‘ మా అన్నయ్య ”ఆత్మీయ కవితా స్రవంతి-7

33-అందరికన్నా నా అన్న మిన్న –శ్రీ చింతపల్లి వెంకట నారాయణ –కైకలూరు -9441091692

త్రేతాయుగం లో లక్ష్మణుని అన్న శ్రీ రాముని కన్నా

ద్వాపర యుగం లో శ్రీ కృష్ణుని అన్న బలరాముని కన్నా

కలియుగం లో శ్రీనివాసుని అన్న గోవిందరాజుల కన్నా

వర్తమాన కాలం లో తెలుగు యువత అన్న ఎన్ .టి.ఆర్ .కన్నా

నా అన్న నాకు మిన్న –వేరెవరూ సాటి రారన్నా .

Posted in కవితలు | Tagged | Leave a comment

ఉయ్యూరు -విష్ణాలయం లో విశేష పూజలు ఏం .ఎల్.సి శ్రీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె ఛి సౌ శ్వేత వివాహం 20-4-16బుధవారం సందర్భం గా ఈ రోజు 13-4-16బుధవారం ఉయ్యూరు శ్రీ విష్ణ్వాలయం లో శ్రీ రుక్మిణీ కల్యాణం చేసిన దృశ్యా మాలిక Translate

This gallery contains 129 photos.

More Galleries | Tagged | Leave a comment

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం )

cr2 001 cr1 001సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం )

సంపాదక చక్ర వర్తి సి రా .గారి’’ సిరా’’, అభిరుచి ,ప్రవృత్తీ,జీవనాధారం సంపాదకీయ రచనే .ఈ రచనలో క్లుప్తత స్పష్టత నిబద్ధత ,వార్తవిలువ,సమకాలీనత ప్రతి బి౦బిస్తాయి .నిష్టగా ఇష్టం తో రాశారు .సుమారు 5వేల సంపాదకీయాలు రాశారు .పత్రికా భాషగా తెలుగు ,పోతన జీవన రీతిలో నీతి ,పత్రికలూ ,పరిణామం ,ప్రయోజనం వంటివి అమూల్యాలని పించాయి .’’పత్రికకు సంపాదకత్వం వహించేది సంపాదకుడో,అడ్వర్ టైజ్ మెంట్ మేనేజరో తెలియటం లేదు ‘’అని నిజాన్ని నిర్భయంగా చెప్పారు .సంగీత సామ్రాజ్ఞి ఏం ఎస్ అంటే మహా అభిమానం .ఆమె సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గేయాలను పాడి యువతకు మార్గ దర్శనం చేశారని మెచ్చుకొన్నారు .ప్రజా హక్కుల సాధనకోసమే ఆయన కలం పనిచేసింది .ప్రలోభాలకు లొంగని వ్యక్తిత్వం ఆయనది

సి రా .ఒక విజ్ఞాన సర్వస్వంగా భాసించే వారు .తాపీ ధర్మారావు ,విజయ లక్ష్మి ,చింతామణి ,కాశీనాధుని  ,స్మారక అవార్డులను అందుకొన్నారు .సిద్ధార్ధ కళా పీఠం,రాష్ట్ర ప్రభుత్వం ,రామినేని ఫౌండేషన్ ,మద్రాస్ తెలుగు అకాడెమీ వీరిని ఆహ్వానించి ఘన సన్మానం చేశాయి .జాతీయ సమైక్యతా పురస్కారం అందుకొన్నజర్నలిస్ట్ సరస్వతి ఆచారి గారు .సాటి పత్రికా సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు వీరిని ‘’త్యాగధనుడు ‘’అని కీర్తించారు .తమ విశ్వాసాలతో ఏకీభవించని వారితోనూ కలిసి మెలిసి సంచరించే విశాల హృదయం ఆయనది .ఇదే అరుదైన వ్యక్తిత్వం .అతిసున్నిత మనస్తత్వం ఆయనది .’’అక్షర శాస్త్ర దారి ‘’ అయిన ఆయన కలానికీ గళానికీ విపరీతమైన శక్తి ఉంది .మౌనంగా కళా సాహిత్యార్చన చేసే సంస్కారి .సంస్కరణ వివాహాలు వీరి చేతుల మీదుగా వెయ్యి కి పైనే జరిగాయి .వివాహ పరమార్ధాన్ని అతి తేలిక మాటలతో వివరించి చెబుతూ జరిపించే వీరి పధ్ధతి సర్వ జనామోదమైంది .విశాలాంధ్ర సంస్థాపకులు శ్రీ మద్దూరి చంద్ర శేఖర రావు ఉపన్యాసాల పరంపరకోసం ప్రముఖ పాత్రికేయులైన ఏం. చలపతిరావు గారిని ఆహ్వానించి ప్రారంభం చేయటం ఆయన విశాల దృక్పధానికి గొప్ప నిదర్శన .వీరి సంపాదక ప్రతిభను గుర్తించిన ఈ నాడు సంపాదకులు శ్రీ రామోజీ రావు పొత్తూరి వారితో వీరిని తమ పత్రికలో పని చేయమని ఆహ్వానం పంపగా సున్నితంగా ‘’ఎందుకు లెండి ‘’అని తిరస్కరించిన నిబద్ధత వారిది . నిరాడంబరతకు నిజరూపం ,విలాసాల మీద మోజు లేని వారు .కమిటెడ్ కమ్యూనిస్ట్ .

సంస్కృతం ఎకానమీ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ కు ఉదాహరణ .శ్లోకాలు తేలిగ్గా గుర్తుంటాయి అని మెచ్చుకొన్నారు .గొప్ప పద ప్రయోగ శైలి వారిది .”’Fundamentals of Bharata  Natya  Shastra ‘’కు ముందుమాట రాస్తూ ‘’శతాబ్దాలుగా కళ నే నమ్ముకొని ,ప్రచారం చేస్తూ ,కూచిపూడి వారు చేసిన కృషి అనన్య సామాన్యమైనది ‘’అన్నారు .సమాజం లోని అన్ని కోణాలను స్ప్రుసించే కవిత్వం అమృతం కురిసిన రాత్రిలో దేవరకొండ బాల గంగాధర తిలక్ రాశాడని చెప్పారు .వట్టికోట ఆల్వార్ స్వామి ,దాశరధి ,కరుణశ్రీ , లపై గాఢమైన మమకారమున్నవాడు ఉద్యమ కవితగా ప్రసిద్ధి చెందిన వేములపల్లి శ్రీ కృష్ణ గేయం ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’అంటే వీరాభిమానం .పుట్టపర్తి వారి శివ తాండవం చదివి పులకించిన సంస్కారి .అందులో ‘’హరియే హరుడై ,లచ్చి అగజాత యై సరికి సరిగ ,హరులోన హరి చూసి ,హరి యందు హరు జూసి ,భేద భావన లెల్ల బ్రదిలి పాడేనమ్మా భవుడు ‘’,అన్న రచనలో అద్వైత సిద్ధి కనిపిస్తుంది .నటరాజ తాండవానికి జగన్మాత లాస్యానికి అందె అద్వైత౦  దర్శన మిస్తుంది .ప్రతీకాత్మక మైన సంప్రదాయ వాదన విచ్చుకొని ,,చూడ గల లోచూపు గల వ్యక్తీ ,సంఘం ,సాహిత్యం ,జీవితాల పరస్పరాశ్రయాను బంధాల ఏకాత్మతా బంధం సాక్షాత్కరిస్తుంది ‘’అని విశ్లేషించిన సంస్కారి .

విద్యా వైద్య ,రాజకీయ ,న్యాయ చట్ట విషయాలెన్నిటి పైనో వేలాది వ్యాసాలూ రాసి మనసుకు హత్తుకోనేట్లు చేసిన హృదయవాది ,అభ్యుదయ వాది.. శ్రీ జువ్వాది గౌతమ రావు గారు విశ్వనాధ కల్ప వృక్షం లో ని పద్యాలను రెండుగంటలకు పైగా బెజవాడ రామ మోహన గ్రంధాలయం లో అచ్చగా విశ్వనాధ పాడినట్లే పాడుతుంటే రాఘవాచారిగారు ఆ రెండు గంటలు తన్మయ స్థితి లో వినటం నేను చూశాను .కార్యక్రమం అవగానే వారిని  ‘’మీరు కమ్యూనిస్ట్ ,విశాలాంధ్ర సంపాదకులు కదా ,విశ్వనాధ పై ఇంత ఆరాధన ఎలా సాధ్యమైంది “”అని అడిగా .చిరు నవ్వు నవ్వి ‘’అది వ్రుత్తి ధర్మం ఇది ప్రవ్రుత్తి ధర్మ౦ ‘’అన్నారు.  అప్పుడు వారి సంస్కారానికి జోహార్లర్పించాను .బెజవాడలో ఎన్నో సభలలో వారిని దర్శించాను .అంతటి సంస్కారి సజ్జనులు ,సహృదయులు నిబద్ధ జీవి  ,విశాల హృదయులు శ్రీ రాఘవాచారి గారి సంపాదకీయ శైలిని శ్రీమతి కొమాండూరి శ్రీ కృష్ణ అత్యద్భుతంగా ఆవిష్కరించారు . ఆమెను అభినందిస్తూ ముగిస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’

ఆజానుబాహు దేహం అరవింద దళాయ తాక్షం ,మిసిమి పసిమి ఛాయ దేహం ,స్పురద్రూపం ,ఆకట్టుకొనే చూపు ,నెమ్మది స్వభావం ,సరళ స్నేహ హృదయం తెల్లని గిరజాల జుట్టూ అంతకంటే మల్లెపూవు తెల్లదనం పైజమా చొక్కా ,వేదికకూ ,వేదిక ముందూ అలంకారం ,మహా నిశిత పరిశీలనం ,పరిశోధనం ,అనర్గళ వాగ్వైభవం ,చాందస భావాలకు దూరం ,అయినా సనాతన సాహిత్యం పై విపరీతమైన అభిమానం ,పూర్తీ కమ్యూనిస్ట్ అయినా, విశ్వనాధ అన్నా ఆయన సాహిత్యమన్నా వల్లమాలిన అభిమానం ,అభిరుచి ఉన్నవారే శ్రీ చక్ర వర్తుల రాఘవాచారి .ఈ పేరు చాలా మందికి తెలియదు .సి రాఘవా చారి అంటే కొంతమందికీ ,సి రా ‘’అంటే ఇంకొంచెం మందికి విశాలాంధ్ర రాఘవాచారి అంటే అందరికీ తెలుస్తుంది .33 ఏళ్ళు  విశాలాంధ్ర దిన పత్రికకు సంపాదకులుగా ఉండి,ఎన్నోన్నో సంపాదకీయాలు తనదైన శైలిలో నిర్మించి ఆ పత్రికకే గొప్ప సొబగు తెచ్చినవారు .విజయవాడలో ఆయన లేని సభ దాదాపు ఉండదు .రేడియోలో ఆయన ప్రసంగించని అంశం ఉండదు .చరిత్ర లోతుల్ని శోధించి గంభీరంగా మాట్లాడే నేర్పున్నవారు .ఆయన విజయవాడ వారే అని అందరూ అనుకొంటారు . కాదు .

బి ఏ చదివి ,సంస్కృతంలో విద్యా భూషణ అయి ,ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి తెలుగు ఏం ఏ .సాధించి  ,హైదరాబాద్ ఏ ఎస్ .సి లో పండిత శిక్షణ పొంది ,సంస్కృతం  లోనూ ఏం ఏ .అందుకొని ,మూడేళ్ళు సంస్కృత ఉపన్యాసకురాలిగా పని చేసి ,16ఏళ్ళ నుండి తెలుగు పండితురాలిగా ఉద్యోగిస్తూ ,  శ్రీ కోయిల్ కందాడైశ్రీనివాసన్ ను వివాహమాడి ,పుత్రుని పొంది ,సరసభారతికి ఆత్మీయురాలైన శ్రీమతి కొమాండూరి కృష్ణా ,’’రాఘవాచారి గారి సంపాదకీయశైలి  ‘’అనుశీలనం 2008లో  రాసి ప్రచురించి నాలుగు నెలల క్రితం  నాకాపుస్తాకాన్నిస్తే, తీరికగా నిన్నా ఇవాళా చదివి ,అందులో చాలా విషయాలు చాలా మందికి తెలియవు అనే అభిప్రాయం తో ముఖ్య విషయాలను మీకు అందిస్తున్నాను .

సాహితీ సంపాదకచక్రవర్తి శ్రీ చక్రవర్తుల రాఘవా చారి తెలంగాణాలోని వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ‘’శాతాపురం ‘’లో 10-9-1939న శ్రీ నల్యాన్ చక్రవర్తుల వరదాచార్యులు ,శ్రీమతి కనకవల్లి దంపతులకు జన్మించారు .తొమ్మిది మంది సంతానం .అయిదుగురు అన్నదమ్ములలో చివరి వాడు .అందరు ‘’రాఘవన్ ‘’అని పిలిచేవారు .తల్లిగారిది కృష్ణాజిల్లా మానికొండ దగ్గర బొకినాల గ్రామం .ఆనాటి పద్ధతిలో ఇంట్లోనే విద్య నేర్చారు .అమ్మ తమిళం నేర్పింది .ఆంధ్రనామ సంగ్రహం ,రుక్మిణీ కల్యాణం బాల్యం లోనే చదివేశారు .అన్నయ్యలతో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులో ఉండి అక్కడి భావనారాయణ సంస్కృత కళాశాలలో శ్రీ సంపత్కుమారాచార్య ,చల్లా సత్య నారాయణ శాస్త్రి గారల వద్ద పంచకావ్యాలు నేర్చారు .1951లో హైదరాబాద్ లోని లాల్ గుడా రైల్వే స్కూల్ లో హైస్కూల్ విద్య పూర్తీ చేశారు .  నిజాం కాలేజి లో పి యు  సి .మొదటి బాచ్ లో చేరి ఉస్మానియా పరిధిలో 6వ రాంక్ లో పాసైనారు .ప్రీ ఇంజనీరింగ్ పాసైనా ఇంజనీరింగ్ లో చేరకుండా బి ఎస్ సి లో చేరి చదివి ఉత్తీర్ణులయ్యారు

1961లో ఉస్మానియాలో ‘’లా కోర్సు ‘’చదివి ,ఎ.ఎల్ ఏం కూడా పూర్తీ చేశారు .ఇక్కడే రాజకీయ అరంగేట్రం చేశారు .అప్పటి ఆర్ట్స్ కాలేజి విద్యార్ధి ప్రెసిడెంట్ మాజీ కెంద్ర మంత్రి శ్రీ జయపాల్ రెడ్డి .వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు .సి ఆర్ ను ‘’ఆంధ్రా ‘’అని ,’’చైనీస్ కమ్యూనిస్ట్ ‘’అనీ సహచరులు పిలిచేవారు.వీరికి ధర్మ శాస్త్రాధ్యయనం ‘’జూరిస్ ప్రిడేన్స్’’అంటే విపరీతమైన అభిమానం ..ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ అయినా పట్టుదలగా దానినే ఎంచుకొని 1964లో పాసైనారు .క్రికెటర్ శ్రీ జయ సింహ ,దర్శకుడు శ్యాం బెనెగల్ ,శ్రీ చేకూరి రామారావు ,శ్రీ జే బాపురెడ్డి ,ఆచార్య శ్రీ జి వి సుబ్రహ్మణ్యం ,అంపశయ్య నవీన్ ,శ్రీ ముదిగొండ వీరాభాద్రయ్య వీరి సహ విద్యార్ధులు .అప్పటికే కమ్యూనిజం ను అవపోసనపట్టిన వీరు ఉద్యమం లో మొదట చనిపోయి అమరురాలైన శ్రీమతి చాకలి ఐలమ్మ ప్రేరణ గా నిలిచింది .1948లో తెలంగాణా లో రజాకార్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు వీరి కుటుంబం కమ్యూనిస్ట్ లకు  ఆశ్రయ మిచ్చింది .తాతగారు శ్రీ నరసింహా చార్యులు గొప్ప ఆయుర్వేద వైద్యులు .ఇంటికి దగ్గరగా పాకలు వేయించి ఆసుపత్రులుగా మార్చి వైద్య సేవ చేశారు .ఇంటికి ఎవరు వచ్చినా వండి వడ్డించే దొడ్డ ఇల్లాలు వీరి తల్లిగారు .1953నుండి ‘’విశాలాంధ్ర ‘’పత్రికను చదవటం ప్రారంభించారు ‘’జన ధర్మ ‘’ను కూడా  చదివే వారు .కమ్యూనిస్ట్ నాయకుసు శ్రీ మోటూరు హనుమంతరావు రచనలంటే ఇష్టపడి చదివేవారు .

కాలేజీ చదువులోనే’’ క్రీడాభిరామం లో ఓరుగల్లు వర్ణన ‘’వ్యాసం రాసి ప్రశంసలందు కొన్నారు .శ్రీ శ్రీ వరవర రావు లపై రాసిన వ్యాసాలూ ‘’సృజన ‘’లో ప్రచురితమైనాయి .ఇప్పటికీ రోజుకు రెండు గంటలైనా సాహిత్యాధ్యనం చేయకుండా ఉండరు .భావాలలో కమ్యూనిస్ట్ అయినా వేషధారణ సంప్రదాయ పద్ధతిలోనే ఉండేది .పిలక కూడా ఉండేది అందుకే విద్యార్ధి దశలో ‘’యెర్ర సభ్యతం ‘’తీసుకోలేదు .తండ్రి తద్దినాలు కూడా పెట్టేవారు .చివరి సారిగా 1959-60లో పెట్టి ‘’ఇక పెట్టను ‘’అని ప్రకటించి సభ్యత్వం  తీసుకొన్న నిబద్ధత ఆయనది ..ఆదర్శాలు మాటల్లో కాదు చేతల్లో చూపిన వారాయన .శ్రీ కనపర్తి నాగయ్య గారి చివరి కూతురు ,న్యాయవాది అయిన శ్రీమతి జ్యోత్స్నను ‘’కులాంతర  ఆదర్శ ,ప్రేమ వివాహం ‘’చేసుకొన్నారు . ఈ విషయం నా లాటి చాలామందికి తేలియదు.వీరిది చాలా అన్యోన్య దాంపత్యం .’’మాస్టర్ ఆఫ్ లాస్ ‘’అయిన భర్తావద్ద ధర్మ సందేహాలు తీర్చుకోనేవారామె .

న్యాయ వాదవ్రుత్తి స్వీకరించకుండా జర్నలిజం పై ద్రుష్టి పెట్టారు .భారత రాజ్యాంగం ,ఇతర దేశాల రాజ్యా౦గాలను  తులనాత్మకంగా పరిశీలింఛి విషయాలను కరతలామలకం చేసుకొన్నారు .అన్నీ ‘’ఫింగర్ టిప్స్’’పై ఉండేవి .’’భాషా సాహిత్యాలపై ఉన్న టెంపరమేంట్ పార్టీ నిర్మాణం లో పనికి రాదు ‘’  అని గ్రహించి పార్టీ పత్రికలో పని చేసేందుకు సిద్ధమయ్యారు .తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శ్రీ మోహిత్ సేన్ ప్రభావం తో హైదరాబాద్ లో విశాలాంధ్ర విలేకరిగా చేరారు .నాలుగేళ్ల తర్వాత పేట్రియట్,  లింక్ పేపర్లకు పని చేశారు .1968లో ధిల్లీ లో పేట్రియట్లో పని చేస్తూ ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు ‘’హాబ్స్ వెన్ ‘’ను ఇంటర్వ్యు చేయటం మరపు రాని అనుభవమైంది .

అనేక విశ్వ విద్యాలయ జర్నలిజం కోర్సులకు అధ్యాపకులుగా ,సందర్శనాచార్యులుగా ,,ఎక్సామినర్ గా సేవలందించారు .1971లో విశాలాంధ్ర సంపాదక వర్గం లో చేరి ,1972లో సంపాదక బాధ్యత,2002వరకు  వహించి దాని ఉన్నతికి ముఖ్యకారకులైనారు .2006లో సాంకేతికంగా విశ్రాంతి పొందినా సలహాలు సంప్రదింపులు అందిస్తున్నారు .33ఏళ్ళ కుర్ర వయసులో సంపాదకుడైన ఆచారిగారు’’ ప్రజా సంపాదకులు ‘’ గా పేరు తెచ్చుకొన్నారు .

పుస్తక ముఖ చిత్రం జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-16-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

8-4-16 శుక్రవారం సాయంత్రం 6గం లకు గండి గుంటదత్త గుడిలో శ్రీ దుర్ముఖి ఉగాది పంచాంగ శ్రవణం 

8-4-16 శుక్రవారం సాయంత్రం 6గం లకు గండి గుంటదత్త గుడిలో పంచాంగ శ్రవణం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బ్రెజిల్ వీర నారి రాణి దందారా దాస్ పాల్మర్ (వ్యాసం) -గబ్బిట దుర్గాప్రసాద్

బ్రెజిల్ వీర నారి రాణి దందారా దాస్ పాల్మర్ (వ్యాసం) -గబ్బిట దుర్గాప్రసాద్

జాతుల మధ్య సామరస్యాన్ని సాధించటానికి తీవ్ర కృషి చేసిన ఆఫ్రో బ్రెజిల్ తెగనాయకులలో జుంబి పేరు తెలియని వారుండరు .అతనితో పాటు అంతే తీవ్ర స్థాయి లో పని చేసిన అతని భార్య దందారా దాస్ పాల్మర్ పేరును అటు చరిత్రకారులు ,ఇటు రాజకీయ నాయకులు మరిచి పోయి ఆమె పట్ల తీవ్ర వివక్షత చూపారు .జాతుల సమైక్యతకై ఆమె చూపిన చొరవ ,సాహసం పోరాట పటిమ చిరస్మరణీయం .మరుగున పడిన ఆ వనితా మాణిక్యాన్ని పరిచయం చేయటమే ఈ రచనలో నా ఉదేశ్యం .

ఆఫ్రో బ్రెజిల్ జాతి సమానత్వ పోరాటం లో అలుపెరుగని వీరాధి వీరుడు జుంబి .అతని ప్రతికదలిక ,ప్రతి పోరాటం ప్రతిమాట చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిపోయాయి .ఆరాధ్య దైవమే అయ్యాడు .అంతటి వీరునికి అన్ని విధాలా దీటైన భార్య దందారా పాల్మర్స్ వీరవనిత గా ఖ్యాతి చెందింది .17 వ శతాబ్దం లో ఈ జంట నాయకత్వం లో ఆఫ్రో-బ్రెజిల్ విముక్తి పోరాటం చారిత్రాత్మకమైనది .నవంబర్ నెల బ్రెజిల్ దేశం లో నల్ల జాతివారి జాతీయ చేతన మాసంగా భావిస్తారు .శతాబ్దాలపాటు బానిసత్వం లో మ్రగ్గిన జాతి విముక్తి సాధనకు కంకణం కట్టు కొన్న మాసం అవటమే దీనికి ముఖ్య కారణం .అందుకే” నల్ల ఉద్యమ మాసం ”అన్నారు నవంబర్ నెలను .ఈ నెలలో బ్రెజిల్ లో ప్రతి స్కూలు కాలేజి విద్యాసంస్థ విముక్తి పోరాట యోధుడు జుంబి ను సంస్మరించుకొని స్పూర్తి పొందుతారు .కాని అతనితో సమానం గా పోరాటం చేసిన అతనికి అన్నివిధాలా తగిన భార్య దందారాను వాళ్ళూ మర్చిపోవటం విడ్డూర మనిపిస్తుంది.

దందారా కూడా భర్త జుంబో తో కలిసి ఆయుధాలు పట్టి,నల్లజాతి స్త్రీ పురుష విముక్తి కోసం తీవ్ర పోరాటమే చేసింది . సమస్యల మూలాలను వెతికి పరిష్కరించే ప్రయత్నం చేసింది .కాని మహిళల పట్ల ఉన్న అసమానత ఆమె పేరు ప్రఖ్యాతులకు అడ్డమొచ్చినది .ఆమె చరిత్ర అక్కడ స్కూళ్ళలో పాఠ్యాంశం కాక పోవటం తీవ్ర నిరాశను కలిగిస్తుంది .నల్లజాతి వారు నల్లజాతి స్త్రీలు ఉద్యమకారులు కూడా ఆమెను అంతగా స్మరించరు అంటే మరీ ఆశ్చర్యమేస్తుంది . లింగ వివక్ష అంతగా వేళ్ళూనికొని ఉందన్నమాట .నల్లజాతి స్త్రీల పై కవిత్వం రచన ,సామాజిక శాస్త్రాలలో చోటు చేసుకోక పోవటం చూస్తే తల దించుకొనే పరిస్థితి .అదీ అక్కడి వాతావరణం .కొందరు పరిశోధకులు ఆమె చరిత్ర ను త్రవ్వి తీసే ప్రయత్నం చేసినా ,ప్రొఫెసర్ క్లేబర్ హెన్రిక్ దందారా పై అద్భుత గ్రంధం రాసినా ,ఆమెకు స్వాతంత్ర్యం విముక్తి పై ఉన్న దాహాన్ని ,ఆమె ఎక్కడపుట్టి ఎలా ఎదిగింది అన్న విషయాలూ ఆమె చాయాచిత్రమూ అలభ్యం గానే ఉన్నాయి .అజ్ఞాత విప్లవ వీర వనితగానే దందారా ఉండి పోయింది .బ్రెజిల్ దేశం నవంబర్ 20 గురువారాన్ని జాతీయ ”నల్లజాతి చేతనా దినోత్సవం ”గా జుంబి ను స్మరించి నివాళులు అర్పిస్తున్నా అతని భార్య జీవిత కధ ఇంకా అసంపూర్ణంగా నే ఉండి పోయింది .

బ్రెజిల్ దేశం లో మొట్ట మొదటి సారిగా కాలు పెట్టిన ఐరోపా దేశస్తులు ,అక్కడ తరతరాలుగా నివసిస్తున్న జాతీయులను బానిసలుగా ,బలవంతంగా కూలి వాళ్ళుగా మార్చేసి, వారి జీవికకు పెద్ద అవరోధం కల్పించారు .మొదటి శ్రేణి జాతి ఇప్పుడు యూరోపియన్ల చేతిలో స్వేచ్చ కోల్పోయి రెండవ శ్రేణి జాతిగా మారి అవమానాల పాలైనారు .బ్రెజిల్ చెరుకు పంటకు బాగా అనుకూలమైనది .వాణిజ్య పరంగా లాభ సాటి అయినది .చెరుకు పంట అత్యుత్పత్తి ,అధిక లాభాలకోసం ఈ స్థానికులనుయూరోపియన్లు అన్నిరకాలా బాధించారు దోచుకొన్నారు స్వాతంత్ర్యాన్ని హరించారు నీచం గా నికృష్టంగా చూశారు .కొందరు ఎదురు తిరిగిపోరాడారు ,నిర్బంధం నుండి తప్పించుకొని పారిపోయారు .కొందరు పల్లెటూళ్ళకు పారిపోయి స్వేచ్చగా వ్యవసాయం చేసుకొంటూ స్వేచ్చా సంఘాలుగా ఏర్పడి ”క్విలంబోస్ ”లేక మెరూన్ సొసైటీ లుగా మారి జీవించారు .
ఇలాంటి వాటిలో అలగాస్ లో సెర్రా డా బారిగా దగ్గరున్న క్విలంబోస్ ఆఫ్ పాల్మర్స్ ముప్ఫై వేల జనాభాతో చాలా ప్రసిద్ధమైనది .సహజ ప్రకృతి అందాలు ,సహజవనరులతో వర్ధిల్లుతోంది .పరస్పర ప్రేమానురాగాలతో స్వేచ్చతో అక్కడిప్రజలు జీవిస్తున్నారు . .పాల్మర్స్ అనేక జాతుల స్త్రీ పురుషులతో అందరికి సమానావ కాశాలతో వర్ధిల్లుతున్న ప్రాంతం .ఎదురు తిరిగిపారిపోయి వచ్చిన నల్లవారికి ,సమాజం లో ఇమడని వారికి ఆశ్రయం కల్పించింది .బ్రెజిల్ లోని అసమానత్వం వర్ణ వివక్ష ,సాంస్కృతిక అసహనం తో విసిగి వేసారి పోయిన వారికి ఎడారిలో ఒయాసిస్ లాగా సేద తీరుస్తోంది .ఆ రాజ్యం లో జనానికి పాడటం,నాట్యం చేయటం ,యుద్ధం చేయటం అనేవి జీవితం లో భాగస్వామ్యమైపోయాయి .చిన్నపిల్లలతో సహా యుద్ధానికి నిత్యోత్సాహం చూపటం అక్కడి ప్రత్యేకత .డ్రమ్ముల ధ్వని వారిని నిత్య చైతన్యులను చేస్తుంది .

చరిత్ర పాఠాలలో 17 వ శతాబ్దం లో జుంబి , అనే నల్ల జాతి పోరాట యోధుడు ,అలాగే మరో వీరుడు గంగా జుంబాల పేర్లు వారి పోరాట పటిమ సాహసాలు వర్ణింప బడినాయి .ఈ నాటి తరం వారు తమ వీరుడు క్విలంబోస్ పాల్మర్స్ కు చెందిన జుంబి ను ప్రధమ పోరాట వీరునిగా భావించి గౌరవిస్తారు .వీరుకాక ఇంకా కొన్ని వందల మంది వీరులున్నా కాలక్రమంలో ఈ 40౦ ఏళ్ళలో వారి చరిత్ర అంతా కాల గర్భం లో కలిసిపోయి అధికారిక చరిత్రలో స్థానం దక్క క ,వీరిద్దరే మిగిలారు .దీనికి జాతి వివక్ష కూడా ఒక పెద్ద కారణం .

జుంబి భార్య దందారా అన్ని విధాలా భర్తకు అనుకూలవతి అయిన భార్య .పోరాట యోదురాలు సాహస ధైర్యాలతో రాణించిన రాణి .దందారా అంటే ”అద్వితీయ సౌందర్య రాశి ”అని అర్ధం .భర్త వలన ముగ్గురు పిల్లలను కని, పెంచి పెద్దవాళ్ళను చేసింది ..ఆమె ఆఫ్రికన్ వారసత్వం గురించి పెద్దగా తెలియటం లేదు .కాని బ్రెజిల్ లో జన్మించి క్విలంబోస్ పాల్మర్స్ కు బాలికగా వచ్చిందని మాత్రం తెలుసు .తన జాతిలో అందరి స్త్రీలలాగానే పొలం పనులు చేస్తూ ,పెండలం పండిస్తూ దాన్ని పిండి గా మారుస్తూ ఉండేది .వేటాడేది .కాపోరియా అనే మార్షల్ ఆర్ట్ లో ప్రావీణ్యం సాధించింది .ఆయుధం పట్టటం, ప్రయోగించటం లో నేర్పు చూపింది .యువతుల బృందానికి నాయకత్వం వహించి వారికి ఈ శిక్షణ ఇచ్చి యువతీ సైన్యాన్ని తయారు చేసింది .తన ముగ్గురు పిల్లలను ప్రేమగా పెంచుతూ తండ్రి అంతటి వీరులను చేసింది . వృద్ధులను కని పెట్టి సేవ చేస్తూ ,సహకార వ్యవసాయం లో సాయ పడుతూ ,ఉద్యాన వన రక్షణ చేసేది .”అయాన్సా” వారసత్వంగా వచ్చిన సహజ మూల స్పూర్తితో ,ఆత్మీయత ఆనందాలను అందరకు పంచుతూ గుర్తింపు పొందింది .ఇన్ని పనులు చేస్తున్నా ఆమెలో స్వేచ్చా స్వాతంత్ర్యభావాలు అనుక్షణం పెరుగుతూనే ఉన్నాయి .మూలాలను మర్చిపోకుండా ,భార్యగా తల్లిగా సమాజ సేవలో ప్రముఖ వ్యక్తిగా తన విద్యుక్త ధర్మం ఏమరుపాటు లేకుండా చేసేది .

పాల్మార్స్ రిపబ్లిక్ లో దందారా ప్రముఖ మహిళా ప్రతినిధిగా గుర్తింపు పొందింది .విముక్తి పోరాటం లో జరిగిన అన్ని యుద్ధాలలోని అన్ని ,ఆందోళన లలోను,ఉద్యమాలలోను ఆమె శక్తి యుక్తులను ధారపోసి పాల్గొన్నది .దెబ్బలు తిన్నది ,బాధలు అనుభ వించింది అనుభవం పొంది ,ముందుకే దూకి౦ది కాని వెనకడుగు వేయనే లేదు .ఆమె రూపం సౌందర్యం ,మూలాలు ఈ నాటికీ ఎవరికీ తెలియవు .కాని ఫెడరల్ యూని వర్సిటి ఆఫ్ బాహియా లో రిటైర్డ్ ప్రొఫెసర్ ,ప్రముఖ మానవ శాస్త్ర వేత్త మేరియా డీ లార్డెస్ సిక్వీరియా సేకరించిన సమాచారాన్ని బట్టి దందారా ఆఫ్రికన్ జాతిలో ”జీ మాహీం ”అనే తెగకు చెందినదిగా భావిస్తున్నారు . ఆమె చిత్రం లభించక పోయినా ఆమె గొప్ప తెలివితేటలూ బలీయమైన శరీరం, శక్తి సామర్ధ్యాలు ,మనోజ్ఞమైన సౌందర్యం తో వీర ,ధీర వనిత లాగా ఉండేదని నిర్ణ యించారు .అందరిని ఒప్పించి ,కలుపుకొని నడిపించే సామర్ధ్యమున్న నాయకురాలని ,స్వేచ్చా స్వాతంత్ర్య సాధన కోసం పట్టువదలని పోరాట యోదురాలుగా నిలిచిందని నిర్ద్వందం గా మెచ్చుకొన్నారు .

దందారా తన అపార అనుభవం , శక్తి సామర్ధ్యాలతో తన కుటుంబానికి , ,తన పాల్మర్స్ సమాజ నిర్మాణానికి ,సామాజిక ఆర్ధిక రాజకీయ సంస్థల నిర్మాణానికి చేసిన సేవ వెలకట్ట లేనిదిగా చరిత్ర కారులు ప్రశంసించారు .యుద్ధం లోనూ ,ప్రేమలోనూ జుంబి, దందారాలు అత్యంత అంకిత భావంతో ప్రవర్తించారు .భర్త తోకలిసి ఆమె వ్యవసాయ క్షేత్రాల పై జరిగిన అనేక దాడులను అరికట్టింది,.బానిసలకు విముక్తి కల్గించింది ,శత్రువుల ఆయుధాలను ఆహార సామగ్రిని ,వస్తువులను స్వాధీన పరచుకోన్నది .పాల్మర్స్ సమాజం బహుళజాతి సమాజం .ఎవరి సంస్కృతిని వారు పరిరక్షించుకొంటూ కలిసి మెలసి అన్యోన్యం గా జీవించేవారు .వారి ఆహారం మొక్కజొన్న ,పెండలం ,చిక్కుడు ,చిలగడ దుంప ,చెరకు ,అరటి .వారికి లోహ శాస్త్రం లో ప్రావీణ్యం ఉంది .వ్యవసాయ పనిముట్లు ,యుద్ధ సామగ్రి స్వయంగా తయారు చేసుకొనేవారు .పింగాణి ,కొయ్య సామగ్రి తయారు చేయటం వచ్చు .క్విండోబా పాం నుంచి నూనె తీస్తారు ,ఇంటికప్పుకి ,పానీయాల తయారీ బుట్టల అల్లకం ,త్రాళ్ళు పేనటానికీ ఉపయోగిస్తారు .క్విండో వలననే ఈ ప్రాంతానికి క్విలంబో పేరొచ్చింది .వ్యవసాయం వర్తకం లలో సిద్ధ హస్తులు .
అన్నిపనులు పురుషులతోపాటు స్త్రీలు కూడా చేస్తారు . బ్రెజిల్ ఈశాన్య ప్రాంతం నుంచి డచ్ వారిని తరిమేయగానే కొత్త కార్మిక సమస్య ఏర్పడింది .చెరుకు పంటకు బానిస కూలీల సంఖ్య ఎక్కువగా కావాల్సి వచ్చింది .పామర్స్ ను స్వాధీనం చేసుకొనే ప్రయత్నం జరిగింది .పాల్మర్స్ లొంగకుండా 50 ఏళ్ళు తీవ్ర పోరాటం చేశారు.18 సార్లు డచ్ వారు పాల్మర్స్ పై దండ యాత్రలు చేశారు . 1630 లో డచ్ వాళ్ళు పల్మర్స్ ను స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేశారు అప్పుడు దందారా చాలా ముఖ్య పాత్ర పోషించింది .తనభర్తకు ముందు ఉన్న విముక్తి వీరుడు భర్త అంకుల్ క్విలంబో పాల్మర్స్ ముఖ్య నాయకుడు అయిన గంగా జుంబో తో కలిసి పోరాటం చేసింది .పెర్నా౦బు కో గవర్నర్ తో జుంబో శాంతి ఒడంబడిక పై 1678 సంతకం చేశాడు .ఈ ఒప్పందం ప్రకారం పూర్వపు పోరాటం లో అరెస్ట్ అయి జైళ్లలో ఉన్న పాల్మర్స్ కు విముక్తికల్గించటం ,పాల్మర్స్ లో జన్మించినవారికి స్వేచ్చ ఇవ్వటం ,వర్తక వాణిజ్యాలను కొనసాగించే హక్కు కల్గించటం .ఉన్నాయి .అలాగే ఇక్కడకు వచ్చి రక్షణ పొందుతున్న బానిసలను డచ్ ప్రభుత్వానికి అప్ప గించాలి .

మొదటినుంచి బానిసలకు స్వేచ్చ కావాలని పోరాడుతున్న దందారా కు ఈ ఒప్పందం నచ్చలేదు తిరస్కరించింది .ఈ ఒప్పందం పాల్మర్ రిపబ్లిక్ కు ఆత్మ హత్యా సదృశం అని ఎదురు తిరిగింది .ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించే ఒక నల్ల జాతివాడే కడుపుమండి గంగా జుంబో ను హత్య చేశాడు .బానిసగా ఉండటానికి ఇష్టపడని దందారాను 1669 ఫిబ్రవరి 6 న సర్కా దాస్ మేకోరాస్ పతనమైన తర్వాత బానిసగా బందీ చేశారు . బానిసత్వాన్ని వ్యతిరేకించిన దందారా తో బాటు వందలాది జనం ఎత్తైన క్వారీ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకొని మరణించారు .స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం జీవించి పోరాడి మరణించిన అమర జీవి బందారా.పాల్మర్స్ చరిత్రలో ఒక లెజెండ్ గా వెలిగింది బందారా. క్విలంబో ఇతిహాసం లో దందారా ప్రతిభా సంపన్నమైన మహోత్క్రస్ట మహిళగా నిలిచి పోయింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -6 (చివరి భాగం )

 మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి  -6  (చివరి భాగం )

30- మా పల్లె’’కన్నయ్య’’అన్నయ్య-శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి –విజయవాడ -. 9440174797

మా అన్నయ్య నాకే కాదు నా స్నేహితులకి కూడా అన్నయ్యే!

ప్రతి ఇంట్లో ఉండాలి.. మా అన్నయ్యలాంటి మాంఛి అన్నయ్య!

నాన్నకి చేదోడు వాదోడుగా…! ఇంటి పెత్తనం నాన్న తరువాత అన్నయ్యదే

కాదు కాదు…ఇంటి పెద్దే… అన్నయ్య…!

..

ఉదయం పాలపాకెట్టు మొదలు… చెల్లికి, తమ్ముడికి బడి వరకు తోడుండాలన్నా

అన్నింటికీ అన్నయ్యే!…అన్నయ్య లేకుండా ఏ పనీ జరగదు!

మా అన్నయ్యని చూస్తే అనిపిస్తుంది అమ్మ నాన్న అదృష్టవంతులని!

నాన్న కష్టం, అమ్మ బడలిక అన్నయ్యని చూడగానే పారిపోతాయి

ఎవరు పిలిచినా… ఎవరికి ఏ సహాయం కావాలన్నా…

చిటికెలో చేసి పెట్టే మా అన్నయ్య మాకే కాదు మా పల్లెకే అన్నయ్య!

పెద్ద చదువు చదివినా ఊరు విడిచి వెళ్ళక, తన విజ్ఞానాన్ని పల్లెకే పంచుతూ

ఒంటరిగా ఉన్న వృద్ధులకి చేయూతనిచ్చే మా అన్నయ్య మా పల్లెకే వెలుగు!

మా అన్నయ్యవంటి అన్నయ్య ఇంటికొకడుంటే… వృద్ధాశ్రమాలెందుకు దండగ!

31 మా పెద్దన్నయ్య –శ్రీ డా.రాచకొండ నరసింహ శర్మ ఏం డి .-విశాఖ పట్నం –

 1- ఈ వసుధ వేయి నెలలుండు జీవులరుదు- అరుదు తగినంత ఆరోగ్య మమరి యుంట

  కరమరుదు వారిలో కొంత ఘనత గనుట- అన్నియును గల్గిన వాడు మా అగ్రజుండు .

2-‘’బాబ్జి ‘’యను ముద్దుపేర బరుగునితడు -రాచ కొండ వంశాన్వయ రమ్య గుణుడు

   తండ్రి నారాయనుండతి ధార్మికుండు -లక్ష్మి బోలు సీతా రామ లక్ష్మి తల్లి .

3-మహాదేవ శాస్త్రి నాముడు-  గృహముల ,మేడల ,నభేద్య గురు సేతువులన్

 రహదారులు రైళ్లకునున్   సహనముతో కట్టె సుజన సంతతి పొగడన్ .

4-పొగగబండుల  ఇంజనియరు -తగు మార్గము రైళ్ళు నడుప తా నిర్మించేన్

  తగు నేర్పరి చిత్తరువుల -అగణిత సద్గుణ ధనుడు అకళం కుడున్

5-అవకాశ మెంత యుండిన –అవినీతికి లొంగ లేదు అగ్రజు డెపుడున్

 అవసరము కతడు మారుట-రవి చంద్రులు నభము వీడి రాలిన యట్లే.

6-కప్పగంతుల వంశీయ కమ్ర హృదయ –సూర్య కాంతమ్మ సదమల చరిత్ర

 ధర్మ పరురాలు మాయన్న ధర్మ పత్ని-భర్త్రు సహకారి ఈశ్వర భక్తురాలు .

 7-సోదరులందు పెద్దతను ,సూనృత వాక్యము తప్ప డెప్పుడున్

   సోదర ప్రేమ లోతులవి శోధన కందక యుండు ,జన్మ

  జన్మోదిత పుణ్య సత్ఫల మొకో !యన మాకితడగ్రజుం  డయెన్.

32-మార్గ దర్శి అన్నయ్య –శ్రీ మైనేని గోపాల కృష్ణ –అమెరికా -001-256-882-5586

జీవిత సత్యాలు బోధించటం లో గురువు

బంధుత్వాలను తెలియ బరచటం లో ఆత్మీయుడు

సహచరులతో కలిసి మెలిసి తిరిగే నేర్పును నేర్పే హితుడు

తప్పు చేస్తే  ఒప్పు కోనేట్లు  చేయగల సంస్కారం ,

అందరితో చనువుగా  సంచరించే సహృదయత నేర్పే సౌజన్యుడు  

తండ్రి రూపం లో వెన్నంటి ,సరైన మార్గ నిర్దేశం చేసి

జీవితానికి వెలుగు నిచ్చే  జ్ఞాన జ్యోతి

అన్నయ్య ఉండటం అదృష్టం లేక పోవటం దురదృష్టం

శ్రమ ,క్షమ,వంతు ,వాటా ,శ్రద్ధ ,కాఠిన్యం,విభిన్నతల లోని

సూక్ష్మ మర్మాలు  అనుభవం తో తెలియ జేసే మార్గ  దర్శి  అన్నయ్య.

  అన్నయ్య ఆత్మీయ కవితా స్రవంతి సంపూర్ణం .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-4-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

“కేమోటాలజి పిత” – కోలాచల సీతారామయ్య – పుస్తక పరిచయం

8.4.2016

మిత్రులు, సాహిత్య సేద్యులు,  శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,                                                                                                                         నా స్పందన

కెమొటాలజి పిత కొలాచల సీతారామయ 

                              ( పుల్లేరు నుండి వోల్గా దాకా )

      దుర్ముఖి నామ సంవత్సర 

    ‘        ఉగాది శుభాకాంక్షలు !

 

నమస్కారములు !  సాహిత్య సేద్యంలో, మధురమైన బాల రసాలను పండిస్తున్న మీకు ముందుగా నా హార్దిక అభినందనలు ! మీరు నాపట్ల ఏంతో అభిమానంతో రెండు నెలల క్రితం పంపిన ‘కెమొటాలజి పితకొలాచల  సీతారామయ్య గారి అద్భుత జీవిత చరిత్ర  చదవటం నిన్ననే పూర్తి చేసాను. ఎన్నో సాంకేతిక అంశాలతో నిండి ఉన్నా, మీరు వాటిని పాఠకులకు ఆసక్తికరంగా చదివిచేటట్లు, అలవోకగా రాయటం, ఇందులో ప్రత్యేకత. ఎన్నో ఉపయోగపడే అంశాల గురించి,  గొప్ప మేధావుల గురించి  మీరు అపురూప గ్రంథాలను  సరళ శైలిలో రచించి  సమాజానికి అందించటం బహుథా ప్రశంసనీయం !

ఎటువంటి పుస్తకాలు చదవాలి ? – అనే సందేహం వచ్చినపుడు, ఇతిహాసాలూ ;… గొప్పవారి జీవిత చరిత్రలు;–  అని అంటాడొకమేధావి !  ఈ కోవలోకే చెందుతుందీ  గ్రంథ రాజం !

కృష్ణా జిల్లాలో, ఉయ్యూరు ప్రక్కన ఉన్న ఒక కుగ్రామం, శాకమూరులో సంప్రదాయ పేద కుటుంబం  నుండి వచ్చి, తన దృఢ సంకల్పంతో, అప్రమేయ దీక్షా దక్షతలతో, అసమాన మేధా సంపత్తితో, అలుపెరుగని యోధునివలె నిరంతరం,  జీవన సమరంలో పోరాడుతూ,‘పడి లేచే కడలి తరంగం వలె విజ్రుంభిస్తూ, సీతారామయ్య గారు కాలి నడకన మద్రాస్ చేరి; తదుపరి మొక్కవోని పట్టుదలతో, ఉన్నత చదువుల కొరకు,   అమెరికా రష్యా దేశాలలో చేసిన మహా ప్రస్థానం గురించీ, సాధించిన అద్భుత అపూర్వ విజయాల గురించీ,  ఏంతో  శ్రమకోర్చి, ఆయనజీవిత చరిత్రను అంకిత భావంతో అక్షరీకరించి మీ రచనా పాటవంతో సమాజానికి తెలిపినందుకు  శత సహస్రాభినందనలు.

ఇటువంటి, అద్భుత గ్రంథం లోని కొన్ని విశేషాలను ఎంపిక చేసి పుస్తక పరిచయం రాసి, నా అంతర్జాలం -మిత్ర బృందం –స్నేహాలయం వారికి కూడా ఈ లేఖతో పంపుతున్నాను.

మీరు నా పట్ల గల అభిమానంతో పంపిన మరొక పుస్తకం. “దైవ చిత్తం అందినది.  ధన్యవాదాలు. అది కూడా చదివిన తరువాత నా స్పందనలు తెలియజేస్తాను. ప్రస్తుతానికి సెల

భవదీయుడు,

(గీతాంజలి మూర్తి )

 శ్రీ గబ్భిట దుర్గా ప్రసాద గారు, ఉయ్యూరు, కృష్ణ జిల్లా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -5

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -5

21-కష్ట జీవి అన్నయ్య – శ్రీమతి కోనేరు కల్పన-విజయవాద -9246493712

 అన్నయ్యంటే ఆత్మాత్మ బంధువు –ఒక అపురూప ఆనంద తారంగం

‘’మా అన్నయ్య ‘’అని అంటుంటే కించిత్ గర్వం కూడా

నాన్న అంట అండ –అందమైన భరోసా కూడా

అలాంటి అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు

ఉన్న నాలుగేకరాలూ అమ్మి అన్నయ్యను అమెరికా పంపినప్పుడు

రేపు తమ బ్రతుకేమిటని అమ్మా నాన్నా అనుకోలేదు

రైతు కాస్తా కూలీగా మారి ,పాలు కూరలు ,ఊరగాయ అమ్మి సంతృప్తిగానే బతికారిన్నాళ్ళు

ఇప్పుడు ప్రయోజకుడై మిగిలిన రెండు నిట్టాళ్ళపాకను         

డబల్ బెడ్ రూమ్ దాబాగా మార్చి ,తమ్ముణ్ణిఐ ఏ ఎస్ చదివించి ,చెల్లాయ్ పెళ్లి  చేసేందు కొస్తున్నాడు

గుగ్గిళ్ళు తేగలు తంపటకాయలు పంచుకు తిన్న రోజులూ ,

కొంకి గడ వాసంతో సీమ చింతకాయలు కోసిచ్చిన రోజులూ గుర్తుకొస్తున్నాయి

తానూ చెరువులో ఈత కొట్టిన సంగతి తమ్ముడు ఇంట్లో చీరవేస్తే

వంద గుంజీలు తీయించిన అన్న గుర్తుకొస్తున్నాడు

ఈ అన్నయ్యే చిటారు కొమ్మ జామపళ్ళు కోసి ఆబగా మాతో తినిపించేవాడు

మా ఇద్దర్నీ సైకిల్ పై స్కూల్ లో దింపి తానూ కాలేజీకెళ్ళిన అన్నయ్యే జ్ఞాపకమొస్తున్నాడు

మా మీదా ,మా ఊరిమీద ,తెలుగు జాతిపైనా ,భారత భూమి మీదా

అపార గౌరవం ఉన్న ఆ అన్నయ్యే వస్తున్నాడు

నవ్యాంధ్ర ఏర్పడి అమరావతి రాజధాని రూపు దాలుస్తున్న వేళ

ఉప్పొంగిన ఆనందం ,పులకించిన డెందం తో

ఎంతో ఆశతో ,ఆంధ్రా స్వర్గం అనే భావనతో   వస్తున్నాడు

ఇక్కడ మోసాలు రాక్షసత్వాలు ,అవినీతి ,పక్షపాతం క్రూరత్వం తెలిస్తే

మళ్ళీ ఈ గడ్డ మీద కాలుమోపడేమో ?

 మీడియా నిత్యం కోడై కూస్తుంటే-దాచేస్తేదాగని సత్యాలా ?

22-మిన్నంటిన గౌరవం అన్న –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు –విజయ వాడ -9908344249

సి.-ఇంటి పెద్దగ పుట్టి ,కంటి పాపగ నిల్చి –అండగా నుండి సాయంబు జేయు

   తోడబుట్టిన వారి తోడూ నీడై తాను –అభిమానమును చూపి ఆదరించు

   నాన్న గారి పిదప నాన్నగానిలబడి –భుజములన్ బాధ్యత మోయు చుండు

  వంశ గౌరవమును ,పరువు ప్రతిష్టలు –పెంచగా నిత్యము  పెంచుకొనును

 కన్న వారికి ,తన కంటె చిన్న వారి –కింటి పేరు నిలుపు నెంతగాను

అమ్మానాన్న లోని ఆది  వర్ణంబులై –అన్న యన్న గొప్ప యరద మిచ్చు

ఆ.వె.-ఆవిదాట బ్రహ్మ అమ్మను సృష్టించె-తనకు బదులు నిజాము ధరణి యందు

      అటులే నాన్న బదులు అన్నాను పుట్టించె-ఆదరింప నెప్పుడు అవని యందు .

తే.గీ .-రక్షా కట్టిన చెల్లికి రక్షణిచ్చి-అన్న యన్న పిలుపుకు దానాద మరచి

      జీవితాంత మాదు కొనెడు జీవి యితడు –అట్టి అన్నయ్య పిలుపు నత్యద్భుతంబు .

ఉ .-అన్నకు గౌరవంబు నిడి ,యా భగవంతుని రీతిగన్ ,సదా

   చిన్నలు చూడ నాతడును చింతలు దీర్పగ ప్రేమ పంచుచున్

  దన్నుగ నిల్చి ,ఎల్లపుడు తండ్రిగ దల్లిగ రక్ష ణిచ్చు దా

గన్నులలోన దాచుకొని ,గాచును నిక్కము భూతలంబునన్ .

సి.-అలనాడు సౌమిత్రి అన్న రామయ్యకు –సేవకుని క్రియను సేవచేసే

    అందుడైనను గాని అంబికా పుత్రుని –ప్రభువుగా జేసె పాండు రాజు

   తమ కెంత బలమున్న తమ్ములు నల్గురు –అన్న ధర్మ రాజు మాట నాలకించె

  బలరాము దేవుని భగవంతుడైనను –కన్నయ్య నిత్యమ్ము గౌరవించె

తే.గీ.-ఏ చరిత్రను జూడు ,మెందెందు జూడు –అన్న  యన్న భావ మెప్పుడున్ మిన్ను నంటి

      గౌరవాస్పదమై నిల్చె ఘనము గాను –అందుకే ‘’అన్న’’! అందుకో వందనంబు ‘

23-మా (లక్ష్మీ )అన్న-అయ్య-శ్రీమతి కొమాండూరి కృష్ణా –విజయవాడ -9246434485

  అన్న శబ్దానికి తండ్రి అనే అర్ధం ఉంది .అన్న –అయ్యా అంటే తండ్రి ,పెద్ద .రామాయణం లోకుశాల ప్రశ్నలతో భరతుడిని ‘’తాత !నాయన ‘’అని ఆదరిస్తాడు .వారూ ఆ నాటి అన్నలు

ఆచారం మారింది .అన్నదమ్ముల వైరం పెరిగింది .ఇక అన్నకు చెల్లెలు ఉండి,కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తే ,విలవిల లాడే నేటి దుస్థితి వర్ణనే నా కవిత –

శ్రీరామ రామ –అన్న ఆ అం అన్నే’’ యని మనుజు లన్న

సిరితోడ కావయున్న –రామాన్నే యని అనుజులన్న

ఆ రామ పాడమన్న –రాతినీ నాతిగా చేసే నన్న

ఆ సీత శోక మాప –ఆ రాతి రావణున్నేనేనన్న

‘’కన్నా ‘’నోటిన మన్నునూ –కానినంతానే వాలినా

వెన్న నోటిన ఉన్ననూ –కాన నటులే జారిన

చిన్ని దూడల తోదనూ –కాన కతులే చేరిన

మిన్న చేతల అన్నయూ –ఆన లేతుల మీరెనో !

    అదే నేడు –

భరణ మీయగ జొచ్చినా –నా కన్నా వారలు మెచ్చునా !

ఆరణ మీయక తెచ్చినా –నా అన్న భాగము హెచ్చునా !

ఇరవు కోరక వచ్చెనా –ఆరెన్న ! బావగా తెచ్చునా!

బతుకు తీరగ చచ్చినా –ఆ యన్న కావగా వచ్చునా !

అన్న యన ఇటు లున్డునా –అన్నియును కదా తెర్చునా !

కన్నమనమును చూడని –అన్నయును అన్నఏనా !

అని ఎంతో వగచి వగచి –తానన్ని విడచి –నడచి

ఎన్న రాముని పూజ నెంచి –పరమ పాదము చేరెనా !

24-అంతా నాకు దేవుడిచ్చిన అన్నయ్యలే-డా .శ్రీమతి పద్మావతీ శర్మ –విజయవాడ -9291468295

 అమ్మకు ఆసరాగా గిలక్కాయలతో ఆడించేవాడు మా అన్నయ్య

దోగాడుతూ మట్టిలోకి పోతుంటే ,ఎత్తుకోలేక పోయినా ,మొత్తుకొని పొట్టకు కరిపించుకు తిరిగాడు

తన ,నా పుస్తాకాల సంచీలు మోసినవాడు –ఆటల్లో నాకు దెబ్బ తగలకుండా కాపలా ఉన్నవాడు

నా సంతోషం కోసం చాక్లేటు నా స్నేహితులకిచ్చిన వాడు

కాలేజీ రోజుల్లో కంటికి రెప్పలా కావలి కాసిన వాడు

పట్ట రాని  కోపమొచ్చినా నాకోసం బావను క్షమించేవాడు

తనపిల్లల కన్నా నా పిల్లలనే అతిగా ముద్దు చేసేవాడు

భార్య తో గోదావలుపడ్డా నా యోగ క్షేమాలే చూసేవాడు

నా జబ్బు తగ్గాలని ఉపవాసాలు చేసి మొక్కు తీర్చుకోనేవాడు

అన్నీ చేసి ,ఇక చేయతానికేమీ లేదని పించాడు

అబ్బ !యెంత బాగుంది ఈ ఊహా చిత్రం !ఎందుకంటె నాకు అన్నయ్యలె లేరు

అందుకే- మీరంతా నాకు దేవుడిచ్చిన అన్నయ్యలు –మా అన్నయ్యలు .

25-అనురాగ మూర్తి అన్నయ్య –శ్రీ పాణిగ్రాహి రాజ శేఖర్ –విజయవాడ -9292006075

అమ్మలో సగం నాన్నలో సగం అన్నగా రూపాంతరం

అమ్మ ప్రేమను పంచి ,నాన్న శిక్షణ నేర్పే ప్రాకారానివి

నాఆనందం కోసం అహర్నిశలూ శ్రమిస్తావు

నా విజయమే నీదిగా భావించి ఉప్పొంగి పోతావు

అర్ధం కాని విషయాల్ని అవలీలగా బోధిస్తావు

మానవ సేవే మాధవ సేవ అంటూ ,సమాజమే దేవాలయ మంటావు

శ్రమైక జీవనమే నీ మార్గం  -అదే అందరికీ ఆదర్శం

ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా –వీడిపోదు మన బంధం

జన్మజన్మాలకీ నిలవాలి –ఈ అన్నదమ్ముల సౌభాగ్య బంధం .

26-అన్నన్నా –శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి –విజయ వాడ –

1- అన్నా !అన్న !ఇదేమి దుర్విది !అనూహ్యంమన్న !నన్నింక నీ

మన్నన్ కాదన నన్న !చేసితిని అన్యాయమ్ము,నీ, కమ్మకున్

మున్నే నే పసిగట్టి చేటు ,నుడువన్ ,మోటైన మాటాడి ,వీరి

మ్మన్నన్,తల్లిటు వచ్చితిన్ శఠుడనై   ఆలోచనా శూన్యతన్ .

2 తరలితీవు బంగారు లేడి తరుము కొనుచు—కొంతవడికి వింటిమి మేము వింత గొలుపు

నార్త నాదమ్ము ‘’హా లక్ష్మణా ‘’రవమ్ము –స్పస్టమది నీదె గొంతు ,ఉచ్చ్రైస్స్వరమ్ము.

3-వెను వేంటనేపోపోమ్మన –వినని ననున్ తల్లి రూక్ష వీక్షల నురిమెన్

మనసును రాయి పొనర్చుచు –నని వార్యపు గతిని కదలితన్నా వినుమా .

4-ఏదీ తల్లి ఇటుండ బాసితినిగా ,ఈ పంచ వటీ స్థలిన్

 ఎదీ లేదిట లోగిలిన్ వేలుపలన్ ,ఏదేని కీడయ్యెనో

ఆ దేవిం గొను పోయి రక్కసులు ద్రోహమ్మేమి  కాంక్షిం చిరో

నా దైవంమగు తల్లి ,అగ్రజుని ప్రాణమ్మింక నేమౌనోకో .

5-అనుచున్ లక్ష్మణుడశ్రు ధారల హ్రుదబ్జాంత ర్దళోద్విగ్నతన్

 ప్రణమిల్లెన్ త్రప నొంది ,అగ్రజునకున్ ,పల్కండు ,తోన్కండేట్

కినుకన్ బూనేనో ?లోని కోప బడ బాగ్నిన్ మ్రింగి చల్లార్చేనో ?

అనుకొంచం గ్రజు వెంటనంటి తరాలేనారాన్య సంశోధనన్ .

6-రాక్షస సంహారము –ముని రక్షణ యు తన అవతారలక్ష్యము లగుచో

 సుక్షత్రియుడౌ రఘు పతి-దీక్షకు భూ పుత్రి రక్ష తీక్ష్ణ సమస్యౌ .

27-అన్నయ్య పురుషోత్తముడు –శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు –విజయవాడ -9703776650

1-సి-అన్నయ్య లేకుంటె,అన్నమే లేదపుడు –మా తండ్రి శివలోక మరిగె గాన

 కష్టాల కడలి లో నిస్టంగ నెదురీది –ఆడరి౦చెను  మము నమిత ప్రేమ

స్వార్జన మితమయ్యు స్వార్ధంము శూన్యమై –అనుజుల పొషించె నమృత మూర్తి

తప్పొప్పు లెరిగించి దండించి ,భూషించి –మంచి మార్గము జూపె నంచితముగ

జ్యేష్ట భ్రాత్రు స్థాన  శ్రేస్తుండు పూజ్యుండు –సద్వ్రతాచరణ ప్రశస్తుడతడు

పరమ ధర్మమూర్తి పురుశోత్తమాచార్యు –నెలమి దలతు హృదిని నిష్ట తోడ.

2-అన్నయ్య క కంఠాన నినదించు పద్యముల్ –నాకెంతొ ప్రేరణై రక్తి నింపె

  పుష్ప విలాపంపు రసదునిన్ మొదటగా –అన్నయ్య నోటనే విన్న వాడ

ఆంద్ర భాషా యోష అనురాగ వల్లరుల్ –అన్నయ్య వలననే అలము కొనెను

సరసవినోదినీ సమ్యక్ సమస్యలన్-అన్నయ్య చెప్పగ వినగనైతి

నన్ను భాషా ప్రవీణు గా వెన్ను తట్టి –చదువనేర్పించి నత్తి సజ్జను డతడు

పైత్రు కంబగు సాహిత్య ప్రాభవంపు –వాసనల్ నన్ను పద్యముల్ పలుక జేసె

3-సందర్భోచిత నీతి పద్యముల సుశ్రావ్యంబు గా జెప్పుచున్

 అన్డంబై చెలువొందు భాషణము లత్యంత  మోడంబులై   .

 చిందుల్ వేయగమా మనంబు లహహా  చెన్నొ౦దు వాజ్నైపు ణిన్

మందుల్ నేర్వగలుంగు  ట్టి సరణిన్ మాట్లాడు పెద్దన్నయౌ .

28-అపర భగీరధుడు అన్నయ్య –శ్రీమతి వడ్డాది సుభద్ర –విజయవాడ -8885803170

కన్నవారు దివికేగిన వేళ-సంసారనౌక సంద్రాన ఉన్న వేళ

ధైర్యపు చుక్కాని తో  తీరం చేర్పించిన వేళ

మరపు రాణి మహా మనిషి మా అన్నయ్య .

తోబుట్టువుల సుఖమే తనది అన్న వేళ-రాత్రిం బవళ్ళురెప్పగా కాచిన వేళ

తగిన వరు నెంచి నిస్వార్ధంగా  ఒక ఇంటి దాన్ని చేసిన వేళ

అరిషడ్వర్గాలు అదుపులో ఉన్నవాడు

స్వార్ధం అనేపదం నిఘంటువు లో లేనివాడు –నిరాడంబరుడు మా అన్నయ్య

ఇవ్వటమే తెలిసినవాడు ,ఊరికి తలమానికం

కరువు కాటకాలలో చిరుధాన్యాలు పండించి పంచిన జన బాంధవుడు

సాగు జలాలకోసమై నిరంతర శ్రమ చేసి సాధించినాడు

రైతుల పాలిటి అపర భగీరధుడు –మా అన్నయ్య .

29-మనసున్న మా అన్న –శ్రీమతి ఎస్.అన్నపూర్ణ –విజయ వాడ -9290681 769

   వామన గుంటలాటల్లో –నది ఒడ్డున కేరింతల పరవళ్ళలో

  నాతొ పోటీ పడే అన్నయ్య

అమ్మ కోపగిస్తే మూతి ముడిచి అలిగి కూర్చున్న నన్ను

 ఉసిరికాయలిచ్చి ఊరడించిన వాడు

మార్కులు తగ్గితే నాన్న రిమార్కుల నుండి నన్ను వెనకేసుకొచ్చిన వాడు

అల్లరి పిల్లల కాలేజి గొడవల్లో నాకే ఇబ్బందీ రాకుండా కాచిన వాడు

పెళ్లి చేసి పంపినపుడు చిన్న పిల్లాడిలా వెక్కిళ్ళ తో ఏడ్చి కుమిలినవాడు

అత్తారింట్లో ఉంటె రోజూ దూరవాణి తో మాట్లాడే ప్రేమ మూర్తి

మేనల్లుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఊసులెన్నో చెప్పి ఓర్పు చూపి

నేను నోరు తెరువకుండానే నా మనసు

 గ్రహించి మసలే మా అన్నయ్య మామంచి వాడు .

  సశేషం

శ్రీ దుర్ముఖి ఉగాది శుభా కాంక్షలతో

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-16-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -4

  మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -4

15-ఆత్మ బంధువు అన్న –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీ పట్నం -9849812443

సి –అమ్మానాన్నల యనురాగ మార్ణ వమైన – అన్నయ్య అనురాగ మంబరమగును

అన్నయ్య కురిపించు  అనురాగ వర్షమ్ము అంబు దమ్ముల తీరు హర్ష మొసగు

సాదరంబాగు మామ సోదరున్ సందిట –బాలార్కుని కిరణ స్పర్శ తోచు

ఆప్యాయ మొలికెడు అన్నయ్య పిలుపన్న –మలయానిల మ్ముగ మదిని తోచు

ఆ.వె.-అన్నయన్న పిలుపు ఆనంద ప్రదమగున్ –రక్త బంధమె యనురక్తి యనగ

       సోదరులిక ప్రేమ సుంత పంచిన చాలు –కాన వచ్చు అన్న కనుల తృప్తి .

సి –అన్నయ్య కిడగను అగ్రాది పత్యము –పెద్దకొడుకనెడు పేరు నిలుపు

   వరుసగ గృహమున గురుతర బాధ్యతల్ –నిర్వహించ గ కడు నేర్పు చూపు

 కష్ట సుఖమ్ములు కాదు లాభ నస్టముల్ –సహన సంపద తోడ సంస్కరించు

అనుజుల నడిపించ నాదర్శ మార్గమ్ము –అసమాన ప్రతిభను అవధరించు

తీ.గీ.-వినయ స౦పన్నులైన వారు విద్య నేర్చి –ప్రగతి పదమున ప్రతిభ తో పరుగు లిడుచు

      లక్ష లార్జించు చుండగ లక్షణముగ-కురియ నానంద బాష్పాలు మురియు నన్న .

సి-శ్రీరాము నంతటి స్థిర చత్తు నన్నగా –పొందగల్గుటపూర్వ పుణ్య ఫలమె

   నిస్వార్ధ బుద్ధితో నిరతము కృషి సల్పు –మా యన్న విధిగమా మంచి నెంచు

  అన్నయ్య బోధించు కన్నయ్య వలె నింక –మంచి చెడుల గీత ఖచ్చితముగ

 ఆత్మ బంధువు మాకు ఆత్మీయుడగు అన్న –సన్నిధిన్ తలతుము పెన్నిదిగను

తే.గీ .-తల్లిదండ్రుల యెడభక్తి తరగనీక –అలుక నెరుగక ,మా యన్న అలుపు లేక

        సాకు కుశలమ్ముగ కుటుంబ సారదిగను –కొండ వలె నుండు మా అన్న అండ మాకు .

16-పుట్టింటి వేలుపు అన్న – –శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ –మచిలీపట్నం -9299303035

అన్నంటె సగమౌను ,అమ్మలోనెప్పుడు-అనురాగ సుమముల నంద జేయు

అజ్ఞాన తిమిరమ్ము నార్పి వేయుచు తాను –దీధితుల్ వెదజల్లు దివ్వె యగును

అభిమానమును పంచు ననుజుల కెప్పుడు –స్వార్ధ భావము లేని సదయుడగును

అమృత మెచటనగ అన్న మదిని దాగు –రక్త సంబ౦ధమ్ము రక్తి నిచ్చు

అమ్మలోన నాది ,నాన్నలో తుది కల్సి –అన్న యన్న పదము నమరె గాన

అమ్మలోని ప్రేమ ,నాన్న పాలన బుద్ధి –ఉన్న వాడె’’అన్న ‘’ఉర్వి యందు .

2-త్యాగ శీలి యితడు తన యనుజులకునై –పాలను మురిపాలు పంచి యిచ్చు

  వారి భవిత కొరకు వచ్చు ఆపదలన్ని-దాటి ముందు నడచు ధర్మ మూర్తి .

3-అమ్మ నాన్న పిదప నాదరించెడు వాడు  -అన్న యొక్కడగును యతివ కెపుడు

   అన్న తమ్ముల ప్రేమ అక్క చెల్లెలు కోరు –ఆడరణంబుఅభిలషించు

  అత్తింట ఎన్నున్నపుట్టింటి పై ప్రేమ –వీడ దెప్పుడు కాంత వింత గాదు

అమ్మలో సగము ‘’అ’’,నాన్న లో సగము’’న్న’’-అవి రెండు కలిసిన అన్న యగును

అమ్మ వోలె సాకు అన్న తా వెంటుండి –అన్న ధైర్య మొకటి అతిశయించు

ఎచట నున్న కాని ఎప్పుడు పుట్టింటి- మేలుకోరు ఇంటి వేలుపగుచు

కంసు వంటి వానన్నగా కాన నీకు –శూర్పణఖ వంటి చెల్లెలు శోభ యగునె?

కాచి రక్షించెడి కరుణాకరునియిచ్చి-అమ్మ బ్రోవుము అవనిని అతివ నెపుడు .

17-దేవుడి వరం అన్న –శ్రీ మునగంటి వెంకటాచార్యులు –విజయవాడ -92925753560

 ఆత్మీయులైన అమ్మా నాన్నల ఆద్య౦తాల కలగలపైన కమనీయ రూపమే అన్న

నేనే మా కుటుంబం లో ఆగ్రజుడను –అందుకే తమ్మునిగా ఆ ఆప్యాయతను అందుకోలేక పోయాను

‘’అన్నా ‘’అని నోరారా పిలువ గలిగిన పేగు బంధం నాకు లేక పోయినా

జీవితం నాకొక అన్నయ్య నిచ్చింది .

నేనామిత్రుని ‘’అన్నా ‘’అని ఆదరంగా అంటే –‘’తమ్ముడూ ‘’అని ప్రతిధ్వనిస్తాడు

ఇద్దరం కలిసి మనసు పొరల్లోని ఎన్నో విషయాలను ముచ్చటిస్తాం

వృద్ధాప్యం లో నామిత్రుడు హైదరాబాద్ లో కొడుకు దగ్గరకువ వెళ్లక తప్పలేదు

ఇలా కాలం మమ్మల్ని విడదీసింది –అయినా మనసులు దూరం కాలేదు

నేను భాగ్యనగరం వెళ్ళినప్పుడు చరవాణిలో వివరం తెలుసుకొని ,నా భాగ్యం గా  స్టేషన్ కొచ్చాడు

ఆ మిత్రన్నయ్యను చూడగానే గుండె బరువెక్కింది

గొంతు మూగ బోయి కళ్ళు చెమర్చాయి

సరిగ్గా నడవలేని స్థితిలో నాకోసం స్వయంగా వచ్చిన ఆంనయ్యను చూసి చలించి పోయాను

ఆదరంగా గుండెలకు హత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్లి ఆతిధ్యమిచ్చాడు

నా కవితా సంకలనానికి ‘’అనుస్పర్శ ‘’నందించిన ఆత్మీయుడీ అన్న

ఆర్ద్ర హృదయం తో నాకు వీడ్కోలు పలికి –నాకు దేవుడిచ్చిన ఆత్మీయుడైనాడు అన్నయ్య .

18-అన్నయ్య అమల బంధం –శ్రీమతి సింహాద్రి వాణి-విజయవాడ -779939113

ఆ.వె.-అమ్మ నాన్న కలిసి అన్న రూపుగ మారి –సేవ చేయు నన్న చెల్లి కొరకు

       అన్నకెపుడు చెల్లి ఆరవ ప్రాణమ్ము –అన్న కున్న ప్రేమ అద్భుతమ్ము

ఆ.వె.-కష్ట సుఖములందు కన్నవారికి తోడు-అన్న కూడ నిలిచి యాదుకొనును

       అన్న ఉన్న చెల్లి అవనిలో కరువేది >కంటి రెప్ప వలెనె కాపు కాయు .

తే.గీ.—తనదు సుఖములన్ని త్యజియించి వేసైన-అన్న చెల్లి కొరకు అన్ని తీర్చు

        తల్ల్లడిల్లు చుండు తల్లి దండ్రి వలెను –తోడ బుట్టినట్టి తోడు కొరకు

తే.గీ.అన్నలందున మా యన్న మిన్న యనగ-చాల కర్తవ్య నిష్టతో  చక్కగాను

     తల్లిదంద్రికి తోడుగా తాను నిలిచి  -తోడ బుట్టిన వారికి త్రోవ చూపె

తీ.గీ.-తనదు జన్మమ్ము మిక్కిలి ధన్య మొండ –ప్రేమ వర్షము కురిపిస్తు పిన్నలెడల

చేయుచున్నాడు నా యన్న జీవ యాత్ర –అన్న సోదర బంధమ్ము అమలమవగ.

19-ఇష్ట దేవత అన్న –శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ –విజయవాడ –9346078829

సి—అన్న నిన్ను దలచ ఆనంద ముప్పొంగు –మరువ జాలనెపుడు మదిని నిన్ను

   కంటి రెప్పల వోలె కాచి కాపాడుచు –వెంట నంటెడి దొడ్డ వేల్పు వయ్య

   విద్యలందున నీవు విలసిల్ల వలెనని –అభిలషించెడు గొప్ప అన్న నీవు

   ఎన్ని జన్మలకైన నిను సరిపోలిన –అన్నగానగ జాల నవని యందు

ఆ.-   కలిమి లేములందు కష్టసుఖములందు –నిన్ను మించి నట్టి  నెలవు కలదె?

       ఏక గర్భమందు ఏర్పడు బంధమ్ము-త్రుంచ నలవి కాదు ఎంచి చూడ .

ఆ .-అన్న యనగా నెంతొ ఆత్మీయ భావన –పొంగి పొరలు ఎడద పోరలనుండి

     మనసు నిండ ప్రేమ మమతల నెలవైన –పేగు బంధ మిలను వీగి పోదు .

ఆ .-ఎన్ని జన్మలందు ఏర్పడు బంధమో –వీడ రాణి దెపుడు,వాడి పోదు

    రక్త బంధ మెంతొరమణీయ మౌగాడ –పూవులోన తావి పొదిగి నట్లు .

ఆ .-ఆప్త మిత్రువోలె ఆది పాడిన రీతి –మరపు రాణి గాఢ మైత్రి మాది

   కల్మషం బెరుగని గాఢాను రాగంబు –తరిగి పోదు మదిని తొలగి పోదు .

ఆ .-కష్ట సుఖము లందు ఇష్ట దేవత వోలె –తోడూ నిలిచె నతడు వీడ కుండ

    ఆది నుండి నన్ను అత్యంత ప్రేమతో –చెల్లి యనుచు పిలిచి చెలిమి జేసే .

20-అరుదైన బ్రహ్మ కమలం అన్నయ్య –శ్రీ కందికొండ రవి కిరణ్ –విజయ వాడ -9491298990

అన్న యనంగ మా’’ అమ్మ ‘’,’’నాన్న ‘’లలో సగము సగము

గుణము చూడ నది తలిదండ్రుల గుణ యుగము

తోబుట్టువులకు అతని యండ పెను నగము

దోసమేంచక అనుజుల నాదరించును ,ఇచ్చు భాగము

లక్ష్మణాగ్రాజపాండవాగ్రాజుల వలెచూపు ననురాగము

పెంచగా చూచు పెద్దల కీర్తిని ,మెచ్చగ బంధు జగము .

    తన చదువు నాపి తమ్ముళ్ళను బడికి పంపి చేయూతై నాడు

   అమ్మకు ఇంటి స్థితి గతులు ఓడలు బండ్లుగా మారినపుడు

  సహజన్ముల సంతాన యోగ క్షేమ మరయు నెల్లప్పుడు

  శిక్షించు తీక్షణత్వమున సూర్యుడు ,అనురాగ శీతలత్వామున చంద్రుడు

  ఇవ్వటమే తప్ప అడుగు టెరుగడు ,మాట తప్పడు ,మడమ త్రిప్పడు

అన్నకు రాముని ,తమ్మునకు కైక సుతుని పేర్కొంటారు విజ్ఞులు

అన్నయ్య లందరూ అలాగా ఉంటె ప్రతి ఇల్లూ అగు నయోధ్య

భరతుడు నేనైనా కాకున్నా ,మా అన్నయ్య రాముడే

దేహానికి హృదయం రీతి ,అన్నయ్య మా కుటుంబానికి

మనకంటూ ఎమున్నవీలోకాన ?రక్తసంబంధము ,తోడ బుట్టిన వాడూ కాక ?

పూలూ చెట్లూ ఎన్నున్నా ,తావి ఉన్న తావునకే కదా పూల సజ్జలు చేరికలు

పూవు వంటి అన్నయ్యను శోభిల్ల జేయు ‘’తావి ‘’వదిన

ఇంటి ఇల్లాలు చూపు ఆడరణాప్యాయతలే ఇంటి గడప గవాక్షాలు

దుర్భావన వాయువులు వీడి సద్భావన పవనాలతో ఆయిల్లు విలసిల్లగ .

  సశేషం

శ్రీ దుర్ముఖి ఉగాది శుభా  కాంక్షలతో  

           మీ-గబ్బిట-దుర్గా ప్రసాద్  -7-4-16-ఉయ్యూరు

Posted in కవితలు | Tagged | Leave a comment

ఉగాది నాడు గండి గుంత దత్త గుడి లో నా పంచా0గ శ్రవణం

ఉగాది నాడు గండి గుంత దత్త గుడి లో datta 001 పంచా0గ శ్రవణం

 

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ దుర్ముఖి ఉగాది శుభాకాంక్షలు

Inline image 2

Inline image 3

Inline image 1  
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -3

   మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -3

11- ఆత్మీయ అనురాగ పుంభావ మూర్తి అన్నయ్య –శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –మచిలీపట్నం -9247558854

ఊహ తెలిసిన నుంచి ఉద్యోగ భారంతోనో ,వయసు దూరం తోనో

నాన్న నాకు అరుదుగా కనిపించే వ్యక్తి అయినపుడు

‘’అన్న ‘’అంటే అందుబాటులో ఉండే’’ నాన్నే ‘’నని పించేది

   బజారుకెళ్లాలన్నా ,బడి కెళ్లాలన్నా

   అమ్మ రక్షణ భారాన్ని తానే వహిస్తూ నేటికీ  

   నా దైన్యాన్ని పోగొట్టి సైన్యం లా నిలబడతాడు .

అమ్మ గోరుముద్దల్లోను నూతి చన్నీళ్ళ స్నానాలలోను

తిరునాళ్ళ తీపి జీడి కొనుగోళ్ళ లోను ,

వేసవి వెన్నెలరాత్రుల ఆరు బయట పడకల్లోను  జత కాడే కాదూ

చదువు సందేహాలలో సరస్వతి సందేశం లా సంస్కరించే వాడు మా అన్నయ్య .

వస్తువులను పోగేసుకోవటమే అభి వృద్ధికి

కొలమానమను కొనే రోజుల్లో నూ

మనుషుల్ని ,మనసుల్ని ముడి వేసుకోవటమే మూలం

అన్న అభ్యుదయ వాదిలా అగుపిస్తాడు మా అన్నయ్య .

కోపం లో దూర్వాసుడైనా పట్టుదలకు విశ్వామిత్రుడు

ఆదరణ లోను ,ఔదార్యం లోను వసిస్టులాంటి వాడు

నా నాలుగు పదుల వయసు లోను

అంటి పెట్టుకొన్న ఆత్మీయతకు ,అంటుకొంటున్న అనురాగానికి

పుంభావ మూర్తి మా అన్నయ్య .

12-అనురాగపు  కొండ అన్నయ్య  –శ్రీమతి గుడిపూడి రాధికా రాణి –మచిలీపట్నం –9494942583

వెన్నంటే అన్నంటే –మిన్నంటే ప్రేమున్నా

వాడిపైన వాడియైన –ఫిర్యాదుల ఫిరంగి మోతలు

ఇదంతా నా పెళ్లి వరకే –అన్నవదనం విరిసిన దిరిసెన

అప్పగింతలు నాడు కురవని మేఘం

-యెడ చాటుతెలిపింది యెద చాటు మమత  

దూరంగా నిలబడనిదే  -ఆసాంతం కనబడరు కదా .

నేను ,అన్నయ్యా వీణా ,తీగలుగా వేరు వేరైనా

పలికేది ఒకే రాగం –అనురాగం

ఆలయ స్తంభాలుగా వేరు వేరు

మోసేది ఒకే ప్రాకారం –మమకారం

మా అన్నయ్య తాను విల్లుగా కదలక నిలిచి

నను రివ్వున సాగే శరంగా మలిచి

 తను కత్తిపోట్లు తిన్న వెదురుగా నిలిచి

 నను వేణు మధుర నాదంగా మలిచి

తను చినుకు పడి చి౦దేసే మట్టిగా నిలిచి

నను ఆహ్లాదపు ఆత్మీయపు పరిమళం గా  మలిచి  

తను ఆలయ పునాది రాయిగా మిగిలి

నను గోపుర శిఖరంగా నిలిపి ….

ఇప్పుడు ఫిర్యాదుల్లేవ్ ,ఫిరంగి మోతల్లేవ్

కొండ దిగి దూరంగా నుంచుంటే

కొండ ఉన్నతి తెలిసింది

మా అన్నయ్య బంగారు కొండ .

13-రక్షాబంధనమే అన్నయ్య –శ్రీమతి మేరీ కృపాబాయి –మచిలీపట్నం -9989347374

  అన్నయ్య౦టే కుటుంబ అనుబంధం

అన్నయ్యంటే సామాజిక సంబంధం

విశాల సమాజం లో ఎందరో అన్నయ్యలు

అనాధ చిన్నారిని ఆదుకొనే వేళ అతడే అన్నయ్య

పేదరికం లో మగ్గి పోయే వేళ అమ్మాయికి ఫీజు కడితే అతడే అన్నయ్య

చిమ్మ చీకటిలో చిక్కుకున్న స్త్రీకి దారి చూపి

రక్షించే వేళ అతడే అన్నయ్య .

సమస్యల వలయం లో చిక్కుకున్న వేళ

పరిష్కారం చూపితే అతడే అన్నయ్య .

అన్నయ్య భావన విశ్వ వ్యాపితం

అన్నయ్య అనురాగం ఎల్లలు లేనిది

అన్నయ్యంటే కుటుంబ బంధం

అన్నయ్యంటే సామాజిక అనుబంధం

అన్నయ్యంటే రక్షా బంధం .

14-అమ్మ అయ్యల కలగలుపు అన్నయ్య –శ్రీమతి కందాళ జానకి –మచిలీపట్నం –

అమ్మ అయ్యల కలగలుపు అన్నయ్య

ధర్మ పరిపాలకుడే మన రామన్న

పాండు పుత్రుల బలం ధర్మ రాజన్న

సోదర సోదరీ ప్రేమకు మూలమన్న

తలిదండ్రుల ఋణం తీర్చు తొలి తనయుడన్న  

తండ్రి ప్రేమను పంచి తనవి నిచ్చునన్న

తన వారిగా తలచి నందర పైకి తెచ్చు

వదిన ప్రేమే తనకు పేరు మంచిగా నిచ్చు

పుట్టింటి బంధాన్ని తన తోడ ముడి వేయునన్న

స్వార్ధ మెరుగని సాదు శీలియే మా అన్న

ప్రేమామృతాన్ని పంచేది అన్నయ్యే

ఆర్తి వేడిన చెల్లి మానాన్ని కాపాడె నన్న

కన్నయ్యలాంటి అన్నయ్యలున్న దేశం నాది

అన్ని బంధాలకు ఆది మూలం మనది

నిత్య కళ్యాణ పచ్చ తోరణంగా

పిల్ల పాపల తోడ చల్లగా వర్ధిల్లు అన్న

మాకు పసుపు కొమ్మే చాలు ,పట్టెడు కు౦కుమే చాలు

అన్నల౦దరకు ,మా అన్న లందరకు మంగళం శుభ మంగళం .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-16-ఉయ్యూరు

 

 

 

Posted in కవితలు | Tagged | Leave a comment

3-4-16-ఆదివారం సరసభారతి నిర్వహించిన శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకల దృశ్యమాలిక 

3-4-16-ఆదివారం సరసభారతి నిర్వహించిన  శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకల దృశ్యమాలిక

https://plus.google.com/u/0/+GLNSarmaG/posts/L5S8yBk2a8r?pid=6269541609958980034&oid=115752370674452071762

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

4-4-16 సోమవారం సాయంత్రం ఉయ్యూరు శ్రీ శాంతి నికేతన్ హైస్కూల్ వార్షికోత్సవ సభలో ముఖ్య అతిధిగా నేను పాల్గొన్న చిత్రాల మాలిక 

This gallery contains 91 photos.

More Galleries | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -2

    మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -2

         5-అన్నయ్యకు స్వాగతం –కుమారి .మాది రాజు బిందు వెంకట దత్తశ్రీ –ఉయ్యూరు -9666020842

ఓ విలక్షణ మైన ప్రేమ స్వరూపం అన్నయ్య

జీవిత ప్రయాణం లో ఓ తోడు అన్నయ్య

ఆడపిల్లలకు పుట్టింటి బలం అన్నయ్య

అమ్మానాన్న ల అనురాగ రూపం అన్నయ్య

అందుకే మనం –

రామ లక్ష్మణులను ,బలరామ క్రష్ణులను

నేటికీ మరువ లేకున్నాం

అలాంటి అన్నయ్యకు ప్రేమ పూర్వక స్వాగతం పలుకుతూ

చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాన్ని సంపాది౦చు కొంటున్నది

సరసభారతి ‘’మా అన్నయ్య ‘’కవి సమ్మేళనం .

ఓ దుర్ముఖీ !ఇంతమంది అన్నయ్యలను

కవితాపరంగా పరిచయం చేస్తున్న నీకు వందనం

నూతన తెలుగు ఏడాది నాడు అన్నా తమ్ముల అక్కా చెల్లెళ్ళ

ఆప్యాయ అనురాగాలు మరింత ఇనుమడించాలని

ముగురమ్మల మూల పుటమ్మను భక్తితో వేడుకొంటున్నా.

           6- దార్శనిక విక్రా౦త కీర్తి అన్న  –శ్రీ నవులూరి రమేష్ బాబు –ఉయ్యూరు -9704071079

తే.గీ//శ్రీమదాది గణేశుడు చిన్మహితుడు –సకల సౌభాగ్య సౌకర్య శతము సతము

సుంత సద్బుద్ధి సిద్ధింప జూచు చుండి –ఆదుకొనుట నందరికిని ‘’పెద్దన్న’’యగును .

మత్త కోకిల –‘’అమ్మ ‘’యన్ పద పూర్వభాగము నర్ద వంతము జేయగా

             ‘’అమ్మహాత్ములు ‘’’’నాన్న ‘’లోని పరార్ధ భాగము జేర్చుచున్

             ఇమ్మహిన్ పదమేర్చె’’అన్న ‘’గ నెంత లెంతలొ నేర్పుగా

            దిమ్మ దిర్గిన బ్రహ్మ బుర్రకు తేజ మెంతయు జారెగా .

ఉ-ముందున బుట్టి ,యాతడు తమోంతక తేజుడు భానుడే యగున్

   ముందుగ వచ్చు నట్టి కడు మోటగు కష్టములెల్ల తానె,యా

   నందము తో భరించి ,తదనంతర సంతతి కంతకంతకున్

  సుందర సౌఖ్య మంది యిడు చొప్పున వర్తిలు ,’’అన్న ‘’యన్నయే .

మత్తకోకిల –అమ్మ నాన్నల యర్ధ దేహము లైన రెండు సగాలకున్

             నమ్మకమ్మును రూప మిచ్చియు ,నాణ్యతన్  గలిగించగా

             తమ్ముగుర్రల పుణ్య మార్గము తప్ప కుండగ చూచుటన్

             నెమ్మనమ్మున దైవ మట్టుల  నిత్య పూజలు ‘’నన్న ‘’కే .

సి –చిన్నతనమునుండి చేరువగా నుండి సకల సమస్యలు చక్క దిద్దు

    యుక్త వయసు నందు యోచన బెంచుచు,సలహాలనిచ్చుచు సాకు చుండు

    కౌమారమందు సకలమును తానుగా ,అడుగడుగున తానె ఆదుకొంచు

     వృద్దాప్యమున  గూడ శ్రద్ధగా క్షేమమ్ము ,జూచు చుండెడునట్టి శుద్ధ జీవి

తీ.గీ //పాఠ్య భేదాలు లేని పాఠ మట్లు,స్వార్ధమే లేక బాధ్యతల్ సక్రమ గతి

         పూర్తి చేసెడు సంపూజ్య పుణ్యుడతడు,తమ్ము గుర్రల ‘’కన్నయ్య ‘’దార్శనికుడు .

        ఆదరాత్మీయతా పూర్ణ వార్ధిఅన్న !సుందరానురాగ ప్రభావ స్పూర్తి అన్న

       దివ్య తేజంబు వెదజల్లు దీప్తి అన్న –ఆర్తి పోకార్చు విక్రా౦త కీర్తి అన్న.

                  7-అన్నయ్య ప్రేమ –శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ –ఉయ్యూరు -9666020842

అన్నయ్యంటే నాకిష్టం –మా అన్నయ్యంటే నాకెంతో ఇష్టం

ఈ ఇష్టం ఇప్పటిదికాదు —ఎప్పటిదో

 బ్రతుకు పొరల్లో కలిసి తిరిగిన జ్ఞాపకాలు

అమాయక జీవితం లో ,సమర్ధతా సామర్ధ్యాలను పెంచినవాడు

ఎందుకు వెళ్ళానో గుర్తు లేదుకాని

చెంప చెళ్ళు మని పిస్తే ఏడుస్తూ వెళ్ళిపోయిన నాకోసం

సైకిల్ పై నా వెనకే వచ్చి ‘’ఎందుకొచ్చావురా ?’’అని

బుజ్జగించిన సంగతి నేనెన్నడూ మరవనే లేదు

తల నిమిరిన ఆ చేయి  అమృత హస్తమే అనిపించింది

మా అన్నయ్య ప్రేమ కొండంత

గగనాంతపు రోదసిలో విహరిస్తున్న

మా అన్నయ్యే ఎన్నటికీ నాకు తోడూ నీడ .

                  8-కన్నయ్యే అన్నయ్య –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –ఉయ్యూరు -9395379582

సుభద్రకు ప్రత్యక్షంగా ,మనకు పరోక్షంగా

అన్న ప్రేమను పంచిన ఆ కన్నయ్యే మన అన్నయ్య .

నేను సైతం అంటూ ఓ భరోసా ఇస్తూ

ఆ బంధాన్ని రాఖీతో పెనవేసిన వాడే మన అన్నయ్య .

ఆడపిల్ల ఆడ ఉన్నా, ఈడ ఉన్నా నేనున్నానంటూ

అమావాస్య పండక్కి (దీపావళి )పుట్టింటికి రాని

సోదరి ఇంట భగినీ హస్త భోజనం చేసే కన్నయ్యే మన అన్నయ్య

కాలానికి కరగనిది ,ఏ ప్రలోభాలకు లొంగనిది అన్నయ్య  ప్రేమ .

      9-వీర బంధుడు అన్నయ్య –శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం –ఆకునూరు -9490420476

ఆకాశం లో ఒక తార  భువిలోని ఓ జంట మెరుపులా మెరిశాయి 

ఆ మెరుపులో మోక్షమే కలిగింది

ధర్మార్ధ కామ మోక్షాలు ప్రజ్వరిల్లాయి

సంతాన ప్రాబల్యం ఓ ప్రబంధ వేదిక

అమ్మానాన్న ల ముద్దు మురిపాలు అగణ్యం

శరీర ధర్మం ఓ ప్రకృతి ప్రభంజనం

అన్నయ్య ఉన్నాడని దరి చేరే చెల్లెలు

అక్కయ్య కలదని చేరే తమ్ముడూ ఉంటారు కాని

తల్లిదండ్రుల చెంత ఉండే దెవ్వరు ?

 వీర బంధుడు ఒక్కడే ఒక్కడు –అతడే అన్నయ్య ‘’గణ నాధుడు ‘’.

        10-అన్నయ్య మనసు నిర్మలం –శ్రీమతి పెళ్లూరి శేషుకుమారి –నెప్పల్లి-9392458160

అన్నయ్య అనే కమ్మని పిలుపు లోని మార్దవాన్ని

రక్త సంబంధపు అనుబంధాన్నీ రంగరించి

అమ్మా నాన్నా ,అన్నా తమ్ముడు ,అక్కా చెల్లి బంధాలతో

ముడిపడిన కుటుంబ ఆత్మీయతను పంచుకొన్న మనం

మతమేదైనా ,కులమేదైనా ,,మానవతే మన నైజం .

వసుధైక కుటుంబం మన భారతం

ఆప్యాయతల ,అనుబంధాల సుమహారం .

అందునా !ఈ ఉగాది లో అన్నయ్య ఆత్మీయతను

అభిమానాన్నీ ప్రస్పుటీకరిస్తూ

రక్త సంబంధం లేకున్నా ‘’అన్నయ్య ‘’అనే పిలుపు అవగాహించి

పరాయి ఆడ పడుచును సోదరిలా ఆద రించాలనీ

అన్నగా అక్కున చేర్చుకోవాలని నినదిస్తూ

వాస్తవాన జరిగే అత్యాచార ఘాతుకాలను నిరసిస్తూ

నిండు మనసుతో ‘’ఈ సందోహాన్ని’’అపెక్షిస్తున్నాను

సృష్ట్యాది నుండి మరల మరల వచ్చినా

నిన్న మన్మధ –నేడు దుర్ముఖి

ఈ వసంత శోభలో కోయిలల కుహు కుహూ రాగం కూని రాగమైనా

ఆనవాయితీ తప్పని షడ్రుచుల ఉగాది పచ్చడి ఊరిస్తుంటే

‘’అన్నయ్య ‘’అనే పదం లోని నిర్మలత్వం తో

దుర్ముఖి ని స్వాగతిస్తున్నాను .

        సశేషం

శ్రీ దుర్ముఖి ఉగాది శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-4-16-ఉయ్యూరు

 

Posted in కవితలు | Tagged | Leave a comment

మా అన్నయ్య –ఆత్మీయ కవితా లహరి

మా అన్నయ్య –ఆత్మీయ కవితా లహరి

సరాసభారతి  ,శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది .వేడుకల సందర్భంగా 3-4-2016 ఆదివారం  ‘’మా అన్నయ్య ‘’శీర్షిక పై నిర్వహించిన ఆత్మీయ కవి సమ్మేళనం లో వెల్లి విరిసిన కవితా స్రవంతి-

           ఉయ్యూరు విశిష్టత –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు –విజయవాడ -9908344249

శా-ఉయ్యూరా !ఇది పండితుల్ కవులు నత్యుత్సాహ వంతుల్ సదా

   నెయ్యంబున్ గడు ప్రేమ జూపు ఘనులున్ ,నిత్యంబు సాయంబులున్

   చెయ్యంది౦చెడువారు గల్గు పురి ,యాక్షేపింప బోరెవ్వరున్

   వెయ్యండికను పూల హారములు వైవిధ్యంబు కీర్తి౦చు చున్.

తే//పంచదార కర్మాగార బస్తి గాన –ఇచ్చట కవితలన్నియు ముచ్చటింప

      నోలలాడించు నెప్పుడు నూయ బాపి –మధుర సుధలనిచ్చుచు మన మానసంబు .

తే//అతిదులన్ గౌరవిం చెడుయశము గల్గి –సంస్కృతీ సంప్రదాయముల్ శాశ్వత మయి

    తగువు లాడక నిత్యము దయను పంచి –ధర్మ సత్యంబులను గల్గి ధరణి యందు –

   నెల్లెడల పొందు సత్కీర్తి యప్పురంబు .

ఉ//అబ్బురమౌ విధంబునను హారములన్ తెలుగమ్మ కేయగన్

     గబ్బిట వారు నిల్పిరిట ఖ్యాతిని పెంచగ సాహితీ సభన్

     జబ్బలు గట్టిగా చరఛి జట్టుగ పిల్వగ సత్కవీశులన్

     దెబ్బకు నాంగ్ల దెయ్యమును తెల్గున కైతలకున్ దిగెన్ గదా .

సి //ఎందరో నాయకు లెందరో గాయకు లెందరో సత్కవులిక్కడుండె

      ఎందరో సజ్జను లెందరో పండితు లెందరో సంస్కారు లీడనుండె

     ఎందరో అతిదులెందరో అభ్యాగతు లకీ పురంబును తోడు నిచ్చె

     ఎందరో ఘనులకు నెందరో బుధులకు నిచ్చోట గౌరవంబెప్పుడుండె

    అట్టి అలరారు ఉయ్యూరు ఆంద్ర మందు –గొప్ప గ్రామమై వెలుగొంది మెప్పు పొందు

    స్థానికుల కెప్డు దివ్యమౌ  స్థాన మిచ్చి –ఎల్ల వేళల సంరక్షించు నీ యుగాది .

              మా అన్నయ్య –ఆత్మీయ కవితా స్రవంతి -1

                          1-నా (అ)న్న వసుధ బసవేశ్వర రావు –వెంప-9490832787

చిన్నప్పుడు చీకట్లో నడుస్తూ –భయం తో ‘’నాన్నా ‘’అని అరిచా

‘’నీ వెనక నేనున్నాలే పద ‘’-అన్నాడు నాన్న

కష్టాలవాకిట్లో నడుస్తూ –మళ్ళీ భయం తో –‘’నాన్నా ‘’అని అరిచా

‘’నీ వెనక నేనున్నా పద ‘’-అన్నాడిప్పుడు మా అన్న .

              2-చిన్నన్నయ్య –శ్రీ డా .రాచకొండ నరసింహ శర్మ ,ఏం డి.-విశాఖ పట్నం -0891-6671-471

విశ్వమని మేము పిలుచు న –శ్వర కీర్తి యుతు నతి వినమ్రుని,సు కదా

విశ్వము లోన మహా రదు –విశ్వమును వలచిన వాని వినుతింప నగున్ .

      ఈ రా.వి.శాస్త్రి కీరితి –ఏరాడను కొండ మించి ఎవరెస్టగుటన్

     తీరాన నేను నిల్చితి –గారాబము మదిని నిండి కన్నీరొలుకున్  .

నిరపరాధులైన నిరు పెదలనెపుడు –వాదించి విడి పించు వాద యుక్తి

‘’ఘన పారు ‘’లను మించు దన ధారణా శక్తి –సాంప్రదాయము వీడి సాగు ముక్తి

శ్రమ జీవి సాదలను  శ్రవణింప నాసక్తి-సిద్ధాంతములు దాటు స్నేహ శుద్ధి

తా నెరుంగక యుండి,తన లోన లీనమై –దాగి యుండిన గాఢ దైవ భక్తి

ధరను జరుగు చుండు అనేక దారుణముల –క్రందు దీన జనాళి ఆక్రందనలకు

ఎదను స్పందించు శక్తియు –ఇన్ని గూడి –‘’కధక చక్ర వర్తి’’యితండు కాక యెట్లు ?

  షేక్సిపియర్ కాదులే ,చేక్కోవుయును కాదు -కాళిదాసీతండు కాదు కాని

ప్రాచీన నూతన రచన లందీపాటి-ఉపమాన వైదగ్ధ్య ముండు టరిది

నవ రసముల మహార్ణవము లందీరీతి-ఉర్రూత లూగించు ఓజలేవి ?

పాటకపు జనుల బాధల చిత్రించు –నితని కధా శిల్ప మెచట దొరకు ?

కధలలో నవలల ,నాటకమ్ము లందు –మంచి చెడ్డల భేదమ్ము మనకు నేర్పె

‘’ఉత్తరా౦ద్రుల యాస ‘’ పెల్లుబుకు చుండు-యీతని అనన్య సాధ్యమౌ వ్రాత లందు .

            3-మా శర్మన్నయ్యచిరంజీవి  –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు -9989066375

అన్నయ్యంటే మాకందరికీ విపరీతమైన అభిమానం

తాను కాలుతూ వెలుగినిచ్చిన కొవ్వొత్తి మా అన్నయ్య

ఇంటికెప్పుడూ దూరంగానే ఉన్నా

మా ఇంటిల్లి పాది గుండెల్లో ఉండేవాడు

గాంధీ గారి’’ స్మోకింగ్’’ ఇంగ్లీష్ పాఠం

మా సావిట్లో చెమటలు కక్కుతూ వేసవిలో చెప్పటం

తాను’’ చైన్ స్మోకర్ ‘’అని మాకు తెలిసినా

మేమూ ,అన్నయ్యా చిరు నవ్వులు చిందిస్తూ

వినటం చెప్పటం ఎప్పటికీ మర్చి పోలేను

అన్నయ్య కొన్న తాజ్ మహల్ మార్బుల్ బొమ్మ

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఇస్టమే

అన్నయ్య ఇంగ్లీష్ పరిజ్ఞానం సాటి వారిలో లేనేలేదని

తాడంకి హైస్కూల్ ఇంగ్లీష్ డిబేటింగ్ లో

ఎప్పుడూ అన్నయ్యే ఫస్ట్ అని

అన్నయ్య క్లాస్ మేట్లు  ఆ తర్వాతెప్పుడో చెబితేకాని  అర్ధం కాలేదు

గోర్కీ సాహిత్యమంతా దాచాడు మాకోసం

అమ్మ అంటే ప్రేమ, నాన్నంటే గౌరవ భయం

చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళన్నా అభిమాన దనం

హోస్పేటలో పాతాళ భైరవి ,మిస్సమ్మ

సినిమాలు నాకు  చూపించి వాటిపై చక్కని విమర్శ చేసేవాడు

రైల్వే స్టేషన్ లో అరగంటకో సారి అరకప్పు కాఫీ తాగుతూ, తాగిస్తూ

బియ్యపు గింజల పలువరుసతో చిరునవ్వు చిందించే వాడు  

జి .ఎల్ .శర్మగా అన్నయ్య సంతకం చెక్కు చెదరని జ్ఞాపకం నాకు

అకస్మాత్తుగా 32 ఏళ్ళకే గుండె ఆగి అన్నయ్య చనిపోతే

ఇల్లు శోక సముద్రమే అయింది  

అన్నయ్యఎప్పుడూ  మా గుండెల్లో, స్మృతిలో  చిరంజీవే  .

     4-రామయ్యన్నయ్య –శ్రీ డా.వేదాంతం శ్రీధరాచార్యులు –ఉయ్యూరు

శ్రీరాముడు ఆదర్శ అన్నయ్య

మనం అవ్వాలి రామానుజులం

రామయ్య రాజ్యమే అన్ని కాలాల ప్రభుతల ఆశయం

రామయ్యన్నయ్య అన్న మాట ,నడచిన బాట సర్వ శ్రేష్టం .

   సశేషం

శ్రీ దుర్ముఖి ఉగాది శుభా కాంక్షలతో

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-16

Posted in కవితలు | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

   సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలలో3-4-16 ఆదివారం  ”మా అన్నయ్య ”పై కవి సమ్మేళనం నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే . 30కి పైగా వచ్చిన కవితలు చిక్కగా చక్కగా ఉన్నాయి .వీటి ని ఇదివరకు సరస భారతి ”మాఅ క్కయ్య ”పై  కవి సమ్మేళనం నిర్వహించి పుస్తక రూపం లో తెచ్చినట్లే ఈ సారి   కూడా ఈ కవితలను పుస్తక రూపం లో అందజేయాలన్న కోరిక ఉందని వేదికపై తెలియ జేయగానే సరసభారతి కార్య వర్గ సభ్యురాలు శ్రీమతి సీతంరాజు మల్లికాంబ గారు వెంటనే స్పందించి తాను ఈ  పుస్తకానికి స్పాన్సర్ గా ఉంటానని సభా ముఖం గా తెలియ జేశారు .పుస్తకాన్ని తమ తలి దండ్రులకు అంకితమివ్వాలని కోరారు  ఆమెను కరతాళ ధ్వనులతో అభినందించాం  .ఈ బాధ్యతను రమ్య భారతి సంపాదకులు శ్రీ చల పాక ప్రకాష్ గారిని స్వీకరించ వలసినదిగా కోరగా వెంటనే అంగీకరించారు వీరిద్దరికీ కృతజ్ఞతలు .
  పుస్తకం మరింత మంది కవుల కవితలతో ఉంటె, నిండుదనం ,సార్ధకత ఉంటుందని భావించాం . కనుక ”మా అన్నయ్య ”పై ఇంకా ఎవరైనా కవితలు రాసి పంప దలచి నట్లయితే 20-4-16 లోపు రాసి నెట్ ద్వారాకాని పోస్ట్ లో కాని నాకు కాని ,ప్రకాష్ గారికి కాని పంపవలసినదిగా కోరుతున్నాం-దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం PDF పుస్తకం మీకోసం

https://sarasabharati-vuyyuru.com/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9A%E0%B1%81%E0%B0%B0%E0%B0%A3%E0%B0%B2%E0%B1%81/diavadattam/

daiva chittam 1 001 daivachittam 3 001 daiva chittam 4 001 daiva chittam 2 001 aranya2 001
ca7 001
ca6 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆ సంస్కారానికి నమస్కారం

ఆ సంస్కారానికి నమస్కారం

‘’శ్రీ హర్ష నైషధం –దర్శన పరామర్శ ‘’అనే సంస్కృత పరిశోధన గ్రంధాన్ని రాసి ,పి .హెచ్ డి.పొందిన  డా.శ్రీ ముళ్ళపూడి జయ సీతా రామ శాస్త్రి గారు సంస్కృతాంధ్రాలలో ఉద్దండ పండితులు .డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ ,డా .శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి ,తత్వ శాస్త్ర పారంగతులు శ్రీగరిమెళ్ళ సోమయాజులు శర్మగారు వంటి సంస్క్రుతంద్రాలలో లబ్ధ ప్రతిష్టులైన కవి పండితులకు గురుస్థానం వహించి కైమోడ్పు లందుకొనే సాహిత్యోపజీవి శాస్త్రిగారు . తల్లిగారు శ్రీమతి బాలమ్మగారువీరికి బాల్యం లోనే  అమర కోశం ,రమాయణ పారాయణం ఉపదేశించారు .కావ్య శాస్త్రాలలో సంప్రదాయ శాస్త్ర పద్ధతిలో పాఠం చెప్పి లోతులు తచి చూపించిన వారు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి  వరేణ్యు లు .’’పుత్ర సంజీవనం’’అనే సంస్కృత మహా కావ్యాన్ని రచించిన తండ్రిగారు  శ్రీ నారాయణ  శాస్త్రి గారు ఆది గురువులు .అది తమ అదృష్టపు తొలిదశగా  భావించారు శాస్త్రిగారు .

భాషా ప్రవీణ చదివే రోజుల్లో పూజ్య గురువులు ఉత్తర నైషద కావ్య కర్త శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారు .వీరి శిష్యరికం  ‘’జ్ఞానా౦జన శలాక తో చక్షురున్మీలనం చేసింది  ‘’అని కృతజ్ఞత చెప్పుకొన్నారు .ఇది  వారి విద్యాజీవితం లో రెండవ దశ అన్నారు .

కవి సమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు విమర్శకునిగా రూపొందించారని ,మంచిమనిషిగా మలచిన వారు మిత్రులని ,మంచి ఆదర్శ ఉపాధ్యాయునిగా తీర్చి దిద్దినవారు తన విద్యార్ధులే నని ,వీరందరూ తన జీవిత మధ్య భాగాన్ని ప్రభావితం చేశారని కొండంత ఆనందం తో,వినయం తో  కృతజ్ఞతలు తెలుపుకొన్నారు .

బ్రహ్మశ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు ‘’నైషద కావ్య రహస్యాలను ’’ వందలు,వేలు ‘’గా వివరించి జ్ఞాన జ్యోతిని ఉద్దీపనం చేయటమే కాక ,’’చింతామణి మంత్రం’’ఇచ్చి ఆశీర్వదించారు .ఈ ఆశీః ఫలితమే ‘’శ్రీ హర్ష నైషధం –దర్శన పరామర్శ ‘’అనే పరిశోధన గ్రంథమని అత్యంత వినయంగా చెప్పుకొన్నారు .కామ కోటి పీఠ పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల అనుగ్రహ భాగ్యం పొందిన ధన్యుడనని శాస్త్రిగారు చెప్పుకొన్నారు .ఈ అనుగ్రహానికి వేసిన చివురులే –ఆచర్యవర్యులు శ్రీ గాలి పార్ధ సారధి రావు ,శ్రీ బి ఏం చతుర్వేది ,ఆచార్య పుల్లెల శ్రీ రామ చంద్రుడు ,శ్రీ భాగవతుల కుటుంబ శాస్త్రి ,శ్రీ చెరువు సత్య నారాయణ శాస్త్రి ప్రభ్రుతుల శుభాశీస్సులను ఎన్నటికీ మరచి పోనీ సౌజన్యం వారిది .ప్రచారానికి ,ఆర్భాటానికి ,వేదిక లెక్కి సన్మానాలందుకోవటానికి ,పురస్కారాలు స్వీకరించటానికి వారు పూర్తిగా విముఖులు .

‘’నైషధీయ చరితామృతం ‘’అనే పుస్తకం లో శ్రీ హర్ష మహాకవి కవితా సామర్ధ్యాన్ని వివరిస్తూ చివరగా ‘’పవిత్ర మత్రాతనుతే జగద్యుగే స్మృతా రసక్షాలన ఏవ యత్కథా-కదం న సా మద్గిర మావిలా మపి స్వసేవినీ మేవ పవిత్ర యిష్యతి ‘’అనే శ్లోకం ఉదాహరించారు  .దాని అర్ధం ‘’నా వాక్కులు స్వచ్చాలు కావు ,కాని పుణ్యశ్లోకు డైననలుని కీర్తించటానికి పూను కొన్న వాక్కులివి .కలి  గ్రస్తమైన జగత్తు ను స్మరణ మాత్రం చేత పవిత్రం చేసే ఈ కద-నా వాక్కును పవిత్రం చేయ కుండా ఉంటుందా-అనే ధైర్యం నాకుంది .’’ ఈ శ్లోకం శ్రీ హర్షుడు ముందు చూపుతో నా వంటి వాడి కోసమే రాసి ఉంటాడు .ప్రస్తుతం ఇది నా వాక్యమే ‘’అన్నారు నైషధం పై పరిశోధన చేసి న విశ్లేషకులు శ్రీ శాస్త్రి గారు .ఇది వారి వ్యక్తిత్వానికి అన్నివిధాలా సరి పోలుతుంది .

ఇంతటి విశిష్ట వ్యక్తీ ,ఆచార్యులు ,అనుస్టానపరులు శ్రీ జయ సీతా రామ  శాస్త్రి  గారి తో నాలుగు నెలల క్రితం నాకు టెలిఫోన్ లో పరిచయం చేయించారు డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రిగారు .అప్పుడు వారితో మాట్లాడి,పరిచయం పొంది ,సరసభారతి పుస్తకాలు వారికి అందజేసి  వారినుండి వారివీ, వారి తండ్రిగారివీ అరుదైన గ్రంధాలను వారి నుండి అందుకొని ,ఆ తలిదండ్రుల సంస్కృత సాహిత్యసేవలను ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం’’రెండవ భాగం లో అంతర్జాలం లో రాశాను .ఈ విషయం వారికీ ఫోన్ లో నివేదించాను .చిరునవ్వే వారి సమాధానం .

సరసభారతి నిర్వహించే   శ్రీడుర్ముఖి ఉగాది వేడుకలలో వారిని ఆహ్వానించి సత్కరించాలని మనస్పూర్తిగా భావించి ఫోన్ చేశాను .’’నేను ఇలాంటి వాటికి దూరం గా ఉంటాను .వేదిక లెక్కను .సత్కారాలు అసలు నాకిష్టం లేదు ‘’అని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు .ఈ విషయం శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి చెవిలో ఫోన్ ద్వారా వేశాను. వారొక నవ్వు నవ్వి ‘’వారంతే.వారి సభల్లోనే వేదికపై కూర్చోరు .ప్రేక్షక స్థానం లోనే ఉంటారు .అయినా ప్రయత్నం చేశారు కదా .వారికిష్టం లేనిది మనం చేయరాదు ‘’అని సలహా ఇచ్చారు .ఔదల దాల్చాను .అందరితో పాటే వారికీ ఆహ్వాన పత్రంపంపాను .

మార్చి 27వ తేదీ ఆదివారం వారికి ఫోన్ చేసి ఆహ్వానం అందిందా అని అడిగాను .అందిందన్నారు .’’మీరు తప్పక రావాలి .మీ సమక్షం లో కార్య క్రమం జరగాలని నా కోరిక .వేదికపైకి రాకున్నా క్రిందనే ఉందురు గాని ,తప్పక రండి .కారు పంపిస్తాను ‘’అన్నాను .’’అలాంటి పిచ్చి పనులు చేయద్దు .కారు పంపద్దు . మీరు మొదటిసారి నాలుగు నెలల క్రితం నాకు ఫోన్ చేసినప్పుడు నా భార్య కు పుట్టపర్తి శ్రీ సాయిబాబా వారి హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ చేయింఛి అక్కడ ఉన్నాను  .అప్పటినుండి మీరు గుర్తుండిపోయారు.ఆమెకు నేనే అన్నీ అయి సేవ చేస్తున్నాను. కని పెట్టుకొని ఉంటున్నాను .ఆమెను వదిలి బయటికి రావటం కష్టమే . మీ రచనా వ్యాసంగామూ బాగుంది . ప్రయత్నం చేసి ఆ రోజు ఏదో ఒక సమయం లో వచ్చి చూస్తాను .’’అన్నారు .మహదానందం వేసింది .’’కృతజ్ఞతలు .మీ రాక మా అదృష్టం ‘’అన్నాను వినయంగా .

నిన్న 3-4-16-ఉగాది వేడుకలలో సాయంత్రం సుమారు 6-30 నుండి వేదికమీదనే ఉండిపోవలసి వచ్చి న కారణంగా ఎవరు వచ్చారో తెలుసుకోవటం కష్టమైంది .శాస్త్రిగారు పంచె కట్టు తో వస్తారని వారికోసం నా చూపులు అన్ని వైపులకు ప్రసరింప జేసి  చూస్తూనే ఉన్నాను .నేను అసలు ఇంత వరకు వారిని ప్రత్యక్షంగా చూడనే లేదు వారి ఫోటో కూడా వారి రచనలలో లేదు .ఎలా గుర్తు పట్టగలను ?అయినా వస్తారో రారో ?ఇంటి వద్ద పరిస్థితి ఏమిటో ?ఇవన్న్నీ మనసులో సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి .కాని కార్యక్రమనిర్వాహణ లో కొంత ద్రుష్టి పెట్ట లేక పోయానేమో ? వచ్చిన అతిధులు కూడా వారోచ్చినట్లు నాకు చెప్పనూ లేదు. కనుక రాలేదనే నమ్మకం లో ఉన్నాను .వారు వస్తే ప్రేక్షక స్థానం లోనే వారికి నూతన వస్త్రాలు సమర్పించి శాలువా కప్పుదామని రెడీ అయ్యే వచ్చాను .

సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన కార్య క్రమం పూర్తీ అయ్యేసరికి రాత్రి 9గంటలయింది .అంటే 5గంటల సుదీర్ఘ కార్యక్రమం అన్నమాట .అందులో నెట్ లో చూడటానికి ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాం ..అక్కడ డిన్నర్ ఏర్పాటు కూడా చేశాము  .నేను భోజనం చేయగానే రాత్రి 9గంటలకు శ్రీ శాస్త్రి గారు ఫోన్ చేశారు ‘’మీ కార్యక్రమం బాగా జరిగింది అన్నీ దగ్గరుండి మీరు పర్య వేక్షించి ఎంతో గౌరవంగా అతిధులను సత్కరించటం ఇంకా బాగుంది ‘’అన్నారు .ఆశ్చర్యపోయి నేను ‘’మీరు కంప్యూటర్ లో ప్రత్యక్ష ప్రసారం చూశారా ?’’అని అడిగాను .’’కాదు .నేను సభకు వచ్చాను .అయితే చాలా ఆలస్యంగా వచ్చాను సన్మానాలు అయి పోయి  సన్మానితులు కృతజ్ఞతలు తెలుపుతుండగా వచ్చాను .మీ మినిట్ పుస్తకం లో సంతకంకూడా పెట్టాను ‘’అని నన్ను ఆశ్చర్య పోయేట్లు చేశారు .’’ఒక్కసారి నాకు కనిపించి ఉంటె ఏంతో ఆనందంగా ఉండేది .ఎందుకు అలా వెళ్లి పోయారు “?అన్నాను .’’నేనెప్పుడూ అంతే .నా శిష్యులకు సన్మానం జరుగు.’’ తుంటే చూడాలని ఉబలాటం కలిగి వచ్చాను మీరు వేదిక మీద పూర్తిగా నిమగ్నమయి ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక పోయింది .అక్కడ భోజనాలు అవీ ఉన్నాయని చెబుతున్నారు .నేనేమీ తిననుకనుక వెంటనే తిరిగి విజయవాడ వెళ్లి పోయాను ‘’అన్నారు .ఇంతటి ఉన్నతులు ఇంకా లోకం లో ఉన్నారా అని పించి గంగాధర రావు గారికి త్రినాధ శర్మకు చెప్పాను. వారూ నాతోపాటు అవాక్కయ్యారు .

ఇవాళ ఉదయం నేను ఒక నిర్ణయానికి వచ్చి మా శ్రీమతితో చెప్పి సాయంత్రం రామవరప్పాడులో వున్న శాస్త్రిగారింటికి వెళ్లి వారిని చూసి ఆ దంపతులకు వస్త్రాలు సమర్పించి పాదాభి వందనం చేయాలని ఉందన్నాను .మంచిదే వెళ్దాం .అయినా ఒక సరి శాస్త్రి గారికి ఫోన్ చేసి చెప్పండి అన్నది .సరే నని ఫోన్ చేశాను. వారు ఎత్త లేదు  .పది నిమిషాల తర్వాత వారే ఫోన్ చేశారు ‘’మిమ్మల్ని చూడటానికి సాయంత్రం మీఇంటికి రావాలని ఉంది .అనుమతిస్తారా ?’’అని అడిగాను .వెంటనే వారు ‘’రావద్దు .ఇలాంటివాటికి నేను దూరం. ఏమీ అనుకో వద్దు .ఇందులో మొహమాటం ఉండదు నాకు .’’అన్నారు .’’మరి మిమ్మల్ని చూడటం ఎలా ?’’అని అడిగాను .’’నాకు ఆ ప్రాంతం అంతా బాగా తెలుసు .నేనే ఎప్పుడో అటు వైపు వచ్చినప్పుడు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాను ‘’అన్నారు ‘’అదే మాకు మహా ప్రసాదం .అయినా నిన్న మీరు పాంట్ లోవచ్చారా పంచలోనా ?’’అని అడిగా .’’పంచ కట్టుకొనే వచ్చాను ‘’అన్నారు .నిన్ననేను పాంట్ తో వచ్చిన ఒక నల్లని పోడుగాటాయన మోహన రావు ,తూములూరు వారల తో మాట్లాడటం చూసి ఆయనేమో అనుకొన్నాను కనుకనే ఈ ప్రశ్న  వేశాను  . కనుక శాస్త్రిగారిని నేను అక్కడ చూడలేదని నిర్దారణకోచ్చాను.’’నిన్న ఆవిష్కరణ జరిగిన పుస్తకం మీకు ఎవరైనా ఇచ్చారా ?’’అని అడిగా .’’అందరూ హడావిడిలో ఉన్నారు నన్నెవరూ అడిగి ఇవ్వలేదు .నేనూ అడగటానికి మొహమాట పడ్డాను ‘’అన్నారు .’’నేను ఇవాళ పోస్ట్ లో మీకు పంపిస్తాను ‘’అని చెప్పాను .సంతోషం అన్నారు ..అన్నట్లుగానే పోస్ట్ లో పంపాను .ఇదీ శ్రీ జయ సీతా రామ శాస్త్రి గారి మహోన్నతవ్యక్తిత్వం ,మహా సంస్కారం .ఇలాంటి  మేధావి ,మహా రచయిత, విశ్లేషకులు  మన మధ్య ఉన్నారు అంటే మహాశ్చర్యం వేస్తుంది .శాస్త్రి గారి ఆ సంస్కారానికి నమస్కారం . ఎందరో మహానుభావులు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-4-4-16-ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉగాది వేడుకలు ఇవాళ జ్యోతి లో కవరేజ్

9ef03b5f-a13d-4e09-8ced-8775fa26c4aajyoti 0016b79dc20-aae5-405a-9286-9ab907d3ed22jyoti 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged , | Leave a comment

3-4-16-ఆదివారం మధ్యాహ్నం ఉయ్యూరులో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లోను ,మా ఇంట్లోను శ్రీ ఏ సి .పి.శాస్త్రి

3-4-16-ఆదివారం మధ్యాహ్నం  ఉయ్యూరులో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లోను ,మా ఇంట్లోను  శ్రీ ఏ సి .పి.శాస్త్రి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో -రచయిత పరిచయం ,విషయ సూచీ

bio1 001 bio2 001 sopanalu 001దైవ చిత్తం లో -రచయిత పరిచయం ,విషయ సూచీ

manavi 001

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో కార్య దర్శి నివేదిక

దైవ చిత్తం లో కార్య దర్శి నివేదికms1 001 ms2 001 ms3 001 ms4 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో దాతల పేర్లు ,శ్రీ పోరంకి వారి అభినందన

దైవ చిత్తం లో దాతల పేర్లు ,శ్రీ పోరంకి వారి అభినందనdatalu 001 poranki 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో ముందుమాటలు

దైవ చిత్తం లో ముందుమాటలుdp1 001 dp2 001 dp3 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో స్టీఫెన్ హాకింగ్ గురించి

దైవ చిత్తం లో స్టీఫెన్ హాకింగ్ గురించిsh1 001 sh2 001 sh3 001 sh4 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం లో శ్రీ ఏ సి పి.శాస్త్రిగారి గురించి

దైవ చిత్తం లో శ్రీ ఏ సి పి.శాస్త్రిగారి గురించిcap2 001 cap3 001 cap4 001 cap1 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దైవ చిత్తం శ్రీ మైనేని గారికి -అంకితం

దైవ చిత్తం శ్రీ మైనేని గారికి -అంకితంca6 001 ca7 001 card 2 001 chittam ankitam 1 001 ca3 001 ca4 001 ca5 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

4-4-16 ఆదివారం ఆవిష్కరింప బడుతున్న” దైవ చిత్తం ”పుస్తక ముఖ చిత్ర పరిచయం

4

-4-16 ఆదివారం ఆవిష్కరింప బడుతున్న” దైవ చిత్తం ”పుస్తక ముఖ చిత్ర పరిచయం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలు

సంగీత కచేరి

శ్రీమతి వి శాంతిశ్రీ గారు

దాదాపు 25 సంవత్సరాలుగా రేడియో, దూర దర్శన్ లలో  సంగీత కచేరీలు చేస్తూ, సుస్వర మధుర గాత్రం తో జనరంజకంగా సంగీతం వినిపిస్తున్న శ్రీమతి వట్టెం శాంతి శ్రీ గారు శ్రీ వంగర మోహన శర్మ ,శ్రీమతి భానుమతి దంపతులకు జన్మించారు . సంగీతం లో డిప్లొమా, తెలుగు లో ఏం .ఏ .డిగ్రీ . పొందారు ..శ్రీ వట్టెం రామ కృష్ణ గారిని వివాహం చేసుకొన్నారు . పశ్చిమ గోదావరిజిల్లా పెద వేగి జవహర్ నవోదయ విద్యాలయం లో సంగీత ఉపాధ్యాయినిగా పని చేస్తూ ,ప్రస్తుతం సెలవులో ఉన్నారు .జీ తెలుగు ‘’సరిగమలు ‘’,సూపర్ సీనియర్స్’’ పోటీలలో పాల్గొన్నారు .తాము గానం చేసిన అన్నమాచార్య కీర్తనలను ,శంకరాచార్య స్తోత్రాలను రికార్డులు ,సి .డి .గా చేశారు .   సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో శ్రీమతి శాంతిశ్రీ గారిని గాత్ర సంగీత కచేరీ నిర్వాహించవలసినదిగా సగౌరవం గా ఆహ్వానిస్తున్నాం .వీరికి వాద్య సహకారాన్ని  వయోలిన్ పై శ్రీ చావలి శ్రీనివాస్ ,తబలా పై శ్రీ వెంగయ్యగార్లు అంద జేస్తారు ..

.

ఈ సంగీత కచేరీని తమ తల్లిగారైన స్వర్గీయ శ్రీమతి మైనేని సౌభాగ్యమ్మగారి స్మారకార్ధం  ,ఆమెకు సంగీతం పై ఉన్న అభిరుచికి తార్కారణంగా, వారి కుమారులు ,సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )  ప్రాయోజకులు గా సమర్పిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు

వాద్య సహకారానికి , సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీ మతి జోశ్యుల శ్యామలా దేవిగారు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నందుకు  కృతజ్ఞతలు .

 

స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక శ్రీ దుర్ముఖి ఉగాది పురస్కార ప్రదానం

దుర్ముఖి ఉగాది అతిధుల పరిచయం

1–డా .శ్రీమతి పుట్ట పర్తి నాగ పద్మిని గారు

తాను  ‘’ అయ్య ‘’అని ఆప్యాయంగా పిలుచుకొనే తండ్రి సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీమతి కనకమ్మ గారల కుమార్తె శ్రీమతి నాగ పద్మిని గారు .   కడప ఆర్ట్స్ కాలేజిలో బి యెస్.సి. చదివి ,తిరుపతి లో తెలుగు హిందీ లలో ఏం ఏ లలో డిగ్రీ పొంది,. ఈ రెండు భాషలలో  ,పి హెచ్ డి .చేసి ,పద్మిని గారు ,డా నాగ పద్మిని అయ్యారు . .జర్నలిజం ,అనువాద కళ,టి.వి ప్రొడక్షన్ లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందిన విదుషీమణి  .తెలుగు హిందీ ఇంగ్లీష్ లలో అపార పాండిత్యం సాధించి అనేక వేదికలపై ఉపన్యాసాలతో వ్యాఖ్యానాలతో రాణిస్తున్నారు  .సాహిత్య అకాడెమి ,నేషనల్ బుక్ ట్రస్ట్ ,తిరుమలతిరుపతి దేవస్థానాలకు అనువాద రచనలలో తోడ్పడుతున్నారు .నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ‘’రాజ్ కమల్ చౌదరి కధలు ‘’,పబ్లికేషన్ డివిజన్ వారికి ‘’నోబుల్ మహిళా గ్రహీతలు ‘’అనువాదం చేశారు .తెలుగు లో వీరి స్వీయ రచనలు ‘’సాహితీ మంజూష ‘’,’’సంగీత సాహిత్య  స్రవంతి’’,’’వ్యాస వాటిక ‘’,’’తెలుగింటి సిరుల పంట ‘’వ్యాస సంకనాలు.  ,.’’హద్దులు ‘’అనే కవితా సంకలనం రాసి ప్రచురించారు .తండ్రిగారి జీవితం –రచనలపై ‘’భాషాపర శేష భోగి పుట్టపర్తి నారాయణాచార్య ‘’ మహా గ్రంధాన్ని రచించి మార్చి  15 వ తేదీన ఆవిష్కరించారు .

హిందీలోనూ గొప్ప రచనలు చేశారు .తెలుగు ,హిందీ రామ కావ్యాలను తులనాత్మకంగా పరిశోధించి ‘’  సీత ‘’అనే ‘’పరిశోధనాత్మక గ్రంధం హిందీలో రచించారు .హిందీలో వీరి పరిశోధన గ్రంధం ‘’సీతాయాశ్చరితం మహాత్ ‘’ కు, పి .హెచ్. డి.పొందారు .’’తెలుగు ఔర్ హిందీ గీతి కావ్య్-తులనాత్మక్  అధ్యయ్’’హిందీలో ఏం .ఫిల్ సిద్ధాంత గ్రంధం గా రాశారు ‘’తెలుగు సాహిత్యసు ,’’భగవత్ ప్రేమ కా పరిమళ్-తిరుప్పావై ‘’,’’అన్నమాచార్య గీత్ కా మాధురి ‘’వీరి ఇతర హిందీ రచనలు .

.    .చెల్లెలు శ్రీమతి  పుట్టపర్తి అనూరాధ గారితో తో కలిసి’’ పుట్టపర్తి సాహితీ సుధ’’బ్లాగ్ ను అద్వితీయంగా నడుపుతూ అన్ని తరాలవారికీ సరస్వతీ పుత్రుని సాహిత్య సరస్వతిని పరిచయం చేస్తున్నారు .ఆమె రచించిన ఎన్నో భక్తీ, లలిత, భావ ,బాల గీతాలు ఆకాశ వాణి దూర దర్శన్ లలో ప్రసారితాలై, యెనలేని కీర్తి నార్జించి పెట్టాయి . నాగ పద్మిని గారు గానం చేస్తుంటే నాగ స్వరం విన్న అనుభూతి కలుగుతుంది .ఆ స్వర మాధురి అద్వితీయమని పిస్తుంది .హైదరాబాద్ దూర దర్శన్ లో ప్రోగ్రాం ఎక్సి క్యూటివ్ గా ప్రస్తుతం వ్యవహరిస్తూ ,సాహిత్య సంస్కృతులను తెలుగు లోగిళ్ళలో నింపుతున్నారు .

పద్మినిగారిని సత్కరించి సన్మానించి ఎన్నో సాహితీ సంస్థలు ధన్యమయాయి .ఆరాధనా సాంస్కృతిక సంస్థ ,అన్నమయ్య పదకోకిల శ్రీమతి  శోభా రాజ్ వీరిని సత్కరించారు .అమెరికాలోని న్యూ జెర్సీ నిర్వహణలో జరిగిన దీపావళి వేడుకలలో వీరు ఆత్మీయ అతిధిగా సత్కరింప బడి  ,తెలుగింటి ఆడ పడుచు గౌరవాన్ని పొందారు .తమిళనాడు లోని హిందీ అకాడెమి వీరికి ‘’సులభ్’’పురస్కారాన్ని గవర్నర్ శ్రీ రోశయ్యగారి చే ప్రదానం చేయించింది .నారాయణా చార్యుల వారి శత జయంతి ఉత్సవాలలో ఘన సత్కారాలు అందుకొన్నారు .దూరదర్శన్ సప్త గిరి లో 53వారాలపాటు కర్నాటక సంగీతం లో  ‘’స్వరసమరం ‘’నిర్వహించి సంగీతజ్ఞుల విశేష ప్రశంసలు పొందారు .ఎందరెందరో నూతన గాయినీగాయకులకుప్రోత్సాహం , విశేష ప్రాచుర్యం కలిగించారు .చిన్న పిల్లలకోసం 14 వారాల పాటు ‘’చిరు స్వర సమరం ‘’నిర్వహించి శాస్త్రీయ సంగీతానికి యెనలేని కీర్తిని ఆర్జించి పెట్టి అందరికీ మార్గ దర్శిగా నిలిచారు శ్రీమతి పద్మినిగారు .

సరస్వతీ పుత్రునికి, అసామాన్య సంగీత సాహిత్య సరస్వతి గా జన్మించి ‘’ఆ అయ్య’’కు  తగ్గ ,ఆ తండ్రిని మించిన తనయ గా రాణిస్తున్న డా .శ్రీమతి పుట్ట పర్తి నాగ పద్మిని గారిని సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా సహృదయ ఆహ్వానం పలుకుతున్నాం .

2-డా శ్రీ  రావి మోహన రావు శ్రీమతి కృష్ణ కుమారి గార్లు

15-12-1954 లో జన్మించిన శ్రీ రావి మోహన రావు గారు ,24-12-1957లో జన్మించిన శ్రీమతి కృష్ణ కుమారి గారిని 24-5-1974 న వివాహం చేసుకొన్నారు  .చీరాల కాలేజీలో జియాలజీ లెక్చరర్ గా చేరిన మోహన రావుగారు  తర్వాత సంస్కృతం లో అభిరుచి కలిగి గీర్వాణ౦  లోనూ ఏం ఏ .సాధించారు .మహాకవి కాళిదాసు రచించిన ఋతు సంహారం ,మేఘ దూతం కవ్యాలపైనా ,కుమార సంభవ కావ్యం లో 7 సర్గలపైనా ‘’మృణాలినీ ‘’వ్యాఖ్యానం రాశారు .శ్రీ అరుళానంద స్వామిసంపాదకులుగా  ప్రచురి౦ప బడుతున్న  ‘’ఆత్మ జ్యోతి  ‘’ఆధ్యాత్మిక మాస పత్రిక కు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు .స్వంత ఖర్చుతో ఇప్పటి వరకు సుమారు 120 సంస్కృతాంధ్ర గ్రంధాలను వెలువరించిన సాహిత్యోప జీవి శ్రీ రావు గారు .వారికి అన్ని విధాలా సహకరిస్తున్న విదుషీమణి వారి శ్రీమతి శ్రీమతి కృష్ణ కుమారి గారు .

సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్నితమ సాహిత్య కృషికి చిరు అభినందన కానుకగా  అందుకోవలసినదిగా ఈ సాహితీ జంట ను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము .

3-డా.శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు

‘’చిత్త శార్దూలమ్ము చిత్తు చిత్తు గ ,గాగ నెత్తిపై కెక్కిన నీరజాక్షి –శేముషీ సింహమ్ము ‘’శ్రీ ‘’పెంచి ,దానిచే మహిషాదులను నామపు మహిత భావ –శ్వాస హంసము నెక్కి ,చతుర సంచారంబు నేర్పించి కాచు నిర్నిద్ర మాత ‘’అయిన లలితా పరా భట్టారిక శ్రీ రాజ రాజేశ్వరి పై శతకం రాసి ,తమ గురుదేవులు  బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ,వారి తండ్రిగారు వెంకటప్పయ్య శాస్త్రిగారు రచించిన ‘’శ్రీరామ కదామృతం’’అనే బృహత్ గ్రంధం పై’’ సమగ్ర సమీక్ష పరిశోధన నిబంధనం ‘’రచించి ,ఆంద్ర విశ్వ విద్యాలయం చేత పి హెచ్ డి పొందిన వారు శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు .పొన్నూరు లోని శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా ఉద్యోగించి, పదవీ విరమణ  చేసిన సాహితీ మూర్తి .వీరి జననం కృష్ణా జిల్లా ఉప్పులూరు కావటం విశేషం .శ్రీ తూములూరు వెంకట రామ శాస్త్రి ,శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 15-2-1953 లో జన్మించిన శాస్త్రిగారు శ్రీమతి నాగ పద్మావతి గారిని వివాహమాడారు .

రామాయణం –సమాజ దర్పణం ను రెండుభాగాలుగా రచించి ,శ్రీ రామ ,వాల్మీకి , వానుమ ద్వాణి లను వినిపించిన ఆధ్యాత్మిక తేజో విరాజితులు .పావనీ శతకం ,శ్రీ త్రికూటేశ్వర త్రిశతి ,శ్రీ కపోతేశ్వర శతకం ,శ్రీ పొన్నూరు వీరాంజనేయ శతకం ,భావ దేవశతకం వంటి భక్తీ శతకాలను ‘’పిలిస్తేపలికే పద్య ధార’’తో వీనుల విందుగా, గుండెల నిండుగా రాసిన సాహితీ చైతన్య మూర్తి .తమ బావ గారు –అంటే అక్కగారి భర్త గారు శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి అపార సంస్క్రుతాంధ్ర వైదుష్యానికి ,సంస్కృత శతావదానానికీ  అనుక్షణం అబ్బురపడి ఆ మధుర స్మృతులను పంచుకొనే సహృదయ మూర్తి శ్రీ శాస్త్రిగారు

.’’స్తవ నీయుండు ,నరోత్తముండు ,సుగుణోద్దాముండు,ధన్యుండు రాఘవ నారారాణశాస్త్రి తాడెపలి విఖ్యాతుండు ,కారుణ్య మూర్తి ,వివేక స్థిర వర్తనుడు మద్దీక్షా గురుండు ,ఆత్మ తత్వ విదుండా’’రుషి వర్యు ‘’గొల్తు ‘’ అని ఘనం గా కీర్తించే గురుభక్తి శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారిది .ఇంతవరకు పద్యాలలో యోగ విద్య ను రాయని లోటును  తీరుస్తూ ‘’ యోగ వైభవం  ‘’రాసి రికార్డ్ సృష్టించారు .  సాహిత్య సాంస్కృతిక ప్రసంగాలతో ప్రజలకు స్పూర్తి కలిగిస్తున్నారు .

సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భావానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవటానికి వేదిక నలంకరించ వలసినదిగా  డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారిని   ఆప్యాయం గా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం .

4-  శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు

తూర్పు గోదావరిజిల్లా అవిడి గ్రామం లో 5-8-1950న శ్రీ గరిమెళ్ళ సూర్యనారాయణ ఘనాపాఠీ, శ్రీమతి సూర్య కాంతమ్మ దంపతులకు జన్మించి ,సంస్కృతాంధ్రాలలో ఏం .ఏ .డిగ్రీ పొంది ,శ్రీమతి రాజేశ్వరిని వివాహమాడి అమలాపురం లోను, విజయవాడ కే బి యెన్ కళాశాలలోను తెలుగు లెక్చరర్ గా పని చేసి పదవీ విరమణ చేసి ,కృష్ణా జిల్లా అధికార భాషా సంఘ సభ్యులుగా ఉన్న శ్రీ సోమయాజులు శర్మగారు పుష్పగిరి పీఠ ఆస్థాన పండిత గౌరవంతో విరాజిల్లుతున్నారు .సహజ పాండిత్య ,తర్క వేదాంత పారంగత బిరుదులు  వీరి విద్వత్తుకు  నిలు వెత్తు సాక్ష్యం .అవధానాలు చేయటం ,అముద్రిత తాళపత్ర గ్రంధాలను  సేకరించి శుద్ధ ప్రతులను తయారు చేయటం ,సాహిత్య ఆధ్యాత్మిక ప్రసంగాలు వీరి వ్యా వ్రుత్తి .

సోమయాజులుగారు బహు గ్రంధ కర్త .సంస్కృతం లో ‘’ద్వాదశీ వ్రతమహాత్మ్యం ‘’,మహాభారత  కంటకోద్దారః మహాకావ్యాలు ,శ్రీశైల లింగాష్టకం ,కలావిలాసః ,ఆనంద మందారః వంటి 11 లఘు కృతులను రచించారు .తెలుగులో పద్యకావ్యాలుగా వాల్మీకి వృత్తాంతం, శ్రీ వేంకటేశ్వర శతకం ,శివ కర్ణామృతం మొదలైన దీర్ఘ కావ్యాలు ,సరస్వతీ దండకం ,విశ్వనాధ మహాకవి వంటి లఘుకావ్యాలూ ,రచించారు .అనేక గ్రంధాలకు బృహత్ పీఠికలు సంత రించారు .ఆంద్ర మాఘ కావ్యానికి ‘’భూమిక ‘’,శంకర విజయానికి ‘’ఆముఖం ‘’వాసుదేవ మననం కు ‘’ఉద్యోతం ‘’పేర్లతో వీరి  పీఠికలు విరాజిల్లాయి .సొమయాజులుగారి వ్యాస వాహిని అడ్డూ ఆపు లేకుండా ప్రవహించింది .కల్పవృక్షం  –నాట్య సంగీత శాస్త్రాలు ,సమగ్రాంధ్ర సాహిత్య సమాలోచనం ,మకర సంక్రాంతి వంటి సుమారు 40 వ్యాసాలను పరిపక్వ అధ్యయనం చేసి రాశారు .తరల సంగ్రహం ,తత్వ బోధ ,పరివ్రాజ చంద్రిక వంటి అనువాదాలూ చేశారు .జగన్నాధ పండితుని గంగా, యమునా, విష్ణు లహరి లకు’’అమృత ధారా వ్యాఖ్య ‘’,అశ్వ దాటీ కావ్యానికి ‘’నవ వీధీ వ్యాఖ్య ‘’రాసి వ్యాఖ్యానం లోనూ సరి జోడు అనిపించారు .సూతసంహిత ,భద్రాద్రి రామ శతకం ,భోగినీదందకం తైత్తిరీయోపనిషత్ మొదలైన 10 గ్రందాల ను పరిష్కరించి , ముద్రణకు తోడ్పడిన విద్వత్ కవి శేఖరులు .శర్మ గారు .వీరి రచనలపై పరిశోధనలూ జరిగాయి .

ఇంతటి విద్వన్మణి,,లౌకిక ఆధ్యాత్మిక గ్రంధ రచనా సమర్ధులు ,శ్రీ పుష్పగిరి ఆస్థాన పండితులు తర్క వేదాంత పారంగతులు  బ్రహ్మశ్రీ గరిమెళ్ళ అచ్యుత శేషగిరి  సోమయాజులు శర్మ గారిని ,సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా  ,అత్యంత వినయం తో వేదిక పైకి సాదర ఆహ్వానం పలుకుతున్నాం .

5-డా. అసిలేటి నాగ రాజు  గారు

విజయవాడకు చెందిన డా అసిలేటి నాగ రాజు గారు యువ రచయిత ,పరిశోధకులు ,వికలాంగ రచయితలకు గొప్ప ఆసరా . .అనేక  కళాశాల ,విశ్వ విద్యాలయ ,జాతీయ సాహిత్య సదస్సులలో పాల్గొని 15 కు పైగా వివిధ అంశాలపై పరిశోధన పత్రాలను సమర్పించిన విద్యా వంతులు .నాలుగు అంతర్జాతీయ సదస్సులలో ప్రాతి నిధ్యం వహించి పత్ర సమర్పణ చేసిన  సమర్ధులు .

సుప్రసిద్ధ కధకులు శ్రీ గంధం వేంకా స్వామి శర్మ గారురచించిన ‘’అమృత హస్తాలు ‘’కదా సంపుటిపై శ్రీ నాగ రాజు పరిశోధన చేసి ,ఎం.  ఫిల్ సిద్ధాంత వ్యాసం’’అమృత హస్తాలు –కదాను శీలనం ‘’రచించి ప్రచురించి  2007-8 విద్యా సంవత్సరానికి ‘’ఉత్తమ పరిశోధన లఘు సిద్ధాంత వ్యాసం ‘’గా ఎంపికై  డా .ఉండేల మాల కొండా రెడ్డి  ‘’స్వర్ణ పతకం ‘’అందుకొన్నారు . గురజాడ ,చలం ,బాపిరాజు ,శ్రీపాద ,విశ్వనాధ కధలపై హైదరాబాద్ విశ్వ విద్యాలయం లో  పరిశోధన చేసి ‘’తెలుగు కదా –సంస్కరణోద్యమ  ప్రభావ చిత్రణ ‘’రచించి 2013లో పి హెచ్ .డి.పొందారు . .

డా.నాగ రాజు   గారి ముద్రిత రచనలు  –‘’తెలుగు భారతి –సాహితీ ప్రస్థానం’’ లో ‘’తెలుగుకద –దళిత ఉద్యమ ప్రభావం ‘’రాశారు .అంతర్జాతీయ పరిశోధనా జర్నల్ ‘’యోగ్యత ‘’లో ‘’ప్రపంచీకరణ నేపధ్యం లో చలం కదా సాహిత్య విశిష్టత ‘’వ్యాసం రాశారు .’’ప్రజాసాహితి ‘’మాస పత్రికకు ‘’గురజాడ దిద్దు బాటు లో మానవ సంబంధాలు ‘’వ్యాసం రాశారు .’’కర్షక మధనం ‘’ నువ్వు అక్కడే –నేను ఇక్కడే కదలు ,,’’అవిటి కధలు –వికలాంగుల బతుకు చిత్రణ ‘’అనే కదా సంకలనం లో ‘’ఎదురీత ‘’కదా రాశారు .

వికలాంగ రచయితలకు వెన్ను దన్నుగా నిలిచి ,25మంది వికలా౦గు లచేత చిన్న కధలను రాయించి సంకలన సారధ్యం వహించి ‘’మేము సైతం ‘’పేరుతొ 2015జనవరి లో ముద్రించి విడుదల చేశారు .కాలాన్ని గెలుస్తూ ,ప్రత్యేక ప్రతిభా వంతులపై ప్రచురిస్తున్న కవితా సంకలానికి శ్రీ నాగ రాజు గారి కవిత ’’వైకల్యాలకు లేవు ఆవ రోదాలు ‘’ఎంపిక అయి గొప్ప గుర్తింపు తెచ్చింది .

శ్రీ అసిలేటి నాగ కోటులు, శ్రీమతి పాపాదేవి దంపతులకు 1981 అక్టోబర్ 4 న జన్మించిన శ్రీ నాగరాజు డిగ్రీవరకు విజయవాడలో చదివి ,హైదరాబాద్ యూనివర్సిటీలో తెలుగు ఏం ఏ చేసి , ,రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో  ఎం.ఫిల్. పూర్ర్తి చేసి ,హైదరాబాద్ యూని వర్సిటీలో పి.హెచ్ డి.చేశారు .2015 డిసెంబర్ 5న శ్రీమతి’’ దీవెన ‘’ను వివాహమాడి ఒక ఇంటి వాడయ్యారు .

‘’యు. జి. సి .పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కు ఎంపికై, ప్రస్తుతం  ‘’స్వాతంత్ర్యానంతర తెలుగు కద-విభిన్న ఉద్యమాల ప్రభావం ‘’పై హైదరాబాద్ విశ్వ విద్యాలయ తెలుగు శాఖలో పరి శోధన చేస్తున్నవారు ,,వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదని సమర్ధ వంతంగా రుజువు చేస్తున్న  డా నాగ రాజు అలిసేటి గారిని –సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకో వలసినదిగా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము

6-శ్రీమతి మద్దాలి (వై )సుశీల గారు

కృష్ణా జిల్లా పెదమద్దాలి లో శ్రీ మద్దాలి పూర్ణయ్య శర్మ,శ్రీమతి లక్ష్మీ కాంతమ్మ దంపతులకు శ్రీ మతి మద్దాలి సుశీల గారు జన్మించి ,5వతరగతి నుండే’’నాట్యా చార్య’’  శ్రీ శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి గారి వద్ద నాట్య విద్య నేర్చి, 6వ ఏట నుండి శ్రీ సుంకర కనకారావుగారి ‘’అరుణోదయ నాట్య మండలి ‘’లో చేరి, సినీనటి సావిత్రి తోకలిసి అనేక నాట్య ప్రదర్శనలిచ్చి ,బహుబహుమతులను ,పురస్కారాలు అందుకొన్నారు .శ్రీ కోట సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీ సి.ఆర్. ఆచార్య గారల శిక్షణతో నాట్యం లో శిష్యులను తయారు చేసి ‘’నాట్యాచారిణి’’గా ప్రసిద్ధి చెందారు .

శ్రీ మతి సుశీలగారి రంగ స్థల అనుభవమూ అపారమైనదే  .ఆ నాటి సుప్రసిద్ధ రంగస్థల నటులు శ్రీ జగ్గయ్య ,మిక్కిలినేని ,జి ఎస్ ఆర్ మూర్తి ,కే వెంకటేశ్వర రావు ,కర్నాటి లక్ష్మీ నరసయ్య మొదలైన వారితో కలిసి ఎన్నో నాటక ప్రదర్శనలిచ్చి ,ఆంద్ర నాటక కళా పరిషత్ ,ఆంద్ర సంస్కృతిక మహా సభలలో నూ పాల్గొని ‘’ఉత్తమనటి ‘’పురస్కారం పొందారు .రస సమాఖ్య ,ప్రజా నాట్య మండలి ,అరుణోదయ నాట్య మండలి వంటి ప్రముఖ సంస్థలలో నటించి  మంచి  గుర్తింపు  సాధించారు .

వీరి రేడియో అనుభవం విజయవాడ రేడియో కేంద్ర స్థాపన నుండి ఈ నాటి వరకు కొన సాగింది ;ప్రసిద్ధ శ్రవ్య  కళాకారిణి గా గుర్తింపు పొందారు .సాంఘిక ,పౌరాణిక ,జానపద నాటకాలు వీరికి కొట్టిన పిండి .శ్రీ బందా ,అద్దంకి శ్రీరామ మూర్తి ,కందుకూరి చిరంజీవి ,మల్లాది సూరిబాబు, శ్రీరంగం గోపాల రత్నం వంటి ఉద్దండులతో నటించిన మేటి కళా కారిణి శ్రీమతి సుశీల గారు .వీరు నటించిన ‘’సీతా పతి సంసారం ‘’సీరియల్ నాటకం సూపర్ హిట్  అని అందరికి తెలుసు .

ఇప్పుడు వీరికి పేరు ప్రఖ్యాతులు చేకూర్చిన హరికదా రంగాన్ని గురించి తెలుసుకొందాం. శ్రీ అక్కిపెద్ది శ్రీరామ శర్మ ,శ్రీ కూచి భొట్ల కోటేశ్వరరావు వంటి ప్రసిద్ధ హరికదా భాగవతార్ల సుశిక్షణతో ఈ రంగ ప్రవేశం చేసి,సుమారు 36 సంవత్స రాలుగా రాణిస్తూ ,నవరస కదా విధానం తో మెప్పిస్తూ ,’’మధుర కదా నిధి ‘’,’’నాట్య రత్న ‘’,’’అభినయ శిరోమణి ‘’,’’హరికధా సరస్వతి ‘’వంటి అనేక సార్ధక బిరుదు లను తమ హరికధా ప్రావీణ్యత కు  అందుకొన్నారు .

సుశీల గారు సినీ రంగప్రవేశమూ చేసి, తమ నటనతో 25పైగా సినిమాలలో  శ్రీ విశ్వనాద్, జంధ్యాల ,దాసరి ఇ. వి .వి .,రాఘవే౦ద్రరావు వంటి అగ్ర దర్శకుల వద్ద నటించి సినీ జనాన్నీ  మెప్పించారు .పెద్ద తెరపై మాత్రమేకాదు బుల్లి తెరపైనా తన నటనా సామర్ధ్యాన్ని నిరూపించారు .’’హిమ బిందు ‘’’’బ్రహ్మా!  నీ రాత తారుమారు ‘’మొదలైన సీరియల్స్ తోనూ, టి .వి .హరి కధలతోనూ మెప్పించారు .

సుశీల గారి నటనా సామర్ధ్యాన్ని గుర్తించి ఆంధ్రా ఆర్ట్స్ అసోసియేషన్ ,భారతీయ పరిరక్షణ కేంద్రం మొదలైన సంస్థలు గౌరవించి సన్మానించి అభినందించాయి .శ్రీ నారాయణ దాస శిష్య ప్రశిష్య బృందం ఘన సత్కారం చేసి ‘’హరికధా సరస్వతి ‘’బిరుదునిచ్చిగౌరవవించారు .

హరికద ,నాట్య, నాటక ,రేడియో,సినీ, టి .వి. కళాకారిణి , బహుముఖ ప్రజ్ఞా శీలి, అభినయ సరస్వతి శ్రీ మద్దాలి (వై ) సుశీలగారిని సరసభారతి నిర్వహిస్తున్న  శ్రీ దుర్మిఖి ఉగాది వేడుకలలో స్వర్గీయ  గబ్బిట భవానమ్మ,మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవటానికి వేదికను అలంకరించ వలసినది గా సవినయంగా ఆహ్వానిస్తున్నాం

                          7– శ్రీ ఎ సి పి.శాస్త్రి గారు

హైదరాబాద్ కింగ్ కొఠీ ప్రభుత్వ సంగీత కళాశాలలోకర్నాటక  శాస్త్రీయ సంగీతం అభ్యసించి ‘’సంగీత భూషణా’’న్ని దాల్చి ,సాహిత్యపు  లోతులు తరచి ,రేడియోకు పులకేశి ,నల చరిత్ర మొదలైన నాటికలు రచించి , హైదరాబాద్ రేడియో వారి యువవాణికి సంగీతం కూర్చి ,దూరదర్శన్ ,ఆకాశవాణి లో ప్రసారమైన గేయాలకు స్వరకల్పన చేసి ,’’హం ఏక్ హై’’ హిందీ గేయ నాటికకు,  కూచిపూడి గేయనాటిక ‘’మహా శ్వేత ‘’కు స్వర రచన,అష్ట లక్ష్మీ వైభవానికి స్వర వైభవం చేకూర్చిన  సామర్ధ్యం శ్రీ ఏ సి పి శాస్త్రి గారిది .హైదరాబాద్  ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమైన శాస్త్రిగారి ‘’సంగీత కళానిధి భట్టు మూర్తి ‘’వ్యాసం వారి సంగీతపు పాటవానికి, అధ్యయన సామర్ధ్యానికి అద్దం పట్టింది .వైదిక సాహిత్యం పై ఎన్నో వ్యాసాలూ రాసి అందులోని అనర్ఘ రత్నాలను వెలికి తీసి చూపిన ప్రతిభ వారిది .పాతిక ఏళ్ళుగా భట్టు మూర్తి అని పిలువ బడే ‘’రామ రాజ భూషణ కవి’’ పాత్రను ‘’న భూతో ‘’గా భువన విజయం లో నటిస్తూ  సంగీత సాహిత్య ప్రియులను మెప్పిస్తూ భట్టు మూర్తి అంటే శాస్త్రిగారే అని పిస్తున్నారు .వీరి నలచరిత్ర నాటకాన్ని ధర్మపురి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి గారు సంస్కృతం లోకి అనువదించి శాస్త్రిగారి కీర్తి కిరీటం లో మరోకలికి తురాయిని చేర్చారు .శాస్త్రిగారు గొప్ప రంగస్థల నటులు కూడా .

శ్రీ శాస్త్రిగారు 19-1-1944 న శ్రీ అందుకూరి వెంకట సుబ్బయ్య ,శ్రీమతి అచ్చమాంబ దంపతులకు జన్మించి ,శ్రీమతి లక్ష్మీ  కళ్యాణి గారిని కళ్యాణ మాడారు . ,హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగం లో చేరి అసిస్టంట్ మేనేజర్ గా పదవీ విరమణ చేశారు . ప్రముఖ భౌతిక అంతరిక్ష శాస్త్ర వేత్త స్టీఫెన్ హాకింగ్ రచన ‘’ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’’చదివి ,ప్రేరణ పొంది హాకింగ్ చెప్పిన వాటినీ , మన వేద.ఉపనిషత్ ,పురాణాలలో చెప్పిన వాటినీ తులనాత్మకంగా పరిశీలించి, పరి శోధించి ఆంగ్లం లో ‘’ది మైండ్ ఆఫ్ గాడ్ ‘’పుస్తకం రాస్తే ,శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ దానిని ‘’దైవ చిత్తం ‘’గా స్వేచ్చాను వాదం చేశారు. ఆ గ్రంధమే ఈ రోజు ఆవిష్కరింప బడింది .శాస్త్రిగారితో మాట్లాడటమే ‘’ఒక ఎడ్యుకేషన్’’.

బహుముఖీన పాండిత్యం ,సరస సంభాషణం ,వేదోక్త జీవన విధానం ,వేద రహస్యా విష్కరణ చేస్తున్న నటులు సంగీత, సాహిత్య కారులు, భువన విజయ భట్టు మూర్తి ఫేం, పూర్ణ ప్రజ్ఞులు ,ప్రాజ్ఞులు  శ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి అంటే ఏ. సి.పి .శాస్త్రి గారిని సరసభారతి నిర్వహిస్తున్న  శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి   గారల స్మారక ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా  సగౌరవం గా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం .

8- శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు

శ్రీ సోమేపల్లి హనుమంతరావు , శ్రీమతి నాగ రత్నం దంపతులకు జన్మించిన శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు ఎం. కాం .ఉత్తీర్ణులై , రెవిన్యు డిపార్ట్ మెంట్ లోఉద్యోగం లో  చేరి , అంచెలంచెలుగా ఎదిగి , గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్నారు ., ప్రస్తుతం ‘’డా.కే.ఎల్ రావు సాగర్’’ అని పిలువబడే పులిచింతల ప్రాజెక్ట్  భూసేకరణ స్పెషల్ కలెక్టర్ గా సేవలందిస్తున్నారు .

వీరి  వ్రుత్తి కలెక్టర్ గిరీ అయినా ప్రవ్రుత్తి సాహిత్యమే .మంచి కవి ,కధకులు, విమర్శకులు అయిన శ్రీ సోమేపల్లివారు గుంటూరు జిల్లా రచయితల సంఘాధ్యక్షులుగా 2007నుండి సాహితీ సేవ చేస్తూ ,ఎన్నో వైవిధ్య భరిత కార్యక్రమాలను జిల్లా ,రాష్ట్ర స్థాయిలలో  నిర్వహించి ప్రశంసలు అందుకొన్నారు .నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఏర్పడినతర్వాత  రాష్ట్ర రచయితల సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ,సంఘ పటిస్టత ,విస్తరణ కోసం అహరహం శ్రమిస్తున్నారు .గత అర్ధ శతాబ్దం గా ‘’గుంటూరు జిల్లా రచయితల సంఘం ‘’పేరుతొ రాష్ట్ర స్థాయి రచయితల నుండి రచనలను ఆహ్వానించి కదా ప్రక్రియలో ఒకటి, కవితా ప్రక్రియ లో ఒకటి పురస్కారాలను అందజేస్తున్నారు .గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలకదా రచయితలనుండి చిన్న కధలను ఆహ్వానించి నిష్పాక్షికంగా ఎంపిక చేయించి ఉత్తమ మైన కధలకు  ‘’సోమేపల్లి కదల పురస్కారం ‘’పేరిట  తమ తండ్రిగారు ‘’సోమేపల్లి హనుమంత రావు స్మారక సాహిత్య పురస్కార ప్రదానం చేస్తున్నారు .ఈ పురస్కారం అందుకోవటం గొప్ప అదృష్టంగా కధకులు భావించే స్థాయి కలిపించారు సోమేపల్లివారు .

మాటలో ,నడవడిలో ఎక్కడా డాబు ,దర్పం లేని అత్యంత వినయ సౌజన్య శీలి ,సాహితీ సేవా పరాయణులు ,ఆదర్శ ప్రభుత్వాధికారి శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారిని సరస భారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలలో స్వర్గీయ గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల  స్మారక ఉగాది ప్రస్కారాన్ని అందుకోవలసినదిగా అత్యంత ఆదరంగా వేదికపైకి  ఆహ్వానిస్తున్నాం .

 

శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రభావతిగారల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కార ప్రదానం

1-శ్రీ పరశు నందకుమార్ గారు

‘’ నందబాబు మేష్టారు ‘’ గా అందరికీ సుపరిచితులైన శ్రీ పరశు నందకుమార్ శ్రీ పరశు వెంకట నాగ భూషణం ,శ్రీమతి రాజ్య లక్ష్మి దంపతులకు 15-7-1954న ఉయ్యూరులోనే  జన్మించారు .పాఠశాల విద్య మాత్రమే అభ్యసించిన శ్రీ నందకుమార్ 1971వ సంవత్సరం మార్చి 2 న , 17 ఏళ్ళ వయసులోనే ‘’విజయ విద్యా నికేతన్ ‘’పేరిట ఏడవ తరగతి వరకు మాత్రమే బోధించే స్వంత పాఠశాలస్థాపించి ,తానూ బోధిస్తూ ,బోధింప జేస్తూ ,పర్య వేక్షిస్తూ 23సంవత్సరాలు దిగ్విజయం గా నడిపి ,1974లో ‘’అమరవాణి పబ్లిక్  స్కూల్ ‘’గా పేరు మార్చి,10వ తరగతి వరకు విద్యా బోధన చేస్తూ  విజయవంతంగా నిర్వహిస్తున్నారు .అతి తక్కువ ఫీజు తో ,అట్టడుగు వర్గాల వారికి అందు బాటులో ఉండేట్లు,విలువలతో కూడిన విద్యనూ నేర్పుతూ ,ఆదునిక శాస్త్ర సాంకేతిక సహాయం తో ,సర్వ హంగులు ఏర్పరచి ,క్రమ శిక్షణకు మారుపేరుగా, మన సంస్కృతీ సంప్రదాయాలపై విద్యార్ధులకు సరైన అవగాహన కల్పిస్తూ  ఆదర్శంగా విద్యా సంస్థను నిర్వహిస్తూ అందరి ఆదరాభిమానాలను పొందారు .పరిసర ప్రాంతాలలో అమరవాణికి గొప్ప గుర్తింపు తెచ్చి ,.వేలాది విద్యార్ధుల   జీవితాలలో వెలుగులు .తమ విద్యార్దుల బహుముఖీన ప్రజ్ఞా పాటవాల కోసం   సరసభారతి చేత ఈ విద్యాలయం లో అనేక వక్తృత్వ, వ్యాస రచన పోటీలను  .సాహితీ ప్రసంగాలను  నిర్వహింప జేసిన ఘనత వీరిది .

45 సంవత్స రాల సుదీర్ఘ అనుభవం తో’’ అమరవాణిలో చదువు ఉజ్వల భవిష్యత్తు కు మెరుపు’’అన్నట్లు మలచిన అమరవాణి విద్యాలయ సంస్థాపక, నిర్వాహకులు .శ్రీ పరశు నందకుమార్ గారిని సరస భారతి నిర్వహిస్తున్న ఉగాది వేడుకలలో  శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతుల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘ ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినదిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం .

 

2   .కుమారి చతుర్వేదుల యశస్విని

స్టేట్ బాంక్ ఉద్యోగి అయిన శ్రీచతుర్వేదుల మధుసూదన మూర్తి ,శ్రీమతి రాజ్య లక్ష్మి దంపతులకు విజయవాడలో జన్మించిన కుమారి చతుర్వేదుల యశస్విని విజయవాడలోనే భాష్యం లో సెకండరీ విద్య పూర్తిచేసి ,అక్కడే శ్రీ చైతన్యలో ఇంటర్ చదివి పాసై ,హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రు ఆర్కి టెక్చర్ అండ్ ,ఫైన్ ఆర్ట్స్ యూని వర్సిటీ లో బాచేలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివి  ఉత్తీర్ణు రాలైనారు . జే .యెన్. ఏ .ఎఫ్.ఏ.యు.కు అనుబంధంగా ఉన్న ఇండస్ట్రియల్ కన్సల్టంట్ సర్వీసెస్ లో ప్రస్తుతం జెన్ .యెన్. టి .యు .కలికిరి ,అనంతపురం మొదలైన చోట్ల లోను అనేక ప్రభుత్వ సంస్థల ప్రాజెక్ట్ లకు డిజైనింగ్ అండ్ ఎక్సి క్యూషన్ ఆర్కి టెక్ట్ గా పని చేస్తున్నారు . ఇతర ఆర్కి టేక్చర్ ,ఇంటీరియల్ మరియు లాండ్ స్కేప్ ప్రాజెక్ట్ లకు ఫ్రీ లాన్సింగ్ చేస్తున్నారు .బెంగుళూర్ లోని కాడేన్స్ ఆర్కి టేక్చర్ ఫరం లో ఒక ఏడాది ఇంటర్న్ షిప్  చేసి తన సమర్ధతను నిరూపించుకొన్నారు . కర్నాటక సంగీతం ,చిత్రలేఖనం ,స్కెచింగ్ ,ప్రాడక్ట్ డిజైనింగ్ యశస్విని  హాబీలు .

.23 ఏళ్ళ ఈ యువ ఆర్కిటెక్ట్ కు ఆస్ట్రేలియా లోని సిడ్నీయూని వర్సిటీ లో ‘’సస్టైనబుల్  ఆర్కిటేక్చర్’’ లో ఈ జులై నుండి  ఏం .ఎస్ .చేయటానికి అడ్మిషన్ లభించిన శుభ సందర్భం లో,కుమారి యశస్విని మరింత యశస్సు నార్జించాలని మనః పూర్వకంగా కోరుకొంటూ , సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకల లో  శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతుల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాన్ని స్వీకరించవలసినదిగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం .

 

3  చి.పామర్తి వీర వెంకట దుర్గా ప్రసాద్

అందులకు విద్యను సులభ తరంగా అందించాలనే అభిలాష ఉన్న వ్యక్తి ఛి పామర్తి వీర వెంకట దుర్గాప్రసాద్ .బి ఏ రెండవ సంవత్సరం చదువుతున్న ప్రసాద్ ,హైదరాబాద్ లో ‘’సాయి జూనియర్ కాలేజి ‘’లో శిక్షణ పొంది ,తను నేర్చిన విద్య ను తోటి అంధ విద్యార్ధులకు వినికిడి ద్వారా  నేర్పించాలని కృషి చేస్తున్నాడు .అంధ విద్యార్ధులకు సి .డి.లద్వారా ఉచిత శిక్షణ నిస్తున్నాడు ..’’ప్రసాద్ సెల్ పాయింట్ షాప్ ‘’ను మంటాడలో నెలకొల్పి ,వచ్చిన ఆదాయం తో కొంత సొమ్మును తాను  స్థాపించిన ‘’ఓం సాయి కంప్యూటర్ ‘’ద్వారా ఖర్చు చేస్తున్నాడు  .ఒకదీపం మరొక దీపాన్ని వెలిగిస్తున్నట్లు దివ్యాంగుడైన తాను ఇతర దివ్యా౦గులకువిద్యా సేవచేస్తున్న ఛి పామర్తి వీరవెంకట దుర్గా ప్రసాద్ ను సరసభారతి నిర్వహిస్తున్న శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతుల ప్రోత్సాహక ‘’స్వయం సిద్ధ ‘’ఉగాది పురస్కారాన్ని అందుకోవలసినది గా వేదిక పైకి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం .

 

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆహ్వానం సరసభారతి – రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ది : 3-4-2016

ఆహ్వానం సరసభారతి – రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ది : 3-4-2016 ఆదివారం సాయంత్రం : 3:30నిమిషాలకు ప్రారంభం


Streaming video by Ustream

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -128

 

 

52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ -3(చివరిభాగం )

ప్రౌస్ట్ రాసిన రిమెంబ రెన్స్ నవలలో ఎన్నో పాత్రలున్నాయి .చెప్పలేనన్నిసంఘర్షణలు  రెండు పెద్ద నేపధ్యాల లో జరుగుతాయి  .మొదటిది సమాజం ఉత్తాన పతనాలు . ఆ శతాబ్దం అంతం లో అననుకూల౦గా  ఉన్న నిబంధనల సడలింపు ,సామాజిక పొరలు కరిగిపోవటం .ఈ నేపధ్యం లో జర్మంటిస్అంటే  అరిస్టోక్రాట్ ల  సమ్మేళనం ‘’స్వాన్స్ ‘’అంటే మధ్యతరగతి మేధావుల సుఖ జీవనం ,’’వర్డూరిన్స్’’అంటే నయా రిచ్ వర్గాల నిలకడ ప్రభావం అన్నీ కలగా పులగం గా ఉన్నాయి .రెండవది ,మరింత జటిలమై సింబాలిక్ గా ఉన్నదీ –కాలం తో మనిషి నిరంతర పోరాటం .అందుకే నవల శీర్షిక ‘’ఇన్ సెర్చ్ ఆఫ్ టైం లాస్ట్ ‘’చాలా చక్కగా నప్పింది .””Poetry is  emotion remembered in tranquility ‘’అని వర్డ్స్ వర్త్ కవి అంటే ,ప్రౌస్ట్ ‘’Not only poetry but reality is an experience relived in the memory ,reality is not so much the event as the re animating flow between the past and the present ‘’అన్నాడు .’’ది పాస్ట్ రి కాప్చర్డ్ ‘’లేక టైం రీ గైండ్ ‘’లో చివరి పేజీలు  అసలు రహస్యాన్ని,కీలక విషయాన్ని  తెలియ జేస్తాయి   .గతం తన ను తనవారినీ వేరు చేయలేదని అన్నాడు .’’మనుషులు స్పేస్ లో కంటే కాలం లో ఎక్కువగా విహరిస్తారు .వారి వర్తమానం భూతకాలం పైనే ఆధార పడి ఉంటుంది..అతని పాత్రలు మామూలు దృష్టిలో పెరగవు .వాళ్ళు వృద్ధి చెంది,వికసిస్తారు .’’The most vivid insights in Proust;s work do not rise from wisdom or applied intelligence ,but from chance sensations and their buried associations –a’’madeleine ‘’,a little cake dipped in a cup of tea .’’

భవిష్యత్ అదృష్టాన్ని గురించిన చింతే లేనివాడు ప్రౌస్ట్ .ప్రౌస్ట్ ను ఫేబర్  తో పోల్చవచ్చు . ఫెబెర్ కీటకాల సంఘ జీవనాన్ని అధ్యయనం చేస్తే ప్రౌస్ట్ మానవ సంఘాల జీవనాన్ని అధ్యయనం చేసి రాశాడు  .బెర్గ్ సన్ కాలాన్ని అధ్యయనం చేశాడుకనుక ఆయనతో పోలికా సరైనదే .జేమ్స్ జాయిస్ తో పోల్చటమూ బాగుంటుంది కారణం అతను అంతశ్చేతనను శోధించాడు .ఫెబర్ లాగా ప్రౌస్ట్ పరిశీలకుడు మాత్రమె కాదు వ్యాఖ్యాత కూడా .బెర్గ్ సన్ లాగా  కాకుండా ప్రౌస్ట్ కాలాన్ని నిర్మాణ అంశంగా కాక విచ్చిన్న అంశంగా భావించాడు .జాయిస్ సబ్జెక్టివ్ అయితే ,ప్రౌస్ట్ ఆబ్జెక్టివ్ .ప్రౌస్ట్ అనుబంధాలు స్వేచ్చా పూరితమైనవికావు .అవి సుదీర్ఘ జ్ఞాపకాల గొలుసులతో గట్టిగా అనుసందానమైనాయి .Remembrance of things past  ‘’is the first and last ,a uniquely expanding autobiography which is a masterpiece of sensibility ‘’.

ఈ బృహత్తర నవలా రచన లో ఉన్నప్పుడు ప్రౌస్ట్ నరాలబలహీనత ,ఒంటరితనం తో మునిగిపోయాడు బజారు అరుపులు శబ్దాలు కాలుష్యం దుమ్ము ధూళి ,పరాగ రేణువులు ,పగటి కాంతి అతని నరాలపై ప్రభావితం చేశాయి .అందుకనే గది వదిలి బయటికి వచ్చేవాడు కాదు .గదిలోకి శబ్దం దూరకుండా కార్కు షీట్లు,సూర్య రశ్మి ప్రవేశించకుండా షట్టర్లు ఏర్పాటు చేసుకొన్నాడు .కిటికీ తలుపులు అసలెప్పుడూ తెరవనే లేదు .స్టీం హీట్ ను ఉపయోగించేనే లేదు .మహిళా సందర్శకులు వస్తే అతని సేవకులు ముందుగా వారి వద్ద పూలుకాని సువాసన ద్రవ్యాలు కాని ఉన్నాయేమో చెక్ చేసి లోపలి పంపేవారు .వేసవి కాలం లోనూ శీతాకాలం లోనూ మఫ్లర్లు స్వెట్టర్లు ,నైట్ కాప్ గ్లోవ్స్ తప్పనిసరి గా వేసు కొనే పడుకోనేవాడు .గది అంతా దట్టమైన ధూపం తో నిండి ఉండేది .ఫామిలీ హౌస్ నుండి మారి ఒక పాత అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తుగదిలో చేరాడు .అంతా చీకటి. అదే అతనికి వరం .ప్రౌస్ట్ జీవిత చరిత్రాకారుడు లియర్ పియరీ క్వింట్ ఆ గదిని ‘’ఒక సర్వెంట్ రూమ్ ‘’లాగా ఉందన్నాడు .దీన్నీ ఖాళీ చేసి వేరొక చోటికి వెళ్లాలని ఉండేది కాని వెళ్ళలేదు .కుర్చీలకు కవర్లు తొడిగే ఉండేవి .పడుకొనే రోజులో చాలా ఎక్కువ భాగం గడిపేవాడు .గది అంతా మందు సీసాలు ,ఖాళీ జార్లు చిందర వందరగా పడి ఉండేవి .మధ్యలో రాసి పారేసిన కాగితాల దొంతరలు .పాత న్యూస్ పేపర్ కట్టలు ,20 పెద్దనోట్ పుస్తకాలు టేబుల్ పైన ఉండేవి .ఇవే అతని తాజా రచనకు తార్కాణాలు .

ఒక్కోసారి రాత్రి బయటికి కాసేపు వెళ్ళేవాడు .రాత్రి అంత ప్రమాదకరం కాదని అనుకొనేవాడు .బాధకు ఉపశా౦తి గా తప్పుడు ఉత్ప్రేరకాలు వాడేవాడు .పరిస్థితి రోజు రోజుకూ క్షీణించింది .విశ్రాంతికోసం మాదక ద్రవ్యాలు వాడాడు .వీటితో మూడు రోజులు నిద్ర పోయేవాడు .లేపటానికి మళ్ళీ ఎఫీన్ అడ్రోలీన్  వేసేవారు .51వ ఏట న్యుమోనియా సోకింది .కాని డాక్టర్ ను పిలవలేదు తమ్ముడు రాబర్ట్  అన్నకు సేవ చేద్దామని వచ్చాడు .అతనితో మాట్లాడనేలేదు  .అతని సపర్యలు వద్దుపోమ్మని తిరస్కరించాడు .తాను  పని చేసుకోవాలి కనుక డిస్టర్బ్ చేయ్యద్దన్నాడు .చావు ముందు ఒక గంట సేపు ప్రూఫ్ రీడింగ్ చేశాడు .అందులో చనిపోయే బెర్గాట్టే పాత్ర వర్ణనలో కొంత మార్పు చేయాలనుకొన్నాడు కారణంగా ‘’I have several retouchings to make ,now that I find myself in the same predicament ‘’చెప్పాడు .అనుకొన్నట్లు ఆ మార్పులు చేయగానే చేతిలోని పెన్సిల్ జారి కింద పడిపోయింది .మార్సెల్ ప్రౌస్ట్ 18-11-1922న 57ఏళ్ళ వయసులో మరణించాడు .

ప్రౌస్ట్  హోమో సెక్సువల్ .మగవాళ్ళతో అతని సంబంధాలు ఆ నాడు బాగా చర్చనీయా౦శ మైంది .కాని ఇది అబద్ధం అని అతనికి సేవ చేసిన సేలేస్టే అల్బరేట్ చెప్పింది .కాని అతని సమకాలిక రచయిత ఆండ్రీ గైడ్ మొదలైన వారు రాసినదానికి ఆమె చెప్పింది విరుద్ధం గా ఉంది .ప్రౌస్ట్ ఎప్పుడూ దీనిపై స్పందించలేదు .ప్రౌస్ట్ రచనలో సేక్సువాలిటి ఒక పెద్ద చర్చనే రేపింది  .’’హోమో’’ అనేది తర్వాత జీన్ పాల్ సాత్రే రచనల్లోనూ చోటు చేసుకొంది .మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో ప్రౌస్ట్ తన నవలను యదార్ధ సంఘటనలతో నిర్మాణం లో పెద్ద మార్పులతో  మూడు రెట్లు పెంచి రాశాడు .’’Proust ;s novel  has a circular constitution and must be considered in the light of the revelation with which it ends ‘’.అతని సబ్జెక్ట్ ముక్తి .తాత్కాలిక ప్రలోభాలనుండి విముక్తి .నవలాపదార్ధం తన గతమే నని స్పష్టంగా చెప్పాడు

ఆధునిక కాల్పనిక  సాహిత్యం లో ఇరవై వ శతాబ్ది నడకను ఒడిసిపట్టుకొని ప్రతిబింబింప జేసిన గోప్పనవల రేమేబ్రన్స్ .తన గత జీవితాన్ని ఒక ముడిపదార్ధంగా తీసుకొని,గతించిన కాలం తిరిగిరాదని ,అమాయకత్వం ను అనుభవం తో అధిగమించాలని ప్రేమ స్నేహం మనిషి అహంకారం గర్వం పాపం నిరాశల విజయాలు గురించే రాశాడు .చివరగా ప్రౌస్ట్ చెప్పిన దాని సారాంశం ‘’దిన జీవితం చాలా ప్రాముఖ్యమైనది .అందులో నీతి సంతోషం ,అందం ,ఆనందం  ఉన్నాయి .వీటిని వదులు కోరాదు . మానవసహజ  తప్పిదాల వలన వాటిని కోల్పోయినా,అవి నాశనం చెందనివి ,తిరిగి పొందగలిగినవి .ప్రపంచ సాహిత్యం లో ప్రౌస్ట్ శైలి అద్వితీయమైనది .వేగం దీర్ఘత ,నిర్డుస్టత  ,శక్తి, మురిపెం,క్లాసిజం ,సింబాలిజం యొక్క సమాహారం ప్రౌస్ట్ రచనా విధానం .అసాధారణ వ్యక్తిత్వం ఉన్న మహా రచయిత ప్రౌస్ట్ .తనది జ్యూయిష్ రక్తం అని ఎక్కడా ప్రౌస్ట్ చెప్పుకోలేదు .తల్లి కులగోత్రాలజోలికీ పోలేదు .

 

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-4-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -127

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -127

52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్ -2

21వయసులో ప్రౌస్ట్ చీకూ చి౦తా లేని యువకుడుగా ఆ నగర యువతలో వెలిగి పోయాడు .తల్లిలాగా ఆలివ్ రంగు శరీరం ,మెరిసే నల్ల కళ్ళతో కనిపించేవాడు .నిరంతరం చిరునవ్వుతో అందరినీ ఆహ్వానిస్తూ ఉండే ముఖం తో ఉండేవాడు .అయితే ఉన్నవయసుకంటే పెద్ద వయసువాడుగా అనిపించేవాడు .అతని స్నేహ బృందం ఆర్ట్ పై నిరంతర చర్చ చేసేది .మేడం జేనివీవ్ స్త్రాటస్  సలూన్ లో ఎక్కువగా గడిపేవాడు .స్త్రాటస్ భర్త చనిపోయాక మిగిలిన బృందాల పరిచయమేర్పడింది .అతనిని బాగా ఆకర్షించింది  అనటోల్ ఫ్రాంక్ ను ప్రభావితం చేసిన మేడం అర్మాన్ డీ కైలావేట్ .అర్మాన్ తోనే ప్రయాణం స్నేహం ఆధారం .ఆమె కోడలు జియాన్నే మారిస్ పాకెట్ .ఈమె మొదటి భర్త గాస్టాన్ డీ కైలావేట్  . ఆమె తన ‘’అనటోల్ ఫ్రాంక్ అండ్ హిస్ మ్యూజ్ ‘’లో ప్రౌస్ట్ ను బాగా అధ్యయనం చేసి రాసింది. మార్సెల్ ఎక్కువ సార్లు ముఖ్యం గా ఆదివారాలలో అర్మాన్ సెలూన్ లో కనిపించేవాడని ,తల వెనక్కి వాల్చి ,బుజం మీద ఉంచి కూర్చున్నట్లు అంటే దాదాపు పడుకోన్నట్లు ఉండేవాడని .అతడు దాదాపు ఒక కుప్ప లాగా ఉండేవాడని ,సీరియస్ ముఖం తో కళ్ళలో గూడు కట్టిన విషాదం తో ఉండేవాడని ,తెల్లని పళ్ళు మెరుస్తూ ఉండేవని ,చిన్న వాటికే పెద్దగా నవ్వేవాడని రాసింది .అందం గా ఆకర్ష వంతంగా మంచిగా ఉండేవాడు .తన నవల చివరిభాగం లో తానూ ఎంతటి సెన్సిటివ్ మనిషో ,తన మర్యాద ఎలా ఉండేదో ,యెంత కృతజ్ఞతతో ఉండేవాడో ఏ మాత్రం మనసుకు గాయమైనా యెంత విషాదం తో కుమిలి పోయేవాడో  అన్నీ రాశాడు .ఆడ ,మగ పిల్లలతో కలిసి ఆడుకోవాలని పించేది .వాళ్ళతో సరదాగా పిక్నిక్ లు చేయాలను కొనేవాడు. కాని పాపం ఏ అమ్మాయీ అతని దగ్గరకు చేరలేదు .అబ్బాయిలు మాత్రం పొగడ్తలతో ఉబ్బేసి ఉబ్బు లింగాన్ని చేసి పబ్బం గడుపుకొని పోయే వాళ్ళు . ‘   తల్లితో సాన్నిహిత్యం  అప్పుడప్పుడు సందిగ్ధం లో పదేసేది .రాయటం మొదలు పెట్టక ముందు నుంచే తానొక రచయిత కావాలను కొన్నాడు అతని మేధస్సుమీద అంత నమ్మకం ఉండేది 20ఏళ్ళ వయసులో మేడం స్త్రాస్ సెలూన్ లో మిత్ర బృందం తో ఉండగా .’’లీ బాన్ క్వెట్’’అనే మేగజైన్ నడిపాడు .అది ఇంగ్లాండ్ వారి ‘’ఎల్లో బుక్ ‘’ధోరణిలో ఉండేది .తన శైలిలో కొన్ని ఆర్టికల్స్ దీనిలో రాసాడు. జర్నలిస్టిక్ విషయాలు సాంఘిక విషయాలు ,పుకార్లు అన్నే ‘’లీ ఫిగరా ‘’లో  వండి వడ్డించాడు.ఇవేవీ గొప్పవి కాకపోయినా తన భావాలకు అవుట్ లెట్ గా ఉపయోగ పడ్డాయి . 25వ ఏట ‘’లేస్పాసివ్స్ ఎట్ లేస్ జోర్స్ ‘’లో కొన్ని కవితలు ,వ్యాసాలూ ,రేవేరీస్ స్కెచ్ లు కలిపి మొదటిభాగం ప్రచురించినప్పుడు ముందుమాటలో ప్రౌస్ట్ ను ‘’ఏ గిల్ లెస్ పెట్రోనియాస్ ‘’అని రాసింది మేడం కైలావేర్ట్ .ప్రౌస్ట్ 22వ ఏట తమ్ముడు స్కాట్ చనిపోయాడు .అతని మధుర స్మృతుల్ని రికార్డ్ చేశాడు రచనలో .తనను నోవా ఇన్ దిఆర్క్ తో పోల్చుకొన్నాడు .

30ఏడు మీద పడేలోగానే ప్రౌస్ట్ స్వయం వినాశక పద్ధతులలో పడ్డాడు .వ్యక్తిత్వం ,అవసరాల మధ్య నలిగిపోయాడు .రాసినా మాట్లాడినా చాలా నిష్కపటంగా ఉండాలనుకొన్నాడు .కానిలోపల మాత్రం ఏదో తెలీని దాపరికం ఉండేది .తన గురించి తల్లి దండ్రుల గురించి స్వేచ్చగా చెప్పాలనుకొన్నా కొన్ని చెప్పలేక పోయాడు .శ్వాస పీల్చే సమయం కూడా దొరికేదికాదు .ముందు తండ్రి తర్వాత రెండేళ్లకు తల్లి చనిపోగానే ప్రౌస్ట్ మరింత మనోవ్యాకులానికి ,విచారానికి గురైనాడు .తల్లిమరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు .దీనిపై ‘’34వ ఏట ప్రౌస్ట్ తల్లి లేని అనాధ అయ్యాడు .చిన్నప్పుడూ ,ఇప్పుడూ కూడా ‘’లిటిల్ బాయ్ లాస్ట్ ‘’గానే ప్రవర్తించాడు .తల్లిని ఎన్నడూ మార్చీ పోలేదు ,క్షమించానూ లేక పోయాడు .తల్లిని ‘’Mother was a dove ,,the consoling hopeful messenger ,who had left him ,who had left him hopelessly alone ‘’అనుకొన్నాడు .ఆమె మరణం అతనికి విముక్తి అనిపించింది .

ఇప్పుడు ప్రౌస్ట్ తన బృహత్తర రచనకు శ్రీకారం చుట్టాడు .కౌంట్ డీ మాంటిస్కో ను నెపోలియన్ మూడవ సోదరి ప్రిన్సెస్ మాతటిల్డా మొదలైన వారిని చాలా తీవ్రంగా అధ్యయనం చేశాడు .దేనినీ మర్చే పోలేదు .ఈ సంఘటనలన్నీ ఒక ధారావాహిక గాధలలా అనిపించాయి .కుళ్ళి పోయిన సమాజం ,బాగు పడని సమాజం ,ప్రజల తీర్చలేని ఇక్కట్లు దారుణ జీవన పరిస్తితులు అన్నిటినీ తన దీర్ఘ నవల ‘’రిమే౦బరెంస్ ఆఫ్ థింగ్స్ పాస్ట్ ‘’లో నిక్షిప్తం చేశాడు .తన మైక్రోస్కోపిక్ ,టేలిస్కోపిక్  వివరాలను చదివి జనం మెచ్చారన్నాడు .ఒక్క పాత్ర ఆల్బర్టైన్ మాత్రమె అతనికి నచ్చలేదు .ఆ పాత్రంటే మహా ప్రేమ ,ఆరాధన .కధలో అసలైన ఆల్బర్టైన్ లెస్బియన్ కు బదులు  సెక్సువల్ .ఈ నవల వ్యక్తిగత ఒప్పుకోలు ,సాంఘిక విమర్శ .దీన్ని ఏ పబ్లిషర్ కూడా గుర్తించలేదు ప్రింట్ చేయానికి ముందుకు రాలేదు .కొంత డబ్బు తానే ఖర్చు చేసి అజ్ఞాత ప్రింటర్ ద్వారా అచ్చువేయించి మొదటిభాగం ‘’స్వాన్స్ వే’’బయటికి 1913 లో తెచ్చాడు .దీన్ని ఎవరూ పట్టించుకోలేదు .అయిదేళ్ళు ఆగాల్సి వచ్చింది రెండో భాగం’’విదిన్ ఏ బడ్డింగ్ గ్రువ్ ‘’ తేవటానికి .ఇది జనం లోకి బాగా చొచ్చుకెళ్లి,వీర అభిమానం తెచ్చి పెట్టి ‘’కన్కార్ట్ ప్రైజ్ ‘’పొందింది .మిగిలిన నాలుగేళ్ళలో ‘’ది గుర్మాన్తెస్ వే’’,సిటీ సాఫ్ ది ప్లైన్ ,ది కాప్టివ్’’,’’ది స్వీట్ చీట్ గాన్’’,ది పాస్ట్ రి కాప్చర్డ్ ‘’ప్రౌస్ట్ జీవితకాలం లోనే రాస్తే మరణానంతరం ప్రచురింప బడ్డాయి ..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4 -16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -126

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -126

52-ఇరవయ్యవ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత మార్సెల్ ప్రౌస్ట్

నిరంతరం బాధిస్తున్న ఎలర్జీలతో సతమౌతూ ,ఆ బాదానివారణ కోసం డ్రగ్స్ కు అలవాటై చస్తూ బతికి ,ఇరవై వ శతాబ్దం లో అత్యుత్తమ సుదీర్ఘ నవలా రచయిత గా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ నవలారచయిత మార్సెల్ ప్రౌస్ట్ .వ్యాసాలు  కొన్ని మాత్రమే రాసినా అతని ‘’ఇన్ సెర్చ్ ఆఫ్ టైం లాస్ట్ ‘’అనే 16 భాగాల సుదీర్ఘ నవల కొంత ఫిక్షన్ ,మరికొంత ప్రౌస్ట్ స్వీయ జీవిత చరిత్ర ,సమాజం యొక్క సంపూర్ణ దృశ్య చిత్రం గా కాలాతీత నవలగా మిగిలింది .

10-7-1871లో ఫ్రాన్స్ లోని ఆటేవిల్ అనే పారిస్ కు దగ్గరలో ఉన్న శివారు గ్రామం లో జన్మించాడు మార్సెల్ ప్రౌస్ట్ .సంపన్న ఎగువ మధ్యతరగతి కుటుంబం .తండ్రి డాక్టర్ ఎడ్రీన్ ప్రౌస్ట్ వ్రుత్తి రీత్యా డాక్టర్ మాత్రమే కాక ,పారిస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రొఫెసర్ ,ఫ్రెంచ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ కు హెడ్ కూడా .తల్లి జీన్నే వీల్ అందమైన సంస్కారవంతమైన ఆల్సేషియన్ జ్యూయేస్ .కొడుకును అతిగారాబంగా పెంచి ,తనపైనే ఆధార పడిన అతడిని చెడగొట్టింది .ఇద్దరు కొడుకులలో రాబర్ట్ చిన్నవాడు తండ్రినుంచి మంచి ఆరోగ్యం ,వివేకం  వారసత్వంగా పొందాడు .ఇతనికి రెండేళ్ళ పెద్దవాడైన మార్సెల్ తల్లినుంచి నరాల బాధ ,అసహనం సున్నితమైన సంవేదనా శీలాలను పొందాడు .9వ ఏట మార్సెల్ ఊపిరి సలుపని జబ్బు పడ్డాడు .అదే ఉబ్బసరోగం అని తర్వాత గుర్తించారు .తరువాతి కాలం లో జరిగిన సంఘటనలు  ఈ జబ్బును బాగా తీవ్రం చేశాయి .ఆస్తమా ఒకోసారి మానసిక అస్తవ్యస్తత వలన కూడా రావచ్చు .పాపం ప్రౌస్ట్ క్రానిక్ ఆస్తమా పేషెంట్ అయిపోయాడు .దీనితో జీవితం లో కొంత వరకు పనికి రాని వాడుగా ఉండి చనిపోయేదాకా  ఎప్పుడూ మంచం లోనే ఉండిపోవటానికి  నిర్ణ యించు కొన్నాడు .

తల్లికి అతుక్కు పోయి జీవించాడు .ఈ విషయాలన్నీ తన ప్రఖ్యాత నవల లో మొదటి  భాగం అయిన ‘’స్వాన్స్ వే’’లో వర్ణించాడు  .రచయిత చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు తల్లి ఒకరోజు రాత్రి రోజూ లాగా ఆతను నిద్రించే ముందు ఇచ్చే’’ గుడ్ నైట్ ముద్దు’’ ఇవ్వటం మర్చి పోయింది .అది అతనిని డిప్రేస్ చేసింది .ఈ విషయాన్ని మర్నాడు డిన్నర్ టేబుల్ దగ్గర ఒక కాగితం పై రాసి ఆమె చూసేట్లు కింద పడేశాడు .ఈ సంఘటన అతన్ని మానసికంగా బాగా కుంగ దీసింది. అంతటి సెన్సిటివ్ అయ్యాడు మార్సెల్ .ఈ సంఘటననే నవలలో రాశాడు .అందుకని ప్రతిరాత్రీ ఆమె గుడ్ నైట్ కిస్ ఇచ్చి తలుపు వేసి వెడుతున్నప్పుడు తల్లిని మళ్ళీ పిలిచి మరో కోసరు ముద్దు పెట్టించుకొని నిద్ర పోయేవాడు .అప్పుడామే చాలా అసహనంగా కనిపించేది .ఈ విషయం పై రాస్తూ తన మనోభావాలను ‘’When she bent her loving face down over my bed ,and held it out to me like a Host ,for an act of Communion in which my lips might drink deeply the sense of her real presence and with it the power to sleep ‘’అని రాసుకొన్నాడు .అంతటి గాఢఅనుబంధం తల్లితో ఉండేది ప్రౌస్ట్ కు .

స్వీయ జీవిత చరిత్రలోని ‘’నేను ‘’కు ,నిజ జీవితం లో మార్సెల్ కు చిన్న తేడా మాత్రమే ఉండేది .యవ్వనం లో తల్లిని చిన్నప్పటి గాయ పడిన మనసుతోనే పిలిచేవాడు .అందులో ఉన్న నిజాన్ని ఉత్తరాలలో తల్లికి తెలియ బరచాడు కూడా .అతను పలికిమాలిన ,ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు కూడా ఇలాగే జరిగింది .తాను  కొంత మెరుగైన ఆరోగ్యం తో ఉన్నప్పుడు కూడా ఆమె ఇలానే ప్రవర్తించింది అన్నాడు .తాను ఆస్తమా తో బాధ పడుతున్నప్పుడు తల్లి తనకు తోడుగా ఉంటె బాగుండును అనుకొన్నాడు .ఈ రాతలలో అతని స్వీయ కనికరం ,(సెల్ఫ్ పిటి )మూర్చ(హిస్టీరియా ) లతో కంగారు గా ఉన్న మనస్సు కనిపిస్తుంది .కొడుకు అనారోగ్యం వలన దేనికీ పనికి రాని వాడైనాదని తండ్రి పట్టించు కోవటం మానేస్తే తల్లి అతని పాలిటి ఆత్మ బంధువు అయి చదువు సంధ్యలు చూసింది .అతని నైతిక స్తైర్యాన్ని పెంచటానికి ఏదో ఒక పని చెప్పి చేయించేది .చదువు అంటే బద్ధకమేర్పడింది .తల్లి ఎప్పుడైనా తిడితే అతనికి విపరీతంగా దగ్గు వచ్చి ఎక్కువకాలం బాధించేది .అప్పుడు తల్లి తప్పక అతనికి సేవలు చేయాల్సి వచ్చేది .లైబ్రరీకి చేరి తన జీవితాన్నే సాహిత్యంగా మలిచాడు .పుస్తకాలు జుర్రి ,మనుష్యుల్ని చదివాడు .తండ్రి స్వగ్రామం  ఇల్లీర్స్ లో వేసవి ఎప్పుడు గడపాలా అని ఎదురు చూసేవాడు .ఈ గ్రామమే అతని ఫిక్షన్ కు కామ్బ్రే గా మారి నేపధ్యం అయింది .సముద్ర తీర కాబోర్గ్ టౌన్ ఫిక్షన్ లో బాల్బెక్ అయింది .బ్రేకులు పడుతూ చదువు సాగింది. లైసీ కండార్సేట్ లో చేరి చదివి సెయింట్ సైమన్ ఫిలాసఫీని అర్ధం చేసుకొన్నాడు  .తన పట్టణ ప్రజల ,సమాజం యొక్క పరిస్తితులపై విశ్లేషనాత్మక రచయితగ మారాలనుకొన్నాడు .కాన్స్క్రిప్ట్ ఆర్మీ లో కొద్దికాలంపని చేసి ,దిస్కూల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ,లా స్కూల్ ,సార్బొంనే స్కూల్ లలో పేరు రిజిస్టర్ చేయి౦చు కొన్నాడు .సార్బాన్నే లో అతనిపై హెన్రి బెర్గ్ సన్ ప్రభావం  పడింది .బెర్గ్ సన్ స్పెషలైజ్ చేసిన ఇమాజినేషన్ అండ్ ఇంట్యూషన్ (ఊహ ,అంతర్ దృష్టి)పై అభిరుచి కలిగింది. బెర్గ్ సన్- ప్రౌస్ట్ కజిన్ మిల్లీ ని పెళ్లి చేసుకోన్నాక వీరిద్దరిమధ్య అనుబంధం మరీ పెరిగింది .

సశేషం

ఆల్ ఫూల్స్ డే శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -125

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -125

51-మతాత్మక హింసాత్మక ఫ్రెంచ్ చిత్రకారుడు –జార్జెస్ రౌవాల్ట్-2(చివరి భాగం )

1917లో బ్లాయ్ మరణం వరకూ రౌవాల్ట్ ,బ్లాయ్ లు  మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ మన పెయింటర్  ధోరణి మార్చుకోలేదు .అత్యాచారాలు మరింత దారుణంగా చిత్రించాడు .వీటిని తానుకూడా సంస్థాపకులలో ఒకడైన ‘’సెలూన్ డీ ఆటోమ్ని’’లో ప్రదర్శించాడు .దీనిపేరు తర్వాత ‘’సెలూన్ డెస్ ఫావెస్’’గా మారింది .’’వైల్డ్ బీస్ట్ ‘’లనబడే ‘’ఫావెస్’’లలో మాటిస్సే ,డిరైన్ ,ఫ్రీజ్ ,రౌవాల్ట్ లున్నారు .వీరందరి నూతన ఆవిష్కరణలు అ రోజుల్లో మామూలుగానే సంప్రదాయ వాదులు విమర్శించారు .వీళ్ళ సృజనను నిగూడం,అశ్లీలం ,కుటిల కృత్రిమ ,పిచ్చి దురవగాహన అగమ్య గోచర కళఅన్నారు .వీరిలో రౌవాల్ట్ నే ఎక్కువగా అందరూ దూషించారు .కారణం అతని అతి చీకటి లక్షణ మానసిక  చిత్రాలే .ఈ విమర్శ ,తిట్లు మరో సారి మరి కొంతకాలమైన తర్వాత  జరిగిన  ప్రదర్శన తర్వాత మరీ పెరిగింది . .బ్లాయ్ మళ్ళీ ‘’నేను నీకు రెండు మాటలు మాత్రమే  చెప్ప దలచాను. ఆ తర్వాత నువ్వు నాకు పోగొట్టుకొన్న స్నేహితుడు గానే మిగిలిపోతావు’.మొదటిది నువ్వు అందవిహీన చిత్రాలపైనా ,అసహ్యించుకొని తల తిరిగేట్లు చేసే వాటినే చిత్రించాలని ఉబలాట పడుతున్నావు .రెండవది నువ్వు నిజంగా దైవ ప్రేమికుడివే అయితే ,విధేయతగల అత్మగలవాడి వైతే నువ్వు ఇలాంటి భయంకర చిత్రాలు గీయవు ‘’ అని రౌవాల్ట్ కు ఉత్తరం రాశాడు .

కాని రౌవాల్ట్ చిత్రకళ అవమానకరమైనదని ,మానవుని కి౦చపరచేదని,దైవం పట్ల విశ్వాసం లేనివని ,ఆత్మ న్యూనత కు చిహ్నాలని ఎవరూ నిరసన తెలుపలేదు .అలాగే అతని బాధా తప్త హృదయాన్నీ,వేదననూ కూడా అర్ధం చేసు కొన్న వారు లేక పోయారు .అతని చిత్రాలు ద్వేషం ,రోషాలతోగీసినవికావు .అవిఆధునిక ప్రపంచ హీన స్థితిని   అంతరాత్మ అవసరం ,సానుభూతి ,సహవేదన లను ప్రదర్శించే చిత్రాలు .వయసు 30 దాటాక ముందుకు దూకే భరోసా లభించింది .అతని చిత్రశైలి మొరటు వ్యంగ్యం ,సామాన్య ప్రజల ,రైతుల ,స్నానం చేసేవారల నిత్యం కనిపించే ఆడ మగ పిల్లా జెల్లా ల ఇష్టాల మధ్య  గడిచింది  ,రంగులు మరీ దట్టమైనాయి .ప్రాముఖ్యం పెంచే నల్ల సరిహద్దు ఆకృతులు ఏర్పడ్డాయి .అతని అసలైన వ్యాపారమైన రంగు గాజు పనులు ఇప్పుడు శక్తి వంతమై నమ్మకం కలిగేట్లు బోధనా మయం గా న్నాయి  .ఇదే రౌవాల్ట్  ను గుర్తించే అతిముఖ్యమైన శక్తివంతమైన శైలి అయింది .నలభైలలో చిత్రించిన నీరస క్లౌన్లు ,యాభై ఎనిమిది లో వేసుకొన్న సెల్ఫ్ పోర్ట్రైట్ ,అరవై లలో వేసిన శిలువ ,యేసు క్రీస్తు చిత్రాలు మత భావ విశేషాలతో రాణించాయి .60కి పైగా పెద్ద కాన్వాసులు చిత్రించాడు .లితోగ్రాఫులు,పెర్సనల్ చిత్రాలు ,సర్కస్ జనం చిత్రాలు అన్నీ కలిపితే వంద దాకా గీసినట్లే లెక్క .తన స్వంతా కవిత్వం ‘’పాసేజేస్ లేజెండరీస్ ‘’కు తానె చిత్రాలు వేసుకొన్నాడు .వందకు పైగా వుడ్ కార్వింగ్స్ చేశాడు .సుమారు ఇరవై కిపైగా చెక్కాడు .వయసు మీద పడుతున్నా అతని శైలి  తీవ్రత ఏమాత్రం తగ్గ లేదు .75వ ఏట ‘’బిబ్లికల్ లాండ్ స్కేప్ ‘’,ది ఇంఫంట్ క్క్రైస్ట్ అమాంగ్ డాక్టర్స్’’చిత్రించాడు .వాటిని చూస్తె భక్తిభావం ఉట్టిపడుతుంది .

మిగతా చిత్రకారులకంటే గొప్ప అదృష్ట వంతుడు రౌవాల్ట్ .కారణం ఆయన జీవించి ఉండగానే అందరూ ఏవ గి౦చు కొన్న, దూరం చేసిన, దూషించిన చిత్రాలనే గొప్ప చిత్రాలుగా ప్రపంచ  విమర్శకులు గుర్తించి మెచ్చుకొన్నారు .ఈ అదృష్టం చాలామంది కి దక్కలేదు .రౌవాల్ట్ యొక్క అసామాన్యతను జేమ్స్ ట్రాల్ సోబీ సమీక్షిస్తూ ‘’ A devout Catholic and devotional painter in a period when artists more often run the gamut of anti religious feeling from indifference to irreverence –a painter of sin and redemption in the face of prevailing estheticism and counter estheticism –an artist with a limited vision of unlimited ferocity in contrast to many other leading painters who have scanned and pivoted but seldom started fixedly for long ‘’అని వివరించాడు .

రౌవాల్ట్ ను ఏ ఇతర సమకాలీన  ఆర్టిస్ట్  తో పోల్చాలి అన్నదొక ప్రశ్నఉంది . అతన్ని ఒక కవిగానే గుర్తించాలి చిత్రకారునిగా కాదు .అతని అసాధారణ జుగుప్సాకర ,ఊపిరి సలపని చిత్రాలు మహా కవి టి .ఎస్ .ఇలియట్ ‘’అపూర్వ కావ్యం ‘’దివేస్ట్ లాండ్ ‘’తో ను యాష్ వేడ్నస్ డే’’జర్నీ ఆఫ్ ది మాగీ ,ఫోర్ క్వార్టర్స్ ‘’కవితలతో పోల్చవచ్చు .ఇలియట్ లాగానే రౌవాల్ట్ గాఢనిరాశ మార్గం నుండి తెగించిన నమ్మకం లోకి ప్రయాణించాడు. ఏదీ ప్రశాంతంగా పరిష్కారం కాదు. పాపం ,ప్రక్షాళన లు నిరంతర ప్రక్రియలు .విదూషకులు,క్రీస్తులు అందరూ మనుషులకంటే .ఎక్కువ బాదే అనుభవించారు .’’ఇలియట్ లాగానే రౌవాల్ట్ కూ క్రూరత్వం  సానుభూతి ప్రేరేపిస్తాయి అని పిస్తాయి ..బాధలలోనే మోక్షం ఉంది ‘’అన్నాడు లూయీ అంటర్ మేయర్ .

1891లో రౌవాల్ట్ ‘’ది వే టు కావల్రి ‘’చిత్రించాడు .1907లో స్పిరిట్యు వలిజం కు,జాక్వెస్ మారిటన్ యొక్క    అస్తిత్వవాదానికి ఆకర్షితుడయ్యాడు.మానవ ప్రక్రుతిపైననే అతని దృష్టి కేంద్రీకరించాడు .A tree against the sky possesses the same interest ,the same character ,the same expression as the figure of a human ‘’అంటాడు రౌవాల్ట్ .1917నుంచి క్రిస్టియన్ మత విశ్వాస చిత్రాలు గీశాడు .1937లో చిత్రించిన ‘’దిఓల్డ్  కింగ్ ‘’అతని ఫైనేస్ట్ ఆర్ట్ గా గుర్తించారు . 1930నుండి లండన్ న్యూయార్క్ చికాగో లలో ప్రదర్శన నిర్వహించాడు .1948లో ‘’సైకిల్ మిసేరేరే ‘’చిత్రించాడు .జీవితం చివరి రోజుల్లో ౩౦౦కు పైగా తన చిత్రాలను తగల బెట్టేశాడు వీటి ఖరీదు నేటి లెక్కల ప్రకారం అర మిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది .దీనికి కారణం ఆయన ఏం చెప్పాడంటే తానిక  వాటిని పూర్తీ చేయలేనుకనుక అన్నాడు .1958లో చిత్రకారుడు రౌవాల్ట్ పారిస్ లో 87వ ఏట మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆహ్వానం సరసభారతి – రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ది : 3-4-2016 ఆదివారం సాయంత్రం : 3:30నిమిషాలకు ప్రారంభం

ఆహ్వానం
సరసభారతి – రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
ది : 3-4-2016 ఆదివారం సాయంత్రం : 3:30నిమిషాలకు ప్రారంభం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -124

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -124

51-మతాత్మక హింసాత్మక ఫ్రెంచ్ చిత్రకారుడు –జార్జెస్ రౌవాల్ట్

ప్రముఖ చిత్రకారుడు వాన్ గో ను మినహాయిస్తే ,అంతటి మతాత్మక చిత్రకారుడు అనిపించుకోవటమేకాక హింసాత్మక చిత్రాకారుడు అనిపించుకొన్నాడు జార్జెస్ రౌవాల్ట్ .పరిశోధనాత్మక చిత్రకారుల పరంపరలో సాగి సిజన్నే ,రేనార్ వంటి అనుభూతివాద చిత్రాకారులకు భిన్నంగా రౌవాల్ట్ చిత్రాలుంటాయి. సిజన్నే తేలిక రంగుల దగ్గరే ఆగిపోతే ,రౌవాల్ట్ ముదురు రంగులైన ఎరుపు ,క్రోం బ్రౌన్ లను  మహా ఇష్టంగా వాడి ,నల్ల బార్డర్ లతో షోకు చేశాడు .రేనార్ సౌందర్యం తో నిష్క్రమిస్తే ,రౌవాల్ట్ భయంకరంగా ,హద్దులను అదిగమించి ,మార్మిక వేదనలను కల్లోల భయానక చిత్రాలుగా గీశాడు .దీనికి కారణం ఆతను జన్మించిన నాటి పరిస్తితులే కావచ్చు .

27-5-1871న ఫ్రాన్స్ దేశపు రాజధాని పారిస్ నగరం లో ఆ దేశ శత్రువు కమ్మ్యూన్ లు తీవ్రంగా పారిస్ పై బాంబు దాడులు చేస్తుండగా ,తల్లి రక్షణ కోసం  పురిటి నెప్పులతో ఒక సెల్లార్ లో తలదాచుకొన్న సమయం లోజార్జెస్ హెన్రి  రౌవాల్ట్ పుట్టాడు .ఇదేదో రొమాంటిక్ గా అనిపించవచ్చు కాని పూర్తీ యదార్ధం .తాతయ్య  సంరక్షణలో పెరిగాడు .ఈ తాత తన మనవడు ఆర్టిస్ట్ కావాలని ఆకాంక్షించాడు కూడా .తాతకు ఆనాటి ఆర్టిస్ట్ లైన కాలట్ ,రేమ్బ్రాంట్ ,కార్బెట్ ,మానేట్ లు అభిమానులు .

రౌవాల్ట్ తండ్రి పియానో ఫాక్టరీలో వడ్రంగం లో నగిషీ పని చేసేవాడు .14వ ఏట కొడుకు ఒక రంగుల గ్లాస్ వస్తువులు చేసేవాడిదగ్గర సహాయకుడిగా పని చేశాడు  .అక్కడ తనపని కొలిమి మంటను పర్య వేక్షించటం ,కిటికీలలోనుంచి  బయట పడిన గాజు ముక్కల్ని ఏరి రిపైర్ చేయటం .ఇది అతనికి బాగా నచ్చింది .ఇక్కడ పని చేస్తూనే సాయంకాలం ‘’ఈకోల్ నేషనల్ డెస్ ఆర్ట్స్ డెకోరాటిఫ్స్ ‘’లో చేరి చదివాడు .20వ ఏట ‘’ఈకోల్ డెస్ బీక్స్ ఆర్ట్స్ ‘’లో పేరు నమోదు చేయి౦చు కొన్నాడు .ఇక్కడే  గుస్టేవ్ మొరేవ్ ప్రభావానికి లోనయ్యాడు .మొరేవ్  రెండవ శ్రేణి రొమాంటిక్ ఆర్టిస్ట్ అయినా చాలా సహన శీలి .శిష్యులను అది చేయి ఇలాచేయి అని బలవంత పెట్టేవాడు కాదు .వారే స్వయంగా తెలుసుకొని ముందుకు వెళ్లాలని కోరుకోనేవాడు .మిడి మిడి జ్ఞానం పనికి రాదనీ హితవు చెప్పేవాడు .’’Art is a furious tracking down of the inner feelings solely by means of plastic expression ‘’అన్నది మొరావ్ అభిప్రాయం .’’ఈ ఫ్యూరియస్ ట్రాకింగ్ డౌన్ ‘’ను రోవాల్ట్ పట్టుకొని తన మనోభావాలను కళ లో ప్రదర్శించాడు .రౌవాల్ట్ మొరావ్ కు ప్రియ శిష్యుడయ్యాడు .గురు శిష్యులమధ్య గొప్ప సాన్నిహిత్యం ఉండేది అందుకే మొరావ్ చనిపో గానే రౌవాల్ట్ ను ‘’మొరావ్ మ్యూజియం ‘’అధ్యక్షుడిని చేశారు .

యవ్వనం లోనే రౌవాల్ట్ క్లాసిక్స్ అభ్యసించాడు .25వ ఏట తన’’ గ్రాఫిక్ సెల్ఫ్ పోర్ట్రైట్ ‘’ను వేసుకొన్నాడు .కనుక అతనిచిత్రాలలో శారీరక నిర్మాణ దోషాలున్నాయని ,కనుక శరీర నిర్మాణ చిత్రాలు వేయటానికి అసమర్ధుడు అని అనేవారికిది చెంప పెట్టు .రేమ్బ్రాంట్ చిత్రకారుడు 26వ ఏట మాత్రమే ‘’క్వారీ ‘’చిత్రాన్ని గీయగాలిగాడని గ్రహించాలి .

30వ ఏట రౌవాల్ట్ ఒక సన్యాసి లాగా కనిపించేవాడు .ఇరవైల మధ్యలో పెరిగిన బిరుసు  గడ్డం ఇప్పుడు మెత్తనై వంకర్లు తిరిగింది .కళ్ళు  ప్రశ్నార్ధకం గా చూసేవి .అందమైన మూతి .ఎందుకో చాలా  దుఖితుడుగా , చింత తో కు౦గి పోయినట్లు గా కనిపిస్తూ వీటిని తన లాండ్ స్కేప్ లలో ప్రతిఫలింపజేసి  నిరుత్సాహ పరుస్తాడు  .పేలవమైన నీలంరంగుతో ,భారమైన ఆత్మ వేదనతో కనిపిస్తాయిఅవి. .ఇదే సమయం లో అంటే 1903లో ఉత్సాహ భరిత అంకిత భావం తో ఉన్న కేధలిక్ రచయిత రియాన్ బ్లాయ్ తో పరిచయ మేర్పడింది . బ్లాయ్ లోని  ఆధ్యాత్మిక తేజం నీరవంగా నిరుత్సాహం గా ఉన్న రౌవాల్ట్ లో ఉద్దీపన కలిగించింది .రౌవాల్ట్ కు కూడా ఇప్పుడిప్పుడే ఆధునిక ప్రపంచం వెగటు పుట్టి దూరమౌతున్నాడు .బ్లాయ్ లాగానే అతనికీ ‘’At a time everything seemed  lost ,to thrust at God the outcry of dereliction and anxiety for the orphaned multitude which the Father in his celestial heights seems to be abandoning  and which no longer has the strength even to die bravely ‘’అనే గొప్ప ఎరుక మన గజేంద్రుడికి ‘’నీవే తప్ప ఇతః ప్రమబెరుగ’’అన్నఉత్కృష్ట  భావన కలిగి జ్ఞానోదయమైంది .

దీనితో కేన్వాస్ పై  టెర్రర్ ,దుర్ఘటనలను(దిసాస్టర్ ) గాస్పెల్స్ ను గీశాడు .చెడు ను అసహ్యించుకోవటానికి అందంగా లేని వ్యభిచారుల్ని అసహ్యమైన ఇంద్రియ లోలురను ,వికార దిగంబర బానిస విట నపుంసకుల్ని ,వికర్షించే మొహినుల్ని  ,నీచ కుహనామేధావుల్ని ,అలసిన విషాద విదూషకుల్ని (క్లౌన్స్ )  బాగా పరీక్షగా అధ్యయనం చేశాడు గీశాడుకూడా . .ఇవన్నీ  చూసి, విని బ్లాయ్ అవాక్కయ్యాడు .తన శిష్యుడు ఆధునిక’’ ఫ్రా0జేలికో’’అవుతాడేమోననుకొన్నాడు ..సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని సమకాలీనం గా మారుస్తాడని భావించాడు .’’రౌవాల్ట్ దేవతా చిత్రాలను (సేరాఫిం ) గీసే సమర్ధుడు అనుకొంటే ,దీనికి విరుద్ధంగా  ఇప్పుడు అత్యాచారాలు ,ప్రతీకార వ్యంగ్య చిత్రాలు మాత్రమే  గీస్తున్నాడు ‘’అని రాశాడు .

 

సశేషం

మీ-గబ్బిట-దుర్గా ప్రసాద్ -31-3-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అరణ్య పర్వాన్ని నన్నయ్యే పూర్తిగా రాశాడు

అరణ్య పర్వాన్ని నన్నయ్యే పూర్తిగా రాశాడు

అని ప్రముఖకవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారి బావగారు,ఆయనకు దీటైన కవిత్వం తో వర్ధిల్లుతున్న శ్రీ కోడూరు  పాండురంగారావు గారు ఏ యూని వర్సిటీ కి పంపని తమ సిద్ధాంత వ్యాసం ‘’ఆదికవి –అరణ్య పర్వం ‘’గ్రంధం లో చాలా స్పష్టంగా ,ఉదాహరణ పూర్వకంగా  తెలియ జేశారు .ఆజన్మ సిద్ధంగా వచ్చిన కవిత్వాన్ని శ్రీ వెంకటేశ్వర శతకం ,సాత్రాజితీయం వంటి కావ్యాలలోనూ తమ కుశాగ్ర బుద్ధిని జోడించి పండించిన విమర్శగ్రంధాలైన అశ్వమేధం మొదలైన వాటిలోనూ ,ఇప్పుడు ఈ గ్రంధం లోనూ వెలువరించి లోకానికి చాటారు .తెలుగు పండితుడు ,అర్ధ గణాంక శాఖలో చేరి , గణాంకాదికారిగా ఉద్యోగ విరమణ చేసిన శ్రీ రంగారావు గారు సాహిత్యాన్ని మాత్రం వదలలేదు ,’’పువ్వాడకు సరి జోడు –కోడూరు ‘’అనిపిస్తూ ,శ్రీనాధ ,పోతనల్లాగా సాహిత్య  బావా మరుదులుగా ఉన్నారు .’’అశ్వ మేధం ‘’లో తన నిశిత పరిశీలనా దృష్టిని లోకానికి తెలియ జేసి ,ఇప్పుడీ ‘’అరణ్యం ‘’లో దర్జాగా నడిచారు .సరసభారతికి ఆత్మీయులైన శ్రీ కోడూరువారు 2015 జూన్ లో ప్రచురించిన ఈ పుస్తకాన్ని నాకు ఆత్మీయంగా సుమారు రెండు నెలల క్రితమే అందజేశారు .ఈ రోజే దాన్నిచదివి అందులోని అతి ముఖ్య విషయాలను మీకు అందిస్తున్నాను .

aranyaparvam 1 001 aranya2 001

ఈ సిద్ధాంత వ్యాసం లో శ్రీ పాండురంగా రావు గారు ముఖ్యంగా భారత అరణ్య పర్వాన్ని నన్నయ భట్టు పూర్తిగా రాశాడని ,అందులో క్రిమి కీటకాదులచేత ధ్వంస మైన భాగాలను మాత్రమే ఎర్రనార్యుడు పూరించాడని అనేక ఉపపత్తులు చూపి వివరించారు  .నన్నయ తన కర్త్రుత్వాన్ని ఉత్తమ పురుషలోకాకుండా ప్రధమ పురుషలోనే చెప్పాడని  ,తిక్కన కూడా విరాట పర్వ ప్రారంభం లో ఇలాగే చెప్పాడని కనుక నన్నయ్యే ఆది సభా అరణ్య పర్వాలు మూడూ రాశాడని అన్నారు .విరాట పర్వం మొదలు మిగిలిన 15పర్వాలను ‘’తుదముట్ట ‘’తాను రచింప బూని నట్లు తిక్కన చెప్పినదానిలో మొదటి మూడు పర్వాలతో ఆగి పోయిన అసమగ్ర భారతాన్ని ,మిగిలిన 15పర్వాలు రాసి సంపూర్ణం చేయటమే తిక్కన లక్ష్యం అన్నారు .నన్నయకు,తిక్కనకు 150ఏళ్ళ అంతరం ఉంది .అంతవరకూ అరణ్య పర్వం  జోలికి ఎవరూ పోక పోవటం  అది సంపూర్ణంగా లభించటమే నంటారు .మారన మార్కండేయ పురాణం లోను ,కొరవి గోపరాజు ‘’సింహాసన ద్వాత్రి౦సిక’’లోను ,అప్పకవి ‘’అప్పకవీయం ‘’లోను ,నన్నయ మొదటి మూడు పర్వాలు రాసినట్లు చెప్పారన్నారు .తిక్కన ,ఆ తరువాతి కవులు అరణ్యం అసంపూర్తి అని చెప్పనే లేదని గుర్తు  చేశారు .ఎర్రన అరణ్యాన్ని పూర్తి చేసినా తన పేరు చెప్పుకోక పోవటానికి కారణం అందులో 55% రచన నన్నయది అవటమే అంటారు .క్రిములు ధ్వంసం చేసిన భాగాలలో కొన్ని చోట్ల అక్షరాలూ కొన్ని చోట్ల పదాలు ,కొన్ని చోట్ల ఉపాఖ్యానాలు ఉండి ఉండవచ్చునని అభిప్రాయ పడ్డారు .’’రయ విచలత్తుర౦గ ‘’పద్యం సభా పర్వం లోను అరణ్య పర్వం లోకొద్ది మార్పు తో ఉంది .కనుక ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని పూర్తిగా రాశాడన వచ్చుఅన్న  .చాగంటి శేషయ్య ,దివాకర్ల వెంకటావధాని గార్లు అరణ్యం లో కొంత దోవ తప్పారన్నారు  .నన్నయ అరణ్య పర్వం సుమారు రెండు వందల ఏళ్ళు సురక్షితంగానే ఉంది .తర్వాత అక్కడక్కడ శిదిలమైతే ఎర్రన పూరించాడు .

భారతం అంటే సూర్య ,అగ్ని చంద్రుల చేత నడుప బడే సృష్టి కి సంబంధించినది  .భారతం 18పర్వాల బృహద్గ్రంధం .నన్నయ రాజా౦కితమ్ గా రచన చేస్తే ,తిక్కన హరిహరనాదునికి అంకితమిచ్చాడు .అంతకుముందు తిక్కన నిర్వాచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధి రాజుకు అంకితమిచ్చాడు .కనుక నరా౦కి తానికి తిక్కన విముఖుడుకాడు .నన్నయ అరణ్యాన్ని పూర్తిగా రాశాడు అంటే ఎర్రనను కించపరచటం కాని అతని సమర్ధతను శంకించటం కాని కాదు నన్నయతో సమానుడిని చేసి సన్మాని౦చటమే నంటారు  రావు గారు .నన్నయ రాసిన అరణ్య పర్వ ఏడు ఆశ్వాశాలు తిక్కన వరకు ఉన్నాయి అని ఘంటా పదంగా చెప్పారు .ఎర్రన కవిత్వం నన్నయ కవిత్వం అంత ప్రౌఢమే అన్నారు .

ఎర్రన రామాయణం ,రాయల మదాలస చరిత్ర కాలగర్భం లో కలిశాయి .అరణ్య రచనలో ఎర్రన తన పేరు చెప్పుకోక పోవటానికి తాను నన్నయ్య కంటే అసమర్ధుడు అని భావించి మాత్రం కాదు ,నన్నయ్య గారి యెడల వినయమే .ఎర్రన తాత యెర్ర సూరి మనవడిని’’ నృసింహ పురాణం’’లో  ‘’ప్రబంధ పరమేశ్వరుడు’’ అన్నాడు. దీనికి కారణం ఎర్రన అరణ్య పర్వ శేషోన్నయం వలననే అంటారు .ఇందులోనే ఆయన ప్రాభవశ్రీ గుబాళించింది .ఎర్రన రాసిన ఛందో గ్రంధం ‘’కవి సర్ప గారుడం ‘’కూడా లభించలేదు .’’ఎర్రన రచనలో మొదటిదే అరణ్య పర్వం ,అప్పటికి ఇంకను సంపూర్ణ ప్రత్యయ మేర్పడలేదు ‘’అన్న దివాకర్ల వారి మాట యదార్ధం కాదన్నారు రావూజీ .

అరణ్యం లో ఆశ్వాసాంత గద్యాలలో ఎర్రన పేరు రాసుకోలేదు .దీనికి కారణం ప్రతి ఆశ్వాసం లోనూ నన్నయ రాసినది కొంతైనా ఉండటమే .కనుక ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని నన్నయ పేరుమీదే పూర్తీ చేశాడు .పెద్దన్న నన్నయ రాసింది ఉ౦ది కనుకే ‘’తద్రచన య కా ‘’పూరించాడు అంటే నన్నయ లాగానే రాశాడని అర్ధం .వ్రాశాను అనలేదు పూరించాను అన్నాడు జాగ్రత్తగా .నన్నయ రాయకుండా వదిలేసిన భాగాన్ని తాను  వ్రాస్తున్నానని ఎర్రన ఎక్కడా చెప్పలేదు .అరణ్య పర్వం లోఉన్న  7 ఆశ్వాసాలలో మొత్తం పద్యాలు వచనాల సంఖ్య2890.అందులో నాలుగవ అస్శ్వాసం లోఉన్న 416పద్యాలలో  నన్నయ గారు 142రాస్తే ,ఎర్రన 274రాసినట్లు చెప్పబడుతున్నాయి .5,6,7 ఆశ్వాసాలలోని 1320పద్యాలు ఎర్రన రాశాడు .ఇంతకు  ముందు చెప్పినట్లు 4 ఆశ్వాసం లో ఎర్రనవి 274 .అంటే మొత్తం ఎర్రన రాసినవి 1594. మరి నన్నయ రాసినవి 1వ ఆశ్వాసం లో మొత్తం 400,2లో మొత్తం 355మూడవ ఆశ్వాసం లో మొత్తం 399, 4వ ఆశ్వాసం లో 142 రాశాడు .అంటే మొత్తం నన్నయవి 1296పద్య గద్యాలు అంటే ఆ పర్వం లో 44.8శాతం నన్నయవే .ఎర్రనవి 55.2శాతం పద్య గద్యాలు ఉన్నాయి .7ఆశ్వాసాలలో ఆశ్వాసాంత గద్యాలన్నీ నన్నయ పేరు మీదే ఉన్నాయి అని స్టాటిస్టిక్స్ తో శ్రీ పాండురంగా రావుగారు వివరం ఇచ్చారు .

ఆంద్ర మహా భాగవతం లో ఉన్న 8993పద్యాలలో పోతన్నగారు రాసినవి 7739పద్య గద్యాలు .అంటే 86.1శాతం .వెలిగందల నారయ ,గంగానార్యుడు ,ఏర్చూరి సి౦గనలు కలిసి  1254రాశారు అంటే 13.9శాతం .4స్కంధంవరకు ఆశ్వాసాంత గద్యాలు పోతన పేరు మీదే ఉన్నాయి .5లో రెండు స్కంధాలలో గంగానార్యునిపేర ,6వ స్కందాన్ని రాసింది ఏర్చూరి సింగన కనుక ఆశ్వాసాంత గద్యాలు  సింగన పేరు లోనే ఉన్నాయి .సప్తమ అష్టమ నవమ దశమ స్కందాలు పోతనే రాశాడు కనుక ఆయన పేరుమీదే ఉన్నాయి .ఏకాదశ ద్వాదశ స్కందాలను వెలిగందల నారాయ రాశాడు కనుక ఆశ్వాసాంత గద్యాలు నారయ పేరనే ఉన్నాయి .కనుక ద్వితీయ స్కంధం ఒక్కటే పోతన ,నారయ రాశారు .మిగిలినవన్నీ ఏక కర్తృత్వం లోనే ఉన్నాయి .పోతన ప్రధమ స్కంధం నుండి ద్వాదశ స్కంధంవరకూ పూర్తిగా తానే ఆంధ్రీకరించాడు  .కాని కొంతభాగం క్రిమి ధ్వస్తం కాగా గంగన, సింగన ,నారయలు మళ్ళీ రాశారు అని విశ్లేషించారు శ్రీ పాండు .11,12వ స్కందాలలో  లో పోతన రాసింది ఏదీ లభ్యంకాలేదు కనుకనే నారయ తనపేరు రాసుకొన్నాడు .అలాగే గంగానా సి౦గనా చేశారు .

భాస్కర రామాయణం లోని 6కాండలలో 3వ కాండ మాత్రమే హుళక్కి భాస్కరుడు రాశాడు .1,4,5లను మల్లికార్జున భట్టు ,2ను కుమార రుద్రా దేవుడు ,6ను అయ్యలార్యుడు రాశారు. అంటే , భాస్కరుడు మొత్తం 6కాండలు రాశాడు కాని 3వది తప్ప మిగిలినవి క్రిమి కీటకాలు భోంచేసి మిగల్చలేదు .అందుకని మిగిలిన వారు రాశారు.  బహు కర్తృత్వం ఉన్నా భాస్కర రామాయణం అనే పేరు నిలిచింది .అని పరిశీలించి చెప్పారు కోదూరువారు

నన్నయ ప్రతిపర్వ ఆశ్వాసాంత గద్యాలలో అందులోని ప్రధాన కదాంశాలను చెప్పాడు. తిక్కన ,ఎర్రన తమ రచనలలో ఎక్కడా ఇలా చెప్పలేదు సాధారణంగా కవి తనకిష్టమైన పద్యాన్ని తనకావ్యం లో మరో చోటకూడా కొద్దిమార్పుతో చెప్పటం ఉంది. నన్నయ కూడా చేశాడు .విశ్వనాధ కూడా ‘’గిరికుమారుని ప్రేమ గీతాలలో ‘’చేశాడు .-కర్త్రుపద ప్రధమకు షష్టిచేసి చెప్పటం –అంటే ‘’నా నేర్చు ‘’వంటి పదాలు నన్నయకు అలవాటు .ఎర్రన రాసిన హరివంశాదుల్లో ఇలా చేయలేదు .

ఏతావాతా శ్రీ కోడూరు పాండురంగా రావుగారు నన్నయ భట్టే అరణ్య పర్వ 7ఆశ్వాశాలు పూర్తిగా రాశాడు .కాలగర్భం లో అందులోని ఉత్తరభాగంలో కొంత కొంత  క్రిమికీటకాలు తినేయటం వలన వాటిని ఎర్రాప్రగడ పూరించాడు . తిక్కన విరాట పర్వం నుండి 15పర్వాలు రాశాడు .దీనితో సమగ్ర మహా భారతం 18పర్వాలు సంపూర్ణమై కవిత్రయ విరచితమై లోకం లో ప్రసిద్ధి చెందింది అని విస్పష్టంగా తేల్చి చెప్పారు .

ఈ సిద్ధాంతవ్యాసం ‘’ఆదికవి-అరణ్య పర్వం ‘’ ఏ యూని వర్సిటీ లోనో ఉండేవాళ్ళు చేయాల్సిన పని .సాహిత్యంపై అభిమానం, అభిరుచి ఉన్న శ్రీ కోడూరు పాండురంగారావు గారు  ఎనిమిది పదుల వయసులో శ్రమించి విషయ సేకరణ చేసి ,పూర్వాపరాలను పరిశీలించి పరి శోధించి తన మేధస్సుకు, ‘’తానేర్చిన ‘’విద్యకు సార్ధకత కలిపించి ఆంద్ర సాహిత్యలోకానికి ఒక కొత్త ‘’వెలుగు శ్రీ’’ ని ప్రసాదించారు .రాసిన వారు, చదివిన మనం ధన్యులమవటం ఖాయం .

పుస్తకం కవర్ పేజీలు  జత చేషాను చూడండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-3-16-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | 1 Comment

నాద యోగం -9

నాద యోగం -9

నాద యోగం –సంత్ కబీర్

సంత్ కబీర్ తన పదాలలో ఒకదానిలో నాద యోగాన్ని గురించి ‘’ఎవరు అక్కడ ఆకాశం మధ్యలో నుండి వేణుగానం చేసేదెవరు ?గంగా యమునా కలయిక స్థానం లో ,గంగా యమునా సరస్వతీ సంగమ స్థానమైన త్రివేణీ సంగమ ప్రాంతాన త్రికూటి లో బాసురీ వాదన చేసేదెవరు ?ఉత్తరాభిముఖంగా సమ్మోహన వేణునాదం వినిపిస్తోంది .గోపిక ఆ నాదాన్ని వింటోంది .సర్వ సృష్టీ ఆ నాద సుధారసం లో తడిసి ముద్దయిపోతోంది .మంత్రం ముగ్ధమై పోతోంది ‘’అన్నాడు .నాదయోగం లో చివరగా వినిపించేది వేణునాదం కంటే ఉత్కృష్టమైన నాదం .ఉన్నతోన్నత స్థాయిలో   వేణు ,వీణా , మబ్బు ,పిడుగు ,కరతాళధ్వని కాని , ఏ వాయిద్య ధ్వనీ  కాని ,ఇత్తడి వస్తువుల శబ్దం కాని వినిపించదు..అది ప్రాచ్య ,పాశ్చాత్య దేశాల సంప్రదాయ సంగీతమూ కాదు .ఆ పరమోన్నత స్థరంలో వినిపించేది ‘’అనాహద నాదం ‘’మాత్రమే .

అనాహద ,అనాహత నాదం

అనాహద నాదం అంటే ఏమిటి ?ఈ నాటివరకు అదేమిటో చెప్పగలిగినవారు ఎవ్వరూ లేరు .కొందరు దాన్ని విశ్వా౦తరాళ నాదమైన ప్రణవనాదం   ఓంకారం అన్నారు .కాదు కాదు ,అది తుమ్మెదలు చేసే నిరంతర  ఝంకార నాదాన్ని తలపించే  భ్రామరీ నాదం అన్నారు మరికొందరు .ఇంకొందరు అదే ఖట్ ఖట్ మని నినదించే  హృదయ స్పందనం అనాహద నాదం అన్నారు .

ఈ అనాహద నాదాన్నే కొందరు అనాహత నాదమన్నారు .రెండిటిలో అర్ధ భేదం ఉంది .అన్ +,ఆహతం =అనాహతం .అన్ అంటే కాదు అని అర్ధం. ఆహతం అంటే కొట్టటం ,సుత్తితో మోదటం ,దెబ్బ కొట్టటం అని అర్ధం .మొత్తం మీద దెబ్బ కొట్టటం వలన ఘర్షణ వలన వచ్చే శబ్దం కాదు అని అర్ధం .కనుక అనాహతం అంటే వస్తువుల పరస్పర ఘర్షణ వలన జనించే శబ్దం కాదని అర్ధం .ఎక్కడ శబ్దం ఉత్పత్తి అవాలన్నా రెండు వస్తువుల మధ్య పరస్పర రాపిడి లేక ఘర్షణ ఉండాలని మనకు తెలుసు .ఇదే ‘’ఆహత నాదం’’.అనాహతం అంటే రెండు వస్తువుల మధ్య పరస్పర ఘర్షణ వలన జనించిన శబ్దం కాదని స్పష్టమౌతోంది .అనాహతం సహజంగా(స్పాంటేనియస్ ) ,యాదృచ్చికంగా స్వయం చాలితమైన (ఆటోమేటిక్ )నాదం .కొందరు అనాహద నాదమని ఎందుకన్నారు ?అన్+హదం=అనాహదం.అన్అంటే కాదు అని అర్ధం .హదం అంటే సరిహద్దు (బౌండరి ).ఈ రెండూ కలిస్తే సరిహద్దులు లేని నాదమే అనాహద నాదం అని అర్ధమొస్తుంది .అంతులేని, హద్దు లేని ఏ నాదమైనా  అనాహద నాదమే అవుతుంది .

నాద యోగం –మహర్షి గోరఖ్ నాద్

మచ్చేంద్ర ముని నాధుని మహా శిష్యులైన మహర్షి గోరఖ్ నాద్ ఆధ్యాత్మికతలో గురువును మించిన శిష్యులై విపరీతప్రచారం పొందారు .ఆయన ‘’సాదువులారా !’’సో –హం ‘’ను నిరంతరం జపించండి ఈ జపాన్ని మనసుతో చేయకండి .దానిని మీ అంతశ్చేతన తో చేయండి..అలా చేస్తే మీరు మీ దైనందిన జీవితం లో అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికీ మీ శ్వాస 24గంటల రోజులో నిమిషానికి 15నుంచి 19సార్లు ఉండేట్లు అంటే రోజుకు 21,600 సార్లు ఉండేట్లు జాగృతమవండి .అంటే మీ శ్వాస గంటకు 900సార్లు లేక ఆ పైన ఉండేట్లు చూసుకోండి . అప్పుడు అనాహద నాదం ఉద్భవించి(ఎమర్జ్ ) వ్యక్తమౌతుంది (మానిఫెస్ట్ ).వెన్నెముకలో కాంతి జ్యోతకమవుతుంది .సూర్య నాడి మేల్కొంటుంది .అప్పుడు వర్ణనాతీతమైన కంపించే నాదం మీ శరీరం లోని ప్రతి సూక్ష్మ  రంధ్రం నుండి ఓం లేక సోహం లాంటి నాదం వినే అనుభూతికలుగుతుంది ‘’అని మహర్షి గోరఖ్ నాద్ నాద యోగాన్ని గురించి తన పుస్తకాలలో వర్ణించారు .

అంతిమ నాదం

ఉన్నత స్థాయి చేతనలో వ్యక్తమయ్యే నాదాన్ని గురించి మాటలలో వర్ణించి చెప్పలేము .అ నాదం ఆనంద మయ కోశం ఆవలి నుండి వస్తుంది. వ్యక్తిగత చేతన పూర్తిగా కరిగిపోయే నాదం లోని  అత్యున్నత బిందువు నాద యోగికి అనుభవమౌతుంది .సాధకుడు నాదం లో తన ఉన్నత చేతనను గుర్తిస్తాడు .అప్పుడు ఈ విశాల విశ్వం అంతా ఆ నాదమే అని గ్రహిస్తాడు .

భారతదేశం లో నాద యోగం

భారత దేశం లో నాద యోగం లో అనేక శాఖలున్నాయి .వీటిలో  –మహర్షి మేహిదాస్ శాఖ ,రాదాస్వామి శాఖ ,సంత్ కబీర్ పంధా చాలా ముఖ్యమైనవి .నాద యోగాభ్యాసం మంత్రం ,క్రియా యోగాలతో ప్రారంభమవుతుంది .సాధన ఆచరణలో సిద్ధాంతం లో యెంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది .అంటే అసంపూర్ణంగానే ఉంటుందన్నమాట .హఠ యోగం ధ్యాన యోగం ,రాజ యోగాలు సంపూర్ణంగా  చెప్పబడి నిర్దుష్టంగా సూక్ష్మ విషయాలను కూడా తెలియ జేస్తూ  రాయబడ్డాయి . కాని నాద యోగం అలా చేయబడలేదు .కనుక ఇంకా అసంపూర్ణమే అనాలి .ముస్లిం లలో ఒక తెగ వారు కూడా నాద యోగాన్ని సాధన చేస్తారు .నాగస్వరం తో పాములను అడి౦చే వారందరూ ఇండియాలో గొప్ప నాద యోగులుగానే పరిగణింప బడుతున్నారు .నాదయోగ శాఖలలో అదీ ఒక శాఖ గా గుర్తింపు పొందింది .

‘’ నాద యోగం’’ సంపూర్ణం

నాద యోగం రచనకు – నాద యోగం పై స్వామి సత్యానంద్ చేసిన ప్రసంగాలను ఆధారంగా ‘’మా యోగ శక్తి ‘’ రచించిన ‘’నాద యోగ ‘’అనే ఆంగ్ల గ్రంధం .

మా యోగ శక్తి గారు పరమహంస సత్యానంద గారి ముఖ్య శిష్యురాలు .12-4-1927 న జన్మించి 23-5-1961లో 37ఏళ్ళ కే సిద్ధిపొందారు .ఆమె అ౦తర్జాతీయ యోగాఫెలోషిప్  ఉద్యమం ,బీహార్ ,మధ్యప్రదేశ్ ,బాంబే స్కూల్స్ ఆఫ్ యోగా ,శివానంద పబ్లిక్ స్కూల్ ,మొదలైన వాటిలో పాల్గొన్నారు .యోగా వీక్లీ గెట్ టుగెదర్ ,సొసైటీ లను అంగోలా ,ముజఫర్ పూర్ లలో  స్థాపించారు .బీహార్ లోని  మాన్ఘీర్ లో .9నెలలపాటు ‘’యోగా టీచర్స్ ట్రెయినింగ్ కోర్స్ ‘’నిర్వహించి తన దార్శనిక ప్రతిభను నిరూపించారు .ఆధునిక మానవ మనసులపై యోగా  అద్భుత ప్రభావం చూపించటానికి ఈ శిక్షణ బాగా ఉపయోగపడింది .గొప్ప విద్యావంతురాలైన’’ మా యోగ శక్తి’’ బీహార్ లోని చాప్రాలో ఉన్న జై ప్రకాష్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా సేవలందించారు .ఆమె అంతర్జాతీయ ప్రఖ్యాత మహిళామణి..ఆమె గొప్ప ఆచరణాత్మక మనస్తత్వశాస్త్ర. వేత్త .మహా యోగిని .అత్యున్నత ఆధ్యాత్మిక మహాత్మురాలు .యోగా పైనా అప్లైడ్ సైన్స్ పైనా ఇంగ్లీష్, హిందీలలోచాలా పుస్తకాలు రచించారు

Inline image 1 Inline image 2

సంత్ కబీర్                                                      స్వామి శివానంద

Inline image 3Inline image 4

స్వామి సత్యానంద                                                          మా యోగ శక్తి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-3-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -8

నాద యోగం -8

భాగవతం లో నాద యోగం

భాగవత మహా పురాణం లో నాద యోగం గురించి అనేక ఉదాహరణలున్నాయి .అందులో శ్రీకృష్ణ భగవానుని లీలలలో  పరమార్ధాలు ,అన్యార్ధ విశేషాలు వర్ణింప బడినాయి .కృష్ణ కధలో ‘’కృష్ణ భగవానుడు తన అంతః పురాన్ని  వదిలి అరణ్యం లోకి వెళ్ళాడు .అది శీతాకాలపు మొదటి పండు వెన్నెల పౌర్ణమి నాటి అర్ధ రాత్రి .శ్రీకృష్ణుడు వేణుగానం మహాద్భుతంగా చేస్తున్నాడు .ఆ అనంత నీరవనిశీధిలో వేణు నాద తరంగాలు అన్ని వైపులకూ వ్యాపించి జగన్మొహనం కలిగిస్తున్నాయి .చీకటి కారడవి నుండి వస్తున్న ఆ నాదం వ్రేపల్లెలోని గోపికల చెవులకు వినిపించింది .అంతే ఇళ్ళల్లో ఉన్న గోపికలు ఇళ్ళను ,భర్త ,పిల్లల్ని వదిలేసి క్షణాలమీద వేణుగాన లోలుని చెంతకు పరుగు పరుగున వచ్చేశారు .ఎక్కడినుండి వేణునాదం వినిపిస్తోందో,ఎలా అక్కడికి చేరుకోవాలో దారీ తెన్నూ ఏమిటో  వారికేమీ తెలియదు .కాని రావాల్సిన చోటుకే చేరుకొన్నారు ,అదీ ఆ నాద సమ్మోహన ప్రభావం . .వచ్చి వేణుగాన లోలుని చుట్టూ చేరి నాట్యం చేయటం ప్రారంభించారు .అలా కొంత సేపు చేసిన తర్వాత వారిలో ప్రతి ఒక్కరికీ శ్రీకృష్ణుడు తన తోనే ప్రత్యేకంగా  నాట్యం చేస్తున్న మధుర భావన కలిగింది .దీనినే రాస లీల అన్నారు .

ఈ కధ అద్భుతమైనది .కాని దీన్ని ప్రపంచం సరిగ్గా అర్ధం చేసుకోలేదు .దీన్ని పూర్తిగా అర్ధం చేసుకొన్నవారు మహాత్ములైన యోగీశ్వరులు .నాదయోగులకు శ్రీ కృష్ణుడే ఉన్నత స్తరం లో ఉన్న చేతన..ఆయన నుండే అత్యుత్తమ సూక్ష్మ నాదం తమ నాద సాధనలో ఉద్భవిస్తుందని విశ్వ సిస్తారు .వేణునాదావిర్భావ ప్రదేశం వారిని సమ్మోహితుల్ని చేసి ప్రతి వ్యక్తిత్వ చేతననూ మరచి పోయి ఆ నాద పారవశ్యం లో ఆనందాను భూతి పొందుతారు .అప్పుడు వారి ఇంద్రియాలు వ్యక్తిగత ఆనందం ,అవగాహన కేంద్రాలనుండి ఉపసంహరించుకొంటాయి .  అవన్నీ వెనక్కి తగ్గి ,వేణు నాదం ఆవిర్భవించిన చోటుకు చేరారు .ఈ స్థితిలో అనుభవ జ్ఞానాలు పూర్తిగా బాహ్య విషయాలతో తమ కున్న  బంధనాలను విచ్చేదనం చేసుకొ౦టాయి అని గ్రహించాలి .మరొక రకంగా యోగి భాష లో చెప్పాలంటే ‘’ధారణ జరిగింది .ధ్యానం ఉదయించాలి ‘’.

సంస్కృతం లో కృష్ణ శబ్దానికి గొప్ప అర్ధం ఉంది .కృష్ణ అంటే  వెనక్కి తగ్గటం లేక ఆకర్షించటం అనే రెండు అర్ధాలున్నాయి .ఈ శబ్దం ‘’కర్షన్ ‘’అనే దాతువునుండి ఆవిర్భవించింది .కనుక కృష్ణ అంటే లాగేవాడు  ఆకర్షించేవాడు ,వెనక్కి లాగేవాడూ అనే అర్ధాలున్నాయి .వ్యవసాయదారుడు ,అనీఅర్ధం ఉంది .గోపి అంటే సంస్కృతం లో గోవు లేక ఆవు అని అర్ధం .సంస్కృతం లో’’ గో ‘’అంటే ,ఇంద్రియానుభావాలు ,ఆవు ,బీద ,అణకువగా ఉండటం , పూర్తిగా ఉన్న సకల విశ్వం అని అర్ధాలున్నాయి .కనుక గోపి అంటే ఇంద్రియ అనుభవాలు అని లోపలి అర్ధం బాహ్యార్ధం గోవులను కాసేవారి పిల్ల .ప్రతీకాత్మికంగా గోపి అంటే ఇంద్రియానుభవాలు .మరి ఈ గోపికల భర్తలు ఎవరు ?కళ్ళకు రూపం భర్త .,చెవులకు శబ్దం భర్త .వినబడాల్సిన అత్యుత్తమ సూక్ష్మ నాదం వినిపించగానే ఇంద్రియానుభవాలు ,బాహ్య౦గా వినిపించే శబ్దాల నుండి విడిపోయి ,అంతర్ నాదం తో ఐక్యమౌతాయి  .ఈ విధానాన్ని ‘’ప్రత్యాహారం ‘’అంటారు .

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-3-16-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్వచ్చ స్వచ్చ

This gallery contains 16 photos.

More Galleries | Tagged | Leave a comment

28-3-16సోమవారం మధ్యాహ్నం మా ఇంట్లో శ్రీమతి చెరుకుపల్లి శారదక్కయ్య ,వాళ్ళబ్బాయి లక్ష్మణ ,అమ్మాయి ఛి సౌ ఉష 

28-3-16సోమవారం మధ్యాహ్నం మా ఇంట్లో శ్రీమతి చెరుకుపల్లి శారదక్కయ్య ,వాళ్ళబ్బాయి లక్ష్మణ ,అమ్మాయి ఛి సౌ ఉష

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

నాద యోగం -7

నాద యోగం -7

చేతనయొక్క వివిధ కోశాలలో నాదం

ఇలా వినిపించిన ధ్వనులన్నీ యదార్ధమైనవే .అవి మనసు లోని విషయాల,చేతనల యొక్క అభిజ్ఞలు లేక చిహ్నాలు .మనసు  ఈ చిహ్నాలపై  నిలిచి ఉండి ,వేగంగా వాటి సాయం తో సాగుతుంది .ఈ ధ్వనులు చేతన యొక్క లోపలి కోశాలైన  అన్నమయ ,ప్రాణమయ ,మనోమయ కోశాల అనుభవాలు .ఈశాబ్దాలు ఊహించినవి కానే కావు .వాటిని వ్యక్తీ యొక్కవివిధ స్థాయిలలోని  అస్తిత్వపు కంపనాలుగా అర్ధం చేసుకోవాలి .ఇవే భౌతిక ,ప్రాణిక ,మానసిక ,అతిమానసిక ,ఆనంద లేక ఆత్మీయ అనే 5స్థితులు .ఈ విభిన్న స్థితులలో నాదం భిన్న భిన్న రూపాలలోఉండి వినిపిస్తుంది .మొదటగా భౌతిక శబ్దం వినిపిస్తుంది .కాని చేతన అత్యుత్తమంగా మితిమీరితే అప్పుడు ప్రాణ కోశం లోని సూక్ష్మనాదాలతో అనుసందానమవుతుంది .

మానవ చేతన పరిదిలేక శ్రేణిని  మొత్తం మూడు లేక ఇంకా సూక్ష్మంగా ఐదుభాగాలుగా విభజించారు .చేతన అనేది అన్నమయ ,ప్రాణమయ కోశాల చేత యేర్పరచ బడింది .ఈ రెండు శరీరాలు ఆహారం ,ప్రాణం ల చేత ఏర్పడినాయి .రెండవ స్థాయిలో వ్యక్తిత్వం అనేది మనోమయ ,విజ్ఞాన మయ కోశాల చేత నిర్మించ బడుతుంది .ఇందులో మానసిక ,జ్యోతిష(యాస్ట్రల్ ) విషయాలు ఉంటాయి .చేతన యొక్క మూడవ పరిమాణం  ఆనందమయ ,కోశం చేత నిర్మింపబడి ఆనందానికి పరమావధిగా ఉంటుంది .

నాద యోగ సాధనలో నాదం యొక్క అభివ్యక్తి (మాని ఫెస్టేషన్)మనసు మిగిలిన మానసిక స్థితుల సంబంధం తో స్థాపించ బడుతుంది .ఉదాహరణకు మనసు లేక చేతన భౌతిక శరీరం లోనే ఉండిపోతే ,అప్పుడు చెవులు మూసుకొన్నా ,హృదయ  ,ఊపిరి తిత్తుల  ,మెదడు ,రక్త ప్రసరణ ,జీవన క్రియల (మెట బాలిజం ).జీవన చర్యలకు శక్తి విడుదల చేసే విధానాలు(కెట బాలిజం ) మొదలైన శరీరం లోపల జరిగేవన్నీ వినిపిస్తాయి .

చేతన ప్రాణమయ కోశం లోపూర్తిగా దూరి  ఉన్నప్పుడు ,వేణునాదం తో కలిసి అనేక ధ్వనులు వినిపిస్తాయి .మనసు ఆనంద మయ కోశం లో విహరిస్తుంటే మిగిలిన శబ్దాలు అన్నీ అంతరించిపోయి దాని స్థానం లో  నాద యోగ ప్రభావం మాత్రమే మిగిలి ఉంటుంది . ఏ ప్రత్యెక నాదం ఏ ప్రత్యెక స్థాయికి చెందిందో చెప్పటం  కష్టం .భారత దేశం లో వీటి దృష్టాంతాలను ప్రతీకాత్మక కధలతో చెప్పారు .ఎత్తులకు ఎగసే మరియు పారమార్ధిక నాదాన్ని అన్వేషించే  వ్యక్తిగత చేతనా స్వరాన్ని నారద మహర్షి ఉదాహరణలతో  విస్తృతంగా పురాణాలలో  వివరించాడు .మహర్షి నారదుడు రాహస్యంగా బోధించిన దాన్నిసందేహ పడకుండా  అర్ధం చేసుకోవాలి .నారదుని చేతిలో మహతి అనే వీణ ఉంటుంది .నాద యోగం లో వీణానాదం అత్యుత్తమ శ్రేణికి చెందినది .నాద యోగుల వివిధ శాఖలలో వీణానాదం ,వేణు నాదం లను చేతనలో ద్వైత భావ౦ అంతమొందించే వాటికి చెందినవిగా భావిస్తారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-28-3-16-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద యోగం -6

నాద యోగం -6

నాద సాధనకు సిద్ధమవటం

నాద సాధన చేసే సాధకుడు ముందు గా మూల బంధం, వజ్రోలి ,యోగ ముద్ర లను అభ్యాసం చేయాలి .ఈ మూడూ చాలా ముఖ్యమైనవి .వీటిని వేయటం బాగా వస్తే తర్వాత కుంభక౦  ను అభ్యసించి తన చేతనను బిందువు పై కేంద్రీకరించాలి .తరువాత భ్రామరి చేయచ్చు.భ్రామరి చేసే టప్పుడు చెవులు మూసుకొని ,కళ్ళను వ్రేళ్ళతో నొక్కి పట్టుకోవాలి .పై దంతాలను కింది దంతాలను దూరం చేసి వదులుగా ఉంచాలి .అప్పుడు అసలైన నాద యోగం  ప్రవహింప చేయాలి .

నాద అభి వ్యక్తీకరణకు ఆచరణ విధానం

ఒక దిండు మీద కూచోవాలి .అరికాళ్ళు,  నేలకు తగిలేట్లు మోచేతులు మోకాళ్ళు తొడ నరాలపై  ఆన్చి కూచో వాలి .ఎత్తు తక్కువ దిండు సుఖంగా ఉంటుంది .కొంతమందికి ఎక్కువ ఎత్తు దిండు బాగుండచ్చు .ఇక్కడ గ్రహించాల్సిన అతి ముఖ్య విషయం ఒకటి ఉంది .వెన్నుపాముకు అడుగున ఉండే త్రిభుజాకార ఎముక (కాకీక్స్ ),మరియు మూలాధారం అంటే ఉపస్తే౦ద్రియానికి గుద ద్వారానికి మధ్య ఉన్న ప్రదేశం లతో దిండును మూలాధార బిందువు వద్ద గట్టిగా  నొక్కాలి  .అందుకని ఉపయోగించే దిండు గుండ్రగా గట్టిగా ఉండాలి .గుదం సంకోచించకుండా ,మూలాధార చక్రాన్ని ఎత్తైన గట్టి దిండు పై కూర్చుని నొక్కాలి .

నాదం అభి వ్యక్తమవటానికి ప్రాణాయామం లో 1-ఉజ్జైయిని 2-సూర్య భేదన 3-భస్త్రిక 4-శీతలి 5-శీత్కారి 6-భ్రామరి 7-ప్లవిని 8-మూర్చ అనే  ఆచరణ విధానాలున్నాయి .అందులో  ‘’మూర్చ ‘’. ప్రాణాయామాన్నిచేసి ,యోని ముద్ర ,మూల బంధనం ,వజ్రోలి లను కొన్ని నిముషాలు చేసి తర్వాతనే నాద యోగాన్నిఇప్పుడు చెప్ప బోయే విధానం లో  ప్రారంభించాలి .  రెండు చెవులు మూసి ,చేతనను బిందువు దగ్గరకు చేర్చి ,అప్పుడు ఏదైనా నాదం వినిపిస్తోందేమోనని  జాగృత మవ్వాలి .అప్పుడు మబ్బు తెరలు వెడుతున్నట్లు ,నీటిజాలు ప్రవహిస్తున్నట్లు ,సము ద్రం గర్జిస్తున్నట్లు ,,ఘంట శబ్దం విన్నట్లు అనిపిస్తుంది .ఒక్కోసారి వేణునాదం ,గిటార్ లయ ,లేకసాయంకాలం సూర్యాస్తమయం లో చీకటి పడే వేళ ఉండే  భయంకర పక్షుల కిచకిచ  లాగా కూడా ఉండచ్చు . లేక నక్షత్రాలతో ఉన్న రాత్రి ,ఏ శబ్దమూ వినిపించ నట్లు అనుభూతికలగా వచ్చు .అది సుదూర సముద్ర ఘోష కాని ,పిడుగు శబ్దం గా కాను అనుభవం కలగనూ వచ్చు .ఈ అంతర్ నాదాలను సాధకుడు కనుక్కో వచ్చు .

బిందువులో శబ్దాన్ని కను గొనడం కష్టం .మనసును సహస్రారం లో కాని ,ఆజ్ఞా చక్రం లోకాని ,లేక మెదడు కేంద్రం లో కాని లేకపోతె కుడి ఎడమ కర్ణ భేరి లలో కాని సంచారం చేయించాలి .లేక పొతే’’ చిదా కాశం’’ లో లేక భ్రూ మధ్యమం లోకాని ఆ నాదం వినబడే దాకా మనసును కేంద్రీకరించాలి .నాదాన్ని గుర్తి౦ఛి కనుక్కోవటం చాలా తేలికే .శబ్దాన్ని ఊహించటానికి బదులుగా ,మనసును ఒకే దృష్టి తో కేంద్రీకరిస్తే ,అప్పుడు మొదటినాదం వినిపించాక దాన్ని చివరిదాకా వెంటాడాలి .శబ్దానికి  చెందినఒక అంతర్నాదాన్ని ఇంకా ఎక్కువ స్పష్టంగా ,ప్రాముఖ్యంగా ఉండే వరకు  అనుసరించాలి .అది నిజంగానే స్పష్టంగా ,ప్రాముఖ్యమైనదిగా ఉన్నప్పుడు  మరొక నాదం వేరొక స్వరం తో నేపధ్యం లో వినిపిస్తుంది .

రెండవ శబ్దం వినిపించాక మొదటిదాన్ని వదిలేసి రెండవ దాన్ని అనుసరించాలి .ఉదాహరణకు చెవులు మూసుకొని ,సాయంకాల పక్షుల కిలకిలారావాలను వినాలి .దీనిని వింటూనే ఉండాలి .అది పూర్తిగా స్పష్టంగా విభిన్నంగా ఉంటె ,మరొక  నైటింగేల్  (కోకిల)అభి వ్యక్త  నాదాన్ని కనుక్కోవాలి .ఇప్పుడు చేతనను పెంచుకోవాలి .నేపధ్యం నుండి పక్షుల కిలకిలా రావాన్ని విసర్జించాలి .ఇప్పుడు నైటింగేల్ స్వరాన్ని మరింత స్పష్టంగా స్పష్టంగా వినాలి .అది పూర్తిగా విభిన్నంగా స్పష్టంగా  చేతనకు అనిపిస్తే  ,మరొక శబ్దం నేపధ్యంగా వినిపిస్తుంది. తరువాత వినిపించే ధ్వని’’ చిన్ చిన్ చిన్’’ అని వినిపించే క్రికెట్ పక్షి శబ్దంగా ఉంటుంది .ఇదికూడా స్పస్ట౦ గా ఉంటె ,ముందు దాన్ని వదిలేయాలి .నైటింగేల్ స్వరాన్నీ విసర్జించి కొత్తదాన్ని అందుకోవాలి .అది కూడా కొంతకాలానికి స్పష్టంగానే ఉంటుంది .దీన్ని వదిలేసి నాలుగోదాని వెంట పడాలి .ఇలాశబ్ద  విసర్జన చేసుకొంటూ  చేతన పూర్తిగా కోల్పోయేదాకా ,లేక చేతన పూర్తిగా మనసులోని విషయాలను ఖాళీ చేసేదాకా  వెళ్ళాలి .

 

Inline image 1Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-3-16-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment