‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -1

‘’మత్స్వప్నః’’ (నా కల )-బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు -1

1-‘’శ్రీ మాతా శ్రీ మహా రాజ్ఞీస్శ్రీమస్సి౦హాసనేశ్వరీ –స్వధ్యాసీనా దేహలీ-

-స్వప్నే దృష్టా ద్రుస్టతః కల్పవల్లీ –శిల్పానల్పా కల్ప బా భాసమానా ‘’

తాత్పర్యం –మంగళకరమైన తల్లి ,సహస్ర నామాది భూతమైన శ్రీ మాత్రు మంత్రానికి అధిదేవత ,సంపత్కారిణి ,శ్రీ విద్యా స్వరూపిణీ ,శ్రీ విద్యలో సర్వాధిస్టాత కామేశ్వర స్వామి పట్టపు దేవి అయిన ముత్తైదువు,పూజనీయ ,మా ఇంటి గడప మధ్య భాగం లో కూర్చుని ,కల్పలతలచే సృస్టింపబడిన అంతులేని శిల్ప ప్రావీణ్యం గల సర్వ ఆభరణాలచేత ప్రకాశించే నా తల్లి నా అదృష్ట వశాత్తు నాకు స్వప్నం లో కనిపించింది .

2-‘’సౌమంగల్య శ్రీ నిదానాంగ యస్టిం-తామీక్షిత్వా భూవ మస్మిస్మితాస్య

హేతుం ప్రుస్టోహంత యానైవ కించి –త్స్వాభావ్యా దేవేత్య వోచం వినీతః ‘’

తా –సౌందర్య సంపాదకు నివాసమైన యష్టివంటి శరీరం కల ఆతల్లిని చూసి నేను చిన్నగా నవ్వాను .ఎందుకు నవ్వావు అని ఆమె అడగగా ,ఆ ఏమీ లేదు స్వాభావికంగానే నవ్వా అని వినయం తో చెప్పా .

3-‘’భావోనోదీయుర్నిమిత్తం వినాక్వా-ప్యా చక్ష్వత్వం కిన్నిమిత్తం స్మితంతే

ఇత్థం ప్రుచ్చం త్యాంజనాన్యా మవోచ –మానేతవ్యో వ్యాస మౌన్యత్ర చేతి ‘’

తా-‘’నవ్వు ఊరికే రాదు .నీనవ్వుకు కారణం ఏమిటి ‘’?’’కారణం చెప్పాలంటే వేద వ్యాసమహర్షి ఇక్కడికి పిలి పించాల్సి ఉంటు౦దితల్లీ ‘’అన్నాను

4-‘’కిం కార్యం తే నాత్ర రేత్వం వదేతి –నిర్భార్త్యోక్తః ప్రాంజలి ప్రహ్వ భాస

సంతోషేణా స్యాంచ భక్తీ ప్రపత్యా –నామం నామం మాతరం వాచా మూచే ‘’

తా-‘’ఆయనతో నీకేం పని ?నవ్వుకు కారణం చెప్పు ‘’అని మాత గద్దించింది .అది సంతోష కారణమై భక్తితో మాటిమాటికీ నమస్కరిస్తూ నేను చెప్పటం మొదలు పెట్టాను .

5-‘’ప్రుచ్వా మిత్వా మాంబ సందేహ మేతం –న ప్రస్టవ్యం బాల భావాద వోచం

అస్మాన్సూత్వా సాధ్వి దేవం కిమూఢా –వోఢవేశానం మాతరస్మా న్ప్రసూతా ‘’

తా-అమ్మా !ఒకసందేహం వచ్చి నిన్ను అడుగుతున్నాను .న్యాయంగా అడగ కూడదనుకో .కుర్రచేస్టతో అడుగుతున్నా .పతివ్రతా తిలకమా !మమ్మల్ని అందర్నీ కన్న తర్వాత శివుడిని పెళ్లి చేసుకోన్నావా ?లేక కామేశ్వరుని పెళ్ళాడి మమ్మల్ని కన్నావా ?’’

6-‘’ప్రశ్న స్యాస్యా త్రాస్తియద్వానిమిత్తం –మాతర్జానే నైవ కించి ద్విమూఢః

ఆహూ యావాభ్యాంమహర్షి స్సుమేదా –వేదం వ్యాసో విష్ణు రేవా నుయోజ్యః ‘’

తా-ఈ కొంటె ప్రశ్న కు  కారణం ఏమిటి అని అడిగితె నాకేం తెలీదమ్మో-మనిద్దరికీ ఈ సందేహ నివృత్తి చేయగలాడు వ్యాసుడే .నన్నే పిలిచి అడగమంటే ఏను కుర్రాడిని .అంతటి మహర్షిని అడిగే దమ్ము,అధికారం  లేనివాడిని .నువ్వే పిలిచి అడగమనే రాజసమూ లేని వాడిని .క్షమించు .

7-మంత్రాద్రస్టాసౌ  పురాణేతి హాసాన్ –లక్షైర్లక్శైః శ్లోక జాలైః ప్రణీయ

కృత్వా కార్షీద్విశ్వ విశ్వోపకారం –త్వత్పాఠార్ధం నాలమాయు ర్జనానాం’’

తా-మంత్రం ద్రష్ట అంటే మంత్రాలను చూసినవాడు అలాంటి వ్యాస భగవానుడు పురాణ ఇతిహాసాలలో లక్షలకొద్దీ శ్లోకాలు రాసి లోకాలకు మేలు చేశాడు .అవన్నీ చదవాలంటే మనిషి ఆయుర్దాయం చాలదు .ఇక విమర్శించటానికి సమయమెక్కడిది తల్లీ !

8-కిన్చిత్కించి౦ చిత్తత్ర తత్తత్పఠిత్వా-సందేహాబ్దౌ మానవౌ ఘోనిమఘ్నః

ఆర్ష గ్రందేషూత్తరం ప్రశ్న దేశే –సంబద్ధంస్యాదిత్య నూచాన వాదః ‘’

తా- ఆ పురాణ  ఇతిహాసాలను కొంచెం కొంచెం చదివి మానవులు సందేహాలలో మునిగిపోయారు .అది రాసినవాడిదో గ్రందానిదో తప్పుకాదు .రుషి ప్రోక్తాలలో ప్రశ్న ఉన్న చోటేసమాదానమూ ఉంటుంది .ఆరు ప్రమాణాలతో మీమాంస శాస్త్రం పద్నాలుగు ప్రమాణాలతో అలంకార శాస్త్రం ద్వారా అర్ధం చేసు కోమని,గురుని ముఖతానేర్చుకోమని వేదం వేదాంగాలు చెప్పాయి .

9-‘’బ్రహ్మాండే శ్రీ లాలితాఖ్యాన బంధే –భంఢో నామ్నా మొహవద్దుర్ని వారః

ఆసీద్విశ్వం స్వాత్మ సాత్క్రుత్య కృత్యా –దక్షం రక్షః ప్రాణిజాలం బాబాధే ‘’

తా-బ్రహ్మాండ పురాణ లలితోపాఖ్యానం లో మూల అజ్ఞానం తో నివారింప లేని భండుడు అనే రాక్షసుడు ,ప్రయోగ దక్ష్టతతో ప్రపంచాన్ని అంతటిని తన స్వాధీనం లోకి తెచ్చుకొని ప్రాణులను విపరీతంగా హింసించాడు .

10-‘’ఏతస్యాసన్మ౦త్రిణస్సైనికాశ్చ –సేనా నాధాఃపుత్రా పౌత్ర ప్రవర్గాః

తై స్తై స్సాకం గ్రీష్మ వద్భీష్మ వచ్చ-చక్రే సర్వం తాప పర్యాకులం సః’’

తా-భండాసురుడు మంత్రి సేనా కుమారాదాలుతో కలిసి ఆరేడు లోకాలను గ్రీష్మ తాపంలాగా విజ్రుమ్భించి కలవరానికి గురి చేశాడు .

11-‘’భేదే దక్ష స్తస్య మంత్రీ విషంగః –జన్తోర్యోగం జంతునా నానుమంతా

ఉత్పన్నం శుక్రం వికర్షే ద్విశుక్రః –స్త్రీణాంపుంసాం దుర్బల స్తేన లోకః ‘’

తా-భేదోపాయం తెలిసిన వాదిమంత్రి విషంగుడు ఒకరితో మరొకరు కలవకుండా చేశాడు .స్త్రీ ,పురుషుల శుక్ర శ్రోణితాలనుదొంగతనం గా ఎత్తుకుపోయి దుర్బలులను చేస్తున్నాడు .ఇలా జగత్తు తల్లడిల్లుతోంది .

12-‘’ఆతార్ణం వ్యాప్నోతిచా బ్రాహ్మ లోకాత్ –నాస్తి త్రాతా కశ్చి దన్యోహ్య ముష్మాన్

విష్ణోర్భీతో నైతి వైకుంఠ మేష –స్వామీ నాప్యాయాతి-హిత్వా తదత్ర ‘’

తా-భండాసురిని బారి నుండి రక్షించేవాడేవ్వరూ గడ్డిపరకనుండి బ్రహ్మ లోకం వరకు కనిపించలేదు.విష్ణువు అంటే భయం తో విష్ణులోకానికి మాత్రం వెళ్ళలేదా రాక్షసుడు .

13-‘’తస్మిన్ కాలే నాదరో నిర్దరోపి-మౌనీ ప్రాపన్నారదో విష్ణు లోకం

స్తుత్వా దేవం సత్క్రుతస్తేన సో సౌ –లోక స్యార్దే పృష్ట ఏనం జగాద ‘’

తా-భయం అభయం రెండూ లేని నారదుడు విష్ణులోకానికి వెళ్లి ,ఆయన్ను స్తుతించి సత్కారం పొంది లోకం లోని విశేషాలేమిటి అని అడిగిన దేవ దేవునితో ఇలా చెప్పాడు .

సశేషం

నవ రాత్రి శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-15-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాయక జయ ప్రకాష్ ఎప్పటికీ స్పూర్తి ప్రదాతే –మంత్రాలలో దాగిఉన్న నివేదనలు

Inline image 1
 
Inline image 2
 
Inline image 3
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కలాం స్పూర్తి ,రుద్రమ కు జరుగుతన్న అన్యాయం

Inline image 1
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జనతా వస్త్ర పంపకం కులకర్ణి

Inline image 1

Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శరన్నవ రాత్రి శుభాకాంక్షలు – శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ”మత్స్వప్నః”(నా కల )

సాహితీ బంధువులజు రేపు 13-10-15 మంగలవారంనుండి ప్రారంభమయ్యే శరన్నవ రాత్రి శుభాకాంక్షలు .
నిరుడు నవరాత్రులకు డా .శ్రీ ఇలపావులూరి పాండురంగా రావు గారు రాసిన” శ్రీ సహస్రిక ”అనే శ్రీ లలితా త్రిపురసుందరీ నామాల విశిష్టతను ధారావాహికం గా మీకు అందించాను . ఈ సారి కూడా ఒక స్పెషల్ ను అందజేయాలనుకొంటున్నాను .
సాధారణం గా మనమందరం కలలు కంటూ ఉంటాం మరి జితేంద్రియు లైన యోగులకు కూడా కలలు వస్తాయా?వస్తే ఎలా ఉంటాయి ?దీన్ని తెలుసుకోవటం కోసం గుంటూరు జిల్లా చందవోలు లో అనునిత్యం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఉపాసనతొ తరించి ఎందరెందరికో గురుమూర్తులై దీక్షనిచ్చి, ”నడయాడే దైవం ”అని పించుకొన్న శ్రీ కంచి పరమాచార్యులు మరియు ,శ్రీ శృంగేరి పీఠాదిపతులు స్వయం గా చందవోలు వచ్చి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద భిక్ష స్వీకరించారంటే శాస్త్రి గారి యోగ వైశిష్ట్యం ఎంతటిదో తెలుస్తుంది. అలాంటి సిద్ధ యోగిపు౦గవులు శ్రీ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు అయిన శ్రీ శాస్త్రి గారికి ఒక కల వచ్చింది .దానిని సంస్కృత శ్లోకాలలో ”మత్స్వప్నః”(నా కల )గా రాశారు అందులో అమ్మవారు ప్రత్యక్షమై వారికి ఏమి తెలియ జెప్పారో వీరేమి అడిగారో ఆ వివరాలన్నీ రేపు 13-10-15 మంగళవారం నుండి అమ్మవారి అనుగ్రహం తో ధారావాహికం గా అందజేస్తాను .. మరొక సారి నవ రాత్రి శుభా కాంక్షలతో -దుర్గా ప్రసాద్

 

Inline image 1
 
Inline image 2
Posted in రచనలు | Tagged | Leave a comment

సిక్కోలు బడిలో ‘స్కైప్’ పాఠాలు 11/10/2015వి.శ్రీనివాస్ a

సిక్కోలు బడిలో ‘స్కైప్’ పాఠాలు

  • 11/10/2015
  • వి.శ్రీనివాస్

ప్రపంచం ఇప్పుడు డిజిటల్ మయం అయిపోయింది. కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఆధునిక సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ మనిషి జీవితంలో ఓ భాగమైపోయాయి. చదువూసంధ్యా సహా అన్ని అవసరాలనూ వీటి సాయంతో తీర్చుకోవడం పరిపాటై, అలవాటైపోయింది. అవి లేకపోతే కాళ్లూచేతులూ ఆడటం లేదు. ‘మనం మెలకువగా ఉన్నామా, నిద్రపోతున్నామా అని ఎవరూ చూడటంలేదు…మనం ఆన్‌లైన్‌లో ఉన్నామా, ఆఫ్‌లైన్‌లో ఉన్నామా అనే చూస్తున్నారు’ అని ఈ మధ్య అమెరికాలో మన ప్రధాని నరేంద్రమోదీ అన్న వ్యాఖ్య..నూటికి నూరుపాళ్లు నిజం. ఆ సాంకేతిక విప్లవం ఇప్పుడు పల్లెల్లో కొత్త వెలుగులకు కారణమవుతోంది. భారత గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్తతరహా సాంకేతిక ప్రగతి పిల్లలకు పాఠాలు నేర్పుతోంది. కంప్యూటర్లు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు ఇంకా అందని పల్లెల్లో, అవన్నీ అమాంతం అందుబాటులోకి వచ్చి ఒక్కసారిగా స్కైప్ పాఠాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది గ్రామీణ భారతంలో.. ఓ మూలనున్న ఆంధ్రప్రదేశ్‌లోని సిక్కోలు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. అత్యంత సామర్థ్యంతో పనిచేసే ఇంటర్నెట్ వ్యవస్థ ఎంత తొందరగా అందుబాటులోకి వస్తే ఆ మార్పు అంత తొందరగా ఫలితాన్నిస్తుంది. అందాకా ఇంటర్నెట్ లేకపోయినా టీవీలో మిగిలిన ‘వైట్‌స్పేస్’ ఆధారంగా బోధన సాగిపోతోంది. అదెలాగో చూద్దాం… శ్రీకాకుళం జిల్లా జనాభా 27,77,343మంది . ఇంటర్నెట్ కనెక్షన్లు లక్షా 27 వేలు ఉండవచ్చని అంచనా. బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ద్వారా 6,432 బ్రాండ్ బాండ్ కనెక్షన్లు ఉండగా, 2,671 మంది డేటాకార్డుల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందుతున్నారు. మిగిలిన వినియోగదారులు ప్రైవేటు నెట్ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని అతి తక్కువ వ్యయంతో జిల్లాలో అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకు వచ్చింది. టెలివిజన్‌లో వృథాగా మిగిలిపోయిన వైట్‌స్పేస్ ద్వారా ఇంటర్‌నెట్ అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈ జిల్లాలో అమలు చేస్తోంది. డిజిటల్ విధానంలో తక్కువ ధరకే ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవచ్చని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన జిల్లాలో ఐదు పాఠశాలలను ఎంపిక చేశారు. ముందుగా ఈ పాఠశాలల్లో అమలు చేసి, తర్వాత జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటారు. మైక్రోసాఫ్ట్ సంస్థ పైలెట్ ప్రాజెక్టుగా ఐదు ప్రభుత్వ పాఠశాలలను ఎంపికచేసింది. మారుమూల గ్రామాలకు అతి తక్కువ వ్యయంతో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడంతోపాటు, పాఠశాల విద్యార్థులకు స్కైప్ ద్వారా బోధన అందిస్తున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రముఖ ఐటీ సంస్థల సీఈవోలతో ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల భేటీ అయినపుడు శ్రీకాకుళం జిల్లా పేరు ప్రస్తావనకు రావడంతో ‘స్కైప్’ ప్రాజెక్టు గురించి మిగతా ప్రాంతాల వారికి తెలిసింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ భారత్‌లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్న విషయం గుర్తుచేశారు. ప్రధానికి ఈ విషయం చెబుతూ ఆయన సిక్కోలులో తమ ప్రాజెక్టు గురించి వివరించారు. గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్‌బాండ్ సదుపాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘1970లో పాఠశాల విద్యార్థులు ట్రాన్సిస్టర్లలో అతికష్టం మీద పాఠాలు వింటున్న రోజులు నాకు గుర్తున్నాయి.. అప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామాల పిల్లలు కూడా ఇలాగే ట్రాన్సిస్టర్ల ద్వారా పాఠాలు వినేవారు… ఇప్పుడు అదే జిల్లా పిల్లలు స్కైప్ ద్వారా వీడియో పాఠాలు వింటున్నారు..’ అని సత్య నాదెళ్ల డిజిటల్ ఉద్యమం గురించి వివరించారు. అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలన్నది నేడు ఒక ఉద్యమంలా జరుగుతోంది. దీనికోసం ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ సంస్థలు ఇప్పటికే భారీ ఎత్తున పరిశోధనలు చేపట్టాయి. మైక్రోసాఫ్ట్ వైట్‌స్పేస్ ఆధారిత నెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న కృషితోపాటు పలు దేశాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో గూగుల్, ఫేస్‌బుక్ శ్రీలంక, అమెరికా దేశాల్లో తమ ప్రాజెక్టులను అమలు చేయబోతుండగా, అంతకుముందే మైక్రోసాఫ్ట్ శ్రీకాకుళం జిల్లాలో టివి వైట్‌స్పేస్‌తో బ్రాడ్‌బాండ్ అమలు చేయడంతో అంతర్జాతీయ చిత్రపటంలో సిక్కోల్‌కు స్థానం దొరికింది. ఇలా మొదలు మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో జిల్లాలో 204 పాఠశాలల్లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఎడ్యుకేషనల్ అండ్ రిసెర్చ్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా, డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ తోడ్పాటును అందిస్తున్నాయి. ఈ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, గార మండలాలకు చెందిన ఒప్పంగి, సింగుపురం కస్తురిబా గాంధీ బాలికల పాఠశాల, ఫరీదుపేట, సతివాడ, వమరవల్లి జెడ్పీ హైస్కూల్‌ల్లో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు బోధన జరుగుతోంది. ఈ డిజిటల్ విద్యా బోధనకు 68 మంది ఉపాధ్యాయులకు ఎంపిక చేసి తగిన శిక్షణ ఇచ్చినట్టు జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం సమీపంలోని ఒప్పంగిలో బేస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో సిగ్నళ్లు అందుతాయి. వైఫై అయితే కేవలం 100 మీటర్లకు మాత్రమే పరిమితమవుతోంది. దీంతో టీవీ వైట్‌స్పేస్ పథకానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒప్పంగిలో బేస్‌స్టేషన్ ఏర్పాటు చేయడంతోపాటు మిగిలిన నాలుగు క్యాంపస్‌లు సింగుపురం, ఫరీద్‌పేట, సతివాడ, వమరవల్లి పాఠశాలల్లో సిగ్నళ్లను తీసుకునేందుకు వీలుగా రిసీవర్లను ఏర్పాటు చేసారు. విద్యార్థులతో మాటామంతీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పంగి, సింగుపురం పాఠశాలల విద్యార్థులతో స్కైప్ ద్వారా విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఇటీవల మాట్లాడారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సింగుపురం కెజిబివి విద్యార్థినులతో మాట్లాడారు. ఒప్పంగి (జెడ్పీ హైస్కూల్) శ్రీకాకుళం పట్టణానికి అతి దగ్గరలోని గ్రామం ఒప్పంగి. అన్ని సౌకర్యాలు ఉన్నా ఇంటర్నెట్ సౌకర్యానికి నోచుకోని గ్రామం. ప్రైవేటు ఇంటర్నెట్‌లు, వైపై సౌకర్యాలు లేని ఇక్కడి జెడ్పీ హైస్కూల్‌లో బేస్‌స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న మిగిలిన నాలుగు పాఠశాలలకు రిసీవర్లను అమర్చేందుకు ఒప్పంగిని స్కైప్ స్టేషన్‌గా మైక్రోసాఫ్ట్ సంస్థ మార్చేస్తోంది. ఇక్కడ నుంచి ఏ దిక్కుకైనా పది కిలోమీటర్లు వ్యాప్తిచెందే ఈ తరంగాలు స్కైప్ బోధనా విధానానికి సులువైన మార్గంగా మారుస్తోంది. దేశంలో ఎక్కడా మొదలుకాని వైట్‌స్పేస్ పథకం కోసం ఒప్పంగిలో బేస్ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. కొద్దిరోజులుగా స్కైప్ పాఠాలు ప్రారంభమయ్యాయి. 339 మంది విద్యార్థులు ఇక్కడ ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 130 మంది విద్యార్థులు ఉండేవారు. స్కైప్ బోధనా విధానం అమలైన నాలుగు నెలల్లోనే డ్రాపౌట్లు లేకుండా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కార్పొరేట్ స్కూళ్ళలో అమర్చే ఇంటర్నెట్‌ల కంటే ఒప్పంగిలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేసే కంప్యూటర్లు, వీడియో కెమెరాలు, స్క్రీన్, రిసీవర్లు వంటి అత్యాధునిక సాంకేతిక హంగులు ఇక్కడి సర్కార్ బడి రూపురేఖలు మార్చేశాయి. సింగుపురం (కెజిబివి) జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్లు దూరం. 16వ నెంబర్ జాతీయరహదారి పక్కనే ఉన్న గ్రామం అది. 195 మంది బాలికలు చదువుకుంటున్నారు. వీరికి స్కైప్ ద్వారా తరగతులు బోధించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ అన్నీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ డిజిటల్ విద్యాబోధన ప్రారంభమైంది. అంతకు ఆరు మాసాల ముందే ఈ సాంకేతిక విప్లవానికి ఇక్కడ శ్రీకారం పలికారు. సతివాడ, వమరవల్లి (జెడ్పీ హైస్కూళ్లు) జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న సతివాడ, వమరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఈ డిజిటల్ విద్యా విధానానికి ఎంపిక కాగా ఇప్పటికే కంప్యూటర్లు తదితర సామాగ్రి చేరాయి. ఒప్పంగిలోని ట్రాన్స్‌మిషన్ ద్వారా సతివాడ, వమరవల్లి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన రిసీవర్లుకు సమాచారం అందుతుంది. సతివాడ, వమరవల్లి పాఠశాలల్లో చెరో 11 చొప్పున కంప్యూటర్లు ఇతర సామగ్రిని రూ. 50 లక్షల వ్యయంతో అందజేసారు. ప్రస్తుతానికి స్కైప్ సేవలు పూర్తిస్థాయిలో లేకపోయినా ఉపాధ్యాయులు సిడిల రూపంలో డేటా సేకరించి కంప్యూటర్లు, ప్రొజెక్టర్ల ద్వారా డిజిటల్ బోధన సాగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సౌకర్యాలు కల్పించి సరైన ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బంది ఎదురవుతోంది. ఫరీదుపేట (జెడ్పీ హైస్కూల్) ఈ గ్రామం ఆధ్యాత్మికతకు మారుపేరు. ఈ గ్రామంలో కొలువైన శ్రీరంగనాథుడిని ప్రతి ఇంటా ఆరాధిస్తారు. హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేసిన బొడ్డేపల్లి సత్యన్నారాయణ ఇదే పాఠశాలలో చదువుకున్నవారే. ఇంతటి చరిత్ర కలిగిన పాఠశాల దేశంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా స్కైప్ బోధనా విధానానికి ఎంపికయింది. వౌలిక సదుపాయాలు, సాంకేతిక పరికరాలు అమర్చినప్పటికీ, ఇంటర్నెట్ కనెక్టుకాక స్కైప్ బోధనకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. సిగ్నల్స్ లేకపోవడం వల్ల యూట్యూబ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని సైన్స్, మేథ్స్, ఇంగ్లీషు గ్రామర్ పాఠాలు బోధిస్తున్నారు. వారానికి ఒక తరగతికి చొప్పున స్కైప్ విధానంలో ఇక్కడి ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఈ పాఠశాలలో 175 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్కైప్ ద్వారా విద్యాబోధనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరువాత మైక్రోసాఫ్ట్ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వెనుకబడిన మారుమూల ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని ఆ సంస్థ సిఇఒ సత్య నాదెళ్ల అనుకున్నారు. ఈ జిల్లాతో ఆయనకు కొంత అనుబంధం ఉంది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకూడా సై అన్నారు. అంతే రెండు నెలలనుంచి అక్కడ స్కైప్ బోధన ప్రారంభమైంది. కానీ వారనుకున్నంత స్థాయిలో ఇంకా జరగడం లేదు. బాలారిష్టాలు ఎదురౌతున్నాయి. నాలుగు గ్రామాల్లోని స్కూళ్లలో స్పైప్ బోధన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా ఇంకా అన్ని సౌకర్యాలూ అందుబాటులోకి రాలేదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఒక్క పాఠశాలలో పూర్తిస్థాయిలో స్కైప్ బోధన సాగుతోంది. మరో పాఠశాలలో కొంతవరకు అమలవుతోంది. ఇంకా రెండు పాఠశాలల్లో ఇంకా బోధన ప్రారంభం కావలసి ఉంది. కొత్త పథకాలు, అదీ సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉండాల్సిన ఇలాంటి పథకాల అమల్లో సాధకబాధకాలు తెలుసుకునేందుకే పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్, వీడియోకాన్ఫరెన్స్‌వంటి కొత్తకొత్త విషయాలను పల్లెజనం ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఈ మార్పువల్ల ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు మళ్లుతున్నారు. అటు సాంకేతికతపై పట్టు, ఇటు సర్కారీ విద్యపై ఆసక్తి రేపుతున్న ఇలాంటి పైలట్ ప్రాజెక్టులు విజయవంతమైతేనే దేశాభివృద్ధికి పల్లెసీమలు పట్టుగొమ్మలవుతాయి. సిలికాన్‌వ్యాలీ నేర్పిన పాఠాలు, మైక్రోసాఫ్ట్ చెబుతున్న బోధనలతో సిక్కోలు వాసుల విజన్ ఇప్పుడిప్పుడే మారుతోంది. అభివృద్ధికి అదే ముందడుగుకదా. * స్కైప్…టీచింగ్ ‘స్కైప్’.. ఇది కంప్యూటర్, టెలిఫోన్, ఇంటర్నెట్ తెలిసిన ప్రతిఒక్కరికి తెలిసిన టెలికమ్యూనికేషన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని ఇంటర్నెట్ ద్వారా టీవీ, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్, స్మార్ట్ఫోన్, వెబ్‌కేమ్, ఇతర మొబైల్ డివైజ్‌లలో వీడియోకాల్స్, వీడియో ఛాటింగ్, వాయిస్ కాల్స్, మెసేజింగ్, వీడియో, టెక్స్ట్ ఫైల్స్ మార్పిడి చేసుకోవచ్చు. దీనికి పెద్దగా రుసుం కూడా ఉండదు. స్కైప్ వినియోగదారునిగా నామమాత్రపు చెల్లింపుపై రిజిస్టర్ అయితే చాలు. 2003లో ఇది ఆవిర్భవించింది. 2011లో దీనిని మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసి, అభివృద్ధి చేసింది. స్కైప్ అనుసంధానంతో విద్యాబోధన, వివిధ భాషల ట్రాన్స్‌లేషన్‌కు కొత్తకొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు భారతదేశంలో స్కైప్ ద్వారా దృశ్య,శ్రవణ విద్యకు సహకరిస్తోంది. అదీ ఉచితంగానే. స్కైప్ ఇన్ క్లాస్‌రూమ్, వైట్‌స్పేస్ టెక్నాలజీ సాయంతో విద్యాబోధనకు కొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో అమలవుతోంది. ఎలా పనిచేస్తుంది..? స్కైప్‌తో అనుసంధానం అయి, ఇంటర్నెట్ సాయంతో వారి వెబ్‌సైట్‌ను సందర్శించి ఆయా పథకాల్లో చేరొచ్చు. వీడియో ఛాటింగ్ ద్వారా విద్యాబోధన జరుగుతుంది. పాఠ్యాంశాలలో థియరీకి తోడుగా ప్రాక్టికల్స్‌ను తిలకిస్తూ నేర్చుకోవచ్చు. ఆయా అంశాల్లో నిపుణులు ఈ భూగోళంలో ఏఏ ప్రాంతాల్లో ఉన్నా, వారిని అప్పటికప్పుడు స్కైప్‌లైన్‌లోకి రప్పించి ప్రత్యక్షంగా సందేహాలు తీర్చుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్ మాదిరిగా అన్నమాట. శ్రీకాకుళం జిల్లాలో ఆ విధానం ఇప్పటికే ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు కోటిమంది వినియోగించే స్కైప్‌కు 2013 నాటికి 30కోట్లమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సర్కారీ బడుల్లో కార్పొరేట్ విద్య స్కైప్ ద్వారా విద్యాబోధన కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతోంది. పిల్లలపై ఒత్తిడి ఉండదు. ఒక విషయాన్ని పదేపదే చెప్పడం కంటే దానిని దృశ్యం ద్వారా చూపించి పాఠాలు చెప్పడంతో పిల్లలు వేగంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ విధానం డ్రాపౌట్లను గణనీయంగా తగ్గించింది. గ్రామీణ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడం తగ్గవచ్చు. -ఎం. రాజ్యసుందరి, బయాలజీ అసిస్టెంట్, ఒప్పంగి జెడ్పీ హైస్కూల్ బోధన సులభతరం స్కైప్ ద్వారా బోధన చేయడం చాలా సులభంగా ఉంది. విద్యార్థులను బాగా తీర్చిదిద్దవచ్చు. నైపుణ్యంతో కూడిన విద్య అందించడం ప్రాథమిక స్థాయిలో మరింత సులువు. -బి.జయదేవి, హెచ్‌ఎం, ఫరీదుపేట సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశాన్ని ఈ బోధన ద్వారా పెంపొందించుకోవచ్చు. సాంకేతిక విద్యపై మక్కువ పెంచుకునేందుకు దోహదపడుతుంది. -ఎం.వసంతరావు, ఫిజిక్స్ టీచర్ , ఫరీదుపేట ఆసక్తి పెరిగింది.. ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న బోధనా విధానం విద్యార్థుల్లో కుతూహలాన్ని కలిగిస్తోంది. పాఠ్యాంశాలపై వారికి మంచి అవగాహన కలుగుతోంది. కొత్తవిషయాలను నేర్చుకోవాలన్న తపన వారిలో పెరుగుతోంది. -వి.కుసుమకుమారి, సైన్సు టీచర్, సతివాడ. మంచి ప్రయోగం అంతర్జాలం ద్వారా విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించి వారిని మరింత ప్రయోజకుల్ని చేసే ఈ ప్రయత్నం మంచిదే. డిజిటల్ విద్యాబోధనకు మా పాఠశాలను ఎంపిక చేయడం గర్వంగా ఉంది. -వై క్రిష్ణారావు, హెచ్.ఎం., వమరవల్లి. మా పిల్లలనైనా చదివించుకుంటాం మాకు ఎలాగూ చదువు అబ్బలేదు. కనీసం మా పిల్లలనైనా బాగా చదివించుకుందామనుకుంటున్నాం. ప్రభుత్వం ఇటువంటి ఉన్నత సాంకేతిక విద్య అందించడం అభినందనీయం.. -పెదలాపు నాగేశ్వరరావు, రైతు, సతివాడ. ఖరీదైన విద్య అందుతోంది ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన పిల్లలకు స్కైప్ బోధన ద్వారా ఖరీదైన చదువు అందుతోంది. కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్‌లో ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడుతుంది. -సత్తారు వనాజాక్షి, విద్యార్థి తల్లి, ఫరీదుపేట ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చు స్కైప్ ద్వారా పాఠాల బోధనతోపాటు ఏ దేశం నుంచైనా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేరుగా ఇక్కడి విద్యార్థులు మాట్లాడారు. విషయ పరిజ్ఞానం ఉన్న నిపుణులతో బోధన సాగించేందుకు అవకాశం ఉంటోంది. డిజిటల్ లెర్నింగ్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ- సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందేందుకు దోహదపడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా శాస్తవ్రేత్తలు, నిపుణుల సందేశాలు, బోధనలు అందించేందుకు అవకాశం ఉంటోంది. -ఎ.బలరామకృష్ణ, హెచ్‌ఎం, ఒప్పంగి ఫలితాలు సాధిస్తున్నాం 163 మంది విద్యార్థులున్న మా పాఠశాల ఫలితాల సాధనలో అగ్రగామిగా ఉంది. విద్యార్థుల ప్రతిభ, శతశాతం ఉత్తీర్ణత, తదితర అంశాల ఆధారంగా మా పాఠశాలను డిజిటల్ విద్యా బోధనకు ఎంపిక చేశారు. -సాయిబాబు, హెచ్.ఎం, సతివాడ. అభినందనీయం విద్యార్థులకు ఇ-లెర్నింగ్, డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నాం. స్కైప్ ద్వారా క్లౌడ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బోధనా ప్రక్రియను రూపొందించారు. ప్రతి విద్యార్థి రాణించడానికి వీలుగా ఉంది. -కె.వరప్రసాదరావు, ఇంగ్లీషు టీచర్, సతివాడ. ‘ప్రావీణ్య’ అనే పేరుతో ఎస్‌సిఇఆర్‌టి సిలబస్‌ను వైట్‌స్పేస్ పథకంలో స్కైప్ ద్వారా అప్‌లోడ్ చేసి ఆ పాఠాలను బోధించే అవకాశం కలిగింది. నిపుణులతో బోధన జరుగుతోంది. విద్యార్థినులు కోరుకుంటే.. ఎక్కడనుంచైనా సరే నిపుణులతో పాఠాలు చెప్పించే విధానాన్ని కూడా ప్రారంభించాం. ఆరుమాసాల క్రితమే సాంకేతిక పరిజ్ఞానంతో పాఠాలు చెప్పాలంటూ బ్రాడ్‌బాండ్ సౌకర్యం కల్పించినప్పటికీ, మైక్రోసాఫ్ట్ సంస్థ రెండు నెలల క్రితం అమర్చిన రిసీవర్ల ద్వారా స్కైప్ విధానంలో బోధనా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ పద్ధతిని 2008లో దక్షిణాఫ్రికాలో అమలు చేసారు. దామోదర్‌పాత్రుని శారద, స్పెషల్ ఆఫీసర్, కెజిబివి-సింగుపురం టెక్నాలజీతో అభివృద్ధి స్కైప్ సాంకేతిక పరిజ్ఞానంతో మరింత అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. ఈ తరహా బోధనకు ‘గైడ్’ అవసరమే. సాంకేతిక నిర్వహణ సామర్థ్యం, క్రమశిక్షణ నేర్పేందుకు ఏర్పాట్లుండాలి. -ఎంజి శంకరరావు, మేథ్స్ అసిస్టెంట్, ఒప్పంగి జెడ్పీ హైస్కూల్ సమయం ఆదా స్కైప్ ద్వారా సమయం కూడా వృథా కాదు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు సులభంగా, వేగంగా అర్థమవడానికి ఈ విధానం ఉపయోగపడుతోంది. -ఎస్ దేవికుమారి, 10వ తరగతి, సింగుపురం బోధన సులభం స్కైప్ ద్వారా బోధన, అభ్యాసం, నేర్చుకోవడం చాలా సులభంగా ఉంది. సైన్స్‌కు సంబంధించిన బొమ్మలు చూడడం వల్ల ప్రత్యక్షంగా చూసినంత అవగాహన కలగడంతో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. -బొమ్మన ప్రియతం సాయి, 9వ తరగతి, సింగుపురం మా గ్రామాన్ని గుర్తించటం ఆనందం కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వం ఇటువంటి విధానాలను ప్రవేశపెట్టడం సంతోషకరం. మా గ్రామాన్ని ఇందుకోసం ఎంపిక చేయటం ఆనందంగా ఉంది. -పెదలాపు శ్రీరాములు, ఉద్యోగి, సతివాడ. బాగా అర్థమవుతోంది కేవలం వినడం ద్వారానే కాకుండా విడియో బొమ్మల రూపంలో సాగిస్తున్న బోధన బాగా అర్థం అవుతోంది. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా లభిస్తోంది. -చల్లా జ్యోతి, 10వ తరగతి, సతివాడ. ఎంతో ఉపయుక్తం డిజిటల్ విధానం ద్వారా సాగించే వివరణాత్మకమైన బోధనపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. పాఠ్యాంశాల వారీగా బోధన ఉపయుక్తంగా ఉంటోంది. -ఎ.అప్పన్న, ఉపాధ్యాయుడు, వమరవల్లి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అహం బ్రహ్మాస్మి మరియు కాల్పనేతర సాహిత్యానికి నోబెల్

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77 33-అద్వితీయ మహాకవి,మహాకావ్య నిర్మాత,మహా పండితుడు –ఎ .ఇ .హూస్మన్(Housman )2-(చివరిభాగం )

వితాలలో చీకటి వెలుగులు -78

33-అద్వితీయ మహాకవి,మహాకావ్య నిర్మాత,మహా పండితుడు –ఎ .ఇ .హూస్మన్(Housman )-2(చివరి భాగం )

సుదీర్ఘ జీవితకాలం లో హూస్మన్ రెండే రెండు గ్రంధాలు మాత్రమె ప్రచురించాడు .కవిత్వంపై గొప్ప పట్టు సాధించాడు వశపరచుకొన్నాడు .అందులో అరుదైనది ‘’శ్రోఫైర్ లాడ్’’.దీనితర్వాత 26ఏళ్ళ కు అప్పటివరకు రాసిన కవితలను కూర్చి రెండో గ్రంధ తెచ్చాడు .దీనితో ఇక తానూ కవిత్వం రాయాల్సిన పని లేదని చెప్పినట్లైనది .ఈగ్రందమే ‘’లాస్ట్ పోయెమ్స్ “’.హూస్మన్ మరనానంతరంచేడురుమడురుగా ఉన్న వాటిని సేకరించి సోదరుడు లారెన్స్ ‘’మోర్ పోయెమ్స్ ‘’గా ప్రచురించాడు .

‘’శ్రోఫైర్ లాడ్ ‘’ఎన్ని సార్లు పునర్ముద్రణ పొందిందో లెక్కే లేదు ఎన్ని రకాలుగా ముద్రణ భాగ్యం దక్కిన్చుకోన్నదే చెప్పలేం .దీనికి ఆయన నిరాశాతోకూడిన వేదాంతం ఒక్కటే కాదు ,అందులోని లయాత్మక,సంప్రదాయ  సంగీతంవీనుల విందు చేస్తుంది .సహజం గా మగాడు మోసం చేస్తాడు ఆడది వంచనకు గురౌతుంది . .ఇది సహజం . ప్రక్రుతి ధర్మం.సహజ మానవ ధర్మం కంటే ప్రక్రుతి ధర్మం తక్కువ క్రూరమైనది .పల్లెటూరి ఆకస్మిక దాడులు మనిషి ని మహా క్రూరత్వం లోకి నెట్టి భయపడేట్లు చేస్తుంది .సున్నితమనస్కుడు మంచికంటే చెడుకు అలవాటు పడటం నేర్చుకొంటాడు .స్వర్గం లో ఆశ ఏమీకనిపించదు .ఉన్నత స్వర్గం భూమి ఒకే పునాది నుంచి వచ్చినవే అంటాడు హూస్మన్ .’’the troubles of our proud dust and angry dust –are from eternity ,and shall not fail ‘’అంటాడు .

ప్రపంచం అంటా వేదన తో నిండి పోయింది దాన్ని  జీర్ణించు కొంటే బాధ అలవాటై’’ ఇమ్మ్యూనై’’పోతుంది అన్నాడు .గ్రందాంతం లో ఒక ప్రాచ్య రాజు’’ మిత్రి డేట్స్’’ప్రపంచం లోని అన్ని రకాల విషాలను సేకరించి  కొద్ది కొద్దిగా రుచి చూసి విష హరత్వం ఏర్పడి శత్రువులను జయించాడు అనే కద చెప్పాడు .

‘’they poured strychnine in his cup –and shook to see him drink it up-they shook ,they stared ,as white’s  their shirt –them it was their poison hurt –I tell the tale that I heard told –Mithridates ,he died old .

‘’అదృష్టం ఒక చాన్స్ కాని అది తప్పక ఇబ్బంది పెడుతుంది’’ అన్నాడు .విశ్వ వ్యాప్త అసమానత్వాలు మనల్ని ఆశ్చర్యం లో ముంచి వేయక పోవచ్చునని చెబుతూ –‘’bear them we can ,and if we can we must –shoulder the sky ,my lad ,and drink your ale ‘’

రెండవది అయిన ‘’లాస్ట్ పోయెమ్స్ ‘’కూడా నిరాశాకే ఆజ్యం పోసింది .నిరాశ పరాకాష్టకు పోయింది .ఇందులో హూస్మన్ –‘’

‘’we are a certainty are not the first –have sat in taverns while the tempest hurled –their hopeful plans to emptiness ,and cursed  -whatever brute blackguard made the world ‘’

‘’ డ్రింకింగ్  ఈజ్ బెటర్ దాన్ థింకింగ్ ‘’ అంటూ గాలిబ్ గారి రుబాయత్ ను అనుసరించి చెప్పాడు .అతని వేదాంతం మనకు కష్టంగానే ఉన్నా హృదయాలను పట్టేస్తుంది .కవిత్వం అంతా  అసంబద్ధ అద్భుతం గా ఉండటం హూస్మన్ సాధించిన ప్రత్యేకత .చిరకాలం జ్ఞాపకం చేసుకొనే వాక్యాలు హ్రుదలాని పట్టుకొని వదలవు .

‘’loveliest of trees,the cherry now –in hung with bloom along the bough –and stands about the woodland ride –wearing white for Eastertide ‘’

హూస్మన్ వచనం కూడా కవిత్వమంతప్రభావితం చేసింది .కవిత్వ లక్షణాన్ని చెబుతూ హూస్మన్ ‘’I could no more define poetry than a terrier could define a rat –but I thought we both recognized the object by the symptoms which it provoked in us ‘’అన్నాడు అతాని పాండిత్య స్పోరక రచనలు అన్నీ వ్యంగ్య వైభవం  రాణించాయి.స్విన్ బార్న్కవిని గురించి చెబుతూ ‘’Swinburne has said not only all he has to say about everything ,but all he has to say about nothing ‘’అన్నాడు .హూస్మన్ అంటే ‘’plainly a perfect poet ,and just as plainly as a great one ‘’అన్నాడు విఖ్యాత విమర్శకుడు లూయీ క్రోనేన్ బెర్గెర్ .ఇంగ్లీష్ లో ఒక్క అక్షరం కూడా రాయని గొప్ప లాటిన్ కవి హూస్మన్ .

క్లాసిస్ట్ కవులలో శిఖరాగ్రకవి హూస్మన్ .ప్రైవేట్ గా విద్యావంతుడై పండితుడి తన కవిత్వం తో కావ్యాలతో అనితర సాధ్యమైన కవి అనిపించుకొన్నాడు .’’జువేనాల్ ,మాలినాస్ ,లూకన్ కవులపై అతని పరిశోధన రచనలు అసాదారణమైనవి .

వోర్సెస్టర్ షైర్ లోని బ్రూమస్ గ్రూవ్ లో హూస్మన్ విగ్రహాన్ని ప్రతిష్టించి గౌరవించారు .వోర్సెస్టర్ యూని వర్సిటి లో ఒక బ్లాక్ కు హూస్మన్ పేరు పెట్టారు .హూస్మన్ కవితలను ‘’కలక్టేడ్ పోయెమ్స్ ‘’గా 10వాల్యూములు ,క్లాసికల్ స్కాలర్షిప్ పేర’’అయిదు గ్రంధాలు ,’’పబ్లిష్ద్ లెక్చర్స్ ‘’గా  అయిదు గ్రందాలు ,ఒక ప్రోజ్ కలెక్షన్ ,కలేక్టేడ్ లెటర్స్ గా రెండు గ్రంధాలు వెలువడ్డాయి .

శ్రో ఫైర్ లాడ్ లో 63 మధుర కవితలున్నాయి .పబ్లిషర్లు ఎవరూ ముందుకు రాకపోతే హూస్మన్ స్వంత ఖర్చుతో దాన్ని 1896లో ప్రచురించాడు .అవి చాడివి సహచరులు విద్యార్ధులు అదిరిపోయారు .వాటిలోని భావోద్వేగాలు , ,హృదయగాయాలను మాన్పే విధానం కు ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్య పోయారు .అమ్మకాలు క్రమంగా పుంజుకొని ఆంగ్ల సంగీత దర్శకుల అభిమానం పొంది వారు స్వరాలుకట్టి  మొదటి ప్రపంచ యుద్ధ యుద్ధానికి ముందు ప్రపంచ మంతా  వ్యాప్తి చెందేట్లు చేశారు .ఇంగ్లీష్ ప్రజల మనస్సులను  హత్తుకున్నాక .’’శ్రోఫైర్ లాడ్;1896మేనెల నుండి నిరంతరంగా పబ్లిష్ అవుతూనే ఉంది .ఇందు లోని గీతాలను హూస్మన్ లండన్ లోని హై గేట్ లో ఉండి రాశాడు .శ్రోఫైర్ లండన్ కు ముప్ఫై మైళ్ళ దూరం లోనే ఉంది .  ఆతను పెరిగింది అక్కడే .దాన్ని తనకవితల ద్వారా చిరస్మరణీయం చేశాడు .తన కవితలకు ప్రేరణ షేక్స్ పియర్ పాటలు,స్కాటిష్ బార్డర్ బాలడ్స్ ,హీన్రిచ్ హీన్  అని ప్రకటించాడు .తనకవిత్వం పై గ్రీక్ అండ్ లాటిన్ క్లాసిక్ కవుల ప్రభావం లేనే లేదని నిర్ద్వందంగా తెలిపాడు .మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతే తన నవ్య కవిత్వాన్ని రాయటం మొదలు పెట్టాడు .ఎందరో బ్రిటిష్ కవులపై హూస్మన్ ప్రభావం కలిగించారు .వారందరూ యుద్ధం మీద కవితా భేరిమోగించారు .యుద్ధ ప్రారంభ సమయం లో చిన్నదైన ‘’బ్రిటిష్ ఎక్స్పెడిషనరిఫోర్స్ ‘’ను బెల్జియం కు పంపిన సందర్భం లో కవిత రాశాడు .పాపం ఈ సైన్యం సరైన ఆయుధ సంపత్తి లేకుండా శక్తి వంతమైన ఆయుధ సామగ్రికల జర్మని తో పోరాడలేక ఇబ్బంది పడింది .

1920లో మోసెస్ జాక్సన్ అనే తన హోమోసెక్సువల్ కెనడాలో చనిపోతున్న సందర్భం లో హూస్మన్ తన ప్రచురణకాని కవితల్ని ఆయనకు పంపి చదివేట్లుచేసి ప్రశా౦త౦ గా మరణించటానికి  తోడ్పడ్డాడు

John Sparrow quoted a letter written late in Housman’s life that described the genesis of his poems:

Poetry was for him …’a morbid secretion’, as the pearl is for the oyster. The desire, or the need, did not come upon him often, and it came usually when he was feeling ill or depressed; then whole lines and stanzas would present themselves to him without any effort, or any consciousness of composition on his part. Sometimes they wanted a little alteration, sometimes none; sometimes the lines needed in order to make a complete poem would come later, spontaneously or with ‘a little coaxing’; sometimes he had to sit down and finish the poem with his head. That… was a long and laborious process.[23]

           Inline image 1     Inline image 2    Inline image 3  Inline image 4

మరో ప్రముఖునితో మళ్ళీ  కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-10-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అమరావతి మన ఆత్మగౌరవం ,పది వేలమంది తో వేద ఘోష

Inline image 1Inline image 1


Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు రాష్ట్రాలలో భాషా సంక్షోభం

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”హుద్ హూద్”కు ఏడాది

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”ఆచ్చి మనోరమ ”మృతి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుకరణ శిల్పం లో సొంత కవిత్వం పాలెంత ?రసాయనకాలుష్యం పై పరిశోధనాస్త్రం

Inline image 1
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పితరులకు ఉత్తమగతి ,పుత్రులకు వంశాభి వృద్ధి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురాంతకం కధల్లో శ్రమ సౌందర్యం మరియు పరిశోధన పట్టా భద్రుడు తిరుమల రామ చంద్ర

మధురాంతకం కధల్లో శ్రమ సౌందర్యం మరియు పరిశోధన పట్టా భద్రుడు తిరుమల రామ చంద్ర

 

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

10-10-15 శనివారం సాయంత్రం విజయవాడ హోటల్ ఐలాపురం లో కృష్ణాజిల్లా రచయితల సంఘం అందజేసిన సాహితీ పురస్కార సభా దృశ్యాలు 

10-10-15 శనివారం సాయంత్రం విజయవాడ హోటల్ ఐలాపురం లో కృష్ణాజిల్లా రచయితల సంఘం అందజేసిన సాహితీ పురస్కార సభా దృశ్యాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77

33-అద్వితీయ మహాకవి,మహాకావ్య నిర్మాత,మహా పండితుడు –ఎ .ఇ .హూస్మన్(Housman )

పెసిమిస్ట్ కవులలో ఉమర్ ఖయ్యాం’’రుబాయత్ “’ కవితలని ఇంగ్లాండ్ కు చెందిన ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ ఆంగ్లం లోకి అనువదించటం తో దాని ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించింది .అలాగే లాటిన్ ప్రొఫెసర్ , కవి ఆల్ఫ్రెడ్ ఎడ్మండ్ హూస్మన్ మనిషి దుర్మార్గాన్ని హత్య ,ఆత్మహత్యలని దేవుడి ద్వేషాన్ని గురించి  రాసిన ‘’ఏ శ్రోఫైర్ లాడ్’’కూడా అంతే విఖ్యాతమైంది .యువప్రేమికులు మాత్రమేకాదు  నైతిక బాధ్యతతో జీవించే వారూ ఈ రెండిటికి బ్రహ్మ రధం పట్టారు .ఈ రెండూ చిన్న గ్రంధాలే అయినా ,విక్టోరియాన్ భావాలపై గొప్ప తిరుగుబాటే చేయించాయి .క్రమశిక్షణ గల ఇ౦ పీరియలిజం నుంచి ‘’బేఫర్వాఆనందోబ్రహ్మా’’  కు జనం మారిపోయారు .వీటి ప్రభావం అంతగా ఉండేది .’’తిను, తాగు, ఆనందించు ‘’అనే మూడు మాటల మంత్రమే అందర్నీ శాసించింది .పురాణ గ్రందాలమధ్య మనవాళ్ళు ‘’చలం పుస్తకాలు ‘’పెట్టుకొని చదివినట్లు వీటిని పెట్ట్టుకొని రహస్యంగా చదివే సంఖ్య గణనీయంగా పెరిగింది .ముఖ్యంగా ఏ శ్రోఫైర్ లాడ్ ‘ను అలా చదివి రహస్యంగా ఆనందించేవారు .

26-5-1859 న  యింగ్లాండ్ లోని శ్రో షైర్ కొండల దగ్గరున్న వార్సేస్టర్ షైర్లో  పుట్టిన హూస్మన్ కు ఆ కొండలే చిన్నప్పుడు విహార స్థలాలు .ఏడుగురు సంతానం లో పెద్దవాడు హూస్మన్ .బ్రూమస్ గ్రూవ్ లో స్కూల్ చదువు పూర్తీ చేసి ఆక్స్ ఫర్డ్ లో సెయింట్ జాన్ కాలేజిలో చేరాడు .కుటుంబం లో అందరికి అభిమాని .ఆక్స్ ఫర్డ్ వదిలేసరికి చాలామారిపోయాడు .ప్రేమ వ్యవహారం విషాదమవటం ఒక కారణం అ౦టారుకాని రుజువుల్లేవు .ఇరవై ఏళ్ళకే అసా౦ఘికంగా ,ఏదీపట్టించుకోని వాడుగా మారి జీవితాంతం అలానే బతికాడు .అతని సమకాలికకవి విల్ఫ్రిడ్ స్కావెన్ బ్లాంట్ ‘’ సిగరెట్ తాగడు .కొద్దిగా డ్రింక్ చేస్తాడు .ఎవరూ కదిలించకపోతే చాలా ప్రశాంతం గా ఉంటాడు ‘’అన్నాడు .స్నేహం చేసేవాడే కాని నిలబెట్టుకోవటం లేదు .పెళ్లి చేసుకోలేదు .అందరికీ దూరంగా ఒంటరిగా ఉండటం ఇష్టం .దేవుడున్నాడనే నమ్మకం పదమూడవ ఏటి నుంచే ఉండేది .ఇరవైఎనిమిదవ ఏటనుండి నాస్తికుడు ఐపోయాడు .ఆనర్స్ పరీక్ష’ డింకీ కొట్టటం’’కూడా ఈమార్పుకు కారణం అని కొందరి ఊహ .బహుశా ఇది సరైనకారణమే కావచ్చు . కాని అతను ఇబ్బందిలేకుండా గ్రాడ్యుయేట్ అయినా 32వ ఏట యూని వర్సిటి కాలేజి లో ఉద్యోగం వచ్చేదాకా డిగ్రీ చేతికి రాకపోవటం తో హతాశుడయ్యాడు . టీచర్ అవటానికి ముందు పదేళ్ళు బ్రిటిష్ పేటెంట్ ఆఫీస్ లో హయ్యర్ డివిజన్ క్లార్క్ గా లండన్ లో పని చేశాడు .ఈకాలం లో ఏకాంత జీవనమే చేశాడు .కుటుంబానికి సంబంధం లేకుండా .1892లో ఆఫీస్ లో ఉద్యోగం మానేస్తూ ‘’యెంత తక్కువ చేయాలో అంత తక్కువ పని చేశా ‘’అని చెప్పి యూనివర్సిటికాలేజి లో లాటిన్ ప్రొఫెసర్ గా చేరాడు .

19 ఏళ్ళ తర్వాత 52 వ ఏట  ట్రినిటీ కాలేజ్ కి మారాడు .ఇక్కడే క్లాసిక్స్ బోధిస్తూ ఇతర లాటిన్ వాళ్ళను విమర్శిస్తూ ,అడపా దడపా కవితలు అల్లుతూ జీవితాంతం ఉన్నాడు . దీన్ని రాసినా మళ్ళీ మార్పు చేసేవాడు కాదు .చివరి పాతిక ఏళ్ళు ఆగస్టన్ యుగానికి చెందిన’’మానిలస్ ‘’కవి గ్రంధానికి వ్యాఖ్యానం రాస్తూ గడిపాడు .ఇదిపూర్తి అయిన ఒక ఏడాదికి హూస్మన్ ను ఒక కొత్త నీరసం ఆవహించింది .గుండెకు సంబంధించిన జబ్బు అని తెలుసుకొని మృతువు సమీపించిందని గ్రహించాడు .అయినా క్లాసులకు రెగ్యులర్ గా  వెళ్లి యధాప్రకారం బోధిస్తున్నాడు .బోధనలో డ్యూటీతోబాటు ఆనందాన్ని పొందాడు .తనకు ఇష్టమైన కవి’’ హోరేస్’’ పై ఉపన్యాసాలను తయారు చేసుకొన్నాడు .కాని పూర్తీ చేయకుండానే హూస్మన్ కు సెకండ్ ఎటాక్ వచ్చి 78 వ ఏట 30-4-1936న మరణించాడు .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జీవన్ముక్తిప్రదాత –

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవీ స్తోత్ర వాజ్మయం లో మాణిక్యం ,కవితాలతపైవిరిసిన భావ కుసుమాలు

Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సముచిత గుర్తింపు ,మాంస భక్షణ పై రాద్ధాంతం

Inline image 1


Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -76

. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -76

32-క్వాంటం సిద్ధాంతం కనుగొన్న –మాక్స్ ప్లాంక్-2(చివరిభాగం )

హేతుత్వం (కాసువాలిటి)గ్రీకుల కాలం నుండి వస్తున్నపదమే .న్యూటన్ కాలం లో దాని ప్రభావం పెరిగింది .ఏదైనా కొంత సమాచారం ఇస్తే జరుగబోయే దాన్ని ఊహించి (ప్రిడిక్ట్ )కార్య కారణ సంబంధం ఆధారంగా చెప్పవచ్చు.గ్రహణాలు ఎప్పుడేర్పడేది ముందే చెప్పవచ్చు .కాని కాజువాలిటీ దీన్నిదాటి చాలా ముందుకు వెళ్ళింది .చేతిలోంచి విసిరే పావులని ఆచేయి అన్నికోణాలను అర్ధం చేసుకొంటే చెప్పవచ్చు .మనిషి భవిష్యత్తును గతం లో  అతని భౌతిక మానసిక స్తితిని అధ్యయనం చేసి చెప్పవచ్చు . అలాగేఖచ్చిత౦  గా ఆకాశం లో నక్షత్రాల లోని సూత్రాలను ఎలా చెప్పగాలిగారో అలాగే పరమాణువు లోని వాటినీ చెప్పవచ్చు .మనిషి మెదడు లో నాడీ స్పందన ప్రారంభం ఆగిపోవటం లను బట్టిఅతని కొత్త ఆలోచనను పసిగట్ట వచ్చు .

అసంభావ్య సూత్రం కాజువాలిటి కున్న అడ్డంకుల్ని తొలగించింది .ఫిలసాఫికల్ ఆలోచన చర్చకు దానినుంచి స్పెక్యులేషన్ కు దారి తీసింది .కొందరు సైంటిస్ట్ ల దృష్టిలో మన సాధారణ విశ్వం’’ పరమాణువుల చాన్స్ మోషన్’’ వలన మార్పు చెందింది .ఐన్ స్టీన్ లాంటి వారు ‘’దేవుడువిశ్వం తో  పావుల ఆట ఆడడు ‘’(God lays dice with the universe )అని నమ్మారు .ప్లాంక్ ఈ ఇద్దరి భావాలలో మధ్యేమార్గాన్ని అనుసరించాడు .కాజువాలిటి కి కొత్త పాజిటివిజం కు మధ్య ఉన్న తగాదా ఫిలసాఫికల్ ఆలోచనలకేకాక ,సైన్స్ కు ఉన్న వాస్తవ బాధ్యతలకూ చాలా అవసరం అని భావించాడు .తన ‘’క్వాంటం దీరీ ‘’ని నీరు గార్చటానికి ఒప్పుకోలేదు .ఆయన ‘’ఇప్పటికి సైన్స్ సామాన్య మానవ ఆలోచనలను మించి ముందుకు వెళ్ళింది .ఇప్పటిదాకా జరిగిన పరిశోధనల పరిధి కూడా దాటి అభి వృద్ధి చెందింది .ఇలా ఇదే వేగం తో ఇవే శక్తి సామర్ధ్యాలు ,ముందు చూపు తో ముందుకు వెళ్లి నా ప్రక్రుతిలోని మిస్టరి ని  చేదించ లేము . దీనికికారణం ఇప్పటివరకు మనం చూసిన విరుద్ధత (డి స్క్రేపెన్సీ)ప్రక్రుతికి కాజువాలిటి  ప్రిన్సిపుల్ కి మధ్య ఉన్నదికాదు  .మనం గీసిన ప్రక్రుతి చిత్రానికి ,వాస్తవం గా మనం చూస్తున్న ప్రకృతికి మధ్య ఉన్నది మాత్రమె అన్నాడు ప్లాంక్ ..

మాక్స్ ప్లాంక్ కున్న నిజాయితీ, ఆలోచనలు, నమ్మకాలను గుర్తించి ఆయన్ను ‘’సైంటిస్ట్ లకే సైంటిస్ట్ ‘’అని గౌరవమిచ్చారు .సమకాలీనులేకాక అన్ని దేశాలవారూ ప్లాంక్ ను అభినందించారు .1918లో ప్లాంక్ కు నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు మహా మేధావి ఐన్ స్టీన్ ,నీల్స్ బోర్ ,రూధర్ ఫోర్డ్, హీసేన్ బెర్గ్ లాంటి హేమా హేమీ సైంటిస్ట్ లందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి అభినందించారు .ఇదొక చారిత్రాత్మక ఘట్టమే  అయింది ఆ నాడు .న్యాయం గా పై వారిలో ప్రతిఒక్కరూ ఆనాడు నోబెల్ ప్రైజ్ కు అర్హులే అంతటి కృషి చేసినవారే .కాని ప్లాంక్ కు  ఇవ్వాలన్న దానిలో ఎవరికీ ఆక్షేపణ లేకపోవటం గమనార్హం .

బిరుదులూ ,గౌరవాలు వచ్చి మీదపడుతున్నా అరవై ఏళ్ళకు ప్లాంక్ విచార గ్రస్తుడయ్యాడు.మొదటి ప్రపంచ యుద్ధం ఆయనకు వ్యక్తిగతంగా ,జనసామాన్యానికి కూడా విషాదం మిగిల్చింది .1916 వెర్దాం  యుద్ధం లో ప్లాంక్ పెద్దకొడుకు కారల్ చనిపోయాడు .రెండవ ప్రపంచ యుద్ధం మరీ సంక్షోభం కలిగించింది .రెండవ కొడుకు ఎర్విన్ జర్మన్ టెర్రరిజానికి బలైనాడు.విమాన దాడిలో ప్లాంక్ ఇంటిమీద బాంబులు పడి ,జీవితకాలం అంతా సాధించి దాచుకొన్నఅపూర్వ విలువైన గ్రందాలున్న  ఆయన స్వంత లైబ్రరీఅగ్ని జ్వాలలకు ఆహుతి పోయింది .వీటిని అన్నిటినీ భరించే శక్తి లేకపోయింది .కాస్సెల్ లో లెక్చర్ ఇస్తూ విమానదాడి నుండి రక్షించుకొనే  షెల్టర్లో కొన్ని గంటలు ఉండిపోవాల్సోచ్చింది .1945 మే నెలలో ఒక అమెరికన్ జీపు చూసి ఆయన్ను కాపాడి అమెరికా ఆక్రమిత సురక్షితమైన గూటెన్  బెర్గ్ కు తీసుకొని వెళ్ళింది .ఇక్కడే మాక్స్ ప్లాంక్4-10-1947న 90  జన్మ దినోత్సవానికి  కొన్ని నెలలముందే  ప్రాణాలు విడిచాడు .  సుదీర్ఘకాలం ,ఆదర్శవంతమైన సమర్ధమైన జీఎవితం గడిపాడు ప్లాంక్ .ఆయన  జీవితకాలం లోనే తన క్వాంటం మెకానిక్స్ ఫిజిక్స్ ను డామినేట్ చేయటం చూసి ఆనందించిన అదృష్టవంతుడు ప్లాంక్ .ఆయన క్వాంటం మెకానిక్స్ గగుర్పొడిచే సత్యం .అది భౌతిక శాస్త్రాన్ని ఫిలాసఫీ ని బాలన్స్ చేసి, విశ్వవ్యాప్తమైంది .

పది ఉత్తమ విజ్ఞానశాస్త్ర గ్రంధాలు రచించాడు ప్లాంక్ .’’నమ్మటం అంటే సత్యాన్ని గుర్తించటమే .సైన్స్ అభి వృద్ధి చెందుతున్నకొద్దీ మిరకిల్స్ క్రమక్రమగా వెనకడుగు వేస్తాయి .మత విశ్వాసాలు బాగా ఉన్నా ఏదోఒక దేవుడు అంటే అభిమానం నాకు లేదు ‘’అన్నాడు .ప్లాంక్ నేతృత్వం లో కైజర్ వేల్హాం సొసైటీ నాజీయిజానికి వ్యతిరేకం గా పోరాడలేదు .అమ్మోనియా ను కృత్రిమం గా  ఉత్పత్తి చేసిన జ్యూ  అయిన  హేబర్ శాస్త్ర వేత్త విషయం లో ఉదారంగా వ్యవహరించమని ప్లాంక్ హిట్లర్ ను కోరినా ఆనియంత అంగీకరించలేదు . ఆ తర్వాత .కొన్ని నెలలకే హేబర్ చనిపోయాడు .ఏడాది తర్వాత కైజర్ వేల్హాం సొసైటీ ప్రెసిడెంట్ గా హేబర్ కు తగిన స్మ్రుతి చిహ్నాన్ని ఏర్పరచాడు .ఎందరో జ్యూయిష్ సైంటిస్ట్ లకు తన సంస్థ లో పని చేయటానికి ఒప్పించి పని చేయించిన సమర్ధుడు ప్లాంక్ .1938లో ప్లాంక్ 80వ జన్మ దినానికి ‘’మాక్స్ ప్లాంక్ మెడల్ ‘’ఏర్పాటు చేసి ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ లూయిస్ డీ బ్రొగ్లీ కి ఇచ్చాడు . 38తర్వాత ప్రష్యన్ అకాడెమి  స్వాతంత్ర్యం కోల్పోవటం తో  నాజీల వశమైంది .ప్లాంక్ పూర్వీకులు తాము పదహారవ వంతు జ్యూలం అన్నారుకాని ప్లాంక్ ఒప్పుకోలేదు .

1933లో ప్లాంక్ కు 74 ఏళ్ళ వయసులో జర్మనీలోని ప్లాంక్ కు తెలిసిన ఎందరో జ్యూయిష్ స్నేహితులు ,బంధువులను పదవులనుండి నాజీలు తప్పించాఋ . కొందరు  ఇతర దేశాలకు వెళ్లి పోవటమో జరిగింది .కొందరిని ఒప్పించి సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని నచ్చ చెప్పి  ఇక్కడే పని చేయించాడు .కాని బహిరంగం గా నాజీలను వ్యతిరేకించలేదు .మాక్స్ ప్లాంక్ సోసైటీఏర్పరచి అధ్యక్షుడై నాడు . అదే 83సోసైటీలుగా అభివృద్ధి చెంది ఎన్నో శాస్త్రీయ పరిశోధనలకు నెలవైనాయి.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-9-10-15-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -75

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -75

32-క్వాంటం సిద్ధాంతం కనుగొన్న –మాక్స్ ప్లాంక్

ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఎంతటి బ్రహ్మపదార్ధమో మాక్స్ ప్లాంక్ క్వాంటం దీరీ కూడా అలాంటిదే .జర్మనీదేశం లో కీల్ నగరం లో 23-4-1858న మాక్స్ ప్లాంక్ జన్మించాడు .అతనిజీవితకాలం జర్మన్ సామ్రాజ్య ఉత్తాన పతనాలతో ముడిపడి ఉంది .తండ్రి కాన్స్టి ట్యూషనల్ లా లో ప్రొఫెసర్ .సైన్సుకున్న మానవీయ బాధ్యతలను కొడుక్కి ఎప్పుడూ గుర్తు చేస్తుండేవాడు .దేనినైనా ప్రయోగాత్మక పరిశోధన తోనే నమ్మాలి అని బోధించేవాడు .

యువ ప్లాంక్ మ్యూనిచ్ లోని మాక్సి మిలీనియం జిమ్నేషియంలో లెక్కలు ముఖ్య విషయంగా చదివాడు .చిన్నప్పటినుండి ఈ ప్రపంచం మనిషికంటే ఎదోరకమైన స్వతంత్రాన్ని కలిగి ఉంది అనిపించేది .తండ్రితో బాటు అతని హైస్కూల్ టీచర్ మూలర్ కూడా ప్రోత్సహించాడు .హాస్యాన్ని మిళితం చేస్తూ ఆయన బోధించేవిధానం ప్లాంక్ కు బాగా నచ్చింది .’’కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ‘’ని చాలా చక్కగా ఉదాహరణగా బోధించిన తీరు మర్చిపోలేదు .మూలర్ దాన్ని వివరిస్తూ ‘’ఒక పెద్ద రాయిని కట్టే బిల్డింగ్ మీదకు మనం ఏంతో శక్తి వినియోగించి చేర్చాలి .శక్తి ఎప్పుడూ నశించదు అది దానిలోకొన్నేళ్ళవరకు  నిలవ ఉంటుంది .దురద్రుస్టవశాత్తు అది ఒకవేళ ఏదో ఒక రోజు  అక్కడ పట్టు తప్పి వదులైతే ,దాచుకున్న శక్తినంతా దారినపోయే దానయ్య నెత్తిమీదపడి బుర్ర బద్దలు చేస్తుంది ‘’అని చెప్పాడు ప్లాంక్ ను ప్రభావితం చేసినవాడు మూలర్ .

హైస్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి మొదట మూడేళ్ళు మ్యూనిచ్ యూని వర్సిటిలో, మరో ఏడాది బెర్లిన్ యూనివర్సిటి లో చదివాడు .బెర్లిన్ లో హెల్మ్ హొల్ట్జ్ దగ్గర చేరాడు .ఆయన ఫిజియాలజిస్ట్మాత్రమె  కాక ఫిజిసిస్ట్ కూడా .కాని బోధన ఆకర్షణీయంగా ఉండేదికాదు .ఆయనక్లాస్ అంటే బోర్ అనిపించేది .కాని ఫిజికల్ కెమిస్ట్ అయిన కిర్చాఫ్ ప్లాంక్ కు దేర్మో డైనమిక్స్ పై ఆసక్తికలిగించాడు .అందులో ముఖ్యంగా రెండవ ధర్మో డైనమిక్స్ లా పై అధిక ఆసక్తికలిగించాడు .దీనినే  పరిశోధన  అంశంగా తీసుకొని 1879లో డాక్టరేట్ పొందాడు .ఈ సూత్రమే మిగిలిన పరిశోధనలకు కేంద్రమైంది .అతని తెలివితేటలకు ప్రతిఫలంగా కీల్ యూని వర్సిటి లో 28 ఏళ్ళకే అసోసియేట్ ప్రొఫెసర్  అయ్యాడు .కిర్చాఫ్ మరణం తర్వాత బెర్లిన్ యూనివర్సిటిలో’’ ప్రొఫెసర్ ఎక్స్ట్రా ర్డినరస్ ‘’అయిపోయాడు .

1879 నుండి 1899 వరకు ఇరవై ఏళ్ళు ప్లాంక్ ‘’దేర్మల్ రేడియేషన్ ‘’సమస్యపై తీవ్రంగా పరిశోధనలు చేశాడు .అప్పటికి తెలిసిన విషయం ఏమిటి అంటే వేడివస్తువులు ఉష్ణ వికిరణం(రేడియేషన్ ) చేస్తాయి..ఉష్ణం ఇంకాపెరిగితే కాంతిని వెదజల్లుతాయి..వేడి ఎక్కువైతే ఈ కాంతి కనపడని ఇన్ఫ్రా రెడ్ నుండి ,కా౦తి హీన ఎరుపుకు , సిందూరం ఎరుపుకు (స్కార్లెట్ ) చివరికి పసుపు రంగు కు మారుతుంది .ఇంకా వేడి ఎక్కువైతే ‘’తెల్లని వేడి ‘’(వైట్ హాట్ )గా మారతాయి .ప్రతి ఉష్ణోగ్రత వద్ద వెలువడే రేడియేషన్ ను ప్రిజం (పట్టకం )ద్వారా విశ్లేషించ వచ్చు.అది కొన్ని రంగుల సమూహం గా ,ప్రతి రంగుకు ఒక నిర్దిష్ట వేవ్ లెంగ్త్ (తరంగ దైర్ఘ్యం )తో వెలువడుతుంది .ఉదాహరణకు ఒక ఇనప ముక్కను ఇలా పసుపు రంగు వచ్చేదాకా వేడి చేస్తే,అప్పుడది నిజంగానే రెడ్ ,ఆరంజ్ ,ఎల్లో ,గ్రీన్ బ్లూ రంగులసముదాయాన్ని ఇస్తుంది అందులో గ్రీన్ బ్లూ చాలా తక్కువ కాంతితో ఉంటె ఎల్లో చాలా ప్రకాశామానంగా ఉంటుంది .

కిర్చాఫ్ శాస్త్ర వేత్త ఇలా కనిపించే రంగులనేకాక ,రంగులపంపకం ఉష్ణం మీదనే తప్ప పదార్ధం మీద ఆధారపడి ఉండదు అని కనుక్కున్నాడు .ఈ స్వతంత్రం టెంపరేచర్ ,వేవ్ లెంగ్త్ లకే చెందిన ఒక ప్రక్రుతి సిద్ధాంతానికి దారి తీసింది .  దీనిపై చాలాపరిశోధనలు జరిగాయి సిద్ధాంతాలు వచ్చాయి .కలర్ డిస్ట్రిబ్యూషన్ విషయం లో ఏదైనా ఫార్ములా ఉండి ఉండాలని అనిపించింది ఈ డిస్ట్రిబ్యూషన్ వర్ణమాల (స్పెక్ట్రం )లో ఏదో కొద్ది మేర కే ఉన్నట్లు గమనించారు .

ఇప్పుడు మాక్స్ ప్లాంక్ ఒక కొత్త సూత్రం కనిపెట్టే పనిలోమునిగిపోయాడు . బ్లాక్ బాక్స్ అంటే బోలు గా ఉండే వస్తువు రేడియేషన్ పై పరిశోధన సాగించాడు . .దాన్ని వేడి చేస్తే దాని లోపలి ఒకవైపు గోడలు రేడియేషన్ ను వెదజల్లితే ,ఎదురుగా ఉండే గోడలు రేడియేషన్ ను హరి౦చి (అబ్సార్బ్ )నట్లు గమనించాడు .ఈ బ్లాక్ బాడీ లేక కేవిటీ రేడియేషన్ కోసం ‘’మెథడ్ ఆఫ్ లిమిట్స్ ‘’ను ఉపయోగించక  తప్పదను కున్నాడు .ఇదిఫిజిక్స్ ,లెక్కలలో  బాగా శక్తివంతమైన ఆయుధం వంటిది .ఎప్పుడైతే సూటిగా  గణనకు (కంప్యుటేషన్ )కండిషన్లుఉపయోగపడవో అప్పుడే దీన్ని సంజీవినిలాగా వాడుతారు .ఇది ఒక కృత్రిమ నియమాన్ని (కండిషన్ )ను ఏర్పరచి మనం సాధించాలనుకొనే ఫలితానికి తోడ్పడుతుంది .అప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా వస్తంది .ఇందులో అవాస్తవిక ఊహ (ఫాల్స్ అస్స ప్షన్ )కూడా ఉంటుంది .క్రమంగా క్రుత్రిమతను తగ్గించుకుంటూ సున్నా దాకా పోతారు.అప్పుడు మనం కోరుకొనే ఫార్ములా వస్తుంది అందులో కల్పించిన కృత్రిమత ఉండదు .ఇదేసరైన మాధానం గా అన్ని పరీక్షలకు తట్టుకొని నిలబడుతుంది.

ప్లాంక్ బ్లాక్ బాడీ రేడియేషన్ నిరంతర ప్రవాహం అని ,ప్రతిరంగు శక్తితో ఉంటుందని నమ్మాడు .ఇక్కడే ప్లాంక్ పొరబడ్డాడు .నిరంతరరేడియేషన్  ప్రవాహం గా కనిపించేదానిలో .చిన్న చిన్న శక్తి విస్ఫోటనాలు (బరస్ట్)ఉన్నాయి  .ప్రతి విస్పోటనాకికి నిర్ణీత శక్తి ఉంటుంది .ముందు ఫార్ములా సాధించి తర్వాత వీటి సంగతి చూద్దాం అనుకొన్నాడు .చివరికి ప్లాంక్ ఫార్ములా ఖచ్చితంగా ప్రయోగాత్మక కొలతలకు సరిపోయింది  .ఈ దశలో కొందరు శాస్త్ర వేత్తలు తమ కృత్రిమ ఊహలు నిజంగానే నిజమయ్యాయని భావించారు .కాని ప్లాంక్ పిరికి వాడుకాదు .తన పరిశోధన కృషిలో ,ప్రామాణికత పై అపార నమ్మకమున్నవాడు .అందుకే అన్ని రేడిఎంట్ ఏనర్జీలు విస్ఫోటనాలుగానే ,వాటివాటి నిర్దిష్ట శక్తిప్రమాణాలతో ప్రయాణం చేస్తాయి అని గట్టిగా చెప్పాడు .నిజం గా ప్రతి రంగుకు ఎనర్జీ ఫిక్స్ అయ్యే ఉంది .అది hc/lamda కు సమానం .ఇందులో’’ c’ అంటే కాంతివేగం ‘’,లామ్డా’’ అంటే ప్రతిరంగుకు ఉండే వేవ్ లెంగ్త్’’ ,h’’అంటే యూనివర్సల్ కాన్స్తంట్ ఆఫ్ నేచర్ .ఇప్పుడు దీన్నే ‘’ప్లాన్క్స్ కాన్స్టంట్’’అంటున్నారు .ఈ గణిత సూత్రానికి భావం ఏమిటంటే –నియాన్ బల్బ్ లోని వేడి ఆటం ఒక బ్లూ విస్ఫోటనం ఇవ్వటానికి ,రెడ్ లైట్ ఇవ్వటానికంటే  ఎక్కువ ఎనర్జీ ని తీసుకొంటుంది .కారణం బ్లూ లైట్ కి వేవ్ లెంగ్త్ తక్కువ .దీనిని బట్టి కొంత ఎనర్జీ ఉన్న ఆటం దొరికితే ,ఒకే రంగుగల కాంతిని వెలువరించ వచ్చు .ఇది పిండితార్ధం .

అంతకుముందే ప్రేరణ పొందిన(ఎక్సైటేడ్) ఆటం పదార్దాన్నిబట్టి రంగులను వెలువరిస్తుందని , సోడియం వేపర్ కు దట్టమైన పసుపు రంగు ,స్వచ్చ నియాన్ ఎరుపురంగు ,మెర్క్యూరీ వేపర్ పర్పుల్ కలర్ ఇస్తాయని తెలుసుకొన్నారు .ఇప్పుడు ఈ పరిశోధనవలన ఆటం స్పెక్ట్రం ను చూసే అవకాశమేర్పడింది .వేవ్ లెంగ్త్ కు ఎనర్జీ కి ఉన్న సంబంధం వలన అయిన్ స్టీన్ ఫోటోఎలేక్త్రిక్ ప్రభావ సూత్రం  కనిపెట్ట్టాడు .దీనితో ఘనపదార్ధాలఉష్ణ గ్రాహక శక్తిని కొలవగాలిగారు ఎక్స్ రేస్ ను ఖచ్చితం గా  నియంత్రించ గలిగారు .సరైన కెమికల్ రియాక్షన్ సమయాలను  గణించ గలిగారు  .

ఈ భిన్నమైన శక్తి స్వభావాలు అంటే ‘’క్వాంటి జేషన్ ‘’లను పదార్ధానికి ,రేడియేషన్ కూ అప్ప్లై చేశారు .దీనితో ‘’వేవ్ మెకానిక్స్ ‘’ఏర్పడి కాంతి తరంగాలకు ఉన్న భిన్న స్వభావాలు అటామిక్ కణాలకూ ఉంటాయని తెలిసింది .మరింత పరిశోధనా ఫలితంగా రేడియో యాక్టివిటి పై మరింత విజ్ఞానం లభించి,న్యూక్లియర్ రియాక్షన్ లను ఊహించి(ప్రేడిక్ట్ )చేసి  చెప్పగలిగారు..ట్రాన్స్మిటర్లను  డిజైన్  చేయగలిగారు . ఇంకొంచెం ప్రగతి సాధించి ‘’హీజేన్ బెర్గ్ అన్ సర్టెన్ ప్రిన్సిపుల్ ‘’కు చేరుకొన్నారు .పదార్ధం లోని కణాలు తరంగాలకుండే ధర్మాలు కలిగిఉంటాయని తేలింది .కాని దాని స్థానం ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేక పోయారు .సరస్సులో నీటి తరంగాలుగా ఉంటాయేతప్ప ఒకే చోట ఉంటు౦దని అనిపించలేదు .ఈ విషయాన్నే ‘’అన్ సర్టేనిటి ప్రిన్సిపుల్ ‘(అసం భావ్యత సూత్రం  )చెప్పింది .కొన్నిసబ్  అటామిక్ పార్టికల్స్ లో ఈ లక్షణం ఉంది .దీని ఫిలసాఫికల్ ప్రాముఖ్యం మాత్రం బాగా విస్తరించింది .

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-10-15-ఉయ్యూరు

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చేతులు కాలక ముందే(కవిత) – శీలా సుభద్రాదేవి

చేతులు కాలక ముందే(కవిత) – శీలా సుభద్రాదేవి

అమ్మ బొజ్జలో నుండి బయట పడుతున్నప్పుడే
ఒక పిడికిట్లో జీవితాన్ని
మరో పిడికిట్లో ఆశల్నీ
భద్రంగా బిగించి పట్టుకొంటుంది పసికందు
ఎప్పుడో తనకి తెలీకుండానే
చేతినుండి జారవిడుచుకొన్న జీవితం
క్రమక్రమంగా మరొకరి అధీనంలోకి పోతుంది
ఆశలూ అంతే !
స్వంత జీవితం , స్వంత ఆలోచనలూ లేనిదైపోతూ
తనది కాకుండా మిగిలిపోతుందని తెలిస్తే
పిడికిలి విప్పెదికాదేమో
ఇప్పుడు ఎంత భద్రంగా దోసిట్లో బంధించి
తనదైన జీవితాన్ని గుండెల్లో దాచేసుకుందా మనుకొన్నా
వేళ్ళ సందుల్లోంచి జారిపోతూనే ఉంటుంది
మనిషి సంఘజీవికదా
సాంప్రదాయాలూ సాంఘిక వలయాలతో
మన చుట్టూ కంచెల్ని బిగిస్తూనే ఉంటుంది సంఘం
జీవించాలనుకోవటం వేరు
జీవించటం వేరు
జీవన విధానంలోనే మనసు వికసితం అవుతుంది
సమస్యల ముళ్ళ తీగల మధ్య నుండి
గాయపడకుండా నడవటంలోనే –
ఆర్ధిక సుడిగుండాల మధ్య కూరుకుపోకుండా
ప్రణాళిక బద్ధంగా బతకటంలోనే –
మనసును మండించే మూఢ నమ్మకాల జ్వాలల్లో నడుస్తూ
వ్యక్తిత్వం బయటపడుతుంది
అమూల్యమైన జీవితాన్ని
ఆరుబయట సుడి గాలుల పాల్చేసి
కన్నుమలిగే క్షణం లో ఎంత దుఃఖిస్తే మాత్రం
మిగిలేది శూన్యమే

– శీలా సుభద్రా దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కృష్ణ గీత – నిషేధం- క్రిష్ణ వేణి

కృష్ణ గీత – నిషేధం- క్రిష్ణ వేణి

సినిమాలు, పుస్తకాలు, పాటలూ..అన్నిటిమీదా బ్యానే.
మహారాష్ట్రాలో బీఫ్ నుంచీ, గుజరాత్లో బ్యాన్ చేయబడిన ‘ఫనా’, ‘ఫిరాక్’ మరియు ‘పర్జానియా’ వంటి సినిమాలేకాక ‘ద విన్సీ కోడ్’, ‘ద బ్లాక్ ఫ్రైడే, ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ వంటి సినిమాలనుంచీ సాతానిక్ వెర్సస్ లాంటి పుస్తకాలవరకూ మన దేశంలో ఏవి బ్యానుకి అనర్హం కాలేదు కిందటి రెండు సంవత్సరాలలో? .

‘ముహమ్మద్-దేవుని దూత’ అన్న ఇరానియన్ సినిమా పట్ల అభ్యంతరం తెలుపుతూ, ఆ ప్రోజెక్టులో జోక్యం ఉన్నవాళ్ళందరి మీదా- ముంబైకి చెందిన ర‌జా అకాడ‌మీ (సున్నీ ముస్లిం సంస్థ) ఫత్వా జారీ చేసింది. ఫత్వా జారీ చేయబడినవారిలో, మ్యూజిక్ కంపోసర్ ఏ ఆర్ రహ్మాన్ మరియు ఆ సినిమా తీసిన మజిదీ కూడా ఉన్నారు. “నేను పాశ్చాత్యదేశాల్లోనూ తూర్పు దేశాల్లోనూ కూడా ఉంటాను. ఎవరినీ తీర్పు తీర్చకుండా అందరినీ ప్రేమించడానికి ప్రయత్నిస్తాను.” అని చెప్తూ, తను “ఏ హానీ కలిగించే ఉద్దేశ్యంతో మ్యూజిక్ కంపోస్ చేయలేదని” ఆస్కార్ విజేత రహ్మాన్ తన ఫేస్‌బుక్ పేజీ మీద రాశారు.
ఫత్వా జారీ చేయడానికి ఒక ప్రక్రియ అంటూ ఉంటుంది. ఎవరికి పడితే వారికి ఫత్వా జారీ చేసే హక్కుండదు. అది వేరే సంగతనుకోండి.

11111111111111111111

మన సినిమాలు కానీ, టివి సీరియళ్ళు కానీ, పాటలు కానీ- స్టీరియో టైపులో ఉన్నంతకాలమూ ఏ బెంగా లేదు. కానీ ఏదైనా సున్నితమైన లేక గంభీరమైన అంశం గురించి ఎవరైనా మాట్లాడే ధైర్యం చేసిన క్షణం, అది మనకి మింగుడు పడదు. ఆ సినిమా లేక సీరియల్ని తీసిన వ్యక్తి ప్రమాదంలో పడకనూ మానడు.

‘సైనిక్ తులే నౌ హతియార్’ అన్న బెంగాలీ పాటని సలీల్ చౌదరీ All India Tripartite Land Reform Movement పర్యంతం కంపోస్ చేసి పాడారు. రైతులు తమ ఆయుధాలని చేబట్టి తమ భూమిని తిరిగి చేజిక్కించుకొమ్మంటూ ప్రేరేపిస్తుందా పాట. అప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో, ఆ ఆల్బమ్నే బ్యాన్ చేసేరు.

ఢిల్లీ గాంగ్ రేప్‌లో నిందితుడైన ముకేష్ సింగ్ ఆలోచనాధోరణిని చూపించిన లెస్లీ ఉడ్విన్ తయారు చేసిన డాక్యుమెంటరీ “ఇండియాస్ డాటర్‌” ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. పోలీసుల పర్యవేక్షణ ఉంటే తప్ప పార్టీలకి ఫారెన్ ఇన్వైటీస్ రావడాన్ని కర్నాటకా ప్రభుత్వం బ్యాన్ చేసింది.

ప్రపంచంలో అధిక పట్టణాలు సైకిల్ తొక్కమని ప్రోత్సహిస్తుంటే, కొలకత్తాలో 62 వీధుల్లో సైకిళ్ళు నడపకూడదు.
ప్యూగో కార్ అడ్వర్టైసుమెంటుని ప్రభుత్వం బ్యాన్ చేసింది. వీడియో చూడండి.

బ్యాన్ చేశిన ‘చాంద్ బుఝ్ గయా’( చంద్రుడు మరుగయేడు) అన్న ఫాయెజ్ అన్వర్ ఫిల్మ్‌- ఒక హిందూ యువకుడూ మరియు ఒక ముస్లిమ్ యువతికీ మధ్య ఉన్న ప్రేమ కథ గురించినది. గుజరాత్ అల్లర్లలో వారి జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. ఆ సినిమాలో వయొలెన్సూ, కొన్ని అమానవీయమైన సీన్లూ ఉన్నాయి. అంతేకాక కొన్ని కారెక్టర్లు నిజజీవితపు కొంతమంది మనుష్యులని పోలి ఉండాలి.

“ఆంధీ” మరియు ‘కిస్సా కుర్సీకా” అన్న సినిమాలు ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తీసినవన్న అనుమానంతో అప్పుడు వాటిని బ్యాన్ చేశారు. ఈ సినిమాల లిస్ట్ సమగ్రమైనది కాదు కానీ ఇది tip of an iceberg మాత్రమే. ఇప్పుడు “లెస్బియన్” అన్న మాట మీదా బ్యానే.

2014 మార్చ్‌లో ‘గుర్బాణీ’ అనే ఒక సీరియల్ ప్రారంభం అయింది. ‘గుర్బాణీ’ అన్న మాటకి ఒక సిక్కు జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంటుందనీ, ఆ మాటని కేవలం సిక్కు గురూల భక్తిగీతాల కోసం మాత్రమే ఉపయోగించాలని శిరోమణీ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అభ్యంతరం తెలిపింది. అప్పుడు ఆ సీరియల్ పేరు మార్చి ‘బాణీ’ అని పెట్టేరు.

మనం ప్రజాస్వామిక సమాజంలో జీవిస్తున్నాం. దేన్ని పడితే దాన్ని బ్యాన్ చేయడం కుదరదు. ఎప్పుడైతే ఏదైనా బ్యాన్ చేయబడుతుందో, జనులు దాన్ని చట్టవిరుద్ధంగా –అడ్డదారుల్లో, పొందాలనుకుంటారు.
ఏ బ్యానైనా పౌరుల స్వేచ్ఛని ఎంతో కొంత ఆరి కడుతుంది.
సమాజాలకి కొన్ని విలువలు ఉంటాయి. స్వేచ్ఛ వాటిల్లో ఒకటి.

బ్యాన్ చేయడంలో భారతదేశం అగ్రగామి అవుతున్నట్టుంది. పాశ్చాత్య దేశాల ప్రభావం నుంచి భారతదేశాన్ని రక్షించడానికి మన ప్రభుత్వం చాలా పాటు పడుతున్నట్టుంది.

బ్యాన్ల మీద కేంద్రీకరించే బదులు దేశం ఎదురుకుటున్న ఇతర సామాజిక/ఆర్థిక అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెడితే, మరిన్ని ఫలితాలు కనిపిస్తాయేమో! ప్రజాస్వామ్యం మరియు స్వేచ్చానుసార చిత్తం అన్న అభిప్రాయాలు మన మనస్సుల్లో ఇంకి ఉన్నాయి. కానీ ఈ బ్యాన్లు మన చర్యలనీ, మన ఆలోచనలనీ నిర్బంధిస్తున్నాయి.

పబ్లిక్లో యూరినేట్ చేయడం నిషేదం కాదు. పార్న్ మీద బ్యాన్ లేదు.
బ్యాన్ చేయాలంటే, బాల్య వివాహాలూ, రేప్ చేయడాలూ, గృహహింసా, చైల్డ్ లేబర్ –ఇలాంటివన్నీ కనబడవెందుకో మన ప్రభుత్వానికి!

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మరియు ఎక్ప్రెషన్ అన్నది తన్ని తాను స్వేచ్ఛగా- నోటి మాట ద్వారాకానీ, లిటరేచర్ ద్వారా కానీ కళ ద్వారా కానీ లేక సమాచార ప్రసారం యొక్క ఇంకే ఇతర మాధ్యమం ద్వారానైనా వ్యక్తపరచగలగడం అన్న భావం.
I disapprove of what you say but I will defend to the death your right to say it- Voltaire

– క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి

అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి – గబ్బిట దుర్గాప్రసాద్

అన్నిటా ప్రధమంగా నిలచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి

మగవారికాలేజిలో చేరిన మొదటి అమ్మాయి ,మొదటి మహిళా హౌస్ సర్జన్ ,బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి మహిళా లేజిస్లేట,ర్ ,రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డ్ కు మొదటి చైర్ పర్సన్ ,శాసనమండలి మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్, మద్రాస్ కార్పోరేషన్ మొదటి ‘’ఆల్డర్ వుమన్ ‘’ఇలా అన్నిటా ప్రధమంగా నిలిచిన డాక్టర్ ముత్తు లక్ష్మి రెడ్డి ని గురించి తెలుసుకొందాం .

బాల్యం –విద్య:
మద్రాస్ రాష్ట్రం లోని పుదుక్కోట సంస్థానం లో 30-6-1886లో ముత్తులక్ష్మి జన్మించింది. తండ్రి నారాయణ సామి .తల్లి చంద్రమ్మాళ్ .ఆ కాలం లో మహిళలపై ఆంక్షలు ఎక్కువగా ఉండేవి . . తండ్రి నారాయణ సామి మహారాజా కాలేజి ప్రిన్సిపాల్ .చాందస భావాలకు వ్యతిరేకి .అందుకే కూతురు చదువుకు ప్రోత్సహించాడు .యవ్వన దశలో స్కూల్ మాన్పించినా ఇంటి దగ్గర ట్యూటర్ లనుపెట్టి విద్య నేర్పించాడు .కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేస్స్తోంది తల్లి .తాను అందరిలాగా ఉండదలచుకోలేదని తన ప్రత్యేకతను చాటుకోవాలను కొంటున్నానని తల్లికి నిర్మోహ మాటం గా చెప్పింది .మగవాళ్ళ చెప్పు కింద తేలు ల్లాగా పడి ఉంటున్న స్త్రీ జనాన్ని చూసి సానుభూతి ప్రకటించేది .వారికి విముక్తి కలగాలని కోరుకొనేది .మగ పిల్లలకే చదువు ఆడవారు చదువుకోకూడదు అనే దాన్ని బాహాటంగా వ్యతిరేకించింది .మెట్రిక్ పాసై మహారాజా కాలేజిలో చేరటానికి దరఖాస్తు చేస్తే కాలేజిప్రిన్సిపాల్, మగ విద్యార్ధుల తలిదండ్రులు తిరస్కరించారు . .మగ పిల్లల కాలేజిలో ఆడపిల్ల చేరితే వారినిఅనైతికంగా ప్రలోభ పెట్టి విద్యా వ్యవస్థను కలుషితం చేస్తుందని వాళ్ళ భయం .ఆమె స్త్రీకావటం ఒకటి ఆమె తండ్రి ఆధునిక భావాలు కలవాడుకావటం మరోటీ కారణాలుగా వారికి కనిపించాయి .కాని ఇలాంటి సంకుచితభావాలకు అతీతుడైన పుదుక్కొట మహారాజు ప్రిన్సిపాల్ అభ్యంతరాన్ని తోసిరాజని ముత్తులక్ష్మి ని కాలేజిలో చేర్చుకోవటమే కాకుండా ఆమెకు స్కాలర్షిప్ మంజూరు చేశాడు ..తండ్రికి ఆమె స్కూల్ టీచర్ కావాలని ఉండేది. కాని ఆమె కు ఇంకా ఉన్నత ఆశయాలు౦డేవి .
డాక్టర్ ముత్తు లక్ష్మి

ఉన్నత విద్య పూర్తీ చేసి 1907లో మద్రాస్ మెడికల్ కాలేజి లో చేరింది .అక్కడ అన్నిటా ప్రధమంగా నిలిచి తన ప్రతిభను ప్రదర్శించింది .ఎన్నో బంగారు పతకాలను ,ప్రైజ్ లను సాధించింది .1912లో మెడిసిన్ పాసై భారత దేశం లో మొదటి మహిళా వైద్యులలో ఒకరుగా నిలిచింది . మద్రాస్ లోని ప్రభుత్వ మహిళా శిశు వైద్య శాలలో హౌస్ సర్జన్ అయింది .డాక్టర్ సుందర రెడ్డి ని తనకు సమాన గౌరవం కలిగిస్తానని ,తన మనోభీస్తానికి ఎన్నడూ వ్యతిరేకంగా నడుచుకోనని ఆయన నుండి హామీ పొంది ,తన వ్యక్తిత్వాన్ని చాటుకొని1914లో 28 వ ఏట వివాహం చేసుకొన్నది .ప్రసిద్ధ తమిళ హీరో శివాజీ గణేశన్ కు మేనత్త ముత్తులక్ష్మి .అతనికి ఆదర్శ౦ ఆమె అని ఆతను చెప్పుకొన్నాడు .

రాజకీయ అరంగేట్రం:
కాలేజీలో చదివే రోజుల్లో సరోజినీ నాయుడు ఏర్పాటు చేసిన మహిళా సభలకు హాజరై ఉత్త్తేజితురాలైంది ముత్ట్టు లక్ష్మి ..స్త్రీ హక్కులకోసం సరోజినీ చేస్తున్న ఉద్యమాలకు సహకరించింది .తరువాత .అనిబి సెంట్ ,మహాత్మా గాంధీల ప్రభావానికి లోనైంది .ముత్తులక్ష్మిని స్త్రీ శిశు సంక్షేమం కోసం కృషి చేయమని వారు ఆదేశించారు .మహిళలు ఇంటి నాలుగు గోడలకే పరిమితం కా కూడదని ఆమె విస్తృతంగా ప్రచారం చేసి వారిలో మార్పు తెచ్చింది .

ఇంగ్లాండ్ వెళ్లి ఉన్నత విద్యనేర్చింది . డాక్టర్ ప్రాక్టీస్ వదిలి ‘’వుమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ‘’ వారి అభ్యర్ధన మేరకు మద్రాస్ రాష్ట్ర శాసనమండలి కి శక్తి హరిహరన్ చేత 1926లో నామినేట్ చేయబడింది . ఇండియా మొత్తం మీద శాసన సభలో ప్రవేశించిన మొట్టమొదటి మహిళగా రికార్డ్ కెక్కింది .తర్వాత డిప్యూటీ చైర్ పర్సన్ గా .ఏకగ్రీవంగా ఎన్నుకో బడింది .ప్రపంచలో నే మొట్ట మొదటి లెజిస్లేచర్ మహిళా డిప్యూటీ చైర్మన్ గా గుర్తింపు పొందింది .’’.మహిళలకు మునిసిపాలిటీ శాసన సభలలో ఓటు హక్కు ఇవ్వాలని గొప్ప ఉద్యమం చేసింది ..’’దేవ దాసి’’వ్యవస్థను నిర్మూలించటానికి .కనీస వివాహ వయస్సును పెంచటానికి ఆమె కృషి అనితర సాధ్యం .మహాత్మా గాంధిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసింది .

సంఘ సంస్కర్త:
.అనాధలు అంటే ఆమె హృదయం ద్రవించేది .మరీ బాలికా అనాధలంటే విపరీతమైన ఆదరణ చూపించింది .అనాధలకు ఉచిత వసతి భోజనాలకోసం ‘’అవ్వై హోమ్’’ను మొట్టమొదటిసారిగా మద్రాస్ లో స్థాపించిన వితరణ శీలి ముత్తులక్ష్మి .ఎన్నో సాంఘిక సమస్యలపై,సంస్కరణ లపై గ్రంధాలు రాసింది .’’శాసనమండలిలో నా అనుభవాలు ‘’అనే పుస్తకం లో తన సేవాకార్యక్రమాలను వివరించింది .స్త్రీ శిశు హాస్పిటల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే తీర్మానం తెచ్చి పాస్ చేయించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రసూతి ఆస్పత్రిలో ప్రత్యేక హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది .స్థానిక సంస్థలు ,మునిసిపాలిటీల చేత నడుపబడే విద్యాలయాలలోని విద్యార్ధులకు తరచుగా క్రమపద్ధతిలో వైద్య పరీక్షలు నిర్వహించేట్లు చేసింది .ట్రిప్లికేన్ లోని ‘’కస్తూరిబాయి హాస్పిటల్ ‘’ముత్తు లక్ష్మి అకుంఠిత దీక్షా ఫలితమే .

అఖిల భారత మహిళా సభకు ముత్తు లక్ష్మి అధ్యక్షురాలిగా ఎన్నుకో బడింది .వేశ్యా వ్రుత్తి నిర్మూలనకు ,అనైతికంగా స్త్రీ బాలికలను అవమాన పరచటానికి బిల్లు పాస్ చేయించింది .వేశ్యాగృహాల చెర నుండి విముక్తులైన స్త్రీల కోసం ఒక బోర్డింగ్ హోం ను ఏర్పాటు చేసిన దయామయి .ముస్లిం బాలికలకోసం ఒక ప్రత్యేక హాస్పిటల్ ను స్థాపింప జేసింది .హరిజన విద్యార్ధినులకు స్కాలర్ షిప్ లు మంజూరు చేయించిన ఘనత ముత్తు లక్ష్మిది .మగవారికి 21 ఏడాది వరకు ఆడపిల్లలకు 16వ ఏడాది వరకు వివాహం చేయరాదని శాసనం చేయాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది .

ఇవికాక ఆమె ఎన్నో విధాలుగా ప్రజా సేవ చేసి ధన్యురాలైంది .’’కేన్సర్ రిలీఫ్ ఫండ్ ‘’ను ప్రారంభించింది . 1935 లో ‘’కేన్సర్ రోగులకు హాస్పిటల్ ‘’కట్టాలని ఉంది అని ప్రకటించింది .ఎందరో దాతలు వదాన్యులు విరాళాలలతో ముందుకు వచ్చారు .1952లో ‘’అడయార్ కేన్సర్ ఇన్ ష్టి ట్యూట్’’ కు ‘’శక్తి హరిహరన్ ‘’శంకు స్థాపన చేశాడు .18-6-1954నుండి అది పని చేయటం ప్రారంభించింది .ఇండియాలో రెండవ పెద్ద కేంద్రంగా దీనికి గుర్తింపు వచ్చింది .ఈ నాడు ప్రపంచ ప్రసిద్ధమై ఏటా 80,000 మంది కేన్సర్ వ్యాధి గ్రస్తులకు ఆశా దీపంగా భాసిస్తోంది . అడయార్ లోని వట వృక్షంగా ఈ సంస్థ అభివృద్ధి చెంది కేన్సర్ రోగులపాలిటి సంజీవని అయింది ధన్య చరిత్ర ఆమెది .

సాంఘిక సంక్షేమ  శాఖ కు మొదటి చైర్ పర్సన్ అయింది ముత్తులక్ష్మి .భారత దేశం లో విద్యాభి వృద్ధిని అధ్యయనం చేసి సలహాలిచ్చే ‘’హార్టాగ్ ఎడ్యుకేషన్ కమిటీ ‘’లో సభ్యురాలై విలువైన సూచనలు అందజేసింది .ఈ కమిటీ తరఫున భారత దేశం అంతా పర్య టించి స్త్రీ విద్యా వ్యాప్తి అభి వృద్ధిని గమనించింది ..ఈ కమిటీలో ముత్తులక్ష్మి ఒక్కరే మహిళా సభ్యురాలు .అలాంటి అరుదైన గౌరవం ఆమెకు దక్కింది .ఈ కమిటీ సలహాలు పాటించి ప్రభుత్వం ఎన్నో అభి వృద్ధి పధకాలను ప్రవేశ పెట్టి మహిళా విద్యకు దోహదం చేసింది .అఖిలభారత మహిళా సమాఖ్య తరఫున ప్రచురించే ‘’రోషిణి’’పత్రికకు సంపాదకురాలుగా సమర్ధంగా పని చేసింది .మహిళాభి వృద్ధికోసం జీవితాంతం పోరాడిన దీరోచిత మహిళా మాణిక్యం ముత్తు లక్ష్మీ రెడ్డి .ఎన్నో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగిన ఆమె వ్యక్తిత్వం అమోఘం .80ఏళ్ళ వయసులో కూడా ఆమెలో చైతన్యం పొంగి పోర్లేది .రాజకీయాలలో ఉన్నా స్త్రీ జాతి సేవను మరచిపోలేదు. ఆమెది మహాత్ముని శాంతి అహింసా మార్గం . పారిశుధ్యం తో కూడిన మరుగు దొడ్లను ,అందులో ప్రత్యేకం గా స్త్రీలకూ వేరుగా ఏర్పాటు చేయటానికి తీవ్ర కృషి చేసి సాధించింది .మురికి వాడలలో నివసించే పేదప్రజలకు వైద్య సదుపాయాలను కలిగించిన మహోదయురాలు.

ముత్తు లక్ష్మి చేసిన విశిష్ట సేవలకు కేంద్ర ప్రభుత్వం1956లో ‘’పద్మ భూషణ్ ‘’గౌరవాన్నిచ్చి సత్కరించింది .ముత్తు లక్ష్మిని చిరస్మరణీయం చేసిన జీవన సాఫల్యాలు ‘’అవ్వై హోం’’ మరియు ‘’కేన్సర్ ఇన్ ష్టిట్యూట్’’లు అనే రెండు గొప్ప సంస్థలు .82 ఏళ్ళు సార్ధక జీవితం గడిపి ,ప్రజా సేవలో పునీతురైన డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డి 22-7-1968 న స్వర్గస్తురాలైంది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

 

Posted in రచనలు | Tagged | Leave a comment

యాభై ఏళ్ళ ప్రతిజ్ఞా పాలన

Inline image 1Inline image 1
Inline image 2
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అడ్డుకొంటే ఇంటినే కాల్చారు మరియు అమానుష దాడి

Inline image 1
Inline image 2
గబ్బిట దుర్గా ప్రసాద్

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’-3(చివరి భాగం )

తెనాలివారి ‘’బాపు రస రేఖ  ‘’-3(చివరి భాగం )

బాపు ముఖ్య శిష్యుడు ,ప్రముఖ చిత్రకారుడు శ్రీ మోహన్ ‘’బాపు గారుతెన్నేటి సూరి నవల చెంగిజ్ ఖాన్ కు వేసిన అట్టమీది బొమ్మ గుర్రం మీద వీరావేశం తో ఖాన్ మంగోలియన్ కళ్ళూ ,,మీసాలు వెనక మంగోలియన్ డిజైన్ కళ్ళు తిరిగే రంగులు ,,మబ్బుల్లోకి ఎగిరిపోయే గుర్రం వెన్ను మీంచి తోక దాకా సర్ర్రున దూసిన గీత ‘’పరమాద్భుతం అన్నాడు .ఇది నచ్చని విశాలాంధ్ర బాస్ జోషి మంగోలియన్ వాతావరణం రాలేదని బాపు తో చెబితే మళ్ళీ వేస్తానన్న నిగర్వి .చెట్టంత ఆర్టిస్ట్ అయి ఉండీ మళ్ళీ వేస్తాను అంటం ఏమిటి అని మోహన్ ఆశ్చర్య పోయాడు .బాపు ను బొమ్మలు వేస్తుండగా చూస్తె ‘’బొమ్మలు గీసే మనిషిలా కనిపించడు.వాటి ఘోస్ట్ పెన్ మెన్ ‘’లా అనిపిస్తాడు .బాపు బొమ్మల ప్రభావం గురించి చెబుతూ మోహన్ ‘’ఆంద్ర పత్రికా ,ప్రభలు మోసుకొచ్చిన బొమ్మలు మా చెంపలు వాయించాయి .చాచి మరీనూ –మీరు చాతకాని వేర్రినాగమ్మలు అంటూ చాలెంజ్ చేశాయ్.నాతొ బాటు బోల్డు మంది ఆర్టిస్ట్ లకు మూడు దశాబ్దాలపాటు ఈ బాపూ భూతం మాకు౦చె ల్ని వెంటాడి ,వేధించి నానా రొస్టూపెట్టాయి .ఆయనలాగా వేయాలని మా ఆరాటం ,ఆయనలాగా వేయకుండా ఉండటానికి పోరాటం .మేము మా లాగా గీయాలని తపన .ఆయన్ను దాటిపోవాలని అత్యాశ .బాపు పార్టీలో చేరి సభ్యత్వ రుసుం చెల్లించి ‘’హోలీ టైమర్లు’’గా పని చేశాం .ఇలా ఆర్ట్ పార్టీ పెట్టిన సంగతి బాపుకు తెలీదు .ముప్ఫై ఏళ్ళు గడిచాక బాపు ఒపీనియన్ చేంజ్ చేసి పార్టీ ఫిరాయించి గ్లామరస్ సినీ పార్టీలో చేరిపోయారు .మేమంతా పత్రికల న్యూస్ ప్రింటుకి బల్లుల్లా అతుక్కు పోయి బతుకు తున్నాం .మాలో అరడజను మంది ఆయన్ను ఓవర్ టేక్ చేసి ఉండాల్సింది .50లలో ఆయన తెచ్చిన విప్లవాన్ని 80లలో మేము తెచ్చి ఉండాల్సింది .మాముందు పెద్ద’’గీతాదర్శాన్ని’’పెట్టి మాలో ఎవర్నీ ఆయనకంటే ముందుకు విసరలేక పోయాడు .’’అంటూ మోహన్ ఈ విషయం లో బాపు ‘’మిజరబుల్ ఫ్లాప్ ‘’అంటాడు కొంటెగా .

పశ్చిమ దేశ చిత్రకారుల చిత్రాలపై బాపుకున్న అధ్యయనం గొప్పది .నలభై ఏళ్ళ ఆయన అనుభవం తో చిత్రకారుల్ని తూర్పు దేశాలపై తిరిగి చూడమన్నాడు .అందుకే మోహన్ ‘’తూర్పు తిరిగి దణ్ణం పెడదాం ‘’అంటాడు సరదాగా .

మరో ఆర్టిస్ట్ శ్రీ చంద్ర  ‘’చిత్రకారుల వంశం రాను రాను గీత తప్పి పోయిందని ,బాపు గీతావాక్యాలు మళ్ళీ వినిపించి బుద్ధి చెప్పాలని , .ఆయన తెలియ బరిస్తే తప్ప తెలుసుకోలేం ‘’అన్నాడు .మరో చిత్రకారుడు శ్రీ సురేంద్ర ‘’సాక్షాత్తు బాపుగారే మహానుభావుడు అనే ఆర్టిస్ట్ లు చాలామంది ఉన్నారు .మనకున్నది ఒకే ఒక బాపు ఆయన మనకే కావాలి ‘’అని నిర్ద్వందంగా అన్నాడు .

శ్రీ ఎన్నార్ ‘’కుంచెను కొంచెమే ఉపయోగించే ‘’కలాయుధుడు’’ బాపు .కలం అతనిహలం .తన అక్షరాలనే కోతులనే అతను ‘’ఫాషన్’’చేశాడు .కధలకు గేయాలకు బొమ్మవేస్తే రచయిత భావాన్ని యధాతధం గా రేఖల్లోకి అనువాదం చేయడు .రచయిత పాయింట్ కు  కౌంటర్ పాయింట్ కోసం వేట సాగించి బ్రెయిన్ వేవ్ రాగానే అయిదు నిమిషాల్లో బొమ్మ పూర్తీ చేసే సత్తా బాపు ది.బాపు మార్క్సిస్ట్ అని చాలా మందికి తెలీదు .సర్రియలిజానికి దగ్గరగా వచ్చే ఫ్యాంటసీ తో అపూర్వ హాస్యాన్ని సృష్టించిన మార్క్స్ బ్రదర్స్ కామెడీలు ఆయనకు కంఠోపాఠం.ఇంటలెక్చువల్ చలన చిత్రాలు ఇస్టపడతాడు.పాప్యులారీటి  ఒక నేరం కాకపొతే బాపు నిజమైన సృజనాత్మక చిత్రకారుడు ‘’అన్నాడు ఎన్నార్ .

శ్రీ అన్వర్ ‘’పప్పీ వారి మైనం అగ్గి పెట్టె సైజు నుండి ఏ3న్నర  కొలతలవరకు చిత్రాలు గీయగల సత్తా, సామర్ధ్యం బాపు కు ఒక్కడికే ఉంది .బాపు పుట్టిన గడ్డపై పుట్టటం మన జన్మ చేసుకొన్నా అదృష్టం .సుమారు నలభై ఏళ్ళక్రితం బాపు గారి ఒరిజినల్స్ తో చిత్ర ప్రదర్శన జరిగిందట .ఆ బొమ్మల్ని ఒళ్ళంతా కళ్ళైచూసిన ఓ చంద్రశేఖర్’’ ఆర్టిస్ట్ చంద్ర ‘’అయ్యాడు .అలాగే మిగిలిన వాళ్ళు కూడా .తెలుగు ఇలస్త్రేషన్ పుట్టి 80ఏళ్ళు కూడా కాలేదు కాని, చావటానికి సిద్ధంగా ఉంది .సినిమా వాళ్లకు రాజకీయనాయకులకేనా వారసులు కళల కు వద్దా ?అని చక్కని ప్రశ్న వేశాడు.ఆలోచించాల్సిన ప్రశ్నకదాఇది ?క్రోక్విల్, బ్రష్ ,చార్కోల్ ,పేస్టల్ఏదీ అంటరానిది కాదన్నాడు బాపు .దొరికిన దానితో గీస్తూ పోతూ ఉంటె ఏదో ఒక రోజు మనం తలుపు దగ్గరికి వెళ్లి ఎవరూ ?అని అడిగితె ‘’నేనోయ్ బాపు బొమ్మను వచ్చాను .తలుపు తీయ్’’అంటుందట .బాపుగా పుట్టటం సులువు .’’బాపిస్ట్ ‘’గా బతకటం కష్టం ‘’అని బాప్టిస్ట్ (బాప్ –ఇస్ట్)భాషలో చెప్పాడు అన్వర్ .అన్వర్ధమైన మాట .ఒకసారి ఒక కవరు చేతిలో పెట్టి బాపు ‘’పెద్దవాడిని ఇస్తున్నాను కాదనవద్దు ‘’అనిఆ తర్వాత ఫోన్ చేసి ‘’నాకో సహాయంక్ చేయాలండీ !విజయవాడ గంధం ప్రసాద్ గారు నా బొమ్మలన్నీ కలిపి బుక్ తెస్తున్నారు దానికి మీరు ముందుమాట రాయాలి ‘’అని అన్వర్ ను కోరారట’’ బాపు దిగ్రేట్ ‘’

శ్రీ శివాజీ ‘’తెల్లకాగితపు స్పేస్ ను ఎలావాడాలో చైనా ఆర్టిస్ట్ కి బాపుకి మాత్రమె తెలుసు .ఆధునిక కళా ద్రుష్టి ఇచ్చిన అతి కొద్దిమందిలో బాపు ఒకడు .కుంచె పుచ్చుకొంటే మత్తు వచ్చేట్లు చేయగల మహత్తు ఆయనది .బుడుగును భాగవతాన్ని యానిమేషన్ చిత్రంగా తీయాలి .బాపు ఒరిజినల్ చిత్రాలు తమ దగ్గరున్న పెద్ద మనుషులు’’ పెద్దమనసు’’తో కలిసి పెద్ద చిత్ర కళా ప్రదర్శన పెట్టి దేశం యావత్తూ తిప్పాలి .35ఏం ఏం లో ఆయన వేసిన బొమ్మలన్నీ ఫిలిం తీసి భద్ర పరచాలి ‘’అనిగొప్ప సూచనలు చేసి ‘’ఇన్నివిదాల మనం గొప్ప పనులు చేయచ్చు ‘’అని మెత్తగా వాయించాడు .లాటిన్ అమెరికా రచన ,ఇరానీ సినిమా లాగా బాపు బొమ్మలు వసుధైక మైనవి .

చివరగా శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారి మంగళాశాసనం తో ముగిస్తున్నాను –

‘’అల వోకగ గీచిన గీ-తలు మురువులు –చిత్ర లక్ష్మి తలమానికముల్

పలుకులు ,కులుకులు కవితా-లలితములై చెలగు’’ బాపు రమణీయమ్ముల్ ‘’

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’సంపూర్ణం .

బాపు నవ్వు  బొమ్మ జత చేశాను చూడండి

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-15-ఉయ్యూరు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

తానా సభల విశ్లేషణ -డా గుమ్మా సాంబశివ రావు -చినుకు – నాదరేఖలు

nada rekhalu 001tana2 001 tana3 001 tana4 001 tana5 001 tana1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ పులుగుర్ట వెంకట రామారావు గారి పద్యమాలిక -రచన

deergha padyam 2 001 deerghapadyam 1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’-2

తెనాలివారి ‘’బాపు రస రేఖ  ‘’-2

శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ బాపు –రమణల ఇంటికి వెళ్ళాడు .అప్పుడు రమణ ఇంటిని ‘’ముళ్ళ పూడి వెంకట రమణ అనే సదా బాలుడిది ఆ ఇల్లు ‘’అన్నాడు .కవిత్వం లో వచ్చిన శైలీ భేదాలే బాపు చిత్ర శైలిలోనూ వచ్చాయని ,ఒకప్పుడు ఆంద్ర జ్యోతి వారపత్రికలో 1/8 డెమ్మీ ఆకారం లో ‘’చిత్ర కల్పన’’శీర్షికతో ప్రశస్తమైన తెలుగుపద్యాలకు ఏం వి .ఎల్ నరసింహారావు వివరణలతో బాపు  విశిష్ట చిత్ర రచన చేశాడని ,అలాగే చైతన్య భారతి సంస్థ కోసం తనూ ,నండూరి రామమోహనరావు సంపాదకత్వం వహించి వెలువరించిన ‘’మహా సంకల్పం ‘’అనే ఆధునిక కవిత్వ సంకలనానికి బాపు ‘’కష్టజీవి ‘’తలపాగాలో తురాయి తురిమి చిత్రించిన బొమ్మ ఆధునిక కవిత్వ మహా సంకల్పానికి గీటు రాయి గా నిలిచిందని చెప్పాడు .ఇతిహాస యుగం నుండి ఈ నాటి ఆధునిక యుగం వరకు తెలుగు కవిత్వానికి ఎన్ని శైలున్నాయో అన్నిటి ఊహా  సమాహారమే బాపు చిత్ర రచనా శైలి అన్నాడు .ఆయనది రేఖలలో ,రంగులలలో ఒక చిత్రమైన శైలి .

స్వర్గీయ దాశరధి కృష్ణమాచార్య తన ‘’గాలిబ్ గీతాలకు ‘’బాపు తో చిత్రాలు గీయి౦చానని, ఆ పుస్తకాన్ని బొంబాయి కవి సమ్మేళనానికి  తీసుకొని వెళ్లానని ఆసభలో తానొక్కడే తెలుగు వాడినని తనకున్న ఉర్దూ పరిచయం తో ఆహ్వానం అందుకోన్నానని ,అక్కడి కవులకు ఆపుస్తకం చూపించానని ఒక్కో చిత్రాన్ని చూసి క్వాజా అహమ్మద్ అబ్బాస్ ,కైఫీ ఆజ్మీ సలాం మచ్లీ షహరీ మొదలైన ఉర్దూకవులు గాలిబ్ ఒరిజినల్ గీతాలను చదివి పరవశం కలిగించారని గాలిబ్ మహా కవి కవితామదురిమను రేఖా చిత్రాలలో బాపు అందించిన తీరు పరమాద్భుతం అని మెచ్చుకున్నారు .గాలిబ్ కవితా స్వరూపాన్ని చిత్రాల ద్వారా అందించిన ప్రముఖులు ఇద్దరే ఇద్దరని  అందులో ఒకరు ‘’చుగ్తాయి ‘’కాగా, రెండవ వారు ‘’బాపు ‘’అని చెప్పారు .’’బాపు చిత్రకళా భాషల పరిధులు దాటి ,దేశాల అవధులు దాటి అఖిల ప్రపంచ  ఖ్యాతి ఆర్జి౦చగలదు ‘’అని ఆనాడే దాశరధి శుభాశీస్సులు  అందజేశాడు . .

శ్రీరమణ –‘’బాపు ‘’జనార్దనాస్టకం’’కు వేసిన చిత్రాలలో ‘’ముక్కు ప్రాణం బుక్కు మీదికి వచ్చింది ‘’అంటాడు .రేఖల్లో ,బొమ్మల్లో ,రంగుల్లో హ౦గుల్లోనే కాదు ,అక్షరాలలో కూడా స్వంత శైలిని ప్రవేశపెట్టాడు అనీ ,ఎప్పుడూ వాయిదాలతో కాలయాపన చేసే లాయర్ వృత్తిని  ఆయన ప్రవృత్తికి విరుద్ధమవటం తో ప్రాక్టీస్ వదిలేసి ఇష్టమైన బొమ్మల ప్రాక్టీస్ మొదలెట్టాడని చెప్పారు .బాపు ను ఒకప్పుడు ఇంటర్ వ్యూ చేశాడు .అందులో బాపు చెప్పిన మాటలు ‘’కొన్ని రోజులు నేను ఎస్ ఎస్ చామకూర్ అనే పోర్ట్రైట్ ఆర్టిస్ట్ ,దామెర్ల రామా రాగారి శిష్యులు వద్ద కళాభ్యాసం చేశా . గోపులు గారి శిష్యరికం నన్ను ‘’అడ్వర్ టైజింగ్’’శాఖకు మళ్ళించింది .జే వాల్టర్ ధాంసన్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్ అవటానికి గోపులు గారే కారణం .తర్వాత ఫ్రీ లాంసర్ గా ఉండి ,ఆంధ్రపత్రిక అధినేత శివలెంక రాదా కృష్ణగారి ‘’అమృతాంజన్ ‘’పబ్లి సిటీ లో పనిచేశా .ఉయ్యూరు కే సి పి అధినేత వెలగ పూడి రామ కృష్ణ తమ కంపెనీ తయారు చేసే స్వీట్లకు ఎఫిషియెంట్ పబ్లిసిటీ వారిపై ఒత్తిడి చేసి నన్ను ఆర్ట్ డైరెక్టర్ ను చేశారు ‘’.అన్నాడు బాపు .

స్కూల్ లో చేరి కళాభ్యాసం చేయక పోయినా .ఎందరో గురువులకి తానూ ఏకలవ్య శిష్యుడనని చెప్పాడు .తన గురుపరంపర ‘’ఆర్ధర్ రాజాం ,రేజనాల్ద్ క్లీవర్ ,పీటర్ ఆర్నో ,జార్జ్ ప్రైస్,ద్యూలాక్ ,హోమ్ సోయ్ ,గోపులు , ,అహ్మద్ మొదలైనవారు అన్నాడు .’’ఒక్క సంకీర్తనే చాలు నన్ను రక్షింప ,తక్కినవి నీ భాండారాన ఉంచుకో ‘’అని అన్నమయ్య గడుసుగా ,చనువుగా స్వామికి చెప్పినట్లే ఒక్క బాపు బొమ్మ చాలు ‘’కళాప్రపూర్ణ ‘’ఇవ్వటానికి .రస రేఖ ఒక్కటి చాలదా కళా ప్రపూర్ణుడు అవటానికి ?’’అన్నాడు శ్రీరమణ .

జీవితం లోంచి నిత్య కృత్యాలలో౦ ఛి ,నాజూకైన హాస్యాన్ని వడగట్టటం బాపునైజమని ,కొండ౦త అతిశయోక్తి నుంచి  రవ్వంత కార్టూన్ ఉద్భవిస్తుందని ,బాపు కొంటె బొమ్మలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయని శ్రీ రమణ అంటాడు .ఆయన కృషి అనంతమైనదని అందుకే ‘’నానృషి కురుతే కార్టూన్ ‘’అన్నానని ‘’తామునిగింది గంగ –తా వలచింది బాపు బొమ్మ ‘’అన్నాడు ‘

తనికెళ్ళ భరణి ‘’తెలుగు వారికి భాషాభిమానం లేక పోయినా ‘’బాపాభి మానం ‘’చాల ఎక్కువ .సీతాకల్యాణం లో గంగావతరణం  ప్రపంచ చలన చిత్ర తెర మీదే అద్భుతం .లండన్ లో ప్రదర్శిస్తే ముక్కు మీద వేలేసుకొని బోల్డు ఆశ్చర్యపోయారు క్రిటిక్కులు .దాన్ని ఫిలిం టెక్స్ట్ బుక్కు గా పెట్టుకొన్నారు .ముత్యాలముగ్గులో ‘’అల్లు ‘’చేత కోతియేమోఅన్నంత అద్భుతంగా చేయించిన బాపు ప్రతిభకు హేట్స్ఆఫ్ .పెళ్లి పుస్తకం సినిమా చూసి గుమ్మడి ‘’మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించి౦దయ్యా  ‘’ఆన్నాడట .బాపు రమణల స్నేహం అద్వైతం .వాళ్ళిద్దరూ రెండు వెలుగులు, రెండు చీకట్లు, రెండు కస్టాలు, రెండు సుఖాలు .అంచేత వాళ్ళు ‘’సత్తిరాజు వెంకట రమణ ‘’,మరియు ‘’ముళ్ళ పూడి లక్ష్మీనారాయణ ‘’అవుతారు .ఎవరైనా పాదాభి వందన చేయటం ,పొగట్టం ,అతివాగుడూ అతి తాగుడూ ,కేమేరాకేసి చూట్టం ఓవర్ యాక్టింగ్ ,మైకు ము౦దు మాట్లాడమనటం ఆయనకు నచ్చదు.’’ ఆయనలోని  సిగ్గే ఆయన బొమ్మలకొచ్చింది ‘’.మోడేస్టేకి పరాకాష్ట బాపు .’’బ్రహ్మ బాపు బొమ్మ లాంటి అమ్మాయిని సృష్టిస్తే చూడాలని ఆశ .’’తెలుగువాళ్ళం మనం అదృష్ట వ౦తులం .మనకొక్కరికే బాపు ఉన్నాడు ‘’అన్నాడు భరణి .

చిత్రకారుడు జయదేవ్ బాపును చేసిన ఇంటర్వ్యు సారాంశం ‘’కార్టూన్ క్రూడ్ గా ఉండనంతవరకు పరవాలేదు .అంగ వైకల్యం వంటి వాటిమీద కార్టూన్లు వేయ రాదు .విదేశీ కార్టూనిస్ట్ లలో వెయ్యిమందికి పైనే నేను అభిమానించే వారున్నారు .అందులో ‘’గాలఘర్ ‘’అంటే చాలా ఇష్టం ‘’.పీనట్స్ సృస్తికర్త ‘’Shulz’’ అంటే కూడా బాగా ఇష్టం .నా చిత్రం నాకే బాగా లేదనిపిస్తే ఎంతమంది బాగుందని అన్నా పెద్ద అనుభూతి రాదు నాకు .నేనేమీ గొప్ప పనులు చేయలేదు కనుక నాకు వారసుడు అంటూ ఎవరూ లేరు .ఇతరులకు సలహా ఇచ్చేంత స్తోమత నాకు లేదు ‘’అని చెప్పాడు బాపు .

నం.పా.సా.అనే నండూరి పార్ధ సారధి ‘’రచయితకి రస పిచ్చి ,చిత్రకారుడికి బొమ్మలపిచ్చి ,సినీ దర్శకుడికి సినేమియా ప్రకోపం విధాయకమే కాని చిత్రకారుడికి ,చలన చిత్రకారుడికి శాస్త్రీయ సంగీతం ఉండటం అపురూపమే బాపు విషయం లో’’ అంటాడు .’’బాపు ఫస్ట్ లవ్ సంగీతమే .సంసారం చిత్రకళతో.హిందూస్తానీ సంగీతం బాపు ప్రాణం .బడేగులాం ఆలీఖాన్ ను పరిచయం చేసినవాడు పీ బి శ్రీనివాస్ .ఖాన్ సాబ్ సంగీత టేపులు ఆయనకొడుకు మున్వార్ ఆలీ దగ్గరకూడా ఉందడి ఉండవు . ఖాన్ మ్యూజిక్ వినటమే బాపు గాలి నీరు ఆహారం .తర్వాత ఎనిమిదేళ్ళకి ‘’నజామ్త్ ఆలీఖాన్ ,సలామత్ ఆలీఖాన్ అనే పాకిస్తానీ సోదరుల సంగీత మోజులో పడ్డాడు .వాద్య సంగీతం లో విలాయత్ ఖాన్,అలీం జఫార్ ఖాన్ ల సితార్ సంగీతం మహా ఇష్టం .పన్నాలాల్ ఘోష్ వేణువు బాగా ఇష్టం .అందులో యమన్ ,శ్రీ ,భూపాలీ ,తోడి రాగాలంటే బహు ఇష్టం .సజ్జాద్ హుస్సేన్ మా౦డలీన్ ప్రత్యేకాభిమానం .ఈయనకు రావలసినంత పేరు రాకపోతే బాపు ప్రత్యేకంగా కచ్చేరీలు పెట్టించాడు ముత్యాలముగ్గు సినిమాలో ఒక అందమైన సన్నివేశానికి ఆయనతో సంగీత౦  చేయించాడు .

తర్వాత గజల్ కళాకారుడు మెహదీ హసన్ బాపు మనసులో దూరాడు .హసన్ బాపు హృదయ సామ్రాజ్యాన్ని అయిదేళ్ళుఏలాడు .తర్వాత గులాం ఆలీ దాడి చేశాడు .మెహదీ హసన్ గజల్ వినకుండా ఒక్క పూటకూడా గడిపే వాడుకాదు .అలాగే సినీ సంగీత దర్శకుడు సి రామ చంద్ర ఆకర్షణీయమైనాడు .బడే గులాం ,అజాకత్ ,సలామాద్ ,మెహ్దీ,గులాం ఆలీ ,సజ్జాద్ ,సి రామచంద్ర ల కళా వైభవాల ప్రభావం బాపు చలన చిత్ర కళా శైలిని తీర్చిదిద్దాయి .ఈ రకంగా బాపు పై మహమ్మదీయ సంగీత  దండయాత్ర జరిగింది .

కర్నాటక సంగీతం పై ఆసక్తి తక్కువగా ఉన్నా రామభక్తి కారణం గా బాపుకు త్యాగయ్య గారు దగ్గరయ్యారు .రామదాసు తో ఆత్మీయత పెరిగింది .మహదేవన్ పరిచయం తో కర్నాటక శాస్త్రీయ సంగీత సంబంధం బలపడింది .బాపు కు ఇష్టం అయిష్టం మాత్రమె తెలుసు. ఒక మోస్తరు అనేది ఆయనకు గిట్టదు .ఇష్టమైతే నిండా మునిగిపోవటమే .సంపూర్ణ రామాయణం తీసేటప్పుడు రామాయణాలన్నీ పారాయణ చేయటం తో రామభక్తిలో నిండా మునిగిపోయాడు బాపు .’’త్యాగ రాజుగారు నూరిపోసిన ‘’రామ రసం ‘’తో బాపు వ్యక్తిత్వం ఓవర్ హాలయి పోయిందని,త్యాగరాజు ఆత్మ ఈయను ఆవహించిందో ఈయన త్యాగరాజుతో తాదాత్మ్యం చెందాడో తెలీనంత అను బంధమేర్పడి ,ఆ సినిమాకి సౌండ్ ట్రాక్ అంతా త్యాగరాజు కృతులే వినిపించాయి ‘’అని  పోఎటిక్ గా చెప్పారు నం .పా. సా .

త్యాగయ్య సినిమా నాగయ్యగారు తప్ప ఎవరూ తీయలేదు .ఆయన త్యాగయ్య రామదాసులలో ప్రధాన పాత్రలు రామభక్తులేకాని రాముడుకాదు .రామభక్తికనిపిస్తు౦ది కాని రాముడు కనిపించడు.రామపాత్ర ను బాపు తీర్చి దిద్దినంత ఉదాత్తంగా  ఏ దర్శకుడూ చిత్రించ లేదు  .సీతాకల్యాణం సినిమాలో సీత అంటే బాపూయే అనిపిస్తుంది .ఈ సినిమా చూస్తె ప్రేమ నిషా నాస్తికులకు కూడా పట్టుకునే ప్రమాదం ఉందనిపిస్తుంది .’’సంగీత జ్ఞాన యోగం లో త్యాగయ్య గారు చూపిన మార్గం లో పయనిస్తున్న కళా పదికుడు బాపు .సంగీత జ్ఞానము భక్తీ వినా సన్మార్గము గలదే ‘’అని బాపుగారి సంగీత కలాభిజ్ఞానం పై ముక్తాయింపు ఇచ్చాడు నం.పా.సా.

ఈ సారి తోటి చిత్రకారులు బాపుపై చ(అ)ల్లిన రంగుల చిత్రాల గురించి తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-15-ఉయ్యూరు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నాయకుడా రైతుకు నువ్వే బాకీ పడ్డావు

Inline image 1

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాతీయ మౌతున్న నేపాల్

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా పెరటి లో కాసిన అమ్రుతపాళీ మాక్సి, మినీ అరటి గెలలు

మా పెరటి లో కాసిన అమ్రుతపాళీ మాక్సి, మినీ అరటి గెలలుDSCN2563 DSCN2564 DSCN2561 DSCN2562

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొండలనడుమ కూర్గ్ అందాలు ,నెహ్రు

Inline image 1
Inline image 2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -74

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -74

31-స్పష్టమైన వినిమయం కోసం నినదించిన అమెరికా ఆర్ధిక వేత్త –ధార్ స్టెయిన్ వెబ్లెన్-2(చివరిభాగం )

మిస్సోరి లో ఏమంత అభిమానం పొందలేకపోయిన వెబ్లెన్ న్యూయార్క్ చేరాడు .’’ది డయల్’’అనే లిబరల్ మాసపత్రిక ఎడిటర్ అయ్యాడు .బరువైన వ్యాసాలూ రాసినా పత్రిక నిలబడలేక పోయింది .యుద్ధ సమయం లో వాషింగ్ టన్ లో తాత్కాలిక చిన్న ఉద్యోగి అయ్యాడు .అతని భావాలు చాలా ముందు చూపుతో ఉండటం తో వదిలేయాల్సి వచ్చింది .సోషల్ రిసెర్చ్ కోసం న్యు స్కూల్లో లెక్చర్లు ఇచ్చాడు .భావోద్వేగం తో మాట్లాడటం తో ఎవర్నీ ఆకర్షించలేక పోయాడు .క్లాస్ రూమ్ లో కూడా ఆతను పారం చెబుతూంటే వినేవాడు ఒక్కడూ ఉండేవాడు కాదు .అతని ‘’ఎంక్వైరీ ఇంటు ది నేచర్ ఆఫ్ పీస్ ‘’ను చాలామంది తిరస్కరించారు .విధ్వంసకర విధానాలను ప్రచారం చేస్తున్నాడని అన్నారు .దీనితో ఏ పదవీ అతనిని వరించలేక పోయింది .డెబ్భై వ పడిలో ఉన్నాడు .శారీరక మానసిక ఆరోగ్యాలు కోల్పోయాడు .క్షయ కూడా సోకింది .కాలి ఫోర్నియాకు వెళ్ళాడు .అక్కడ అడవిలో కేబిన్ లో ఉన్నాడు .ఒంటరి జీవితము ,నిరాశా నిస్పృహ లతో శుష్కించిపోయి అక్కడే వెబ్లెన్ 3-8-1929న చనిపోయాడు .ఒక నోట్ లో నిస్పృహ తో ఉన్న మనిషి టెస్ట్ మెంట్ గా ఇలా రాశాడు చనిపోయే ముందు ‘’నాకు స్మ్రుతి చిహ్నం కాని శిల్పం కాని చిత్తరువుకాని  ఏర్పాటు చేయద్దు .శిలాఫలకం కాని దానిమీద రాత కాని ఇప్పుడుకాని మరేప్పుడూ కాని ఏర్పాటు చేయద్దు .నాపై జీవిత చరిత్ర రాయద్దు .నేనురాసినవి నాకు ఎవరైనా రాసినవి ఉత్తరాలు ప్రింట్ చేయ వద్దు .ఇంకేరకంగానూ కాపీ చేయటం ప్రచారం చేయటం నాకు ఇష్టం లేదు ‘’అని అందులో స్పష్టంగా రాశాడు .

తాను  తన విదానాల విషయం లో  విఫలమయ్యానని భావించాడు .చెడునుఎదిరించటానికి మంచిని సమాయత్త పరచలేక పోయానని వ్యధ చెందాడు .తనకు తానూ సమీకృతం కాలేకపోయినందుకు బాధ పడ్డాడు .’’దిపోర్టబుల్ వెబ్లెన్ ‘’పేరుతొ మాక్స్ లేర్నేర్ రాసిన పుస్తకం లో వెబ్లెన్ వ్యతిరేకించింది వ్యవస్థలనే కాని వ్యక్తులను కాదు అన్నాడు .రూసో తత్వ వేత్త భావాలనే వెబ్లెన్ నమ్మాడు .ఈ విషయం లో కారల్ మార్క్స్ ను వ్యతిరేకించాడు .కేపిటలిజం యుద్ధం కలిసి నడుస్తాయి అనేదాన్ని కాదన్నాడు .సర్ప్లస్ వాల్యు ను ఒప్పుకోలేదు .కాపిటల్ కి లేబర్ కి మధ్య పోరాటాన్ని ఒప్పుకోలేదు .క్లాస్ వార్ ఉండదని ,లేబరే యజమానులౌతారని అన్నాడు .’’వెబ్లెన్ విప్లవం’’వస్తుందని ఊహించాడు .దీనితో కొత్త్తతెలివితేటలున్న మెకానిక్స్  ఉన్నత శ్రేణి టెక్నో క్రాట్స్ ,అరిస్టోక్రసీ ఇంజనీర్లు వస్తారన్నాడు .అసాధ్యాలు అనిపించినా అవి ఆహ్వానింప దగిన విషయాలే .

వెబ్లెన్ చనిపోయినప్పుడు అతన్ని తప్పుడు భావాల ప్రాఫెట్ అని ,క్షమించరాని ఆర్ధిక వేత్త అని అన్నారు చనిపోయినవాడికి చూపించాల్సిన కనీస మర్యాద కూడా చూప లేదు .రాడికల్ మార్పులను వెబ్లెన్ ఆహ్వానించక పోవటం లోపమైంది .కానీ అతనిని ‘’ఇన్ స్టిట్యూషనల్ ఎకనామిక్స్ ‘’ఉద్యమానికి నాయకుడుగా గుర్తించారు .వ్యవస్థలకు ,టెక్నాలజీ కి మధ్య ఉన్న అంతరానికి ‘వెబ్లెన్ డైకోటేమి’’అని పేరు పెట్టారు .అభి వృద్ధి యుగం లో ప్రోగ్రెసివ్ అని పించాడు .లాభాలకోసమే ఉత్పత్తి అనేదాన్ని వ్యతిరేకించాడు .అతని ‘’కాన్స్పిక్యుయస్ కన్సమ్షన్’’సిద్ధాంతం సోషలిస్ట్ నాయకులను బాగా ఆకర్షించింది .మార్కిస్ట్ వ్యతిరేక కేపిటలిజం ను కోరేవారందరికి వెబ్లెన్ ఆరాధ్య దైవమే అయ్యాడు .

వెబ్లెన్ ను ప్రభావితం చేసిన వారిలో ‘’జర్మన్ హిస్టారికల్ స్కూల్ ‘’  ఒకటి .చరిత్రలో మానవులందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తారు అన్నది ఇద్దరి అభిప్రాయం .రెండవది డార్విన్ సిద్ధాంతం లోని కాజువాలిటిఅంటే యాదృచ్చిక సంఘటన .డార్విన్ సిద్ధాంతం ఆధారం చేసుకొని తన స్వంత ఆలోచనలను పెంచి వెబ్లెన్ ఆర్ధిక సిద్ధాంతాలను వ్యాప్తి చేశాడు .మూడవది ప్రాగ్మాటిజం  అంటే స్వేచ్చా పూరితమనసు సంఘం అభివృద్ధిని కోరుతుందని చెప్పేదాన్ని నమ్మి తన ఆర్ధిక పరిణామ సిద్ధాంతాన్ని బలపరచుకొన్నాడు .నాల్గవది మార్క్సిజం .అందులో కూలీకి యజమానికి మధ్య ఉన్న పోరాటం ను కాదని కూలీలు యజమాని మనసుమార్చేయాలన్నాడు .టెక్నాలజీకి పెద్ద పాత్ర ఉందన్నాడు వెబ్లెన్ .

వెబ్లెన్ చెప్పిన ’కాన్స్పిక్యుయస్ కన్సమ్షన్’’సిద్ధాంతం అంటే డబ్బును అనవసరంగా వస్తువులవిలువకంటే ఎక్కువగా ఖర్చుపెట్టటం .ఇది రెండవ  రెండవ పారిశ్రామిక విప్లవకాలం లో ఏర్పడింది .’’కాన్స్పిక్యువస్ లీజర్ ‘’సిద్ధాంతమూ చేశాడు వెబ్లెన్.ఐశ్వర్యాన్ని ,అధికారాన్ని ఉత్పత్తి పనిగా చూపించటంఅన్నమాట దీన్ని వ్యతిరేకించాడు .లీజర్ క్లాస్ ను చెప్పాడు .సూటిగా ఆర్ధిక భాగస్వామ్యం లేకుండా ఉన్నత స్థాయి గౌరవం పొందటం ఆక్షేప ణీయంఅని దీని సారాంశం .అది ఆర్ధిక గ్రంధాలు దాదాపు పాతిక వ్యాసాలూ రాసి ఆర్ధిక సిద్ధాంతాలకు పరి పుష్టి చేకూర్చాడు .

Quotes

Conspicuous consumption of valuable goods is a means of reputability to the gentleman of leisure.

Invention is the mother of necessity.

Born in iniquity and conceived in sin, the spirit of nationalism has never ceased to bend human institutions to the service of dissension and distress.

        Inline image 1      Inline image 2  Inline image 3

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-15-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’

తెనాలివారి ‘’బాపు రస రేఖ   ‘’

గుంటూరు జిల్లా తెనాలిలోని బాపు అభిమానులుశ్రీ రవి కృష్ణ గారి ఆధ్వర్యం లో బాపు రమణలను  తెనాలిలో సన్మానించాలనుకొని ఆహ్వానించటం మొహమాటంగా ఇద్దరూ ఒప్పుకోవటం , బాపుగారి పై ప్రత్యేక  పుస్తకం తేవాలనే సంకల్పం ,శ్రీ గిరిధర్ గారిచే బాపు చిత్రం వేయి౦చాలనుకోవటం ,అయన ఒప్పుకొని వేసివ్వటం ,ఆయన తన అభిమాన చిత్రకారులని ,మంచి స్టడీ చేస్తారని బాపు చెప్పటం 2013లో చకచకా జరిగిపోయాయి ..కానికార్యక్రమం కార్య రూపం పొందకుండా ముందు రమణ ఆ వెంటనే రెండేళ్లకు బాపు మనల్ని వీడి వెళ్ళిపోయారు .కాని పట్టువదలని విక్రమార్కులైన తెనాలివారు ఆ ఇద్దరూ లేకుండానే పుస్తకాన్ని తేవాల్సి వచ్చి  తెచ్చి 2015 జూన్ లో మనసులోని కోరిక ‘’ బాపు ‘’అనేపేరుతో ఆయన ముఖ చిత్రం తో  తీర్చుకొన్నారు ..శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అష్టవిధ నాయికలపై రాసిన పద్యాలకు బాపు వేసిన బొమ్మలూ చేర్చి ప్రచురించారు .దీనికి పూర్తీ సహకారం శ్రీ రమణ అంద జేశారు .బాపు శిష్యులైన చిత్రకారులు మోహన్, చంద్ర మొదలైనవారు ,భరణి వంటి రాయసగాళ్ళు బాపుపై తమ అభిప్రాయాలను పొందుపరచారు .శ్రీరమణ తానదైన శైలిలో ఎన్నో విషయాలు గుది గుచ్చి తెలియ జేశారు .పుస్తకం అందంగా సర్వాంగ సుందరం గా వెలువడింది .బాపు కి ఉన్న అభిరుచులు ,ఇష్టాలు ,అయిస్టాలు ,అభిప్రాయాలు అన్నీ ఇందులో పొందు పరచారు .ఒక రకంగా ఇది ‘’బాపు గీతోపనిషత్ ‘’.అయింది .అందులోని మేలిమి సారాంశాన్ని అంటే ఎసెన్స్ ను అనగా సారాన్ని  నేను మీకు ‘’తెనాలివారి  బాపు రస రేఖ ” ‘’గా అందజేస్తున్నాను .పుస్తకం చదవనివారికి ఇది ఉపశమనం కలిగిస్తు౦దని ఆశ .ఇందులో తెలిసినవిషయాలు, తెలియనివి, తెలుసుకో దగ్గవి, తెలియాల్సినవి ఎన్నో ఉన్నాయి .ఈ ‘’బాపు ‘’ను నాకు పంపించమని  మా ఆత్మీయులు అమెరికాలో ఉంటున్న శ్రీ మైనేని గోపాల కృష్ణగారు తెనాలి లో ఉన్న తమ గురువు, స్నేహితులు, మార్గ దర్శి, మెంటార్ అయిన శ్రీ కోగంటి సుబ్బారావు గారి అబ్బాయి శ్రీ శివ ప్రసాద్ గారికి ఫోన్ చేసి చెప్పగా ఆయన పంపితే నాకు సుమారు నెలక్రితం చేరింది..దీనికి పైవారందరికి కృతజ్ఞతలు .దీనిని ఇవాళే చదివాను.

బాపుగారి భార్యతెనాలికి చెందిన  ప్రఖ్యాత నాటక సినిమా నటులు ,డాక్టర్ స్వర్గీయ గోవిందరాజుల సుబ్బారాగారి కుమార్తె .అంటే బాపు తెనాలి వారి అల్లుడన్నమాట శ్రీ .సి నా రే ‘’సుదర్శనం ‘’పేరుతొ రాసిన కవిత లో ‘’పాపలాంటి పసినవ్వు చిలికే బాపు వెనక –ఓ కొంటె మేధావి ఉన్నాడని కొందరికే తెలుసు ‘’అంటూ మొదలుపెట్టి ‘’బాపు బొమ్మలునిరాడంబరంగా ఉన్నా  గుండెల వెనక ఉన్న స్వాభిమానా లకు చురకలు పెడతాయి.’’అన్నారు .’’బాపులో ఒక దార్శనికుడు, దర్శకుడు  ఉన్నాడు .ఒక్కొక్కబోమ్మా ఓ రంగుల మినీ కవిత ‘’అని శ్లాఘించారు .’’అన్ని అంచులున్న సుదర్శనం బాపు .బాపును  వరించిన’’ డాక్టరేట్ ‘’తరించింది ‘’అని కొత్తకోణం లో చెప్పారు .

బాపు రమణనలను నాలుగు దశాబ్దాలుగా సునిశితంగా తరచి చూసిన అంతేవాసి శ్రీరమణ ‘బాపు నిగర్వి కాని బాపు గర్వం రమణ ‘’అని రాశాడు .ఆంద్ర జ్యోతిలో శ్రీ రమణ పని చేస్తున్నప్పుడు విజయవాడవచ్చిన బాపు ఆఫీసుకు వెళ్లి శ్రీరమణ తో ‘’నన్ను బాపు అంటారండి .నా కార్టూన్లు ఒక సంపుటిగా రా బోతోంది .మీరు ముందుమాట రాస్తే సంతోషిస్తాను .అది అడగటానికే వచ్చాను ‘’అని మాడెస్ట్ గా అంటే కుంచించుకు పోయాడు శ్రీ రమణ .నాలుగు రోజుల్లో ‘’నానృషి’.కృతే కార్టూన్ ‘’అని రాశాడు .ఒక ఏడాదికే మద్రాస్ చేరి బాపు రమణ కుటుంబ సభ్యుడైపోయాడు .’

’సీతాకల్యాణం ‘’చికాగో ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికై అక్కడ వారి ఆహ్వానం పై మొదటి సారి విదేశీ ప్రయాణానికి మద్రాస్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాడు బాపు .అందరు వీడ్కోలు చెప్పటం పూర్తీ అయింది .ఇక బాపు లోపలి వెళ్లిపోవాలి .ముందుకు వెళ్ళబోయి బాపు వెనక్కి నాలుగు అడుగులు వేసి నోటి దగ్గర కర్చీఫ్ పెట్టుకొని నిలబడ్డ రమణ దగ్గరకు వెళ్లి అమాంతం పాదాభి వందనం చేసి తల వంచుకొని వెళ్ళిపోయాడు .దీనిపై శ్రీరమణ’’వారిద్దరి మధ్యా ఉన్నది చనువుకాదు .గౌరవం ఉన్నప్పుడే స్నేహమైనా ,బంధమైనా పదిలంగా ఉంటుంది అని రమణ అనేవాడు అని చెప్పాడు .’’బాపు –పైపు వీరుడు ‘’అని అందరికి తెలుసు .ఆయన దగ్గర వెయ్యిదాకా రకరకాల పైపులు ఉండేవి .’’ఈజన్ బర్గ్ అనే ఆయన కు బాపు  బొమ్మలన్నా బాపు-రమణలు  అన్నా చాలా ఇష్టం . ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున దక్షిణ భారతం లో పుస్తక ప్రచురణ ని, చదివే అలవాటునీ పెంపొందించటానికి ఆయన వచ్చాడు .ఆ రోజుల్లో ఎమెస్కో వారి ‘’ఇంటింటా గ్రంధాలయపధకం ‘’ఇలా వచ్చిందే .అప్పటికే బాపు గొప్ప డైరెక్టర్ .. .బాపు’’ తీసే సినిమాలలో ఎక్కడైనా ఒక చోట ఫ్రేములో కనిపించేట్లు నాలుగు పుస్తకాలు పెట్టు ‘’అని సలహా ఇచ్చాడు దాన్ని పాటించి సలహాకు విలువనిచ్చాడు బాపు .బాపు మౌత్ ఆర్గాన్ ఘనాపాఠీ.ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆర్కెస్ట్రాలో వాయించేవాడు .అయితే ఒక రోజు ఒక పాట రికార్డ్ చేస్తుంటే ‘’అచ్చు ఇదే ట్యూన్ రాత్రి రేడియో లో విన్నానండీ ‘’అన్నాడు మ్యూ జిక్ డైరెక్టర్ తో .అంతే మళ్ళీ అవకాశం రాలేదట .

‘’బాపు త్రాచుపాము . నేను వానపాము ‘’అని రమణ చెప్పేవాడట .తనకేమీరాదు నేర్చుకోవాలి అని రోజుకి ఇరవై గంటలు పనిచేసేవాడు బాపు .తానెక్కడా ఎవరిదగ్గరా చిత్రకళను నేర్చు కోలేక పోయాననే దుగ్ధ ఉండేది .అందుకే తగిన స్థాయికి రాలేక పోయానని అనుకొనేవాడు .అందుకే’’ బాపు స్కూల్ ‘’అవతరించిన్దిసార్ అని శ్రీ రమణ అంటే చిరాకు పడేవాడు బాపు .’’నాలోలోపం నాకు తెలుసు .మీకు తెలుసా ?’’అని గద్దించేవాడు .ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాల్ని విశ్లేషణాత్మకంగా వివరి౦చే వాడు .బాపుకు పిలకా నరసింహ మూర్తి చిత్రించే రంగులు ,రూపాలు అంటే ఇష్టం .అందుకే సీతాకల్యాణం సినిమా లో  పిలకా వారి చేత బాల సీత చూసే దశావతారాలు వేయించాడు .బులెట్ సినిమాలో ‘మా తెలుగు తల్లికి ‘’పాటచిత్రీకరణ కోసం తెలుగు దనాలను ఆయనతోనే వేయించిన కళాభిమాని .మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రాలు దర్పంగా ఉంటాయని మెచ్చేవాడు .బాపు హిందుస్తానీ, రమణ కర్నాటక సంగీతానికి చెవులు కోసుకొనేవారు .  .చాలా ఏళ్ళ క్రితం డాక్టర్ సమరం మానవ మనస్తత్వాలపై ఒక పత్రికలో వ్యాసం రాస్తూ ‘’ప్రాణానికి ప్రాణం గా ఉన్న బాపు –రమణ లలో ఒకరు చనిపోతే మరొకరు ఎలా జీవిస్తారు ?’’అనే అంశాన్ని ప్రస్తావించాడు .చాలామంది అభిమానులు సమరం పై సమార భేరి మోగించారు .

బాపు –చాలా సంగతులు రమణ కళ్ళతో చూస్తాడు ఆయన చెవులతో వింటాడు .బాపుని అర్ధం చేసుకోవటం అందరివల్లా కాదు .రమణ ఒక్కడే బాపుకు వెయ్యిమందిపెట్టు .ఫెయిల్యూర్ తో పేచీ పెట్టుకొని దాన్ని ఓడించే శక్తి రమణ కు ఉంది .ఆ గెలుపు లో మూడు వంతులవాటా బాపు కిస్తాడు .పొరుగు రాష్ట్రాలలో ఉంటె ‘’వెంకట్రావ్ ఎలా ఉన్నావ్ ?’’అని రమణకు ఫోన్ చేసే అలవాటు బాపుది..రమణ అసలుపేరు వెంకట్రావ్.’’రమణ బావుంటే అందరూ బావున్నట్టే ‘’అనేవాడు బాపు .ఒక అక్షరం కాని గీతకాని రమణ కు చూపించకుండా బయటికి పంపేవాడు కాదు .రమణ పోయిన తర్వాత’’ గీతాధ్యానం’’ లో ఉంటూ కూడా తెరచి ఉన్న తలుపు వైపుకు మధ్య మధ్యరమణ వస్తున్నాడే మో నని చూసేవాడు  . ‘’రమణ ఇక రాడు కదా అనే నిష్టుర సత్యం బాపు మనస్సులో కలుక్కు మంటుంది’’.ముందే చెప్పినట్లు’’ బాపు నిగర్వి .కాని బాపు గర్వం రమణ .రమణ నిగర్వి కాని ఆయన గర్వం బాపు ‘’.బాపుకు డబ్బు ఖర్చు చేయటం తెలియదు .రమణ మనసుతో రమణ చేతులతో ఉదారంగా ఖర్చు చేస్తాడు బాపు .రమణ దివ్య స్మృతికి ఒక పుస్తకం అంకితమిస్తూ ‘’నను గోడలేని చిత్తరువును చేసి వెళ్లి పోయిన నా వెంకట్రావు కోటి కోట్ల జ్ఞాపకాలకు ‘’అని మనసు పొరల్లోంచి వచ్చిన మాట రాశాడు బాపు అని శ్రీ రమణ చెప్పాడు .

పుస్తక ముఖ చిత్రాలు జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-15-ఉయ్యూరు bapu1 001 bapu2 001

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -73

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -73

31-స్పష్టమైన వినిమయం కోసం నినదించిన అమెరికా ఆర్ధిక వేత్త –ధార్ స్టెయిన్ వెబ్లెన్-1

థార్ స్టెయిన్ బుండే వెబ్లెన్ 30-7-1857న అమెరికాలోని విస్కాన్సిన్ ఫారం లో పన్నెండుడుగురు సంతానం లో ఆరవ వాడుగా పుట్టాడు .తలిదంద్రులిద్దరూ నార్వేజియన్ ప్రవాసీయులే .తండ్రి కార్పెంటర్ .వ్యవసాయ దారుడుకూడా .కాని దీనికి ఇస్టపడడు..మిగిలిన రైతుల్లాకాకుండా మగ పిల్లలతో బాటు ఆడపిల్లల్నీ కాలేజి లో చేర్పించాడు .కుటుంబం మిన్నేసోటాకు మారింది .అప్పటికే ఎనిమిదేళ్ళ వెబ్లెన్ ఇంగ్లీష్ లోకాకుండా  నార్వేజియన్ భాషలో నే  మాట్లాడేవాడు .ఇంగ్లీష్ అతనికి ‘’విదేశీ భాష ‘’అని పించింది .వెబ్లెన్ కుటుంబీకులు వ్యవసాయ క్షేత్రం లోనే పెరిగినా ,పల్లెటూరి రైతులను పీడించే నగర వ్యాపార వేత్తల మధ్య తగాదాలలో భాగ స్వాములయ్యేవారు .పదిహేడవ ఏట వెబ్లెన్ ను తండ్రి నార్త్ ఫీల్డ్ లోని చార్లేటాన్ లో ఉన్న ఒక చిన్న మత శాస్త్రం బోధించే సంస్థ  కు పంపాడు .ఇక్కడ మూడేళ్ళు ,కాలేజిలో మూడేళ్ళు చదివాడు.ఫిలాసఫీ లో బాగా రాణించినా అతనికి ఫైలాలజి అంటే భాషా తత్వశాస్త్రం  ,బయాలజీ  ,ఆర్ధికశాస్త్రం లపై అభిరుచి ఏర్పడింది .ఇరవైమూడేళ్ళ గ్రాడ్యుయేట్ అయ్యాడు .జాన్ హాప్కిన్ కు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాడు .అక్కడనుండి ఏల్ యూనివర్సిటికి బదిలీ చేయబడి పిహెచ్ డి ని 27ఏళ్ళకే పొందాడు .

ఏల్ లో ఉండగానే భవిష్యత్తుగురించి  ఆలోచించాడు .టీచింగ్ లో చేరాలనుకొన్నాడు .కాని ఇతని నార్వేజియన్ ఇంగ్లీష్ ,దు౦దుడుకు స్వభావం ,లెక్కలేని తనం ,మూర్ఖత్వం అతని ఉద్యోగానికి అడ్డుగోడలైనిలిచాయి .చేసేది లేక మళ్ళీ మిన్నెసోటా చేరి వ్యవసాయం చేస్తూ చార్లేటాన్ కాలేజి ప్రెసిడెంట్ కూతురు ఎల్లెన్ రోల్ఫ్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఏడేళ్ళు ఇక్కడే ఆశగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ తండ్రితో దీర్ఘ సంభాషణలు చేస్తూ ,పుస్తకాలు చదువుతూ గడిపాడు .వెబ్లెన్ కంటే అతని కుటుంబమే ఎక్కువ కలత చెందింది .ఎన్నో కౌన్సెలింగ్ లు ఇచ్చారు బాగుపడతాడేమోననే ఆశతో .చివరికి ఆతను ఆర్ధిక రంగం లో విజయ౦ సాధిస్తాడని నమ్మకం కలిగింది .ఫిలాసఫర్ గా కంటే ఎకనామిస్ట్ గా  రాణించ గలననే  నమ్మకంతో ‘’కార్నెల్ ‘’కు వెళ్ళాడు .

ముప్ఫై అయిదేళ్ళ వయసులో వెబ్లెన్ సాధారణ కూలీ కోటు ,ముతకనూలు ట్రౌజర్లు,కూన స్కిన్ కాప్ తో ఎకనామిక్స్ ప్రొఫెసర్ ప్రోఫెసర్ లారెన్స్ లాఫ్లిన్ ఆఫీస్సులో అడుగుపెట్టి ‘’నేను థార్ స్టెయిన్  వెబ్లెన్ ‘’అని పరిచయం చేసుకొన్నాడు .అతని సూటితనం  గాంభీర్యం లకు ముచ్చటపడి లాఫ్లిన్ కార్నెల్ లో ఫెలోషిప్ ఇచ్చాడు .చికాగో లో కొత్తగా ప్రారంభించే యూని వర్సిటి లో చేరబోతూ తనతోబాటు  వెబ్లెన్ ను  కూడా తీసుకొని వెళ్ళాడు .అక్కడ టీచింగ్ ఫెలో గా ఏడాదికి 520డాలర్ల జీతం తో చేరాడు .నలభై ఆరవ ఏట జీతం వెయ్యి డాలర్లు అయింది .చికాగో లో అనేకమంది ప్రముఖులతో పరిచయమేర్పడింది .కాని వారికి దూరం గా ఒంటరిగా ఉండేవాడు .బోధనపై విసుగూకలిగింది .రొటీన్ జీవితం పరమ బోర్ అనిపించింది .మెటీరియల్ లేబర్ లోని నాణ్యతపై పేపర్లు రాశాడు .డ్రెస్ విషయం లో పొదుపు ,క్లాస్ లలో ఎకనామిక్స్ ను బోధించటం లో రావాల్సిన సమూలమైన మార్పులు అన్నిటిపై ఆచరణాత్మకమైన విధానాలు రాసేవాడు .ఇంతగా రాసినా  నలభై రెండవ సంవత్సరం వరకు వెబ్లెన్ గురించి పబ్లిక్ కు ఏమీ తెలియదు .1899లో వెబ్లెన్ మొదటి పుస్తకం ‘’ది తీరీ ఆఫ్ ది లీజర్ క్లాస్ ‘’రాసి ప్రచురించాడు .

ఆ తర్వాత ఒక డజన్ దాకా పుస్తకాలు రాసినా ఈ పుస్తకానికొచ్చిన పేరు దేనికీ రాలేదు .ఇందులో ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ,ధనవంతుల వెంట మధ్యతరగతి వాళ్ళు ఎందుకు వ్యామోహం చూపిస్తున్నారో పూర్తిగా వివరించాడు .చాలా స్పష్టమైన  సాదారణ భాషలో రాయటం దీనికి  ప్లస్ పాయింట్ అయింది .అతని ‘’conspicuous consumption’’అంటే స్పష్టమైన వినిమయ విధానం అందరిని ఆకర్షించింది .డబ్బును కాలాన్ని ,ప్రయత్నాలను దుబారాగా ఖర్చు చేయటం పై తీవ్రంగా విరుచుకు పడ్డాడు .అమెరికా చరిత్రలో ఏ రచయితా అంతకు ముందు ఎప్పుడూ అమెరికా ధనవంతులు తెలివితక్కువగా ప్రిస్టేజ్ ని కొనుక్కోవటానికి డబ్బును ప్రవాహం లా ఖర్చు చేయటం పై రాయలేదు .అలా రాసి మేల్కొలిపిన  మొదటి వ్యక్తీ వెబ్లెన్ అయ్యాడు .ఒక ఫ్రాన్స్ రాజు సమావేశాలకు తానూ కూర్చునే సీట్ కోసం ఎంతో డబ్బు వృధా చేయటం ,క్రిస్టియన్ మతగురువుల ఆశీస్సు అభిమానం పొందటం పైనా చెలరేగి రాశాడు .

ఈ పుస్తకానికి సీక్వెల్ గా అయిదేళ్ళ తర్వాత ‘ది తీరీ ఆఫ్ బిజినెస్ ఎంటర్ ప్రైజెస్ ‘’రాశాడు వెబ్లెన్ .ఇందులో బడా పారిశ్రామిక వేత్తలు డబ్బును కూడబెట్టుకోవాటానికి ,అధికారం పొందటానికి  తాపత్రయ పడుతున్నారని ఇదివారి వ్యాపరలక్షణానికి శత్రువు అని నిర్మొహమాటంగా చెప్పాడు .విలువల తో కాక సరుకుల నాణ్యత తోకాక వస్తువుల రేట్ల తో ,ధనసంపాదన చేయటం హేయం అన్నాడు .లాభాపేక్షతో ఉత్పత్తిని ద్వంసం చేస్స్తున్నారని ,సామాన్యునికి అండగా నిలబడకుండా వాళ్ళ అమాయకత్వంతో వ్యాపారం చేసి లాభ పడుతున్నారని ఆక్షేపించాడు .దీనికోసం సమాజం లోని ఇంజినీర్లతో ఒక కొత్త కంట్రోల్ విధానం అమలు చేయాలని కోరాడు .యంత్రానికున్న సాంఘిక ఉపయోగాన్ని అందరి దృష్టికి తెచ్చాడు .

వెబ్లెన్ అభిప్రాయాలకు అవాక్కయ్యారు బడా బిజినెస్ మెన్ లతోబాటు యూని వర్సిటి ట్రస్టీలు కూడా వెబ్లెన్ ఆలోచనలు చాలా ప్రమాదకరం అని ఎలుగెత్తి చాటారు .దీనికి తోడు అతని ప్రైవేట్ జీవితమూ ఒడిదుడుకుల పాలైంది .భార్య అనేకసార్లు వదిలి పెట్టి వెళ్ళింది  .కొన్ని అభూతకల్పనలూ వచ్చాయి ఒక పేపరు ఆతను ఒకమ్మాయితో అట్లాంటిక్ లో ఉండటం చూశానని కధనం అల్లింది .తిరిగి వచ్చాక రాజీనామా చేయమనే ఒత్తిడి పెరిగింది .అప్పటికే వయసు నలభై తొమ్మిది .లేలాండ్ స్టాన్ఫోర్డ్ వెళ్లి మూడేళ్ళున్నాడు .అందం ,ఆకర్షణ ఉండటం తో ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలు వెబ్లెన్ అంటే వ్యామోహం తో వెంటపడేవారు .తప్పించు కోలేక పోయేవాడు .అదీ అతని పరిస్తితి .అతనిపై స్కాన్దల్స్ ప్రచారం జోరై పోయింది .

వీటిని తప్పించుకోవటానికి ఒక మౌంటేన్ కాబిన్ లో ఉన్నాడు .కావాల్సిన ఫర్నిచర్ తనకు తోచినట్లుగా ముతకగా తయారు చేసుకొన్నాడు డ్రెస్ విషయం లో  లో శ్రద్ధ చూపించలేదు. ఏది దొరికితే దాన్నే ధరించాడు .సూట్ లకు ఇస్త్రీ లేదు  ‘’చెంబు ఇస్త్రీ’’ తప్ప’.కోట్ బటన్ ఊడితే సేఫ్టి పిన్  పెట్టు కొనేవాడు .సగం జుట్టుతెల్లబడి రంగులేనిదైనది .గడ్డం గీయటం మీసం దువ్వటం లేనేలేవు .ముఖం పై ముడుతలు మరీ వయసు మీద పడేట్లు చేసింది .56 ఏళ్ళకే ముసలివాడైపోయాడు .స్నేహితుడు హెర్బర్ట్ డావెన్ పోర్ట్ ప్రోద్బలం తో మిస్సోరీ యూని వర్సిటి కి వెళ్ళాడు ఆర్ధిక వేత్త వెబ్లెన్ .

1911లో భార్య పూర్తిగా విడాకు లిచ్చి  వదిలేసి వెళ్ళిపోయింది .ఏడేళ్ళు మిస్సోరీ లో ఉన్నాడు .క్లాసులకు క్రమం తప్పకుండా వెళ్ళేవాడుకాని ఇష్టం తో బోధించ లేక పోయేవాడు .స్నేహితుడు డేవేన్ పోర్ట్ సెల్లార్ లో కాలమంతా ఏదో రాస్తూ గడిపేవాడు .ఉద్యోగ జీవితం ఉపయోగపడకపోయినా ఒక కొత్త పుస్తకం ‘’ది హయ్యర్ లెర్నింగ్ ఇన్ అమెరికా ‘’రాశాడు .దీనికి టాగ్ గా’’ఏ స్టడీ ఇన్ టోటల్ డేప్రేవిటి’’(పూర్తీ భ్రస్టత్వ౦లో అధ్యయనం )అని పెడదామనుకొన్నాడుకాని చివరికి తానే వెనకి తగ్గి ఆ టాగ్ తగిలించలేదు .ఇందులో పిరికి కాలేజి ప్రెసి డెంట్ లు ,టీచర్లు  ,డబ్బుకోసమే ఉండే ట్రస్టీలు గురించి ఏకేశాడు ., అమెరికా లో ఉన్నధైర్యవంతులైన అన్వేషకులు ,ఇంజినీర్లు గురించి పూర్తిగా చర్చించాడు .అమెరికా యూని వర్సిటి బోర్డ్ ప్రెసిడెంట్ లుపక్కా బిజినెస్ మెన్ అని ,కనసర్వేటివ్ దృక్పధం ఉన్నవాళ్ళని ఎత్తి చూపించాడు .ఇలాంటి వారితో కూరుకుపోయిన యూని వర్సిటీలు సామాన్యులకు ఏమీ చేయలేకపోయాయని ఆవేదన చెందాడు .

మిస్సోరీ లో ఉండగానే వెబ్లెన్ ‘’the instinct of Workmanship ,imperial Germany and the industrial revolution, an enquiry into the nature of peace and the terms of its perpetuation ,the vested interests and the state of the industrial art ‘’మొదలైన గ్రంధాలు రాసిప్రచురించాడు .వీటిలో తీవ్రమైన అధ్యయనం ,వ్యంగ్యం కనిపిస్తాయి .యాభై ఏడేళ్లకు మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు .రెండోభార్య మొదట్లో బాగానే ఉన్నా తర్వాత మతి స్తిమితం కోల్పోయి శరణాలయం లో ఉంచాల్సి వచ్చింది .మళ్ళీ ఎదురు దెబ్బలు ,వెనకడుగులు తప్పలేదు .మొదటి ప్రపంచ యుద్ధకాలం లో ‘’యాన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ ఆఫ్ పీస్ ‘’పుస్తకం వెలువడింది .సమయానికి తగిన రచనగా గుర్తింపు పొంది మంచి పేరు తెచ్చింది .ప్రొఫెషనల్ రాజకీయ వేత్తలు ఏ విధంగా నిజమైన దేశ భక్తిని స్వలాభానికి వాడుకొంటారో వివరించాడు .అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఏ పబ్లిషర్ కూడా ప్రింట్ చేయటానికి ముందుకు రాకపోతె వేబ్లెన్ 700డాలర్లు చేతి చమురు వదిలించుకొని ముద్రించాడు .తర్వాత అయిస్ లాండ్ దేశీయుల ‘’లాక్స్ డేలా సాగా ‘’అనే మధ్యుయుగ ఇతిహాసకావ్యాన్ని  (ఎపిక్ )ఆంగ్లం లోకి అనువాదం చేసి ప్రచురించి మళ్ళీ ప్రవాసానికి వెళ్ళిపోయాడు .

Inline image 1

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మావో నుంచి నోబెల్దాకా

Inline image 1
 
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒంటరితనం ,అమ్మతనం ,కమ్మదనం కలబోసిన శీలాసుభద్రాదేవి గారి ‘’ఏకాంత సమూహాలు ‘

ఒంటరితనం ,అమ్మతనం ,కమ్మదనం కలబోసిన శీలాసుభద్రాదేవి గారి ‘’ఏకాంత సమూహాలు ‘

శ్రీమతి ’సుభద్రా దేవి గారు ఎప్పుడూ ఏకాంత గోళం లోఒంటరిగా గడియారపు ముల్లును మోసుకు పోతూ  విహరిస్తున్నట్లు ,చుట్టూ జనసమూహాలు ఉరుకులు పరుగులూ తో వెనక వచ్చే నీడనైనా పట్ట్టి౦చు కోకుండా పరిగెత్తే తీరు చూసి ఆశ్చర్యపడ్డారు . తమనీడనే చూడలేనివారు ఆమెలోని స్పందనలను ఎలా గ్రహించగలరు ?ఇష్టం లేకపోయినా ఆమె చుట్టూ శూన్యమే ఆవరించి ఉంది. దాన్ని తొలిచే చిన్న కీటకమైనా వస్తుందేమోనని ఆశపడతారు .మిత్రత్వానికి స్నేహ హస్తం చాచుతున్నా  వారు దూరమై పోతూనే ఉన్నారు. . తనకు తానే శత్రువుని పోతున్నానేమో ననే శంకా, భయం ఆవరించాయి .అక్కడే ఒంటరి శిల్పాన్నైపోతానేమో నన్న ఆందోళన పెరిగింది .లోకం పోకడ గమనిస్తే తానే కాదు తనలాగా మరెందరో ఒంటరి తనం తో బందీలై పోతున్నందుకు బాధ పడ్డారు అందుకే శీర్షిక ‘’ఏకాంత సమూహాలు ‘’అయి అందర్నీ ఒక్క క్షణం నిలకడ గా నిలిచి  ఆలోచి౦ చుకోమని పిలుపు నిచ్చారు. ఈ  సంపుటిలో మొత్తం 40 కవితలు విలక్షణతతో ఉన్నాయి .అందమైన బౌండ్ పుస్తకం .ముఖ చిత్రం భర్త శ్రీ వీర్రాజు గారు చిత్రి౦చినదే . వెనుక ముఖ చిత్రం లో సుభద్రగారు  ‘’తెలుగింటి ఆడపడుచు ‘’గా సంప్రదాయ బద్ధం గా కూర్చుని ఉండటం పుస్తకానికి హై లైట్ .ఆమెతో పాటున్న మిగిలిన మూడు చిత్రాలు స్త్రీ ల విభిన్న దశలను చూపాయి .

సుభద్ర గారు అంటే మాటల మంత్రజాలం . ఆలోచనల దివ్య సారం .ఏది చెప్పినా అనుభవైక వేద్యంగా వైద్యంగా నే ఉండటం ఆమె ప్రతేకత .’’పచ్చని జీవితం పై పూస్తున్న ఆశల్ని –పిడికెడు బూడిదగా కాల్చేస్తూ ‘ఎక్కడినుంచో అశనిపాతం జరిగి వ్యధ రగిల్చి మిగిలిల్చింది. అయినా ఆమె ‘’అమ్మ గుండె కన్నీటి తోరణాలతో ‘’మళ్ళీ మరో జీవితానికి గూడు సిద్ధం చేసిన స్థైర్యం ఆమెది  .ఒక్కోసారి జారి పోయిందనుకున్న నిద్ర ‘’చటుక్కున కలల దారం తో రెప్పల్ని కుట్టేస్తుంది .’’దీనితో మనసు చుట్టూ గూడు అల్లే ప్రయత్నమూ జరిగిపోతుంది .ఆమె జీవితాన్ని కలలు శాసి౦చలేవు .ఆమె ‘’జీవితాన్నే కలలు కనటం అలవాటు చేసుకొన్న గడుసు పిండం .’’కలైనా జీవితమైనా ‘’ఆమెకు తేడాలేదు రెండూ ఒక్కటే .ఆమె ‘’తెగిన పాటల పతంగి ఏదో ఆలోచనల రెమ్మకు చిక్కుకుందేమో ‘’నని స౦దేహం .తన రాగాలకోయిల అలకమాని కొత్త రంగులు అద్దుకొని మళ్ళీ కంర పేటికపై వాలేవరకు పిలుస్తూనే ఉండే ఓపిక ఆమెది .

‘’సమాజానికి సూక్ష్మ రూపమైన కుటుంబాన్ని మోస్తూ ‘’నిత్య చైతన్య జ్వాలతో ,ప్రతిక్షణం మహోన్నతం గా నిలిఛి ,ఒంటినిండా ఆత్మ గౌరవ పర్వతాలు మొలిపించుకొంటూ ,వెలుగు కిరణాలమై ,’’చివరివరకు జీవితం సాగించాలన్న పిలుపు ఆమెది .’’మనలోని చిన్న ఆకాశాన్ని విస్తృతంగా మార్చుకోవటం మన చేతిలోని పనే ‘’అని,’’ ఊకోట్ట్టే తోడు’’ఉంటె అసాధ్యాన్ని సుసాధ్యం చేయచ్చు అనే భరోసా ఇస్తారు .కాలం కాటేసిన క్షణాలలో చూపు కూడా గమనాన్ని మర్చిపోయినా ,మళ్ళీ దారి లోకి మళ్ళాలి .ఆహ్లాదకర సమయాలు ఐస్క్రీము ల్లాగా కరిగిపోతాయి .అప్పుడు ‘’మనల్ని పదును పెట్టేవి గుండె అడుగు పొరల్లోకూరుకుపోయిన ఎదురు దెబ్బలే ‘’అని సాంత్వన వచనం పలికారు .ఒక్కోసారి ‘’కొలతల మధ్య ఇమిడి పోయే మరుగుజ్జు వృక్షాలు ‘’గా మారి పోతాం .ఇది తాత్కాలికం. స్వస్వరూప జ్ఞానం త్వరలో పొంది ముందుకు సాగాలి .’’మనజీవితం మనదే కాకూడదు .మనం సాధించిన విజ్ఞాన సర్వస్వాలు రేపటి తరాల్ని ఉత్తేజితుల్ని చేయాలి ‘’అని ప్రబోధించి ‘’ఈ జీవన కావ్యానికి –చివరి సిరి చుక్క సంతక౦ మాత్రం కావద్దు ‘’అని హెచ్చరిస్తారు .ఆమె స్త్రీలకోసమే చెప్పినట్లు ఉన్నా ఈ వాక్యాలు అందరికీ శిరో దార్యాలే .

తనకో స్వంత చిరునామాకావాలి కాని గుంపులో గోవింద లాగా ఉండకూడదు .అది ‘’నన్ను నేనుగా గుర్తు పట్టేందుకు .నాదైన –అచ్చంగా నాదే అయిన ముఖం కావాలి నాకు ‘’అంటారు .తనకోసం తానూ ఒలక బోసుకొనే కన్నీటి తోనైనా –‘తన  సంతకాన్ని ముద్రిస్తూ ‘ఉండే’’ స్వంత చిరునామాను  సంపాదించు కోవటమే ఆమె ఏకైక లక్ష్యం .ఇది అందరి స్త్రీల లక్ష్యం గా ఉండాలనేదే ఆమె కోరిక ,తాపత్రయం .ముసలితనం లో,ఒకరకమైన వ్యాధికి నడక అవసరమని డాక్టర్ల సలహా .కాని గమ్యం లేని నడక ఆమె కిష్టం లేదు కారణం ఆమె ‘’నిమిషాల్ని ఏరుకొంటూ-గంటల్ని ముడుచుకొంటూ- నాగేటి  చాలుకు కట్టిన ఎద్దులా ‘’తిరుగుతూనే ఉంది .

విదేశీయతలో మనం మమ్మీలంగా మారకుండా ‘’రేపటి తరాన్ని వేలు పట్టి నడిపించి –మన అక్షరాల్ని మనమే దిద్దిద్దాం –మన సంస్కృతీని ఉగ్గుబాలతో తాపించుదాం ‘’అని ఒక తెలివిగల బాధ్యత తెలిసిన ఒక అమ్మ లాగా  స్పందించారు –ఆకాశవాణి లో ప్రసారమైన ‘’మనసుల్ని తెరచి ‘’కవిత లో .  దుఖానికి వార్నింగ్ ఇస్తూ  ‘’నన్నూ ఈ  భూమినీ విడిచి నీ దారిన నువ్వు అనంత విశ్వం లోకి ఫో ఫో ‘’అని దుఃఖ రహిత సమాజం కోసం పరితపించారు .ధిల్లీ ఆకాశవాణి లో ప్రసారమైన ‘’ఉద్యమం ఒంటరిది కాదు ‘’కవితలో మానవ సమాజ పోకడలను తెలియజేస్తూ తెరల మాటునే మనసులు ,మాటలు దాచుకొంటున్నామని  ,మనిషికి  మనిషికీ మధ్య గోడలు కట్టుకొంటున్నామని బాధ పడుతూ ‘’తెరల్ని తొలగించుకోక పొతే –ఏకాకిగా మిగిలే ఒంటరి పక్షులమై పోతాం ‘’అని హెచ్చరించి ‘’ఉప్పెనైనా ,ఉద్యమమైనా ఒంటరిగా రాదు .పెదాలు కలిస్తేనే మాటౌతుంది ‘’అంటూ మనసులుకలిపి మానవతా హారమై ఉద్యమించాలని ఉద్బోధించారు .ఉద్యమం లేనిది లక్ష్యం సాధించటం కుదరదనే సూచన ఉంది .

విదేశం లో కొన్ని నెలలుఉండి ఇంటికి తిరిగి వస్తే ‘’దిగులు కళ్ళతో –పాలిపోతున్న పచ్చదనం తో –ఒళ్ళంతా తడుముతూ హత్తుకున్నాయి’’ –బాల్కనీలోని ఆమె పెంపుడు బిడ్డలు అంటే ‘’మొక్కలు’’ . ఎంత హృదయ స్పందనగా నో చెప్పిన కవిత ఇది! .

‘’ఊపిరి పోసుకున్నప్పుడే కాదు ,ఆ తర్వాతా –మనిషిగా బతికినవాడు –ఊపిరి కడబట్టినప్పుడు కూడా –జనం ఊపిరై జీవిస్తూ ఉంటాడు ‘’అన్న వాక్యాలు ‘’సుభద్రా మానుషోపనిషత్’’ వాక్యం లా పరమప్రబోధకంగా  పవిత్రంగా ఉంది .’’అంతరా౦తరాల్లోకి ‘’కవితలో సైంటిఫిక్ వింతలూ శస్త్రచికిత్స విజయాలు నెమరేస్తూ ‘’మెదడు పొరల్ని తిరగేసి ,మరగేసి –పంక్తులలో గాధల్ని తరచి తరచి తవ్వి –అవి చేసిన గాయాల మరకల్ని స్కాన్ చేయండి ‘’అని హితవుపలుకుతూ ,చేసేవారి జీవిత అనుభవాలను కూడా జోడించి మూల్యాంకనం చేయమని అంటూ ‘’కానీ –అది మీ కత్తులు చేయలేవు –మా కలాలకే అది సాధ్యం ‘’అని కత్తికంటే కలం గొప్పదని ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిభాషలో చెప్పారు .

‘’నదైనా ,మనిషైనా స్త్రీ కావటమే ‘’అన్న సామ్యాన్న బాగా చెప్పారు ‘’ఒకే ఒక్కటి ‘’లో .ఆమెది ఎల్లలు లేని ప్రేమ వార్ధి .’’ముళ్ళతో పొగరుగా చూసే ఎడారి మొక్కైనా –ఠీవిగా తలెత్తి నిలిచే మహా వృక్షమైనా –మొగ్గ తొడిగి బతుకు పండినప్పుడు మాత్ర౦ –ప్రేమ తెలిసిన మనసౌతుంది .’’ఇక్కడ సుభద్రా దేవిగారి అమ్మతనం ,ప్రేమ మాధుర్యం చక్కగా వ్యక్తమయ్యాయి .ఆమె  తనచుట్టూ తాను తిరిగే బొంగరమై ‘’చిన్నారి వెలుగు చుట్టూ పరిభ్రమించే వసుంధర నయ్యాను-అవును –నేను తల్లికి తల్లినే కదా ‘’ అని గుర్తు చేసుకొన్నారు . తాను  భూమాత అయి, ఆమెలోని సహజ సహనానికి ప్రతీకగా నిలిచి వెలుగు ప్రసరించే కారుణ్య దీపమైనారు .ఇంతకంటే కవి సాధించాల్సినదేమి ఉంది ?సార్ధకం ఆమె జీవితం ,కవితా జీవితం కూడా .మంఛి కవితా సంపుటి ‘’ఏకాంత సమూహాలు ‘’.చదివి అభినందించాల్సిన పుస్తకం .2007ఏప్రిల్ లో ప్రచురితమైంది .కిందటివారం సుభద్రగారు నాకు దీన్ని ఆత్మీయం గా పోస్ట్ లోపంపారు .చదివి ఆనందించి మీరూ సంతోషిస్తారనే  ఈ పరిచయం రాశాను .అంతేకాని ముంజేతి కంకణానికి  అద్దమేల ?

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-15-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దిగంబరులారుగురూ కర్తా కర్మా .క్రియలె

Inline image 1

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుష్క కు రుద్రమదేవి కాన్ఫిడెన్స్ పెంచిందట – అనుష్క కు రుద్రమదేవి కాన్ఫిడెన్స్ పెంచిందట

Inline image 1

 

 

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగులో సైన్సు జనీకరణ సమస్య -వివినమూర్తి

Inline image 1

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళాత్మక నిర్మాత ఏడిద నాగేశ్వర రావు మృతి

Inline image 1
Inline image 2

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కూర్మనాధ స్వామి ,శ్రీవారి ఆలయం లో అచ్యుత రాయల పట్టాభిషేకం

కూర్మనాధ స్వామి ,శ్రీవారి ఆలయం లో అచ్యుత రాయల పట్టాభిషేకం

 

Inline image 1
 
Inline image 2
 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment