోత్సహిస్తున్నాడని గగ్గోలు పెట్టాయి .పబ్లిషర్  స్క్రిప్ట్ చదవలేదని తప్పించుకొన్నాడు .దీనితో చట్టం తనపని తానూ చేసుకొని పోయి మొదటి ఎడిషన్ వెనక్కి తీసుకొన్నాడు .చదువరులుమాత్రం లారెన్స్ ఊహకు ,మంత్రముగ్ధ రచనకు అబ్బురపడ్డారు .విభేదించిన విమర్శకులుకూడా అది flushed with a moving  animal vitality ‘’అని మెచ్చుకొన్నారు .

   సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-16- ఉయ్యూరు

‘’

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -203 77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 203

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్

  సమకాలీన సంఘం లో ఇమడలేక ,,స్వయం వేధకు బలైన మేధావి ,ప్రపంచ వ్యాప్త ఒత్తిడులకు  బలహీనత తో  భరించలేని  ఉద్రిక్తలకు లోనైన ఆధునిక ఆంగ్ల నవలా రచయిత డేవిడ్ హెర్బర్ట్ లారెన్స్ . ‘’మనది ముఖ్యంగా విషాద యుగం ‘’ అనే వాక్యం తో ప్రారంభించి’’మనం దాన్ని విషాదంగా తీసుకోవటం లేదు .ఉపద్రవం జరిగిపోయింది .మనం శిధిలాల క్రింద ఉన్నాం. మనం కొత్త చిన్న ఆవాసాలనునిర్మించుకోవాలి ,కొత్త ఆశలు నింపుకోవాలి .అది కష్టమైన పనే .భవిష్యత్తుకు దారి సున్నితంగా ఉండదు  అయినా అడ్డంకులను చేదించు కొంటూ మనం ముందుకు సాగాలి .ఎన్ని అవా౦త రాలోచ్చినా, మిన్ను విరిగి మీద పడినా మనం బతకాల్సిందే ‘’అని  ‘’లేడీ చాటర్లీస్ లవర్ ‘’నవల రాశాడు .

      లారెన్స్ 11-11-1885 న డేర్బి షైర్ , నాట్టింగ్ హాం షైర్ ల మధ్య ఉన్నబొగ్గు  గనుల పట్టణం ఈస్ట్ వుడ్ లో పుట్టాడు .తండ్రి సంతానం లో ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు .అందులో డేవిడ్ హెర్బర్ట్ అతి చిన్నవాడికంటే పెద్దవాడు .కాంతి హీనమైనఇటుకల  ఇంట్లో,కొండ దిగువ రోడ్డులో ఉండేవాడు .తండ్రి సంతకం కూడా చేయలేని చదువులేని పగటి కూలి ,జీవితమంతా బొగ్గుగని పని చేశాడు . తల్లి సాధారణ మాజీ స్కూల్ టీచర్ .ఆడంబరం ,అసహనం ,పెత్తనం ఉన్న స్త్రీ .భర్త  తాగుబోతు అయినా ఆయన ఊహలకు మేడలు కడదామనుకోనేది .  ఆతను మంచి డాన్సర్ ,చక్కని  స్వరం ఉన్న గాయకుడు ,చతురోక్తులతో నవ్వించే హాస్యగాడు .లారెన్స్ చిన్నప్పటినుంచి బలహీనంగా ఉండేవాడు .చిన్నప్పుడు న్యుమోనియా సోకి మళ్ళీ పెద్దగా కోలుకోలేక పోయాడు .బాల్యం లోవచ్చిన  నరాల బలహీనత ,దగ్గు జీవితాంతం అంటి పెట్టుకొనే ఉన్నాయి .సిగ్గరి .ఆకట్టుకొనే స్వభావం లేని విద్యార్ధి అయినా స్కాలర్షిప్ సాధింఛి నాటింగ్ హాం హైస్కూల్ లో 16 వ ఏట చేరి, పక్కింటి అమ్మాయి జెస్సి చేంబర్స్  తో ప్రేమలో పడ్డాడు. అది రొమాంటిక్ లిటరరీ లవ్ .దీన్నే ఫిక్షన్ గా ‘’సన్స్ అండ్ లవర్స్ ‘’పేరుతొ రాశాడు .తల్లి ప్రభావం  తోప్రేమ అంటే భౌతిక ఆనందం కాదు మానసిక విషయం అని గ్రహించాడు  భోతికత తో దాన్ని దిగజార్చ కూడదని తెలుసుకొన్నాడు .ఈవిషషయాలన్నీ జేస్సితో   చర్చించే వాడు .

   17 వ ఏట చదువుకొంటూ తన ఊళ్ళో  పిల్లలకు చదువు చెప్పాడు . ఆ గనికార్మిక పిల్లలకు నాలుగేళ్ళు బోధించాడు .బాటని,ఫ్రెంచ్ లను చదివి నేర్చాడు .ఫ్రెంచ్ భాషను ప్రొఫెసర్ ఎర్నెస్ట్ వీక్లీ దగ్గర చదివాడు .23 ఏళ్ళకు   దక్షిణ లండన్ లోని క్రియోడన్ లో ఉన్న డేవిడ్సన్ రోడ్ స్కూల్ లో పైక్లాస్ పిల్లలకు చదువు చెప్పాడు  . ఇక్కడసాహిత్యం బోధించటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు  .కాని సున్నితమైన పూల చిత్రాలు బహు అందంగా గీసేవాడు .పెద్దమనిషి అయినానని చెప్పుకోవటానికి కని సన్నని మీసం పెంఛి బాలుడిని కాదు అని రుజువు చేసుకొన్నాడు  .జుట్టులేని చెంపలు ,బలహీనమైన గడ్డం  ములక్కాడల్లా  వేలాడే చేతులు , మాట్లాడేకొద్దీకీచుమనే మృదు స్వరం అప్పటి లారెన్స్ లక్షణాలు .

Inline image 1

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -203 76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్-2(చివరి భాగం

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 203

76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన  అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్-2(చివరి భాగం )

కధలన్నీ ‘’హౌ టు రైట్ షార్ట్ స్టోరీస్  అండ్ రౌండ్ అప్ ‘’పేరుతో వచ్చాయి .క్రిటిక్స్ విశ్లేషణలో చాలా దూరం పోయారు .ఆకాలపు ఉత్పత్తులపై ఏవగింపు చూపాడని ,అమెరిక కేపిటలిజం పై సాదికారిక విమర్శ చేశాడని ,మరణావస్త లో ఉన్న సాంఘిక వ్యవస్థ పై తీవ్ర కధనం  చేశాడని   అన్నిరకాల వ్యాఖ్యానం చేశారు కాని వారు అందులోని కామిక్ ఎలిమెంట్ ను ,యెంత మూసుకుని ఉందామనుకొన్న వారినైనా పళ్ళికిలించేట్లు నవ్వి౦చాడని మర్చిపోయారు .అతని ఆటగాయి తనం రచనలు భావ రహిత వర్ణనలు ,సరిగ్గా తగ్గట్టు ఉండే డైలాగులు సందర్భోచిన శ్లేషలు  ఎవరినైనా ఆకట్టుకొంటాయి .’’కోరా స్పాన్ ఎట్ యే స్పాట్ ‘’క్లేమో యూటి వంటివాటిలో పొసగని సర్రియలిజాన్ని ,’’పబ్లిక్ బూత్ఇన్ యే బాత్ రూమ్ ‘’’’త్రీ అవుట్ సైడర్స్ క్లీన్  గో’’ అక్రాస్  ది స్టేజ్జ్ త్రీ టైమ్స్ ‘’లలో స్టేజ్ దర్శకత్వం పై చతురోక్తులు గుప్పించాడు .మేధావుల కౌగలి౦తలకు,వాళ్ళు ఊహించిన స్థాయిలో ఎదగ లేక పోయానేమోననేభయ పడ్డాడు .స్వీయ చరిత్ర’’ది స్టోరీ ఆఫ్ యే వండర్ మాన్ ‘’లో తనను తాను నిందించు కొన్నాడు   .తాను  చనిపోయాక తన సెక్రెటరి పగ తీర్చుకోనేట్లు ఒక చాప్టర్ దానికి చేర్చాలన్నాడు అందులో ‘’యజమాని వెళ్ళిపోయాడు ,ఆయనకు ఎవరు వారసులు ?బహుశా ఆయన ఇంకా పుట్టి ఉండ డేమో !బహుశా అలాంటి వాడు పుట్టడేమో అసలు .అదే నేరు కోరేది ‘’అంటూ రాయాలట.ఇలాంటి రాతలు ఆయన రోగ లక్షణాలను తెలియ జేస్తుంది అన్నారుజనం .

     ది యాంగ్ విజిటర్స్ కు పేరడిగా ‘’ది యంగ్ ఇమ్మిగ్రంట్స్ ‘’రాశాడు .భయాన్ని తనపై పరిహాసం తోకప్పి పుచ్చుకొన్నాడుఇది క్రమంగా లైంగిక ప్రకోపానికి దారి తీసింది .ఇదేదో అశ్లీలమైన మాటకాదు -దీనర్ధం స్వీయాన్ని  నాశనం చేసుకోవటమే .తానున్న సమాజం పై విమర్శ చేస్తూ తాను అశ్రద్ధ కు గురయ్యాడు .తన సున్నిత మనస్తత్వాన్ని వ్యంగ్యం తో కప్పి పుచ్చుకొన్నాడు. ఆయన పాత్రలు తమను లోకం తిట్టుకొంటారని తెలియదు .

1926 లో ఆయనభారీ ఆరోగ్య శరీరం వ్యాధి గ్రస్తమై దగ్గు  .అలసట ఆయాసాలకు గురైంది .టి బి వచ్చిందని ప్రారంభ దశలోనే ఉందని డాక్టర్లు  కనిపెట్టి చెప్పినా డిప్రేస్ అయ్యాడు .చాలా రోజులు డిప్రెషన్ లోనే ఉండిపోయాడు .జబ్బుకంటే డిప్రెషన్ ఎక్కువ బాధించింది .అర్ధం చేసుకోలేక పోయాడు .అపరాధభావం వెంటాడింది .ఏదో జరిగిందని దాన్ని జరగకుండా జాగ్రత్త పడలేక పోయానని అనుకొన్నాడు .అప్పటికే ప్రసిద్ధ రచయిత అయిపోయాడు .కాని కీర్తి గూర్చి అనుమానించాడు.తనలో తానూ మాట్లాడుకోవటం మొదలు పెట్టాడు .జన౦ మీద  అనుమానం ఎక్కువైంది .

‘’ది పోర్టబుల్ రింగ్ లార్దేనర్ ‘’పుస్తకం లో ముందుమాట రాస్తూ గిల్బర్ట్ సేల్దేస్ ‘’మార్క్ ట్వేన్ టెంపరమేంట్లో సగం ఉన్నవాడు స్విఫ్ట్ అంతటి ఆలోచనా పరుడూ కాదు కాని ,ఈ ఇద్దరిలాగానే ఎవరూ తమవైపు కన్నెత్తి చూడని ఉపేక్షిత జనాన్ని  పలకరించిన వాడు   .ఆప్రజల భాషా ఆలోచనలే ఆయన రచనలలో ప్రతి ఫలించాయి .అందుకే వారు ఆయన్ను ప్రేమించారు .’’అన్నాడు .ఫిక్షన్ రాయటం ఆపేసి ఇంటికే పరిమితమయ్యాడు కాని ‘’నో విజిటర్స్ ‘’,అవుట్ టు లంచ్ ‘’న్యూయార్క్ ‘’లు పత్రికల కాలంస్ లో ప్రత్యక్షమయ్యాయి.ఆయన ప్రాముఖ్యత ఏనాడు తగ్గలేదు కాని ఆయన దాన్ని ఆనందించి అనుభవించలేక పోయాడు .నలభై లలో జబ్బుపడి హస్పిటల్ లో చేరి  రెండేళ్ళు ఉన్నాడు .గదిలో ఉన్న రెడియో కొంత కాలక్షేపానికి ,కొంత సెటైర్ ప్రాక్టీస్ చేసు కొవటానికి ఉపయోగ పడింది . ‘’he turned out some of the best reviews of broadcasting ever produced ‘’కాని పెరిగిపోతున్న డిప్రెషన్ ను ,ఓడిపోవటాన్ని అధిగమించలేక పోయాడు .జాగ్రత్తగా ఉన్నా బాగా అలసిపోయాడు .గుండె ఆగి లాంగ్ ఐలాండ్ లోని ఈస్ట్ హాంప్టన్ స్వగృహం లో 25-9 -1933 న 48 ఏళ్ళకే అందర్ని నవ్వించిన నవ్వుల రేడు రింగ్ లార్డ్ నర్ రివ్వుమని చుక్కల్లో చేరాడు .

    లార్డ్ నర్ కు జీవితాంతం దియేటర్ తో సంబంధం ఉండేది .అతని మూడు అంకాల నాటకం బ్రాడ్వే లో ప్రదర్శింపబడి ,మూడు సార్లు తెరకెక్కింది .ఆయన గొప్ప స్వరకర్త ,గీత రచయిత కూడా .ఆయన రాసిన ‘’జాంజిబార్ ‘’జూన్ మూన్ ‘’లు తను కూర్చిన బాణీలతోనే ప్రదర్శించి ముద్రించారు .బెర్ట్ విలియమ్స్ కు ఒక రికార్డ్ సాంగ్ రాశాడు .ఓల్డ్ క్వార్టర్ కు లిరిక్స్ రాశాడు .స్కాట్  ఫిట్జ రాల్ద్   ,జాజ్ యుగ రచయితలతోను  దోస్తీ మస్తుగా ఉండేది . ఫిట్జ రాల్డ్ చివరినవల ‘’టెండర్ ఈజ్ ది నైట్ ‘’లో విషాద పాత్ర ‘’ఏబ్ నార్త్ ‘’కు మోడల్గా  లార్డ్ నర్ ఉంటాడు .లార్డ్ నర్ ప్రభావం  అత్యంత౦గా ఉన్నవాడు ఎర్నెస్ట్ హెమింగ్ వే .హెమింగ్వే తన హైస్కూల్ న్యూస్ పేపర్ కు ‘’రింగ్ లార్డ్ నర్ ‘’అనే మారు పేరుతో ఆర్టికల్స్ రాసేవాడు ఈ ఇద్దరూ 1928 డిసెంబర్ లో మార్క్ పెర్కిన్స్ చోరవతో కలుసుకొన్నారు కాని స్నేహం పెరగలేదు .జే  డి సాలింజేర్ తన ‘’కాచర్ ఇన్ ది రై ‘’,ఫరానీ అండ్ జూయీ ‘’నవలలో లార్డ్ నర్ ను ఉదాహరించాడు .బ్లాక్ సెక్స్ స్కాండల్ కు సంబంధించిన ‘’ఎయిట్ మెన్ అవుట్ ‘’సినిమాలో రచయితా దర్శకుడు జాన్ స్టీల్స్ లార్డ్ నర్ పాత్ర పోషించాడు .మేనల్లుడుజూనియర్ రింగ్ లార్డ్ నర్  స్క్రీన్ రైటర్ –రెండవ ప్రపంచ యుద్ధం లో అమెరికన్ కాంగ్రెస్ ను ధిక్కరించినందుకు బంధింప బడి ,’’హౌస్ అన్ –అమెరికన్ యాక్టివిటీస్ కమిటి ‘’ముందు సంజాయిషీ చెప్పనందుకు  బ్లాక్ లిస్టు లో పెట్టబడిన వాడు ..అతని స్క్రీన్ ప్లే లకు రెండు సార్లు అకాడెమి అవార్డ్ లభించింది .కనుక లార్డ్ నర్ లందరూ రచనా రింగు రంగం లో సుప్రసిద్దులే ,లార్డ్ లే .రచనా వారసత్వం నిలుపుకొన్న వారే .

Inline image 3Inline image 1Inline image 2

 సశేషం

        మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10—7-16 –ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -202

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 202

76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన  అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్

స్పోర్టివ్ హ్యూమరిస్ట్ గా జీవితం ప్రారంభించి,అసాంఘిక వ్యంగ్య రచయితగా మారిన అమెరికన్ జర్నలిస్ట్ రింగ్ లార్డేనర్ .మొదట రాసిన కధలన్నీ పూర్తీ వినోదం ఇచ్చినవే. తరువాతి రచనలు క్రూరంగా ,చిత్ర హింసగా ,నిరాశగా ,ఆత్మ న్యూనతగా ఉంటాయి .క్రిటిక్ జర్నలిస్ట్ అయిన విలియం బోలితో అతనిని ‘’ అమెరికా తయారు చేసిన అతి గొప్ప నిజాయితీ గల ఆశావాది ‘’(the greatest and sincerest pessimist America has produced )అన్నాడు .6 -3-1885న అమెరికా మిచిగాన్ రాష్ట్రము నైల్స్ లో పుట్టాడు .అసలు పేరు రింగ్ గోల్డ్ విల్మార్ లార్డేనర్ .పెద్దయ్యాక తానె రింగ్ డబ్ల్యు.లార్డేనర్ గా మార్చుకొన్నాడు ..మధ్యలో ఉన్న డబ్ల్యు ను అందరూ ‘’వర్మ్’’అని అపోహ పడుతారని దాన్నీ తీసేసి మిగిలిన పేరు ఉంచుకొన్నాడు .హైస్కూల్  చదువు అయ్యాక మిచిగన్ యూని వర్సిటి లో చేరి ఫుట్ బాల్ ,డెంటిస్ట్రి చదవాలనుకొన్నాడు .మిచిగన్అంటే మరీ ఇంట్లో నే ఉన్నట్లు ఉంటుందనుకొని చికాగో లో ఆర్మర్ ఇన్ స్టి ట్యూట్ లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ లో  మొదటి సెమిస్టర్ తర్వాత అలంకార శాస్త్రంచదివి బయటికొచ్చాడు నిరలంకారంగా .ర్రైల్ రోడ్ పనుల్లో కొంతకాలం ,సరుకు రవాణా ఏజెంట్ గా   కొద్దికాలం  పనిచేసి ఒక సారి అతి భారీగా ‘’క్రీం చీజ్ ‘’ను తప్పుడు అడ్రస్ కు పంపిస్తే ఉద్యోగం ఊడింది .గాస్ ఆఫీస్ లో బాయ్ లాగా అన్ని పనులు చేస్తూ వారానికి ఆరు డాలర్లు సంపాదించాడు .20 వయసులో ఇతని అన్నకు ఇండియానాలోని సౌత్ బెండ్ లో ‘’టైమ్స్ ‘’లో ఉద్యోగం వస్తే ,దాన్ని ఆతను తిరస్కరిస్తే మనోడు దాన్ని జాక్పాట్ లాఒడిసి పట్టుకొన్నాడు .రెండేళ్ళు అందులో రిపోర్టర్ గా పన్జేసి కోర్టులు ,పోలీస్ స్టేషన్లు ,బాల్ గేమ్స్ ,కొత్త సినిమాల రివ్యూలు ,,వినోద ప్రదర్శనలపై ప్రశంసలు ఒకటేమిటి సకల కళా వల్లభుడుగా అన్నీ రాశాడు .

  22 వయసులో ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అయి మంచి పేరు పొందాడు .చికాగో ట్రిబ్యూన్ లో రాసిన ‘’ఇన్ ది వేక్ ఆఫ్ ది న్యూస్ ‘’అందర్నీ ఆకర్షించి ఒక నమూనా గా నిలిచి పోయింది .ఇరవైలలో చికాగో పిచ్చేర్ జాక్ కీఫే పై పరిహాసం ,సరదా కలిపి రాసిన కధలు ‘’ది సాటర్ డే ఈవెనింగ్ పోస్ట్ ‘’లో వస్తే  పిచ్చ పిచ్చ గా నచ్చి అది ‘’యు నో మి అల్ ‘’గా పుస్తక రూపం పొందిన తర్వాత  మరీ మరీ ఆకర్షణీయమైంది . విరగబడి పగలబడి పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వుకొన్నారు చదివి .పాత్రలను అంత గొప్పగా హాస్యం రంగరించి తయారుచేయటం ఆషామాషీ కాదు –మన ముళ్ళపూడి వెంకట రమణ లాగా అంతే ‘’వీజీ ‘’కాదు .దీనిపై హెన్రి ఎల్.మెంకేన్ స్పందిస్తూ ‘’లార్డ్ నర్ తీర్చి  దిద్దిన తీరు న భూతో గా ఉంది అమెరికా జనం దీన్ని బాగా అర్ధం చేసుకొని విపరీతంగా ఎంజాయ్ చేశారు ‘’అని రాశాడు .

1911 లో ఇంకా రిపోర్టర్ గానే ఉండగా పాతికేళ్ళ వయసులో ఎల్లిస్ ఆబ్బట్ ను  పెళ్లి చేసుకొన్నాడు .ఆరడుగుల అందగాడు ,బలిష్ట మైన శరీరం రెండొందల పౌండ్ల బరువున్నవాడు .తండ్రి కావాలనే ఉబలాటం ఎక్కువ .నలుగురు మగపిల్ల తండ్రి అయ్యాడు .పెద్దకొడుకు జాన్ తండ్రిలాగానే స్పోర్ట్ రైటర్ అయ్యాడు .కామిక్ గాఘాటుగా రాసేవాడు .లార్డ్ నర్ లాగా రాయాలని చాలామంది ప్రయత్నించారుకాని అతని శైలి అందుకోలేక చతికిల పడ్డారు .అది ‘’అననుకరణీయం ‘’అని గ్రహించారు .అతని భాష సామాన్య అమెరికన్ మనిషి మాట్లాడేఇంగ్లీషే .ఆయన రాసే ఇంగ్లీష్ ను  ఆయన పేరు మీద ‘’రింగ్లిష్’’అన్నారు  .’’హల్లిబుల్స్ ట్రావెల్స్ ‘’,ట్రీట్ ఏం రఫ్ ‘’లు కూడా పూర్తిగా హాస్య రస పానీయాలే .అదే ప్రత్యేకతను సంతరించుకోన్నవే .

30 లోకి  అడుగుపెట్టగానే హ్యూమరిస్ట్ స్తైరిస్ట్ గా రూపాంతరం చెందాడు .’’హౌ టు రైట్ షార్ట్ స్టోరీస్ ‘’,’’ది లవ్ నెస్ట్ (ప్రేమగూడు  ) లు పూర్తిగా హాస్యాస్పద సంఘటనలతో ,వింత పరిస్థితు లతో కడుపుబ్బా నవ్వు పుట్టిస్తాయి .ఒక ప్రాంతానికి ,ఒక లెవెల్ కు మాత్రమే సంబందినవి కాకుండా అన్ని చోట్లా అన్ని తరహాల వారినీ ఆకర్షింఛి వినోదం పంచాయి .’’అలీబి ఇకి ‘’కూడా బేస్ బాల్ వజ్రం గురించినదే కాని ఇతి వృత్తం అసంబద్ధంగా ఉంటుంది .ఇందులోని ఫ్రాంక్ ఎర్నేల్ ఒక విదూషకుడు( క్లౌన్)  కాదు  అసలు మనిషే .అనిపిస్తాడు డికెన్స్ పాత్రలలాగా .’హెయిర్ కట్ ‘’ఒక అతి వాగుడు బార్బర్  యొక్క  ఇబ్బంది ,చికాకు పరచే స్వగతం అయినా చిన్న పట్ణంలోని నిజజీవిత జోకర్ అనిపిస్తాడు .లవ్ నెస్ట్  పరోక్ష వివరణ .ఒక రిపోర్టర్ ఒక బిజినెస్ మాగ్నెట్ ను ఇంటర్వ్యు చేయటం .పాఠకుడిని బాధించి ,దిగ్భ్రాంతి చెందించి చివరికి కదిలించి స్థానిక భయాన్ని దిగాజారుడును కళ్ళ ముందు నిలుపుతుంది .పదికధలను 1924  లో పుస్తకంగా తెచ్చాడు .హాస్యం నుంచి సీరియస్నెస్ కు అతని ప్రస్థానం కనిపిస్తుంది .తరువాత తనకు తాను తక్కువ చేసుకొన్నాడు .ఈ పది కధలు కధలు ఎలా రాయాలో తెలియ జేసే మార్గ దర్శకత్వ౦ చేస్తాయి .  .మిస్టరికద ఎలా ప్రచురింప బడిందో అందరికి మిస్టరీ గానే ఉంది .ఈ కధలలోని జీవులు చెడు పద్ధతులు న్నవారు ,అసహ్యం పుట్టించే తెలివి తక్కువ వాళ్ళు ,మధ్య వయసున్న   కౌమారదశవాళ్ళు ,తప్పు చేసి దాక్కొనే నకిలీ వాళ్ళు ,చవకబారువాళ్ళు ,పనికి మాలిన వాళ్ళు .వీళ్ళను చూసి పెద్దగా నవ్వడురచయిత.వాళ్ళపై జాలి ఉంటుంది .అందరూ అన్నిటా శూన్యులే అవటం వింత గొలుపుతుంది .

 Inline image 1Inline image 2

     సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-16 –ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -202 76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 202

76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన  అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్

స్పోర్టివ్ హ్యూమరిస్ట్ గా జీవితం ప్రారంభించి,అసాంఘిక వ్యంగ్య రచయితగా మారిన అమెరికన్ జర్నలిస్ట్ రింగ్ లార్డేనర్ .మొదట రాసిన కధలన్నీ పూర్తీ వినోదం ఇచ్చినవే. తరువాతి రచనలు క్రూరంగా ,చిత్ర హింసగా ,నిరాశగా ,ఆత్మ న్యూనతగా ఉంటాయి .క్రిటిక్ జర్నలిస్ట్ అయిన విలియం బోలితో అతనిని ‘’ అమెరికా తయారు చేసిన అతి గొప్ప నిజాయితీ గల ఆశావాది ‘’(the greatest and sincerest pessimist America has produced )అన్నాడు .6 -3-1885న అమెరికా మిచిగాన్ రాష్ట్రము నైల్స్ లో పుట్టాడు .అసలు పేరు రింగ్ గోల్డ్ విల్మార్ లార్డేనర్ .పెద్దయ్యాక తానె రింగ్ డబ్ల్యు.లార్డేనర్ గా మార్చుకొన్నాడు ..మధ్యలో ఉన్న డబ్ల్యు ను అందరూ ‘’వర్మ్’’అని అపోహ పడుతారని దాన్నీ తీసేసి మిగిలిన పేరు ఉంచుకొన్నాడు .హైస్కూల్  చదువు అయ్యాక మిచిగన్ యూని వర్సిటి లో చేరి ఫుట్ బాల్ ,డెంటిస్ట్రి చదవాలనుకొన్నాడు .మిచిగన్అంటే మరీ ఇంట్లో నే ఉన్నట్లు ఉంటుందనుకొని చికాగో లో ఆర్మర్ ఇన్ స్టి ట్యూట్ లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ లో  మొదటి సెమిస్టర్ తర్వాత అలంకార శాస్త్రంచదివి బయటికొచ్చాడు నిరలంకారంగా .ర్రైల్ రోడ్ పనుల్లో కొంతకాలం ,సరుకు రవాణా ఏజెంట్ గా   కొద్దికాలం  పనిచేసి ఒక సారి అతి భారీగా ‘’క్రీం చీజ్ ‘’ను తప్పుడు అడ్రస్ కు పంపిస్తే ఉద్యోగం ఊడింది .గాస్ ఆఫీస్ లో బాయ్ లాగా అన్ని పనులు చేస్తూ వారానికి ఆరు డాలర్లు సంపాదించాడు .20 వయసులో ఇతని అన్నకు ఇండియానాలోని సౌత్ బెండ్ లో ‘’టైమ్స్ ‘’లో ఉద్యోగం వస్తే ,దాన్ని ఆతను తిరస్కరిస్తే మనోడు దాన్ని జాక్పాట్ లాఒడిసి పట్టుకొన్నాడు .రెండేళ్ళు అందులో రిపోర్టర్ గా పన్జేసి కోర్టులు ,పోలీస్ స్టేషన్లు ,బాల్ గేమ్స్ ,కొత్త సినిమాల రివ్యూలు ,,వినోద ప్రదర్శనలపై ప్రశంసలు ఒకటేమిటి సకల కళా వల్లభుడుగా అన్నీ రాశాడు .

  22 వయసులో ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అయి మంచి పేరు పొందాడు .చికాగో ట్రిబ్యూన్ లో రాసిన ‘’ఇన్ ది వేక్ ఆఫ్ ది న్యూస్ ‘’అందర్నీ ఆకర్షించి ఒక నమూనా గా నిలిచి పోయింది .ఇరవైలలో చికాగో పిచ్చేర్ జాక్ కీఫే పై పరిహాసం ,సరదా కలిపి రాసిన కధలు ‘’ది సాటర్ డే ఈవెనింగ్ పోస్ట్ ‘’లో వస్తే  పిచ్చ పిచ్చ గా నచ్చి అది ‘’యు నో మి అల్ ‘’గా పుస్తక రూపం పొందిన తర్వాత  మరీ మరీ ఆకర్షణీయమైంది . విరగబడి పగలబడి పొట్ట చేక్కలయ్యేట్లు నవ్వుకొన్నారు చదివి .పాత్రలను అంత గొప్పగా హాస్యం రంగరించి తయారుచేయటం ఆషామాషీ కాదు –మన ముళ్ళపూడి వెంకట రమణ లాగా అంతే ‘’వీజీ ‘’కాదు .దీనిపై హెన్రి ఎల్.మెంకేన్ స్పందిస్తూ ‘’లార్డ్ నర్ తీర్చి  దిద్దిన తీరు న భూతో గా ఉంది అమెరికా జనం దీన్ని బాగా అర్ధం చేసుకొని విపరీతంగా ఎంజాయ్ చేశారు ‘’అని రాశాడు .

1911 లో ఇంకా రిపోర్టర్ గానే ఉండగా పాతికేళ్ళ వయసులో ఎల్లిస్ ఆబ్బట్ ను  పెళ్లి చేసుకొన్నాడు .ఆరడుగుల అందగాడు ,బలిష్ట మైన శరీరం రెండొందల పౌండ్ల బరువున్నవాడు .తండ్రి కావాలనే ఉబలాటం ఎక్కువ .నలుగురు మగపిల్ల తండ్రి అయ్యాడు .పెద్దకొడుకు జాన్ తండ్రిలాగానే స్పోర్ట్ రైటర్ అయ్యాడు .కామిక్ గాఘాటుగా రాసేవాడు .లార్డ్ నర్ లాగా రాయాలని చాలామంది ప్రయత్నించారుకాని అతని శైలి అందుకోలేక చతికిల పడ్డారు .అది ‘’అననుకరణీయం ‘’అని గ్రహించారు .అతని భాష సామాన్య అమెరికన్ మనిషి మాట్లాడేఇంగ్లీషే .ఆయన రాసే ఇంగ్లీష్ ను  ఆయన పేరు మీద ‘’రింగ్లిష్’’అన్నారు  .’’హల్లిబుల్స్ ట్రావెల్స్ ‘’,ట్రీట్ ఏం రఫ్ ‘’లు కూడా పూర్తిగా హాస్య రస పానీయాలే .అదే ప్రత్యేకతను సంతరించుకోన్నవే .

30 లోకి  అడుగుపెట్టగానే హ్యూమరిస్ట్ స్తైరిస్ట్ గా రూపాంతరం చెందాడు .’’హౌ టు రైట్ షార్ట్ స్టోరీస్ ‘’,’’ది లవ్ నెస్ట్ (ప్రేమగూడు  ) లు పూర్తిగా హాస్యాస్పద సంఘటనలతో ,వింత పరిస్థితు లతో కడుపుబ్బా నవ్వు పుట్టిస్తాయి .ఒక ప్రాంతానికి ,ఒక లెవెల్ కు మాత్రమే సంబందినవి కాకుండా అన్ని చోట్లా అన్ని తరహాల వారినీ ఆకర్షింఛి వినోదం పంచాయి .’’అలీబి ఇకి ‘’కూడా బేస్ బాల్ వజ్రం గురించినదే కాని ఇతి వృత్తం అసంబద్ధంగా ఉంటుంది .ఇందులోని ఫ్రాంక్ ఎర్నేల్ ఒక విదూషకుడు( క్లౌన్)  కాదు  అసలు మనిషే .అనిపిస్తాడు డికెన్స్ పాత్రలలాగా .’హెయిర్ కట్ ‘’ఒక అతి వాగుడు బార్బర్  యొక్క  ఇబ్బంది ,చికాకు పరచే స్వగతం అయినా చిన్న పట్ణంలోని నిజజీవిత జోకర్ అనిపిస్తాడు .లవ్ నెస్ట్  పరోక్ష వివరణ .ఒక రిపోర్టర్ ఒక బిజినెస్ మాగ్నెట్ ను ఇంటర్వ్యు చేయటం .పాఠకుడిని బాధించి ,దిగ్భ్రాంతి చెందించి చివరికి కదిలించి స్థానిక భయాన్ని దిగాజారుడును కళ్ళ ముందు నిలుపుతుంది .పదికధలను 1924  లో పుస్తకంగా తెచ్చాడు .హాస్యం నుంచి సీరియస్నెస్ కు అతని ప్రస్థానం కనిపిస్తుంది .తరువాత తనకు తాను తక్కువ చేసుకొన్నాడు .ఈ పది కధలు కధలు ఎలా రాయాలో తెలియ జేసే మార్గ దర్శకత్వ౦ చేస్తాయి .  .మిస్టరికద ఎలా ప్రచురింప బడిందో అందరికి మిస్టరీ గానే ఉంది .ఈ కధలలోని జీవులు చెడు పద్ధతులు న్నవారు ,అసహ్యం పుట్టించే తెలివి తక్కువ వాళ్ళు ,మధ్య వయసున్న   కౌమారదశవాళ్ళు ,తప్పు చేసి దాక్కొనే నకిలీ వాళ్ళు ,చవకబారువాళ్ళు ,పనికి మాలిన వాళ్ళు .వీళ్ళను చూసి పెద్దగా నవ్వడురచయిత.వాళ్ళపై జాలి ఉంటుంది .అందరూ అన్నిటా శూన్యులే అవటం వింత గొలుపుతుంది .

 Inline image 1Inline image 2

     సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -201 75- అమెరికాలో మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన -సింక్లైర్ లెవిస్ -2(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 201

75-   అమెరికాలో  మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన    -సింక్లైర్ లెవిస్ -2(చివరిభాగం )

రియలిస్ట్ ,సేటైరిస్ట్ ,విజనరీ అయిన లెవిస్ భౌతికాభి వృద్ధిని నిరసించాడు .’’యారో స్మిత్ ‘’లో డాక్టర్ –సైంటిస్ట్ ను వ్యాపార ధోరణికి అసహ్యించాడు ‘’ఎల్మేర్ గంట్రి లో హైక్లాస్ ప్రీచర్లను ,క్వేకర్లనూ ,దొంగ సన్యాసులను ,మతాన్ని లాభసాటి వ్యాపారం చేసే రివైవలిస్ట్ లను ఉతికి ఆరేశాడు .’’ది మాన్ హు న్యు క్కాల్ రిడ్జ్ ‘’ఓ అంటే నా రాని బిజినెస్ మాగ్నేట్లపై రాసిన పెద్ద కార్టూన్ .ఇందులో ముఖ్యపాత్రధారి లోవెల్ స్మాల్జ్ పెద్దమోసగాడే అయినా పై అధికారుల ప్రతినిధి .ఎందుకూ పనికిరాని డాడ్స్ వర్త్ అందరితో ఆటలాడుకొంటూ  .ముందుకు తోస్తూ శూన్యం లోకి నేట్టేసేవాడు .’’వర్క్ ఆఫ్ ఆర్ట్ ‘’ అమెరికాలో ఆర్టిస్ట్ అంటే విజయాలు సాధించటమేకాక ,హోటల్ నడపటం లోనూ సామర్ధ్యం ఉన్నవాడు అనే నిర్ణయానికి వస్తాం .ఒకసారి తన జాతీయం ఏర్పడ్డాక క్లిష్టమైన ,అసమ్మతిని తీవ్రంగా చేశాడు .ఆతను కారికేచర్ కు ఎక్కువ పాత్రకు తక్కువ అని తీర్మానించారు .సామాన్య భాషలో అసామాన్యంగా రచనలను నిర్మించటం ఆయన ప్రత్యేకత .ఫోటోగ్రాఫర్ కూడా అంత చక్కగా వెలుగు నీడలను ప్రదర్శించలేడు.ఆయన ఒక సందేహాస్పద రిపోర్టర్ .గొప్ప నైపుణ్యం ఉన్నవాడే కాక దక్షుడైన సంస్కర్త .1926 లో ‘’యారోస్మిత్ ‘’కు పులిట్జర్ బహుమతి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించటమేకాకుండా  వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్య చేశాడు .సాహిత్య స్వేచ్చా ప్రియుడుకనుక గౌరవాలు బిరుదులూ చాలా ప్రమాదకరమైనవి అంటాడు .దానివలన ఇలాగే రాయాలని అలా రాయకూడదనే దానికి లోనౌతాడు రచయితా అన్నాడు .నాలుగేళ్ల తర్వాత వచ్చిన నోబెల్ ప్రైజ్ విషయం లో స్పందిస్తూ దాన్ని తీసుకొంటున్నందుకు క్షమించమని కోరాడు .దియోడర్ డ్రీజర్ ,విల్లా కేధర్ ,జేమ్స్ బ్రాంచ్ కాబెల్ లు ఈ బహుమానాని అన్నివిధాలా అర్హులని ,వారు అమెరికన్ వ్యవస్థలను హేళన చేయకుండా సంయమనం పాటించారని అన్నాడు .

  లెవిస్ మరింత నిర్ణయాలకు శస్త్ర చికిత్సలకు  సిద్ధ పడ్డాడు .50 దాటాక అల్ప ,విపరీతమైన ఇతి వృత్తాలను ఎన్నుకొన్నాడు .వారానికొకటి రాసి వదిలాడు .మొదట ‘’ఆన్ వికర్స్ ‘’ ను సామాన్య విషయం తీసుకొని రాసాడు తర్వాత ‘’ఇట్ కన్ నాట్ హాప్పెన్ హియర్ ‘’లోఅమెరికా లో  రాబోయే ఫాసిస్ట్ సామ్రాజ్యాన్ని ఊహించి చెప్పాడు .ఒక సెటైర్  ఫైరీ టేల్ ను తర్వాత స్మగ్గ్లర్ల ,డబ్బు నీతి విషయం లో కష్టం అధికారుల ద్వంద్వ ప్రవృత్తిని ఎండగడుతూ ‘’గిడియాన్ ప్లానిష్ ‘’రాశాడు ..జాతుల సమస్య,నీతి అది అమలవటం లో అపహాస్యం గురించి రాశాడు .వీటన్నిటిని బట్టి ఆయన్ను సంస్కర్త అన్నారు .క్రమంగాకంజర్వేటివ్ అవుతున్నాడు . ‘’లేబర్ నవల ‘’రాయాలనుకొన్నాడు .యూనియన్లను ,వర్కర్లను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాడు .యువత పై మమత ఉన్నా వాళ్ళ తీవ్రవాదాన్ని ఒప్పుకోలేదు .’’ప్రాడిగల్ పేరెంట్స్ ‘’నవల రాసిన 22 నవలలో  నాసిరకమే .అది యువతరం పై తీవ్ర విమర్శే .

రెండవ సారి విడాకుల తర్వాత వెర్మాంట్ కౌంటి వదిలి డోరోతి దాంప్సన్ తో న్యూయార్క్ లో   కలిసిఉంటూ , ,మిన్నెసోటా లోని దూలత్ లో ,మాసాచూసేట్స్లోని విలియంస్ టౌన్ లో విలాసవంతమైన విశాల భవనం లో ఉన్నాడు .పూటుగా తాగిన తర్వాత పిచ్చి ప్రేలాపనలతో ,బెదిరింపులతో స్నేహితులకు దూరమై పోయాడు .అంతులేని సంపద మధ్య చింతతో వంటరి వాడయ్యాడు .దీనికి తోడు జబ్బు చేసింది .బలవంతం మీద మందుమానేసి ప్రత్యామ్నాయంగా స్వీట్లు కాన్డీలు బస్తాలకొద్దీ లాగించేవాడు . తర్వాత వీటికీ స్వస్తి చెప్పాల్సి వచ్చింది .అయినా చదువు ,పరిశోధనా , రచన మానలేదు . 64 లో చారిత్రాత్మక నవల ‘’ది గాడ్ సీకర్ ‘’రాశాడు .అదేమీ గొప్పదని పించలేదు .జబ్బుతో ఉన్నా  మరో గొప్ప నవల’’ వరల్డ్ సో వైడ్ ‘’ రాయాలనే ప్రయత్నం లోనే ఉన్నాడు.ఇటలీ కి వెళ్లి ఊరేగింపులో పాల్గొని న్యుమోనియా తో అకస్మాత్తుగా కుప్ప కూలాడు .తనకు స౦బ౦ధించిన అన్నిటికీ దూరమైన రోమ్ నగరం లో 10-1-19 51న 64వ ఏట లెవిస్ మరణించాడు .

లెవిస్ రచనలలో ఆదర్శవాదం వ్యంగ్యం తో మిళితమై ఉంటుంది .తన దారి ఏదో తెలుసుకాని లెవిస్ కు గమ్యం తెలియదు .ముసలి లెవిస్ యువ లెవిస్ ను వ్యతిరేకిస్తాడు .పరిణత దశలో కూడా తన లక్స్యాలేమిటో ఆయనకు తెలియదు .ఆయన యుటోపియన్ అయినా యుటోపియాస్ లను  చూసి నవ్వు కొంటాడు .ఆయన యాంటి సెంటి మెంటలిస్ట్ .రోటరీక్లబ్బులంటే వెక్కిరింపు .అసాధారణ మనిషి .క్రియాశీలక రాడికలిజం తో గొడవ పడి ,రెబెల్ నుంచి రోటేరియన్ గా మారాడు .లాభసాటి సోషలిజాన్ని ,లాభా పేక్ష లేని కేపిటలిజం తో కలుపుదామని ప్రయత్నించిన సుమనస్కుడు .కళా కవితా దీపకాంతిని వాటిని వ్యతిరేకించే వారిపై ప్రసరింప జేసే ప్రయత్నం చేశాడు .దీనిఫలితం వ్యర్ధ కలల కళాకారులు ,కాసుల బంధం లో చిక్కుకున్న కవులు ఏర్పడ్డారు .ఆయన ఆదర్శాలకు ఆచరణ విదానాలకు చాలా వ్యత్యాసం ఉంది .లెవిస్ సాగా లో ముఖ్యమైనది ‘’బాబ్బిట్ ‘’నవల,అందులో ఆతను దృఢమైన పౌరుడు ,ము౦దే అల్లుకుపోయిన బూర్జువా ,అన్నీ కలిసిన బిగి౦పు న్నవాడు  .వెదర్ ప్రూఫేడ్ మధ్యతరగతి మనిషి .లెవిస్ అతన్ని ప్రేమించటం కంటే ఎక్కువగాద్వేషిం చాడు .బాబ్బిట్ ,ఆయన  సృస్టికర్త లెవిస్ లు స్వయం క్షోభకులుఅయినా స్వీయ సాధన ఉన్న స్వయం రక్షకులైన ‘’సయామీస్ ట్విన్స్ .‘’ఇద్దరినీ విడదీసి వేరు చేయలేము. .

అమెరికన్ దేశభాష ను ,విధానాలను మొదటిసారిగా అతి ఖచ్చితంగా రికార్డ్ చేసినవాడు లెవిస్ .ఇంగ్లీష్ నవలా కారుడు యి. ఏం. ఫార్ స్టర్ ‘’lodges a piece of continent in the worlds imagination ‘’ అని చాలా చక్కగా చెప్పాడు .పిక్విక్ ,డాన్ క్విక్సోట్,సీగ్ ఫ్రీడ్.రాస్కలోనికోవ్ సిరానో లాగా లెవిస్ పాత్రలు ,  ఆయన దేశమైన అమెరికా  ప్రతినిధులు .సింక్లైర్ లెవిస్ పుస్తకం లో జార్జ .ఎఫ్ .బాబ్బిట్ పుట్టే దాకా ,అమెరికాఫిక్షన్ లో మార్క్ ట్వేన్ గారి టాం సాయర్ తర్వాత ఇలాంటి పాత్ర రానేలేదు .అంతర్జాతీయంగా ఒక గుర్తింపు పొందిన సిటిజన్ గా ఆపాత్ర నిలిచిపోయింది .    1940  లలో అమెరిలాలో లెక్చర్ టూర్ చేస్తూ ‘’ఆధునిక యువతీ మంచిగా ఉందా ‘?పల్లా? పట్నమా?యాంత్రికత నాగరికతకు చేటా?మొదలైన సమస్యలపై కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షం లో మాట్లాడాడు ’.-19 43 లో హాలి వుడ్ లో ఒక సినిమాకు డోరే  స్కారి తో  కలిసి పనిచేయటానికి వెళ్ళాడు .సినిమాపేరు ‘’స్టారం ఇన్ ది వెస్ట్ ‘’రెండవ ప్రపంచ యుద్ధానికి అన్యార్ధమైన కధ.పూర్తికా రాజకేయం కనుక అది ముందుకు సాగలేదు .ఆయనవి 22 నవలలు ,7 భాగాలలుగా చిన్న కధలు ,నాలుగు నాటకాలు ,సుమారు పది  వ్యాసాలూ నాలుగు కవితా సంకలనాలు  రాశాడు .

Inline image 1Inline image 2Inline image 3

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-7-16- ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -200 75- అమెరికాలో మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన -సింక్లైర్ లెవిస్

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 200

75-   అమెరికాలో  మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన    -సింక్లైర్ లెవిస్

అమెరికాలో సాహిత్యం లో మొదటి సారి నోబుల్ పురస్కృతి  సింక్లైర్ లెవిస్ కు  దక్కింది అంటే అది పారడాక్స్ అన్నారు .కారణం ఆయన రాసినవి  స్థానిక విషయాలకు సంబంధించిన చౌకబారు పుస్తకాలు .అవి స్థానిక సాంఘిక ప్రమాణాలకు మాత్రమే సరిపోయేవి .అమెరికా బిజినెస్ మనస్తత్వానికి కాపట్యానికి వ్యతిరేకి .7-2-1885 న అమెరికా మిన్నేసోటలోని సౌక్ సెంటర్ లో పుట్టాడు .తాను పుట్టింది   సెంట్రల్ వెస్ట్ లోని సంస్కృతికి విరుద్ధమైన ,కిక్కిరిసిన ఇళ్ళతో నైతికంగా దిగజారిన గోఫర్ ప్రయరి లో అని చెప్పుకొన్నాడు .తండ్రి గ్రామీణ వైద్యుడు .తండ్రి పై అభిమానాన్ని నవలలో చెప్పుకొన్నాడు .అటు పల్లెకాక ,ఇటు పట్నామూకాని ఊరు అది .చిన్నప్పటినుండి తూర్పుగాలి పై ధ్యాస ఉండేది .లోకల్ స్కూళ్ళలో చదివి ఏల్స్ వెళ్లి ,ఒక సాహిత్య పత్రికకు సంపాదకుడై 1908 లో గ్రాడ్యుయేట్ అయ్యాడు ‘వికృతంగా పొడుగ్గా ఎముకలపోగుగా ,ఉబ్బిన కనుబొమలతో  గట్టి నుదురు తో ‘’యవ్వనం లో కనిపించేవాడు .అండర్ గ్రాడ్యుయేట్ గా ఉండగానే కాల్పనిక శృంగారం ను కవిత్వం వచనం కలగలిపి కధలు రాశాడు .మొదటి రచనలన్నీవిపరీతమైన ఎమోషన్ తో నైపుణ్యంగా రాసిన  వచనాలే .45వ ఏట ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకొని అప్పటిదాకా రాసింది వ్యర్ధమేనని భావించి అసలైన జీవిత చిత్రణ చేయాలనుకొని మిన్నెసోటా ప్రయరి గ్రామాల నేపధ్యం తో రాశాడు .

           అప్టాన్ సింక్లైర్ స్థాపించి ఏంగిల్ వుడ్ లోని కొ ఆపరేటివ్ కాలని గురించి తెలిసి సోషలిజం దెబ్బతినటానికి కారణాలను అన్వేషించాడు .న్యు జేర్సిలో హేల్పర్లు అవసరం అని గ్రహించి తానే స్వయంగా కాపలాదారుగా ,లాండ్రి మాన్ గా సేవలు అందించాడు .తాను  అసంతృప్తితో పేరుపెట్టిన హేలికాన్ హాల్ దగ్ధమైతే ,నిరాశ చెందినా ధైర్యంగా నిలబడ్డాడు .పనామా కు చేరి ,ఆ విస్తృత కాలువ త్రవ్వకం పనుల్లో పై ఉద్యోగం రాక ,కాలి ఫోర్నియా చేరుకొన్నాడు .డబ్బుల్లేక అప్పులతో ఏడాదిన్నర గడిపాడు .చిన్నకధలు రాసి పత్రికలకు పంపిస్తే అంతే వేగంగా తిరిగొచ్చేవి ..మళ్ళీ తూర్పు పై గాలి మళ్ళి,ఇయోవాలో రిపోర్టర్ గా చేరి ,వాషింగ్టన్ డి సి లో జూనియర్ అసిస్టంట్ గా పనిచేసి ,25 ఏళ్ళ వయసులో న్యు యార్క్ లో ఒక పబ్లిషింగ్ హౌస్ లో వారానికి 15 డాలర్ల కు చెవిటి వారికి ప్రత్యేకమైన మేగజైన్ లో సబ్ ఎడిటర్ గా పని చేశాడు .’’లేబర్ మార్కెట్ లో ఇదే నా అసలైన విలువ ‘’అని జోక్ చేస్తూ  19 30  లో నోబెల్ ఫౌండేషన్ లో ఆటో బయాగ్రఫి రాస్తూ చెప్పుకొన్నాడు .ఇదీ ఆయనకేమీ నచ్చలేదు .తానూ ఏదైనా గొప్ప సాహిత్యం రాసిఉంటేకళ్ళకద్దుకొని పెద్ద జీతం ఇచ్చేవారు అనుకొన్నాడు .తరువాత అయిదేళ్ళు ఆఫీస్ బాయ్ గాఒక పబ్లిషర్ వద్ద ,రాతప్రతి సరి చేసే వాడుగా ,’’అడ్వెంచర్ ‘’పత్రికకు అసిస్టంట్ ఎడిటర్ గా ,యాడ్ రైటర్ గ ,కేటలాగర్ గా ,బుక్ రివ్యూయేర్ గా పనిచేసి పొట్ట గడుపుకొన్నాడు .మొదటి పుస్తకం ‘’హైక్ అండ్ ది ఏరోప్లేన్ ‘’అనే ఒక కుర్రాడి కద 25 వ ఏట రాసి’’టాం గ్రాహం ‘’అనే మారు పేరుతో  ప్రచురించాడు  .

  29 వ ఏట గ్రేస్ హేగ్గర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ,11 ఏళ్ళ తర్వాత విడాకులిచ్చాడు .19 28 లో జర్నలిస్ట్ ,కాలమిస్ట్ దోరోతి థామ్సన్ ను పెళ్ళాడాడు .14 ఏళ్ళ కాపురం తర్వాత విడాకులు .మొదటి భార్యకు పుట్టిన కొడుకు కు ‘’వెల్స్’’అని తన అభిమాన రచయిత హెచ్ జి వెల్స్ పేరు  పెట్టుకొన్నాడు .యితడు రెండవ ప్రపంచయుద్ధం లో చనిపోయాడు .వెల్స్ ప్రభావం మొదటినవలలపై బాగా ఉంది .’’ది ట్రయల్ ఆఫ్ ది హాక్ ‘’నవల మిడ్వెస్ట్ లోని ఒక కార్పెంటర్ కొడుకు ప్రాంతీయ సాంప్రదాయాలనుండి విముక్తుడై ,నిరంతర సంచారిగా చివరికి కొత్త నావికా ప్రపంచం లో అడుగు పెట్టటం కధ.బిజినెస్ వృత్తిలోని స్త్రీ పోరాటాలను ‘’ది జాబ్ ‘’లో ,మధ్యవయసుసాహసం మధ్యతరగతి ప్రేమ మందహాసం ‘’ది ఇన్నోసెంట్ ‘’లో ,తూర్పు సమాజపు పిల్ల .మధ్య ప్రాచ్య మెకానిక్ ల మధ్య ప్రేమాయణం విభేదాలు ,స్స్వేచ్చ కోసం తపన ‘’ఫ్రీ ఎయిర్ ‘’లో రాశాడు .ఇవన్నీ 30 ఏళ్ళ లోపే  రాశాడు .35 వయేట ఈ విధానానికి గుడ్ బై చెప్పి రాజీలేని నిజాయితీ ,జంకని వాస్తవికత లతో రచన చేశాడు .ఇప్పటిదాకా సంతోష పెట్టటానికే రాశాడు .ఇప్పడు నిజం చెప్పటానికి ,ఆ నిజం యెంత ఘాటుగా ఉన్నా జనం చదవక పోయినా ఫరవాలేదన్న భావం తో రాశాడు .ఈ ధోరణిలో ‘’మెయిన్ స్ట్రీట్ ;’’రాశాడు .ఇదొక బాంబు ప్రేలుడు లాగా జనానికి షాక్ ఇచ్చింది .స్థానిక సరిహద్దులు దాటి విస్తృత పరిధిలో రాసిన రచన ఇది .కనుక వివాదాస్పదమై  ,ఒక మిలియన్ కాపీలు అమ్ముడై సంచనం సృష్టించి ,అన్ని యూరోపియన్ ఆసియా భాషలలోకి అనువాదం పొంది అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు .ఆయనలోని తిరుగుబాటు మనస్తత్వానికి ,సంకుచితత్వ౦పై పోరాటానికి  డాలర్ ప్రభావంతో క్రూసిఫిక్స్ అయిన పల్లెటూరుజనం పై సానుభూతికి నిదర్శనం .అమెరికన్ మార్మిక కధలన్నీ అమెరికా గ్రామాలు మహోన్నతమైనవని సంతోష భరితమైనవని తెలియ జేస్తుంటే ఈ అమెరికన్ రచయిత లెవిస్ దాన్నంతటిని పుక్కిటి పురాణం –మిత్ అని చెప్పటం వివాదాస్పదమైంది .’’hundreds and thousands  read the book with the same masochistic pleasure that one has  sucking an aching tooth ‘’లక్షలాది జనం ఈ పుస్తకాన్నిబాధా సర్ప దస్ట ఆనందం తో  పంటి నొప్పితో బాధ పడుతూ చప్పరిస్తున్నట్లుగాచదివి ఆనందించారు అని అర్ధం .

 మొదట్లో ,ఆ తర్వాత రాసిన నవలమధ్యలో దాదాపు 200కధలు రాస్తూ ప్రచురించి అమ్మాడు .ఇందులో కొన్ని సెలెక్ట్ చేసి ‘’సేలేక్తేడ్ షార్ట్ స్టోరీస్ ;;గా 1935 లో 50 వ ఏట ముద్రించాడు . ఇందులో ఆయనకే నచ్చనికధలు కొన్ని ఉన్నాయి .ఈలోగా ఆయన బుర్రంతా నవల ప్లాట్ లతో నిండిపోయింది .మెయిన్ స్ట్రీట్ తర్వాత ప్రసిద్ధ నవల ‘’బాబ్బిట్ ‘’ప్రచురించాడు .రెండూ విపరీతమైన క్రేజ్ సృష్టించాయి ఒకదాన్ని మించి ఒకటి .బాబ్బిట్ ఇంగ్లాండ్ లో హాగ్ వాల్పోల్ ము౦దుమాటలతో 200  అమెరికన్ ఎక్స్ప్రెషన్స్ తో  అచ్చయింది .మెయిన్ స్ట్రీట్ చిన్న టౌన్ కు ప్రతినిధి అయితే బాబ్బిట్ పెద్ద సిటికి ప్రాతినిధ్యం పొందింది .ఇందులోనూ మోసాలు ,హిపోక్రసీలు ,జిమ్మిక్కులు ,ధనమేరా అన్నిటికీ మూలం అదే విజయసాధనకు కొలబద్ద అనిపించటం మంచి జీవితానికి  వ్యాపారమే కొలమానమవటం దర్శనమిస్తాయి . వీటిలోని మానవుడికి ‘’the standard advertized wares –toothpastes ,socks ,tires ,cameras ,instantaneous hot water heaters –were his symbols and proofs of excellence –at first the signs then the substitutes for joy and passion and wisdom ‘’అనిపిస్తుందని నిజాలు నిర్భయంగా చెప్పాడు .


సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-7-16 –ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -198 74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్ నవలా రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -3 (చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -198

74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్  నవలా  రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -3 (చివరి భాగం )

కాఫ్కా పుస్తకాలు నిరాశ గాదామయ ధారావాహికం .గట్టిమనసు ,అన్నిటిని ఎదుర్కొనే  ధైర్యం కావాలని కోరుకున్నాడుకాని పొందలేక పోయాడు .ఆ అదృష్టం తనకు దక్కదని గ్రహించాడు .’’ది ట్రయల్ ‘’నవలలో బాంక్ లో ధనసంబంధ ఉన్నతాధికారి యే నేరం చేయక పోయినా చట్టాన్ని ఉల్లంఘించక పోయినా అరెస్ట్ అవుతాడు .నేరం మోపిన వారినికాని ఎందుకు అరెస్స్ట్ చేశారో ఏనిబంధనలతో చేశారో  కాని తెలియదు .అయిష్టంగానే లాయర్ని కుదుర్చుకొన్నాడు .పైన పడిన అపరాధం తో కుంగి పోయాడు .భయపడిపోయాడు .అటార్నీ రహస్య డాక్యుమెంట్ కోర్ట్ లో దాఖలు చేస్తే కేసు నిరంతరం సాగుతూనే ఉంటుందని సలహా ఇచ్చాడు .తన వెనక ఏదో ముఠావ్యతిరేకంగా పని చేస్తోందనుకొన్నాడు .అలాగే జరిగి కత్తిపోట్లకు గురై చనిపోయాడు .ఈ నవలనే ఆండ్రే గైడ్ ,జీన్ లూయీ బార్రట్లు నాటకం గా మలిచారు .గోటిఫ్రైడ్వాన్ ఈనేం ఒపెరగా మార్చాడు .

‘ ది కాజిల్ ‘’లో ఈ నిరాశ మరీ విస్త్రుతమైనది .హీరోకు బాగా ఎత్తుమీదున్న బడాకేజిల్ అధికారులు లాండ్ సర్వేయర్ ఉద్యోగ౦ ఆశ చూపించి .దానిపైకి మంచు చీకటి లో ఎక్కలేక ఎక్కలేక ఆభాస శూన్యం గా భావించాడు .ఇంత కస్టపడి ఇంటర్వ్యు కు వెడితే లోపలి అనుమతించలేదు .ఎన్నో విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు .స్టేటస్ సాధించే ప్రయత్నాలు లాభించలేదు .ఒక బార్ మెయిడ్ సాయం తో ప్రయత్నించినా కుదరలేదు .’’అమెరికా ‘’నవల కనిపించని శత్రువు ఉంటాడు .ఈ మూడిటిని’’ ట్రయాలజి ఆఫ్ లోన్లినెస్ ‘’అన్నారు  .కాఫ్కా తండ్రి సగం నియంత సగం దేవుడు .బ్యూరాక్రాసి ప్రపంచం లో ,యాంత్రిక పారిశ్రామికాభి వృద్ధిలో ఒంటరి అవటం మనుషులకు దూరం కావటం సహజం అని సూత్రీకరించాడు .కాఫ్కాను బాగా సంర్ది౦ చేవారూ బాగా వ్యతిరేకి౦ చేవారూ ఉన్నారు’కాఫ్కాలో మానవత్వం వంటరిదైపోయింది ,ప్రేమలేదు ,రక్షణ ఉండదు .అన్ని ఆసరాలు కోల్పోతారు .కాఫ్కా వీటన్నిటిని భూతద్దంలో చూపించాడు .

చిన్నతనం లో వ్యాయమ౦ అంటే మోజు లేదు కాని పెద్దయ్యాక ఆటలు, ఫిజికల్ యాక్టి విటీలలో బాగా పాల్గొన్నాడు .మంచి రైడర్ ,స్విమ్మర్ ,రోవర్ .ప్రత్యామ్నాయ మందులపై ఆసక్తి ఉండేది .మాంటిస్సొరి ,టెక్నికల్ విద్యలపై అభిరుచిఉండేది ‘’.రచన కాఫ్కా కు ఒక విధమైన ప్రార్ధన’’ .శబ్దకాలుష్యానికి దూరం.అతనిది ‘’స్కిజాయడ్ పర్సనాలిటి డిసార్దర్ ‘’.Enclosed in my own four walls, I found myself as an immigrant imprisoned in a foreign country;… I saw my family as strange aliens whose foreign customs, rites, and very language defied comprehension;… though I did not want it, they forced me to participate in their bizarre rituals;… I could not resist.[193]

 

రచన అంతా జర్మన్ భాషలోనే చేశాడు .సుదీర్ఘ వాక్యాలు ఒక్కోసారి పేజీ అంత ఉండేవి .వీటిని ఇంగ్లీష్ లోకి అనువదించటం కష్టమయ్యేది .జర్మన్ భాష తమాషా ఏమిటి అంటే ఒకే వాక్యాన్ని అనేక రకాలుగా అనువాదం చేయచ్చు .అతనిది ‘’మెటామార్ఫసిస్ ‘’శైలి అంటారు .మిగిలిన రచయితల వాక్యాలను ఉదాహరించినట్లుగా కాఫ్కా వాక్యాలు ఉదాహరించటం అరుదు . Michel-André Bossy writes that Kafka created a rigidly inflexible and sterile bureaucratic universe. Kafka wrote in an aloof manner full of legal and scientific terms. Yet his serious universe also had insightful humour, all highlighting the “irrationality at the roots of a supposedly rational world”.[180] His characters are trapped, confused, full of guilt, frustrated, and lacking understanding of their surreal world. Much of the post-Kafka fiction, especially science fiction, follow the themes and precepts of Kafka’s universe. This can be seen in the works of authors such as George Orwell and Ray Bradbury.[180]

  “Kafkaesque”

Kafka’s writing has inspired the term “Kafkaesque”, used to describe concepts and situations reminiscent of his work, particularly Der Process(The Trial) and “Die Verwandlung” (The Metamorphosis). Examples include instances in which bureaucracies overpower people, often in a surreal, nightmarish milieu which evokes feelings of senselessness, disorientation, and helplessness. Characters in a Kafkaesque setting often lack a clear course of action to escape a labyrinthine situation. Kafkaesque elements often appear in existential works, but the term has transcended the literary realm to apply to real-life occurrences and situations that are incomprehensibly complex, bizarre, or illogical.[

ఆల్బర్ట్ కాము ,జీన్ పాల్ సాత్రే ,లూయీ బోర్జేర్ లు కాఫ్కా ప్రభావానికి బాగా గురైనవారు .అతని సాహిత్యం విజువల్ ఆర్ట్ మీద ,సంగీతం మీద ,పాప్యులర్ కల్చర్ మీద అపారం .20 వ శతాబ్దం నవలలు ఎక్కువ భాగం ఆతని ప్రభావం తో రాయబడినవే . Steinhauer, a professor of German and Jewish literature, says that Kafka “has made a more powerful impact on literate society than any other writer of the twentieth century”.[5]Brod said that the 20th century will one day be known as the “century of Kafka”.[5]

 Inline image 1  Inline image 2


Inline image 3Inline image 4

 

ఫ్రాంజ్ కాఫ్కా మ్యూజియం ను ప్రేగ్ లో నెలకొల్పారు .అతనిపేర ఏటా సాహిత్య  అవార్డ్ అందిస్తున్నారు .కాఫ్కా సొసైటీ ఏర్పడి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది .


 సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-16 –ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మల్లినాథ సూరి వంశీకుడు శ్రీ కోలాచలం వెంకటరావు గారి జీవిత విశేషాలు -1

సంస్కృత పంచకావ్య విమర్శకులు శ్రీ కోలాచలం మల్లినాథ సూరిగారి వంశానికి చెందిన శ్రీ కోలాచలం వెంకట రావు గారి దేశ భక్తి ,సాంఘిక సేవాకార్యక్రమాల విశేషాలున్న  9 పేజీల ఆంగ్ల వ్యాసాన్ని బళ్ళారి నుండిలాయర్  శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు ఎలా తెలుసుకొన్నారో నా చిరునామా తెలియదుకాని ఈ రోజు పంపారు .ఆ విశేషాలు అందరూ తెలుసుకో తగినవి కనుక మీకు 2 భాగాలలో అంద  జేస్తున్నాను -ఎందరో మహానుభావులు అందరికి వందనాలు –దుర్గా ప్రసాద్ 
kvr4 001
kvr5 001 kvr1 001 kvr2 001 kvr3 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -197 74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్ నవలా రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -197

74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్  నవలా  రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -2

కాఫ్కా తనకు నరాల బలహీనత ,తప్పు చేస్తున్నానేమోననే భయం ,పట్టుకొని పీడిస్తున్నాయి .స్కూల్ లో ఆతను అందరికంటే పెద్దవాడు .తమ్ముళ్ళు ఇద్దరూ ముందే చనిపోయారు .చెల్లెళ్ళు ముగ్గురికీదూరమై ఒంటరి వాడై పోయాడు .జర్మన్ ఎల మెంటరిహైస్కూల్ లలో చదివి ప్రేగ్ యూనివర్సిటిలో తనకిష్ట మైన సాహిత్యం భాష లను చదివాడు .డిబేటింగ్ సొసైటీ లో చేరి యువ ,ప్రయోగ శీల రచయితలను ప్రోత్సహించాడు .21 వ ఏడు వచ్చాక తాను  లోయీ డ్రీమర్ గా ఇక ఉండలేననుకొన్నాడు .ఏదో ఒకటి  చేసి కస్టపడి డబ్బు సంపాదించి జీవించాలని నిర్ణ యించుకొన్నాడు .తండ్రి బిజెనెస్ లోకి రమ్మని ఒత్తిడి చేసినా ఆ వైపుకు కన్నెత్తి చూడక ,తనకున్న వాదనా పటిమ ను లాయర్ గా ఉపయోగి౦చు కొందామనుకొని లా చదివాడు .23 కే‘’డాక్టర్ ఆఫ్ లా’’ అయ్యాడు. కాని ప్రాక్టిస్ పెట్టలేదు .ఒక చిన్న ఇన్సురెన్స్ ఆఫీస్ లో గుమాస్తాగా చేరి ,తర్వాత పైకి ఎదిగాడు .ఆస్ట్రియన్ ప్రభుత్వ శాఖలో పని చేస్తూ ఖాళీ సమయం లో ఆత్మకధ రాస్తూ లోపలి టెన్షన్ లకు విముక్తి కలిగించే ప్రయత్నం చేశాడు .

ఒంటరిగా ఉండాలన్న భావాన్ని వదిలేసి గ్రూపులతో కలిసి ఉంటున్నాడు .మహా కవి దార్శనికుడు ,జర్మన్ రచయితా గోదే ను ఆవిష్కరించే సామర్ధ్యం ఉన్న రుడాల్ఫ్ స్టేనర్ పరిచయమై ప్రవర్తనా శీల అధ్యయన శాస్త్రం ( యాన్త్రోపోస్కోపి ),తాంత్రిక శాస్త్రాలవైపు ఆకర్షింప బడ్డాడు .కొంతకాలం తానే ‘’కాబాలిస్ట్ ‘’అయ్యాడు .మాక్స్ బ్రాడ్ ,ఫ్రాంజ్ వేర్ఫెర్ మొదలైన వారి ప్రభావంతో ‘’జియోనిస్ట్ ‘’అయ్యాడు .ఇద్దరు ముగ్గురికంటే సన్నిహితంగా ఉండేవాడుకాదు .బృంద ఆలోచనలలో పాల్గొనే వాడుకాదు .ఒక గంట మాట్లాడాక నరాల ఒత్తిడి పెరిగిపోయేది పెదిమలు ఆకస్మికంగా బిగుసుకు పోయేవి ,అసాధారణమైన నల్ల కళ్ళు మండిపోయేవి .విపరీతమైన తలనొప్పి వచ్చి బాధ పడేవాడు .29 వయసులో బెర్లిన్ వయ్యారి  పొగడ్తలతో ఉబ్బు లింగమై పోయాడు . ఆమెతో సాన్నిహిత్యం ప్రేరణ భయమూ కూడా కలిగించాయి.రెండేళ్ళతర్వాత పెళ్లి చేసుకోమని అడిగాడు .ఎంగేజ్ మెంట్ జరిగింది కూడా కాని మూడు నెలలకే దాన్ని కాఫ్కా రద్దు చేయించాడు .తన అకసమిక  నిర్ణయానికి లెంపలేసుకొని క్షమాపణ కోరాడు చాలా సార్లు .తన నరాల బలహీనత ,టి బి లక్షణాలు ఏకరువు పెట్టాడు కాని జబ్బుకంటే మానసికంగా బలహీనమయ్యాడు .’’హనీ మూన్ ఆలోచన అంటే నాకు భయమేస్తుంది ‘’అని చెప్పుకొన్నాడు ఒకసారి .’’నాప్రేమ ఉక్కిరి బిక్కిరికి భయం, నా విదానాలకింద సమాధి అయింది  ‘’అని మాక్స్ బ్రాడ్ కు జాబు రాశాడు .గృహస్త జీవితానికి సంసార బాధ్యతలకు  అనుకోకుండా స్వస్తి  చెప్పినవాడిని చూస్తె ;;కర్క్ గాడ్ ‘’గుర్తుకొస్తాడు కాఫ్కా నేరాన్ని తండ్రిపై నెట్టేసి తప్పించుకొన్నాడు .తండ్రికి రాసిన ఉత్తరం లోనే ఈ అధ్యాయాన్నీ చేర్చి  ‘’సంసారం  ఈడ్చాలంటే నీలాగా సర్వ సమర్డుడనై ఉండాలి  .కానీ నాకవేమీ లేవు .అంటే మంచీ చెడూ లేవునాకు .అవి నీలో సహజంగా ఉన్నాయి .అందర్నీ ప్రేమిస్తున్నట్లే ఉంటావుకాని ఎవరినీ నమ్మవు ‘’అని ఏకరువుపెట్టాడు .జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలనుకొని 34 వ ఏట మళ్ళీ ఒకమ్మాయికి లైనేసి ఎంగేజ్ మెంట్ చేసుకొన్నాడు .కాని విషయం పక్వంకాకుండానే అతని అధైర్యం ,అనాసక్తత వలన ఒక్కసారిగా బ్రేక్ పడింది  .మళ్ళీ సీరియస్ గా జబ్బుపడి ఒంటరివాడయ్యాడు .

అప్పటికే తాను  రాసిన వ్యాసాలూ ,కొన్ని చిన్నకధలు చేర్చి ‘’దిస్టోకర్ ‘’పేరిట ముద్రించాడు .ఇది ప్రైజ్ పొందింది .ఇదే  తర్వాత వచ్చిన ‘’అమెరికా ‘’అనే ఫాంటసి లో చోటు చేసుకొన్నది .మిగిలిన రచనలు అతని అతి తక్కువ స్నేహబృందానికి తప్ప లోకానికి తెలియ లేదు .చనిపోయాక మూడు నవలలు విడుదలై అనువాదం పొందాయి .మొదటి ప్రపంచ యుద్ధకాలం లో ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది .డబ్బులకేమీ ఇబ్బంది లేదు కాని అప్పుడు బొగ్గు కొరత ఏర్పడింది .కనుక వెచ్చదనానికి అవకాశం లేక రక్తం కక్కుకోనేవాడు .అతనికి ‘’పల్మనరి కటార్  ‘’జబ్బు వచ్చిందని ,అందుకని ఎవరొ ఒకరు  తోడు ఉండాలికనుక సాజ్ దగ్గర జురావు ఎస్టేట్ లో ఉన్న చిన్న చెల్లెలి దగ్గర ఉండమని డాక్టర్లు సలహా చ్చారు .అక్కడ ఆరోగ్యం కొంత నయమైంది .’’ది ట్రయల్ అండ్ ది  కాజిల్’’ రాయటం లో విశ్రాంతి లేక దగ్గు పట్టుకోంది.తర్వాత చాలా శానిటోరియం లలో చేరాడు .

40 వ ఏట 18 ఏళ్ళ జ్యూయిష్ అమ్మాయి డోరా డిమాంట్ తో ప్రేమలో పడి ఇద్దరూ కలిసి ప్రేగ్ కు వెళ్ళారు .కాని మళ్ళీ ప్రేమ విఫలమైంది.జబ్బు తీవ్రమై ప్రమాద స్థితికి చేరింది .తలిదండ్రులకు తెలిసి అతనికి తక్షణ వైద్యం కోసం తీసుకొని వెళ్లి వీనర్ వాల్డ్ శానిటోరియం ‘లో చేర్చాలనుకొని ఓపెన్ కారు లో తీసుకు వెడుతుంటే మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు అకస్మాత్తుగా తుఫాను చుట్టు ముట్టింది .ఒళ్లంతా తడిసి ముద్దఅయి ఒణుకుతూ అచేతన స్థిలో చేరాడు .అక్కడ రోగులు విపరీతంగా ఉన్నారు .కాఫ్కాను బాధ తో చచ్చిపోతున్న ఒకవ్యాదిగ్రస్తుడి ప్రక్క బెడ్ లో పడుకోబెట్టారు .తర్వాత కీర్లింగ్ శానిటోరియం లో ఒక ప్రత్యేకగదిలో పెట్టారు . అక్కడే కాఫ్కా 3- 6-1924 న 41వ పుట్టిన రోజు ఒక నెల ఉందనగా  ఈ లోకం నుంచి కనుమరుగైపోయాడు శాశ్వతంగా  .స్వగ్రామానికి తీసుకొని వెళ్లి జ్యూయిష్ పద్ధతిలో ప్రాగ్ –స్ట్రాస్స్ చిన్జ్ లో  ఖననం చేశారు ,అతని చెల్లెళ్ళు ముగ్గురూ విజ్ కాన్సేంట్రేషన్ కాంప్ లో నాజీ దురాగతానికి బలైపోయారు  . మగ నలుసు కూడా ఎవరూ  మిగల లేదు .

Inline image 1Inline image 2

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-16 –ఉయ్యూరు

 

 

 

   

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment