వీక్షకులు
- 1,130,898 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
- శ్రీరామ కర్ణామృతం.10 వ భాగం.26.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.154 వ భాగం.26.3.26.
- శ్రీక౦ఠ స్పూర్తికథలు
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.6 వ భాగం.25.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి. 3 వ భాగం.25.3.26.
- శ్రీరామ కర్ణామృతం.9 వ భాగం.25.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.153 వ భాగం.25.3.26.
- శ్రీ పత్తిపాటి వారి పంచామృతాలు
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,868)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
‘కార్తీక వైభవం ”- సరసభారతి 85వ సమావేశం – శ్రీ నవులూరి రమేశ్ బాబు గారి ఉపన్యాసం
సరసభారతి 85వ సమావేశం గా శ్రీ సువర్చ లాంజనేయ స్వామి దేవాలయం లో 8-12-15మంగళవారం సాయంత్రం 6-30కు ”కార్తీక వైభవం ”-పై
,రాత్రి 7గం.లకు లక్ష వత్తులతో అఖండ దీపోత్సవ దృశ్యాలు
లక్ష దీపోత్సవానికి ఆహ్వానం
సరసభారతి 85వ సమావేశం గా స్థానిక శ్రీ సువర్చలాంజనేయ స్వామిదేవాలయం లో 8-12-15మంగళ వారం సాయంత్రం 6గం లకు కార్తీక మాస సందర్భం గా ”కార్తీక వైభవం ”పై శ్రీ నవులూరి రమేశ్ బాబు (రిటైర్డ్ తెలుగు లెక్చరర్ )గారు ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు .అనంతరం రాత్రి 7గం లకు లక్షవత్తులతో దీపోత్సవం జరుగుతుంది .కలియుగ కైలాసం గా ఆంజనేయ దేవాలయం భాసించే ఈ కార్య క్రమం లో అందరూ పాల్గొని విని ,కనీ తరించండి -దుర్గాప్రసాద్ -సరసభారతి మరియు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవస్థానం
నర్తకి సావిత్రి -విఏకే రంగారావు ,బెజవాడ ఒకప్పుడు జైన కేంద్రం ఎంట్రోపి (యంతరపి )క వన శర్మ కమ్మని కవిత
6-12-15 ఆదివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో రెండవ రోజు శ్రీ సుందర కాండ పారాయణ మరియు శివాలయం లో శ్రీ జగదాంబా సమేత సోమేశ్వర స్వామి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యం లో వనభోజనాలు చిత్రమాలిక
6-12-15 ఆదివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో రెండవ రోజు శ్రీ సుందర కాండ పారాయణ మరియు శివాలయం లో శ్రీ జగదాంబా సమేత సోమేశ్వర స్వామి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యం లో వనభోజనాలు చిత్రమాలిక
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920)
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920)
నడిమింటి భాగవత పతంజలి శాస్త్రి ,కామాక్షీ దంపతుల పుత్రుడు గోపాల శాస్త్రి .1853లో జన్మించి 1920లో మరణించాడు .అభినవ కాళిదాసు నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారి మనవడు .తండ్రీ తాతలవలేనే శ్రీ విద్యోపాసకుడు .శివ గౌరీ పరిణయం ,శ్రీ రామాభ్య్దయం కావ్యాలు రాశాడు .చిన్నతమ్ముడు నరసింహ శాస్త్రి ఈ అన్నగురించి చెప్పిన శ్లోకం తప్ప ఏమీ లభించలేదు –
‘’శ్రీ మంగళేశ్వరస్య పాత్రో గోపాల పండితః -పతంజలి కవేః పుత్రో కృతవాన్ గ్రంధ యుగ్మకం
శ్రీ రామాభ్యుదయం చైవ గౌరీ పరిణయం తదా –క్రుతవానాతిభక్త్యా తు శ్రీ విద్యోపాసకో త్తమః
శ్రీ మద్విభవ పౌర్ణాభ్యాంశ్రవణేగురువాసరే –అర్ధ రాత్యాం జహో ప్రాణాన్ ధ్యాయన్ శివ ముమాపతిం ‘’
35-శేష గోవింద
గోదావరి జిల్లా నందపురి లో శేష యజ్ఞేశ్వర ,భీమా౦బలకు జన్మించిన గోవింద తారవాత వారణాసి వెళ్లి పోయాడు .తాత అనంతుడు 17వ శతాబ్దం వాడు .గోవింద ‘’ప్రచండ గరుడ వ్యాయోగంలేక వినతానందం , గూడార్ధ పద వ్యాఖ్య ,గోపాల లీలార్నవ భాణఅమరు శతక వ్యాఖ్యా రాశాడు .
వ్యాయోగం – గరుత్మంతుడు తల్లి వినతా దేవి కోరికపై స్వర్గం వెళ్లి అమృత కలశం తెచ్చి తల్లికి ఆనందం కల్గించటం కద.వారణాసి బిందుమాధవ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .
‘’దర్పాహం పూర్వ భాగ్య వ్యతికర కుపితాన్యోన్య ఫూత్కారకారీ –స్ఫాయత్క ర్ణావ సద్విరస న ధామాని భాస్త్రికాద్మా తతీద్రే
సూత్రధారుని చేత ఈ వ్యాయోగం ఎక్కడ ఎప్పుడు ఆడిండీ వివరాలు చెప్పించాడు
కవి రాసిన రెండవ కావ్య౦ గూడార్ధ పద దీపిక అంతా వేదా౦తమే .మొదటి శ్లోకం లో కవి గురించి కొంత తెలుస్తుంది .
;;యత్ప్రసాదదీన సిద్ధి పురుషార్ధ చతుష్టయం –సారస్వత్యావతారం తమ్ తమ్ వందే శ్రీ మధుసూదనం ‘’
గోవిందకవి మధుసూదనుని శిష్యుడు అని తెలుస్తోంది ,మధుసూదన సరస్వతి ?తండ్రి శేష పండితుడని చెప్పాడు .
36-కుందుర్తి గోవింద మంత్రి
శాండిల్య గోత్రీకుడైన కుందుర్తి గోవింద మంత్రి కొండవీడు ప్రభువుల పోషణలోని వాడు .23కాండాల’’హరి వంశ సార చరిత్ర ‘’రాశాడు .దీనికి అప్పయ దీక్షితులు వ్యాఖ్య రాశాడు .అయినా కవి వివరాలు తెలియ రాలేదు కుప్పాంబిక శ్రీ దల్లి మంత్రి ల కుమారుడు .భారతీ పరిణయం రాసిన గోవిన్దమంత్రీ ఈయన ఒకరే కావచ్చునని బిరుదరాజు వారి అభిప్రాయం. వేంకటపతి రాయల ఆస్థానకవి .ఈతని మనవడు,రామయ మంత్రి కొడుకు కుందుర్తి వెంకటాచలకవి తెలుగులో మిత్ర విందా పరిణయ కావ్యం రాశాడు .హరి వంశ సారచరిత్ర నుండి ఒకటి రెండు శ్లోకాలు –
‘’అస్తీందు రింద్రానుజా చిత్త శుక్తి ముక్తామణిర్మూల దనం సురాణాం-ఆమ్లాన ముక్తం సముమాస సవస్త్య పురావిదః పుష్ప మపాం యమాహుః
చివరి శ్లోకం
‘’యదుస్తతో జాయత దేవా యాన్యాం యశోధనానాం ప్రధమాభి దేయః –వంశో యదీయే వరదః పురాణోగోప్త్రుం జనత్ శ్రీ హరి రావిశాతీత్ ‘’
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 33-జాను౦పల్లి గోపాల రాయ (1650)
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
33-జాను౦పల్లి గోపాల రాయ (1650)
‘’అష్ట భాషా బహిరి గోపాల రావు ‘’అని పిలువబడే గోపాలరాయ జానుం పల్లి వీరమ్మ ,వెంకట లకుమారుడు .17వ శతాబ్దం మధ్యభాగం లో జానుంపల్లివంశ రాజులు వనపర్తి సంస్థాన పాలకులు .1650కాలం వాడు .అతని రాజధాని వనపర్తి దగ్గరున్న సూగూరు .రెడ్డికులస్తులు .కవిపండిత పోషణతో బాటు స్వయంగా రాజు కవి .బహుభాషా వేత్త .ఎనిమిది భాషలు వచ్చు .’’అందుకే అష్ట భాషా బహిరి ‘’అని పిలిపించుకొన్నాడు .బహిరి అనేది వనపర్తి రాజుల వంశ పారంపర్య నామం .’’షడ్ దర్శన వల్లభ ‘’అనే సార్ధక బిరుదూ ఉంది .’’రామ చంద్రోదయం ‘’అనే యమక కావ్యాన్ని ,శ్రీరంగ మంజరీ భాణం’’ను రాశాడు .
రామ చంద్రోదయం క్లిష్టమైన యమక కావ్యం .5ఉచ్వాసాలతో 295శ్లోకాలతో ఉంది .వ్యాఖ్యానం లేకుండా అంగుళం కూడా కదలలేము .రాజు తానె స్వయంగా ‘’విజ్ఞానార్ధ దర్పణం ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .పూర్తీ రామాయణ గాద .మొదటి అధ్యాయం లో అయోధ్య వర్ణన ,రామాదుల పుట్టుక వర్ణించాడు .రెండవ దానిలో వసంత ఋతువు దశరధుని జలక్రీదాడున్నాయి .మూడులో విశ్వామిత్ర ప్రవేశం ,ఆయనతో సోదరులిద్దరు యజ్న రక్షణకు వెళ్ళటం బల అరిబల విద్యలు నేర్వటం .తాటాక సుబాహు వధ మారీచుడిని బాణం తో పార ద్రోలటం ,గంగావతరణం మిధిలా ప్రవేశం ఉన్నాయి. నాలుగులో జనకుని స్వాగతం సీతారాముల సమాగమం ,దశావతార వర్ణన లో పది దశల ప్రేమ ను వ్యక్తం చేయటం ,శివ ధనుర్భంగం ఉంటాయి. చివరి అధ్యాయం లో సీతారామ వివాహ వర్ణన చాలా విస్తృతంగా చేశాడు కవి .అయోధ్యకు తిరుగుప్రయాణం పరశురామ గర్వ భంగం ఉన్నాయి .చివరి శ్లోకాలలో రాముడిని అడవికి పంపటం వాలివధ ,సుగ్రీవ పట్టాభిషేకం సేతు బంధనం రావణ వధ ,శ్రీరామ పట్టాభ్హి షేకం తో పూర్తీ .
వ్యాకరణ విద్యార్ధులకు,కొత్తగా కవిత్వం రాసేవారికి ఈ కావ్యం కర దీపిక .ప్రారంభ శ్లోకం –
‘’శ్రీ వేంకట పురపతిం స్థిర సత్ప్రభావం శ్రీ రామ చంద్ర మనిశం హృది భావ యామి –నశ్యత్య బాహ్యమపి భూరి తమః ప్రజానాం సర్వార్ధ సాధ్విది గమో స్తి చ యత్ప్రసాదాత్ ‘’
కవి తన గురించి తానూ ఇలా చెప్పుకొన్నాడు
‘’శాట్చాస్త్రీ పార దృశ్వా సరస మృదు వచరారాల్లాధ్య నానా కవీంద్ర –స్తుత్యః స్వారేష భాషా కృత బహు మధురోదార చిత్ర ప్రబందః ‘’ అని చెప్పుకొని ఇంత గొప్ప కవిత్వం తనకు శ్రీ రామ చంద్రుని కటాక్షం వలననే లభించిందని వినయంగా చెప్పుకొన్నాడు –
‘’అక్రుతసనామా ధీరం యమక కృతిం కాళిదాస నామా ధీరం –అన్యో నామా ధీరం సుకవిం తత్ప్రధయాయి తుమదునా మధీరం .
శబ్దాలతో చెడుగుడు ఎలాఆడాడో చూద్దాం –
‘’యతో యతో యతో యతోదయం పికర్తునిధి సః-రమా రమా రమా రమాయత తాత తోధవైజయీ ‘’
రెండర్ధాల శ్లోక వైభవం చూద్దాం –
‘’మంజులతా గణికానాం జగృహే మధుపేన పుష్పతాగనణికానాం-జాతిరుత గణికానాం ననుశ్రుతా నోచితజ్ఞాత గణికానాం ‘’ఈ శ్లేష పగలకొట్టి అర్ధం చేసుకోవటానికి శోష పడాలి .
ప్రేమలో ఉన్న పది అవస్థలను అద్భుతంగా వర్ణించాడు .చివరికి రామ రాజ్యాన్ని వర్ణించాడు –
‘’రామితా గాదిభి శ్శామితా జనతా శమితాన నాశ మితాన వ్రుషాః-పరమాయురవాప రమామాఖిలః పరమామపి నోపరమార హృది ‘’
గోపాల రాయని రెండవ రచన ‘’శ్రీ రంగ మంజరీ భాణం’’ను మృదు మధురంగా రాశాడు .మహబూబ్ నగర్ శ్రీరామాలయ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .తన రాజధాని సూగూరును వర్ణించాడు .తన భాణాన్ని’’కోష్యేష ప్రచురే గిరం మధురిమా కోప్యార్ధ గంభీరిమా –సర్వం నూతన మేవ సూత్రితమహో యన్నాన్య సాధారణం –భాణో స్మిన్ కవినాసయే సుమహాన్ భాగ్యస్య పాకోహినః ‘
కాళిదాస కుమార సంభవాన్ని గుర్తుకు తెస్తుంది .శ్రీరంగ నాద దర్శనానికి రధాలలో వచ్చే వివిధ దేశాలనుంచి వచ్చిన మహిళను చక్కగా వర్ణించాడు .ఘూర్జర ,నేపాల లాట దేశ స్త్రీలను వర్ణించాడు .చంద్రోదయం తో సమాప్తి చేశాడు .భరత వాక్యమూపలికాడు .అక్కడక్కడ ప్రాకృతం వాడాడు .చివరి శ్లోకం –
‘’దేవః పంచ శరః ప్రపశ్యతు వియుగ్దీనాన్ దయాలోకితే –స్స్వాన్న్కాంతా నను గృహ్నతాంమృగ ద్రుశ స్సంత్య క్తమా నాస్శ్వయం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు
జనన విద్యాభ్యాసాలు
ఆధునిక కాలం లో గీర్వాణ భాషలో లోతైన పాండిత్యం కలిగి మహా ప్రతిభావంతంగా కావ్య రచన చేసి ఆంద్ర దేశానికి చెందిన అసలైన పీఠంఅయిన పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులుగా గౌరవం పొంది ,సహజ పాండితీ గరిమతో ,అరుదైన శాస్త్ర పాండిత్యం తో బహు గ్రంధ కర్తృత్వం తో వన్నె కెక్కిన అసమాన పండితకవులు ,మన విజయ వాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మగారు .శ్రీ గరిమెళ్ళ సూర్య నారాయణ ఘనాపాఠీ , శ్రీమతి సూర్య కాంతమ్మల దంపతుల పుత్రులు .తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటతాలూకా ‘’అవిడి ‘’గ్రామం లో 5-8-1950లో శ్రీ వికృతినామ సంవత్సర నిజాషాఢ శ్రీ కృష్ణాష్టమి నాడు జన్మించారు .సంస్కృతాంధ్రాలలో ఏం .ఏ .సాధించారు .
ఉద్యోగ సోపానం
తూర్పు గోదావరిజిల్లా అమలాపురం లోని ఎస్ .కే.బి ఆర్ .కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా1979నుండి 89వరకు పని చేశారు.తర్వాత విజయ వాడ కే బి యెన్ కళాశాల లో 1989-నుండి 2007వరకుతెలుగు ఉపన్యాసకులుగా సేవలందించారు. ఉద్యోగ విరమణానంతరం విజయవాడలో స్థిర పడ్డారు .
వివాహం సంతానం
సోమయాజులు శర్మగారు ముమ్ముడివరం కు చెందిన శ్రీ నూకల శ్రీ మన్నారాయణ ,శ్రీమతి రాజేశ్వరి దంపతుల కుమార్తె శ్రీమతి రాజ్య లక్ష్మి గారిని 1996లో వివాహ మాడారు .ఈ దంపతుల వంశోద్ద్దారకుడు ,కులదీపకుడు రవి తేజస్సుతో విరాజిల్లే ఛి సూర్య తేజ.
అందుకొన్న బిరుదులూ ,పదవులు
శాస్త్ర సాహిత్యాలలో సోమయాజులుగారి ప్రతిభ కు గుర్తింపుగా శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పండితులుగా గౌరవ స్థానం లో ఉన్నారు .కృష్ణాజిల్లా అధికార భాషా సంఘ .సభ్యులు .
సోమయాజులు శర్మగారుపొందిన ‘’సహజ పాండిత్య ‘’బిరుదం అన్వర్ధం..శ్రీ పుష్పగిరి శంకరాచార్య స్వామి ‘’విద్యా విభూషణ ‘’బిరుదునిచ్చి సత్కరించారు .విజయవాడ దేవీఫౌందేషన్ వారు ‘’తత్వ శాస్త్ర పారంగత ‘బిరుదు ప్రదానం చేసి సన్మానించారు .
ప్రవ్రుత్తి
సంస్కృతాంధ్ర భాషలలో శాస్త్ర ,కావ్య గ్రంధ రచన .పుష్పగిరి పీఠ చాతుర్మాస్య సమయం లో అవధానాలు నిర్వహించటం .అముద్రిత తాళ పత్ర, లిఖిత గ్రంధ సేకరణ ,వాటిని పరిష్కరించి శుద్ధప్రతులను తయారు చేసి భద్ర పరచటం ,సాహిత్య ,ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారి ప్రస్తుత ప్రవ్రుత్తి ,వ్యాసంగం .
గబహుగ్రంద కర్త
శ్రీ సోమయాజులు శర్మగారు అనేక గ్రంధాలను గీర్వాణ ,ఆంధ్రాలలో రచించారు .అన్నీ ప్రసిద్ధి చెందినవే .
సంస్కృత రచనలు
1–ద్వాదశీ వ్రత మహాత్మ్యం (అంబరీషోపాఖ్యానం )-దీన్ని మైసూరు సుధర్మ సంస్థ ప్రచురించింది 2మహా భారత కంట కోద్దారః 3-కర్నాటసాహిత్య దర్శనం (హిస్టరీఆఫ్ కన్నడా లిటరేచర్ ఇన్ సాంస్క్రిట్ )
సంస్కృత లఘు కృతులు
1-శ్రీశైల లింగాష్టకం 2గోపాల కవేః కాలః 3-సుధార్మాభి నందనం 4-సమస్యా పూరణం 5-శ్రీ వినాయక పంచ రత్నం 6-అశ్వధాటీ వృత్త లక్షణ విచారః 7-శ్రీ వెంకటేశ్వర స్తుతిః 8-హల్లోహల శబ్దార్ధ విమర్శః 9-భట్ట వచనం సత్యమేవ 10-సుధార్మాభి వర్ధనం 11-శ్రీరామ నవమీ 12-ఆమోదః (శ్రీ మహేశ మాలా పీఠిక )13-కళావికాసః (పుష్ప బాణ విలాస పీఠికా )14-ఆనంద మందారః (బెల్లం కొండ రామ రాయ కవిః-అముద్రితం )15-అమృత సందేశః (మేఘ సందేశ పీఠికా)
తెలుగు రచనలు
పద్యకావ్యాలు –వాల్మీకి వృత్తాంతం ,శ్రీ వెంకటేశ్వర శతకం ,శ్రీ వెంకట రామ యశో వికాసం ,శివ మహాత్మ్యా ఖండం ,శివ కర్ణామృతం
లఘు పద్యకావ్యాలు –పంచ రత్నాలు ,సరస్వతీ దండకం ,దివాకర్ల ప్రశంస ,విశ్వనాధ మహా కవి ,శ్రీ రామ విభక్తి స్తవం ,వారణ మాల ,తెలుగు భాషా వైభవం ,ఉగాది పద్యాలు ,కర్షక నవ రత్న మాలిక .
శర్మగారు అనేక గ్రంధాలకు బృహత్ పీఠికలు రాశారు –ఆంద్ర మాఘానికి భూమిక ,శంకర విజయానికి ఆముఖం ,వాసుదేవ మననం కు ఉద్యోతం ,సూత సంహితకు న్యాసం ఆంధ్ర బ్రహ్మ సూత్రాలకు వేదాంత దర్శనం మొదలైన బృహత్ పీఠికలను ,13రాశారు .
లఘు పీఠికలు –కొప్పు లింగేశ్వర మహాత్మ్యం ,మోక్షసోపానం గాయత్రీ కల్ప వృక్షానికి వరివస్య విష్ణు సహస్ర నామ స్తోత్రానికి ప్రవేశిక ,మారుతి రామాయణానికి సంజీవని ,పరివ్రాజ చంద్రికకు విన్నపం మొదలైన 33గ్రంధాలకు లఘు పీఠికలు సంతరించారు .
వ్యాసాలు
శర్మగారు శర పరంపరగా వ్యాస వాహిని ప్రవహింప జేశారు .భాగవత సంపద ,ఈశాన సంహిత ,కల్ప వృక్షం –నావిక పరిభాష ,బెల్లంకొండ రామరాయ కవి ,కోన సీమ వాజ్మయ సేవ ,కల్ప వృక్షం –నాట్య శాస్త్రం ,సంగీత శాస్త్రం ,సమగ్రాంధ్ర సాహిత్య సమాలోచనం ,మకర సంక్రాంతి ,చత్వారి శృంగాః ,శ్రీ లంకా వెంకట రాయ శాస్త్రి ,ప్రయోగ రత్నమాల మొదలైన 37వ్యాసాలను వివిధ విషయాలపై రాసి వెలుగు నిచ్చారు .
అనువాదాలు
తరల సంగ్రహం ,తత్వ బోధ ,సర్వ సిద్ధాంత సంగ్రహం ,సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి ,తైత్తిరీయోపనిషత్ ,పరివ్రాజక చంద్రిక మొదలైన 6అనువాద గ్రంధాలు రాశారు .
వ్యాఖ్యాన లహరి
సోమయాజులు శర్మగారు అనేక కావ్యాలకు వ్యాఖ్యానాలు రచించారు .జగన్నాధ పండిత రాయల యమునాలహరికి గంగా లహరి ,విష్ణు లహరి లకు –అమృత ధారా వ్యాఖ్య ,అనులోమ విలోమ రాఘవ యాదవీయానికి –హరిప్రియా వ్యాఖ్య ,అశ్వ దాటీ కావ్యానికి –నవ వీధీ వ్యాఖ్య రచించి ఆ కవుల కవితా ప్రభావాన్ని తెలియ జేశారు .
పరిష్కరణలు
శ్రీ శర్మగారు గ్రంధ పరిష్కరనలోనూ తన ప్రతాపాన్ని ప్రదర్శించారు –సూతసంహిత ,శ్రీ భద్రాద్రి రామ శతకం ,శబర శంతన విలాసం ,భోగినీ దండకం ,స్తోత్ర ముక్తావళి ,తైత్తిరీయోపనిషత్ ,మైరావణ చరిత్రం ,కూచి మంచి సామ్బకవి రాసిన కుమారసంభవం మొదలైన 10 గ్రంధాలు పరిష్కరించి ప్రచురణకు తోడ్పడ్డారు .
అముద్రితాలు
సోమయాజులు శర్మగారి అముద్రిత గ్రంధాలు ముఖ్యం గా మూడున్నాయి అవి –కల్ప వృక్ష శిల్ప సమీక్ష ,ఆంద్ర పురాణ సమీక్ష ,పోతన కృతులు
గరిమెళ్ళ వారిరచనలపై పరిశోధనలు
1-గరిమెళ్ళ వారి పద్య కావ్యాలపై శ్రీ జి చలపతి రావు (నాగార్జున విశ్వ విద్యాలయం ),2-కర్ణామృత త్రయం –ఆంధ్రానువాదములు –తులనాత్మక పరిశీలన –శ్రీ షేక్ బాపూజీ (నా వి వి.)3-గరిమెళ్ళ సంపూర్ణ వాజ్మయం –శ్రీ పి.ఉమానాద శర్మ (బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం ) పరిశోధనలు చేసి పి.హెచ్ డి పొందారు .మేలు రచనలు గరీయంగా చేసి గరిమెళ్ళ వారు ఆంద్ర సాహిత్యాకాశం లో ప్రకాశిస్తున్నారు .వారు నిజంగా సాహిత్య యజ్ఞం చేసిన సోమయాజులు .మరిన్ని సార్ధక గ్రంధాలు వారు వెలువరిస్తారని ఆశిద్దాం .
ఈ రచనకు ఆధారం –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు స్వయంగా ఈ రోజు నాకు పోస్ట్ లో పంపిన వారి ‘’బయో డేటా’’వారి రచనలు .ఇందుకు వారికి కృతజ్ఞతలు .వారి చిరునామా ,ఫోన్ నంబర్ అందజేసిన శ్రీ రావి మోహనరావు (చీరాల )వారికి ధన్యవాదాలు.
సోమయాజులుగారి ఫోటో జత చేశాను చూడండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-15-ఉయ్యూరు
సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్
సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్
వివిధ సంక్షేమ కార్యక్రమాలలో సేవ చేసిన – సఘాల్ మన్మోహిని జట్షి
మూర్తీభవించిన మానవత్వంతో కార్మిక సంఘాలను నిర్వహించి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన సఘాల్ ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించి ,లాహోర్ లో ,పలుకుబడి ,అభ్యుదయ భావాలున్న నెహ్రూ కుటుంబ సభ్యురాలుగా పెరిగింది .ఆమె తండ్రి లాడ్లీ ప్రసాద్ జట్షి మోతీలాల్ నెహ్రూ కు మేనల్లుడు .ఆమె తల్లి ఫెమినిస్ట్ .మహిళా క్లబ్ లను నిర్వహిస్తూ దానధర్మాలలో ప్రసిద్ధి చెందింది .తల్లి లాహోర్ లోని య౦గ్ వుమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ .(వై .డబ్ల్యు .సి. ఏ.)లో సాయం తరగతులకు సైకిల్ మీద వెళ్ళేది .ఆ కాలంలో ఇండియాలో ఏ స్త్రీకూడా సైకిల్ తోక్కేదికాదు .ఈమెయే లాహోర్ లో ధైర్య సాహసాలతో సైకిల్ తొక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ .తనకూతురు సఘాల్ ను కూడా సైకిల్ తొక్కటమే కాదు, గుర్రపు స్వారీ కూడా చేయమని ప్రోత్సహించేది .తన నలుగురు కుమార్తెలను ఉన్నత విద్య నేర్వమని హితవు చెప్పింది .సఘాల్ లాహోర్ లో హిస్టరీ లో 1929లో ఏం. ఏ. పాసైంది .
మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ పిలుపు నివ్వగానే సఘాల్ బహిరంగ సభలలో మాట్లాడి జనాన్ని ఉత్తేజ పరచి ఉద్యమ భాగ స్వాములను చేసేది .తల్లి ఇద్దరుసోదరిలతో సహా 1930-32కాలం లో తీవ్రమైన ఉద్యమాలు నడిపి కాలనీ ప్రభుత్వం పై ప్రజాగ్రహాన్ని నిరూపించింది .ఆమె చేబట్టిన ఆందోళనలు ఎప్పుడూ అహింసా యుతంగానే శాంతియుతంగానే ఉండేవి .చట్ట ధిక్కారం ఉండేదికాదు .1935లో కాంగ్రెస్ కు చెందిన ఒక మహిళా విద్యాలయం ప్రిన్సిపాల్ గాబీహార్ రాష్ట్రం లో పని చేసింది .అక్కడ అనేక సంస్కరణలు అమలు పరచింది .వయసుమళ్ళినవిద్యార్ధినులకు ఫిజికల్ ఫిట్ నెస్ క్లాసులు నిర్వహించింది .దీన్నిఆడపిల్లల కుటుంబాలు వ్యతిరేకించాయి . .
సఘాల్ 1935లో వివాహం చేసుకొని బొంబాయ్ వెళ్లి అక్కడ మహిళా కార్యక్రమాలలో పాల్గొన్నది .1947లో భారత దేశం స్వాతంత్ర్యాన్ని పొందిన తొలి రోజుల్లో ఆహార కొరత తీవ్రంగా ఉండేది .అప్పుడామే అఖిలభారతమహిళా కేంద్ర ఆహార సంస్థ సభ్యురాలైంది .బియ్యం ,గోధుమలకు తీవ్ర కొరతగా ఉన్న ఆకాలం లో ఢిల్లీ లో ఒక కాంటీన్ నిర్వహించి గోధుమ బియ్యం లేకుండా మిగిలిన ఆహారపదార్ధాలతో ఆహారం అందజేసేది .భారత దేశ స్వాతంత్ర్యం తర్వాత ఇండియా పాకిస్తాన్ విభజన వలన పాకిస్తాన్ నుంచి వలసవచ్చిన వేలాది శరణార్ధులను ఆదుకొనే బృహత్తర కార్య క్రమం మీద వేసుకొంది.భారత ప్రభుత్వ పునరావాస శాఖలో నెలకు ఒకే ఒక్క రూపాయి జీత౦ మాత్రమే తీసుకొంటూ ఆదర్శం గా అందులో సేవలందించింది సఘాల్ .వచ్చిన మహిళలకు ,పిల్లలకు ఆశ్రయాలు నెలకొల్పి సహాయం అందించింది .
పాకిస్తాన్ నుండి ఉద్యోగాలు కోల్పోయి వచ్చిన శరణార్ధుల మనుగడకోసం వారికి అప్పులు ఇప్పించటం లోను ,వారికి ఆర్ధిక సాయం చేయటం లో చొరవ చూపింది . వారు స్టిరపడి ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని జీవి౦చేదాకా సహాయం కొనసాగించింది .తర్వాత ఇండియన్ వుమెన్స్ క్రాఫ్ట్ సొసైటీ ప్రెసిడెంట్ అయింది .మంత్రివర్గం నుండి 1954లో రాజీనామా చేసి మరింతగా సంక్షేమ కార్య క్రమాలలో పాల్గొన్నది .
1952ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది .ఇక శక్తి యుక్తులన్నిటి ని కార్మిక సంఘాల వ్యవస్థీకరణ కోసమే వినియోగించింది .ఉత్తర భారత రైల్వే ఉద్యోగ సంఘానికి చైర్ పర్సన్ అయింది .మత్స కారుల సంఘం ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడింది .రక్షణ మంత్రిత్వ శాఖ లోవర్ డివిజన్ క్లార్క్స్ యూనియన్ అధ్యక్షురాలుగా ఎన్నికైంది .కార్మికులు ఉండే ప్రదేశాలలో మంచి సౌకర్యాలను కలిగించటానికి ,అక్కడ పారిశుధ్యాన్ని మెరుగు పరచటానికి శక్తి యుక్తులు ధార పోసిన ధీర సేవా మహిళ సఘాల్ .వారి కాలనీలలో రక్షిత మంచి నీటి సరఫరా చేయించింది .అధిక రుణాలతో ఇబ్బందిపడే కార్మికులకు ఉదారం గా అప్పులు మంజూరు చేయించేది .సాంఘిక సంక్షేమ పునరావాస దైరెక్ట రేట్ కు గౌరవ డైరెక్టర్ గా నియమింప బడింది .ఈ పదవులన్నీ ఆమె చేసిన సేవలకు ప్రతిఫలాలుగా వచ్చినవే పైరవీలతో పొందినవికావు .
1973లో ఢిల్లీ ‘’నేషనల్ ఫెడరేషన్ఆఫ్ ఇండియన్ వుమెన్ ‘’ లో చేరి గృహ హి౦స లకు పాల్పడిన భార్యలను కావాలని అగ్నికి ఆహుతి చేయబడిన స్త్రీలను సంరక్షించే కార్యక్రమం లో చురుకుగా పాల్గొన్నది . భార్తలచే బహిష్కృతులైన భార్య పిల్లల పాలిటి ఆపద్బాందవి అయింది .వారు స్వయం ఉపాధి పై జీవించ టానికి సహాయ పడింది .ఆర్ధిక౦గా ఆసరా నిచ్చింది .’’ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ‘’(భారత శిశు సంక్షేమ శాఖ )లోపనిచేసి ,వారి ఉన్నతవిద్యాభ్యాసానికి అన్నివిధాలా సహకరించింది .వారిని దత్తత తీసుకొని బాధ్యతగా పెంచుకొనే వారిని గుర్తించి అ ఆపిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది .వారికోసం1950లో ‘’ఆర్య అనాధాలయం ‘స్థాపించి పోషకురాలుగా ఉంది .అందులో 600 మందికి ఆశ్రయం కలిపించిన వదాన్యురాలు .
ఢిల్లీలోని కామన్ వెల్త్ వుమెన్స్ అసోసియేషన్ లో 45ఏళ్ళు వైవిధ్యమైన సేవలను అందించింది .ఢిల్లీ కుటుంబ నియంత్రణ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా తొమ్మిదేళ్ళు ఉన్నది .’’ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ‘’ప్రెసిడెంట్ గా సఘాల్ విశేష సేవలు అందజేసింది .1990లో ఢిల్లీ లో వర్కింగ్ మెన్ హాస్టల్ నిర్మాణ పర్య వేక్షణ చేసింది .బహువిధ సేవాకార్యక్రమాలలో జీవితాన్ని పరిపూర్ణం చేసుకొన్న సఘాల్ 85ఏళ్ళు జీవించి 1944 లో మరణించింది .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96
42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్
నిష్కపట యదార్ధ వాది,నిష్కర్షక విమర్శకుడు అనే రెండే రెండు మాటలతో హెచ్ జి వేల్స్ ను ఆవిష్కరించవచ్చు .1936లో 70వ ఏట ఆయన ‘’The Late H ..G. Wells’’ పేరిట రాసుకొన్న ఆయన జీవితచరిత్రను లివింగ్ ఏజ్ ప్రచురించింది .అప్పటికి ఆయన ఎంతో ఆరోగ్యంగా జీవించే ఉన్నాడు .తన చరిత్ర ‘’పోస్ట్ మార్టెం ఎస్టిమేట్ ‘’అని చెప్పుకొన్నాడు .అందులో మొదటి పేరా లో ‘’నిన్నమధ్యాహ్నమే గుండె జబ్బుతో97వ ఏట చనిపోయిన హెచ్ జి వెల్స్ పేరు ,యువత తో సాన్నిహిత్యం కలిగి ఉంటుంది .మధ్య వయస్కుల జ్ఞాపకాలు ఈ శతాబ్దపు ప్రారంభాన్ని ,ఆయన రాసిన పుస్తకాలను వాటి పేర్లను గుర్తుంచుకొంటారు .అతని రచనలను మననం చేసు కొంటారు . చాలా పుస్తకాలు రాశాడు .విలువైన విమర్శ గ్రంధాలు రాశాడు .తనపై గ్రందాలెన్నో వచ్చాయి సాహిత్యాకాశం లో మిలమిల మెరిసే తార .తనను తాను రోజర్ బేకన్ తో పోల్చుకోవటం భేషజమే .అతని మూలాలు సాధారణమైనవే .తండ్రి ఒక తోటమాలి .తర్వాత చిన్న దుకాణానికి యజమాని మాత్రమేకాక క్రికెట్ ప్లేయర్ .అతని తల్లి ఒక ఇన్ కీపర్ కూతురు .పెళ్ళికాక ముందు సర్వెంట్ మెయిడ్ .వెల్స్ లు ఎప్పుడూ ఈ సాంఘిక నిమ్నతను గురించి ఆలోచి౦చలేదు .కొత్తప్రపంచం లో స్వేచ్చా పౌరుడు .అతను లిబరల్ డెమొక్రాట్ .ఆలోచించే,విమర్శించే ,చర్చించే అనంత స్వేచ్చ హక్కూ ఉన్నవాడు .సోషలిస్ట్ .వర్గ జాతీయతలఆధిపత్యానికి వ్యతిరేకి ‘’ అని రాసుకొన్నాడు వెల్స్.ఇదీ అతని ప్రత్యేకత .
ముగ్గురుసోదరులలోచిన్నవాడైన హెర్బర్ట్ జార్జి వెల్ల్స్21-11-1866లో కెంట్ లోని బ్రామ్లీ లో పుట్టాడు .తన పుట్టుక లోని నిమ్నాస్తాయిని గూర్చి ఆలోచించలేదు అంతే కాదు కింది మధ్యతరగతి జనం విషయం కూడా ఆయనకు పట్టేదికాదు.పుట్టుకతో వచ్చిన’’ కాక్నీ ఉచ్చారణ ‘’మాత్రం మర్చి పోలేదు .చనిపోయే ముందు ‘’I may be scientific aristocrat ,but I am no gentleman ‘’అని నిర్భయం గా చెప్పాడు .’’బార్టీ’’అనే ముద్దు పేరున్న వెల్స్ ప్రాధమిక విద్య పెద్దగా లేదు .అతి పేదకుటుంబం కనుక చదువుకొనే స్తోమత లేదు ఇది అతన్ని జీవితాంతం బాధించింది .తండ్రి దుకాణం లో సహాయం చేస్తూ ఉండచ్చునను కొన్నాడు .కాని విధి వశాత్తు ఎనిమిదో ఏట కాలు విరిగింది .విశ్రాంతి తీసుకొంటూ ఆరోగ్యాన్ని చక్క బరుచు కొంటూ దొరికిన పుస్తకాలన్నీఆబగా చదివాడు .డికెన్స్ ,వాషింగ్టన్ ఇర్వింగ్ ,రచనలు ఆపోసన పట్టాడు .కాని స్కాట్ నవలలు బోర్ కొట్టించాయి. అయినా ష్కాట్ నవలలు ‘’మర్మియాన్ ‘,ది లేడీ ఆఫ్ ది లేక్’’మొత్తం కంఠస్తం చేశాడు .గడగడా అప్ప చెప్పేవాడు .
చదివే అలవాటే తనకు గొప్ప రక్షణ నిచ్చిన్దన్నాడు .13వ ఏట ఒక కెమిస్ట్ దగ్గర సహాయకుడిగా చేరాడు .కొంతకాలం బట్టల కొట్లో ఉన్నాడు .పనులు చేస్తూ ఖాళీ సమయాలలో క్లాసులకు వెడుతూ 15వ ఏట మిడ్ హర్స్ట్ గ్రామర్ స్కూల్ లో’’ డోర్ కీపర్;;గా చేస్తూ చదువు కొన సాగించాడు .18వ ఏట లండన్ లోని సౌత్ కేన్నిన్ టన్ లోఉన్న కాలేజ్ ఆఫ్ సైన్స్ లో చేరటానికి స్కాలర్షిప్ ఆఫర్ పొందాడు .అక్కడ ప్రపంచ ప్రసిద్ధ బయాలజిస్ట్ థామస్ హుక్స్లీ వద్ద నిద్య నేర్చాడు .ఖాళీ సమయాలలో వెనక బడిన విద్యార్ధుల అసైన్ మెంట్లు చేసి డబ్బు సంపాదించేవాడు .టీచర్ గా పని చేయటానికి సిద్ధ పడ్డాడు .21వయసులో లండన్ యూని వర్సిటి నుంచి డిగ్రీ చేతికొచ్చింది .అండర్ గ్రాడ్యుయేట్ గా ఉన్నంతకాలం ఎప్పుడూ ఆకలితో అలమటిస్తూ ఉండేవాడు .చాలినంత తినటం అసలు ఉండేదేకాదు .గుంటకళ్ళు ,పాలిపోయిన ముఖం ఎముకల పోగుగా అప్పుడు ఉండేవాడు వెల్స్.తర్వాత మనం చూసే వెల్స్ ఫోటోలకు ఆనాటి వెల్స్ ఫోటోలకు హస్తి మశకాంతర భేదం ఉంటుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-12-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 30-ఏలేశ్వరపు గోపాల
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
30-ఏలేశ్వరపు గోపాల
ఏలేశ్వరపు వెంకటలక్ష్మి ,సుబ్బరాయలపుత్రుడే గోపాల .కౌశికస గోత్రం .’’యుదిష్టిరాశ్వమేద చంపు ‘’కర్త..ధర్మరాజు చేసిన అశ్వమేధ కద.మూలం జైమిని భారతం .హలయాస క్షేత్ర మీనాక్షీ సుందరేశ్వరుల భక్తుడు .మీనాక్షీ దేవిని స్తుతిస్తూ చెప్పిన శ్లోకం –
‘’శ్రీ హాలస్య వసున్ధరానివాసతే రీశస్య మోదప్రదా-మీనాక్షీ కరుణా కటాక్ష సరణిర్మా౦ పాతు సా సతతం ‘’
కవిని ఇతర కవులు పొగిడి ఈ కావ్యాన్ని రాయమని కోరిన శ్లోకం –
‘’మీనాక్షీ వరలబ్ద దివ్య కవితా ధారా సుధా రాశింస౦ -భూతా గణ్య మహా ప్రచండ రచనా పాండిత్య సర్వంకషం
శ్రేస్టే జైమిని భారతే సురుచిరం పర్వాశ్వ మేధం మహా –కావ్యం త్వం కురు గద్య పద్య మయమిత్సేతే ప్రహృష్టా ధియః ‘’
ఈ శ్లోకాలలో కవి బహు గ్రంధ కర్త అని ధారా శుద్ధి కలకవి అని తెలుస్తుంది .కాని యుదిష్టిర చంపు తప్ప ఏదీ లభ్యం కాలేదు కవి చేసిన హస్తినాపుర వర్ణన –
‘’ఆస్తి శ్రీ భారతాన్వవాయ జనుషాంరాజ్ఞాం జ్వలత్సేజసం –సంపజ్జాలా వినిర్జితా మరపురీ శ్రీ హస్తి నాఖ్య పురీ .
చివరలో ఉన్న శ్లోకం –
‘’మైలో రత్నమయం కిరీటమమలం పార్శ్వేనుజాతన్యదా –చిత్తే భూత దయాం కరే వితరణం బాహో ప్రతాపశ్రియం
జిహ్వాగ్రే హరి కీర్తనం విరచయన్ ధర్మాత్మ జాతో ముహుః-సా మోదేనసహాత్యుతేనశకలం గోపాయతి స్మశ్రితిం ‘’
తన వంశ చరిత్రను చివర్లో చెప్పుకోన్నాడుకవి .
‘’శ్రీమత్స్కౌశిక గోత్ర పావన మహా ఏలేశ్వరా ఖ్యాన్వయ-మ్భో జా హస్కరతేజస్య కవి సుత శ్రీ సుబ్బయాదీ౦దునా
శ్రీ మద్వేంకట శబ్దపూర్వ విలసల్లక్ష్మాంబికా గర్భాస –ద్రత్నే నేదమ కారీ చంపు కవినా గోపాల నామ్నా ముదా ‘’
గోపాలకవి పుట్టిన చోటు ,కాలం తెలియదు .ఏలేశ్వర పు వారు ప్రసిద్ధ బ్రాహ్మణులు ఏలేశ్వరం పవిత్ర క్షేత్రం కూడా .అందులో ఏలేశ్వరోపాధ్యాయులు గొప్ప సంప్రదాయ విద్యా వేత్త .సూక్తి వారధి రాసిన పెద్దిభట్ట కూడా ఇక్కడివాడే.నల్గ్గొండ జిల్లా కృష్ణానదీ తీర నివాసులు ఏలేశ్వరపు వారు .
31శ్రీ రంగ నాధ ప్రబంధ కర్త –ఆంద్ర రత్న దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య (1889-1928)
దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య2-6- 1889లో కోదండ రామ స్వామి సీతమ్మ దంపతులకు జన్మించాడు .పుట్టిన మూడవరోజు తల్లిని ,మూడవ ఏట తండ్రిని కోల్పోయిన దురదృష్ట వంతుడు .పినతండ్రి నాయనమ్మల దగ్గర కూచి పూడి గుంటూరు లలో చదివాడు..హైస్కూల్ చదువులోనే ‘’జాతీయ నాట్య మండలి ‘’స్థాపించి సగీత నాటక కార్యక్రమాలు చేసేవాడు .చదువు పై శ్రద్ధ తగ్గి మెట్రిక్ తప్పి బాపట్ల లో చేరి పాసైనాడు . రాజకీయ దురంధరుడు రామ భక్తుడు,సాహసి నిక్కచ్చిమనిషి . .హరితస గోత్రం .1906 వరకు గుంటూరులో చదివాడు .కాలేజి విద్యార్ధిగా ఉండగానే బాలగంగాధర తిలక్ అరవిందుల ప్రభావానికి లోనయ్యాడు నడింపల్లి నరసింహా రావు అనే స్నేహితుని సాయం తో .ఇంగ్లాండ్ వెళ్లి ఎడిన్ బర్గ్ లో 1911-16వరకు అయిదేళ్ళు చదివి ఏం ఏ డిగ్రీ పొందాడు .అక్కడ ఉండగానే ప్రముఖ శిల్పి వేదాంతి చిత్రకారుడు ఆనంద కుమార స్వామితో పరిచయమైంది .ఆయన శిష్యరికం లో తనను తానూ తీర్చి దిద్దుకొన్నాడు గోపాల క్రిష్నయ్య .నందికేశ్వరుడు రాసిన ‘’అభినయ దర్పణం’’ను ఆనందకుమార స్వామితో కలిసి ‘’ది మిర్రర్ ఆఫ్ గెస్చర్’’పేరుతొ ఇంగ్లీష్ లోకి అనువదించాడు .ఇది కేంబ్రిడ్జి –హార్వర్డ్ యూని వర్సిటీ ప్రచురితం .ఇండియా తిరిగి వచ్చి రాజమండ్రి ట్రెయింగ్ కాలేజి లో 1917నుండి ఒక ఏడాది లెక్చరర్ గా పని చేశాడు .తర్వాత 1918-19కాలం లో బందరు జాతీయ కళాశాలలో విద్య నేర్పాడు .ఎక్కువ కాలం ఇక్కడ ఉండకుండా చీరాల పేరాల దగ్గర ‘’ఆంద్ర విద్యా పీఠ గోష్టి’’అనే విద్యా సంస్థను స్థాపించాడు .గాంధీ మహాత్ముని పిలుపు నందుకొని స్వాతంత్ర్య ఉద్యమం లో చేరాడు .ప్రజలకు నచ్చ చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమం లో భాగస్వాములను చేశాడు .భారత జాతీయోద్యమ నాయకులలో ముఖ్యుడైనాడు .ఉద్యమాలలో అరెస్ట్ అయి ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాడు .’’శ్రీ రామ దండు ‘’అనే ‘’ఆధ్యాత్మిక జాతీయ స్వచ్చంద దళాన్ని’’ తయారు చేశాడు.ఆనాటి కాంగ్రెస్ సభలకు వీరే రక్షక భటులు .జైలు నుండి విడుదలకాగానే సాంఘిక సంస్కరణ లకు శ్రీకారం చుట్టాడు .గోపాల క్రిష్నయ్య మహా వక్త .ఆంగ్లాన్ద్రాలలో అనర్గళంగా మాట్లాడే నేర్పున్నవాడు. నాగస్వరానికి పాములు పరవశమైనట్లు గోపాల క్రిష్నయ్య గారి ఉపన్యాసానికి జనం ముగ్దులయ్యేవారు .వేలాది జనం పాల్గొన్న సభలలో ఆయన కంచు కంఠం తో జనాలను ఉత్తేజ పరచేవాడు కర్తవ్య బోధ చేసేవాడు .జానపద కళా రూపాలఉద్ధరణకు గ్రంధాలయోద్యమానికి విశేష కృషి చేశాడు .ఆయన ప్రోత్సహించిన జానపద కళారీతులు –తోలుబొమ్మలాటలు ,జముకుల కద ,బుర్ర కద ,వీధినాటకాలు సాము గరిడీలు ,గొల్లకలాపం బుట్టబొమ్మలు ,కీలుగుర్రాలు ,నాటకాలు ,గోసంగి గురవయ్యలు ,సరదాకద ,కిన్నెర కద కొమ్ము బూర జోడు మద్దెల ,పల్లె సుద్దులు తూర్పు భాగోతం ,చుట్టుకాముడు ,పిచ్చుక కుంటల కద ,సాధనా శూరులు ,పల్నాటి వీరులు మొదలైనవెన్నో .
ఆంగ్ల ప్రభుత్వం చీరలా పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినపుడు వ్యతిరేకించి పెద్ద ఉద్యమం నడిపాడు .ప్రజలను ఖాళీ చేయించి ప్రభుత్వా దృష్టికి తెచ్చాడు.. ఆయన చేసిన చీరాల పేరాల పోరాటం చిరస్మరణీయం .
గోపాల క్రిష్నయ్య సర్వోత్క్రుస్టకవి, దేశభక్తుడు ,సంస్కర్త విమర్శకుడు . .గీర్వాణ ఆంధ్రాలలో గోపాలకృష్ణయ్య రాసిన కవిత్వం ఆయన పాండిత్యానికి మచ్చుతునకలు .’’సమకాలీనులలో మహా జీనియస్ ‘’అన్నాడు ఆయన్ను కట్టమంచి రామ చంద్రా రెడ్డి .1921లో గుంటూరు సభలో గోపాల క్రిష్ణయ్యకు ‘’ఆంద్ర రత్న ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .దురదృష్ట వశాత్తు 40ఏళ్ళ వయసులోనే 10-6-1928 నమరణించాడు
శ్రీరంగం లోని రంగ నాద స్వామి పై ‘’శ్రీ రంగ నాద ప్రబంధం ‘’సంస్కృతం లో రచించాడు గోపాల క్రిష్నయ్య .మహా కవుల శైలికి ఏ మాత్రం తగ్గకుండా అర్ధ గాంభీర్యం తో కవితా పాటవం తో వెలసిన కావ్యం ఇది .అందులోని కొన్ని శ్లోకాలు –
‘’కదా వా కావేరీ విమల సలిల ప్రాంగణా౦ ట-చ్చ్రుమ్భాద్గ తమిళ హృదయ ధ్వాంత దలనం
తనో త్యా తిధ్యం మే నిజ సదసి బందా చ్యుతి యుతో –ముహూర్ర్తేత్యా క్రోశన్నిమిష న్నివనేష్యామి దివసన్ .
‘’శ్రీ రంగేశ కృపాలో తమిళ జన సభాధ్యక్ష దీక్షాంత రంగం –స్వరాజ్యానంద నిద్రా పరవశా ద్రుతముత్తిస్ట భో రంగ నాయక
త్రేతాయాం రామ చంద్ర కృతి ద్రుత భవతా ప్రీణితై వాంధ్ర భూమి –స్త్వాన్ద్రోహం కర్త మానాం తవ భవన కధాం వక్త్రు మత్రాగతోసమి ‘’
ఇదికాక సంస్కృతం లో చాటువులు చాలా రాశాడు .గీర్వణ౦ లో ఆంగ్ల పదాలను చేర్చి జైలు నుంచి తిరిగి రాగానే మద్రాస్ లో బహిరంగ సభలలో మాట్లాడాడు –మచ్చుకి ఒకటి
‘’న యాచే’’ రిఫారం’’ నవా’’ స్టీలు ఫ్రేముం’’ న ‘’కౌన్సిల్ ‘’న తు ‘’ప్రీవీ కౌన్సిల్’’పదం వా-స్వరాజ్యార్తి హంతాంగ్లరాజ్యే నియంతా ,’’ఫరంగీ ‘’ఫిరంగీ ‘’ద్రుడన్గ౦గే కరోతు ‘’ ఇది జగన్నాధ పండిత రాయల ‘’నయాచే రాజాలిం న వా వాజి రాజిం ‘’ కవిత్వానికి అనుకరణ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-15-ఉయ్యూరు
’















