వీక్షకులు
- 1,159,081 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ బేతబోలు రామబ్రహ్మం గారి “దేవీ భాగవతం బేతవోలు వారి సృజనాత్మక చాతుర్యం” పై శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ప్రసంగం ఈరోజు(10-6-26) ఉదయం 7:20 నిమిషాలకు ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రసారమైనది. శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ బాబాయ్ గారికి శుభాకాంక్షలు, వందనాలు . ధన్యవాదములుతో…పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
- అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ ఎకనమిస్ట్ ,ఉడ్రోవిల్సన్ ఫెలోషిప్ ఆవార్డ్ గ్రహీత –శ్రీమతి గీతా గోపీనాథ్-(మహిళామణులు ) -గబ్బిట దుర్గాప్రసాద్
- హెచ్. డబ్ల్యూ. మాస్సింగ్హామ్(త్రివేణి)
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.29 వ భాగం.8.6.26.
- ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి. కల్పవృక్ష వా గ్వై భవం.2 వ భాగం.8.6.26.
- బద్ర్ (పూర్ణ చంద్) దిట్టమైన అచ్చతెనుగు కవితా పేటిక ‘’ నిట్ట’’
- కర్ణాటక జానపద గీతాలు(త్రివేణి)
- రావణుడు కొట్టిన శక్తి బాణం దెబ్బలకు లక్ష్మణుడు మూర్చపోతే ,రావణుడు చేతులతో లేపే ప్రయత్నం చేశాడా ?
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.28 వ భాగం.7.6.36.
- ముక్కు తిమ్మన పారిజాతాపహరణం కావ్యం.1 వ భాగం.7.6.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,102)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 35-చిదంబర కవి-(16వ శతాబ్దం )
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
35-చిదంబర కవి-(16వ శతాబ్దం )
సూర్యనారాయణ యజ్వ మనవడు ,వేంకటాంబ ,అనంత రామయ్యలకుమారుడు చిదంబర కవి .16వ శతాబ్ది గొప్పకవి ,సాహిత్య శాస్త్ర వేత్త .తండ్రిగోదావరిజిల్లాలో పుట్టినా తమిళనాడుకు వలసవెళ్లి విజయనగర రాజుల ప్రాపకం సంపాదించాడు .శుద్ధ అద్వైతి అయిన చిదంబరం జీవితం చివర్లో తిరుపతి సందర్శించి ఒక్కసారిగా వీర వైష్ణ వుడయ్యాడు .వెంకటేశ్వర స్వామి పై 200 పైగా స్తోత్రాలు స్తుతులు రచించాడు .ఉత్తర ఆర్కాట్ లో ఉండే మాతామహుడు వేదపురీశ్వరుడు ‘’మార్గ సహాయ చరిత్ర ‘’రాశాడు .చిదంబర తల్లి తమిళ దేశీయురాలు తండ్రి ఆంధ్రావాలా .తమ్ముడు శ్రీనివాసుడు మేనమామ శివసూర్య .చిడంబరకవి తంజావూర్ జిల్లా పలయూర్ నివాసి .
రాఘవ యాదవ పాండవీయం అనే త్ర్యర్దికావ్యం ,చిదంబర విలాసం ,శ్లేష చింతామణి ,శబ్దార్ధ చింతామణి ,భాగవత చంపు ,పంచకల్యాణ చంపు రాశాడు .మొదటిదానికి ‘’కదా త్రయి ‘’అనే పేరూ ఉంది .మూడాశ్వాసాలకావ్యం .రామాయణ భారత భాగవత కదా.దీనికి అర్ధ ప్రదీపిక వ్యాఖ్య ఉంది.కావ్య ప్రారంభ శ్లోకం
‘’వాచం వో రచయతు స్సర్వదాంత రంగేగాంగేయ సరస నయోదయం దధానః –సత్యాప్తో బుధ కుల మౌళి బంధు రోజా శ్రీ రామ స్తుత గురుమానసాబ్జ హంసః ‘’.మూడవ ఆశ్వాసం లో తన వంశ చరిత్ర చెప్పుకొన్నాడు .
చిదంబర విలాస కావ్యం లోరెండు కా౦ డలున్నాయి అర్ధ దీపిక పేర తానె వ్యాఖ్య రాశాడు .చాలా సంక్లిష్ట రచన –మచ్చుకి –
‘’నాద హ్రదా రామకే జానపద్యాః పారే వాసీ ఫాలయూ రగ్ర హారే –లీలా సేవ్యః శైల కన్యా సహాయః కైలాసేపి వ్యాప కాంక్షా౦ న దేవః ‘’
50వ శ్లోకం లో తానూ తంజావూర్ జిల్లా పాలయూర్ వాసినని చెప్పాడు
.శేష చింతామణి110శ్లోకాల కావ్యం .వ్యాఖ్యానం రాసుకొన్నాడు .కవి శ్లేష యమక చక్రవర్తి .-మొదటిశ్లోకం
‘’సవః శ్రేయో విభుస్తన్యా త్సువయః పున్గావద్భావః –కరీంద్ర వదనో ల్లాసీ కటకీకృత పన్నగః ‘’
శబ్ద రత్న చింతామణి రెండు సర్గలు రామాయణ భాగవతజోడుకధలు .కవి నికశోపల వ్యాఖ్య రాశాడు..పంచకల్యాణ చంపు గద్య ,పద్య కావ్యం .రామ ,కృష్ణ సుబ్రహ్మణ్య స్వాముల కళ్యాణ గాధ,కవి శిష్యుడు నంజుండ వ్యాఖ్యానం రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-15 ఉయ్యూరు
‘కార్తీక వైభవం ”- సరసభారతి 85వ సమావేశం – శ్రీ నవులూరి రమేశ్ బాబు గారి ఉపన్యాసం
సరసభారతి 85వ సమావేశం గా శ్రీ సువర్చ లాంజనేయ స్వామి దేవాలయం లో 8-12-15మంగళవారం సాయంత్రం 6-30కు ”కార్తీక వైభవం ”-పై
,రాత్రి 7గం.లకు లక్ష వత్తులతో అఖండ దీపోత్సవ దృశ్యాలు
లక్ష దీపోత్సవానికి ఆహ్వానం
సరసభారతి 85వ సమావేశం గా స్థానిక శ్రీ సువర్చలాంజనేయ స్వామిదేవాలయం లో 8-12-15మంగళ వారం సాయంత్రం 6గం లకు కార్తీక మాస సందర్భం గా ”కార్తీక వైభవం ”పై శ్రీ నవులూరి రమేశ్ బాబు (రిటైర్డ్ తెలుగు లెక్చరర్ )గారు ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు .అనంతరం రాత్రి 7గం లకు లక్షవత్తులతో దీపోత్సవం జరుగుతుంది .కలియుగ కైలాసం గా ఆంజనేయ దేవాలయం భాసించే ఈ కార్య క్రమం లో అందరూ పాల్గొని విని ,కనీ తరించండి -దుర్గాప్రసాద్ -సరసభారతి మరియు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవస్థానం
నర్తకి సావిత్రి -విఏకే రంగారావు ,బెజవాడ ఒకప్పుడు జైన కేంద్రం ఎంట్రోపి (యంతరపి )క వన శర్మ కమ్మని కవిత
6-12-15 ఆదివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో రెండవ రోజు శ్రీ సుందర కాండ పారాయణ మరియు శివాలయం లో శ్రీ జగదాంబా సమేత సోమేశ్వర స్వామి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యం లో వనభోజనాలు చిత్రమాలిక
6-12-15 ఆదివారం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో రెండవ రోజు శ్రీ సుందర కాండ పారాయణ మరియు శివాలయం లో శ్రీ జగదాంబా సమేత సోమేశ్వర స్వామి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యం లో వనభోజనాలు చిత్రమాలిక
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920)
నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920)
నడిమింటి భాగవత పతంజలి శాస్త్రి ,కామాక్షీ దంపతుల పుత్రుడు గోపాల శాస్త్రి .1853లో జన్మించి 1920లో మరణించాడు .అభినవ కాళిదాసు నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారి మనవడు .తండ్రీ తాతలవలేనే శ్రీ విద్యోపాసకుడు .శివ గౌరీ పరిణయం ,శ్రీ రామాభ్య్దయం కావ్యాలు రాశాడు .చిన్నతమ్ముడు నరసింహ శాస్త్రి ఈ అన్నగురించి చెప్పిన శ్లోకం తప్ప ఏమీ లభించలేదు –
‘’శ్రీ మంగళేశ్వరస్య పాత్రో గోపాల పండితః -పతంజలి కవేః పుత్రో కృతవాన్ గ్రంధ యుగ్మకం
శ్రీ రామాభ్యుదయం చైవ గౌరీ పరిణయం తదా –క్రుతవానాతిభక్త్యా తు శ్రీ విద్యోపాసకో త్తమః
శ్రీ మద్విభవ పౌర్ణాభ్యాంశ్రవణేగురువాసరే –అర్ధ రాత్యాం జహో ప్రాణాన్ ధ్యాయన్ శివ ముమాపతిం ‘’
35-శేష గోవింద
గోదావరి జిల్లా నందపురి లో శేష యజ్ఞేశ్వర ,భీమా౦బలకు జన్మించిన గోవింద తారవాత వారణాసి వెళ్లి పోయాడు .తాత అనంతుడు 17వ శతాబ్దం వాడు .గోవింద ‘’ప్రచండ గరుడ వ్యాయోగంలేక వినతానందం , గూడార్ధ పద వ్యాఖ్య ,గోపాల లీలార్నవ భాణఅమరు శతక వ్యాఖ్యా రాశాడు .
వ్యాయోగం – గరుత్మంతుడు తల్లి వినతా దేవి కోరికపై స్వర్గం వెళ్లి అమృత కలశం తెచ్చి తల్లికి ఆనందం కల్గించటం కద.వారణాసి బిందుమాధవ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .
‘’దర్పాహం పూర్వ భాగ్య వ్యతికర కుపితాన్యోన్య ఫూత్కారకారీ –స్ఫాయత్క ర్ణావ సద్విరస న ధామాని భాస్త్రికాద్మా తతీద్రే
సూత్రధారుని చేత ఈ వ్యాయోగం ఎక్కడ ఎప్పుడు ఆడిండీ వివరాలు చెప్పించాడు
కవి రాసిన రెండవ కావ్య౦ గూడార్ధ పద దీపిక అంతా వేదా౦తమే .మొదటి శ్లోకం లో కవి గురించి కొంత తెలుస్తుంది .
;;యత్ప్రసాదదీన సిద్ధి పురుషార్ధ చతుష్టయం –సారస్వత్యావతారం తమ్ తమ్ వందే శ్రీ మధుసూదనం ‘’
గోవిందకవి మధుసూదనుని శిష్యుడు అని తెలుస్తోంది ,మధుసూదన సరస్వతి ?తండ్రి శేష పండితుడని చెప్పాడు .
36-కుందుర్తి గోవింద మంత్రి
శాండిల్య గోత్రీకుడైన కుందుర్తి గోవింద మంత్రి కొండవీడు ప్రభువుల పోషణలోని వాడు .23కాండాల’’హరి వంశ సార చరిత్ర ‘’రాశాడు .దీనికి అప్పయ దీక్షితులు వ్యాఖ్య రాశాడు .అయినా కవి వివరాలు తెలియ రాలేదు కుప్పాంబిక శ్రీ దల్లి మంత్రి ల కుమారుడు .భారతీ పరిణయం రాసిన గోవిన్దమంత్రీ ఈయన ఒకరే కావచ్చునని బిరుదరాజు వారి అభిప్రాయం. వేంకటపతి రాయల ఆస్థానకవి .ఈతని మనవడు,రామయ మంత్రి కొడుకు కుందుర్తి వెంకటాచలకవి తెలుగులో మిత్ర విందా పరిణయ కావ్యం రాశాడు .హరి వంశ సారచరిత్ర నుండి ఒకటి రెండు శ్లోకాలు –
‘’అస్తీందు రింద్రానుజా చిత్త శుక్తి ముక్తామణిర్మూల దనం సురాణాం-ఆమ్లాన ముక్తం సముమాస సవస్త్య పురావిదః పుష్ప మపాం యమాహుః
చివరి శ్లోకం
‘’యదుస్తతో జాయత దేవా యాన్యాం యశోధనానాం ప్రధమాభి దేయః –వంశో యదీయే వరదః పురాణోగోప్త్రుం జనత్ శ్రీ హరి రావిశాతీత్ ‘’
సశేషం
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 33-జాను౦పల్లి గోపాల రాయ (1650)
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
33-జాను౦పల్లి గోపాల రాయ (1650)
‘’అష్ట భాషా బహిరి గోపాల రావు ‘’అని పిలువబడే గోపాలరాయ జానుం పల్లి వీరమ్మ ,వెంకట లకుమారుడు .17వ శతాబ్దం మధ్యభాగం లో జానుంపల్లివంశ రాజులు వనపర్తి సంస్థాన పాలకులు .1650కాలం వాడు .అతని రాజధాని వనపర్తి దగ్గరున్న సూగూరు .రెడ్డికులస్తులు .కవిపండిత పోషణతో బాటు స్వయంగా రాజు కవి .బహుభాషా వేత్త .ఎనిమిది భాషలు వచ్చు .’’అందుకే అష్ట భాషా బహిరి ‘’అని పిలిపించుకొన్నాడు .బహిరి అనేది వనపర్తి రాజుల వంశ పారంపర్య నామం .’’షడ్ దర్శన వల్లభ ‘’అనే సార్ధక బిరుదూ ఉంది .’’రామ చంద్రోదయం ‘’అనే యమక కావ్యాన్ని ,శ్రీరంగ మంజరీ భాణం’’ను రాశాడు .
రామ చంద్రోదయం క్లిష్టమైన యమక కావ్యం .5ఉచ్వాసాలతో 295శ్లోకాలతో ఉంది .వ్యాఖ్యానం లేకుండా అంగుళం కూడా కదలలేము .రాజు తానె స్వయంగా ‘’విజ్ఞానార్ధ దర్పణం ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .పూర్తీ రామాయణ గాద .మొదటి అధ్యాయం లో అయోధ్య వర్ణన ,రామాదుల పుట్టుక వర్ణించాడు .రెండవ దానిలో వసంత ఋతువు దశరధుని జలక్రీదాడున్నాయి .మూడులో విశ్వామిత్ర ప్రవేశం ,ఆయనతో సోదరులిద్దరు యజ్న రక్షణకు వెళ్ళటం బల అరిబల విద్యలు నేర్వటం .తాటాక సుబాహు వధ మారీచుడిని బాణం తో పార ద్రోలటం ,గంగావతరణం మిధిలా ప్రవేశం ఉన్నాయి. నాలుగులో జనకుని స్వాగతం సీతారాముల సమాగమం ,దశావతార వర్ణన లో పది దశల ప్రేమ ను వ్యక్తం చేయటం ,శివ ధనుర్భంగం ఉంటాయి. చివరి అధ్యాయం లో సీతారామ వివాహ వర్ణన చాలా విస్తృతంగా చేశాడు కవి .అయోధ్యకు తిరుగుప్రయాణం పరశురామ గర్వ భంగం ఉన్నాయి .చివరి శ్లోకాలలో రాముడిని అడవికి పంపటం వాలివధ ,సుగ్రీవ పట్టాభిషేకం సేతు బంధనం రావణ వధ ,శ్రీరామ పట్టాభ్హి షేకం తో పూర్తీ .
వ్యాకరణ విద్యార్ధులకు,కొత్తగా కవిత్వం రాసేవారికి ఈ కావ్యం కర దీపిక .ప్రారంభ శ్లోకం –
‘’శ్రీ వేంకట పురపతిం స్థిర సత్ప్రభావం శ్రీ రామ చంద్ర మనిశం హృది భావ యామి –నశ్యత్య బాహ్యమపి భూరి తమః ప్రజానాం సర్వార్ధ సాధ్విది గమో స్తి చ యత్ప్రసాదాత్ ‘’
కవి తన గురించి తానూ ఇలా చెప్పుకొన్నాడు
‘’శాట్చాస్త్రీ పార దృశ్వా సరస మృదు వచరారాల్లాధ్య నానా కవీంద్ర –స్తుత్యః స్వారేష భాషా కృత బహు మధురోదార చిత్ర ప్రబందః ‘’ అని చెప్పుకొని ఇంత గొప్ప కవిత్వం తనకు శ్రీ రామ చంద్రుని కటాక్షం వలననే లభించిందని వినయంగా చెప్పుకొన్నాడు –
‘’అక్రుతసనామా ధీరం యమక కృతిం కాళిదాస నామా ధీరం –అన్యో నామా ధీరం సుకవిం తత్ప్రధయాయి తుమదునా మధీరం .
శబ్దాలతో చెడుగుడు ఎలాఆడాడో చూద్దాం –
‘’యతో యతో యతో యతోదయం పికర్తునిధి సః-రమా రమా రమా రమాయత తాత తోధవైజయీ ‘’
రెండర్ధాల శ్లోక వైభవం చూద్దాం –
‘’మంజులతా గణికానాం జగృహే మధుపేన పుష్పతాగనణికానాం-జాతిరుత గణికానాం ననుశ్రుతా నోచితజ్ఞాత గణికానాం ‘’ఈ శ్లేష పగలకొట్టి అర్ధం చేసుకోవటానికి శోష పడాలి .
ప్రేమలో ఉన్న పది అవస్థలను అద్భుతంగా వర్ణించాడు .చివరికి రామ రాజ్యాన్ని వర్ణించాడు –
‘’రామితా గాదిభి శ్శామితా జనతా శమితాన నాశ మితాన వ్రుషాః-పరమాయురవాప రమామాఖిలః పరమామపి నోపరమార హృది ‘’
గోపాల రాయని రెండవ రచన ‘’శ్రీ రంగ మంజరీ భాణం’’ను మృదు మధురంగా రాశాడు .మహబూబ్ నగర్ శ్రీరామాలయ ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .తన రాజధాని సూగూరును వర్ణించాడు .తన భాణాన్ని’’కోష్యేష ప్రచురే గిరం మధురిమా కోప్యార్ధ గంభీరిమా –సర్వం నూతన మేవ సూత్రితమహో యన్నాన్య సాధారణం –భాణో స్మిన్ కవినాసయే సుమహాన్ భాగ్యస్య పాకోహినః ‘
కాళిదాస కుమార సంభవాన్ని గుర్తుకు తెస్తుంది .శ్రీరంగ నాద దర్శనానికి రధాలలో వచ్చే వివిధ దేశాలనుంచి వచ్చిన మహిళను చక్కగా వర్ణించాడు .ఘూర్జర ,నేపాల లాట దేశ స్త్రీలను వర్ణించాడు .చంద్రోదయం తో సమాప్తి చేశాడు .భరత వాక్యమూపలికాడు .అక్కడక్కడ ప్రాకృతం వాడాడు .చివరి శ్లోకం –
‘’దేవః పంచ శరః ప్రపశ్యతు వియుగ్దీనాన్ దయాలోకితే –స్స్వాన్న్కాంతా నను గృహ్నతాంమృగ ద్రుశ స్సంత్య క్తమా నాస్శ్వయం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-15-ఉయ్యూరు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు
-నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4
32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు
జనన విద్యాభ్యాసాలు
ఆధునిక కాలం లో గీర్వాణ భాషలో లోతైన పాండిత్యం కలిగి మహా ప్రతిభావంతంగా కావ్య రచన చేసి ఆంద్ర దేశానికి చెందిన అసలైన పీఠంఅయిన పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులుగా గౌరవం పొంది ,సహజ పాండితీ గరిమతో ,అరుదైన శాస్త్ర పాండిత్యం తో బహు గ్రంధ కర్తృత్వం తో వన్నె కెక్కిన అసమాన పండితకవులు ,మన విజయ వాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మగారు .శ్రీ గరిమెళ్ళ సూర్య నారాయణ ఘనాపాఠీ , శ్రీమతి సూర్య కాంతమ్మల దంపతుల పుత్రులు .తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటతాలూకా ‘’అవిడి ‘’గ్రామం లో 5-8-1950లో శ్రీ వికృతినామ సంవత్సర నిజాషాఢ శ్రీ కృష్ణాష్టమి నాడు జన్మించారు .సంస్కృతాంధ్రాలలో ఏం .ఏ .సాధించారు .
ఉద్యోగ సోపానం
తూర్పు గోదావరిజిల్లా అమలాపురం లోని ఎస్ .కే.బి ఆర్ .కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా1979నుండి 89వరకు పని చేశారు.తర్వాత విజయ వాడ కే బి యెన్ కళాశాల లో 1989-నుండి 2007వరకుతెలుగు ఉపన్యాసకులుగా సేవలందించారు. ఉద్యోగ విరమణానంతరం విజయవాడలో స్థిర పడ్డారు .
వివాహం సంతానం
సోమయాజులు శర్మగారు ముమ్ముడివరం కు చెందిన శ్రీ నూకల శ్రీ మన్నారాయణ ,శ్రీమతి రాజేశ్వరి దంపతుల కుమార్తె శ్రీమతి రాజ్య లక్ష్మి గారిని 1996లో వివాహ మాడారు .ఈ దంపతుల వంశోద్ద్దారకుడు ,కులదీపకుడు రవి తేజస్సుతో విరాజిల్లే ఛి సూర్య తేజ.
అందుకొన్న బిరుదులూ ,పదవులు
శాస్త్ర సాహిత్యాలలో సోమయాజులుగారి ప్రతిభ కు గుర్తింపుగా శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పండితులుగా గౌరవ స్థానం లో ఉన్నారు .కృష్ణాజిల్లా అధికార భాషా సంఘ .సభ్యులు .
సోమయాజులు శర్మగారుపొందిన ‘’సహజ పాండిత్య ‘’బిరుదం అన్వర్ధం..శ్రీ పుష్పగిరి శంకరాచార్య స్వామి ‘’విద్యా విభూషణ ‘’బిరుదునిచ్చి సత్కరించారు .విజయవాడ దేవీఫౌందేషన్ వారు ‘’తత్వ శాస్త్ర పారంగత ‘బిరుదు ప్రదానం చేసి సన్మానించారు .
ప్రవ్రుత్తి
సంస్కృతాంధ్ర భాషలలో శాస్త్ర ,కావ్య గ్రంధ రచన .పుష్పగిరి పీఠ చాతుర్మాస్య సమయం లో అవధానాలు నిర్వహించటం .అముద్రిత తాళ పత్ర, లిఖిత గ్రంధ సేకరణ ,వాటిని పరిష్కరించి శుద్ధప్రతులను తయారు చేసి భద్ర పరచటం ,సాహిత్య ,ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారి ప్రస్తుత ప్రవ్రుత్తి ,వ్యాసంగం .
గబహుగ్రంద కర్త
శ్రీ సోమయాజులు శర్మగారు అనేక గ్రంధాలను గీర్వాణ ,ఆంధ్రాలలో రచించారు .అన్నీ ప్రసిద్ధి చెందినవే .
సంస్కృత రచనలు
1–ద్వాదశీ వ్రత మహాత్మ్యం (అంబరీషోపాఖ్యానం )-దీన్ని మైసూరు సుధర్మ సంస్థ ప్రచురించింది 2మహా భారత కంట కోద్దారః 3-కర్నాటసాహిత్య దర్శనం (హిస్టరీఆఫ్ కన్నడా లిటరేచర్ ఇన్ సాంస్క్రిట్ )
సంస్కృత లఘు కృతులు
1-శ్రీశైల లింగాష్టకం 2గోపాల కవేః కాలః 3-సుధార్మాభి నందనం 4-సమస్యా పూరణం 5-శ్రీ వినాయక పంచ రత్నం 6-అశ్వధాటీ వృత్త లక్షణ విచారః 7-శ్రీ వెంకటేశ్వర స్తుతిః 8-హల్లోహల శబ్దార్ధ విమర్శః 9-భట్ట వచనం సత్యమేవ 10-సుధార్మాభి వర్ధనం 11-శ్రీరామ నవమీ 12-ఆమోదః (శ్రీ మహేశ మాలా పీఠిక )13-కళావికాసః (పుష్ప బాణ విలాస పీఠికా )14-ఆనంద మందారః (బెల్లం కొండ రామ రాయ కవిః-అముద్రితం )15-అమృత సందేశః (మేఘ సందేశ పీఠికా)
తెలుగు రచనలు
పద్యకావ్యాలు –వాల్మీకి వృత్తాంతం ,శ్రీ వెంకటేశ్వర శతకం ,శ్రీ వెంకట రామ యశో వికాసం ,శివ మహాత్మ్యా ఖండం ,శివ కర్ణామృతం
లఘు పద్యకావ్యాలు –పంచ రత్నాలు ,సరస్వతీ దండకం ,దివాకర్ల ప్రశంస ,విశ్వనాధ మహా కవి ,శ్రీ రామ విభక్తి స్తవం ,వారణ మాల ,తెలుగు భాషా వైభవం ,ఉగాది పద్యాలు ,కర్షక నవ రత్న మాలిక .
శర్మగారు అనేక గ్రంధాలకు బృహత్ పీఠికలు రాశారు –ఆంద్ర మాఘానికి భూమిక ,శంకర విజయానికి ఆముఖం ,వాసుదేవ మననం కు ఉద్యోతం ,సూత సంహితకు న్యాసం ఆంధ్ర బ్రహ్మ సూత్రాలకు వేదాంత దర్శనం మొదలైన బృహత్ పీఠికలను ,13రాశారు .
లఘు పీఠికలు –కొప్పు లింగేశ్వర మహాత్మ్యం ,మోక్షసోపానం గాయత్రీ కల్ప వృక్షానికి వరివస్య విష్ణు సహస్ర నామ స్తోత్రానికి ప్రవేశిక ,మారుతి రామాయణానికి సంజీవని ,పరివ్రాజ చంద్రికకు విన్నపం మొదలైన 33గ్రంధాలకు లఘు పీఠికలు సంతరించారు .
వ్యాసాలు
శర్మగారు శర పరంపరగా వ్యాస వాహిని ప్రవహింప జేశారు .భాగవత సంపద ,ఈశాన సంహిత ,కల్ప వృక్షం –నావిక పరిభాష ,బెల్లంకొండ రామరాయ కవి ,కోన సీమ వాజ్మయ సేవ ,కల్ప వృక్షం –నాట్య శాస్త్రం ,సంగీత శాస్త్రం ,సమగ్రాంధ్ర సాహిత్య సమాలోచనం ,మకర సంక్రాంతి ,చత్వారి శృంగాః ,శ్రీ లంకా వెంకట రాయ శాస్త్రి ,ప్రయోగ రత్నమాల మొదలైన 37వ్యాసాలను వివిధ విషయాలపై రాసి వెలుగు నిచ్చారు .
అనువాదాలు
తరల సంగ్రహం ,తత్వ బోధ ,సర్వ సిద్ధాంత సంగ్రహం ,సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి ,తైత్తిరీయోపనిషత్ ,పరివ్రాజక చంద్రిక మొదలైన 6అనువాద గ్రంధాలు రాశారు .
వ్యాఖ్యాన లహరి
సోమయాజులు శర్మగారు అనేక కావ్యాలకు వ్యాఖ్యానాలు రచించారు .జగన్నాధ పండిత రాయల యమునాలహరికి గంగా లహరి ,విష్ణు లహరి లకు –అమృత ధారా వ్యాఖ్య ,అనులోమ విలోమ రాఘవ యాదవీయానికి –హరిప్రియా వ్యాఖ్య ,అశ్వ దాటీ కావ్యానికి –నవ వీధీ వ్యాఖ్య రచించి ఆ కవుల కవితా ప్రభావాన్ని తెలియ జేశారు .
పరిష్కరణలు
శ్రీ శర్మగారు గ్రంధ పరిష్కరనలోనూ తన ప్రతాపాన్ని ప్రదర్శించారు –సూతసంహిత ,శ్రీ భద్రాద్రి రామ శతకం ,శబర శంతన విలాసం ,భోగినీ దండకం ,స్తోత్ర ముక్తావళి ,తైత్తిరీయోపనిషత్ ,మైరావణ చరిత్రం ,కూచి మంచి సామ్బకవి రాసిన కుమారసంభవం మొదలైన 10 గ్రంధాలు పరిష్కరించి ప్రచురణకు తోడ్పడ్డారు .
అముద్రితాలు
సోమయాజులు శర్మగారి అముద్రిత గ్రంధాలు ముఖ్యం గా మూడున్నాయి అవి –కల్ప వృక్ష శిల్ప సమీక్ష ,ఆంద్ర పురాణ సమీక్ష ,పోతన కృతులు
గరిమెళ్ళ వారిరచనలపై పరిశోధనలు
1-గరిమెళ్ళ వారి పద్య కావ్యాలపై శ్రీ జి చలపతి రావు (నాగార్జున విశ్వ విద్యాలయం ),2-కర్ణామృత త్రయం –ఆంధ్రానువాదములు –తులనాత్మక పరిశీలన –శ్రీ షేక్ బాపూజీ (నా వి వి.)3-గరిమెళ్ళ సంపూర్ణ వాజ్మయం –శ్రీ పి.ఉమానాద శర్మ (బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం ) పరిశోధనలు చేసి పి.హెచ్ డి పొందారు .మేలు రచనలు గరీయంగా చేసి గరిమెళ్ళ వారు ఆంద్ర సాహిత్యాకాశం లో ప్రకాశిస్తున్నారు .వారు నిజంగా సాహిత్య యజ్ఞం చేసిన సోమయాజులు .మరిన్ని సార్ధక గ్రంధాలు వారు వెలువరిస్తారని ఆశిద్దాం .
ఈ రచనకు ఆధారం –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు స్వయంగా ఈ రోజు నాకు పోస్ట్ లో పంపిన వారి ‘’బయో డేటా’’వారి రచనలు .ఇందుకు వారికి కృతజ్ఞతలు .వారి చిరునామా ,ఫోన్ నంబర్ అందజేసిన శ్రీ రావి మోహనరావు (చీరాల )వారికి ధన్యవాదాలు.
సోమయాజులుగారి ఫోటో జత చేశాను చూడండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-15-ఉయ్యూరు

















