చరిత్ర లేకుంటే భవిష్యత్తు లేదు- వకుళాభరణం రామకృష్ణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ మన్మధ ఉగాది 21-3-15 శనివారం 4 చోట్ల నా పంచాంగ శ్రవణం రాత్రి 7 గం లకు గండిగుంట దత్త దేవాలయం లో చిత్రమాలిక …

శ్రీ మన్మధ ఉగాది 21-3-15 శనివారం 4 చోట్ల నా పంచాంగ శ్రవణం రాత్రి 7 గం లకు గండిగుంట దత్త దేవాలయం లో చిత్రమాలిక …

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ మన్మధ ఉగాది – sakshi నా పంచాంగ శ్రవణం

sakshi 21 - 3 - 15

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -22

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -22

11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ -2

లూసీ ని ఎలా ఎందుకు ఫ్లాబర్ట్ ప్రేమించాడో అర్ధం కాక అతని మిత్రులు జుట్టు పీక్కున్నారు .ఆమె స్వతం ప్రకటనా చాతుర్యం లో దిట్ట అని ,అందరి దృష్టిని ఆకర్షించటానికే తాపత్రయ పడుతుందని ‘’she had a natural lack of naturalness ‘’అని బల్ల గుద్ది మరీ చెప్పారు .ఇవేమీ మనవాడికి కనిపించలేదు ఆమె అంటే ఒక విపరీతమైన ఫాసినేషన్ మాత్రమే ఉంది..తండ్రిని ,సోదరిని కోల్పోయి శూన్యం లో బతుకుతున్న ఫ్లాబర్ట్ ను ఆమె ‘’he was sexually aroused .as an un tamed buffello from the wild of America ‘’.అయినా ఫ్లాబర్ట్ చాలా జాగ్రత్తగానే వ్యవహరించాడు .మొదటిసారి ఆమెతో ప్రేమ విహార యాత్ర చేసి తిరిగి వచ్చాక ‘’నాకు భౌతిక ప్రేమ రెండవ స్థానం .నేను ఆనందాన్ని  కల్గించిన మొదటి స్త్రీవి నువ్వే .ఇంకెవరూ లేరు .చివరిదాకా నన్ను అర్ధం చేసుకొంటావని ఆశిస్తున్నాను .నాదారిలో నిన్ను ప్రేమించే అవకాశం ఇవ్వు .నాకోపాలు తాపాలు ఉద్రేకాలు అన్నీ భరించగలవు అనుకొంటాను .నన్ను బలవంతం గా ఏ పనీ చెయ్య నివ్వద్దు .అప్పుడే నేను ఏదికావాలన్నా చేయగలను ‘’అని కుండ బద్దలు కొట్టి సారీ ‘’గుండె బద్దలు కొట్టి ‘’చెప్పేశాడు..ఇలా పూర్తిగా కొనసాగిందో లేదోకాని ఆమె బలవంత పెట్టినప్పుడు సంకోచించాడు ,ఆమె బాగా అడ్వాన్స్ అయితే వెనక్కి తగ్గాడు .తన తల్లికి ఇబ్బందికలిగించే ఏ పనీ చేయటానికి మాత్రం సాహసించ లేదు ఫ్లాబర్ట్ .ఆమెను తల్లికి తన ‘’లిటరరీ ఫ్రెండ్ ‘’అనే చెప్పాడు .

ప్రేమ వ్యవహారాలను గురించి రాసే విషయం లో ఫ్లాబర్ట్ కొంత  ఆత్మ రక్షణ తోనూ కొంత తప్పించుకొనే పద్ధతిలోను రాశాడు .ఎవరు ఎలాంటి వారైనా ఫ్లాబర్ట్ కోరుకొన్నది ఏకాంతమే ‘’ఏ  కాంతనూ’’ కాదు  .ఎవరొ ఒకరు  భార్యగానో మిస్త్రేస్ గానో ఉండటం అతనికి నచ్చనిపని .తనను తానూ పూర్తిగా పుస్తకాలకే అర్పించుకొన్న వ్యక్తీ ఫ్లాబర్ట్ .’’మంచి పరిశుభ్రమైన గది ,వెచ్చదనం ,కావలసినంత విశ్రాంతి అందుబాటులో అనంతమైన సాహిత్యం  ఉంటె నాకు ఇంక ఏమీ అక్కరలేద’’న్నాడు .అతన్ని మురిపించటానికి మర్చిపోలేదని తెలియ జేయటానికీ లూసీ అప్పుడప్పుడు కానుకలు ,తన బెడ్ రూమ్ స్లిప్పర్లు అనేక రకాల జుట్టు కత్తిరింపులు పంపేది వీటికి బదులుగా ఫ్లాబర్ట్ ఆమెకు ఏమీ పంపేవాడుకాడు .కొత్త సంవత్సరం గిఫ్ట్ గా ‘’కిస్ ‘’అంద జేస్తున్నట్లు రాసేవాడు .ఆమెలో’’ ప్రేమ త్రాచు’’ బుసలు కొట్టేది .20 మీద పడినా ఫ్లాబర్ట్ ఇంకా ఒక్క పుస్తకమూ ప్రచురించలేదు .ఆతను ప్రాధమికంగా రచయిత ,ఆ తర్వాతే ప్రేమికుడు .సన్నివేశాలు ,సంఘటనలు ,అనుభవాలు ,భావోద్రేకాలు అన్నిటిని జాగ్రత్తగా అక్షర బద్ధం చేశాడు ‘’మేడం బోవరి ‘’నవలలో .ఈ రచనా వ్యాసంగం లో పూర్తిగా అంకితమైపోయి ప్రేమ కు క్రమంగా దూరమైపోయాడు .

రెండు పుస్తకాలు ‘’సెంటిమెంటల్ ఎడ్యుకేషన్ ‘’,టెంప్టేష న్స్ ఆఫ్ సెయింట్ ఆంథోని ‘’అన్న రెండు పుస్తకాల మీద తీవ్రం గా ద్దృష్టిపెట్టాడు .స్నేహితుడు డూకాంప్ తో తూర్పు దేశాలు తిరిగి వచ్చాడు .అలేక్సాండ్రియ ,నైల్ నది ,సిరియా ,కాన్ స్టాంటి నోపుల్ ,రోమ్ మొదలైనవన్నీ తిరిగి చూశారు .తల్లి అనుజ్న ఇచ్చింది .ఈ టూర్ అతని ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు సలహా ఇవ్వగా కొడుకు  డిప్రెషన్ లోంచి బయటపడతాడని తల్లి ఆశించింది .చాలాకాలం గడుపుదామనుకొన్నా ఇంటి బెంగ పడి త్వరలోనే తిరిగి వచ్చాడు .నార్మండిలో ఉండగా నైల్ నదిని కలగనేవాడు .ఈపర్యటనకు ముందే  డూకాంప్  ను ఇంటికి పిలిపించుకొని తాను  రాస్తున్న టెంప్టే షన్స్ చాప్టర్లు చదివి వినిపించాడు .ఇందులో ‘’రోమాం టిజం ‘’ను పీకల్లోతుగా రాశాడు . ఫాంటసీ దట్టించాడు .దీన్నే ‘’ ఫాంట స్మ గోరియా ఆఫ్ మిత్స్ ‘’అన్నారు .ఇందులో దెయ్యం,రుషి కద పురాతనమైనదే ,నరకతీవ్రతలు,ఒలింపస్ దేవతలు ,హిందూ దేవా దేవతలు ,క్రిస్టియన్ మత ప్రీస్టులు ,భవిష్యత్ చెప్పే సూద్ సేయర్స్ ,నాగారాధకులు ,అమరవీరులు ,అద్భుతాలు స్పినిక్స్ వగైరా మసాలా అంతా దట్టించి నూరాడు .ఇదంతా చదివితే’’ ప్రోజ్ పోయెం’’అన్న అనుభూతి కలుగుతుంది .ఇవన్నీ చదివి వినిపించాడు  డూకాంప్ కు  .చదవటం పూర్తవగానే అంతా నిశ్శబ్దమే రాజ్యం చేసింది .చివరికి డూకాంప్ తల ఊపి షేక్ హాండ్ ఇచ్చి ‘’నువ్వు సంగీతం సృస్టిం చా లనుకోన్నావు .కాని రణగొణ ధ్వని తప్ప ఏమీ సాధించ లేకపోయావు ‘’అన్నాడు .అప్రతిభుడై నాడుకాని దీన్ని ఒప్పుకోలేదు .బౌల్హీట్ కూడా ఇదే అభిప్రాయం చెప్పాడు . ఏకీభవించని  ఫ్లాబర్ట్ ఇరవై ఏళ్ళు అతనితో మాట్లాడలేదు ..చివరికి మళ్ళీ తిరగ రాసి ఏడేళ్ళు దాచిపెట్టాడు దాన్ని .1876 మార్పులు చేర్పులు పూర్తీ అయ్యాక ప్రచురించాడు .

ముప్ఫై వయసులో మన్మధ  సౌందర్యం తో చుక్కల్లో చంద్రుడిగా వెలిగిపోయాడు ఫ్లాబర్ట్ .లూసీ మళ్ళీ ఊరిస్తూనే ఉంది .అతని తిరస్కారాన్నేమీ లెక్క చెయ్యలేదామే .ముగ్గులో దించే ప్రయత్నం మానలేదు .’’నువ్వు నా హృదయం వెనక గది లో కొలువై ఉన్నావ్.’’అని చెప్పి అతని తల్లి కి దగ్గరై ప్రయత్నాలు చేయ ప్రారంభించింది .ఆమె ఉన్న ఇంటికి వెళ్లగా తలుపు దగ్గరే నిలవరించి ఫ్లాబర్ట్ ఆమెను వెనక్కి పంపేశాడు .ఇంతమాత్రం చేత ఆమెకు ఉత్తరాలు రాయటం మాత్రం మానలేదు ఫ్లాబర్ట్ .టెంప్ టేషన్’’సబ్జెక్ట్ లాంటిదికాక వేరొక ప్రాజెక్ట్ మీద ఆలోచిస్తున్నాడు .ఫ్లాబర్ట్ స్నేహితుడు డాక్టర్ డిలానీ భార్య వలన ఇబ్బందులు పడి ఆత్మ హత్య చేసుకోన్నాడని తెలిసి మనసు కలత చెంది నాలుగేళ్ళు బాధా తప్త హృదయం తో గడిపి మేడం బావరి ‘’రాశాడు. అంతకు ముందెన్నడూ చూడని గొప్ప సాహిత్యానికి సృష్టికర్త అనిపించుకొన్నాడు ప్రపంచం లోనే గొప్ప నవలా రచయిత అని ప్రసిద్ధి చెందాడు .యదార్ధ వాది గా అవతారం ఎత్తాడు ఫ్లాబర్ట్ .దీన్ని చదివి సోమర్సెట్ మాం గొప్పగా స్పందించి ‘’Flaubert created the modern realistic novel and directly or indirectly influenced all writers of fiction since his day .The characters are  drawn with consummate skill. It never occurs to us that they are figures in a novel..Homais is a creature as humorous as Mr  Micawber as familiar to the French as Micawber is to the English ..అన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-15 ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆదర్శ పురుషుడు

ఆదర్శ పురుషుడు

  • 22/03/2015
  •  -పసుమర్తి కామేశ్వరశర్మ

‘ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితః’. ఈ విశ్వాన్ని పరిపాలించేది ధర్మం. ‘ధృ’ అనే ధాతువు నుండి వచ్చింది ‘ధర్మం’ అనే పదం. ‘ధృ’ అంటే ధరించుట, ఆధారంగా నిలుచుట అనే అర్థాలున్నాయి. ధర్మం – ఈ విశ్వానికి ఈ సమాజానికి, ఈ వ్యవస్థకి, ఈ వసుధైన కుటుంబానికి, వ్యక్తికి, ఆధారంగా నిలుస్తోంది. ధరించేది కనుక ధర్మం అన్నారు. ‘సర్వే ధర్మం ప్రతిష్ఠితం’ అన్నారు. ‘ధర్మం’ గురించిన విశేషాలను చెప్పేవి – వేదములు. ‘వేదోఖిల ధర్మమూలం’ ఉపనిషత్తులు, పురాణేతిహాసములు, భగవద్గీత మున్నగు వాటిలో ధర్మ సూత్రములు చెప్పబడ్డాయి. ధర్మాన్ని కథారూపంలో రసవంతంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పిన ఆదికావ్యం ‘శ్రీమద్రామాయణం’ ఉత్తమ మానవ ధర్మాలను లోకానికి చాటటానికే రామాయణం రచించాడు – వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి పదహారు మంచి గుణాలు చెప్పి, ఈ గుణాలన్నీ కలిగిన వ్యక్తి లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? అని అడిగాడు, లోకసంచారి అయిన నారద మహర్షిని. నారద మహర్షికి వెంటనే సమాధానం దొరకలేదు. కాస్త ఆలోచించి – ‘ఉన్నాడు, లేకేం’ అని, అన్ని సద్గుణాలు కలిగిన ధర్మస్వరూపుడు, దశరథ కుమారుడైన శ్రీరామచంద్రుడని’ నొక్కి వక్కాణించి చెప్పాడు. వాల్మీకి మహర్షి నారదుడు చెప్పిందంతా విని, సత్యసంధుడు, దృఢవ్రతుడు ధర్మాత్ముడయిన శ్రీరాముని సచ్చరిత్రను ఒక కావ్యంగా వ్రాయాలని సంకల్పించాడు. ఆ ఇరువురు ఒక శుభముహూర్తాన కలిశారు, ఆ సంఘటనే మానవాళికి మార్గదర్శకంగా, మొట్టమొదటి కావ్యంగా, అందింపబడింది శ్రీమద్రామాయణంగా. రామాయణంలోని ఆధ్యాత్మికతను తెలుసుకుందాం. రామ+అయనం = రామాయణం. అంటే, రామ అయనం – అనే రెండు మాటలతో ‘రామాయణం’ ఏర్పడింది. ఆయనము – అనే మాటకు, గమనము, గయ్యము అనే అర్థాలున్నాయి. ‘నాన్యః పంథా అయనాయ విద్యతే’ అన్నది వేదం. అయనం – అంటే అక్కడ చేరవలసిన స్థానం. దాన్ని చేర్చేది – పంథాః అనే మాట. దానే్న పరాయణమని కూడా పేర్కొన్నారు. పరమమైన గమ్యమేదో – అది పరాయణం. ‘సత్యజ్ఞానానంద రూపా, సామరస్య పరాయణ’ అన్నది లలితా సహస్ర నామం. కనుక, ‘రామాయణం’ అంటే – రాముడే గమ్యం. అనగా, ఆత్మ తత్త్వమే ఎప్పటికైనా మనం చేరవలసిన స్థానం. ఇదే ఆత్మారామ, తారక రామ తత్త్వం. సత్యము, ధర్మము, త్యాగము, కర్తవ్య నిష్ఠ, పితృవాక్య పరిపాలన, మాతృభక్తి, భ్రాతృ ప్రేమ, అనురాగము, క్షమ, స్నేహము, సౌశీల్యము, వాత్సల్యము, ఔదార్యము, సహనము, సౌహార్ధము – మొదలగు గుణములచే మానవ జాతికి ఆదర్శప్రాయుడైనాడు – శ్రీరామచంద్రుడు. రాముని ధర్మ నిరతి నాటికి, నేటికి, ఏనాటికి అందరికీ ఆదర్శప్రాయమే. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసా దాసేత్ సాక్షాత్ రామాయణాత్మనా పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు దశరథాత్మజుడైన రాముడుగా అవతరించగానే, పరమాత్మ గుణ వర్ణనైక పరాయణమగు వేదము వాల్మీకి మహర్షి నోట శ్రీమద్రామాయణము రూపములో వెలువడినది. పరిపూర్ణ మానవుడుగా ప్రవర్తించి, ఎన్ని కష్టములు వచ్చినా స్వధర్మమును వీడక, ధర్మ పథాన్ననుసరించి, లోకానికి ధర్మమాహాత్మ్యమును చాటి చెప్పిన అవతార పురుషుడు -శ్రీరామ చంద్రుడు. మానవ జీవితంలో స్వార్థానికీ, ధర్మానికీ ఎప్పుడూ సంఘర్షణే. స్వార్థం – మనస్సును ఇంద్రియాల వైపు మళ్లిస్తుంది. ధర్మం, మనస్సును ఇంద్రియాల నుండి దూరం చేస్తుంది. స్వార్థం – స్వసుఖాన్ని కోరుకుంటుంది. ధర్మం – పరహితాన్ని కోరుకుంటుంది. స్వార్థం – భోగాన్ని కోరుకుంటుంది. ధర్మం – త్యాగాన్ని ప్రబోధిస్తుంది. ‘త్యాగేనైకే అమృతత్వ మానసుః’ స్వార్థానికీ, ధర్మానికీ జరిగే సంఘర్షణే – జీవితం. జీవితంలో స్వార్థాన్ని త్యజించి, ధర్మాన్ని అనుసరించే మానవుడు – అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తాడు, అందరి మన్ననలను పొందుతాడు, మహోదాత్తుడవుతాడు. అర్థ, కామాల కొరకు, అధర్మ మార్గాన్ని అవలంబించేవారు, స్వార్థబుద్ధితో పతనవౌతారు, పాపాత్ముడవుతాడు. రాముడు – స్వార్థరహితుడు, త్యాగనిరతుడు, ధర్మపరుడు. అందుకే ఎన్ని యుగాలకైనా రాముడు ఆదర్శవంతుడు. నడుస్తున్న కాలానికీ ఆయన మార్గం ఆచరణీయం. ఇదే రామతత్త్వం. పుత్ర కామేష్ఠి యాగం పూర్తి అయిన తరువాత, పనె్నండో నెల అయిన చైత్రమాసంలో, నవమి తిథినాడు, పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో గురు, చంద్రులుండగా, ఐదు గ్రహములు ఉచ్ఛస్థితిలో వుండగా కౌసల్యాదేవి, జగత్కల్యాణ కారకుడైన శ్రీరామచంద్రుణ్ణి ప్రసవించింది. ఇది క్రీస్తు పూర్వం 5114వ సంవత్సరం జనవరి నెల 10వ తేదీ అని కొందరు శాస్త్ర పండితులు అభిప్రాయం వెలిబుచ్చారు. అనగా రాముడు జన్మించి సుమారు 7130 సంవత్సరాలైనదని ఒక ఆంగ్ల మాస పత్రిక పేర్కొన్నది. శ్రీరాముని జీవితం – ఒక క్షీరసాగర మథనం. ఆయన జీవితంలో ఎన్నో హాలాహలం లాంటి చేదు అనుభవాలు అనేకం ఎదుర్కొన్నాడు. ధర్మాన్ని ఆశ్రయించి, స్వార్థాన్ని త్యజించి, ధార్మికునిగా జీవితాన్ని గరపిన పూర్ణ పురుషుడు – శ్రీరాముడు. రామునిలో ఈ ధార్మికతే వాల్మీకిని బాగా ఆకర్షించింది. ధర్మాన్ని రాశిపోస్తే – రాముడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని రాక్షసుడైన మారీచుడి చేత పలికించాడు. వాల్మీకి మసర్షి, ఎవరితో – ధర్మబద్ధం గాని కాముకుడైన రాక్షసరాజు రావణునితో. ఇంతకంటె నేటితరం వారికి రామాయణం, ఇంకా ఏం చెప్పాలి. ‘అతఏవ మున యోశ్చ నాగాః గంధర్వాః గుహ్యకాః తథా ధార్మికం పూజయం తీవ న ధనాఢ్యం న కాముకం’ కాముకులైన వారిని, గుణహీనుడైన ధనవంతుణ్ణి ఈ లోకం పూజించదు, హర్షించదు. ధార్మికులైన వారిని మాత్రమే గౌరవిస్తుంది. ఇదే రామునిలోని ధార్మికతా తత్త్వం. అయోధ్యకు వచ్చాడు విశ్వామిత్రుడు. యాగ రక్షణకై – రాముణ్ణి తీసుకొని వెళ్లటానికి. దేహమే శాశ్వతమనుకొన్న దశరథుడు, అంతరార్థాన్ని తెలుసుకోలేక, తానే వచ్చి ఆ కార్యాన్ని నెరవేరుస్తానంటాడు. అప్పుడు దశరథుని వారించి, విశ్వామిత్రుడు- ‘నీ కొడుకును గైకొని చని మాకాకలియంచు దిందుమా పిచ్చి నృపా, మాకడ బ్తిశస్త మన్త్ర వ్యాకృతికలదద్ది నేర్పెదమింతే’ అని అంటారు విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో. దీనినిబట్టి ఎక్కడ ధార్మికత ఉంటుందో, ఎక్కడ స్వార్థరహితం ఉంటుందో, ఎక్కడ విశ్వజనీనత ఉంటుందో, ఎక్కడ అతి పరాక్రమము ఉండి, సత్వగుణంతో నైతిక ధర్మపాలన ఉంటుందో, ఎవరు తనకు ప్రాప్తించిన ‘శక్తి’ని విశ్వ కల్యాణానికి ఉపయోగిస్తారో – వారికి ఆ శక్తి ప్రదానం జరుగుతుంది. తన వద్ద ఉన్న శక్తివంతమైన అస్తశ్రస్త్రాలను జగత్కల్యాణానికి ఉపకరించేవాడు రాముడని గ్రహించి, అతనికి వాటిని ప్రదానం చేసే నిమిత్తం రాముణ్ణి తీసుకొని వెళ్లటానికి అయోధ్యకు వచ్చాడు – విశ్వామిత్రుడు. ఇన్ని అస్త్ర శస్తమ్రులున్న విశ్వామిత్రుడు, తన యాగాన్ని తను రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. ఇందులో మనకి రాముని లోకకల్యాణ తత్త్వాన్ని విశ్వామిత్రుని పరంగా విశదపరచబడింది. శ్రీరామునికి, శస్త్రాస్త్ర విద్యను బోధించిన గురువు – పరమ సాత్విక మూర్తి వశిష్ఠుడైతే, ఆయన చేసే దుష్ట విక్షణ శిష్ట రక్షణకు అవసరమైన శస్త్రాస్తమ్రులను అందించిన గురువు – రజస్తమో గుణ రాశియై చివరకు సత్వ గుణాతీతుడైన రాజర్షి, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. విద్య నేర్పిన గురువు పరమ సాత్విక మూర్తి బ్రహ్మర్షి వశిష్ఠుడు. అందుచేత శస్త్రాస్త్ర సామర్థ్యం లోకోపకారణమయింది. రాముడు లోక పూజ్యుడయినాడు. ఇది ఈనాటి అణు విజ్ఞానాన్ని విశ్వకళ్యాణానికి వినియోగించాలని హెచ్చరిస్తోంది. రాముడు సత్యవాక్య పరిపాలకుడు. రెండు మాటలు మాట్లాడడు. ‘రామోద్విర్నాభి భాషతే’ పితృవాక్య పరిపాలకుడు. ఒక భయంకర శబ్దం వినపడింది. బీభత్స భయానక రూపం కనపడింది. కొండ గుహలాంటి నోరు తెరుచుకుంది. రామలక్ష్మణులను మ్రింగటానికి మీదికి వస్తోంది – తాటకి. స్ర్తి హత్య, దోషం అని సంశయిస్తున్న రామునితో – ‘వ్యవధి లేదు రామా, దుర్మార్గమైనా, సన్మార్గమైనా, పాతకమైనా దోషమైనా – ప్రజారక్షణకై కర్తవ్యాన్ని నిర్వర్తించు అది ప్రభు ధర్మం’ అన్నాడు విశ్వామిత్రుడు. వింట బాణం దూసుకు పోయింది – ప్రాణాలు విడిచింది తాటకి. ‘మా తండ్రి దశరథుడు నన్ను తమతో పంపునపుడు, మీ మాటను వేదవాక్కుగా ఆచరించి శిరసావహించి ఆచరించమని చెప్పారు.’ ఎంత పితృభక్తి, ఎంత వినయం, రామునికి తండ్రి పట్ల ఉన్నదో తెలుస్తుంది. ఒక సందర్భంలో రాముడు తల్లితో తను తండ్రి వాక్యమును ఎన్నడూ అతిక్రమించనని ‘పితృవాక్యం న యతిక్రమితుం మమ’ అన్నాడు. ఎప్పుడూ ఒకే మాట – అదే రామతత్త్వం. రాముడు, స్థూల రూపమున దశరథ రామునిగా, సూక్ష్మ రూపమున అంతరా రామునిగా ఉన్నాడు. అతడే, తారకరాముడు. ఆ తారకరాముని నిజ తత్త్వమును ఉపాసించి తరించిన వారు – ఎందరో మహానుభావులు. ఎన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడని, అన్ని రూపులై యున్న ఆ పరమాత్ముని నామము కథ విన్నా, ఎన్ని జన్మముల చేసిన పాపులీ జన్మమున వీడునని, రామమంత్రముచే ఇది కడసారి జన్మమని, శాశ్వత నిత్యానంద మోక్షగతి మొదలగు విషయములను మనకందిస్తూ ‘తారకమంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా’ అని తారకరాముని ఆర్ద్రతతో కీర్తించాడు – భద్రాచల భక్త రామదాసు. ఇది శ్రీరామనవమికి స్ఫూర్తినిస్తుంది. త్రేతాయుగంలో, ధర్మవిరుద్ధమైన కామము ఎంత అనర్థాల్ని తెస్తుందో చెప్పింది – రామాయణం. ఎంతో శక్తిసంపన్నుడైనా, ధర్మవిరుద్ధమైన కామానికి తెగబడిన దుర్మార్గుడు రావణుడు ఎలా నశించాడో, సామాన్య మానవుడిగా ఆవిర్భవించి, ధర్మబద్ధమైన జీవితాన్ని గరపిన రాముడు ఎంత ఉన్నత స్థితిని చేరుకున్నాడో, ఆదర్శంగా నిలిచాడో, చెప్పింది – శ్రీరామకథ. ధనాంధకారం వల్లనో, అధికార దర్పం వల్లనో, మరింకేమైనా గానివ్వండి తమకు ఎదురులేదని అధర్మంగా తప్పుడు పనులు చేసే అహంకారులు ఎప్పటికైనా వాళ్ల అధర్మ ఫలం అనుభవించక తప్పదని హెచ్చరిస్తుంది – శ్రీరామకథ శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు, జితేంద్రియుడు. దశరథుడు అలా కాదు. ముచ్చటగా మూడవ భార్యను, కైకను పెళ్లి చేసుకొనేటప్పుడు, ఆమెకు పుట్టే కొడుకునే, అయోధ్యా సామ్రాజ్యానికి పట్ట్భాషిక్తుణ్ణి చేస్తానని కేకయ రాజుకి వాగ్దానం చేశాడు – దశరథుడు. అయితే రాముడు ముందు పుట్టాడు. ఆనందోత్సాహాలతో ముందు రోజు కైకేయి మందిరానికెళ్లాడు దశరథుడు. రామ పట్ట్భాషేకం ఆగిపోయింది. వంశ క్రమానుగత రాజధర్మానికి విఘాతం కలిగించింది, దశరథుని మరణానికి కారణమయిందీ – దశరథుని అధర్మకాముకత. ఇది రామాయణం చెప్పే అతిముఖ్యమైన సూక్తి. అరణ్య వాసం చేస్తూ, చిత్రకూటలో ఉన్న రాముణ్ణి మరల అయోధ్యకు తీసికొని వెడదామని, స్వచ్ఛందంగా వచ్చిన బంధువులు, ప్రజావాహినితో వచ్చాడు – తమ్ముడు భరతుడు. ప్రియమార, భరత శతృఘు్నలను కౌగిలించుకున్నాడు. భరతుణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు వేస్తూ, ఉత్తమోత్తమ ప్రభు ధర్మాలు రాజనీతి విశేషాలు, తాత్త్విక విషయాలు, పరోక్షంగా భరతుడికి చెప్పాడు. సూర్యోదయం కాగానే అధర్మంగా ధనార్జన చేసుకోవచ్చని సంతోషించేవారు, సూర్యాస్తమయం అవగానే అధర్మంగా విశృంఖలంగా కామోపభోగాల్ని అనుభవించవచ్చని సంతోషించేవారు, సూర్యోదయ సూర్యాస్తమయముల మధ్య, తమ జీవితాల్లో ఒకరోజు ఆయుష్షు తగ్గిపోతోందని, ఒకరోజు వయస్సు పెరిగిపోతోందని తెలిసికోలేక పోతున్నారని, కాల ప్రాముఖ్యాన్ని తెలిసికొని, ఆత్మ తత్త్వాన్ని దర్శించాలని, ధర్మంతో అర్థకామాల్ని అనుభవించాలన్న ఆత్మ తత్త్వాన్ని బోధించిన – ఆత్మారాముడు – శ్రీరామచంద్రుడు. వాల్మీకి, రామాయణం ద్వారా చెప్పదలచుకొన్న దాన్ని రాముడి చేత ఈ సందర్భంలో చెప్పించాడు. శ్రీరామ నవమినాడు మననం చేసికోవలసిన ముఖ్య విషయం. ధూళిలో వాయు భక్షిణియై, ఇతరులకు కనపడకుండా తపమొనర్చుచూ వేయి ఏండ్లు ఆశ్రమమున పంచభూత సదృశముగా ఉన్నది – అహల్య. హల్య కానిది అహల్య. రాముడింకనూ కొంత దూరమున ఉండగానే, అతని మేని గాలి సోకుట వలన, కాలి సవ్వడి వినుట వలన, దేహ పరిమళము వ్యాపించుట వలన, శరీర నీల రత్నకాంతి గోచరించుట వలననూ, శ్రీరామచంద్రుడు ఆతిథ్యము స్వీకరింపవచ్చుట వలన, శబ్ద స్పర్శ రూప, రస, గంధములుగా పంచభూతముల, పంచతన్మాత్ర లనబడే సూక్ష్మ స్థితులతో పంచేంద్రియములను పొంది స్వరూపమును పొందిన మహాసాధ్వి – అహల్య. గుణాతీత అయిన అహల్యకు నమస్కరించిన మహాజ్ఞాని- శ్రీరాముడు. రాముడొక్కడే దిక్కని భావించి, సంపూర్ణ దాసోహ భావంతో, సాత్విక భక్తి విశ్వాసములతో త్రికరణశుద్ధిగా రామచింతనతో కాలము గడుపుతోంది బక్కచిక్కిన శబరి. ‘తుట్టతుది దాక నెండిన చెట్టుకొమ్మ శేఖరంబున యందు పుష్పించినట్లుగా’ ఫల పుష్పములతో కూడిన మెట్టపళ్లిక తల మీద పెట్టుకొని రామునికి అభిముఖంగా వచ్చింది. రాముడు శబరితో ‘అవ్వ నీ తల యింత ముగ్గు బుట్టయినదేమి?’ అంటే, తల అంతా నెరిసిపోయిందన్న భావంతోను, జ్ఞానవృద్ధురాలవు అన్న అంతర్లీన భావంతో అన్నాడు. శబరి ‘ఆ ముగ్గుబుట్ట నీ ఆత్మవాకిట రంగవల్లులు దిద్దుటకయ్యా’ అన్నది. రాముడు ‘అవ్వా, నీ ఆయువంత ఏర్చి ఎండి ఏకైతివేమి? అని అంటే, ‘ఆర్ద్రంబుగ ఆ ఏకును ఇంత వత్తిగ జేసి వెలిగింపవయ్యా’ అన్నది. ఇది జీవాత్మ – పరమాత్మల సంబంధం. ఉదాత్త గంభీర ఆధ్యాత్మికత. రామాయణంలో తెలిసికోవలసిన ముఖ్య అంశం. శ్రీరామ నవమి పండుగకు పూర్తి స్ఫూర్తినిస్తుంది. ‘ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము’ అన్నాడు త్యాగయ్య, ముఖారి రాగంలో. సీతారాములు – ఆదర్శ దంపతులు. రావణునితో సంభాషించునపుడు, తృణముకన్న హీనుడన్న భావముగా, ఒక గడ్డిపోచను అడ్డముగా పెట్టుకొని మాట్లాడింది – సీత. ‘నీవు పరాక్రమశాలివే అయితే, రామలక్ష్మణులు ఆశ్రమములో లేని సమయంలో, అందునా సాధు వేషంలో మోసగించి, అపహరించవలసిన ఖర్మమేమి పట్టినదన్నది. రామ బాణముతో పనిలేకుండా, తన పాతివ్రత్య ధర్మ నిష్ఠా శక్తితేజము, రావణుని సంహరించగలదని హెచ్చరించింది. ఈ చిన్న కార్యానికి అంత పెద్ద శక్తిని వ్యర్థము చేయదలచలేదన్నది. అదీగాక రామాజ్ఞ కూడా లేదన్న, మహోదాత్త శక్తి స్వరూపిణి – సీతామాత. ఇంద్రియాల్ని జయించినపుడు రావణుడు ముల్లోకాలను, గడగడలాడించాడు. ఆ యింద్రియాలు రావణునిపై పగబట్టినాయి. పగ తీర్చుకోవటానికి తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయి. సీతామాతను, సాధు రూపంలో మోసగించి తీసికొని రావటంతో, ఇంద్రియాలకు లోనయినాడు – పతనం చెందాడు. ఈ మాటలన్నది ఎవరో కాదు – సాక్షాత్తు రావణుని భార్య, మహాసాధ్వి – మండోదరి. సర్వసృష్టికి మూలహేతువైన తత్త్వము – బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రంతో రావణ సంహారం జరిగింది. రామ కార్యమును సఫలము చేసిన బుద్ధి మతాంవరిష్ఠుడు, సీతా ప్రాణదాత, రామాయణ మహా మాలకు రూపు వంటివాడు ఆంజనేయుడు. శ్రీరామచంద్రునికి దాసుడై, రాముని ప్రతిబింబమే దాస స్వరూపుడుగా వెలసిన వాడు, వాయునందనుడు – హనుమంతునికి మహోత్కృష్ట స్థానాన్నిచ్చాడు – వాల్మీకి ‘పాహి రామ దూత జగత్ప్రాణ కుమార మాం పాహి’ అన్న వసంత వరాళి రాగ కీర్తనలో ఆంజనేయ తత్త్వాన్ని, ముఖ్యంగా సుందరకాండలోని విశేషాల్ని, హృద్యంగా అందించాడు, నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి. ‘గీతార్థము సంగీతానందము నీ తావున చూడరా మనసా సీతాపతి చరణాబ్జము లిడుకొన్న వాతాత్మజునికి బాగ తెలుసురా…’ అన్న సురటి రాగ కీర్తనలో ఆంజనేయుని వైభవాన్ని, దాసభక్తిని అత్యద్భుతంగా వివరించారు త్యాగరాజ స్వామి, సురటి రాగ, ఆదితాళ కీర్తనలో. సీత పరాప్రకృతి, రాముడు పరాత్పరుడు. వారి అనుబంధం సహజసిద్ధం – సర్వలోక రమణీయం. ‘్ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్ధివం’ అని, విశ్వామిత్రుడు రాజయోగియై, మహాజ్ఞానియైన జనక మహారాజుకి ఆదేశమిచ్చాడు. ‘వత్సరామ ధనుఃపశ్య’ రామా ఈ ధనువును చూడుము’ అని గంభీరంగా పలికాడు. భావమెరిగిన రాముడు శివధనుర్భంగం చేశాడు. ఆ సందర్భంగా శ్రీరాముని ముద్దు మోముపైగల ముంగురులు ‘అలకలు అల్లలాడుట కన్నులార చూచిన విశ్వామిత్రుడు శ్రీరామ ఉపాసనా లక్ష్యసిద్ధిని పొందాడని మధ్యమావతి రాగంలో రూపక తాళ నిబద్ధనలో ‘అలకలల్ల లాడగని ఆరాణ్ముని ఎటు పొంగెనో’ అన్నాడు త్యాగయ్య. ‘ఫెళ్లుమనె విల్లు – గంటలు ఘల్లుమనె, గుభిల్లుమనె గుండె నృపులకు – ఝల్లుమనియె జానకీ దేహ మొక నిమేషమ్మునందె నయము, జయము, భయము, విస్మయము గదురగా’ శివధనుర్భంగము గావించిన ధీరోదాత్తుడు రాముడని హృద్యంగా వర్ణించాడు కరుణశ్రీ – సీతారాముల కల్యాణ ఘట్టంలో. ‘సీత పూజడ వెన్నుగ శిరసు వంచె, చెఱకు గడవోలె నడిమికి విరిగె ధనుస్సు’ అని అద్వైత శృంగార భావాల్ని, అద్భుతంగా ప్రదర్శించాడు విశ్వనాథ – రామాయణ కల్పవృక్షంలో. ‘మనస్సును మంత్రధ్యానంతో లయంచేసి, లక్ష్యాన్ని సాధించాలి. ప్రణవమనే ధనుస్సుతో, బాణమనే మనస్సును సంధించి, ముక్తికాంత అనే లక్ష్యాన్ని సాధించడమనేది – ఉత్తమ తత్త్వం. ఇదే జీవిత ధ్యేయం కావాలి. అదే శ్రీరామచంద్రుడు ధనుర్భంగం గావించి, సీతామాతను పరిణయమాడటంలో గల తత్త్వ రహస్యం’. సీతారాములు ముఖ్యంగా తెలుగు వారికి ఆరాధ్య దైవం. తొమ్మిది రోజుల శ్రీరామ నవమి ఉత్సవం, పదవ రోజు పట్ట్భాషేకంతో కన్నుల పండుగవుతుంది. యోగి, అన్ని వాసనలను వదులుకొని, దశేంద్రియముల చిత్తవృత్తులను రూపుమాపుకున్నపుడు, మోక్షానికి అర్హుడవుతాడని చెప్తుంది – శ్రీరామ సామ్రాజ్య పట్ట్భాషేకం. ‘జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా’ – అని నాటరాగం, ఆదితాళం – ఘన రాగ పంచరత్న కీర్తనలలో మొదటి కీర్తనగా, బ్రహ్మవిద్యా సార్వభౌముడు సద్గురు త్యాగరాజ స్వామి మనకందిస్తే- ‘సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకీ ప్రాణప్రదము, రామ సర్పఫణామణి రమణి సీత, ధరణిజా జీవితా తప తరణిస్వామి’ అని విశ్వనాథవారు సీతారాముల్ని అద్వైత ప్రేమమూర్తులుగా, ఆదర్శ దంపతులుగా అభివర్ణించారు. ‘రాముడు లోకాభిరాముడని’ రామాయణ కథాగానం చేస్తూ ‘అందరికీ రక్షకుడితని దెలిసి కొలువరో’ అని త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని యందు చూస్తూ, హరి సంకీర్తనాచార్య అన్నమయ్య చేసిన గానం – శ్రీరామ నవమికి- మనకిస్తుంది – శ్రీరామరక్ష. ……… లక్ష తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం కల్యాణ వేడుకలను తిలకించేందుకు ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలను కల్పించినట్లు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.జ్యోతి తెలిపారు. భక్తుల కోసం లక్ష తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేశారు. అందరికీ ఉచిత భోజనం అందజేస్తారు.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

22 లక్షల గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారి దర్శనం

22 లక్షల గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారి దర్శనం

  • 22/03/2015
TAGS:

ద్వారకాతిరుమల, మార్చి 21: క్షేత్ర దేవతగా విరాజిల్లుతూ శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీకుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు 2 లక్షల గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ఉదయం, సాయంత్రం కుంకుమార్చనలతోపాటు గాజుల అలంకరణలో నిండుముత్తయిదువులా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే నిండు సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి ప్రజల దీవెనలు అవసరం
జంగారెడ్డిగూడెం, మార్చి 21: రాష్ట్ర విభజనతో సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల దీవెనలు అవసరమని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఆర్డీఒ ఎస్.లవన్న అధ్యక్షతన ఉగాది సందర్భంగా శనివారం స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో జరిగిన పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి శ్రీ మన్మధనామ సంవత్సరంలో అంతా శుభం కలగాలని ప్రజలు కోరుకోవాలన్నారు. ఉగాది పచ్చడి వలే ప్రతి ఒక్కరి జీవితాల్లో తీపి, చేదువలే సుఖ దుఃఖాలు ఉంటాయన్నారు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోరాదన్నారు. రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ముఖ్యమంత్రి నిరంతర శ్రమ చేస్తున్నారన్నారు. ఆయనకు అందరూ సహకరిస్తే లక్ష్యాలు చేరువ కాగలవన్నారు. భవిష్యత్‌లో పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ఉగాది నుండే రాష్ట్రానికి మంచి జరగాలన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాతను ఘనంగా సత్కరించారు. ఆర్డీఒ ఎస్.లవన్న, తహసీల్దార్ జివివి సత్యనారాయణ మహిళా ప్రజాప్రతినిధులతో మంత్రికి సత్కారం జరిపించారు. పంచాంగ శ్రవణం చేసిన గరిమెళ్ళ ప్రభాకరశాస్ర్తీ (్భను), పురోహితులు వెంపరాల ప్రసాదశాస్ర్తీ, రేమెళ్ళ సూర్యనారాయణశాస్ర్తీ, కవి సమ్మేళనం నిర్వహించిన టివి నరసింహారావు, కెఎల్ వీర్రాజు, టి.వి.రామకృష్ణ, వి.అప్పారావు, చావా రమేష్‌బాబు, నాట్యాచారిణి ఎస్.రూపాదేవి, జానపద, పౌరాణిక కళాకారులు ఎల్‌ఆర్ కృష్ణబాబు, నున్న కృష్ణయ్య, జొన్నకూటి వెంకటేశ్వరరావు, బుద్దాల సత్యనారాయణ తదితరులను మంత్రి ఘనంగా సత్కరించారు. పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఇఒ పెనె్మత్స విశ్వనాధరాజు (శివ) ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమారాచార్యులు తదితరులు మంత్రి సుజాతకు వేదాశీస్సులు అందజేశారు. తహసీల్దార్ జివివి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపిపి కొడవటి మాణిక్యాంబ, సహకార సంఘ అధ్యక్షుడు వందనపు హరికృష్ణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, ఎంపిడిఒ పి.శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ బి.సాల్మన్‌రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, టిడిపి నేతలు మండవ లక్ష్మణరావు, దల్లి కృష్ణారెడ్డి, షేక్ ముస్త్ఫా, కొడవటి సత్తిరాజు, రాజాన సత్యనారాయణ(పండు), పెనుమర్తి రామ్‌కుమార్, నంబూరి రామచంద్రరాజు, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్ పాల్గొన్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉగాది నవరత్నోపహారం

ఉగాది నవరత్నోపహారం -డా ఎస్ ఏం మహమ్మద్ హుసేన్ -మూసి మార్చిnavaratn 001 ugadi1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యజుర్వేద సంధ్యావందనం –

saandhya2 001 sandhya3 001 sandhya4 001 sandhya5 001 sandhya6 001 sandhya7 001 sandhya8 001 sandhya9 001 sandhya10 001 sandhya11 001 sandhya12 001 yajurveda sandhyavandanam 1 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 4 Comments

శ్రీమన్మద ఉగాది శుభాకాంక్షలు

img074శ్రీమన్మద ఉగాది శుభాకాంక్షలుUgadi-Telugu Ugadi Festival Story And Significance | infosamay.com - cutmirchi.com

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -21

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -21

11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్

‘’మంచి ,చెడు అనే విషయాలు శైలీ అనేవి  లేవు .వస్తువులను మనం చూసే దృష్టిని బట్టే అవి ఏర్పడతాయి .’’అని ఫ్లాబర్ట్ అన్నా కూడా ఆయన రాసిన సబ్జెక్ట్ వల్లనే ప్రసిద్ధి చెందాడు .ఇదే ఆయన వ్యతిరేకులకు విమర్శనాయుధం గా మారింది కూడా .ఫ్రాన్స్ దేశం లో నార్మండిలోని రోఎన్ లో 12-12-1821న అక్కడే స్తిరనివాసం గా ఉంటున్న ఫిజీషియన్  చీఫ్ సర్జన్ అయిన తండ్రికి జన్మించాడు .తల్లి తండ్రి అయిన తాతకూడా గ్రామ వైద్యుడే .అందుకే పాత్రలను చక్కగా వైద్య రీతిలో కత్తిరించి సొగసు చేకూర్చగాలిగాడు ఫ్లాబర్ట్ . ఫ్రెంచ్ ‘’లిటరరీ రియలిజం కు ఆద్యుడు ఫ్లాబర్ట్ .మొదటినవల ‘’మేడం బావేరి ‘’తో విఖ్యాతుడయ్యాడు.అనితర సాధ్యమైన శైలీ విన్యాసం ,సౌందర్య దిదృక్ష ఫ్లాబర్ట్ సొంతం  .’అన్న అచిల్లీ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి డాక్టర్ అయ్యాడు .దీనికి విరుద్ధం గా ఫ్లాబర్ట్ చిన్నతనం నుండి రచనా వ్యాసంగం లో ఉన్నాడు .స్నేహితుడికి ఒక ఉత్తరం ఆనాడే రాస్తూ తనతోకలిసి రచనకు చేయూతనిమ్మని కోరాడు .ఫ్లాబర్ట్ యవ్వన దశలో ఆల్బర్ట్ లీ పోటేవిన్,లూయీ బుల్ హెర్ట్ ,మాక్సిం డు కాంప్ లతో సాన్నిహిత్యం పెంచుకొన్నాడు .అందులో ఆల్బర్ట్ 27 ఏళ్ళకే చనిపోతే తట్టుకోలేక పోయాడు .లూయీ కవి .మాక్సిం జర్నలిస్ట్ .

19 వయసులో లా చదివాడు .ఆ పాఠ్య గ్రందాలంటే  విపరీతమైన విసుగు ,అసహ్యం వచ్చింది  .సివిల్ కోడ్ ను ‘’నాన్సెన్స్ ‘’అన్నాడు .నాటక శాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ దానిపై వ్యామోహం పెంచుకొన్నాడు .తనకొచ్చే అలవెన్స్ డబ్బులన్నీ సరదాగా దీనికే ఖర్చు చేసేవాడు .స్త్రీ వ్యామోహం లో మాత్రం పడలేదు .కాని మిగిలిన జల్సాలన్నీ అనుభవించాడు .అందం గా ఆకర్షణీయం గా ఫ్లాబర్ట్ ఉండటం తో అమ్మాయిలూ బాగానే ‘’వలపుల వల’’ విసిరే ప్రయత్నాలు చేసేవారు.’’యువ గ్రీకు  వీరుడు ‘’గా ఉండేవాడని మనసుపారేసుకొన్న ఒకావిడ అన్నది .అతనిది ‘’హీరోయిక్ బ్యూటీ ‘’.రోమన్ సైనికులతో వీరోచితం గా పోరాడిన ‘’గాలిక్ చీఫ్ ‘’లాగా ఉండేవాడని ఒకామె కామెంట్ చేసింది . అప్పటికే ఫ్లాబర్ట్ ఒక సారి లోతుగా ప్రేమ వ్యవహారం లో దిగి కూరుకుపోయాడు. పదిహేనేళ్ళ వయసులో కుటుంబం తో వేసవిని ట్రౌవిల్ లో గడపటానికి వెళ్ళినప్పుడు పెళ్లి అయి, పిల్లను సాకుతున్న ఇరవై ఆరేళ్ళ ఎలీషా స్లీసిన్గర్ అమ్మాయి కి మనసు పారేసుకొన్నాడు .ఆమె భర్త మన ప్రేమపిచ్చోడి వాలకం కనిపెట్టి తనతో నౌకాయానం చేయించాడు .ఆరేళ్ళ తర్వాత పారిస్ లో చదువుతున్నప్పుడు ఆ దంపతులుఒక  సాయం వేళ తమతో గడపటానికి ఆహ్వానించారు .సిగ్గుల మొగ్గై ముడుచుకు పోయాడుకాని ఆంతర్యాన్ని ఆవిష్కరించలేక పోయాడు ఫ్లాబర్ట్ .ఆమె మాత్రం ఇతని నిజాయితీని ,నిష్కపట ప్రేమను, ఆరాధనను గుర్తించింది .ఆమె జీవితం లో చోటు చేసుకోలేక పోయినా జీవితాంతం ఎలీషా అంటే పరమ ప్రేమారాదనాభావం మాత్రం వదలలేదు .ఆ తర్వాత మూడేళ్ళ దాకా ప్రేమా సెక్సూ లేకుండానే గడిపేశానని రాసుకొన్నాడు .చచ్చేదాకా అలానే ఉన్నానని ఎక్కడో రాసుకొన్నాడు .కాని 23 ఏళ్ళదాకా వర్జిన్ బాయ్ లానే ఉన్నాడు .కాని ఒక పని చేసే అమ్మాయితోనో లేక ఏదో హోటల్ లో ఉంటె వేరొక అమ్మాయితోనో ఒక రాత్రి గడిపాడు అనే పుకారు పారిస్ అంతా షికారు చేసింది .

చదువు మీద దృష్టిపెట్టి ఉన్నా ,అది అబ్బక పరీక్షలు తప్పాడు .ఏదో తన్ను ఆవహించిన ఫీలింగ్ లో ఉండేవాడు .దాని నుంచి బయటపడినప్పుడు ఆ విషయాలను తెలియ జేసేవాడు .యేవో కాంతులు మెరుపులు అస్పష్ట ధ్వనులు అపస్మారక స్తితిలో వినిపించేవని చెప్పేవాడు .ఇవి ప్రముఖ అమెరికన్ రచయిత ఎడ్గార్ అలెన్ పో,సెయింట్ తెరెసా ,జర్మన్ పో అనిపించుకొన్న ఇ టి ఏ హాఫ్మన్ ల  ఫాంటసీ కధల్లా అనిపించేవి . .ఇతన్ని పరీక్షించిన డాక్టర్లు మూర్చ లక్షణం కాదని అతని ప్రవర్తన ‘’A plethora vitality ‘’అన్నారు ఇదే క్రమంగా హిస్టేరియో –ఎపిలెప్టిక్ ‘’ ఎటాక్స్ గా మారతాయని చెప్పారు .దీనికి తండ్రి చేసిన వైద్య ప్రక్రియ దారుణం గా ఉండేది .రక్తం వచ్చేట్లు కొట్టేవాడు అన్నం లేకుండా మాద్చేసేవాడు ఎప్పుడూ తలనిండా స్నానాలు చేయించేవాడు ..ఈ లక్షణం ఫ్లాబర్ట్ బతికి ఉన్నంతకాలం వెటనంటే ఉండి పోయింది పాపం .తల్లి నిరంతరం అతన్ని కనిపెట్టుకొనే ఉండేది .ఇవన్నీ నెర్వస్ వీక్నెస్ కు, దానినుంచి డిప్రెషన్ కు  దారి తీశాయి .చాలాకాలం తర్వాత జీవితం అంటే తనకు భయమేస్తోందని జార్జ్ సాండ్ కు తెలుపుకొన్నాడు .

సంపాదించిన సొమ్ముతో తండ్రి క్రాసేట్ లో ఒక ఇల్లుకోనుక్కొని కుటుంబాన్ని  ప్రక్రుతి సౌందర్య విలసిత ప్రదేశానికి మార్చాడు ఒకటి రెండు సార్లు తూర్పు దేశ పర్యటనలు తప్ప మిగిలిన కాలమంతా ఫ్లాబర్ట్ ఇక్కడే గడిపాడు .ఒక్కమాటలో చెప్పాలంటే ‘’ఇంట్లోనే ఉండి  రాశాడు ‘’.కొద్దికాలం తర్వాత తండ్రి కేన్సర్ తో మరణించాడు .కొన్ని నెలల తర్వాత సోదరి ప్రసవించి చనిపోయింది .ఈ రెండూ కు౦గ దీశాయి ఫ్లాబర్ట్ ను .దురదృష్టం వెంటాడుతోంది అని భావించాడు .లోపల ఏదో ఆందోళన భయ పెడుతోంది .మేకుల బూట్ల తో మనుషులు విపరీత శబ్దం చేస్తూ మేడ మెట్లు దిగుతున్నట్లు ,సోదరి కరోలిన్ నల్ల వస్త్రదారణ తో తలనిండా గులాబీలతో  చాలా పొడవుగా కనిపించినట్లు భావించేవాడు .

ప్రాడీర్ స్టూడియో లో గడపటానికి పారిస్ వెళ్ళినప్పుడల్లా లూయీ కోలేట్ ను కలిసేవాడు .అప్పటికే ఆమెకు పెళ్లి అయి  ఆరేళ్ళ కూతురు తో ముప్ఫై ఏళ్ళ వయసులో ఉండేది .మనవాడివయసు ఇరవైనాలుగు.ఆమె సెలెబ్రిటి అనిపించేది .భర్తనుండి విడాకులు పొంది ఫిలాసఫర్ ఎకడేమీషియన్ అయిన విక్టర్ కజిన్స్ కు మిస్త్రేస్ గా ఉన్నది .ఆయన ప్రోత్సాహం తో ఆమె అనేక అకాడెమీ ప్రైజులను కవిత్వానికి పొందింది .ఆమె తానను తాను  ప్రాచీన గ్రీకు కవయిత్రి సాపో గా భావించుకొనేది .ఆమెను అందరూ గొప్ప ప్రేరకురాలిగా భావించేవారు .కజిన్స్  ఫ్లాబర్ట్ ను ఆమె అపార్ట్ మెంట్ కు ఆహ్వానించాడు .తనకవిత్వాన్ని కమ్మగా చదివి వినిపించి మురిపించింది .ఇలా కొంతకాలం జరిగి ఇద్దరూ ప్రేమలో పడిపోయారు .ఫ్లాబర్ట్ ను పారిస్ వచ్చి ఆమెతో ఉండిపొమ్మని కోరిందామే .స్వంత ఇంటినీ ఊరిని తల్లినీ వదిలి వెళ్లాలని పించలేదు ఫ్లాబర్ట్ కు. ‘’ప్రేమించటం కంటే ప్రేమించబడటం  ‘’కు ఫ్లాబర్ట్ ప్రాధాన్యత నిస్తాడు .అప్పుడప్పుడు వెళ్లి లూసీ దర్శనం చేసి సంతృప్తి పడేవాడు .ఆమెతో తరచూ ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ ఉంటానని వాగ్దానం చేసి నిలబెట్టుకొన్నాడు ఫ్లాబర్ట్ .

 

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-15 –ఉయ్యూరు .

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విహారి గారి ”పద చిత్ర రామాయణం ”పై సదస్సు 5-4-15 ఆదివారం సా 3 గం లకు

విహారి గారి ”పద చిత్ర రామాయణం ”పై సదస్సు 5-4-15 ఆదివారం సా 3 గం లకు N T R కళావేదిక పబ్లిక్ గార్డెన్స్ హైదరాబాద్

vihari1 001 vihari2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రాజకీయ ‘మన్మథులు’

రాజకీయ ‘మన్మథులు’

  • 15/03/2015
  • – కృష్ణ తేజ

తెలుగునేలపై ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. లేలేత మావిచిగుళ్లు తిన్న కోకిలలు కుహూ కుహూ అంటూ గొంతు సవరించుకుంటున్నాయి. వేపపూల గమ్మతె్తైన వాసన గుబాళిస్తోంది. గున్నమామిడి కొమ్మలకు పిందెలు అందంగా వేలాడుతున్నాయి. హోలీరంగుల్లో ఆడిపాడి అలసి సొలసిన తెలుగు లోగిళ్లకు మామిడాకుల తోరణాలు కొత్త కళ తెస్తున్నాయి. విపణివీధిలో తెలుగు పంచాంగాల అమ్మకాలు జోరందుకున్నాయి. పంచాంగ శ్రవణం, కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, రాజపూజ్యావమానాలు, ఆదాయ వ్యయాలు, కందాయఫలాల వివరాలకోసం తెలుగువారు ఆసక్తి చూపిస్తున్నారు. షడ్రుచులతో ఉగాది పచ్చడి నోరూరిస్తోంది. కవిసమ్మేళనాల సంరంభానికి తెరలేచింది. ప్రభవాది అరవై తెలుగు సంవత్సరాలలో ఇప్పుడు మన్మథనామ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. పేరులో ఉన్న అందం…జీవితంలోనూ ఉంటే బాగుంటుందని అందరి ఆశ. సగటుజీవి చూపంతా ఆదాయ వ్యయాల పైనే ఉంటుంది. మధ్యతరగతి మనిషి ఆలోచనలన్నీ వీటితోపాటు రాజపూజ్యావమానాల చుట్టూ తిరుగుతూంటాయి. సంపన్నుల దృష్టి ఉగాది వేడుకలపై ఉంటుంది. సాహితీవేత్తలు, కవి పండితులు, పంచాంగకర్తల మనసంతా ఉగాది వర్ణన, మంచిచెడుల విశే్లషణపై నిలిచి ఉంటుంది. వీటన్నింటికి భిన్నం రాజకీయ ఉగాది వేడుకలు. రాజకీయ పార్టీలు వేటికవి పంచాంగశ్రవణాన్ని విన్పిస్తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే పంచాంగ శ్రవణంలో ప్రభుత్వానికి జరిగే మంచిపైనే ఫలితాలుంటాయి. ఈ మన్మథ నామ సంవత్సరంలో రాజకీయ నాయకుల మనసు ఎలా ఉంటుంది. ఉగాది ఫలితాలపై వారేమనుకుంటున్నారు…రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతల మనోభీష్టం ఎలా ఉంది. ఓ సారి సరదాగా ఊహించుకుని, వాటికి అక్షర రూపం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ వ్యాసానికి ప్రాణం పోసింది. హాస్యప్రియులైన తెలుగువారి మనోల్లాసంకోసం ఓసారి నేతల మనసులలోకి తొంగిచూద్దాం. కెసిఆర్ జయనామ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడే చెప్పా. వచ్చే ఉగాది తెలంగాణలోనే జరుపుకుంటామని. కేసిఆర్ మాటంటే మాటే. నేనామాట అన్నప్పుడు పిచ్చోనిలెక్కన చూశారు. ఇప్పుడేమైంది? మన్మథ నామ సంవత్సరం మనది. బిడ్డల త్యాగఫలితంగా వచ్చిన తెలంగాణ గడ్డపై తొలిసారి మన ఉగాది మనం జరుపుకుందాం. అలాగని జయనామ సంవత్సరం మనకు తక్కువచేయలే. జయం మనదే. మన్మధుడూ మనవాడే. మన పంచాంగం మనమే తయారుచేసుకుందాం. ఏం మన నేలపై పండితులకు కొదవా. పాండిత్యానికి కొదవా. యాదాద్రి, భద్రాద్రినుంచి అయ్యవార్లను రాయమంటే రాయరా. పంచాంగశ్రవణం అంటే మన బిడ్డలు చెవికోసుకోరా. మంచిచెడులు చెప్పే చేవ మనకు లేదా. సోయిలేనోనికి తప్ప మనకేం తక్కువ. అయినా ఇందులో ఎవరు చెప్పేదేముంటుంది. నేనే చెబుతా. ఇక మనకు అంతా మంచే. మన పరిపాలనలో మనకు అవమానాలు ఏంది? ఆ రోజులు పోయినై. అంతా రాజపూజ్యమే. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే తెలంగాణ గల్లాపెట్టె గలగలలాడుతుందని నేను చెప్పలేదా. అది ఇప్పుడు నిజం కాలేదా. మన దగ్గర డబ్బున్నప్పుడు ఇక ఆదాయవ్యయాల లెక్కలు తెలుసుకునేదేంది. మన బిడ్డలకు అంతా ఆదాయమే. బిడ్డా…డబ్బుందని లెక్కాజమా లేకుండా ఖర్చుపెట్టొద్దు. నా లెక్కలు నాకుంటయి. మన బిడ్డలకు ఎక్కువ తక్కువ చేయం. మాటతప్పని నేను దేవుడి మొక్కులన్నీ తీర్చిన. ప్రకృతి కూడా మనకు సాయం చేయాలనే దేవుడికి మొక్కుతున్నా. ఏవరేమనుకుంటరన్న భయం మనకేంది. మన పంచాంగశ్రవణం మన పండితులు చెబుతారు. మంచిచెడ్డలు విని మసలుకోవాలే. మన ఉగాది పచ్చడి తెలంగాణ గడ్డమీద పండిన వస్తువులతోనే చేసుకోవాలె. మన జగిత్యాల మామిడికన్నా ఏ మామిడి బాగుంటది. మన ఆదిలాబాద్ అడవుల్లో పండిన చింతపండుకన్నా రుచి దేనికుంటది. మన నిజామాబాద్ నేలపై విరగబూసిన వేపపూవులో చేదు ఉన్నా, ఆ పూల పరిమళం మనకు తీపిగుండదా. ఆ నేలపైనేకదా మన చెరకు తీపవుతున్నది. గుంటూరు మిర్చికేనా ఘాటున్నది. మన నల్లగొండ నేలలో పెరిగిన మిరపకాయకు కారం తక్కువా. మనకు పౌరుషం తక్కువా. మన ఆలోచనల్లో, మన భావనల్లో ఎదుగుదల రావాలె. మనకు మనం బాస్‌లమన్న భావన పెరగాలే. మన మనసులను ఆ దిశగా మన్మథ నామ సంవత్సరం మలచాలె. మన్మథ నామ సంవత్సరం తెలుగువారిది. తెలంగాణలో ఉన్న తెలుగువారికి అది..ఆది ఉగాది. ఆంధ్రోళ్లు, సీమాంధ్రులు, సెటిలర్లనేవి పిచ్చిమాటలు. నే చెబుతున్నా…మన ఉగాది పచ్చడి వీరికి నేనే స్వయంగా పంచుతా. తెలంగాణ ఉగాది పచ్చడి రుచి చూపిస్తా. మన మనసులోని మమత చాటుతా. గతం మర్వాలె. అంతా కలిసి మనగలగాలె. ఇందులో రాజకీయం లేదు. నేనేమీ టీఆర్‌ఎస్ ఉగాది చేస్తున్నానా. తొలి తెలంగాణ ఉగాది చేసుకోమంటున్నా. ఇందులో తప్పేముంది. పనిపాటాలేని ప్రతిపక్షాలకూ ఇదే చెబుతున్నా…పండగ చేసుకుందాం. పండగలో పాలిటిక్స్ వద్దు. వినకపోతే మీఖర్మ. మన తెలంగాణ మనకు వచ్చాక, జనం వారి తీర్పు చెప్పాక, మీ తీరు మారకపోతే ఏం చేస్తాం. మంచిగ చేసిన మన ఉగాది పచ్చడి తిని, మన పండితులు చెప్పిన మంచిమాటలు విని మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలె. కాదంటే కేసీఆర్ ఒప్పుకుంటాడా. వెంకయ్యనాయుడు రెండు తెలుగు రాష్ట్రాలకు మన్మధ నామ సంవత్సరం మంచి చేస్తుందని విశ్వసిస్తున్నా. ప్రత్యేక హోదా దక్కలేదని ఆంధ్ర ఉగాది వేడుకలను మరచిపోనక్కర్లేదు. ప్రధాని మోదీ మనతోపాటు ఉగాది పచ్చడి తిని వేడుకలను రసవంతం చేస్తారు. ఆంధ్రను ఆదుకుంటారు. అసలు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను అనాలి…జయ నామ సంవత్సర ఉగాదికి ఆంధ్రులకు పచ్చడిమెతుకులుకూడా లేకుండా చేశారు. మన్మధలో మేం ఏం చేద్దామన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందు చంద్రబాబు కొత్తపంచాంగం చూడాలి. గ్రహగతులను బట్టి ముందడుగు వేయాలి. కొత్త రాష్ట్రం అన్నాక రాజపూజ్య అవమానాలు తప్పవు. రాష్ట్రంకోసం, ప్రజల అభివృద్ధికోసం అవమానాలు దిగమింగాలి. నా వరకు నాకు నాయుడు ముద్రవేసి జయనామ సంవత్సరంలో అవమానించారు. ఇప్పుడిప్పుడే రోజులు మారుతున్నాయి. తిట్టినవాళ్లే కండువాలు కప్పుతున్నారు. చేతులు కలుపుతున్నారు. అభివృద్ధికోసం కలసి పనిచేయడం తప్పదు. అప్పుడు ఉగాది పచ్చడీ కలసి తినొచ్చు. ఇరుగుపొరుగు తెలుగువారు షడ్రుచుల ఉగాది పచ్చడిని ఇచ్చిపుచ్చుకోవాలి. రెండు రాష్ట్రాల నాయకులు ఉప్పూకారం తగ్గించి, కాస్త తీపి ఎక్కువ వేసి పచ్చడి తినాలి. ఆదాయవ్యయాల లెక్కలు పంచాంగ కర్తలకన్నా చంద్రబాబు బాగా నేర్చారు. ఆయనకు మేం కన్పిస్తేచాలు చిట్టా విప్పుతున్నారు. ఇక కేసీఆర్‌కు ఖజానాకష్టాలు లేవు. అంటే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణకు ఇబ్బందులు లేవు. ఉగాది సంబరంలో అసలు విషయం మరిచిపోవద్దు. వచ్చే వేసవికి తెలంగాణ చల్లగా ఉండాలంటే ఆంధ్రతో కలిసిమెలిసి పనిచేయాలి. ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు మాకు సమానమే. తెలుగువారికి రాష్ట్రాలు వేరైనా ఉగాది ఒక్కటే. భాజపా చెప్పే పంచాంగం ఇదే. జానారెడ్డి జయనామ సంవత్సరంలో అరవై ఏళ్ల తెలంగాణ కలం నిజం చేసింది మా పార్టీనే. అయితే మాకు ఏ గ్రహం అడ్డొచ్చిందో తెలీదు. ఫలితం కేసీఆర్‌కు వెళ్లిపోయింది. ఏ గ్రహమో అనుకుని ఏం లాభం. మా గ్రహాలే ఈ పని చేసుంటాయి. ఆ ఎన్నికలప్పుడు నాకు, మా పార్టీకి మంచి జరగలేదు. ఏం చేస్తాం. మన్మథ నామ సంవత్సరమైనా కలిసొస్తుందని అనుకున్నా. సూచనలు అలా లేవు. ఈ ఏడాదికూడా రాజపూజ్యం పూజ్యంలా ఉంది. అవమానం తప్పేట్టు లేదు. పార్టీ పదవి మళ్లీ తప్పిపోయింది. ఇది జయనామ సంవత్సరం ఖాతాలో వేసినా మన్మథ నామ సంవత్సరానికి సంకేతంగా పరిగణించాలేమోనన్న భయం పట్టుకుంది. ఆదాయవ్యయాలతో నాకు పనేం లేదు. ఈ విషయంలో పంచాంగంపై ఆధారపడను. నేను ఒకప్పటి టీచర్‌ను. పాఠాలు చెప్పడం, పాఠాలు నేర్వడం మామూలే. ఎటొచ్చీ ఎవరికి రాజకీయ పాఠాలు చెప్పాలో తేల్చుకునేలోగానే నాకు గుణపాఠాలు ఎదురవుతున్నాయి. నాకన్నా నాలుగాకులు ఎక్కువ చదివినవారు వెళ్లి పదవులు కొట్టేస్తున్నారు. నవ తెలంగాణలో తొలి ఉగాదిని ప్రభుత్వం పెద్దఎత్తున చేయాలి. ప్రతిపక్షానికి అందులో భాగస్వామ్యం కల్పించాలి. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఉగాది జరుపుకుంటే సరిపోదు. అవసరమైతే అసెంబ్లీలో ఈ విషయం మాట్లాడతా. ఉగాదిపచ్చడిలో ఆరు రుచులుంటాయి. నా మాటల్లోను అంతరార్థం అలాగే ఉంటుంది. నచ్చినవాడికి నచ్చుతుంది. నచ్చనివాడికి నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా ఉగాది చేసుకోవాలె. చేదు ఉందని ఉగాది పచ్చడి తినడం మానేస్తామా. అది సరికాదు. ఓడిపోయామనో, అధికారంలోకి రాలేదనో, పదవి రాలేదనో బాధపడితే ఉగాది పచ్చడిలోని తీపి చేదుగానే అన్పిస్తుంది. మనసును బట్టి రుచి. మన్మథుడిని బట్టి మనసు. అర్థమైందనుకుంటాను. నా మాట అర్థంకాకపోతే నేనేం చేయగలను. నిజానికి నేను చంద్రుడిలాంటివాడినని చెప్పుకున్నా. అదే తప్పైనట్టుంది. చంద్రుడికి కళ తగ్గినట్లు…నాకు పార్టీ పదవి తప్పిపోయింది. అసలే నా మాట అర్థంకాందంటారు…చాలామంది. ఇప్పుడు నామాట నాకే అర్థం కాలేదు. మన్మథలోనైనా నా మాట అందరికీ అర్థం కావాలి. చంద్రబాబు ఉగాది అయినా, ఉగాది పచ్చడయినా సమపాళ్లలో సరుకులు పడకపోతే రుచి సరిగ్గా ఉండదు. జయనామ సంవత్సరంలో ఆంధ్రకు ఉగాది చేదునే మిగిల్చింది. మనకు రాజపూజ్యం లేదు. అంతా అవమానమే. మనది రెండు పచ్చళ్ల సిద్ధాంతం. రెండు పంచాంగాల సిద్ధాంతం. ఆంధ్రలో పచ్చడి, ఉగాది బాగోలేదని బాధతప్ప, తెలంగాణకు ఉగాది బాగోలేదని, బాగోకూడదనికాదు దీనర్థం. ప్రతిపక్షాలకు పనేముంది. నేనేం చెప్పినా పచ్చడి చేసేద్దామనుకుంటారు. చతికిలపడతారు. జయనామ సంవత్సరంలో మనకు ఆదాయ వ్యయాలూ సరిగాలేవు. మన గల్లాపెట్ట ఖాళీగా ఉంది. రాష్ట్ర విభజనతో వట్టిపోయాం. కేంద్రం సాయం కావాలి. జయ నామ సంవత్సరంలో కేంద్రం వట్టిచేయే చూపింది. మన్మథనామ సంవత్సరంలో కేంద్రం మనసుమార్చేలే ఈ ఉగాది ఉండాలి. ఆదాయవ్యయాల లెక్క చూస్తే గాభరాగా ఉంది. తెలుగువారి లెక్కాజమా పక్కాగా చూస్తా. చేతికి చిల్లిగవ్వ ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. అయితే ఏదోవిధంగా డబ్బు లేదా బాండు ఇస్తా. మన్మథనామ సంవత్సరంలో రాజపూజ్యం కన్పించడం లేదు. అవమానాలు పూర్తిగా తగ్గిన సూచనలు కన్పించడం లేదు. కందాయ ఫలాలు చూస్తే కంగారుపెడుతున్నాయి. అయితే అంతా పకడ్బందీగా నడిపిస్తున్నా. మన్మథనామ సంవత్సరం మనదే కావాలని ప్రణాళిక ప్రకారం ముందుకెడుతున్నా. ఉగాదిపచ్చడి చేయడం, తినడం, అడ్డొచ్చేవారిని పచ్చడి చేయడం తెలుగువారికి, తెలుగుదేశానికి కొత్తకాదు. తిరుమల వేంకటేశ్వరుడి దయతో ఈ ఉగాది తెలుగువారికి మంచినే తెస్తుందని మనవి చేస్తున్నాను. ఆంధ్రను సింగపూర్‌గా మార్చినా ఉగాదిపచ్చడి మరవను. తుళ్లూరు రూపం మారిపోయినా అక్కడే ఎప్పుడూ ఉగాది చేసే ఏర్పాటు చేస్తా. ఐటీ సాయంతో ఆధునిక ఆంధ్రను తీర్చిదిద్దినా తెలుగుసౌరభమైన ఉగాది వేడుకలను మరవను. తెలుగుదేశం పంచాంగం, తెలుగువారి పంచాంగం రెండూ విన్పించే ప్రయత్నం చేస్తా. అటు తెలంగాణలోనూ అదే ఏర్పాటు చేస్తా. మాకు ఆంధ్ర అభివృద్ధి ముఖ్యం. తెలంగాణ వెలుగు ముఖ్యం. ఎక్కడున్నా తెలుగువారి శ్రేయస్సు ముఖ్యం. అంతేతప్ప, లెక్కాజమా లేకుండా, బొక్కసం నింపుకుని, ఊచలు లెక్కపెట్టొచ్చిన నేతల ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు. వారిచ్చిన ఉగాది పచ్చడి తినొద్దు. తెలుగువారికోసం నేను అవసరమైతే ఒకమెట్టు దిగొస్తా. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే ఉగాదిపచ్చడి తింటా. నాక్కావలసింది తెలుగువారి భవిష్యత్. అంతేతప్ప ఎక్కడి పచ్చడి అన్నది కాదు. హైదరాబాద్‌లో ఉన్నా ఉగాదిని మాత్రం ఆంధ్రలోనే జరుపుకుంటా. జగన్ ప్రజలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అంతా విజయమే అనుకున్నా. జయనామ సంవత్సరం దెబ్బేసింది. అయితే అది బయటకు ఎందుకు ఒప్పుకోవాలి. మా కొత్తపార్టీకి జవసత్వాలు ఇచ్చింది జయ నామ సంవత్సరమే కదా. గతేడాది రాజపూజ్యం, అవమానం సరిసమానమనే అనుకుంటున్నా. ఇక మన్మథ నామ సంవత్సరంలో కొత్తగా వచ్చేదేముంటుంది. కాకపోతే భవిష్యత్‌కోసం మన్మధపైనే ఆధారపడాలి. పంచాంగాలు, పంచాంగశ్రవణాలు నాకన్నా జనానికి అవసరం. ఆంధ్రలో రాజధాని లేదు. ఉద్యోగులకు జీతాల భరోసా లేదు. పేదలు, రైతుల భూములు పోతున్నాయి. ఇక ఉగాది వేడుకలు ఎక్కడ. పచ్చడి తినకముందే చేదెక్కిపోయింది. నేను ఈ మధ్య తుళ్లూరు వెళ్లా. అక్కడి రైతులు ముఖం చూస్తే చేదుమింగినట్లుంది. వేలాది ఎకరాలు భూసేకరణ పేరుతో గుంజుకుంటే..ఆ భూముల్లో మామిడితోటలు ఏమవ్వాలి. కోకిలగానం విన్పిస్తుందా. మన్మధనామ సంవత్సరమేకాదు…ఇక ఏ ఉగాదికీ ఆనందం లేనట్టే. సింగపూర్ తరహా రాజధాని అని చంద్రబాబు అంటున్నారు. సింగపూర్‌లో ఉగాది ఉంటుందా. ఉగాదిలేని సింగపూర్ మనకెందుకు. నేనడుగుతున్నా…ఉషోదయం, మామిడితోటలు, కోకిలకూతలు, చెరకుపంట, బెల్లం తయారీ లేని నగరం అవసరమా. అభివృద్ధి అవసరమే కానీ…మన సంస్కృతిని చెరిపేసే అభివృద్ధి అవసరమా. జనానికి అదే చెబుతున్నా. ఈ ఉగాది సంగతి చెప్పలేనుకానీ వచ్చే ఉగాదిలోగా నేను అధికారంలోకి వచ్చేస్తా. చూస్తూ ఉండండి నేనే మీకు ఉగాది పచ్చడి తినిపిస్తా. అధికారపక్షాన్ని పచ్చడిపచ్చడి చేస్తా. ఆదాయవ్యయాల లెక్కలు నేను చూసుకునే వీలు లేకుండా పోయింది. ఆదాయపన్ను శాఖే నా లెక్క చూస్తోంది. గ్రహాలు ననే్నం చేస్తాయి. నేను తప్పు చేయలేదు. నా పచ్చడి తిని, నాకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన నేతలే నా రోజులు బాగున్నప్పుడు పంచన చేరతారు. అంతవరకూ ఓర్పు, ఓదార్పుతో ముందుకెళతా. చంద్రబాబు, ఇతర నేతలు ఈ ఉగాదిగురించి ఆలోచిస్తున్నారు. నేను అలా కాదు. అధికారంలోకి రావడమే అసలు ఉగాది అని భావిస్తున్నా. అదే జరిగితే ఇంటింటికి ఉగాదియాత్ర చేసి వారి నోటికి తియ్యటి పచ్చడి అందిస్తా. పవన్‌కల్యాణ్ జనం మధ్య జేజేలు పలికించింది జయనామ సంవత్సరం. ఇంతవేగంగా అయిపోతుందని అనుకోలేదు. ఇక మన్మథనామ సంవత్సరంలోనూ మనం స్టార్‌గానే కొనసాగాలి. ఏం చేయాలి. జనంలోకే వెళ్లాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అడుగేయాలి. సింహమైనా, నేనైనా జూలు విదిలించి ముందుకువెళితేనే విలువ. అందుకే ఆంధ్ర రాజధాని ప్రాంతానికి వెళ్లా. జనం తెచ్చిన పెరుగన్నం తిన్నా. రేపొచ్చె ఉగాదికి జనం పెట్టే ఉగాది పచ్చడికూడా తింటా. తినొద్దన్నవారిని పచ్చడిపచ్చడి చేస్తా. జనం వెంట నేనున్నా. జనాన్ని బాధపెట్టే ఏ నిర్ణయాన్నైనా ఎదిరిస్తా. పోరాడతా. చంద్రబాబు, మోదీ..ఎవరైనా జనం కంట కన్నీరు తెచ్చే నిర్ణయాలు వద్దు. మన్మథలో వారి మనసు బాధపెట్టొద్దు. మీకు ఆలోచనలు రాకపోతే నేను చెబుతా. నాక్కొంచెం తిక్కుందని, అయినా దానికో లెక్కుందని ఎప్పుడో చెప్పా. నా పంచాంగం నాది. రాజపూజ్యానికి తిరుగులేదు. అవమానమంటారా. గతంకంటే ఏముంటుంది. కందాయఫలాలు, కందమూలాలు మనకక్కర్లేదు. కవిసమ్మేళనాలు మనకు సరిపడవ్. జన సమ్మేళనమే నాకు సరిపోతుంది. జనసేనే నా ఆయుధం. **

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెంకయ్య ఏకపాత్రాభినయం

వెంకయ్య ఏకపాత్రాభినయం – ఎ. కృష్ణారావు (18-Mar-2015)

నేను కర్ణాటక సభ్యుడిని. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నావని కర్ణాటక సభ్యులే అంటున్నారు.. అని వెంకయ్య చెప్పినప్పటికీ తన కాళ్ల క్రింద నేల ఆంధ్రప్రదేశ్‌ అని ఆయనకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవ స్థీకరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో తాను వీరవిజృంభణ చేశానని, ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఏమి చేయక పోయినా అంతా తన వైపే చూస్తారని ఆయనకు తెలుసు. విభజన చట్టంలో ఉన్న వాటిని అమలుచేసేలా చూడడం వెంకయ్యకు కత్తిమీద సామే. దానిక్కూడా ఆయన వెనుకాడడం లేదు.
ఆయన కేంద్రంలో మూడు శాఖలకు మంత్రి. అయినా ఆయన ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహా రాల గురించైనా మాట్లాడగలరు. ఒక సారి హోంమంత్రి రూపంలో, ఒక సారి ఆర్థిక మంత్రి రూపంలో, మరో సారి విదేశాంగ మంత్రి రూపంలో ఆయన మనకు ప్రత్యక్షమవు తుంటారు. ఆయన బీజేపీ నాయకుడు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్థ కుడు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు సంబంధించిన వ్యవహారా లైతే ఆయన వెంటనే రంగంలోకి దూకుతుంటారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాజ్య సభలో గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, సీతారాం ఏచూరి లతో పాటు ఏ పార్టీ నేతలు తన పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినా ఆయన వెంటనే లేచి పదునైన వాగ్బా ణాలు సంధిస్తుంటారు. ఎవర్నైనా చెండాడడానికి సిద్ధంగా ఉంటారు. అప్పటివరకూ లోక్‌సభలో ఉన్న వ్యక్తి, రాజ్యసభలో కనపడుతుంటారు. రకరకాల ప్రతినిధి వర్గాలను కలుస్తుం టారు. ఉన్నట్లుండి నల్గొండలో శాసనమండలి సభ్యుల ప్రచా రంలో పాల్గొనడానికి కూడా తానే వెళతారు. టీఆర్‌ఎస్‌ అభ్య ర్థిని ఓడించమని పిలుపునిస్తారు. వారాంతం వస్తే దక్షిణా దిన నాలుగైదు చోట్ల ప్రసంగించకపోతే ఆయన ఆరోగ్యం బాగుం డదు. పార్లమెంట్‌ వార్తల కోసమో, తెలుగు వార్తల కోసమో, టీవీ వైపు చూస్తే చాలు ఆయన మాట్లాడుతున్న దృశ్యమే కన పడుతుంటుంది. పోనీ, తన మంత్రిత్వ శాఖల పనులు ఏమైనా చేయరా అనుకుంటే అది కూడా పొరపాటే. స్మార్ట్‌ సిటీల సదస్సులోనో, మరో అధికారిక సమావేశంలోనో మాట్లాడుతూ ఉంటారు. మెయిల్‌ తెరిస్తే చాలు, ఆయన మీడియా అధికారి నుంచి అంచలంచలుగా, కుప్పలు తెప్పలుగా, పుంఖాను పుంఖాలుగా వార్తలు, ఆయన ఉపన్యాస పరంపరలు వస్తూనే ఉంటాయి. ఆయన ఎవరో కాదు, వెంకయ్యనాయుడేనని ఈ పాటికి చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది.
అసలు వెంకయ్యనాయుడుకు ఈ శక్తి ఎలా వచ్చింది? అని ఆశ్చర్యపోయే నాయకుడుండరు. బహుశా అంతటా సర్వంత ర్యామిలా తానే కనపడకపోతే, రోజుకు కనీసం పదిసార్లైనా మాట్లాడకపోతే ఆయనకు ఈ శక్తి ఉండేది కాదేమో. పని, మాట్లాడడం రెండూ ఆయన శక్తికి ఇంధనాల్లా కనపడుతాయి. హర్యానాలో ఒక చర్చిని కూల్చివేస్తే, పశ్చిమ బెంగాల్‌లో 72 ఏళ్ల ఒక వృద్ధ క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం జరిగితే మంగళవారం జీరో అవర్‌లో సభ్యులు గందరగోళం సృష్టిం చారు. నిజానికి ఇలాంటి సంఘటనలపై పార్లమెంట్‌లో హోం మంత్రి ప్రకటన చేయాలి. కాని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌కు రాక రెండు మూడు రోజులైంది. ఎక్కడో జపాన్‌లో ఏదో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. హోంశాఖ సహాయమంత్రి ఉన్నా ఆయనకు ప్రతిపక్షాలకు దీటుగా జవాబిచ్చే శక్తి లేదు. అంతే, అదే సమయంలో లోక్‌సభలో ఉన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. ఒక్కో సభ్యుడికి దీటుగా సమాధానమిచ్చి వారి నోళ్లు మూయించారు. సంఘటన నిందించదగ్గదే.. కాని రాజకీయం చేయవద్దు. హర్యానా, బెంగాల్‌లో ఏదో జరిగితే కేంద్రం ఏమి చేస్తుంది? ఒకవేళ కేంద్రం ఏమైనా చేసినా మీరు ఊరుకుంటారా.. అని విరుచుకుపడ్డారు. సంఘ్‌పరివార్‌పై ఒక్క మాట కూడా ఆయన పడనీయకుండా అడ్డుకున్నారు. చేసేది ఏమీ లేక కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పార్టీ సభ్యులు వాకౌట్‌ అని ప్రకటించి వెళ్లిపోయారు. రాహుల్‌ గాంధీపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం రాజ్యసభలో సభను స్తంభింపచేసిన కాంగ్రెస్‌ సభ్యులను కూడా వెంకయ్యే ఎదుర్కొన్నారు. అధికారులు ముఖ్య నాయకుల గురించి ఆరా తీయడం మామూలేనని, అది గూఢచర్యం కాదని కొట్టి పారేశారు. మీ హయాంలో మీ ఆర్థిక మంత్రి (ప్రణబ్‌ ముఖర్జీ) స్వయంగా తన కార్యాలయంలో హోంమంత్రి (చిదంబరం) బగ్గింగ్‌ చేయించారని ప్రధానికి లేఖ రాసిన విషయం మరిచిపోయారా.. అని ఎద్దేవా చేశారు. ఒక ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీని నాటి ఆర్థిక మంత్రి స్వయంగా నియమించుకుని బగ్గింగ్‌ పరికరాలను తీసేసిన విషయం ఆయన గుర్తు చేశారు. పనికిరాని ఆరోపణలు చేసి సెల్ఫ్‌గోల్‌ చేసుకోకండి.. అని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌ జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు, మూడు దేశాల పర్యటనకు వెళుతున్నారంటే అర్థం ఉంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన భార్య ఆరోగ్యం బాగులేదని అమెరికాకు వెళ్లారంటే కూడా అర్థం చేసుకోవచ్చు. కాని అదే జైట్లీ మళ్లీ లండన్‌లో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణకు వెళ్లడం, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జపాన్‌లో జాతీయ విపత్తు సదస్సుకు, ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమాలకు వెళ్లడం అవసరమా… అని అనుకోకుండా ఎవరూ ఉండలేరు. ఆర్థికమంత్రి సభలో లేకుండానే లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించేందుకు పూనుకుంటే ప్రధాన ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. ఆర్థిక మంత్రి లండన్‌కు వెళ్లేందుకు అనుమతించిన స్పీకర్‌ తన రూలింగ్‌ను సభ్యులే ధిక్కరిస్తుంటే ఏమీ చేయలేక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వైపు చూశారు. మిమ్మల్ని వారు ధిక్కరిస్తుంటే, మీరు మాత్రం ఏమి చేయగలరు? సభను వాయిదా వేయండి.. అని వెంకయ్య సూచించారు. హమ్మయ్య.. అనుకుంటూ మహాజన్‌ సభను వాయిదా వేశారు. ఇలా రోజుకు పలు సార్లు వెంకయ్య వైపు చూడకుండా స్పీకర్‌ సభను నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నది. పార్లమెంట్‌ అంటే వెంకయ్యే అనుకునే స్థితి ఏర్పడింది.
స్పీకరే కాదు, పార్లమెంట్‌ నడుస్తుంటే మిగతా కేంద్ర మంత్రులేమయ్యారో, వారేమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు. మీరు వెంకయ్య చెప్పినట్లు నడుచుకోండి.. అని నరేంద్రమోదీ చెప్పినట్లున్నారు.. అందుకే సభ కార్యక్రమాల గురించి వెంకయ్యతో చర్చించకపోతే సంబంధిత మంత్రి సభలో ఏమీ చేయలేరు. భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షం చేస్తున్న గందర గోళంపై వ్యూహరచన చేసేందుకు వెంకయ్య పిలిస్తే సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, స్మృతి ఇరానీతో సహా మొత్తం 35 మంది మంత్రులు ఆయన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో, నియోజకవర్గాల్లో ఏ విధంగా ప్రచారం చేయాలో ఆయన సూచించారు. ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్‌కు మీరేమి చేశారో చెప్పండి.. అని ఒక్కొక్కరి నుంచీ ఆయన వివరణలు కోరారు. భూసేకరణ బిల్లుపై ఆర్‌ఎస్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తే పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా వెంకయ్యతో చర్చించి సవరణలను చేర్చారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్రమోదీ ఉన్నప్పటికీ వెంకయ్యే ప్రధాన వక్త. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది, పార్లమెంట్‌కు హాజరై మీ బాధ్యతలు నిర్వహించడానికి. గైరు హాజరు చేయడం సరైంది కాదు.. అని ఆయన మోదీ సమక్షంలోనే క్లాసు పీకారు. కీలకమైన భూసేకరణ బిల్లు ఓటింగ్‌ జరిగినప్పుడు ప్రీతమ్‌ ముండే, వరుణ్‌ గాంధీ, పూనం మహాజన్‌, శత్రుఘ్న సిన్హా తదితరులు రాలేదని ఆయన వారందరి పేర్లూ చదివారు.
ఒకటి కాదు, రెండు కాదు, ఏఅంశంపైనైనా, ఆఖరుకు శ్రీలంకలో తమిళుల అంశంపైనైనా వెంకయ్య మాట్లాడగలరు. ఆయన వద్ద ఏ అంశంపైనైనా రెడీమెడ్‌గా సమాచారం ఉంటుంది. కాంగ్రెస్‌ హయాంలో ఎన్ని ఆర్జినెన్స్‌లు జారీ చేశారో, ఎన్ని సార్లు వారి మంత్రులు సభకు రాలేదో.. ఏఏ అక్రమాలు చేశారో.. ఆయన వద్ద సమాచారం సిద్ధంగా ఉంటుంది. మోదీ, మరికొందరు ముఖ్యమైన మంత్రులు సభలో లేరు కదా.. అని ప్రతిపక్షాలు విజృంభించాలని చూస్తే వారికి వెంకయ్య అరివీర భయంకరుడులా, కొరకరాని కొయ్యలా కనపడుతున్నారు. ఒకటి రెండు సార్లు ఆయనను ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్‌ నేతలు చూశారు. ఆయన తమను అవమానించారని ఆరోపణలు చేశారు. సోనియా కూడా ఆయనపై దాడి చేశారు. వెంకయ్య ఒక్కరోజు వెనక్కు తగ్గినట్లు కనపడ్డారు. కాని మరునాటి నుండి మళ్లీ వెంకయ్య సహజరూపంలో దర్శనమిచ్చారు. ఇప్పుడెందుకురా ఆయనతో పెట్టుకోవడం.. అని భయపడే పరిస్థితిని కల్పించారు. అలా అని వెంకయ్య ప్రతిపక్షాలతో స్నేహం చేయరా అంటే అదీ లేదు. నెయ్యం నెయ్యమే, కయ్యం కయ్యమే.. అన్నట్లుగా ఆయన వైఖరి కనపడుతోంది. ఇదేమిట్రా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రే తమను ఢీకొంటున్నారని ప్రతిపక్షాలు అనుకున్నప్పటికీ వెంకయ్య ఇలాగే ఉంటారని వారు సర్దుకోక తప్పడం లేదు. బీమా, తదితర బిల్లులను ఆమోదించక తప్పలేదు. ఇక తృణమూల్‌, టీఆర్‌ఎస్‌ వంటి పార్టీలను మచ్చిక చేసుకోవ డంలో వెంకయ్య సిద్ధహస్తులు. మీ అపాయింట్‌మెంట్‌ లేకుండా మీ ఆఫీసుకు వచ్చాను.. అని మమతా బెనర్జీ అంటే, సోదరీ.. నా వద్ద మీకు అపాయింట్‌మెంట్‌ ఎందుకు. ఎప్పుడైనా రావచ్చు.. అని వెంకయ్య అనగలరు.
నేను కర్ణాటక సభ్యుడిని. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నావని కర్ణాటక సభ్యులే అంటున్నారు.. అని వెంకయ్య చెప్పినప్పటికీ తన కాళ్ల క్రింద నేల ఆంధ్రప్రదేశ్‌ అని ఆయనకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవ స్థీకరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో తాను వీరవిజృంభణ చేశానని, ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఏమి చేయక పోయినా అంతా తన వైపే చూస్తారని కూడా ఆయనకు తెలుసు. మోదీని, సర్కార్‌లో మంత్రుల్నీ ఒప్పించి, విభజన చట్టంలో ఉన్న వాటిని అమలుచేసేలా చూడడం వెంకయ్యకు కత్తిమీద సామే. కాని దానిక్కూడా ఆయన వెనుకాడడం లేదు.
– ఎ. కృష్ణారావు
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

16-3-15 సోమవారం ఉదయం 11 గం లకు ఉయ్యూరు శ్రీ నివాస హైస్కూల్ లో శ్రీ మన్మధ ఉగాదివేడుకలు

16-3-15 సోమవారం ఉదయం 11 గం లకు ఉయ్యూరు జర్నలిస్ట్ శ్రీప్రకాష్ వివిధ న్యూస్ చానెళ్ళ కోసం శ్రీ నివాస హైస్కూల్ విద్యార్ధినులతో  మామిడి  మొదలైన చెట్ల వనం లో శ్రీ  మన్మధ ఉగాదివేడుకలు నిర్వహించి ,నాతొ పంచాంగ శ్రవణం చేయించిన చిత్ర మాలిక -బహుశా ఇవి ఉగాదినాడు ప్రసారం కావచ్చు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015)

కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015)
పద్యమంటే పొడిమాటల సమాహారం కాదని
హృద్యంగా గుండెను తడిపే మాటల మకరందమని
సుశబ్దశోభిత సురభిళ సుమహారమని
వేదికలపై చమత్కారమై మెరసి
అనుభూతిని గుండె నిండా కురిసి
తెలుగుపద్యంపై చెరగని సంతకం చేసినవాడు
తెలుగు పద్యానికి తరగని సిరిగా నిల్చినవాడు
అతడు ‘కవితాప్రాద’ భాసురుడు
కవితాకాశంలో అస్తమించని ప్రతిభా భాస్కరుడు
జనతా హృదయావిష్కృత విజయశేఖరుడు.
‘రాళ్ళబండి’కి కవిత్వపు రత్నాలను ఎత్తి
ఊరూరా పద్యమై ఊరేగినవాడు.
నిత్యం పద్యమై ప్రవహిస్తూ
తీయని సంభాషణల్లో మెరుస్తూ
‘కందం’లో అందమైన జగణంగా నిలుస్తూ
నన్నయ్య వారసుడిగా ఈ తరాన్ని పలకరిస్తూ
అన్నయ్య నాగభైరవను మనసులో తలుస్తూ
లోకానికి కవిత్వాన్ని
నాలాంటి ఎందరికో దుఃఖాన్ని మిగిల్చి
‘లఘువు’లా మాయమయ్యాడు
రేపటి పద్యానికి ‘గురువు’గా నిలిచాడు
అవధాన విద్యకు ఆధునికతను జోడించి
పద్యానికి సరికొత్త పరిమళాన్ని అద్దినవాడు
స్నేహసౌజన్యాలకు మారుపేరై
కార్యనిర్వహణలో నూతన ఒరవడిని దిద్దినవాడు
అతడు నిత్యప్రససాద భాసురుడు
ఏ భుజకీర్తులూ లేని అచ్చమైన భూసురుడు
– డా. బీరం సుందరరావు
ఇంకొల్లు, ప్రకాశం జిల్లా
నువ్వెప్పటికీ మా స్టూడెంట్‌ పండిట్‌వే’- ఎస్‌.ఎ. కరీమ్‌ (17-Mar-2015)
ఉగాది వచ్చినా… సంక్రాంతి వచ్చినా… తెలుగు టీవీ చానళ్ళలో పదహారణాల తెలుగు ఆహార్యంతో నిండుగా… నవ్వుతూ కనిపించేవాడు ప్రసాదరాజు. ప్రసాద్‌ ప్రసంగాలు – కవితలు ఆ తెలుగు ఉచ్ఛారణ… తెలుగుపై నా ప్రేమను పెంచేవి. ఈ ఉగాదికి నువ్వు లేవు. కానీ… తెలుగు వాళ్ళంతా నిన్ను తలుచుకుంటారు.
రాళ్ళబండి కవితాప్రసాద్‌ గురించి ఇలాంటి సందర్భంలో రాయాల్సి వస్తుందని నేనసలు ఊహించుకోలేదు. అసలు నాకు ఇలాంటి తలపే ఏనాడూ రాలేదు. మా ప్రసాదరాజు సాధించిన విజయాలపై గొప్పగా రాయాలనుకున్నా… మనం అనుకున్నా… అనుకోకున్నా… మనకు ఇష్టం ఉన్నా… లేకున్నా కొన్ని ఆగవు. జరిగిపోతాయి. నిండు నూరేళ్ళు నవ్వుతూ బతకాల్సిన మా ప్రసాదరాజు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతాడని ఎవరనుకున్నారు?
రాళ్ళబండి కవితా ప్రసాద్‌ గురించి చెప్పాలంటే 38 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 1976లో ఈ కథ మొదలైంది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నియోజకవర్గం సత్తుపల్లి. అటు పల్లె కాదు, ఇటు పట్నం కాదు. వెంగళరావు అండతో… చొరవతో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఊరది. వెంగళరావు చొరవతోనే అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1976లో ప్రారంభమైంది. కొత్త కళాశాల కాబట్టి… విద్యార్థుల్ని ఆకర్షించాలన్న ఉద్దేశంతో మొదటి బ్యాచ్‌ వారికి ఉచిత విద్య – ఉచిత భోజన వసతి కల్పించారు. అది తెలుసుకున్న అనేక మంది పేద విద్యార్థులు కృష్ణా, పశ్చిమగోదావరి, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వచ్చి సత్తుపల్లి కాలేజీలో చేరారు. ఇంటర్‌లోనే చదువు ఆపేసిన వాళ్ళు కూడా అనేక మంది పెట్టె బేడా సర్దుకుని సత్తుపల్లి వచ్చేశారు. అందుకే మొదటి బ్యాచ్‌లో ఎంతో వైవిధ్యం ఉండేది. రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు… వయస్సులో కూడా చాలా పెద్దవాళ్ళు… పెళ్ళయిన వాళ్ళు… నూనుగు మీసాల వాళ్ళు… ఇలాంటి వాళ్ళంతా కలిసి సత్తుపల్లి కాలేజీ మొదటి బ్యాచ్‌ అయ్యింది. ఇక లెక్చరర్లు కూడా ఉద్దండులు. ప్రతి సబ్జెక్టులోనూ మెరికల్లాంటి లెక్చరర్లను సత్తుపల్లి బదిలీ చేయించారు వెంగళరావు. బీఎస్సీ, బీకాం, బీఏ… మూడు క్లాసులు మొదలయ్యాయి. అందులో బీఎస్సీ విద్యార్థి రాళ్ళబండి ప్రసాదరాజు. అప్పుడు అతని పేరు అదే. తర్వాత కవితా ప్రసాద్‌గా మార్చుకున్నాడు.
మా బ్యాచ్‌లో పిన్న వయస్కులు అతి కొద్దిమందిలో ప్రసాదరాజు ఒకడు. ప్రసాద్‌ స్వతహాగా ప్రతిభావంతుడు. మితభాషి. మృదుస్వభావి. సున్నిత మనస్కుడు. లెక్చరర్లు… తోటి విద్యార్థుల మనసు గెలిచినవాడు. ముఖంపై చెరగని చిరునవ్వు ప్రసాదరాజు ట్రేడ్‌ మార్క్‌. అందరిలో చిన్నవాడు కదా? అప్పుడప్పుడూ… కొందరు ఆట పట్టించేవాళ్ళు. ప్రసాదరాజు చిరునవ్వే అందుకు జవాబు. ఇక కాలేజీలో జరిగే వార్షికోత్సవాల్లో… సాహితీ విభాగం బహుమతులన్నీ ప్రసాదరాజు దక్కించుకునేవాడు. అందుకే మా లెక్చరర్లు ‘స్టూడెంట్‌ పండిట్‌’ అని బిరుద్దు ఇచ్చేశారు. ఆనాటి సత్తుపల్లి కాలేజీ నిజానికి ఒక గురుకులం. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే వాళ్ళు లెక్చరర్లు. వేమనపైన… నల్లమందు యుద్ధంపైన… ఇలా అనేక అంశాలపై ప్రత్యేక లెక్చర్లు ఉండేవి. శ్రీశ్రీ మహా ప్రస్థానంలో యువత ఉర్రూతలూగుతున్న కాలమది. ఎమర్జెన్సీకి ముందు – తర్వాత రాజకీయ వాతావరణాన్ని కూడా మేం అక్కడే పసిగట్టాం. లైబ్రరీలో నిండా పుస్తకాలు. ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు. అవన్నీ చదవండంటూ ప్రోత్సహించే లెక్చరర్లు. ముందు ముందు ప్రసాదరావు మంచి సాహితీవేత్తగా ఎదగడానికి కారణమయ్యింది ఆ వాతావరణం. స్వతహాగా సాహితీ అంశ ఉన్నవాడు. దానికి సత్తుపల్లి కాలేజీ సానపట్టింది. మా బ్యాచ్‌ వాళ్ళందరికి సత్తుపల్లి జీవితం ఒక చెరగని స్వప్నం. సత్తుపల్లి తర్వాత ఎవరి దారి వారిది.
ప్రసాదరాజు ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరోలో అధికారిగా చేరాడు. ఆ తర్వాత గ్రూప్‌-1 పాసై సోషల్‌ వెల్ఫేర్‌లో అధికారిగా వచ్చాడు. ఇక అక్కడి నుంచి ప్రసాదరాజు సాహితీ వ్యవసాయం నిరంతరంగా సాగిపోయింది. సాహితీ పరంగా చూస్తే… ఆధునిక భావాలున్న సంప్రదాయవాదిలా కనిపిస్తాడు ప్రసాద్‌. హైదరాబాద్‌లో అప్పుడప్పుడూ మాసాబ్‌ట్యాంక్‌ ఆఫీసులో కలిసేవాళ్ళం. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఫోన్లు, ఈ మధ్య ఒక ఫేస్‌బుక్‌ పలకరింపులు మాత్రమే. సాహితీ రంగంలో కొత్త కొత్త బాటలు వేసుకుంటూ బాటసారిలా సాగిపోయే ప్రసాదరాజులో చిన్న అసంతృప్తి ఉండేది. సోషల్‌ వెల్ఫేర్‌లో కాకుండా… రెవిన్యూలో పోస్టింగ్‌ వచ్చి ఉంటే… ఐఏఎస్‌ అధికారి అయ్యేవాడినని… అన్నాడు నాతో ఒకసారి. కానీ… ఇవ్వాళ ప్రసాద్‌ రావు వాటన్నంటికన్నా, ఎత్తుకు ఎదిగాడు. ఉగాది వచ్చినా… సంక్రాంతి వచ్చినా… తెలుగు టీవీ చానళ్ళలో పదహారణాల తెలుగు ఆహార్యంతో నిండుగా… నవ్వుతూ కనిపించేవాడు ప్రసాదరాజు. ప్రసాద్‌ ప్రసంగాలు – కవితలు ఆ తెలుగు ఉచ్ఛారణ… తెలుగుపై నా ప్రేమను పెంచేవి. ఈ ఉగాదికి నువ్వు లేవు. కానీ… తెలుగు వాళ్ళంతా నిన్ను తలుచుకుంటారు. నువ్వు వెళ్ళిపోయావు… నిజం. సత్తుపల్లి కాలేజీ మొదటి బ్యాచ్‌ అందరి గుండెల్లో నువ్వున్నావు. అదీ నిజమ్‌. వాళ్ళందరి తరఫున నీకిదే నివాళి. మా బ్యాచ్‌ తరఫున తీవ్ర సంతాపం తెలియజేస్తున్నా. రాళ్ళబండి కవితా ప్రసాద్‌ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నాం. ప్రసాద్‌! నువ్వెప్పటికీ మా స్టూడెంట్‌ పండిట్‌వే. నిన్ను మేం అలాగే గుర్తుంచుకుంటాం.
ఎస్‌.ఎ. కరీమ్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు

తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు (09-Mar-2015)
‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’, వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యాల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా కనిపిస్తారాయన.
తెలుగు వ్యాసప్రస్థానంలో స్వామినీన ముద్దునరసింహనాయని గారి ‘హిత సూచని’ ఒక మైలురాయి. 1862 లో అచ్చయ్యింది. రచన అంతకు ముందెప్పుడో జరిగింది. ఎందుకంటే నరసింహం గారి మరణానంతరం అచ్చుకెక్కిన పుస్తకం అది. వ్యాసం ఇందులో ప్రమేయం అనే పేరుతో ఉంది. అప్పటికింకా వ్యాసానికి వ్యాసం అనే పేరు రాలేదు.
వ్యావహారిక భాషలో వెలువడ్డ వ్యాసాలివి. ఇది తెలుగులో మొదటి వ్యాససంపుటిగా పరిగణింపబడుతోంది. ఆధునిక విద్యా విజ్ఞానాలు కలిగిన మనిషి హేతుపురస్సరంగా విద్య, వైద్యం, మంత్రం, రాక్షసులు, వివాహం మొదలైన విషయాల గురించి చేసిన ఆలోచనలు ఈ వ్యాసాలు. చరిత్ర కారులు ఈ రచనను ఆధునికత ప్రారంభరచనగా గుర్తించారు కాని ఇందులోని సాహిత్య విమర్శాంశను గుర్తించినట్టు లేదు. దీనిని ఆధునిక సాహిత్య విమర్శలో తొలి రచనగా కూడా గుర్తించవలసి ఉంది.
మనుష్యేతర జంతు సంజ్ఞాప్రమేయంలో నరసింహంగారు బంగారు ముంగిస కథను, కేకయ రాజు కథను తీసుకుని వాటిలోని సంఘటనల సాధ్యాసాధ్యాలను విశ్లేషణాత్మకంగా విచారించారు. ఆ కథల మూల లక్ష్యంగా మనం గ్రహించవలసిన విషయాలను, యథార్థాలని భ్రమించకుండా విడిచిపెట్టవలసిన విషయాలను విశదీకరించారు. జంతుజాలం మనుష్యులలాగా ఆలోచించగలదని, మనుష్యులతో మాట్లాడగలదని నమ్ముతున్న జనాన్ని ఉద్దేశించి రాసిన ప్రమేయం ఇది.
భారతంలో కనిపించే బంగారు ముంగిసకథను పరిశీలించిన పద్ధతి ఇలా ఉంది. ముందుగా కథను వివరంగా చెప్పా రు. పేద బ్రాహ్మణుడు అతని కుటుంబం తమకు తినడానికి ఏమీ లేని స్థితిలో చివరకు దొరికిన యవల పిండిని కూడా అతిథి సంతృప్తి కోసం త్యాగం చెయ్యడం, ఆ అతిధికి పాద్యం నిమిత్తం వాడిన నీటిలో తలను, ఒక పక్క శరీరాన్ని తడుపుకున్న ఒక ముంగిసకు ఆ భాగాలు బంగారంగా మారడం, తక్కిన శరీరాన్ని కూడా బంగారంగా మార్చుకోవడం కోసం ఆ ముంగిస వివిధ యాగ ప్రదేశాలకు వెళ్ళి ప్రయత్నించి విఫలం కావడం, ధర్మరాజు చేసిన అశ్వమేధం వద్ద కూడా ఫలితం పొందలేకపోవడం, ఆ ముంగిస అక్కడి విప్రులకు రాజుకు పేదబ్రాహ్మణుడి త్యాగం కన్న ఈ యాగాదులు మిన్నకావని చెప్పడం మొదలైన సంఘటనలన్నిటినీ చెప్పారు. తర్వాత ముంగిసకు మానవ భాష రావడం అసాధ్యమని, దాని శరీరం బంగారంగా మారడం కుదరని విషయమని విశ్లేషించారు ‘న్యాయానుగుణంగా ఆర్జించని సొత్తు ఎంత విస్తారముగా వ్యయము చేసినా న్యాయ కష్టార్జితము తాలూకు స్వల్ప భాగము యొక్క ధర్మముతో సమానము కానేరద’ నేది ఆ కథ నుంచి గ్రహించవలసిన నీతి అని వివరించారు.
అలాగే కేకయ రాజు కధావిమర్శ కూడా చేశారు. ఈ కథ వాస్తవంగా జరిగిందని అనేకులు నమ్ముతున్నారని, అప్పటి వాస్తవ ప్రపంచ మర్యాదకు విరుద్ధంగా ఉన్నప్పటికీ పూర్వయుగాలలో ఇటువంటి సంగతులు జరిగి ఉన్నట్టు చెబుతున్నారని అది తప్పని రాశారు.
అంటే పురాణ కథలు కల్పిత సాహిత్యం అని, ఒక ధ్యేయంతో రచయితలు సాగించిన రచనలని అంటున్నారన్నమాట.
భారతాంతర్గతంగా ఉన్న పరీక్షిదుదంక తక్షకుల కథను మంత్రప్రమేయములో వివరంగా చర్చించారు. పరీక్షిత్తు మహారాజు చేసిన తప్పు, దానికి మునికుమారుడైన శృంగిచేత శాపానికి గురికావడం మొదలుకుని సర్పయాగ విరమణ వరకూ ఉన్న అన్ని ఘట్టాలను సంక్షిప్తంగా తెలియజేశారు. ఆ తర్వాత ఆ ఘట్టాలలోని హేతుబద్ధతను చర్చించారు. చివరగా ఆ కథ ద్వారా నేర్చుకోవలసిన నీతిని ప్రస్తావించారు. వేట ఒక వ్యసనమని అది తప్పు పనులను చేయిస్తుందని, ప్రభువైన వాడు నేరం పూర్తిగా విచారించకుండా శిక్షించడం తప్పని, తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు స్పందించడం న్యాయమని, జాతిలో ఒక్కడు తప్పుచేస్తే అది జాతి మొత్తానికి హానికరంగా పర్యవసించవచ్చునని వివరించారు. అయితే కథ కూర్పులోని అస్తవ్యస్థతలను ఉపేక్షించలేదు.
ఈ భాగంలో స్వామినీన వారు లేవనెత్తిన ప్రశ్నలు అనేకం. మచ్చుకు కొన్ని
1. తండ్రి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా తండ్రిని అవమానించాడన్నకోపంతో రాజును శపించిన శృంగి దుడుకు మనిషి. శాప ఉపసంహరణ చెయ్యమని చెప్పిన తండ్రి న్యాయబద్ధమైనకోర్కెను పాటించలేని వాడు, అటువంటి మనిషి తిట్టు అమోఘంగా ప్రవర్తించడం ఎలా సాధ్యం?
2. అతనికి ఆ సామర్థ్యం ఉన్నట్టయితే తక్షణం చనిపోయేటట్టు ఎందుకు శపించలేదు? వారం రోజుల వ్యవధి ఎందుకు ఉంచాడు?
3. భూలోకంలో అనేక సర్పాలు ఉండగా నాగలోక నివాసి అయిన తక్షకుడే కాటు వేయాలని ఎందుకు శపించాడు?
4. బతికి ఉన్న చెట్టును దానిపై ఉన్న పక్ష్యాదులతో సహా తన విషంతో భస్మం చెయ్యగలిగిన తక్షకుడు పరీక్షిత్తు ఉన్న ఒంటి స్తంభం మేడను దానిలో ఉన్న మనుష్యులందరితో సహా ఎందుకు భస్మం చెయ్యలేకపోయాడు?
5. సర్పయాగంలో ముందుగా తక్షకుడే చనిపోయేటట్టుగా రాజు ఎందుకు సంకల్పించలేదు?
మంత్రాలు లేవని వాదిస్తూ రాసిన ఈ వ్యాసం మూఢనమ్మకాలకు సంబంధించినదేగాని ఇందులో సాహిత్య విమర్శ కూడా ఉంది. నరసింహంగారి లక్ష్యం అది కావడం కాకపోవడంతో నిమిత్తం లేకుండానే ఇక్కడ సాహిత్య వస్తువిమర్శ జరిగింది. ఒక సాహిత్య రచనను ఏ విధంగా చదవాలి ఏమి స్వీకరించాలి అన్న వివేచన ఉంది.
శిల్పం, అలంకారం, రసం, వస్తువు, పాత్రలు, సంఘటనలు మొదలైనవన్నీ కలిసి సాహిత్యం తయారవుతుంది. వాటిలో ఏ అంశాన్ని విశ్లేషించినా అది సాహిత్య విమర్శ అవుతుంది. స్వామినీన వారు చేసింది పురాణ సాహిత్య వివేచన. ‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’ వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యా ల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా కనిపిస్తారాయన.
– రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015)

ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015)

తన చావుకు కారణం ఒకరికైనా తెలియాలన్నదే ఆ ఆత్మ కోరిక. అది ఎప్పుడు పుట్టిన కోరిక? ఆత్మగా మారాక పుట్టినదా? బ్రతికున్నపుడు అటువంటి కోరిక మనిషికి ఎందుకు పుడుతుంది? తన కోరిక అదని ఆ కోరిక తీరేదాకా ఆత్మకి ఎందుకు అర్థం కాలేదు? ఆత్మ లక్షణాలే సరిగా తెలియని మనల్ని ‘ఆత్మలో వుండే ఆత్మకే తెలియని మరో ఆత్మ’ గురించి చెప్పి ఈ రచయిత ఎందుకు పరీక్షిస్తున్నాడు?
ఎక్కువ శాతం కథ ఆత్మకి ఉన్న (ఉందనుకుంటున్న) సౌలభ్యాన్ని ఉపయోగించుకోనపుడు, ఎక్కువ భాగం కథ ఆ వ్యక్తి బ్రతికున్నప్పటి విషయాలను, భావాలనే చెప్తూ పోయినపుడు అసలు ‘ఆత్మ’తో కథ చెప్పించవలసిన అవసరమేమిటి అన్న ప్రశ్న వస్తుంది. ప్రయోగం కోసం చేసిన ప్రయోగం అసంతృప్తిని కలిగిస్తుంది.
కథని ఎవరి చేత చెప్పించాలి అన్న విషయాన్ని ప్రతి కథారచయితా ఆలోచించి ఎంచుకుంటాడు. ఒక్కొక్కసారి ప్రయోగాలూ చేస్తాడు. వృక్షాలూ జంతువులూ వచ్చి మనకి కథలు చెప్పడం జరుగుతూ వుంటుంది. అందుకు ఒక ప్రయోజనమూ ఉంటుంది. కథకుడు రాగద్వేషాలకు అతీతంగా సత్యాన్ని చెప్తున్నాడన్న నమ్మకాన్ని పాఠకుడికి కలిగించేందుకో, లేక పాఠకుడు కథలోని పాత్రలతో తాదాత్మ్యం చెందకుండా కథలోని సత్యాన్ని మాత్రమే గ్రహించే అవకాశాన్ని కల్పించేందుకో బహుశా రచయిత చెట్టునీ, పిట్టనీ కథకుడిని చేస్తాడు. ఒక్కొక్కసారి ‘ఆత్మలు’ చెప్తున్నట్లుగా కూడా కొన్ని కథలు వస్తూ వుంటాయి.వాటి ప్రయోజనం ఏమిటి? అంటే, ‘ఆత్మ’ ద్వారా కథ చెప్పించినందువల్ల ‘కథకి’ ఒనగూడే అధిక విలువ ఏమిటి? ఆ విషయాన్ని పరిశీలించే ప్రయత్నం ఈ వ్యాసం.
నా పరిశీలనకు నాలుగు కథలని తీసుకున్నాను. గొరుసు జగదీశ్వర రెడ్డి వ్రాసిన ‘బతుకుగోస’, సామాన్య వ్రాసిన ‘మహిత’, అరిపిరాల సత్యప్రసాద్‌ వ్రాసిన ‘ఊహాచిత్రం’, మండువ రాధ వ్రాసిన ‘చివరిపూవు’. ఈ కథలు మాత్రమే చర్చకు తీసుకోవడానికి కారణం ఇవి ప్రస్తుతం నాకు అందుబాటులో వుండడం, నేను చెప్పదలచుకున్న విషయాలను చెప్పేందుకు ఈ నాలుగు కథలూ సరిపోవడం. అంతే తప్ప నేను ఈ వ్యాసంలో చర్చిస్తున్న విషయాలు (గుణాలు, దోషాలు కూడా) ఈ నాలుగు కథలలో మాత్రమే ఉన్నాయని కానీ ఈ దృక్కోణంతో వ్రాసిన ఇతర కథలలో లేవని కానీ కాదు. అలాగే, ఈ వ్యాసంలో ఎత్తి చూపిన కొన్ని అంశాలు ఆయా కథారచయితలకి తెలియవనీ కాదు.
ఈ నాలుగు కథలలోనూ కథ మొత్తాన్ని లేదా కథలో కొంత భాగాన్ని ‘ఆత్మ’ చెప్తుంది. ‘బతుకుగోస’లో ఒక కంపెనీ మూసేసినందుకు నిరసనగా ధర్నా చేస్తూ కాల్పులలో చనిపోయిన కార్మికుడి ఆత్మ, ‘మహిత’లో అత్తగారింటిలో భర్త చేతిలో హత్య చేయబడిన పదహారేళ్ళ మహిత ఆత్మ, ‘ఊహాచిత్రం’లో ప్రస్తుతం వేస్తూ వున్న ఒక చిత్రం గురించిన ఆలోచనలతో పరధ్యానంగా స్కూటర్‌ నడిపి యాక్సిడెంట్లో చనిపోయిన చిత్రకారుడి ఆత్మ, ‘చివరిచూపు’ కథలో కరెంటు షాకుతో మరణించిన సూరి అనే త్రాగుబోతు ఆత్మా మనకి కథ చెప్తాయి.
వ్యవహారంలో ఆత్మ అనేమాటని మనం చాలారకాలుగా వాడుతూ వుంటాం. ఒక్కొక్కసారి మనసునే ఆత్మ అంటాం. ఇంకొకసారి మనసుకన్నా వెనుకనున్న ‘మరేదో’ అన్న అర్ధంలో ‘ఆత్మ’ అన్న పదాన్ని వాడతాం. మనిషికి మూడు శరీరాలు- స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు-ఉంటాయని చెప్పుకుంటాం. ఇందులో స్థూల శరీరానికి తప్ప మిగిలిన మూడింటికీ ‘ఆత్మ’ అనే మాటని మనం సంభాషణలలో కొంత అస్పష్టంగా వాడుతూ వుంటాం. సందర్భాన్ని బట్టి తగిన అర్థం తీసుకుంటూ వుంటాం.
మనుషులే కథ చెప్తున్నపుడు, మనుషుల సంభాషణలో ఆత్మ అనే పదం వాడినపుడు, ఈ అస్పష్టతలన్నీ కథలో ఉండవచ్చు. ఎందుకంటే మనం అలా అస్పష్టంగానే మాట్లాడుకుంటాం కాబట్టి. అయితే ఆత్మే కథ చెప్తున్నపుడు ఆ అస్పష్టతలు ఉండవచ్చునా? రచయిత దేనిని ‘ఆత్మ’ అంటున్నాడో, కథకుడిగా వ్యవహరిస్తున్న ‘ఆత్మ’ స్వరూపస్వభావాలు ఏమిటో మనకి స్పష్టంగా తెలియాలి కదా? ఇలాంటి కొన్ని కథలు చదివిన మీదట కొందరు రచయితలతోను పాఠకులతోను ఈ విషయంపై మాట్లాడిన మీదట అందరూ ఏకీభవిస్తున్న, భావిస్తున్న సామాన్య లక్షణాలు కొన్ని కనిపించాయి. అవి ఏమిటంటే, ఈ రకమైన కథలలో బ్రతికున్నపుడు ఉత్తమపురుష కథకుడిలో ఉన్న ‘మనసే’ అతను చనిపోయాక ‘ఆత్మ’ అవుతుంది. శరీరంతో బంధింపబడి లేదు కాబట్టి అది ఎక్కడికైనా ఎప్పు డైనా వెళ్ళిపోగలదు. అది కథలోని మిగతా పాత్రలకి కనబడదు. వినబడదు. దానికి మాత్రం అందరూ కనబడతారు, వినబడతారు. ఇవి ఇలాంటి అన్ని కథలలోనూ కనబడే ‘ఆత్మ’ లక్షణాలు. పాఠకులూ రచయితలూ కూడా అంగీకరించే సామాన్య లక్షణాలు. అప్పుడు మూడు విషయాలను గమనించవలసి అవసరమూ అవకాశమూ ఏర్పడుతుంది. 1. ఈ సౌలభ్యాన్ని రచయిత ఎంతవరకు ఉపయోగించుకున్నాడు? 2. ఎంత విచక్షణతో ఉపయోగించుకున్నాడు? 3. దానివలన కథకి ఏ ప్రయోజనాన్ని సాధించాడు? పైన చెప్పిన నాలుగు కథలనీ ఉదాహరణలుగా తీసుకుని ఈ మూడు విషయాలు పరిశీలిద్దాం.
కథలో ‘ఆత్మ’ తప్ప చెప్పలేని విషయమెంత?
ఆత్మ చెప్తున్న కథలు అయినప్పటికీ నిజానికి ఇవి ఉత్తమపురుష దృక్కోణంతో నడిచే కథలే. కథకుడు తాను బ్రతికున్నపుడు జరిగిన విషయాలని, మరణించాక జరిగిన విషయాలని కలగలిపి చెప్పడం మనం వీటిలో చూస్తాం.
కథనం మనసు నుండి ఆత్మకు మారడం (కథకుడు మనిషి నుండి శవంగా మారడం) అనేది కథ మొదట్లో జరగవచ్చు, మధ్యలో జరగవచ్చు చివర్లో జరగవచ్చు. ఎప్పుడు జరిగినప్పటికీ కథలో ఉత్తమపురుష కోణంలో కథ చెప్పబడితే ఏయే విషయాలు చెప్పే అవకాశముందో అవి మాత్రమే చెప్పినపుడు లేదా అవే ఎక్కువగా చెప్పినపుడు కథ ఈ సౌలభ్యాన్ని సరిగా వాడుకోనట్లే. ఆ కోణంలో చూసినపుడు, ఈ నాలుగు కథలలో బతుకుగోస, మహిత కథలు ఈ అవకాశాన్ని బాగా వాడుకున్నాయని అనిపిస్తుంది. కథ చెప్తున్నది ఆత్మ అన్న విషయాన్ని బతుకుగోసలో కథ చివర్లోనూ, మహితలో కథ మధ్యలోనూ చెప్తారు. ఊహాచిత్రంలో కథ మొదట్లోనే చెప్తారు. అయినా ఊహాచిత్రంలో కన్నా మిగిలిన రెండు కథల్లోనే రచయితలు ‘ఆత్మ’ని సరిగా వాడుకున్నారు. ఎందుకంటే ఊహాచిత్రం కథలో ఎక్కువభాగం ‘మనసు’ కూడా చెప్పగలిగిన కథే. ఊహాచిత్రం కథలో ‘కథకి అవసరమైన భాగం’ ఆత్మ మాత్రమే చెప్పగలది కాదు. ‘ఆత్మ చెప్పిన భాగం’ కథకి నిజంగా అవసరమైనది కాదు. ఇక చివరిచూపు కథలో అయితే ‘ఆత్మ’ ప్రాధాన్యం అసలే లేదు. ఈ రెండు కథలూ ఒక చిన్న అంశాన్ని చెప్పేందుకు మాత్రమే ఆత్మని వాడుకుంటాయి.
ఎక్కువ శాతం కథ ఆత్మకి ఉన్న (ఉందనుకుంటున్న) సౌలభ్యాన్ని ఉపయోగించుకోనపుడు, ఎక్కువ భాగం కథ ఆ వ్యక్తి బ్రతికున్నప్పటి విషయాలను అప్పటి పరిస్థితులను, భావాలనే చెప్తూ పోయినపుడు, ఒక చిన్న అంశాన్ని చెప్పేందుకు మాత్రమే ఆత్మని ప్రవేశపెట్టినపుడు, మరీ ముఖ్యంగా ఆ చిన్న అంశం కూడా నిజంగా కథకి అంత కీలకమైనది కానపుడు అసలు ‘ఆత్మ’తో కథ చెప్పించవలసిన అవసరమేమిటి అన్న ప్రశ్న వస్తుంది. ప్రయోగం కోసం చేసిన ప్రయోగం అసంతృప్తిని కలిగిస్తుంది.
ఆత్మ యొక్క కనీసపు లక్షణాలుగా రచయిత తీసుకునే కొన్ని విషయాలను పైన చెప్పుకున్నాం. రచయిత కనీసం వాటికి కట్టుబడి ఉండవలసిన అవసరం ఉందనీ అనుకున్నాం. వాటిలో ఒకటి బ్రతికి ఉన్నప్పటి మనసునే చనిపోయాక ఆత్మ అంటున్నామన్న విషయం. రెండవది ఆత్మ శరీరంలో నుంచి బయటకి వచ్చింది కనుక ఇక దానికి శరీరం లేదన్న విషయం. ఈ అనుకోలుతో కథ చది వితే కథ చెప్తున్నది ఆత్మ అయినపుడు కొన్ని రకాల వాక్యప్రయోగాలు, వ్యక్తీకరణలు చేసే అవకాశం వుండదు. కానీ ఒక్క మహిత కథలో తప్ప మిగిలిన మూడు కథలలోనూ వాటిని రచయితలు విరివిగా చేశారు. బతుకుగోస కథలోని వాక్యాలు కొన్ని చూద్దాము.
‘లోపలికి అడుగేస్తుంటే… శరీరం కంపించింది’, ‘లేత్‌మిషన్‌ చేతికి తగిలింది.’, ‘తుళ్ళిపడ్డట్టు వెనక్కి తిరిగాను.’, ‘ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది.’- ఇవి బతుకుగోస కథలోని వ్యక్తీకరణలు. చివరి చూపు కథలో ‘ఆత్మ’ ప్రవేశించేది కథ చివర్లో. ఒక రెండు మూడు పేరాలు మాత్రమే ఆత్మ చెప్పే కథ వుంటుంది. ఆ చిన్న భాగంలో వ్యక్తీకరణలు ఇలా ఉంటాయి. ‘నా ఆత్మ ఏడుస్తోంది. నా గురించి ఒక్క మంచి మాట వినాలని తపన పడతా అక్కడక్కడే తిరుగుతోంది.’, ‘దిగులుతో నా మనశ్శరీరాలు రెండూ కుంచించుకుపోసాగాయి.’, ‘నన్ను క్షమించండి అని ముందుగా నేనే అందరితోనూ అనాలనుకున్నాను. ముఖ్యంగా నా పెళ్ళాంతో అనబోయేంతలో నా ఆత్మ ప్రకృతిలో కలిసిపోయింది.’
సాహిత్యానికి సంబంధించినంతవరకు ఆత్మ కథకుడైనపుడు ఆత్మ=మనసు=నేను అనుకున్నాము కనుక మళ్ళీ ఆ కథకుడు(ఆత్మ) ‘నా ఆత్మ’ అనడం, ‘నా మనశ్శరీరాలు’ అనడం సరి అయిన వ్యక్తీకరణ కాదనిపిస్తుంది.
ఇక ఊహాచిత్రం కథలోనయితే ఈ వైరుధ్యాలు, అస్పష్టతలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. ‘నేనొక పిచ్చోణ్ణి. నా ముందు మసక మసకగా వున్న చిత్రాన్ని చూసి సర్రియలిజమో ఇంకేదో అనుకున్నా… ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో! పైగా టీ ఇవ్వలేదని కోపమొకటి! అలా ఎంతసేపు పెయింటింగ్‌కి పోజిచ్చినవాడిలా కూర్చోవాలో మరి. ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!’ ‘ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో!, …. ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!’ వంటి మనిషికి కలిగే భావాలనే ఆత్మలకి కూడా కలిగినట్లుగా వ్రాయడంలో ఔచిత్యం లేదు. ఇటువంటి వాక్యాలు ఈ కథలో చాలా ఉంటాయి.
అలా కాదు. మనం తికమకలో ఉన్నట్లే ఆత్మలూ తికమకలో ఉంటాయి, పైగా అప్పుడప్పుడే ఆత్మగా మారినపుడు ఆ తికమక కొంచెం ఎక్కువగా వుంటుంది అని సమర్ధించుకోవచ్చు. లేక ఆత్మ అలాంటి వ్యక్తీకరణ చేసే అవకాశమూ నిజంగానే ఉండవచ్చు. కానీ అపుడు మళ్ళీ మొదటి ప్రశ్నే వస్తుంది. ఉత్తమపురుష కథనానికీ ఆత్మ కథనానికీ అసలేభేదమూ లేనపుడు…భావ వ్యక్తీకరణలో, పదప్రయోగంలో కించిత్తయినా వ్యత్యాసం చూపనపుడు ఆత్మతో కథ చెప్పించడం ఎందుకన్న ప్రశ్న. ప్రయోగం కోసమే ప్రయోగమూ అన్న ప్రశ్న.
ఆత్మ దృక్కోణంలో నడిచే కథకీ మాములుగా ఉత్తమపురుష దృక్కోణంతో నడిచే కథకీ ‘వ్యక్తీకరణ’లో, కథనంలో పెద్ద తేడా చూపడం లేదు రచయితలు. మరి ఎందుకు ఆత్మతో కథ చెప్పిస్తున్నారు? అని పరిశీలించి చూస్తే… ఈ కథలలో ఒక వ్యక్తి తను మరణించిన తర్వాత కూడా ఈ లోకంలో జరిగే కొన్ని విషయాలు గమనించడం, వాటి గురించి ఆలోచించడం, కొన్ని భావాలకు లోనవడం, కొన్ని విషయాలు వ్యాఖ్యానించడం వుంటుంది. కథని ఆత్మతో చెప్పించినప్పటికీ వాస్తవానికి రచయితకీ మనకీ కూడా కావలసింది ఆత్మ యొక్క వ్యాఖ్యల నుంచి ఆత్మని అర్థం చేసుకోవడం కాదు. ఆత్మ యొక్క వ్యాఖ్యల ఆధారంగా కథలోని బ్రతికున్న పాత్రలని, బ్రతికి ఉన్నప్పటి కథకుడి మనసుని ఇంకొంత బాగా అర్థం చేసుకోవడం. అలా అర్థం చేసుకునేందుకు మనకి ఆత్మ యొక్క వ్యాఖ్యలు, కథనం ఉపయోగపడాలి. ఆ దృష్టితో ఈ కథలని చూద్దాము.
చివరిచూపు కథలో ఏమవుతుంది? మనం చనిపోయాక కొందరు మనకోసం ఏడుస్తారని, బ్రతికుండగా మన ప్రవర్తన సరిగా లేకపోయుంటే చనిపోయాక మన గురించి ఎవరూ ఒక మంచి మాట మాట్లాడరని, అపుడు మనం ఎవరికైనా క్షమించమని అడుగుదామనుకున్నా ఇక ఆ అవకాశం ఉండదనీ సూరి ఆత్మ తెలుసుకుంటుంది. అంతే. ఇది నిజానికి ఆత్మ చెప్తే తప్ప తెలియని విషయం, మనం ఆత్మగా మారితే తప్ప అర్థం కాని విషయం కాదు.
ఇక ఊహాచిత్రం కథలో రచయిత ఆత్మ గురించి సమాజంలో వున్న మామూ లు నమ్మకాలకన్నా కొన్ని విషయాలు అధికంగా వ్రాస్తారు. ఆత్మ వెళ్ళిపోవాలనుకుంటున్నప్పటికీ వెళ్ళలేక పోతోందనీ, దానిని ఏదో శక్తి ఇక్కడ ఆపుతోందనీ ఒక వాక్యం ఉంటుంది. ఆ శక్తి ఏమిటి? ఏదైనా బాహ్య శక్తా? దానిలోనే ఉన్న కోరికా? దాని కోరికే అయితే ఆ కోరిక ఏమిటో దానికి కూడా తెలియదా? ఇలాంటి విషయాలన్నీ అస్పష్టంగా వుంటాయి. ఆత్మ అంటే శరీరం నుంచి బయటకి వచ్చిన మనసు అన్న అర్థం వరకే కథలో తీసుకుంటే శాస్త్రచర్చలు చేయవలసిన అవసరం వుండదు. ఈ విషయం నిజానికి చివరిచూపు కథకి కూడా వర్తిస్తుంది. ఆ కథలో ‘నా ఆత్మ ప్రకృతిలో కలిసిపోయింది.’ అన్న చివరి వాక్యం చాలా ప్రశ్నలకి దారితీస్తుంది. మళ్ళీ ఊహాచిత్రం కథకి వస్తే అందులో ఈ క్రింది వాక్యాలు ఉంటాయి. ‘నాకు అక్కడ వుండబుద్ది కావటం లేదు. కాని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్దామంటే వెళ్లనివ్వకుండా ఏదో పట్టి లాగుతోంది. భూమ్మీదే ఏదో శక్తి ఆపుతోంది. పోలీసులు వచ్చారు. నా మొబైల్‌ తీసుకొని అందులో నెంబర్లకి ఫోన్‌లు చేస్తున్నారు. నాకు అర్థమయ్యింది. నా భార్యాపిల్లల్ని చూసుకోవాలనే అనుకుంటా నా ఆత్మ ఆరాటం.’
ఇక్కడ ‘నేను’ ఎవరు? ‘అదే అనుకుంటా నా ఆత్మ ఆరాటం’ అని మనతో అంటున్నది ఎవరు? ఆత్మే కదా! ఆత్మ మళ్ళీ ‘నా ఆత్మ’ అనడం ఒక తికమక అయితే ఆ ‘ఆత్మ ఆరాటం’ ఏమిటో ఈ కథ చెప్తున్న ఆత్మకి స్పష్టంగా తెలియదనడం మరో తికమక. ‘కనీసం ఒకరికైనా నా చావుకు కారణం తెలిసింది. అదే నేను వినాలనుకున్నది. నా ఆత్మ గాల్లోకి లేచింది.’ ఈ వాక్యం చదివితే బోలెడన్ని సందేహాలు వస్తాయి. తన చావుకు కారణం ఒకరికైనా తెలియాలన్నదే ఆ ఆత్మ కోరిక. అది ఎప్పుడు పుట్టిన కోరిక? ఆత్మగా మారాక పుట్టినదా? బ్రతికున్నపుడు అటువంటి కోరిక మనిషికి ఎందుకు పుడుతుంది? తన కోరిక అదని ఆ కోరిక తీరేదాకా ఆత్మకి ఎందుకు అర్థం కాలేదు? ఆత్మ లక్షణాలే సరిగా తెలియని మనల్ని ‘ఆత్మలో వుండే ఆత్మకే తెలియని మరో ఆత్మ’ గురించి చెప్పి ఈ రచయిత ఎందుకు పరీక్షిస్తున్నాడు? – ఇవి నాకు కలిగిన సందేహాలలో కొన్ని మాత్రమే.
ఇక మహిత కథలో మాత్రమే కథకురాలు ఆత్మగా మారాక కొంత నిర్వికారంగా కథ చెప్పడం మనకు కనిపిస్తుంది. అయితే చిత్రంగా ఈ కథే మన మనసుని ఎక్కువగా కదిలిస్తుంది. పోస్టుమార్టం చేసిన డాక్టరు, తల్లి, తండ్రి, చనిపోయిన మహిత పొడుగాటి జడను తడుముతూ ఏడ్చిన మేనత్త – వీళ్ళందరి గురించీ మహిత ‘నిర్వికారంగా’ చెప్తుంటే… పదహారేళ్ళ పిల్ల అన్ని బాధలకీ అతీ తమైన స్థితికి బలవంతంగా నెట్టబడిందని అర్థమయిన మన గుండెల్లోకి ఆ పిల్ల బాధంతా…. ఇక మహితని అంటుకునే అవకాశం లేని ఆ బాధంతా గోడకి కొట్టిన బంతిలా వచ్చి చేరినట్లవుతుంది.
మహిత కథ చెప్తున్నపుడు శరీరం వుంది. ఇంకో క్షణంలో భర్త వచ్చి ఏం చేస్తాడో అత్త వచ్చి ఏం చేస్తుందో అన్న భయం, వారినుండి తనని తాను కాచుకోవలసిన కర్తవ్యం- ఇవన్నీ ఉన్నాయి. ఇంతలో ప్రాణం పోయింది. ఒక్కసారిగా ‘దృక్కోణం’ మారిపోయింది. ఒకరకమైన నిశ్చింత, నిదానం వచ్చాయి. ‘మహిత ఆత్మ’గా కథ చదువుతున్నపుడు మనం చుట్టూ వున్న మనుషుల్ని (కథలోని పాత్రల్ని) మరో దృక్కోణంతో చూడడం జరుగుతుంది. కొంత స్థిమితంగా నిర్వికారంగా గమనించడం జరుగుతుంది. చాలా చిన్నదే కావచ్చు కానీ ఇందులో ఒక తేడా వుంటుంది.
కథని ‘ఆత్మ’ చేత చెప్పించాలని రచయిత నిర్ణయించుకున్నపుడు వ్యక్తీకరణలో కూడా కొంత భేదాన్ని చూపగలిగితే, అందువలన కథకి ఒక ప్రయోజనాన్ని సాధించగలిగితే అపుడు ఆ కథ పాఠకులపై మరింత గాఢమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఆ ప్రయోగానికి సార్ధకత వుంటుంది.
– ధీర
దారిచూపు – ముకుంద రామారావు (16-Mar-2015)
దేనిని అందుకోవాలనో
ఆకాశం అనాదిగా అలా ఒంగిపోయి ఉంది
చూడటానికి పుస్తకం దగ్గరకు లాక్కున్నట్టు
ఆకాశాన్నీ లాక్కుంటే ఎంత బాగుండును
నిన్ను నన్ను
అమ్మ తొమ్మిది నెలలే మోసింది
పుట్టుకనుంచి గిట్టుకవరకే కాదు
తనలోకి చేరినా మోస్తోంది భూమి
నిన్నూ నన్నేనా
సమస్తాన్నీ తన నెత్తిన పెట్టుకుని
అవిశ్రాంతంగా సూర్య ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది
రోజుకొకమారైనా నిండుగా సూర్యదర్శనం చేయిస్తూనే ఉంది
అదేమిటో ఎప్పటికప్పుడు
కాళ్ళను కెలుకుతూ
తనలోకి రమ్మంటుంది భూమి
విన్నవారితో ఏమేమి మాటాడుతుందో
ఎన్నాళ్ళయినా
తనలోనే దాచుకుంటూ
ఎవరు మరచిపోయినా
భూమి మాత్రం గుర్తుంచుకుంటుందేమో
ఏ రక్తం అయినా చూడు
తాను ఎన్నడూ చూడని
ఎందరు బంధువులో దానికి
శరీరంలో ఆగకుండా ప్రవహించే
రక్తమే ఆత్మనా
ప్రవాహం ఆగిపోతే
గుంపులో ఒకరుగా ఉన్నా
తండ్రులు తెలియని కుక్కల్లా నిద్రలో
ఎక్కడైనా
ఎవరైనా
ఏదైనా
దారి దొరుకుతే
మనలోని నీటికి కూడా
సముద్రాన్ని చేరాలని ఉంటుందా
కిటికీ బయట
కవిత్వాన్ని చూపించకుండా
చెప్పిందల్లా పూవులా వింటూ
కంటి వైద్యుడు చదవమన్నదే చదవడం
పంటి వైద్యుడు చేయమన్నదే చేయడం
ఎంత ఇబ్బందో
నీకైనా నాకైనా
ఎన్నెన్ని మాయల్ని మాంత్రికుల్ని
దాటుకుంటూ వచ్చినా
చివరి మాంత్రికుని
రహస్య స్థావరానికి దారి
ఎవరూ చెప్పలేరా?
ముకుంద రామారావు
99083 47273
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్‌ (16-Mar-2015)

రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్‌ (16-Mar-2015)
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు నిగర్వి. నిరాడంబరుడు. విశేషించి నాకు చాలా ఆత్మీయుడు కూడా. వారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైనారన్న వార్త మీడియా ద్వారా తెలిసిన వెంటనే ఆనందపారవశ్యాన్ని పొందిన రాచపాళెం వారి మిత్రకోటిలో నేను కూడా ఉన్నాను. కాని కిన్నెర శ్రీదేవిగారు రాచపాళెం వారిని గూర్చి మార్చి 9వతేదీ వివిధలో ప్రకటించిన వ్యాసం చదివిన తర్వాత, ఆ వ్యాసంలో వారు అవధాన ప్రక్రియను కించపరుస్తూ ‘‘అవధానాలు బూర్జువా సంస్కృతి అవశేషాలని చెప్పారు’’- ‘‘రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వాన్ని అంచనా వేసే క్రమంలో జరిగిన లోటుపాట్లకు కార ణం అవధానాలను వదిలించుకోలేని సాహిత్య వారసత్వమే కారణమని ఎంతో నిష్పాక్షికంగా తన అభిప్రాయాన్ని ఆవిష్కరించారు’’- వంటి అంశా లు చూచిన తర్వాత సముచితంగా స్పందించడం నా బాధ్యతని భావించాను.
కిన్నెర శ్రీదేవిగారు ‘అవధానానికి పెట్టనికోటైన రాయలసీమలో’- అని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అవధాన ప్రక్రియకు బంగారు బాటలు వేసి ఆబాలగోపాలాన్ని అలరింపజేసిన తిరుపతి వేంకటకవులు, కొప్పరపు కవులు రాయలసీమవారా? పోనీ, వారి తరం తరువాతనో, కొంత సమకాలికులు గానో వచ్చిన గాడేపల్లి వీరరాఘవ శాసి్త్ర, గడియారం వేంకటశాసి్త్ర మొదలగు మహానుభావులు రాయలసీమవారనుకున్నా, అప్పుడు కూడా వేలూరి శివరామశాసి్త్ర, పిశుపాటి చిదంబరశాసి్త్ర వంటి దిగ్గజాలు కోస్తా జిల్లాలలో ఉన్నవారే. నాడైనా, నేడైనా అవధాన ప్రతిభామూర్తులు అన్ని ప్రాంతాలలో ఉన్నారు. ఈ విధంగా ఆలోచిస్తే అవధాన ప్రక్రియకు సంబంధించిన ప్రాంతీయ విశ్లేషణ పట్ల సత్యదృష్టితో కూడిన అవగాహన రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారి విమర్శలో లేదన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంది.
ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అవధాన ప్రక్రియను గూర్చి రసజ్ఞపాఠకులకు నేను ఒక అంశాన్ని మనవి చేస్తున్నాను. ప్రస్తుతం యావత్‌ ప్రపంచంలో అత్యధికులు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌కు సంబంధించిన క్రీడావిశేషాలు చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక క్రీడాకారుడు సిక్సరో, ఫోరో కొట్టినప్పుడు ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు చూస్తూ ఉంటాం. కాని ఒక అవధాన ప్రతిభామూర్తి చమత్కార బంధురమైన పద్య కవితా శిల్పధోరణితో ఒక సమస్యాపూరణమో, ఒక దత్తపది పూరణమో నిర్వహించినప్పుడు కూడా ఆయా అవధాన సభలలో హర్షధ్వానాలు వ్యక్తమౌతూ ఉంటాయి. అయితే క్రికెట్‌ క్రీడాకారుని ప్రతిభ టి.వి., ఇతర మాధ్యమ ప్రసారాల వల్ల జగద్వ్యాప్తమై శోభిస్తూ ఉంది. అవధాన ప్రతిభకు కూడా అంతగా ప్రసారమాధ్యమాల ప్రోత్సాహం లభిస్తే ఈ ప్రక్రియ కూడా తప్పక జగద్వ్యాప్తం కాగలదు. ఇది కేవలం నా అభిప్రాయం కాదు. నేను అమెరికా వంటి దేశాలలో పర్యటించి అవధాన సాహిత్య సభలు నిర్వహించిన సభలలో పాల్గొ న్న రసజ్ఞులైన అక్కడి విశ్వవిద్యాలయ ఆచార్యులలో కొందరి అభిప్రాయం. ఇటువంటి సదభిప్రాయాలతో కొందరు ఆచార్యులు, సెనేటరులు లిఖితపూర్వకంగా ఇచ్చిన ప్రశంసాపత్రాలు కూడా నా వద్ద ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పవలసివస్తూ ఉందంటే ప్రపంచభాషలలో ఏ భాషకూ లేని ప్రత్యేకత తెలుగుభాషామతల్లికి అవధాన ప్రక్రియవల్ల లభించిన గౌరవం- అని ప్రపంచ భాషావేత్తలందరూ గుర్తిస్తున్న సత్యం.
తెలుగుభాషకు ప్రాచీన హోదాను సాధించుకోవడంలో కొంతకు కొంత మనం కృతకృత్యులం కాగలిగాం- అనుకోవచ్చు. కాని తమిళ సోదరుల లాగా, కన్నడ సోదరుల లాగా మనం సంపూర్ణ కృతకృత్యులు కాలేకపోయాం. కారణం అక్కడి భాషాభిమానులలో ప్రాచీన హోదాను సాధించుకోవాలనే తపనతోపాటు ప్రాచీన సాహిత్య సంప్రదాయాల పట్ల అపారమైన ఆరాధన, తాత్పర్యం కూడా ఉన్నాయి. ఏమి దురదృష్టమో గాని తెలుగుసీమలో ప్రాచీన హోదాను సాధించుకోవాలనే తపన ఉన్న స్థాయిలో ప్రాచీన సాహిత్య సంప్రదాయాల పట్ల ఆరాధన లేదని స్పష్టమౌతూ ఉంది.
‘విమర్శలో రాచబాట’ అన్న వ్యాసారంభంలోనే కిన్నెర శ్రీదేవిగారు అతిసాహసంతో కూడిన ఒక వాక్యం రాశారు. అందులో రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారిని అలనాటి విమర్శక దిగ్దంతులు కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ఆర్‌.ఎస్‌. సుదర్శనం-వంటి మహామహులతో సమానంగా ప్రజ్ఞాప్రాభవాలు కలిగిన గొప్పవ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో పూర్తిగా ఔచిత్యం లోపించింది. ఎందుకంటే, పూజ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు గాని, ఆర్‌.ఎ్‌స.సుదర్శనం ప్రభృతులు గాని వారివారి విమర్శనా రచనలలో ఎక్కడా అవధాన ప్రక్రియను కించపరిచే అంశాలు ప్రస్తావించలేదు. పైగా వారీ ప్రక్రియను ఎంతో ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. ‘శిల్పప్రభావతి’ అన్న రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారి సిద్ధాంత గ్రంథం తెలుగు ప్రబంధాలపై పరిశోధనలు చేసేవాళ్ళకు శిల్పసంబంధమైన చర్చ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందన్న మా గురువుగారు జి.యన్‌.రెడ్డిగారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే ఆ సిద్ధాంతగ్రంథం అంత సైద్ధాంతిక శిల్పశోభితం కావడానికి కారకులు, ప్రేరకులు రాచపాళెం వారికి పీహెచ్‌డీ పర్యవేక్షకులైన ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారు- అన్న అంశాన్ని రాచపాళెం వారు కూడా త్రోసి పుచ్చలేరు.
‘ఆవేశానికి ఆస్కారం ఉన్న సందర్భాలలో కూడా బ్యాలెన్స్‌ కోల్పోకుండా విమర్శ రాయగలగటం ఆయన ప్రత్యేకత’- అన్న కిన్నెర శ్రీదేవి మాటల్లో సత్యం ఉన్నట్లు నేను భావించలేను. ఎందుకంటే, అవధాన ప్రక్రియను కించపరిచే రాచపాళెం వారి విమర్శనా ధోరణిలో పూర్తిగా బ్యాలెన్స్‌ లోపించింది. ఇక్కడ నేను మరొక అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాను. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధునాతన కవితా ప్రకియలను నిబద్ధతతో అధ్యయనం చేసిన పరిశోధక విమర్శకునిగా నేను మనఃపూర్వకంగా అంగీకరిస్తాను. కాని ప్రాచీన సంప్రదాయ సాహిత్యాన్ని, సంప్రదాయాలను అంతే నిబద్ధతతో వారు అధ్యయనం చేయలేదు- అనడానికి వారి విమర్శన గ్రంథాలలోనే నేను చాల ఉదాహరణలు చూపగలను. రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు సహృదయంగా ముందుకు వస్తే వారితో నేను ఈ విషయికంగా ముఖాముఖి చర్చకు కూడా సంసిద్ధంగా ఉన్నానని పత్రికాముఖంగా రసజ్ఞ విమర్శకలోకానిక మనవి చేస్తున్నాను.
మేడసాని మోహన్‌
99089 77763
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రసమయ కవితా శకటం రాళ్ళ బండి కవితా ప్రసాద్

రసమయ కవితా శకటం రాళ్ళ బండి కవితా ప్రసాద్

ఆ చిరునవ్వు, ఆ ఆత్మీయ పలకరింపు ,ఆ గాఢాలింగనం  చిన్నలపై అమితాసక్తి ,పెద్దల  యెడ అపరిమిత గౌరవ మర్యాద ,మహాకవులెవరైనా పాదాభివందనం చేసే  సంస్కారం  ,కట్టులో బొట్టులో ,భాషలో ,చమత్కారం లో తనదైన హుందా తనం ,అధికారిననే గర్వం కిన్చిత్తు కూడా కానరాని భాషా సంస్కృతీ సేవా పరాయణం ,ఏ హోదాలో ఉన్నా ఆపదవికే గౌరవం సంతరించిపెట్టిన మూర్తి మత్వం స్వర్గీయ రాళ్ళ బండి కవితా ప్రాసాదీయం .ఆయన మనల్ని ఒక సారి చూస్తె చాలు మనసులో చిరస్థాయిగా నిలుపుకొనే జ్ఞాపకం ,మళ్ళీ కనిపిస్తే చక్కగా  పేరు తో సంబోధించి ఆత్మీయతను కురిపించే సౌహార్ద్రత శ్రీ కవితా ప్రసాద్ సద్గుణ లక్షణం .ఆ చిరునవ్వు ఆగిపోయింది .ఆ సహృదయత మాసిపోయినది. ఆ కవితా శకటం ఆగిపోయింది .ఆ దరహాస ప్రసాదం కనుమరగైంది .ఒక మన కృష్ణా జిల్లాకే కాదు ,ప్రపంచం లోని తెలుగు వారందరికీ కడుపు కోతగా మిగిలి పోయింది .ఆ మహా కవి శ్రేస్టూని పాండిత్య  ,ప్రకర్షకు నీరాజనాలు .’’జయన్తితే సుక్రుతా ‘’ అన్నదానికి సరైన నిర్వచనం కవితా ప్రసాద్ .

సుమారు ఇరవై ఏళ్ళ క్రితం బందరులో నా అనుంగు మిత్రులు, గురు తుల్యులు మా కుటుంబ మిత్రులు  ,మార్గ దర్శి ప్రఖ్యాత రచయితా, అందునా కమ్మని తెలుగు కధల రాజనాలు పండించిన స్వర్గీయ ఆర్ ఎస్ కే మూర్తి గారి షష్టి పూర్తీ మహోత్సవానికి నన్ను  నా శ్రీమతి ని ఆప్యాయం గా ఆహ్వానించి ,ఆ రోజు శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ చేసే  గణిత అష్టావధానానికి ఒక ప్రుచ్చకుడిగా కూడా నన్ను ఉండమని కోరారు .అలాగే మేమిద్దరం ఉదయమే బయల్దేరి బచ్చుపేటలో ఉన్న మూర్తి గారింటికి వెళ్లాం .అప్పటికే క్రతువు జరుగుతోంది .కాఫీ టిఫిన్లు అయిన తర్వాత అక్కడికి చేరిన నాలాంటి వారిని వారింటి దగ్గరలో ఉన్న డా. శ్రీ మాదిరాజు రామ లింగేశ్వర రావు గారింటికి వారి అబ్బాయిని నాకు తోడూ ఇచ్చిపంపారు .అప్పటికే అక్కడ శ్రీ రావి రంగారావు గారు మొదలైన వారంతా సమావేశమై కవితా ప్రసాద్ గారు మధ్యలో పరివేష్టించి ఉండగా కబుర్లు చెప్పుకొంటున్నారు అందరికి కాఫీలు ఇచ్చారు .అదే మొదటి సారి రావి వారిని కవితాప్రసాద్ గారిని రామలింగేశ్వర రావు గారినిచూడటం .ఒకరినొకరం పరిచయం చేసుకోన్నాం శ్రీ కవితా ప్రసాద్ తానూ అమ్మవారిపై రాసిన ‘’కాదంబినీ ‘’శతకం అందరి తో బాటూ నాకూ అందజేశారు .అందులో తానూ రాసిన పద్యాలను ఏంతో  హృద్యం గా చదివి వినిపిస్తూ తానూ అందులో పొదిగిన లోకోత్తర భావాలను అలవోకగా విశదీకరిస్తున్నారు .ప్రతి పద్యానికి మేమందరం ఆనందించి కరతాళ ధ్వనులతో అభినందించాం .   దాదాపు రెండుగంటలపాటు ఆ రసమయ భక్తీ చిన్ముద్రలో ఉండిపోయాం .తర్వాత తానూ చేసే గణితావధానం విశేషాలను ప్రుచ్చకులుగా ఎవరి పాత్ర ఏమిటి అన్న వివరాలను వివరించి  ట్రయల్ గా   అవదానం చేసిమాకు స్పూర్తికల్గించారు .ప్రుచ్చకులలో శ్రీ చింతలపాటి మురళీ కృష్ణ ,పూర్ణ చంద్ర రావు సోదరులు ,స్వర్గీయ కే వి ఎల్ యెన్ నరసింహా చార్యులు వగైరా లున్నట్లు జ్ఞాపకం .చింతలపాటి సోదరులతో అప్పటికే అయిదారేళ్ళనుంచి పరిచయం ఉంది ఉయ్యూరు సాహితీ మండలికి వారిద్దరూ వచ్చి ప్రస్సంగిమ్చటం కవి సమ్మేళనాలలో పాల్గొనటం జరిగింది. అందులో మురళీ కృష్ణ మూర్తిగారికి స్వయానా అల్లుడు .జూనియర్ తెలుగు పండిట్ గా ఉండేవారు .ఆయన వివాహానకి కూడా నేను వెళ్లాను . తర్వాత అందరం కలిసి  నడుచు  కొంటూ వెళ్లి మూర్తిగారింట షడ్రసోపేతమైన  విందు ఆరగించాం .సాయంత్రం ఆరు గంటలకు కవితా ప్రసాద్ గారి అవధానం టౌన్ హాల్ లో ..కాసేపు మూర్తిగారి౦టనే విశ్రమించి  మొహాలు కడిగి అవధానానికి హాజరయ్యాం .Untitled

మూర్తి గారి దంపతుల సమక్షం లో అవధానం జరిగింది .అందరూ వారికి పద్య రూప శుభా కాంక్షలు అందిస్తే నేను  దీర్ఘమైన వచన కవితలో అభినందన సుమమాల అల్లి సమర్పించాను పద్యకవులకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో నాకూ అంతే అభినందన దక్కింది .కవితా ప్రసాద్ నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు తో పట్టు బట్టలు ధరించి ఆసీనులై మందస్మిత వదనార విందులుగా ఉన్నారు .రావి రంగారావు గారు నిర్వాహకులు .ఆయన ప్రసాద్ గారికి బి ఇ డికాలేజిలో గురువు ..ఆ గురు శిష్య బాంధవ్యం వర్ణనాతీతం .అమ్మవారిని స్తుతించి కవితా ప్రసాద్ గారు అవధాన ప్రక్రియ ప్రారంభించారు .ప్రశ్న అడగటం ఆలస్యం పద్యం వారి నోట ప్రవాహమై ప్రవహించింది .అప్రస్తుత ప్రసంగం నరసింహం గారు చేసిన జ్ఞాపకం .అందులో ఆయన ఆరితేరిన వారు .నల్లేరు మీద నడకలా హాయిగా అపరిమిత వేగం గా కవితా వర్షం కురిపించారు .ధారణ కూడా నిమిషాలమీద ,ఎక్కడా తడుము కోకుండా సాగించి అందరి ప్రశంసలను అందుకొన్నారు కవితా ప్రసాద్ గారు .ఇంత త్వరగా అవధానం పూర్తీ అవుతుందని నేనూహించలేదు .అదీ కవితా ప్రసాద్ సామర్ధ్యం  .అందరం అవధానిగారిని ప్రశంసిమ్చాం ..మూర్తిగారు అవధానిగారికి గొప్ప సత్కారం చేసి ప్రుచ్చకులైన మాకు కూడా సన్మానం చేసి తృప్తి పరచారు .రాత్రికి ఉయ్యూరు తిరిగి వచ్చేశాం .అప్పటికి నాకు ఇది రెండవ అవధానం .అంతకు ముందు రెండేళ్ళ క్రితం నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గ ఉన్నప్పుడు నూతులపాటి వారు శ్రీ  వర్దపర్తి వారితో అవధానం చేయిస్తే చూడటానికి వెళ్ళిన నేను అప్రస్తుత ప్రసంగం చేయటానికి ఎవరూ ముందుకు రాక పొతే నేనే చేశాను .ఆ తర్వాత వర్ది పర్తివారి శాతావదాననికి చల్లపల్లి లో ప్రుచ్చకుడిని ఇది చింతలపాటి సోదరులు నిర్వహించిన కార్యక్రమం దీనికి చివరి రోజున శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ గారు కూడా విచ్చేసి ఆశీర్వదించారు .

ఆ తర్వాత చింతల పాటి సోదరులు భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యం లో కూచిపూడి మొవ్వ కోసూరు చల్లపల్లి అవనిగడ్డ మొదలైన చోట్ల అవధానాలు సాహితీ సదస్సులు నిర్వహించే వారు .రావి వారు ,ప్రసాద్ గారు తప్పక హాజరై ప్రోత్సహించేవారు .ఇలా చాలా సార్లు కవితా ప్రసాద్ గారిని కలుసుకోవటం జరిగింది .ఒక సారి శ్రీ రావి రంగారావు గారు శ్రీ కవితా ప్రసాద్ గారి చేత బందరులో శతావధానం చేయించారు .అందులో నన్ను ప్రుచ్చకునిగా నియమించారు .అందరికి టిఫిన్లు భోజనాలు లడ్డూలు తో పెళ్లి విందు .ఉదయం నుండి సాయంత్రం వరకు అవధానం .మర్నాడు ధారణా దీనికి శ్రీ ప్రసాద రాయ కులపతి గారు ప్రత్యేకం గా విచ్చేసి అవధాని ధారణకు అబ్బురపడి మనసారా ఆశీర్వదించారు .జ్ఞాపికలు అందజేశారు. రాత్రి భోజనం తర్వాత ఇంటికి వచ్చాను .రెండు రోజుల అవధానం లో కవితా ప్రసాద్ ఎక్కడా ఎప్పుడూ చిర్రు బుర్రూ ఆడింది లేదు .ఎంతటి కష్టతర సమస్య అయినా అతి సునాయాసం గా సమాధాన పద్యాలు అల్లి సెహభాష్ అని పించారు .అప్రస్తుతం శృతి మిన్చుతున్నా ఏమీ అనేవారు కాదు .తన ప్రియ సంభాషణ తో వారి నోటికి తాళం వేసేవారు .ఆ శతావధానం చాలా పేరు తెచ్చింది కవితా ప్రసాద్ గారికి .

దీని తర్వాత కవితా ప్రసాద్ గారి చేత ద్విశతావదానానికి రంగారావు గారు పూనుకొని ప్రుచ్చకులను ఎన్నుకొని రెండు సార్లు బందరులో సమావేశ పరచి అవధానం తీరు తెన్నులను వివరించి కర్తవ్యోన్ముఖులను చేశారు .ఈ ద్విశతావధానం విజయ వాడలో జరిగింది .ఆనాటి  విద్యా మంత్రి శ్రీ కడియం శ్రీహరి మొదలైన ప్రముఖులు వచ్చారు.నేనూ మా ఆవిడా కూడా ప్రుచ్చకులుగా ఉన్నాం .మూడు రోజుల కార్యక్రమం అని గుర్తు .ఏర్పాట్లు ఘనం గా ఉన్నాయి. విందూ అదిరింది .రోజూ ఉయ్యూరు నుండి వచ్చి వెళ్ళేవాళ్ళం ఇద్దరం .మూడవ రోజు ధారణా రాక్షసులు సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహా రావు గారు విచ్చేశారు. వారి సమక్షం లో శ్రీ కవితా ప్రసాద్ పద్యాలను ధారణ  చేసి నరసింహారావు గారితో సహా అందరినీ అమితాశ్చర్యం లో పడేశారు .గరికపాటి ఈ అవధానిగారిని మెచ్చుకొంటూ ఆశీస్సులను ప్రశంసలను పద్య రూపం లో చదివి కవితా విందు భోజనం పెట్టారు .దీనికిఏకాంబరాచార్యులు బేత వోలు వారు ,ఆశావాదివారు వగైరా కవి శ్రేస్టులు కూడా హాజరై నిండుదనం చేకూర్చారు .శత ద్విశత అవధానాల పుస్తకాలు కూడా రంగా రావు గారు తెచ్చిన గుర్తు .  ఈ విధం గా కవితా ప్రసాద్ గారితో సాన్నిహిత్యం ఏర్పడింది .అప్పటి నుండి ఎక్కడ సభలో కనిపించినా ‘’మాస్టారూ బాగున్నారా ?అని ‘’అని పలకరించేవారు చిరు నవ్వుతూ. చిరు దరహాసమే ఆయన సొత్తు .

హైదరాబాద్ లో జరిగే సభలకూ వీలయితే వెళ్ళేవాళ్ళం. అక్కడా వారి అవక్ర  కవితా విక్రమాన్ని ప్రదర్శించి మెప్పు పొందేవారు .కృష్ణా జిలా రచయితల సంఘం జాతీయ సదస్సు నిర్వహించినపుడు వారు వచ్చి పాల్గొన్నారని జ్ఞాపకం .మొదటి ప్రపంచ తెలుగు రచయితల సభకు ఊహ వ్యూహం  నిర్వహణ ప్రభుత్వ సహకారం అందించటం లోను సభలు అద్వితీయం గా నిర్వహించేట్లు తోడ్పడటం లోను సాంస్కృతిక శాఖ కార్య దర్శిగా శ్రీ కవితాప్రసాద్ చేసిన సేవలు చిరస్మరణీయాలు .గొప్ప కార్య నిర్వాహకులు అనిపించారు .ప్రభుత్వం అందజేసిన ఆర్ధిక సాయాన్ని చెక్కు రూపం లో అందరి కరతాళ ధ్వనుల మధ్యా రెప రెప లాడిస్తూ వేదిక మీద చూపించి ఉత్సాహ పరచారు .ఆ దృశ్యం మరువలేము .దీని ఆధారం గా రెండో ప్రపంచ సభలూ మనవాళ్ళు నిర్వహించారు .ఇటీవల ఫిబ్రవరి లో జరిగిన మూడవ సభలలో శ్రీ కవితా ప్రసాద్ ను శ్రీ ఇనాక్ గారిని ,ఆచార్య శ్రీ శలాక శర్మగారు వంటి ప్రసిద్ధులను  తప్పించే  వ్యూహం చేసి గొప్ప అపఖ్యాతి పొందారు  నిర్వాకం లో సింహ భాగం లో ఉన్న ఒక పంచ కట్టాయన, .దీనితో వీరికి తీవ్ర నిరాశా .నిస్పృహా ఆవేదనా కల్గింది .’’రచయితల సంఘం సూర్య చంద్రులు’’ చేస్ట లుడిగి తమ చేతుల్లోంచి సభా నిర్వహణ ఎవరో లాగేసుకొని తమను బైపాస్ చేసినట్లు పాపం దీన వదనులయ్యారు .మహా సాహితీ మూర్తులకు తెలుగు నేల మీద తీవ్ర నిరాదరణ జరగటం క్షంతవ్యం కాదు .జరిగిన తప్పు మళ్ళీ జరగరాదు .

ఇలాంటి మనస్తాపమే కాక తనను తెలంగాణా కేడర్ లో చేర్చటం తో శ్రీ కవితా ప్రసాద్ తీవ్రం గా కలత చెంది వ్యాకుల మనస్కులయ్యారు .సాంస్కృతిక శాఖ నుండి మార్చటమూ ఆయన్ను బాగా బాధించింది . ‘’బాస్ ‘’పెత్తనమూ నచ్చి ఉండదు .దీనితో ఆరోగ్యమూ దెబ్బ తిన్నది .మృతువుతో భీకరం గా ఇరవై రోజులు పోరాడి ఓడిపోయి దివిజ లోకం చేరారు .ఆ మహనీయునికి ఈ జాతి ఏంతో రుణ పడి ఉంది .వారికి గౌరవ స్మ్రుతి చిహ్నం ఏర్పాటు చేయాలి .వారి పేరిట ప్రభుత్వం పురస్కారాన్ని ఏర్పాటు చేయాలి .

అంతర్జాలాన్ని అద్భుతం గా ఉపయోగించుకొని సాహిత్యానికి గొప్ప ఊపు తెచ్చిన వారు శ్రీ కవితా ప్రసాద్ .తన ఫేస్ బుక్ కు ‘’గ్రంధ ముఖి ‘’గా నామకరణం చేసి ‘’లక్ష పద్యార్చనం ‘’చేయించిన కవితా సాహసి. దేశ విదేశాలలో ఉన్న కవులందరూ ఇందులో పాల్గొని విజయవంతం చేశారు  అలాంటి  గొప్ప వ్యూహ కర్త .విజయవాడ రేడియో కేంద్రం ద్వారా’’ రేడియో అవధానం’’ నిర్వహించిన బయటి ఊరివారు అడిగిన ప్రషణలు పద్య రూపం లో సమాధానాలు చెప్పేవారు .ముఖ్యం గా యువకవులకు యువ అవధానులకు ఆయన గొప్ప మార్గ దర్శి . దీనికి స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సహకారం బంగారానికి వన్నె తెచ్చినట్లయింది .ఆంద్ర ప్రాంతం లోనే కాక తెలంగాణాలోనూ అవధాన ప్రక్రియ నిరంతరం కొనసాగించి 500 అవధానాలు చేసిన ఘన కీర్తి సాధించారు .ఊరికే అవధానాలు చేసి ఊరుకోలేదు అవధాన ప్రక్రియ పై యువకులకు ఉత్సాహం కలిగించటానికి ‘’అవధాన విద్య –ఆరంభ వికాసాలు ‘’,మొదలైన గ్రంధాలు రాశారు .ఒంటరిపూల బుట్ట ,పద్య మండపం ,అగ్ని హంస ,ఇది కవి సమయం ,’’సప్త గిరి ధామ కలియుగ సార్వ భౌమ శతకం ,వేద విజ్ఞాన లహరి ,ఉపనిషత్ సుధాలహరి ,తాను జన్మించిన నెమలి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ వేణు గోపాల స్వామిపై ‘’నెమలి వేణుగోపాల శతకం ‘’మొదలైన రచనలు చేశారు శ్రీ కవితా ప్రసాద్ .వారిఅవదానలో అష్టావధానం గణితావధానం ,నవరసవధానం ,శతావధానం ద్విశతావధానం వంటి వైవిధ్య భరిత అవధానాలున్నాయి .ఎన్నో భువన విజయాలను ఆంద్ర దేశమంతటా ప్రదర్శించి తాను శ్రీ కృష్ణ దేవ రాయలుగా ఉండి సరస కవితా ఝరిని పారించి మిగిలిన కవులకూ తగిన ప్రాదాన్యతనిచ్చి భువన విజయాన్ని గ్రామోత్సవం చేసిన కార్య దక్షులు .అవధాన సరస్వతిని పూజించి ఊరేగించిన ఘన చరిత్ర శ్రీ కవితా ప్రసాద్ గారిది

స్నేహ శీలి సౌజన్య మూర్తి సాహసి రస హృదయులు ,అమితమైన ప్రేమాభిమానాలున్న వారు కర్తవ్య దీక్షా బద్దులు ,కార్య క్రమ విజయానికి  అకుంఠిత దీక్ష తో కృషి చేసినవారు తెలుగు భాషకు సంస్కృతికి భారతీయ ఆత్మకు ప్రతీకగా నిలిచిన పుంభావ సరస్వతి శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ అకాల మరణం ‘’నడి భానుడు’’ అకస్మాత్తుగా కుంగిపోయి కనుమరుగైనట్లు అనిపిస్తుంది ఆ దివ్య కవితాత్మ ఆత్మకు శాంతి చేకూరాలని ,వారి కుటుంబ సభ్యులకు వారు లేని లోటు క్రమంగా తీరాలని భగవానుని కోరుకొంటున్నాను.వారిఅంతర్ ముఖత్వానికి గొప్ప ఉదాహరణ గా నిలిచే  ప్రసిద్ధ పద్యం తో ముగింపు పలుకుతున్నాను –

‘శ్రీ మాత్రు చిత్కళా శ్రీ వత్స లాంచన –ద్యుతి మణి ద్వీప ప్రయోగ సిద్ధి

శ్రీ చక్ర బిందు కేంద్రీయ సుదర్శన –చక్ర విభ్రమణ ప్రసార శక్తి

శ్రీంకార నాదవిస్తృత తరంగావ్రుత –శంఖాను నాద ప్రచండ గరిమ

శ్రీ పీఠ సంస్థిత సిత పద్మ సమ పాద –సందీప్త దివ్య  ప్రశస్త  శోభ

కలసి తిరు మంత్ర రూపమై వెలసితీవ –వైభవోద్దామ !శ్రీ దాస వార్ధి సోమ

ప్రణవ సుమ దామ !నిగమ పరాగ సీమ –సప్త గిరి ధామ !కలియుగ సర్వ భౌమ ‘’

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17 3-15 –ఉయ్యూరు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విజయవాడ ”మానర్ ఫుడ్ ప్లాజా ”లో 16-3-15 సోమవారం రాత్రి శ్రీమతి చలసాని వసుమతి గారు ,మహా కధకులు శ్రీ విహారి గారికి మహా చిత్రకారులు శ్రీ వీర్రాజు గారికి చెరొక 25,౦౦౦ రూపాయల నగదు ను ”వసుమతి -మాధవ ”పురస్కారం గా అంద జేసిన దృశ్యమాలిక 

విజయవాడ ”మానర్ ఫుడ్ ప్లాజా ”లో 16-3-15 సోమవారం రాత్రి  శ్రీమతి చలసాని వసుమతి గారు ,మహా కధకులు శ్రీ విహారి గారికి  మహా చిత్రకారులు శ్రీ వీర్రాజు గారికి చెరొక 25,౦౦౦ రూపాయల నగదు ను  ”వసుమతి -మాధవ  ”పురస్కారం గా అంద జేసిన  దృశ్యమాలిక

 

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతిశ్రీ మన్మధ ఉగాది వేడుకలు -వార్త పత్రిక వార్తాకధానం 17-3-15

varta 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’పై   కవి సమ్మేళనం

సభలోని చిత్రాలు

76 వ సమావేశం గా సరసభారతి 15-3-15 ఆదివారం సాయంత్రం 4 గం .’లకు ఉయ్యూరు ఏ సి లైబ్రరీలో నిర్వహించిన ‘’శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు ‘’ఆద్యంతం నవరస భరితం గా జరిగాయి .విచ్చేసిన సాహితీ ప్రియులకు అతిధులకు ,సన్మానితులకు అందరికి ముందుగా ఆత్మీయ అల్పాహార విందు నిచ్చి తేనీరు తో ఎండవేడిలో శ్రమపడి వచ్చినందుకు కొంత ఉపశమనం కల్గి౦చా౦ . ముందే చెప్పినట్లు సరిగ్గా నాలుగు గంటలకు ‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’అంశం పై  స్మితశ్రీ చింతపల్లి నాగేశ్వర రావు, శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ, శ్రీమతి గుడిపూడి రాధికా రాణి ఆధ్వర్యం లో  కవి సమ్మేళనం ప్రారంభించాం .  ఇందులో స్మితశ్రీ గారిది పండిన అనుభవమైతే దత్తాత్రేయ శర్మగారిది  హాస్య చతుర సంభాషణా భరితం .గుడిపూడి ది బుడి బుడి నడకల అరంగేట్రం .ముందుగా మహిళలకు ప్రాధాన్యత నిచ్చి తర్వాత పురుష కవులకు అవకాశమిచ్చాం .కవులు తమ తమ ద్రుష్టి కోణం లో నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తీరు తెన్నులు ,ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్తితులు ,మిన్ను విరిగి మీద పడినట్లు హూద్ హూద్ తుఫాను సృస్టించిన విలయం దాన్ని తట్టుకొని ఆంధ్రజాతి నిలబడిన తీరు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం వగైరా విషయాలపై నిర్మొహమాటం గా  తమ మనోభావాలను  చక్కని చిక్కని  పది పంక్తులలో,నాలుగు  పద్యాలలో  ,పాటలుగా వచన కవిత్వంగా కవితలల్లి వినిపించి ఆమని హాయిని ఆరు రోజుల ముందే ఉయ్యూరు పట్టణానికి తెచ్చి నవ వసంతాన్ని చిమ్మారు .కవిత చదవగానే నా చేతులమీదుగాను , కవి సమ్మేళన నిర్వాహకుల చేతుల మీదుగా జ్ఞాపిక అందజేశాం .జ్ఞాపిక కూడా నవ్యాంధ్ర ప్రదేశ్ నేపధ్యం గా బెజవాడ ప్రకాశంబారేజ్ ,తెలుగుతల్లి విగ్రహం ,పైన ‘’చిలక పచ్చని రౌతు మన్మధుని ‘’చిత్రం ,మామిడి పిందెలు ,చిగుళ్ళు ,ఉగాది వేపప్రసాదం ఉన్న  రజత పాత్ర ,అన్నిటికి మించి ఉగాది వచ్చిందని తెలిపే కోయిల కూత ,మధ్యలో ఎడమ చివర అడివి బాపిరాజుగారు , తర్వాత మామిడి పూడి వెంకట రంగయ్యగారు ,ఆ తర్వాత పారుపల్లి రామకృష్ణయ్యగారు కుడి చివర దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు ,వీరికి దిగువన సాహితీ సమరాంగణ సార్వ భౌముడు  కృష్ణ దేవరాయలుగారి తో జ్ఞాపిక ను సందర్భోచితం గా తయారు చేసిచ్చారు మా జర్నలిస్ట్ మిత్రుడు ప్రకాష్ .చాలా హుందాగా హృదయంగమం గా జ్ఞాపిక తయారై అందరిని అలరించింది .సుమారు రెండుగంటల సేపు కవి సమ్మేళనం ఆహ్లాదభరితం గా కరతాళ ధ్వనుల మధ్య ప్రశంసా వాక్యాలతో జరిగి విచ్చేసిన కవి బృందానికి అత్యంత ఆనందాన్ని కల్గించిందని వారి  వదనాలలో   ప్రస్పుటిమ్చిన హావ భావాల వలన తెలిసింది. ధన్యోస్మి అనుకొన్నాను .

గ్రందాల  ఆవిష్కరణ

సాయంత్రం ఆరు గంటలకు గ్రంధా విష్కరణ ,పురస్కార ప్రదాన సభ మొదలు పెట్టాం .అధ్యక్షునిగా సరసభారతి ఆవిర్భావం ,ప్రగతిని శ్రీ మైనేని గోపాల కృష్ణగారి వితరణను క్లుప్తం గా వివరించి నేను రాసిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’గ్రంధాన్ని శ్రీ మైనేని వారికి అంకితం ఇస్తున్నవిషయం ,గ్రంధ రూపం గా వారి మేనకోడలు డా .శ్రీమతి జ్యోతి ,ఆమె సోదర సోదరీమణులు (అమెరికా)ఖర్చు భరించి వెలువరిస్తున్న సంగతి తెలియ జేశాను .ఈ గ్రంధాన్ని ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్ర మాజీ డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ మాన్య శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు ఆవిష్కరించి మొదటి ప్రతిని ఆచార్య శ్రీ శలాక రఘు నాద శర్మ గారికి అందజేశారు . గ్రంధం పై డా .శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు సంక్షిప్తం గా   అందులోని విషయాలను సభా సదులకు అవగాహన కల్గించే రీతిగా మధుర మంజుల వాక్కులతో కవితాత్మకం గా వివరించి నిండుదనం చేకూర్చారు .146 మంది ప్రాచీన ,నవీన గీర్వాణ కవులపై రాసిన గ్రంథమని ,నాలుగు వందలకు పైన పేజీలతో బృహత్తరంగా వెలువడిందని ,రచయిత కృషి ఆదర్శప్రాయమని అన్నారు .శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు

త్యాగి కలం పేరుగల ప్రముఖ హాస్య రచయిత శ్రీ తాడిమేటి సత్యనారాయణ గారు  ‘’త్యాగి ‘’పేరే’’డీలు +’పేరిట రాసి ముద్రణ ఖర్చులు భరించి ,సరసభారతి ద్వారా ప్రచురించిన పుస్తకాన్ని కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు ఆవిష్కరించి మొదటి ప్రతిని నాకు అందజేశారు .దీనిని ప్రముఖ కవి కధకురాలు శ్రీమతి కోపూరి పుష్పాదేవిగారు సంక్షిప్త పరిచయం చేశారు .ఈ పుస్తకాన్ని స్వర్గీయ బాపు రమణ జంట కు అంకితం ఇవ్వటం ఏంతో సముచితం గా ఉందని వారిద్దరి పేర అంకితమిచ్చిన మొదటి గ్రంధం గా ఆంద్ర దేశం లో చిరస్తాయిగా నిలిచి పోతుందని అన్నారు .ఇందులోని పేరడీలు ,కవితలు రసభరితం అన్నారు . మైనేని వారు బాపు రమణ స్మారక పురస్కారాన్ని ఏర్పరచి సరసభారతి ద్వారా శ్రీ వేదగిరి రాంబాబు గారికి ,శ్రీ శీలా వీర్రాజు గారికి అందజేసి ఆంద్ర దేశం లో ఇలా వారిద్దరి పేరిట మొట్టమొదట పురస్కారం అందించిన ఘనత పొందాం .ఇప్పుడు ఈ  అంకితానికీ మేమే ముందున్నాం .గీర్వాణం ,పెరేడీలు రెండు గ్రంధాలను హాజరైన సదస్యుల౦దరికి అందజేశాం .రామడుగు వారి ముందుమాటలు ‘

ఉగాది పురస్కార ప్రదానాలు

స్వర్గీయ శ్రీమతి గబ్బిట భవానమ్మ శ్రీ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారప్రదానం

సాయంత్రం ఆరున్నరకు శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది పురస్కార ప్రదానం ప్రారంభించాం .ముందుగా మా తలిదంద్రులైన స్వర్గీయ శ్రీమతి బ్బిట భవానమ్మ ,శ్రీ  మృత్యుంజయ శాస్త్రి గరాల స్మారక ఉగాది పురస్కారాన్ని మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారికి ప్రత్యేక ఆసనం పై ఆసీనులను చేసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి ,చందనం చేతులకు అలిమి ,తాంబూలాన్ని ఫల భరితం గా అందజేశాం నేనూ నా శ్రీమతి ప్రభావతి .తర్వాతా సెంట్ చల్లి శాలువా కప్పి పుష్పహారాన్ని వేసి నూతన వస్త్రాలుగా  పంచ ఉత్తరీయ౦  అందజేసి నగదున్నకవర్ చేతిలో ఉంచి, జ్ఞాపిక నందజేసి శిరసుపై గులాబీ రెక్కల వాన కురిపించి మా గౌరవాన్ని చాటుకున్నాం .మా ప్రక్కన  వేదికనలంకరించిన  పెద్దలందరూ నిలబడి వేడుక చేసి తామూ గులాబి రేకులను చల్లి మధురానుభూతి కలిగించారు .ఈ సంఘటన చిరస్మరణీయం గా నిలిచింది .ముందుగా నేనే శ్రీ ఆదిత్య ప్రసాద్ గారిని సభకు వారి సేవలను ప్రస్తుతిస్తూ ఆహ్వానించి ఆసీనులను చేశాను .సంగీత సరస్వతిని సన్మానించిన అనుభూతి గొప్పగా కలిగి కనులు చెమర్చాయి .

తర్వాత  ఆచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారిని శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి వారి పాండిత్య వైదుష్యాన్ని వివరిస్తూ వేదికపైకి ఆహ్వానించింది .మా దంపతులం శ్రీ శర్మగారికి పైన పేర్కొన్న విధంగానే అదే రీతిలో ఘనం గా సన్మానించి సర్సాభారతి ప్రచురణలన్నీ అందించాం .గీర్వాణ వాణిని సత్కరించిన మధురానుభూతికి లోనయ్యాం .

పిమ్మట కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారి సాహితీ ప్రస్థానాన్ని విశదీకరిస్తూ శ్రీ జి వేణుగోపాల రెడ్డి ఆహ్వానించారు .ఉచితాసనాసీనులను చేసి పైన చెప్పిన తీరునననే శ్రీ  సుబ్బారాగారిని సత్కరించి మా సహ్రుదయతను ఆత్మీయతను ,ఆప్యాయతను సాహిత్య సభా నిర్వహణ సామర్ధ్యానికి అందించిన పురస్కారం గా భావించాం .

గీర్వాణ గ్రంధానికి ‘’అంత రి౦ద్రజాలం ‘’పేర ముందుమాటలు రాసి ,వేదిక పై గ్రంధాన్ని పరిచయమూ చేసి  నాకు అత్యంత ఆప్తులైన డా .శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి కవితా శ్రేస్టతను వారుపొందిన పురస్కారాలను వివరిస్తూ  శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ గారు ఆహ్వానించారు .శ్రీ శర్మగారికీ పై రీతిగానే ఘనం గా సత్కరించి మా అభిమానాన్ని చాటు కోన్నాం.తెలుగు కవితా సరస్వతీ సత్కారం చేశామని సంత్రుప్తిపొందాం .

చివరగా ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణగారి సాహితీ గరిమను విశిష్టతను వివరిస్తూ శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ఆహ్వానించారు .మన్నవ వారిని ఉచితాసీనులను చేసి పై విధం గా అన్ని హంగులతో సత్కరించి మా కున్న గౌరవాన్ని చాటుకున్నాం  .అంతర్ ద్రుష్టి తో లోకాన్ని చదివి విద్యార్ధుల  జ్ఞాన నేత్రాలను వికసింప జేసిన విశిష్ట సాహితీ మూర్తిని సంమాని౦ చామని మహదానందాన్ని పొందాం .

శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల ప్రోత్సాహక ఉగాది ప్రత్యెక పురస్కార ప్రదానం

ముందుగా ‘’స్వయం సిద్ధ ‘’పురస్కారాన్ని శ్రీమతి పెద్దిభొట్ల సౌభాగ్యవతి గారికి చందన తాంబూలాది సత్కారాలతో ,పుష్పాహారం తో చీరే జాకెట్ లతో శాలువాతో మేమిద్దరం మిగిలిన అతిధుల సహకారం తో అందజేసి సత్కరించాం .శ్రీమతి శివలక్ష్మి ఈమెను సభకు పరిచయం చేసింది .

ఉయ్యూరు పోస్ట్ మాస్టర్ శ్రీ గొట్టుముక్కల రామారావు గారిని ,మన చానల్ రిపోర్టర్ శ్రీ రాజా గారిని స్థాయి ఏమాత్రమూ తగ్గకుండా అందరికీ చేసినట్లే సన్మానించి వారి విశిష్ట సేవలను అందరికి తెలియ జేశాం .

సభ మధ్యలో ఉయ్యూరు ప్రధమ పౌరులు ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు గారు విచ్చేసి సభకు నిండుదనం చేకూర్చారు .ఇంతమంది మహా కవి పండితులమధ్య తానూ కూర్చోవటం జీవితం లో మరచిపోలేని ఘట్టం అన్నారు .దుర్గాప్రసాద్ గారు తనకు బాగా తెలుసునని ఇంత పాండిత్యం ఆయనకు  ఉందని ఇంతమంది చెప్పే దాకా తానూ తెలుసుకోలేక పోయానని అని అందరి సన్మానాలు స్వయం గా దగ్గరుండి జరిపించి ఆనందాను  భూతి పొందారు .సన్మానాలు అయ్యేసరికి గులాబీ రేకుల రాసి పోగై  అందరి మనసులలో సంతోష గులాబీలు వికసించి నట్లయింది .

ప్రసంగ ప్రశంశలు

శ్రీ ఆదిత్య ప్రసాద్ గారు మాట్లాడుతూ ‘’ఇలాంటి అనుభూతి తనకు చాలా తక్కువ చోట్ల మాత్రమె లభించిందని ఇక్కడి వీరి ఆత్మీయతకు మాటలు రావని సహృదయం తో చేసే సరసభారతి కార్యక్రమాలకు ఎన్నిటికో తానూ హాజరయ్యానని ,దుర్గాప్రసాద్ గారితో ఆత్మీయ మైత్రీ బంధం చాలా కాలం నుండి ఉంది’’అని  ఆనందంగా చెప్పారు .శ్రీ శలాక వారు ‘’తెలుగును మరచిపొవద్దని ,తనది బెజవాడ దగ్గర గొల్లపల్లి అని కృష్ణా జిల్లా వాసినని ఆకిరిపల్లి సంస్కృత కళాశాల విద్యార్దినని తమ వ్యాకరణ గురువు పేరి వారు ప్రపంచం లోనే గొప్ప వ్యాకర వేత్త అని వారిని మించిన వారు లేనే లేరని ,వారి శిష్యుడిని అని చెప్పుకోవటం అందరికి గర్వకారణమని ,ఆకళాశాల స్థాపకుల తల్లిగారు నిరాడంబరం గా జీవిస్తూ కళాశాల విద్యార్ధుల భోజబాలు అయ్యాయి అన్న గంట వినబడిన తర్వాతే భోజనం చేసేవారని అంతటి ఆదరణం విద్యార్ధులపై ప్రేమ ఎక్కడా చూడ లేదని కృతజ్ఞతా భావం గా తెలియజెసి  ఉయ్యూరు లొ తనకు జరిగిన సన్మానం స్వంత ఇంట జరిగినట్లు ఉంది అని సంతోషం గా చెప్పారు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు సరసభారతి తాము ఎన్నో కార్యక్రమాలను కలిసి నిర్వహించామని ,ఉయ్యూరు అంటే తమకు సరస భారతి దుర్గాప్రసాద్ గారే గుర్తుకోస్తారని ఇక్కడి వారి ఆత్మీయత ముగ్ధులను చేస్తుందని ఏది చేసినా అంకితభావం తో చేయటం ప్రత్యేకత అని అన్నారు .శ్రీ రామదుగు వారు దుర్గాప్రసాద్ పై అభినందన పద్యాలు రాసి చదివి వినిపించి ప్రత్యేకమైన అనుభూతిని అందరికి కలిగించారు. ఆచార్య మన్నవ గారు తమకూ సరసభారతికి ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకొన్నారు ఇక్కడి వాతావరణం ఏంతో ఆహ్లాదం గా ,సహృదయం గా ఉందని కృతజ్ఞతలు తెలిపారు .శ్రీమతి సౌభాగ్య లక్ష్మి ఇందరి సమక్షం లో తనను ఆహ్వానించి గౌరవించి సత్కరించిస్వయం సిద్ధ  పురస్కారం అంద జేసినందుకు ‘’ఆంటీ అంకుల్ ‘’లకు కృతజ్ఞతలు అన్నారు .పోస్ట్ మాస్టారు శ్రీ రామా రావు గారు తమ పనిలో తామెప్పుడూ మునిగి ఉంటామని ,కాని అదొక సేవగా దుర్గా ప్రసాద్ గారు గుర్తించి పోస్టాఫీస్ చేస్తున్న సేవలకు ఈ విధం గా గౌరవం కృతజ్ఞత  కలిపించి  సిబ్బంది అందరి తరఫున తనను సత్కరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు .మన చానల్ రిపోర్టర్ శ్రీ రాజా ‘’సరసభారతి శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం కార్యక్రమాలన్నిటిని తాను  వచ్చి రికార్డ్ చేసి మన చానల్ లో ప్రసారం చేశామని ఈ సంస్థ మర్యాదకు మన్ననకు తానూ పరవశించి పోతానని రిపోర్టర్ కు ఇంతటి ప్రాధాన్యతను కల్పించే సంస్కారం సహృదయత దుర్గా ప్రసాద్ గారిలో ఉందని చెమరించిన కనులతో ఆనందాన్ని వ్యక్తీకరించారు .చివరగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్స్ది డా జి వి పూర్ణ చంద్ ‘’ఇంతటి సహృదయ వాతావరణం లో ఇంతమంది విశిష్ట సంగీత సాహిత్య కవి పండితులను స్వయం గా అభివృద్ధి చెంది ఆదర్శం గా నిలిచినా వారిని నిత్య జీవితం లో ఉద్యోగాలలో ఉంటూ విశిష్ట సేవలు చేసేవారిని గుర్తించి సత్కరించటం అపూర్వ విషయమని  దుర్గాప్రసాద్ గారు రాష్ట్ర దేశ పరిధులు దాటి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకొని ఉయ్యూరుకే గర్వ కారణం అని ,సరసభారతి ప్రతి కార్యక్రమాన్ని నిర్దుష్టం గా మహా విశిష్టంగా నిర్వహిస్తుందని 75 ఏళ్ళ వయసులో ప్రసాద్ గారు ఒక ముఖ్య కార్య కర్తగా ,గ్రంధ రచయితగా వక్తగా ,బ్లాగుల నిర్వాహకునిగా విభిన్న పాత్రలలో రాణిస్తూ తమందరికి ఆదర్స్ధం గా ఉన్నారని తెలిపారు .

లైబ్రేరియన్ శ్రీ సంపత్ కుమార్ గారికి ,శ్రీమైనేని గోపాల కృష్ణగారికి ఆంధ్రా యూని వర్సిటీలో సహాధ్యాయి ,గురజాడ మాజీ సర్పంచ్ ,ప్రముఖ సంఘ సేవకులు ,జ్ఞాన వయో వృద్ధులు శ్రీ గురజాడ వెంకటేశ్వర రావు గారిని  సత్కరించాం ‘’శ్రీ గురజాడ వారు’’సరస భారతి కార్యక్రమాలకు అబ్బుర పడి  ప్రోత్సాహం గా  సంస్థకు 1,000 రూపాయలు కానుకగా అందజేశారు కృతజ్ఞతలు ..గండిగుంట వాసి ,నాగార్జున విశ్వ విద్యాలయ మాజీ లైబ్రేరియన్ ప్రస్తుత హైదరాబాద్ నివాసి  శ్రీ సుంకర కోటేశ్వర రావు గారు నెల రోజుల ముందే సరసభారతికి రెండు వేలరూపాయలు (2,000-)చెక్ పంపి ప్రోత్సహించారు .వారికి కృతజ్ఞతలు . . శ్రీ గురజాడవారికి  , మాకూ మిత్రులు శ్రీ వీణెం గోపాల క్రిష్ణయ్యగారికి ,మాజీ డ్రిల్ మాస్టారు మా గురువుగారు  శ్రీ ఎస్ వి సుబ్బా రావు గారికి ,శ్రీ వి బి జి రావు ,శ్రీమతి శివలక్ష్మి ,శ్రీనివాస శర్మ ,,వేణుగోపాల్ ,మొదలైన వారందరికీ పుష్పహారాలు వేసి జ్ఞాపికలను అందజేశాం .దాదాపు నాలుగు గంటల సేపు సభ చాలా నిండుగా సుమారు తొంభై మంది హాజరీతో దేదీప్యమానం గా జరిగి అందరికి సంతృప్తి ని కలిగించి సరసభారతి ధన్యమైంది .

సభ అనంతరం పైన అందరికి విందు ఏర్పాటు చేశాం .పదార్ధాలు బాగా రుచికరం గా ఉన్నాయని మెచ్చి తృప్తిగా అందరూ భోజనం చేయటం మాకు ఎంతో సంతృప్తిని సంతోషాన్ని కల్గించింది .ఇలా మా ఉయ్యూరు కు  ఆరు రోజుల ముందే ఉగాది శోభ సరసభారతి కలిగిస్తే మా కవితాకోవిలలు కూడా ముందే హాయిగా నవ్యాంధ్ర ప్రదేశ్ లో నవ వసంత గానం చేసి పరవశాన్ని కల్గించాయి .శుభం భూయాత్ .

సందట్లో సడేమియా

ఎప్పుడూ ప్రార్ధన తో మొదలు పెట్టి ,జాతీయ గీతం తో ముగిసే మా సభలు ఈ సారి ఆ రెండూ’’పర’’వశం లో  మర్చిపోయి గొప్ప తప్పే చేశాం . అంతా అయ్యెదాకా  గమనించక పోవటం నాదే ప్రధాన దోషం అని సవినయంగా నా తప్పును ఒప్పుకొంటున్నాను .

పిలిచిన అతిదులలో  శ్రీ వై వి బి ,శీ  చలసాని  ,శ్రీకలిమిశ్రీ లు పురస్కార గ్రహీతలలో ‘’శ్రీకళాసాగర్ ,శ్రీమతి శిరీష ,,శ్రీ బాషా ,శ్రీ ఫజులాల్ మొయిద్ శ్రీమతి శ్యామలాదేవి ‘’పే’’రెడీ’’ రచయితా ‘’రెడీ’’ గా రాకపోవటం   బాగా నిరాశ పరిచింది .

ప్రపంచ సభలలో ఉయ్యూరు కవి సమ్మేళనానికి మేమొస్తాం మా పేరు రాయండి అని మరీ అడిగి రాయించుకొని ,ఆహ్వాన పత్రం లో పేరు చేర్చినా దాదాపు సగం మంది పైగా కవులు రాకపోవటం కొంత బాధ కలిగించింది .ఎవరికారణాలు వారికి ఉంటాయి .ఇంతే  అని సరి పెట్టు కోవటమే  మంచిది .

ఉగాది వేడుకలను ఇంటర్నెట్ ఉన్నవారందరూ చూసే వీలుగా లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారం చేసే ఏర్పాట్లు చేశాం .దూరప్రాంతాలవారు విదేశాలలో ఉన్న తెలుగువారూ చూసి సంతోషించారు .కొందరు ప్రసారం బాగా ఉంది అంటే కొందరు  వీడియో’’ భేష్’’ ఆడియో ‘’ట్రాష్ ‘’అని సన్నాయి నొక్కులు నొక్కారు .ఎక్కువ మందినే సంతృప్తి పరిచింది అని అని పించింది .సరసభారతి కార్యవర్గ సభ్యులు ఇచ్చిన చక్కని సహకారం మరువలేనిది అందరికి కృతజ్ఞతలు .అందరి సమష్టి కృషి ఈ విజయానికి కారణం .’’వన్ మాన్ షో ‘’గా ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోన్నాననే అనుకుంటున్నాను .తీర్పు  చూసిన వారు చెప్పాల్సిన విషయం .

హై టెన్షన్

వ్యవధి రెండు నెలలో లోపే ఉంది మాకు ఈ రెండు గ్రందాల ముద్రణకు .శ్రీ చలపాక ప్రకాష్  గారింట్లో కుమార్తె వివాహం మార్చి 7 వ తేదీ తో బిజీ బిజీ .అయినా పట్టు వదలని విక్రమాదిత్యునిగా పుస్తకం డి టిపి చేయించి ,ముద్రణకు సమయానికి అందించి ఫోటోలుపెట్టి , కవర్ పేజీ డిజైన్ శ్రీకళాసాగర్ తో చేయించి, చివరి వారం రోజులూ పగలూ రాత్రీ విశ్రాంతి కూడా తీసుకోకుండా మాకోసం  శ్రమించి పుస్తకాలను రెడీ చేయించారు .బెజవాడలో పేరడీలను శుక్రవారం రాత్రికి ఏ యెన్ ఎల్ పార్సిల్ సర్వీస్ లో పంపితే అవి శనివారం ఉదయానికి రావాల్సింది రాలేదు నేనూ ప్రకాష్ గారు  ఇక్కడి పార్సిల్ సర్వీస్ ఆతను ఫోన్ల మీద ఫోన్లు పోద్దుటినుంచీ చేస్తూనే ఉన్నాం . శని వారం మధ్యాహ్నం పంపిస్తామని బెజవాడ వాళ్ళు చెప్పటం తర్వాత అక్కడ ఆఫీసులో ఇన్ కం టాక్స్ వారి రైడింగ్ ఉందని కనుక పంపలేదని తెలియటం తో మాకు హై టెన్షన్ వచ్చింది .చివరికి ఆది వారం అంటే సభ జరిగే రోజు పొద్దున  పంపితే ఉదయం పదింటికి వచ్చాయి .అప్పుడు వెళ్లి తెచ్చుకొని ఆవిష్కరణకు పదిపుస్తకాలు పాక్ చేయించాను .

ఇక అసలైన గీర్వాణం గ్రంధాలు చాలా పెద్ద సైజు కనుక  వాటిని అదే పార్సెల్ సర్వీస్ లో వేస్తె ,అందవు అని నేనూ ప్రకాష్ అనుకోని ,సభరోజు ఆదివారం మధ్యాహ్నం  ఒంటిగంటకు  ఆటోలో పంపే ఏర్పాటు చేసుకోన్నాం .అవి సరిగ్గా  రెండు గంటలకు  ‘’కులాసాగా’’ చేరాయి .వాటినీ పది కాపీలుఆవిష్కరణకు  పాక్ చేయించాను ..మొత్తం మీద శని, ఆదివారాలంతా టెన్షనే టెన్షన్.హై టెన్షన్ . అన్నీ తీరిపోయి మధ్యాహ్నం రెండుగంటలకు ఊపిరి పీల్చుకొన్నాం .ఇంతహడావిడి ఇంతవరకు ఎప్పుడూ లేదు .శ్రీ చలపాక ప్రకాష్ గారికి ఏమిచ్చి మా ఋణం తీర్చుకో గలం  “?ఆయన సౌజన్యం సౌహార్ద్రతలకు జేజేలు పలకటం తప్ప .?మంచి మనీషి శ్రీ ప్రకాష్ .అలాంటి వారు నాకు, శ్రీ మైనేనిగారికి పరిచయమవటం మా అదృష్టం .సరసభారతి అదృష్టం .

శ్రీ మన్మధ ఉగాది శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-15- ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రాళ్ళబండి ఇక లేరు

20150316a_002135004 D25550452

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి ఉయ్యూరు ఆధ్వర్యంలో 76వ సమావేశం ఆదివారంనాడు (15 – 3 – 15 ) మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు, కవి సమ్మేళనం, గీర్వాణ కవుల కవితా గీర్వాణము, త్యాగి పేరడీలు గ్రందావిష్కర్ణ , ప్రముఖులకు సత్కారాలు, పురస్కారాల సభ నిర్వహించబడినది . సభలోని చిత్రాలు తిలకించండి .

సరసభారతి  ఉయ్యూరు ఆధ్వర్యంలో 76వ సమావేశం  ఆదివారంనాడు (15 – 3 – 15 ) మన్మధ నామ  సంవత్సర ఉగాది వేడుకలు, కవి సమ్మేళనం, గీర్వాణ కవుల కవితా గీర్వాణము,   త్యాగి పేరడీలు గ్రందావిష్కర్ణ , ప్రముఖులకు సత్కారాలు, పురస్కారాల సభ  నిర్వహించబడినది . సభలోని  చిత్రాలు తిలకించండి .

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు

డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు

abhinandan - 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

1969 లో అంటే 45 ఏళ్ళ క్రితం కవిత -బందరు -సారస్వత సమితి ముద్రించిన తొలి పుస్తకం లో

సాహితీ బంధువులకు శుభకామనలు -ఎప్పుడో 1969 లో అంటే 45 ఏళ్ళక్రితం  ,నా ఆదర్శ కదా రచయిత ఆత్మీయులు స్వర్గీయ ఆర్ ఎస్ కె మూర్తి గారు అడిగితె రాసిన కవిత ”భ్రమ తొలగింది ”మచిలీపట్నం ఆంద్ర సారస్వత సమితి  వారు ముద్రించిన  మొదటి పుస్తకం లో చోటు  చేసుకొన్నది .దాన్ని    ,బందరుకు చెందిన సాహితీ మూర్తి శ్రీ జ్ఞానేశ్వరరావు గారి కుమార్తె శ్రీమతి గుడిపూడి రాదికారాణి  సేకరించి ,భద్రపరచి జిరాక్స్ కాపీ తీయించి నిన్న జరిగిన శ్రీ మన్మధ ఉగాది వేడుకలలో పాల్గొనటానికి వచ్చి నాకు ఏంతో  ఆత్మీయం గా ముద్దుముద్దు మాటలతో అందజేసింది ఆ కవిత రాసిన విషయం ఎప్పుడో మర్చిపోయాను అది సమితి వారు ముద్రించిన పుస్తకం లో ఉందన్న సంగతీ నాకు తెలీదు లేక గుర్తు లేదు .ఈ క వితను పది రోజుల ముందు  రాధికా రాణి నాకు  ఫోన్ లో చదివి వినిపించి నన్ను ఆశ్చర్య పరచింది  నా కవిత వేనకే    బాలబందు స్వర్గీయ శ్రీ బి వి నరసింహా రావు గారి ”మంచి గంధము -మల్లెపువ్వులు ”కవిత కూడా ఉంది . ఆకవిత ఆయనలాగానే మంచిగంధపు చల్లదనాన్ని మల్లె పూల సోయగ ,సౌరభాలను వె ద జల్లుతుంది దాన్నికూడా మీ కోసం అందజేస్తున్నాను -దుర్గాప్రసాద్   69-1 001 69-2 001 balabandhukavita 001

Posted in కవితలు | Tagged | Leave a comment

”గీర్వాణం ”లో దా. రామడుగు వారి ముందుమాటలు ”అంత రింద్రజాలం ”

”గీర్వాణం ”లో దా. రామడుగు వారి ముందుమాటలు ”అంత రింద్రజాలం ”

ramadugu4 001 ramadugu5 001 ramdugu1 001 ramdugu2 001 ramdugu3 001 ramdugu6 001 ramdugu7 001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి ఉగాది వేడుకలు -వార్తాకధనం

bhumi enadu 001 sakshi 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దొరకునా… ఇటువంటి సినిమా ! ‘శంకరాభరణం’

దొరకునా… ఇటువంటి సినిమా !

Sakshi | Updated: March 15, 2015 00:14 (IST)
దొరకునా... ఇటువంటి సినిమా !

ఆ సినిమాలో కథానాయకుడి పాత్ర వయసు అరవైకి దగ్గర! సినిమాలో డ్యూయెట్లు లేవు… ఫైట్లూ లేవు. అంతా సంగీతం… అదీ సంప్రదాయ సంగీతం! కానీ, ప్రాంతమేదైనా ప్రేక్షకుల అభిరుచి గొప్పది. బాక్సాఫీస్ సూత్రాలకు విరుద్ధమైన ఆ తెలుగు సినిమా… భాషల ఎల్లలు దాటి 35 ఏళ్ళ క్రితమే దేశాన్ని జయించింది. ప్రపంచాన్ని ముక్కున వేలేసుకొనేలా చేసింది. ఎందరెందరో కళా ఋషుల తపఃఫలమైన ‘శంకరాభరణం’ ఇన్నేళ్ళ తరువాత తమిళంలోకి

డబ్ అయి, మొన్న శుక్రవారమే జనం ముందుకొచ్చింది. మూడున్నర దశాబ్దాల విరామం తర్వాత ఒక భాష నుంచి మరో భాషలోకి డబ్బింగైన తెలుగు సినీ స్వర్ణాభరణంగా ఇప్పుడు మళ్ళీ చరిత్రకెక్కింది.

– డాక్టర్ రెంటాల జయదేవ

అది 1980… మద్రాసు (ఇప్పటి చెన్నై) మౌంట్ రోడ్ అణ్ణా ఫ్లై ఓవర్‌కు సమీపంలోని సత్యం సినీ కాంప్లెక్స్… అప్పటికి 20 వారాలుగా అందులో ఒక సినిమా విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది. అయినా సరే  కొత్త రిలీజ్‌లా తమిళ ప్రేక్షకులు ఉత్సాహంగా వస్తూనే ఉన్నారు. అదేమీ ఏ తమిళ సూపర్ స్టార్ సినిమానో కాదు. ఆ మాట కొస్తే అసలు తమిళ సినిమానే కాదు. పదహారణాల తెలుగు సినిమా. మాటలూ, పాటలూ కూడా తమిళంలోకి అనువాదం చేయని పక్కా తెలుగు సినిమా. అయితేనేం… ఉత్తమ కళా సృజనకూ, ఉత్తమ సంగీతానికీ భాష, ప్రాంతం అడ్డుగోడలు కావని మరోసారి నిరూపితమైంది. తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్న ఆ సినిమా… ప్రపంచ మంతటా తెలుగువారు ఇవాళ్టికీ శిరసెత్తి సగర్వంగా చెప్పుకొనే సినీ చిరునామా… జాతీయ అవార్డుల్లో ‘స్వర్ణ కమలం’ (ప్రత్యేక విభాగంలో) అందుకున్న ఒకే ఒక్క తెలుగు సినీ ఆణిముత్యం…. పేరు – ‘శంకరాభరణం’.

అప్పట్లో మద్రాసులో 20 వారాలు ఆడిన ఆ తెలుగు కళాఖండం మదురై, సేలమ్ లాంటిచోట్ల శతదినోత్సవాలు జరుపుకొంది. మాటలు మాత్రం మలయాళంలోకి డబ్బింగ్ చేసి, పాటలు అలాగే తెలుగులోనే ఉంచేసి, రిలీజ్ చేస్తే కేరళలో 25 వారాలు ఆడింది. లక్షల్లో లాభాలు తెచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ చిత్ర రంగాల్లో కనీవినీ ఎరుగని ఘట్టంగా చరిత్రకెక్కింది.

మూడున్నర దశాబ్దాల తరువాత… మళ్ళీ అదే మద్రాసు. మొన్న శుక్రవారం మార్చి 13న మన ‘శంకరాభరణం’ మరోసారి విడుదలైంది. అయితే, ఈసారి నవతరం తమిళులకు కూడా దగ్గరయ్యేలా పూర్తిగా తమిళంలో..! తెలుగు నుంచి అనువాదమైన తమిళ మాటలు, పాటలతో!! ఆధునిక డిజిటల్ సాంకేతికతను వినియోగించుకొని, కలర్ కరెక్షన్లన్నీ చేసుకొని, సంగీతాన్ని డిజిటల్ మాస్టరింగ్ చేసుకొని సరికొత్త హంగులతో..!!

నిజానికి, 1979లో రికార్డింగ్, షూటింగ్ జరుపుకొని, అదే ఏడాది సెన్సారై, కొనుగోలుదార్ల కోసం వారాల కొద్దీ వేచిచూసి, చివరకు 1980 ఫిబ్రవరిలో విడుదలయ్యాక సంచలనం రేపిన కళాఖండమిది. ‘‘అలాంటి క్లాసిక్ ఇన్ని దశాబ్దాల తర్వాత… మరో భాషలోకి అనువాదం కావడం విశేషం. అదీ మాతృక రిలీజై విజయం సాధించేసిన చోటకే మళ్ళీ డబ్బింగై, రిలీజవడం మరీ విశేషం. చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా ఇలా జరగలేదు’’ అని ప్రముఖ సినీ, సంగీత, కళా విమర్శకుడు వి.ఏ.కె. రంగారావు అన్నారు.

మొన్న మార్చి 13న ఏకంగా ఏడు తమిళ చిత్రాలు, 4 ఇంగ్లీష్ సినిమాల కొత్త రిలీజులతో పోటీ మధ్య వచ్చిందీ తమిళ ‘శంకరాభరణం’. ప్రస్తుతం తమిళనాట చెన్నైతో పాటు మదురై, కోయంబత్తూరు సహా వివిధ ప్రాంతాల్లో, 18 థియేటర్లలో ఈ తమిళ ‘శంకరాభరణం’ అభిరుచి గల ప్రేక్షకుల ఆదరణతో ఆడుతోంది. మరో విశేషమేమిటంటే, ఇప్పుడు చెన్నైలో తమిళంతో పాటు కొన్ని థియేటర్లలో తెలుగు వెర్షన్‌నూ విడుదల చేశారు. ఈ కొత్త రిలీజ్‌ను కళ్ళారా చూస్తున్న ఎనిమిది పదుల తమిళ సినీ చరిత్ర కారుడు ‘ఫిల్మ్‌న్యూస్’ ఆనందన్‌కు మూడున్నర దశాబ్దాల క్రితం ‘శంకరాభరణం’ సృష్టించిన సంచలనం ఇప్పటికీ గుర్తే. ‘‘అప్పట్లో ఈ చిత్రానికి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసేందుకు సినీ, రాజకీయ, కళా రంగాల ప్రముఖులు ఉవ్విళ్ళూరారు.

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర సంగం)లో ప్రత్యేకంగా ఒక ప్రింటే ఉంచేశారు. దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ప్రముఖుల కోసం అక్కడ చిత్ర ప్రత్యేక ప్రదర్శన జరిగేదంటే, అప్పట్లో ఆ చిత్రం అందుకున్న గౌరవాన్ని అర్థం చేసుకో వచ్చ’’ని అప్పట్లో ఆ చిత్రానికి తమిళ పత్రికా సంబంధాలు చూసిన ఆనందన్ అన్నారు. భాషాభేదం లేకుండా ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు అంతగా ఆదరించడా నికి విభిన్నమైన కథ, దర్శకత్వ ప్రతిభ, కట్టిపడేసే సంప్రదాయ సంగీతం, పాటలు – ఇలా అనేక కారణాలు కనిపిస్తాయి. అప్పుడందరూ కూనిరాగం తీసిన ఓంకార నాదాను సంధానమౌ గానమే… అన్న తెలుగు పాట ఇప్పుడు తాజా డబ్బింగ్ వెర్షన్‌లో ‘ఓంకార నాదంగళ్…’ అంటూ అదే గాయకుడు ఎస్పీబీ నోట తమిళంలో వినిపిస్తోంది. ఇంతకీ, ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాను ఎందుకు డబ్ చేసినట్లు?

ఈ తమిళ అనువాదం వెనుక అప్పటి తెలుగు చిత్ర ప్రదర్శన తాలూకు తీపి జ్ఞాపకాలెన్నో చోదకశక్తిగా పనిచేశాయి. చెన్నైలో బి.ఏ (తమిళ సాహిత్యం) చదువుకున్న నేటి తమిళ నిర్మాత ఎన్. రత్నంకి అప్పట్లో తమ తమిళ ప్రొఫెసర్ స్టూడెంట్స్ అందరినీ ‘సత్యం’ థియేటర్‌కు తీసుకెళ్ళి తెలుగు ‘శంకరాభరణం’ చూపించిన రోజులు ఈ 54 ఏళ్ళ వయసులోనూ గుర్తే. ‘‘అప్పటి నుంచి ఈ చిత్రానికీ, దర్శకులు విశ్వనాథ్ గారికీ నేను వీరాభిమానిని. ఆ తరువాత సినీ రంగంలోకి వచ్చి, రెండు చిత్రాలకు దర్శకత్వం వహించా. ఆ పైన ఇంగ్లీషు చిత్రాల దిగుమతితో మొదలుపెట్టి, దాదాపు వెయ్యి దక్షిణ భార తీయ భాషా చిత్రాలను హిందీలోకి అనువదించా. డబ్బు సంపాదించా. అయితే, ఆత్మతృప్తి కోసం ‘శంకరాభరణం’ డబ్బింగ్ చేశా’’ అని ఈ తాజా తమిళ డబ్బింగ్ చిత్ర సారథి – నిర్మాత ఎన్. రత్నం ‘సాక్షి’కి వివరించారు.

నిజానికి, అప్పటి ఈ చిత్రానికి ఇప్పుడు ఒరిజినల్ పిక్చర్ నెగటివ్ దొరకలేదు. సౌండ్ నెగటివూ పాడై పోయింది. కానీ, రత్నం – తమిళ డబ్బింగ్ ‘శంకరాభరణం’లో ఆయనకు భాగస్వాములైన ఇతర మిత్రులు పట్టుదలగా ఢిల్లీ వెళ్ళి, అక్కడ ఉన్న ఒకే ఒక్క ప్రింట్‌ను తీసుకొన్నారు. దాన్ని డిజిటైజ్ చేశారు. కొత్త నెగటివ్‌ను సిద్ధం చేశారు. పాడైపోయిన సౌండ్ నెగటివ్‌నూ పునరుద్ధరించారు. ‘‘అప్పట్లో ఈ సినిమాను ప్రదర్శించిన ఢిల్లీ తమిళ సంఘం దగ్గర ఈ సినిమా ప్రింట్ ఉంది. ఒకే ఒక్క ప్రదర్శన తరువాత ఆ ప్రింట్ అక్కడే భద్రంగా ఉండిపోయింది. ఆర్కైవ్స్‌లోని ఆ ప్రింట్‌ను తీసుకొని, కొత్తగా డి.ఐ (డిజిటల్ ఇంటర్మీడి యట్) చేసి, కలర్ కరెక్షన్ జరిపాం. తమిళంలో పాటలు రాయించి, రికార్డింగ్ చేశాం’’ అని రత్నం వివరించారు.

తెలుగు మాతృకలో పాడిన ఎస్పీబీ, ఎస్. జానకి, వాణీ జయరామ్‌లతోనే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత అవే పాత్రలకు తమిళంలోనూ పాటలు పాడించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ మీద గౌరవంతో ఆ ఉద్దండు లందరూ దాదాపు పారితోషికం తీసుకోకుండానే పాడడం మరో విశేషం. ‘ఏ తీరుగ ననుదయ చూచెదవో’, ‘మానస సంచరరే’ లాంటి సంప్ర దాయ కీర్తనల్ని అలాగే ఉంచేసి, తెలుగులో వేటూరి రాసిన మిగిలిన పాటలన్నీ తమిళంలో కొత్తగా రాయించుకొన్నారు (రచన: రాజేశ్ మలర్ వణ్ణన్, డాక్టర్ నావేంద్రన్). ఓ సంగీత దర్శకుడి (రాఘవ్) సారథ్యంలో కొత్తగా రికార్డింగ్ చేశారు. రత్నం మాటల్లో చెప్పాలంటే, ‘‘దాదాపు 30 రోజుల డబ్బింగ్, డి.టి.ఎస్‌లో రీరికార్డింగ్ – ఇలా అన్ని చేసేసరికి ఒక కమర్షియల్ సినిమాకయ్యే ఖర్చు అయింది.

అయితేనేం, తమిళ (డైలాగ్స్: రామకృష్ణన్) ‘శంకరా భరణం’ ఈ తరంవారికి కొత్త తమిళ సినిమా చూస్తున్న అనుభూతినిస్తుంది.’’ ‘పి.ఎక్స్.డి’ లాంటి ఆధునిక డిజిటల్ ప్రదర్శన విధానంతో ప్రింట్ల ఖర్చు లేకపోవడం, వారు కూడా ఈ కళాఖండాన్ని తక్కువ రుసుముకే డిజి టల్‌గా చూపడం కలిసి వస్తున్నాయి. వెరసి కాసుల కోసం కాక కళ కోసం చేసిన ఈ డబ్బింగ్ విదేశాలకూ వెళుతోంది.

భాష తెలియకపోయినా, తమిళనాట ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఈ చిత్రానికి అప్పట్లో జరిగిన అభినందన సభలో సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస య్యర్ మాట్లాడుతూ, ‘‘కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహించ డానికి నూరేళ్ళలో మా మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ చేయలేని పనిని ఒక్క ‘శంకరాభరణం’ చేసింది’’ అని ప్రశంసించారు. అందుకే, సినీ చరిత్రలోనే ‘శంకరా భరణం’ ఒక చరిత్ర. ఆ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో రావడం మరో కొత్త చరిత్ర. ఈ కొత్త చరిత్రకు దోహదపడ్డ తమిళ నిర్మాత రత్నం అన్నట్లు, ‘‘కావ్యాలూ, ఇతిహాసాలూ ఎన్నేళ్ళయినా నిత్యనూతనం. వెండితెర కావ్యం ‘శంకరాభరణం’ సరిగ్గా అలాంటిదే!’’
అందుకే, దొరకునా… ఇటువంటి…సినిమా!

‘‘అప్పట్లో ‘శంకరాభరణం’ చిత్రం ఇంత గొప్పగా రావడానికి ఎంతోమంది కారణం. ఈ సినిమా కోసం అందరూ ఓ కుటుంబంలా కష్టపడి పనిచేశారు. కొన్ని సినిమాలు రీమేక్ చేయలేం. మళ్ళీ నన్నే ఈ సినిమా తీయమన్నా ఇంత అద్భుతంగా వస్తుందా అన్నది సందేహమే. మనకున్న ఘన సంగీత వారసత్వం గురించి ఈ తరానికి తెలియజెప్పడానికే ఈ చిత్రం తీశాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా చాలామంది ‘శంకరాభరణం’కి ముందు, ‘శంకరా భరణం’కి తర్వాత అంటారు. ఇప్పుడు ‘శంకరాభరణం’ తమిళ రూపం చూస్తుంటే, మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి. ఈ సినిమా గురించి మాట్లాడడానికి, చెప్పడానికి ఎన్నెన్నో విషయాలున్నాయి.’’
– ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్, ‘శంకరాభరణం’ చిత్ర దర్శకుడు

‘‘ఆ రోజుల్లో అందరూ నిరుత్సాహపరిచినా మా ప్రయత్నం తెలుగు రూపంలోనే తమిళ నాటా అద్భుత ఆదరణ పొందింది. ఉత్తమ చిత్రం, సంగీతం, గాయనీ, గాయకుల (మహదేవన్, వాణీ జయరామ్, ఎస్పీబీ) విభాగాల్లో జాతీయ అవార్డులందుకున్నాం. ఇప్పుడీ చిత్రాన్ని తమిళ మాటలు, పాటలతో చూసి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా.’’
 – ఏడిద నాగేశ్వరరావు, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత  

‘ముప్ఫై అయిదేళ్ళ క్రితం ‘శంకరాభరణం’ తెలుగు చిత్రానికి మద్రాసులో రికార్డింగ్ ఎక్కడ జరిపామో (అప్పట్లో విజయా డీలక్స్. ఇప్పటి పేరు ఆర్.కె.వి. స్టూడియో), సరిగ్గా అక్కడే ఇప్పుడీ తమిళ డబ్బింగ్ వెర్షన్ పాటలు విడుదలయ్యాయి. నేను 33 ఏళ్ళ వయసులో ఉండగా, తెలుగులో ఈ పాటలు పాడి, రికార్డ్ చేశా. సుమారు ముప్ఫై అయిదేళ్ళ విరామం తరువాత 68 ఏళ్ళ వయసులో ఇప్పుడీ తమిళ గీతాలు ఆలపించా. ముప్ఫై అయిదేళ్ళ నాటి సినిమా ఇప్పుడు డబ్బింగ్ చేయడమే ఒక విశేషమైతే, అప్పుడు పాడిన నేనే మళ్ళీ ఇప్పుడివీ పాడడం మరో విశేషం. ఇలాంటి భాగ్యం ప్రపంచంలో నా ఒక్కడికే దక్కిందనుకుంటా. అన్నీ అనుకొని చేసేవి కాదు. ‘శంకరాభరణం’ లాంటి కొన్ని అద్భుతాలు అలా జరుగుతాయి… అంతే!’’
– ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ‘శంకరాభరణం’ చిత్రానికి జాతీయ అవార్డందుకున్న నేపథ్య గాయకుడు

ఎల్లలు దాటిన బాక్సాఫీస్ విజయం

⇒తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్టీఆర్ సినిమాలు అయిదింటి (‘లవకుశ’, ‘దానవీరశూర కర్ణ’, ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘వేటగాడు’) తరువాత రూ. కోటి వసూళ్ళు సాధించిన తొలి సినిమా ‘శంకరాభరణ’మే!
⇒తెలుగు నాట 4 (విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్) కేంద్రాల్లో నేరుగా రజతోత్సవం జరుపు కొంది. మరో 5 కేంద్రాల్లో నూన్‌షోలతో పాతికవారాల పండుగ చేసుకుంది. విజయవాడ ‘అప్సర’లో 181 రోజులు, హైదరాబాద్‌లో షిఫ్టులతో 350 రోజులాడింది.
⇒హీరోల సినిమాలుగా తెలుగు, తమిళాల్లో వర్గీకరణ వచ్చాక మన సినిమాలు తమిళనాట ఆడడం పెద్ద విశేషం. కమలహాసన్ నటించిన కె. బాలచందర్ చిత్రం ‘మరో చరిత్ర’ (1978) మద్రాస్‌లో ఒకే థియేటర్ (సఫైర్)లో, ఉదయం ఆటలతో  596 రోజులు ఆడి, చెరగని రికార్డ్‌గా నిలిచింది. ఆ తరువాత ‘శంకరాభరణం’ (1980) ఒక్క మద్రాస్‌లోనే కాక, తమిళనాడు అంతటా బాగా ఆడింది.
కన్నడ సీమలో బెంగుళూరులోనే ఏకంగా 6 థియేటర్లలో తెలుగు ‘శంకరాభరణం’ శతదినోత్సవం జరుపుకొంది. ఇప్పటికీ మరే తెలుగు సినిమాకూ దక్కని రికార్డు.
⇒ అప్పట్లో తమిళనాడు, కేరళ హక్కుల్ని తమిళ నటులు మనోరమ, మేజర్ సౌందరరాజన్ కొన్నారు. ‘ఏ.వి.ఎం’ చెట్టియార్‌కు సమీప బంధువైన ఒక డిస్ట్రిబ్యూటర్ కేరళ వరకు హక్కుల్ని మనోరమ వాళ్ళ నుంచి కొన్ని వేలకు కొనుగోలు చేశారు. మలయాళ డైలాగులు, తెలుగు పాటలతో రిలీజై కోట్లలో లాభం తెచ్చింది. ఇవాళ్టికీ, శబరిమల వెళుతుంటే మలయాళ సీమలో ‘శంకరాభరణం’ ఆడియో, వీడియోలు పలకరిస్తూనే ఉంటాయి.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు వార్త మరియు సాక్షి -పత్రికా కధనం

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు వార్త మరియు సాక్షి -పత్రికా కధనంpaper coverage 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం సాహిత్య సేవలో సరసభారతి –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

సాహిత్య సేవలో సరసభారతి –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి

సాహిత్యాభిమానులందరికీ ఉగాది శుభా కాంక్షలు ,అభినందనలు .సరసభారతి –సాహిత్య సంస్కృతీ సంస్థ 24-11-2009 నప్రారంభమైనది . అయిదేళ్లుగా సాహితీ సేవ చేస్తూ  అరవ ఏడాది లోకి అడుగుపెట్టింది అని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .సరసభారతి ప్రచురించిన ‘’సిద్ధ యోగి పుం గవులు ‘’,మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాలలో మొదటి నుంచి అప్పటిదాకా అంటే అరవై వ సమావేశం దాకా జరిగిన ప్రగతిని వివరం గా తెలియ జేశాం .ఆ తర్వాత చేసిన కార్యక్రమాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను .

21-5-2014  బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్ర్రీ మతి కొమాండూరి కృష్ణ గారిచే 61 సమావేశం గ ‘’దాస్య భక్తీ-శ్రీ ఆంజనేయ స్వామి ‘’అనే అంశం పై ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేశాం .శ్రీమతిక్రిష్ణ ఏంతో భావ గర్భితం గా ప్రసంగించి అందర్నీ భక్తీ భావనలో తేల్చారు .యధోచిత సత్కారం చేశాం .62  సమావేశం 22-5-14 గురువారం మచిలీపట్నం సోదరులు ఛి వీరుభోట్ల పవన్ కుమార్,ఛి వరప్రసాద్ లచే ‘’ఏక పాత్రాభినయం ‘’ఏర్పాటు చేయగా ,సోదరులు ఏంతో హుషారుగా ,చలాకీగా ఆయా పాత్రలలో తన్మయులై ధారాళం గా సంభాషణలు చెప్పి ,గొప్ప అభినయాన్ని ప్రదర్శించి ,జీవించి  ఆకట్టుకొన్నారు .వారి తండ్రిగారు మూర్తిగారు వీరిని తీర్చి దిద్దిన తీరు ప్రశంసనీయం .సరసభారతి ఈ ముగ్గురిని ఘనం గా సత్కరించి సంస్కృతీ సేవ చేసింది .వర్దిష్ణులైన  ఆ చిర౦ జీవులను అందరూ అభినందించారు .

తెలుగు విద్యార్ధి మాస పత్రికను సమర్ధం గా అరవై ఏళ్ళు  నిర్వహించిన ఆ పత్రిక సంపాదకులు ,శాసన మండలి మాజీ సభ్యులు ,విద్యా రంగం లో ఉపాధ్యాయుల సేవలో తరించిన శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారి మరణానికి సంతాప సభగా 23-6-14 సోమవారం ఏ. సి .గ్రంధాలయం లో సంతాప సభను 63 వ సమావేశం గా జరిపి శ్రద్ధాంజలి ఘటించాం .శ్రావణ మాసం లో ‘’శ్రావణ మాసం –నోములు –విశిష్టత ‘’పై మన దేవాలయం లో 64 వ సమావేశం 29-7-14 సాయంత్రం శ్రీమతి వేదాంతం శోభాశ్రీ ప్రసంగం ఏర్పాటు చేశాం . .65 వ సమావేశం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను 17-8-14 ఆదివారం నిర్వహించి చిన్నపిల్లలకు కృష్ణ గోపికా వేషాలలో పోటీ నిర్వహించి బహుమతులను అందించాం .

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి శ్రీమైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేసి , డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి గారికి అంకితమిచ్చిన ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గ్రంధా విష్కరణ సభను స్థానిక ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాలలో కాలేజి ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ వారి సౌజన్యం తో  డిగ్రీ విద్యార్ధుల సమక్షం లో 66వ సమావేశం గా 28-8-14గురువారం  శ్రీ రాచకొండ శర్మగారి 90 వ జన్మ దినోత్సవం సందర్భం గా నిర్వహిం చాం సభాధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారు –కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ,.శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి  గ్రంధా విష్కరణ చేసి తోలి కాపీని విశాఖ పట్నం నుండి విచ్చేసిన   ప్రముఖ రచయిత స్వర్గీయ రా.వి .శాస్త్రి గారికుమారులు శ్రీ రాచకొండ లక్ష్మీ నరసింహ ప్రసాద్ గారికి అందజేశారు. కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ కొడాలి సత్యనారాయణ ,శ్రీ డా జి వి పూర్ణ చంద్ శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ఆత్మీయ అతిధులుగా విచ్చేసి వేదికను సుసంపన్నం చేశారు .ఉదయం అల్పాహార విందును కాలేజి వారు ఏర్పాటు చేయగా అతిధులకు మధ్యాహ్న భోజనం సరసభారతి ఏర్పాటు చేసింది .ఇంగ్లీష్ లెక్చరర్ శ్రీమతి జి సోని పుస్తకాన్ని సంక్షిప్తం గా సమీక్షించారు .గ్రంధ కర్తను మైనేని గోపాల కృష్ణగారు ఏర్పాటు చేసిన  బంగారు   బ్రేస్ లెట్ ‘ను శ్రీ సుబ్బారావు గారు రచయితచేతికి అలంకరించారు .సరసభారతి అతిదులందరికి ‘’ఆధునిక ఆంగ్ల కవితాపిత ‘’జియోఫ్రీ చాసర్  చిత్రం ఉన్న  జ్ఞాపిలను అందజేసి శాలువాలతో సత్కరించింది .కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి,ఆంగ్ల లెక్చరర్ శ్రీ మతి  అరుణ కుమారి  కార్యక్రమాన్ని పర్యవేక్షించారు .సాహిత్యం విద్యార్ధులకు చేరువ అవ్వాలన్న సరసభారతి సంకల్పం ఇలా నేర వేరింది .

కవులు ,కళాకారులు జన్మించిన గ్రామాలలో వారి సభలు జరపాలని నిర్ణయించి శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారి జయంతి వర్ధంతిని చిట్టూర్పు లో వారి స్వగ్రామం లో జనవరి పన్నెండు న నిర్వహించిన  సంగతి మీకు తెలుసు .ప్రముఖ సినీ సంగీత దర్శకుడు స్వర్గీయ శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతిని 67 వ సమావేశం గా వారి స్వగ్రామం కాటూరు లో శాఖా గ్రంధాలయం లో కాటూరు గ్రామ పెద్దల సహకారం తో 31-8-14 ఆదివారం సాయంత్రం జరిపి ఈ తరానికి పరిచయం చేసి కాటూరి ప్రజల మన్ననలు అందుకోన్నాం . శ్రీ వేమూరికోతెశ్వరరావు శ్రీ బాబ్జీ గారు  లైబ్రేరియన్ గారు సహకరించారు 68వ సమావేశం గా ప్రముఖ చిత్రకారులు సినీ దర్శకులు స్వర్గీయ బాపు గారికి బాష్పాంజలి ని ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో 6-9-14సాయంత్రం  నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించాం .

విజయ వాడ రమ్య భారతి ,ఉయ్యూరు సరసభారతి సంయుక్త ఆధ్వర్యం లో ప్రముఖ రచయిత పాల గుమ్మి పద్మ రాజు గారి శతజయంతిని విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 14-9-14- ఆదివారం ఉదయం నిర్వహించాం .ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ కదా రచయిత శ్రీ వేదగిరి రాం బాబు గారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిన ‘’బాపు –రమణ ‘’ల స్మారక పురస్కారం అయిదు వేల రూపాయలను సరసభారతి ద్వారా అ౦ద జేశాం .మొదటి సారిగా ఆపురస్కారాన్ని ఆంధ్ర దేశం లో ఏర్పాటు చేసిన ఘనతను శ్రీ గోపాల కృష్ణ గారు ,అందజేసిన ఘనత సరసభారతి ,మొదటిసారిగా అందుకొన్న ఖ్యాతి శ్రీ రాం బాబు గారికి దక్కింది .ఇది సరసభారతి 69 వ సమావేశం .ఒక వారం వ్యవధిలో మచిలీపట్నం మహతి కళా వేదిక పై 21-9-14 ఆదివారం సాయంత్రం 70వ సమావేశాన్ని కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారం తో జరిపాం .ప్రముఖ చిత్రకారులు కవి నవలా రచయితా శ్రీ శీలా వీర్రాజుగారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిన బాపు-రమణ ల స్మారక పురస్కారం 10,౦౦౦రూపాయలు అందించాం .జిల్లా ఒకటవ అదనపు  న్యాయ మూర్తి జస్టిస్ శ్రీ యం రామ శేషగిరిరావు ముఖ్య అతిధిగా విచ్చేసి పురస్కారాన్ని జ్ఞాపికను వీర్రాజు దంపతులకు అందజేయటం శాలువా తో సత్కరించటం  చారిత్రాత్మక విషయం .వారం వ్యవధిలో ఈ పురస్కారాన్ని ఇద్దరు ప్రముఖులకు అందజేసిన ఘనత సరసభారతికి శ్రీ మైనేని వారి వలన దక్కింది. వారి వితరణ శీలతకు కృతజ్ఞతలు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు డా శ్రీ జి వి పూర్ణ చంద్ గార్లు ఆత్మీయ అతిధులుగా వేదికకు నిండుదనం తెచ్చారు .ఈ సభా నిర్వహణ బాధ్యతా ఖర్చు అంతా కృష్ణా జిల్లా రచయితల సంఘమే భరిం చింది శ్రీ సుబ్బారావు గారు తీసుకొన్న ప్రత్యెక శ్రద్ధకు ధన్యవాదాలు అందజేస్తున్నాం .నెల రోజులలో 5 కార్యక్రమాలు నిర్వహించి రికార్డ్ నెలకొల్పింది సరసభారతి .

71 వ సమావేశం గా కవిసమ్రాట్ విశ్వనాధ సత్య నారాయణ గారి 38 వ వర్ధంతిని వారి స్వగ్రామం నందమూరులో వారి తండ్రిగారు శోభనాద్రి గారు నిర్మించిన శ్రీ గంగా అన్న పూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయం లో 19-10-14 ఆదివారంసాయంత్రం  ఘనం గా నిర్వహించాం .గ్రామస్తులు విశేషం గా పాల్గొని విశ్వనాధ వారి కీర్తిని ప్రస్తుతించారు శ్రీ వల్లభనేని రమేష్ చంద్ విశ్వనాధ తో ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్నారు .విశ్వనాధ వారి మనుమలు విశ్వనాధ సత్యనారాయణ  సోదరులు కూడా పాల్గొని నిండుదనం తెచ్చారు .22-11-14 శనివారం శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో 72వ సమావేశాన్ని కార్తీక మాసం సందర్భం గా ధార్మిక ప్రసంగం  ఏర్పాటు చేశాం .రిటైర్డ్ తెలుగు లెక్చరర్ శ్రీ నౌడూరి రమేష్ గారు ‘’తెలుగు కావ్యాలలో శివ పార్వతి వర్ణన ‘’పై అద్భుత ప్రసంగం చేసి శ్రోతలను భక్తి ప్రవాహం లో తన్మయులను చేశారు .నెల రోజులలో 5 సమావేశాలను నిర్వహించి రికార్డ్ నెల కోల్పింది సరసభారతి .  సాహిత్యం విద్యార్ధులకు అందుబాటు లోకి తేవాలన్న లక్ష్యం 27-12-14 శుక్రవారం సాయంత్రం 73వ సమావేశం లో తీరింది .మా తెనుగుతల్లికి గేయ రచయిత స్వర్గీయ శంకరంబాడి సుందరాచారి గారి శత జయంతి సభను ఫ్లోరా విద్యాలయం లో జరిపాం .మచిలీపట్నం నుండి శ్రీ పి వెంకటేశ్వర రావు ,శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మ గార్లు వచ్చి సుందరాచారిగారి కవిత్వాన్ని సాహిత్య ధోరణులను చక్కగా విద్యార్ధులకు అర్ధమయ్యేట్లు వివరించి వారి ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు .

–   గ్రంధాలయోద్యమ సారధి ,బాల సాహిత్యరచయిత,.గ్రంధాలయ శాస్త్రం పై అనేక సాధికారిక గ్రంధాలు రచించిన వారు ఉయ్యూరు ఏ సి లైబ్రరీ నిర్మాణం లో పూర్తీ సహకారం అందించిన వారు శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి మరణానికి ,ఉయ్యూరు సాహితీ మండలి సంస్థాపక సభ్యులు, ప్రస్తుతనిర్వాహకులు సాహిత్యోపజీవి శ్రీ గూడపాటి కోటేశ్వర రావుగారి  మృతికి సంతాప సభను  గా ప్రత్యెక సమావేశాన్ని31-12-14 బుధవారం సాయంత్రం ఏ సి లైబ్రరీలోనిర్వహించి వారి సేవను శ్లాఘించి నివాళులర్పించాం .

మైనేని వారి గురుభక్తికి నిదర్శనం గాఏర్పాటు చేసిన  వారి చిన్ననాటి గురువుగారు స్వర్గీయ కోట సూర్య నారాయణ గారి స్మారక నగదు పురస్కారం 10,000 రూపాయల ను సరసభారతిద్వారా శాంతినికేతన్ లో పదవ తరగతి చదువుతున్న ప్రతిభ ఉన్న పేద విద్యార్ధిని ఛి లంకె లావణ్య కు ఆ స్కూల్ లో సభ జరిపి అందించాం .భగవద్గీత లో రాణిస్తున్న అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై గీతను వినిపించిన కుమారి మాదిరాజు బిందు దత్త శ్రీ కి ఉన్నత విద్యాభ్యాసం ప్రోత్సాహక  నగదు బహుమతి 15,౦౦౦ రూపాయలనుశ్రీ గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిపంపగా సరస భారతి తరఫున  శ్రీ సువర్చలా౦జనేయ స్వామి సన్నిధిలో అందించాం .ఉయ్యూరు హిందూ స్మశాన వాటికను ఆధునిక రీతిలో అభివృద్ధి చేస్తున్న ఉయ్యూరు రోటరీక్లబ్ వారికి సహాయం గా పెద్దమనసుతో శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు పంపిన 25000  ల రూపాయలను శ్రీ సువర్చలా౦జనేయ స్వామి సన్నిధిలో రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీ యార్ల గడ్డ నాగేశ్వరరావు గారికి సరసభారతిద్వారా అంద జేశాం .ఇన్నిరకాల వితరణలను సరసభారతి ద్వారా అంద జేయించిన శ్రీ గోపాల కృష్ణగారి ధార్మిక సేవను యెంత ప్రస్తుతించినా సరిపోదు .సరసభారతిపై వారికి ఉన్న నమ్మకానికి కైమోడ్పులు .ఒక రకం గా మైనేనివారు మా సరసభారతికి ‘’చీఫ్ పాట్ర‘న్ ‘’’ .అందుకు మాకు గర్వం గా ఉంది .

11-1-15 ఆదివారం సాయంత్రం  ఆర్య వైశ్య కళ్యాణ మందిరం లో 74వ సమావేశం గా శ్రీ మైనేని గోపాల కృష్ణగారి 80 వ జన్మ దినోత్సవం సందర్భం గా నిర్వహించాం .సాయంత్రం అయిదు గంటలకు సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భం గా శ్రీ పి ఇంద్ర కీలాద్రి శర్మ బృందం చే సంగీత కచేరి నిర్వహించాం .తర్వాత శ్రీ దుర్గా ప్రసాద్ రచించిన ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’గ్రంధాన్ని నది మాస పత్రిక సంపాదకులు శ్రీ జలదంకి ప్రభాకర్ ఆవిష్కరించి మొదటి కాపీని గ్రంధాన్ని అంకితం పొందిన మైనేని వారి మెంటార్ –కపట మెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి శ్ర్రీ కోగంటి సుబ్బారావు గారికి అందజేశారు .ఈ పుస్తకానికి ,ఆ రోజు మొత్తం ఖర్చుకు స్పాన్సర్ గోపాల కృష్ణ గారే .దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి దేశ విదేశాలలో కంప్యూటర్ ఉన్న వారందరూ చూసే ఏర్పాటు చేశాం .ఒక సాహిత్య సంస్థ ఇలా లైవ్ ప్రోగ్రాం నిర్వహించటం ఇదే మొదలు దీన్ని వీక్షించిన మైనేని గోపాలకృష్ణ  దంపతులు  పులకించిపోయారు . తన ఆత్మీయులు ,స్నేహితులు మార్గ దర్శిఎనభై అయిదేళ్ళ జ్ఞాన వయో వృద్దు  శ్రీ సుబ్బారావు గారికి ,సరసభారతి చేత పట్టుబట్టలు శాలువా ,బంగారు శ్రీ లక్ష్మీ నరసింహ కాయిన్  తెనాలిరామాలయం తో సంక్రాంతి వేడుక ఉన్న ప్రత్యెక జ్ఞాపిక ,సరసభారతి గ్రంధాలు అంద జేశారు .కోగంటి వారి కుటుంబ సభ్యులు హితులు సన్నిహితులు తెనాలి నుండి తరలి వచ్చిపాల్గొని ఏంతో నిండు దనం తెచ్చారు .గోపాల కృష్ణగారి బావ గారు శ్రీ అన్నే హనుమంతరావు  చెల్లెలు శ్రీమతి హేమలత ,కోగంటి వారి అల్లుడు శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు వారి కుమార్తె శ్రీమతి  శ్రీదేవి,కోగంటివారి పెద్ద కుమారుడు శ్రీ శివప్రసాద్ కోడలు శ్రీమతి పుష్పలత ,స్నేహితుడు శ్రీ అన్నే వెంకటేశ్వర్లు దంపతులు ,కోగంటివారి మనుమలు  వారి శ్రీమతులు మనుమరాళ్ళు అందరూ హాజరై పెళ్లి వేడుకను చేశారు .వచ్చిన వారందరితో బాటు సరసభారతి కోశాధికారి ఈ కార్య క్రమం ఇంత ఘనం గ జరగటానికి కృషి చేసిన  శ్రీ గబ్బిట వెంకటరమణ శ్రీమతి మహేశ్వరి దంపతులకు మైనేని గారు అందజేసిన నూతన వస్త్రాలు శాలువా ,జ్ఞాపిక అందజేశాం .అందరికీ ఆత్మీయ సత్కారం జరిపాం .గ్రంధ కర్త శ్రీ దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులకు శ్రీ ప్రభాకర్, శ్రీ సుబ్బారావు గార్లు ఘన సత్కారం చేసి నూతన పట్టు వస్త్రాలు శాలువా జ్ఞాపికలను మైనేని వారి తరఫున  అంద జేశారు.  .శ్రీ చలపాక ప్రకాష్ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు .500 పుస్తకాలను సభకు వచ్చినవారికి, తెనాలివారికి, మదన పల్లివారికి అందజేశాం .శ్రీ దుర్గాప్రసాద్ గారి గురువుగారు మాజీ డ్రిల్ మాస్టారు శ్రీ ఎస్. వి .సుబ్బారావు గారు శిష్యవాత్సల్యంగా  దుర్గాప్రసాద్ గారికి నూతన వస్త్రాలు శాలువా బహూకరించి సాహితీసేవను ప్రస్తుతించి ఆశీర్వ దించారు .కన్నుల పండువుగా జరిగిన ఈ సమావేశం చరిత్రాత్మకం గా నిలిచింది .

సభ ప్రారంభానికి ముందు అందరికి స్వీటు హాట్ అందజేసి టీ ఇచ్చాం .మధ్యలో బిస్కట్లు మళ్ళీ తేనేరు అందించాం సభానంతరం అందరికి షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేశాం .వచ్చిన వారందరూ సంతృప్తిగా భోజనం చేసి ఆనందించి అభినందించారు .ఇంత గొప్ప సభకు నూటపాతికమందికి పైగా సాహిత్యాభిమానులు పాల్గొని విజయ వంతం చేశారు .కార్యక్రమ నిర్వహణలో శ్రీ వీరమాచనేని బాలగంగాధర రావు గారు శ్రీమతి  శివలక్ష్మి శ్రీ గబ్బిట వెంకట రమణ గారు ,శ్రీ వెంట్రప్రగడ ఆంజనేయులుగారు ఏంతోతోడ్పడ్డారు .వీరందరికీ శాలువా  జ్ఞాపిక ,పుష్పహారం చందన తాంబూలాలతో సత్కరించాం .ఇందరి సమిష్టి కృషియే ఈ విజయానికి కారణం .సరసభారతిపై ఉన్న అభిమానానికి నిదర్శనం అందరికి కృతజ్ఞతలు .

75 వ సమావేశం గా భావ కవి ,ఆంధ్రా షెల్లీ స్వర్గీయ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని ఈ తరం విద్యార్ధులకు పరిచయం చేసే కార్యక్రమం అమరావాణీ హైస్కూల్ లో 25-2-15 బుధవారం జరిపాం . శ్రీ దుర్గాప్రసాద్ –కృష్ణ శాస్త్రి గారితో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని ,మద్రాస్ లో వారింటికి నాలుగైదు సార్లు వెళ్ళిన విషయమూ వారితోవారి కుటుంబం తో మద్రాస్ లో ఉన్న వారి పెద్దక్కయ్య పెద్దబవ గారు కీ .శే.  గాడేపల్లి లోపాముద్ర ,కృపానిధి గారల   బంధుత్వమూ ,వారు తనను తన మేనకోడలు సత్యకళను కారు లో త్యాగరాజనగర్ ,పాండీబజార్ లలో త్రిప్పిన మధురమైన రోజులను గుర్తు చేసుకొన్నారు .కృష్ణశాస్త్రి గారు కాటూరి వెంకటేశ్వర రావు గారు తమ చిన్న తనం లో ఉయ్యూరు లో వారింటికి వచ్చి రెండు గంటలు తమ తలిదండ్రుల తో మాట్లాడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు . శ్రీమతి మందరపు హైమవతి చక్కని ప్రసంగం చేసి విద్యార్ధులకు కృష్ణ శాస్త్రి గారి జీవితం వ్యక్తిత్వం రచనలను సుబోధకం గా వివరించారు .’’కృష్ణ శాస్త్రి గారిని చూసి మాట్లాడిన దుర్గాప్రసాద్ గారు ధన్య జీవులు .వీరింటికి వారు వారింటికి వీరు వెళ్లి ణ బాంధవ్యం గొప్పది దుర్గాప్రసాద్ గారికి నా పాదాభి వందనాలు ‘’అని ఉద్వేగం తో  ఆనంద  పులకంకి తం గా  చెప్పారు .వారికి ప్రిన్సిపాల్ శ్రీ  పి. నాగ రాజు , ఉపాధ్యాయ బృదం గొప్ప సహకారం అందజేశారు .కృష్ణ శాస్త్రి గారి జీవితం సాహిత్యం పై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించాం .శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ జాన్సన్ గార్లు కృష్ణ శాస్త్రి సినీ సన్ గీతాలను మధురాతి మధురంగా గానం చేసి రస డోలికలో ఊపేశారు . శాస్త్రి గారి గీతం ‘’జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ‘’గానం చేసిన విద్యార్ధులందరికీ సరసభారతి బహుమతులను అందించింది .విద్యార్ధులకు సాహిత్యం చేరువ చేయాలన్న మా సంస్థ ఆశయం ఇలా మళ్ళీ నెరవేరింది .

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలుగా 76 వ సమావేశాన్ని 15-3-15 ఆదివారం నిర్వహిస్తున్నాం . శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ ,డా.శ్రీ శలాక రఘునాధ శర్మ ,డా.శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,ఆచార్య మన్నవ సత్యనారాయణ గార్లకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా  ప్రసాద్ గారు తమ  తలిదండ్రులు స్వర్గీయశ్రీమతి  గబ్బిట భవానమ్మ ,శ్రీ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాలను  అందజేస్తున్నారు  .ప్రోత్సాహక పురస్కారులుగా శ్రీ కళాసాగర్ శ్రీమతి చలపాక -,శ్రీ బాషా (ఈనాడు ) ,శ్రీ రాజా ,(మనచానల్) శ్రీగూడవల్లి రామారావు (పోస్ట్ మాస్టర్ –ఉయ్యూరు ) శ్రీ ఫజులుల్ మొయిద్ (జాగృతి పొదుపు సహకార సంస్థ ఉయ్యూరు)కు అలాగే’’ స్వయం సిద్ధ ‘’ప్రత్యెక పురస్కారాన్ని శ్రీమతి పెద్ది భొట్ల సౌభాగ్య లక్ష్మి-(తెలుగు పండిట్ –ఉయ్యూరు) గారికి శ్రీ దుర్గా ప్రసాద్ దంపతులు  అందిస్తున్నారు .

శ్రీ దుర్గాప్రసాద్ రచాన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’గ్రంధాన్ని శ్రీ  మంగళ గిరి ఆదిత్య ప్రసాద్                       ఆవిష్కరిస్తారు . ఈ గ్రంధ అంకిత  స్వీకర్త శ్రీ మైనేని  గోపాల కృష్ణ గారికి ,దీన్ని స్పాన్సర్ చేసి సరసభారతి తరఫున ముద్రిస్తున్న శ్రీ మైనేని వారి మేనకోడలు డా శ్రీమతి జ్యోతిగారికి ,వారి సోదర సోదరీ మణులకు (అమెరికా)ధన్యవాదాలు ,కృతజ్ఞతలు .సరస భారతి మిత్రులు ప్రముఖ హాస్య రచయిత శ్రీ తాడిమేటి సత్యనారాయణ రచన ‘’ త్యాగి పే రెడీలు+ పుస్తకాన్ని ‘’ను సరసభారతి తరఫున ముద్రించి ఈ సభలో శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారిచే  ఆవిష్కరింప జేస్తున్నందుకు ధన్యవాదాలు .దీనితో సరసభారతి ప్రచురణలు 16 ,అందులో శ్రీ దుర్గా ప్రసాద్ గారి రచనలు 10.

80 మంది  ప్రముఖ కవులతో ‘’ నవ్యాంద్ర ప్రదేశ్ ‘’అనే అంశం పై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం . ముఖ్య అతిదిది గా  విచ్చేసిన శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ వై . వి .బి .రాజేంద్ర ప్రసాద్ ,ఆత్మీయ అతిధులు  శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు ,(ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ ) శ్రీ చలసాని రాజేంద్ర ప్రసాద్ (ఆంధ్ర జ్యోతి ఇంచార్జ్ –విజయవాడ )డా.శ్రీ జి వి పూర్ణ చంద్  శ్రీ కలిమిశ్రీ (మల్లెతీగ మాస పత్రిక సంపాదకులు ) మొదలైన వారికి ధన్యవాదాలు ..సరసభారతిఅధ్యక్షులు నితోత్సాహి శ్రీ దుర్గాప్రసాద్ సరసభారతి  ,శ్రీ సువర్చలాంజనేయ స్వామి అనే రెండు బ్లాగులను నిర్వహిస్తున్నారు . .వీటి వీక్షకుల సంఖ్య మూడు లక్షల పాతిక వేలు అంటే అందరికీ ఆశ్చర్యమేస్తోంది .మా గౌర్వాధ్యక్షులు ,శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,కోశాధికారి శ్రీ గబ్బిట వెంకట రమణ ,సాంకేతిక నిపుణులు శ్రీ వి బి జి రావు ,మిగిలిన కార్య వర్గ సభ్యులకు వారందిస్తున్న సహకారానికి సేవకు సరస భారతి  కృతజ్ఞతాభి వందనాలందిస్తోంది . సరసభారతి కార్య క్రమాలకు హాజరౌతూ ప్రోత్సహిస్తున్న సాహిత్యాభిమానులకు ,కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేర్చి సహకరిస్తున్న మీడియా మిత్రులకు సదా కృతజ్ఞతలు .మా కార్య వర్గ సభ్యుల సహకారం మరువలేనిది అందరికీ శ్రీ మన్మధ ఉగాది శుభాకాంక్షలతో కృతజ్ఞతాభినందన వందనాలు .

 

మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి

 

గీర్వాణ కవుల కవితా గీర్వాణం


నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ

ఇలా మొదలైంది–“సిద్ధయోగిపుంగవులు” మొదలుకొని , “మహిళామాణిక్యాలు” ,

“పుర్వాంగ్లకవుల ముచ్చట్లు”, “దర్శనీయ దైవక్షేత్రాలు” ఒకొక్కటీ ఎప్పటి కప్పుడు
శ్రీ దుర్గాప్రసాద్ గారు నాకు అంకితమివ్వాలనుకో వటo , నేను వాటి
స్వీకర్తులుగా సరియైనవారిని సూచించటం , వారు దానికి అంగీకరించటం
జరిగిపోయాయి . ఇప్పుడు “గీర్వాణకవుల కవితా గీర్వాణం” అంతర్జాలంలో
ధారావాహికంగా ప్రచురించిన దానిని నా ప్రమేయం లేకుండానే నాకు అంకిత
మివ్వటo నన్ను అమితాశ్చర్యాలకు గురిచేసింది . ఇంతటి పవిత్రమైన అమృతంలాoటి
రచనకు స్వీకర్త గా నాకున్న అర్హత శ్రీ దుర్గాప్రసాద్ గారికి నాయందున్న
అభిమానం మాత్రమే నని నా నిశ్చితాభిప్రాయం  .
తదుపరి , ఈవిషయాన్ని గురించి మేనకోడలు జ్యోతి తో సంభాషిస్తున్న సందర్భంలో
, జ్యోతి ఉత్సాహానికి నా ప్రోత్సాహం తోడై ఈ మహోన్నత విలువైన రచనను
పుస్తకరూపంగా ప్రచురిoచాలని, అందుకు జ్యోతి తoడ్రి గా రైన , మా పెద్దబావగారు
డా :  రాచకొండ నరసింహశర్మ గారి ఆశీస్సులతో ,అన్న సుధాకర్ , తమ్ముడు రమేష్,
చెల్లెలు సంధ్య(అంతా అమెరికా వాసులు ) లను కలుపుకొని సమిష్టిగా
ప్రాయోజకత్వం (స్పాన్సర్షిప్) వహించాలనుకొవటo , ఈసూచనకు శ్రీ
దుర్గాప్రసాద్ గారు  పచ్చజెండా ఊపటం ఒకదానివెంట ఒకటి దైవనిర్ణ యాలు గా
జరిగిపోయాయి.  వీరందరికీ నా ధన్యవాదాలు .

–మైనేని గోపాలకృష్ణ-  హన్ట్స్ హిల్  -అలబామా -అమెరికా  

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-

మనవి మాటలు

–                   రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

సాహితీ బంధువులకు శుభ కామనలు-సంస్కృత౦  లేక అమరభాష లేక గీర్వాణ బాషా కవుల సంక్షిప్త జీవితాన్ని వారి కవితా అమరత్వాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తులను ఈ తరం వారికి  పరిచయం చేయటానికి  ‘’గీర్వాణ కవుల కవితా  గీర్వాణం’’శీర్షకతో sసంస్కృత  కవుల పరిచయాన్ని చేయటానికి సాహసిస్తున్నానని సవినయం గా మనవి చేస్తున్నాను .146  మంది గీర్వాణ కవుల కవితా గీర్వాణమే ఇది .

శ్రీ చిలుకూరి నారాయణ రావు గారు రాసిన ‘’సంస్కృత కవుల చరిత్ర ‘’ ఎప్పుడో చదివిన గుర్తు మాత్రమె ఉంది .శీర్షిక మొదలు పెట్టి నాలుగైదు ఎపిసోడ్ లు రాసిన తర్వాత లైబ్రరీలో దానికోసం ప్రయత్నిస్తే లభించలేదు .వీకీపీడియా ఆధారం గానే మొదలు పెట్టాను .తర్వాత శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డి గారు పరిశోధన చేసి సంస్క్రుతకవి జీవితాలపై ఒక గ్రంధం రాశారని తెలిసి  మిత్రుడు శ్రీ కట్టుకోలు సుబ్బా రెడ్డి గారి దగ్గర ఉంటుందేమోనని వాకబు చేస్తే, ఉందని చెప్పి నాకు పంపించారు .కనుక ఈ వ్యాస పరంపరకు డాక్టర్ ముదిగంటి గోపాల రెడ్డి ,డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి గార్లు రచించిన ‘’సంస్కృత సాహిత్య చరిత్ర ‘’ముఖ్య ఆధారం అని మనవి చేస్తున్నాను .కాని ఇంకా కొత్త సంగతులేమైనా ఉన్నాయేమోనని గూగుల్ ను, తెలుగు వీకీ పీడయాలు వెతికి సేకరించి పొందుపరచాను .ముఖ్యం గా ఇంగ్లీష్ లో ఆయా గ్రంధాలను రాసిన వారు ఇంకా లోతుగా చర్చించి అనర్ఘ మణి రత్నాలను వెలువరించారు .వాటిని సేకరించి రాశాను  .యెంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఉంది అనే అసంతృప్తి నాకు ఉంది .దాదాపుగా కవుల కాలాన్నిబట్టి మొదలుపెట్టి రాశాను .    ఆధునిక యుగం లో కూడా ప్రసిద్ధులైన సంస్కృతకవులున్నారు. గొప్ప గ్రంధాలే రాశారు ..వారిని గురించి కూడా రాశాను.

సాహితీ బంధువులకు శుభ కామనలు .‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా ఇంగ్లాండ్ ,అమెరికా దేశపు 125 మంది పూర్వకవుల పై రాసి ప్రచురించిన తర్వాత ,నా మనసులో ఒక బాధ పీడిస్తూనే ఉంది .మన దేశ పూర్వ కవులపై ఇంతవరకు రాయలేక పోయానే అనేది మనసులో తొలుస్తూనే ఉంది .ముఖ్యం గా మన సాహిత్యానికి మూలం సంస్కృతం కనుక పూర్వ సంస్కృత కవులపై రాసి ఆ లోటు భర్తీ చేయాలని పించింది .శీర్షిక కోసం రెండు మూడు రోజులు ఆలోచిస్తే ఫ్లాష్ గా ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’పేరు స్పురించింది .వెంటనే రాయటం మొదలు పెట్టాను .అది పెరిగి పెరిగి విస్తృత రూపం దాల్చింది .మధ్యలో కొద్ది రోజులు విరామం తర్వాత కొన సాగించి ఈ రోజుకు 95 ఎపి సోడ్ లలో ,146మంది సంస్కృత కవుల గురించి రాశాను .నా అంతర్జాల రాత ప్రయత్నాలలో ఇది చాలా బృహత్తరమైనదే .నేను రాసినవి చాలా ప్రాధమిక విషయాలే .వారిగురించి తెలుసుకోవాల్సింది చాలా ఉండి ఉంటుంది నాకు లభించిన సోర్సు ల నుండి గ్రహించిణ సమాచారాన్ని  మీ కు తెలియ జేశాను అంతే .ఇంకా ఎందరో నా దృష్టికి రాని వారు ఉండవచ్చు .

ఇంత మంది సంస్కృత  మహా కవులు, రచయితలను సంస్మరించగలిగాను .వారి గురు పరంపరను స్పృశించి ధన్యమయ్యాను .ఇది నా అదృష్టం గా భావిస్తున్నాను .ఇంకా నా దృష్టికి రాని వారిగురించి తెలుసుకొని వారినీ చేర్చే ప్రయత్నం చేస్తాను .అంత వరకు ఈ శీర్షిక కు ‘’మరొక కామా లేక మరో విరామం ‘’గా భావించండి .ఆదరించిన వారందరికీ ధన్యవాదాతో కూడిన కృతజ్ఞతలు .

మరొక ముఖ్య విషయం –నేను ఎప్పటికప్పుడు తనకు అంకితం ఇద్దామను కొన్న నాలుగు పుస్తకాలను ఒకటి ‘’సిద్ద యోగి పుంగవులు’’ను  తమ తల్లిగారు  కీ శే .మైనేని సౌభాగ్యమ్మగారికి ,రెండవది’’మహిళా మాణిక్యాలు ‘’ను  తన అర్ధాంగి శ్రీమతి సత్య వతి గారికి ,మూడవది ‘’పూర్వాం గ్ల కవుల ముచ్చట్లు ‘’ను తన బావ గారు డాక్టర్  శ్రీ రాచకొండ నరసింహ శర్మ –ఏం డి గారికి కి  నాల్గవది ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’ను తన జీవితానికి మార్గ దర్శి అయిన ‘’కపటమెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి’’ శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అంకితం ఇవ్వమని చెప్పి ,ఇప్పించిన  స్పాన్సర్ గా ఉన్న ఉదార హృదయులు నాకు బహు ఆత్మీయులు ,సరసభారతి కి అత్యంత శ్రేయోభిలాషులు ,,మార్గ దర్శి శ్రీ మైనేని  గోపాల కృష్ణ –(అమెరికా )గారికి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అనే ఈ అంతర్జాల గ్రంధం ,అంతర్జాల సాక్షిగా –రూపాయి కూడా వారికీ నాకు ఖర్చు లేని విధం గా  వారి సాహిత్యాభి లాషకు ,సరస హృదయానికి ,సౌశీల్యతకు  స్నేహ ధర్మానికి మాతృ దేశాభిమానానికి మాతృభాషా భిమానానికి ,భారతీయ అధ్యాత్మకత పై ఉన్న గౌరవానికి ,  గుర్తింపు గా   10-1-2015న శ్రీ గోపాల కృష్ణ గారి 80 వ జన్మ దినోత్సవం సందర్భం గా ఇప్పుడే కృతజ్ఞతా పూర్వకం గా , చిరుకానుక గా ఈ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అంతర్జాల గ్రంధాన్ని  అంకితమిస్తున్నాను  .      ఇదేదో వారిని మభ్య పెట్టి గ్రంధ రూపం లో దీనిని తీసుకు రావానే ఆలోచన తో మాత్రం కాదని ,వారు ‘’ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న అంకిత విషయం ‘’పై నా  నిర్ణయమే నని సవినయం గా మనవి చేస్తున్నాను .వారికి తెలియ బరచ కుండా నే  నేను చేసిన ఈ సాహసానికి గోపాల కృష్ణ గారు సహృదయం తో అర్ధం చేసుకొంటారని భావిస్తున్నాను .

ఇది రాసిన సుమారు ఇరవై రోజులకు ఒక రోజు రాత్రి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అమెరికా నుండి ఫోన్ చేసి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ను పుస్తకం గా తీసుకొని రావటానికి తన మేన కోడలు ,తన బావ గారు డా .రాచకొండ నరసింహ శర్మ –ఏం. డి .గారి కుమార్తె  శ్రీమతి డాక్టర్ జ్యోతి ఉత్సాహం గా ఉందని  నేను ఒప్పుకొంటే వెంటనే ఆ పని ప్రారంభిద్దా౦  అన్నారు  .సంతోషం గా అంగీకరించాను .దీన్ని మార్చి 15 వ తేదీ సరసభారతి నిర్వహించే శ్రీ మన్మధ ఉగాది సంబరాలలోఆవిష్కరించాలని భావించాం .మర్నాడు ఉదయం శ్రీ చలపాక ప్రకాష్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పా .మీరందరూ అంత ఉత్సాహం గా ఉంటె సమయం రెండు నెలలే ఉన్నా ప్రయత్నించి గ్రంధాన్ని తెద్దాం .అన్నారు .ఏంతో ఆనందమేసింది ,ఇక పని ప్రారంభించాం ..ఇంతమంది సాహితీ మూర్తుల సహకారం లభించింది .అందుకే పుస్తకం ఈ రూపం దాల్చింది .దీనికి శ్రీమతి జ్యోతిగారినకి వారి సోదరే సోదరీమణులకు (అమెరికా) ,అంకితం తీసుకుంటున్న ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారికి ,ముద్రణ బాధ్యతలను మా తరఫున స్వీకరించిన శ్రీ చలపాక ప్రకాష్ గారికి కృతజ్ఞతలు .అడిగిందే తడవుగా పెద్ద మనసు తో అంగీకరించి గ్రంధానికి స్పూర్తి దాయక మైన ముందు మాట’’అంతరింద్రజాలం ‘’ రాసిన సహృదయ ఆత్మీయ సాహితీ మూర్తి డా.శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారికి కృతజ్ఞతాపూర్వక సహృదయ ప్రణామాలు  అందజేస్తున్నాను .సరసభారతి వీరందరికీ ఆత్మీయ ధన్యవాదాలు తెలియ జేస్తోంది

ఈ పుస్తకం సరసభారతి ప్రచురించిన 15 వ గ్రంధం నేను రాసిన 10 వ గ్రంధం .అంతర్జాలం లో నేను రాసిన ఆరవ పుస్తకం .ఇదంతా సరస్వతీ దేవికరుణా , మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారల అనుగ్రహం ,మా కుటుంబ సభ్యుల అందునా ముఖ్యం గా నా సతీమణి శ్రీమతి ప్రభావతి సహకారమే   అని సవినయం గా  మనవి చేస్తున్నాను ..

ఎందరో మహాను భావులు. అందరికి వందనములు

‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’గ్రంధ రచనకు సహకరించిన పుస్తకాలు

1-డా.శ్రీ ముదిగంటి గోపాల రెడ్డి ,డా.శ్రీమతి ముదిగంటి సుజాతాదేవి రాసిన ‘’సంస్కృత సాహిత్య చరిత్ర ‘’‘’

2- తెలుగు విజ్ఞాన సర్వస్వం  ,

3–20 వ శతాబ్ది తెలుగు వెలుగులు (1,2 భాగాలు )-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ

4-వీకీ పీడియా

మొదలైనవి

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు -ప్రత్యక్ష ప్రసారం

live link

సాహితీ బంధువులు శుభ కామనలు ఱెపు అంటే 15-3-15 ఆదివారం సరసభారతి 76 వ సమావేశం గా నిర్వహించే ”శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుక ల ”ను మధ్యాహ్నం 3-30 నుండి మీ కంప్యూటర్లలో  ప్రత్యక్షం గా  వీక్షించటానికి ఏర్పాటు చేశాం .  దూర ప్రాంతాల తెలుగువారు ,విదేశం లో ఉన్న తెలుగు వారు ఈ అవకాశాన్ని సద్విని యోగం చెసుకో వలసినదిగా మనవి-  దుర్గాప్రసాద్ 10688362_1028981593797438_939230920805912889_o

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

8 – 3 – 2015 ఆదివారం నాడు ఆంధ్రభూమి పత్రికలో మెరుపు పేజిలో సరసభారతి అధ్యక్షుడు గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన “దర్సనియ దైవక్షేత్రాలు” రచన పై రమ్యభారతి మాస పత్రిక సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారి సమీక్ష.

 

Click to access darsaneeya-punyakshetralu-bo.pdf

For other Books

Download Link


10423296_1028833710478893_5117056530410202525_n

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద

శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద sundarachari1 001 sundarachari2 001 sundarachari3 001 sundarachari4 001 sundarachari5 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేర్చుకున్నదిది అన్న పఠాభి -ప్రమిద

pathabhi1 001 pathabhi2 001 pathabhi3 001 pathabhi4 001 pathabhi5 001 pathabhi6 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుమారుడు రాహుల్ తో బుద్ధుడు –

rahul-buddha 2 001 rahul-buddha -3 001 rahul-buddha1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు

Added At : Sun, 03/08/2015 – 03:11

భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 తెలంగాణాలోని భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో 24, 329 మంది బస్తర్‌ వంటి కోరాపుట్‌ ప్రాంతాలలో మూడు లక్షల వరకు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల రెంటిలో ఉన్న గిరిజన జాతుల్లో కోయజాతి ఆదివాసీలు సంఖ్యా పరంగా ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందు చెప్పిన ప్రాంతాలలో వారు బాగా విస్తరించి వున్న, తూర్పు గోదా వరి, పశ్చిమగోదారి, ఖమ్మం, వరంగల్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో
కూడా వీరి సంఖ్య సుమారుగా కనిపిస్తుంటుంది. ఈ కోయ జాతి జనులు అటవీసంపదపై ఆధారపడి బతుకుతుంటారు. అడవితల్లే వారికికన్న తల్లిగా భావిస్తారు.
కోయల్లో వ్యవసాయం ముఖ్యవృత్తిగా జీవించేవారి సంఖ్య తక్కువేంకాదు. ఈ వ్యవసాయక తెగల్లో కొండదొర, కొండరెడ్డి, కోలం, తోటి, జతపు అనే వారు ముఖ్యులు. ఓరుగల్లు (వరంగల్‌) జిల్లాలో కోయలు అధికంగా నర్సంపేట, ములుగు, మహబూబా బాద్‌, ఇంకా ఖమ్మం జిల్లాలో భద్రా చలం కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గుం పాడు, నూగూరు,మధిర, పాల్వంచ మొదలైన చోట్ల కనిపిస్తుంటారు. నాలుగు జిల్లాలో కలిసివారి సంఖ్య దాదాపు 14.33 లక్షలుంటారు.
4.92 లక్షల మంది వరకూ భూమిని సాగుచేసుకుంటూ వ్యవ సాయం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా భూమి పుట్రాలేని వారైతే 1.50 లక్షల వరకూ ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరు గతంలో ఎన్నో రాజకీయ పోరాటాలలో పాల్గొన్న దాఖలు కనిపిస్తున్నాయి. వాటిలో 1969లో శ్రీకాకుళ గిరిజ నోద్యమం కొండమొదలు గిరిజనపోరాటం, తెభాగా గిరిజన పోరాటం ప్రధానమైనవిగా చెప్పుకోవాలి.
బేరీజు వేసి చెప్పుకోవాల్సి వస్తే ఈ కోయజనం ఒక్క శ్రీకాకుళ గిరిజనోధ్యమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారంటే అతిశయోక్తికాదు. ఇదే మాదిరిగా నేటి తెలంగాణాలోని ఆది లాబాద్‌ లోగల ఇంద్రవెల్లిలోకూడ ఉద్యమంలో 13మంది గిరిజ నులు కాలగర్భంలో కలిసి పోయి సంగతి అసత్యం మాత్రం కాదు. కోయజాతిలో అధికంగా తెలుగుభాష, ఇదే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. కొన్ని అక్కడ కొండ ప్రాంతపు మండలి కాలకూడా వారి భాషలో చోటు చేసుకున్నాయి. వీరిని గుర్తించి ప్రత్యేకించి చెప్పాల్సొస్తే ముఖ్యంగా నక్సలైట్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. 1970 సంవత్సరం నుంచి ఈ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కోయలలో ఒక్క ఆదిలాబాద్‌లోనే 18
ఉపజాతులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఖమ్మం, కరీంనగర్‌, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వీరి ఉపజాతులుగా ఈ విధంగా చెబుతున్నారు. అవి రాజకీయ గుత్తకోయ, (గొత్తి), అడవికోయ, డొల్లకోయ, బొమ్మకోయ, మన్నెకోయ, చిత్తకోయ, పుష్టికోయ, లింగకోయ మొదలైన వర్గాలుగా చెప్పుకోవడం పరిపాటి.
మనం పైన చెప్పుకున్న వేకాకుండా వారివారి వృత్తిపరమైన విభజన చేస్తూ మరికొన్ని అవాంతర విభాగాలుగా చేసి పిలవడంకూడా పరిశీలిద్దాం! కమ్మరి కోయ (వీరు పని ముట్లు తయారు చేసేవాళ్లు) కావ చ్చు, ముసరకోయ, ఒడ్డి కోయ, వీళ్లంతా అటవీ సంబంధమైన సంపదపైన ఆధారపడి బతు కుతుంటారు. కొండదేవర పేరు, చెబుతూ కొందరు పల్లెలు, గ్రామాలు పట్టణాలలో తిరుగుతూ జ్యోతిష్యం చెప్పటం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం! వీరు అడవుల్లో సంచారం చేస్తూ బెల్లం, తేనె, చింతపండు, మూలికలు, జింక చర్మాలు, వేర్లు, పులిచర్మాలు, పులి గోళ్లు, పాము చర్మాలు, జీడిపప్పు, ఇప్పపువ్వు, తునికాకు, కరకోయలు, వేపతేనె, పులినెయ్యి, గోందు లేక బంక (జిగుర్లు) ఉసిరి కాయలు మొదలైనవి భాగా సేకరిస్తుంటారు. వాటిని ఎంత దూరమైనా వెళ్లి అమ్ముకుపోతుంటారు. బాగా రేటు బాగా పలికితే బజార్లలో గాని విక్రిస్తారు. వారు వెదురు బొంగులు, కారెగడ్డి, తుంగతతో (అదొకరమైన గడ్డి) గుడిసెలు వేసుకుని గూడేలలో జీవిస్తుంటారు. ఎడమ చేతి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కోయస్త్రీలలో బాగా ఉంది. ఎక్కువగా హిందూ సాంఘీక ఆచారాలే వీరు పాటిస్తుంటారు. హిందువుల పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన వాటిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా వీరికి భూమాత, మూర్పక, అమ్మోరు మొదలైన పండుగ జాతర్లు నిర్వహించడం గమనించవలసిన అంశం.
పాటలు పాడుతూ ఆడుతూ ఉన్నప్పుడు తలలపై మగవారు పశువుల తలలతో చేసిన కిరీటం లాంటి దాన్ని ధరించే అలవాటు ఈ కోయ జాతివారికి వుంది. డప్పులు, బూరలు వాయిస్తూ స్త్రీ పురుషులున్నట్లు చేస్తారు. అమ్మోరు జాతరలో ఎన్నో మేకలను, గొర్రెలను బలిస్తుండటం వీరికి అనాదిగావస్తున్న ఆచారం. ఒకానొకప్పుడు అనాగరికులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లన్ని
కన్నెపిల్లల్ని బలిచ్చే సంప్రదాయం ఉండేదట. పిల్లాపాపలు పాడి పంటలు బాగా పండాలని వారి క్షేమం కోసం ఈ జాతర్లు చేస్తుంటారు. వరంగల్‌ జిల్లాలో గల సమ్మక్క-సారలమ్మ జాతర ఇంకా మగద పూర్ణిమ రోజున జరిగే కోయ జాతర్లు పేరు పొందాయి. తెలంగాణా ప్రాంతంలో నివసించే కోయజాతులే వంశ పారంపర్యంగా లింగదారి, కోయ, రాజకోయ, కమ్మర, అరితదోలు అనే శాఖలు కనిపిస్తుంటాయి. కోయగ్రామ పెద్దమ్మను ముత్యాలమ్మ, లేక దేవర అని వ్యవహరిస్తుంటారు. గూడేల్లో ఎలాంటి నేరాలు జరిగినా వీరి సమక్షంంలో అవి విచారించ బడతాయి.
ఈ కోయజాతి కోయగూడెంలో పదవులు వారి వారి వంశ పారం పర్యంగా సంక్రమిస్తుంటాయి. ఆస్తి పంపకాలు కూడా ఇదే పంథాలో సాగు తుంది. వారి 15 గ్రామాలు కలిసి ఒక సమితి ఉంటుంది. బలమైన ఈ గిరిజన సాంఘీక ఐక్యత ముందు నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఏదైనా తప్పుచేసాక అది అబద్ధం కాదని వారి కోయజాతిలో ఎవరైనా ఆవుతో కనుకళ్లకు కట్టుకుని ప్రమాణం చెయ్యాల్సివుంటుంది. వీరి జాతిలో పెళ్లిళ్లు మూడు రోజులు జరుగుతాయి. వీరి వ్యవసాయ క్షేత్రాలు సమిష్టి ఆస్తిగా పరిగణింపబడుతుంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో వీరి భూములను తెల్లవారు బలంతంగా పరాయి కరణం చేసారు. వార్ని వారి భూముల నుంచి వెళ్లగొట్లడం చెప్పుకోదగిన అంశం. వీరిలో పెద్ద దొరకు కోయగూడెంలో భూముని అమ్మే అధికారమం మాత్రం ఉంటుంది. గిరిజనేతరులు ఈ మధ్య కాలంలో అడవుల్లో ప్రవేశించి అడవ లను నరికి నందువల్ల కోయ జాతి వలస పోవడం ప్రారంభించింది. పోడు వ్యవసాయం చేసుకుని జీవించే వీరి గుడిసెలు పొలాలకు ఆనుకునే నిర్మించు కుంటారు.
పెండ్లి విషయకంగా చెప్పాల్సి వచ్చినట్లైతే పెళ్లికొడుకు పెండ్లికుమార్తెకి చెందిన రెండు కుటుంబాల మధ్యతో సరిపెట్టుకోరు. ఆ ఇద్దరి తండాలు అంటే గ్రామాలలో పెండ్లి జరుగుతుంది. ప్రజ లంతా ఈ వివాహ వేడుకలో పాలు పంచుకుంటారు. అయితే ఈ పెండ్లి తంతులో పాల్గొనే ప్రతికోయ వ్యక్తీ కొంత ధాన్యం, మద్యం పట్టుకొని వస్తారు. మగ పెళ్లి వారు, ఆడపెళ్లి వారికి పెండ్లి నిశ్చయం చేసుకున్న రోజున రెండు కడవల మద్యం, ఆడమగ రెండు మేకలు, ఒక గొడ్డలి, పువ్వులు ఇస్తారు. బహుశా ఇది కన్యాశుల్కమే మోమరి. ఈ కోయ కుటుంబాలను కుతుం అనివ్యవహరిస్తుంటారు. ఒక స్త్రీకి ఒకే భర్త అన్నదే ప్రాచుర్యంలో ఉంది. వీరి భౌగోళిక పరిసరాలను ముతా అంటారు.వీరిలో సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో సాగుతాయ.
కోయజాతి జనులు నేడు వ్యవసాయానికి ఎన్ని ఆధునిక పద్ధతులను అవతలించినా అనాదిగా వస్తున్న అనుష్ఠానాలకు వారు విస్మరించక పోవడం విశేషం. ఆ అనుష్ఠాలివి 1. విత్తనాలు వేసే దానికి ముందు కావించే అనుష్టానం 2. కాలనిర్ణయం కోసం సుంకువేయటం 3. విత్తనం వేసేముందు చేసే అనుష్ఠానం 4. పంటకు తెగులు తగిలితే చేసే అనుష్టానం వరి పొట్టుకు వచ్చిన ప్పుడు చేసే అనుష్టానం 6. వరి చెెనుకోసేటప్పుడు అనుష్టానం 7. వరి కోసిన తర్వాత చేసే అనుష్టానం ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం, ప్రాంతవాసులైన కోయజాతులే ప్రసిద్ధంగా నేటికీ కొన సాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో కొన్ని వైయ్యక్తిక ములైతే మరికొన్ని సామూహికాం షాలని చెప్పు కోవచ్చును.
ఈ జాతివారిలో కొందరు కోయపూజారులుంటారు. నమ్మ కాలు విశ్వాసాలు వీరిలో బాగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇదే ప్రాంతంలో శానాపురం అనే ఊళ్లో ఒకరింట్లో చీపురు దయ్యం ఉండేదట. అతగాడు కళ్లం వేస్తే ఆ ఊళ్లో మరెవ్వరూ కళ్లంవేయరు. ఆ ఇంటి యజమాని కల్లం అయిపోయాక ఒకరి తర్వాత ఒకరు వేయాలి. ఇదేం వింత ఆచారామో వీరు విత్తనాలు జల్లే ముందు భూదేవికి భూమి దేవర పండుగ అనేదాన్ని చేస్తారు. ఆపండుగ రోజు పందిని బలిస్తారు. దీనికి పూర్వగాధ ఏమైనా ఉందా అంటే ఉన్నట్లు చెబుతారు. మన ఇతిహాసాలలో హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టుతుండగా భూమిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన అంశం ప్రస్తావన కొస్తుంది. ముఖ్యంగా ఈ కోయతెగల్లో పాండవులు అడుగిడిన చోటు చాలా పవిత్రమైన దిగా భావిస్తారు. పంటలకు చీడలు పడితే కొడిశ ఆకునీరు పోయే మొదళ్లలో నీరు పోయేదారిలో వేస్త్‌ ఆ పురుగులు నివారించ వచ్చన్న బలమైన నమ్మకం వారికి ఉంది. ఇది శాస్త్రీయ దృక్పధమా! అశాస్త్రీయమా అన్నది వారి ఆలోచనల్లోకి రాదు. పెద్ద వెంకటాపురం అనే గ్రామంలో బుడుగుమైసమ్మ ఉంది. ఆమెను వీరు బాగాఆరాధిస్తుంటారు.
ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!చఙిిఈడొ ఖిొటసిికోయజాతి గిరిజనులు
సంస్క ృతి సంప్రదాయాలు
dŸ్శdŸా ొ dŸ్శ్ఘŸ్ష‘ిలిి
భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 తెలంగాణాలోని భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో 24, 329 మంది బస్తర్‌ వంటి కోరాపుట్‌ ప్రాంతాలలో మూడు లక్షల వరకు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల రెంటిలో ఉన్న గిరిజన జాతుల్లో కోయజాతి ఆదివాసీలు సంఖ్యా పరంగా ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందు చెప్పిన ప్రాంతాలలో వారు బాగా విస్తరించి వున్న, తూర్పు గోదా వరి, పశ్చిమగోదారి, ఖమ్మం, వరంగల్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో
కూడా వీరి సంఖ్య సుమారుగా కనిపిస్తుంటుంది. ఈ కోయ జాతి జనులు అటవీసంపదపై ఆధారపడి బతుకుతుంటారు. అడవితల్లే వారికికన్న తల్లిగా భావిస్తారు.
కోయల్లో వ్యవసాయం ముఖ్యవృత్తిగా జీవించేవారి సంఖ్య తక్కువేంకాదు. ఈ వ్యవసాయక తెగల్లో కొండదొర, కొండరెడ్డి, కోలం, తోటి, జతపు అనే వారు ముఖ్యులు. ఓరుగల్లు (వరంగల్‌) జిల్లాలో కోయలు అధికంగా నర్సంపేట, ములుగు, మహబూబా బాద్‌, ఇంకా ఖమ్మం జిల్లాలో భద్రా చలం కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గుం పాడు, నూగూరు,మధిర, పాల్వంచ మొదలైన చోట్ల కనిపిస్తుంటారు. నాలుగు జిల్లాలో కలిసివారి సంఖ్య దాదాపు 14.33 లక్షలుంటారు.
4.92 లక్షల మంది వరకూ భూమిని సాగుచేసుకుంటూ వ్యవ సాయం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా భూమి పుట్రాలేని వారైతే 1.50 లక్షల వరకూ ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరు గతంలో ఎన్నో రాజకీయ పోరాటాలలో పాల్గొన్న దాఖలు కనిపిస్తున్నాయి. వాటిలో 1969లో శ్రీకాకుళ గిరిజ నోద్యమం కొండమొదలు గిరిజనపోరాటం, తెభాగా గిరిజన పోరాటం ప్రధానమైనవిగా చెప్పుకోవాలి.
బేరీజు వేసి చెప్పుకోవాల్సి వస్తే ఈ కోయజనం ఒక్క శ్రీకాకుళ గిరిజనోధ్యమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారంటే అతిశయోక్తికాదు. ఇదే మాదిరిగా నేటి తెలంగాణాలోని ఆది లాబాద్‌ లోగల ఇంద్రవెల్లిలోకూడ ఉద్యమంలో 13మంది గిరిజ నులు కాలగర్భంలో కలిసి పోయి సంగతి అసత్యం మాత్రం కాదు. కోయజాతిలో అధికంగా తెలుగుభాష, ఇదే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. కొన్ని అక్కడ కొండ ప్రాంతపు మండలి కాలకూడా వారి భాషలో చోటు చేసుకున్నాయి. వీరిని గుర్తించి ప్రత్యేకించి చెప్పాల్సొస్తే ముఖ్యంగా నక్సలైట్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. 1970 సంవత్సరం నుంచి ఈ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కోయలలో ఒక్క ఆదిలాబాద్‌లోనే 18
ఉపజాతులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఖమ్మం, కరీంనగర్‌, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వీరి ఉపజాతులుగా ఈ విధంగా చెబుతున్నారు. అవి రాజకీయ గుత్తకోయ, (గొత్తి), అడవికోయ, డొల్లకోయ, బొమ్మకోయ, మన్నెకోయ, చిత్తకోయ, పుష్టికోయ, లింగకోయ మొదలైన వర్గాలుగా చెప్పుకోవడం పరిపాటి.
మనం పైన చెప్పుకున్న వేకాకుండా వారివారి వృత్తిపరమైన విభజన చేస్తూ మరికొన్ని అవాంతర విభాగాలుగా చేసి పిలవడంకూడా పరిశీలిద్దాం! కమ్మరి కోయ (వీరు పని ముట్లు తయారు చేసేవాళ్లు) కావ చ్చు, ముసరకోయ, ఒడ్డి కోయ, వీళ్లంతా అటవీ సంబంధమైన సంపదపైన ఆధారపడి బతు కుతుంటారు. కొండదేవర పేరు, చెబుతూ కొందరు పల్లెలు, గ్రామాలు పట్టణాలలో తిరుగుతూ జ్యోతిష్యం చెప్పటం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం! వీరు అడవుల్లో సంచారం చేస్తూ బెల్లం, తేనె, చింతపండు, మూలికలు, జింక చర్మాలు, వేర్లు, పులిచర్మాలు, పులి గోళ్లు, పాము చర్మాలు, జీడిపప్పు, ఇప్పపువ్వు, తునికాకు, కరకోయలు, వేపతేనె, పులినెయ్యి, గోందు లేక బంక (జిగుర్లు) ఉసిరి కాయలు మొదలైనవి భాగా సేకరిస్తుంటారు. వాటిని ఎంత దూరమైనా వెళ్లి అమ్ముకుపోతుంటారు. బాగా రేటు బాగా పలికితే బజార్లలో గాని విక్రిస్తారు. వారు వెదురు బొంగులు, కారెగడ్డి, తుంగతతో (అదొకరమైన గడ్డి) గుడిసెలు వేసుకుని గూడేలలో జీవిస్తుంటారు. ఎడమ చేతి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కోయస్త్రీలలో బాగా ఉంది. ఎక్కువగా హిందూ సాంఘీక ఆచారాలే వీరు పాటిస్తుంటారు. హిందువుల పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన వాటిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా వీరికి భూమాత, మూర్పక, అమ్మోరు మొదలైన పండుగ జాతర్లు నిర్వహించడం గమనించవలసిన అంశం.
పాటలు పాడుతూ ఆడుతూ ఉన్నప్పుడు తలలపై మగవారు పశువుల తలలతో చేసిన కిరీటం లాంటి దాన్ని ధరించే అలవాటు ఈ కోయ జాతివారికి వుంది. డప్పులు, బూరలు వాయిస్తూ స్త్రీ పురుషులున్నట్లు చేస్తారు. అమ్మోరు జాతరలో ఎన్నో మేకలను, గొర్రెలను బలిస్తుండటం వీరికి అనాదిగావస్తున్న ఆచారం. ఒకానొకప్పుడు అనాగరికులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లన్ని
కన్నెపిల్లల్ని బలిచ్చే సంప్రదాయం ఉండేదట. పిల్లాపాపలు పాడి పంటలు బాగా పండాలని వారి క్షేమం కోసం ఈ జాతర్లు చేస్తుంటారు. వరంగల్‌ జిల్లాలో గల సమ్మక్క-సారలమ్మ జాతర ఇంకా మగద పూర్ణిమ రోజున జరిగే కోయ జాతర్లు పేరు పొందాయి. తెలంగాణా ప్రాంతంలో నివసించే కోయజాతులే వంశ పారంపర్యంగా లింగదారి, కోయ, రాజకోయ, కమ్మర, అరితదోలు అనే శాఖలు కనిపిస్తుంటాయి. కోయగ్రామ పెద్దమ్మను ముత్యాలమ్మ, లేక దేవర అని వ్యవహరిస్తుంటారు. గూడేల్లో ఎలాంటి నేరాలు జరిగినా వీరి సమక్షంంలో అవి విచారించ బడతాయి.
ఈ కోయజాతి కోయగూడెంలో పదవులు వారి వారి వంశ పారం పర్యంగా సంక్రమిస్తుంటాయి. ఆస్తి పంపకాలు కూడా ఇదే పంథాలో సాగు తుంది. వారి 15 గ్రామాలు కలిసి ఒక సమితి ఉంటుంది. బలమైన ఈ గిరిజన సాంఘీక ఐక్యత ముందు నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఏదైనా తప్పుచేసాక అది అబద్ధం కాదని వారి కోయజాతిలో ఎవరైనా ఆవుతో కనుకళ్లకు కట్టుకుని ప్రమాణం చెయ్యాల్సివుంటుంది. వీరి జాతిలో పెళ్లిళ్లు మూడు రోజులు జరుగుతాయి. వీరి వ్యవసాయ క్షేత్రాలు సమిష్టి ఆస్తిగా పరిగణింపబడుతుంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో వీరి భూములను తెల్లవారు బలంతంగా పరాయి కరణం చేసారు. వార్ని వారి భూముల నుంచి వెళ్లగొట్లడం చెప్పుకోదగిన అంశం. వీరిలో పెద్ద దొరకు కోయగూడెంలో భూముని అమ్మే అధికారమం మాత్రం ఉంటుంది. గిరిజనేతరులు ఈ మధ్య కాలంలో అడవుల్లో ప్రవేశించి అడవ లను నరికి నందువల్ల కోయ జాతి వలస పోవడం ప్రారంభించింది. పోడు వ్యవసాయం చేసుకుని జీవించే వీరి గుడిసెలు పొలాలకు ఆనుకునే నిర్మించు కుంటారు.
పెండ్లి విషయకంగా చెప్పాల్సి వచ్చినట్లైతే పెళ్లికొడుకు పెండ్లికుమార్తెకి చెందిన రెండు కుటుంబాల మధ్యతో సరిపెట్టుకోరు. ఆ ఇద్దరి తండాలు అంటే గ్రామాలలో పెండ్లి జరుగుతుంది. ప్రజ లంతా ఈ వివాహ వేడుకలో పాలు పంచుకుంటారు. అయితే ఈ పెండ్లి తంతులో పాల్గొనే ప్రతికోయ వ్యక్తీ కొంత ధాన్యం, మద్యం పట్టుకొని వస్తారు. మగ పెళ్లి వారు, ఆడపెళ్లి వారికి పెండ్లి నిశ్చయం చేసుకున్న రోజున రెండు కడవల మద్యం, ఆడమగ రెండు మేకలు, ఒక గొడ్డలి, పువ్వులు ఇస్తారు. బహుశా ఇది కన్యాశుల్కమే మోమరి. ఈ కోయ కుటుంబాలను కుతుం అనివ్యవహరిస్తుంటారు. ఒక స్త్రీకి ఒకే భర్త అన్నదే ప్రాచుర్యంలో ఉంది. వీరి భౌగోళిక పరిసరాలను ముతా అంటారు.వీరిలో సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో సాగుతాయ.
కోయజాతి జనులు నేడు వ్యవసాయానికి ఎన్ని ఆధునిక పద్ధతులను అవతలించినా అనాదిగా వస్తున్న అనుష్ఠానాలకు వారు విస్మరించక పోవడం విశేషం. ఆ అనుష్ఠాలివి 1. విత్తనాలు వేసే దానికి ముందు కావించే అనుష్టానం 2. కాలనిర్ణయం కోసం సుంకువేయటం 3. విత్తనం వేసేముందు చేసే అనుష్ఠానం 4. పంటకు తెగులు తగిలితే చేసే అనుష్టానం వరి పొట్టుకు వచ్చిన ప్పుడు చేసే అనుష్టానం 6. వరి చెెనుకోసేటప్పుడు అనుష్టానం 7. వరి కోసిన తర్వాత చేసే అనుష్టానం ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం, ప్రాంతవాసులైన కోయజాతులే ప్రసిద్ధంగా నేటికీ కొన సాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో కొన్ని వైయ్యక్తిక ములైతే మరికొన్ని సామూహికాం షాలని చెప్పు కోవచ్చును.
ఈ జాతివారిలో కొందరు కోయపూజారులుంటారు. నమ్మ కాలు విశ్వాసాలు వీరిలో బాగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇదే ప్రాంతంలో శానాపురం అనే ఊళ్లో ఒకరింట్లో చీపురు దయ్యం ఉండేదట. అతగాడు కళ్లం వేస్తే ఆ ఊళ్లో మరెవ్వరూ కళ్లంవేయరు. ఆ ఇంటి యజమాని కల్లం అయిపోయాక ఒకరి తర్వాత ఒకరు వేయాలి. ఇదేం వింత ఆచారామో వీరు విత్తనాలు జల్లే ముందు భూదేవికి భూమి దేవర పండుగ అనేదాన్ని చేస్తారు. ఆపండుగ రోజు పందిని బలిస్తారు. దీనికి పూర్వగాధ ఏమైనా ఉందా అంటే ఉన్నట్లు చెబుతారు. మన ఇతిహాసాలలో హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టుతుండగా భూమిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన అంశం ప్రస్తావన కొస్తుంది. ముఖ్యంగా ఈ కోయతెగల్లో పాండవులు అడుగిడిన చోటు చాలా పవిత్రమైన దిగా భావిస్తారు. పంటలకు చీడలు పడితే కొడిశ ఆకునీరు పోయే మొదళ్లలో నీరు పోయేదారిలో వేస్త్‌ ఆ పురుగులు నివారించ వచ్చన్న బలమైన నమ్మకం వారికి ఉంది. ఇది శాస్త్రీయ దృక్పధమా! అశాస్త్రీయమా అన్నది వారి ఆలోచనల్లోకి రాదు. పెద్ద వెంకటాపురం అనే గ్రామంలో బుడుగుమైసమ్మ ఉంది. ఆమెను వీరు బాగాఆరాధిస్తుంటారు.
ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!కోయజాతి గిరిజనులు
సంస్క ృతి సంప్రదాయాలు
భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 తెలంగాణాలోని భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో 24, 329 మంది బస్తర్‌ వంటి కోరాపుట్‌ ప్రాంతాలలో మూడు లక్షల వరకు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల రెంటిలో ఉన్న గిరిజన జాతుల్లో కోయజాతి ఆదివాసీలు సంఖ్యా పరంగా ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందు చెప్పిన ప్రాంతాలలో వారు బాగా విస్తరించి వున్న, తూర్పు గోదా వరి, పశ్చిమగోదారి, ఖమ్మం, వరంగల్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో
కూడా వీరి సంఖ్య సుమారుగా కనిపిస్తుంటుంది. ఈ కోయ జాతి జనులు అటవీసంపదపై ఆధారపడి బతుకుతుంటారు. అడవితల్లే వారికికన్న తల్లిగా భావిస్తారు.
కోయల్లో వ్యవసాయం ముఖ్యవృత్తిగా జీవించేవారి సంఖ్య తక్కువేంకాదు. ఈ వ్యవసాయక తెగల్లో కొండదొర, కొండరెడ్డి, కోలం, తోటి, జతపు అనే వారు ముఖ్యులు. ఓరుగల్లు (వరంగల్‌) జిల్లాలో కోయలు అధికంగా నర్సంపేట, ములుగు, మహబూబా బాద్‌, ఇంకా ఖమ్మం జిల్లాలో భద్రా చలం కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గుం పాడు, నూగూరు,మధిర, పాల్వంచ మొదలైన చోట్ల కనిపిస్తుంటారు. నాలుగు జిల్లాలో కలిసివారి సంఖ్య దాదాపు 14.33 లక్షలుంటారు.
4.92 లక్షల మంది వరకూ భూమిని సాగుచేసుకుంటూ వ్యవ సాయం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా భూమి పుట్రాలేని వారైతే 1.50 లక్షల వరకూ ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరు గతంలో ఎన్నో రాజకీయ పోరాటాలలో పాల్గొన్న దాఖలు కనిపిస్తున్నాయి. వాటిలో 1969లో శ్రీకాకుళ గిరిజ నోద్యమం కొండమొదలు గిరిజనపోరాటం, తెభాగా గిరిజన పోరాటం ప్రధానమైనవిగా చెప్పుకోవాలి.
బేరీజు వేసి చెప్పుకోవాల్సి వస్తే ఈ కోయజనం ఒక్క శ్రీకాకుళ గిరిజనోధ్యమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారంటే అతిశయోక్తికాదు. ఇదే మాదిరిగా నేటి తెలంగాణాలోని ఆది లాబాద్‌ లోగల ఇంద్రవెల్లిలోకూడ ఉద్యమంలో 13మంది గిరిజ నులు కాలగర్భంలో కలిసి పోయి సంగతి అసత్యం మాత్రం కాదు. కోయజాతిలో అధికంగా తెలుగుభాష, ఇదే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. కొన్ని అక్కడ కొండ ప్రాంతపు మండలి కాలకూడా వారి భాషలో చోటు చేసుకున్నాయి. వీరిని గుర్తించి ప్రత్యేకించి చెప్పాల్సొస్తే ముఖ్యంగా నక్సలైట్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. 1970 సంవత్సరం నుంచి ఈ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కోయలలో ఒక్క ఆదిలాబాద్‌లోనే 18
ఉపజాతులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఖమ్మం, కరీంనగర్‌, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వీరి ఉపజాతులుగా ఈ విధంగా చెబుతున్నారు. అవి రాజకీయ గుత్తకోయ, (గొత్తి), అడవికోయ, డొల్లకోయ, బొమ్మకోయ, మన్నెకోయ, చిత్తకోయ, పుష్టికోయ, లింగకోయ మొదలైన వర్గాలుగా చెప్పుకోవడం పరిపాటి.
మనం పైన చెప్పుకున్న వేకాకుండా వారివారి వృత్తిపరమైన విభజన చేస్తూ మరికొన్ని అవాంతర విభాగాలుగా చేసి పిలవడంకూడా పరిశీలిద్దాం! కమ్మరి కోయ (వీరు పని ముట్లు తయారు చేసేవాళ్లు) కావ చ్చు, ముసరకోయ, ఒడ్డి కోయ, వీళ్లంతా అటవీ సంబంధమైన సంపదపైన ఆధారపడి బతు కుతుంటారు. కొండదేవర పేరు, చెబుతూ కొందరు పల్లెలు, గ్రామాలు పట్టణాలలో తిరుగుతూ జ్యోతిష్యం చెప్పటం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం! వీరు అడవుల్లో సంచారం చేస్తూ బెల్లం, తేనె, చింతపండు, మూలికలు, జింక చర్మాలు, వేర్లు, పులిచర్మాలు, పులి గోళ్లు, పాము చర్మాలు, జీడిపప్పు, ఇప్పపువ్వు, తునికాకు, కరకోయలు, వేపతేనె, పులినెయ్యి, గోందు లేక బంక (జిగుర్లు) ఉసిరి కాయలు మొదలైనవి భాగా సేకరిస్తుంటారు. వాటిని ఎంత దూరమైనా వెళ్లి అమ్ముకుపోతుంటారు. బాగా రేటు బాగా పలికితే బజార్లలో గాని విక్రిస్తారు. వారు వెదురు బొంగులు, కారెగడ్డి, తుంగతతో (అదొకరమైన గడ్డి) గుడిసెలు వేసుకుని గూడేలలో జీవిస్తుంటారు. ఎడమ చేతి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కోయస్త్రీలలో బాగా ఉంది. ఎక్కువగా హిందూ సాంఘీక ఆచారాలే వీరు పాటిస్తుంటారు. హిందువుల పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన వాటిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా వీరికి భూమాత, మూర్పక, అమ్మోరు మొదలైన పండుగ జాతర్లు నిర్వహించడం గమనించవలసిన అంశం.
పాటలు పాడుతూ ఆడుతూ ఉన్నప్పుడు తలలపై మగవారు పశువుల తలలతో చేసిన కిరీటం లాంటి దాన్ని ధరించే అలవాటు ఈ కోయ జాతివారికి వుంది. డప్పులు, బూరలు వాయిస్తూ స్త్రీ పురుషులున్నట్లు చేస్తారు. అమ్మోరు జాతరలో ఎన్నో మేకలను, గొర్రెలను బలిస్తుండటం వీరికి అనాదిగావస్తున్న ఆచారం. ఒకానొకప్పుడు అనాగరికులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లన్ని
కన్నెపిల్లల్ని బలిచ్చే సంప్రదాయం ఉండేదట. పిల్లాపాపలు పాడి పంటలు బాగా పండాలని వారి క్షేమం కోసం ఈ జాతర్లు చేస్తుంటారు. వరంగల్‌ జిల్లాలో గల సమ్మక్క-సారలమ్మ జాతర ఇంకా మగద పూర్ణిమ రోజున జరిగే కోయ జాతర్లు పేరు పొందాయి. తెలంగాణా ప్రాంతంలో నివసించే కోయజాతులే వంశ పారంపర్యంగా లింగదారి, కోయ, రాజకోయ, కమ్మర, అరితదోలు అనే శాఖలు కనిపిస్తుంటాయి. కోయగ్రామ పెద్దమ్మను ముత్యాలమ్మ, లేక దేవర అని వ్యవహరిస్తుంటారు. గూడేల్లో ఎలాంటి నేరాలు జరిగినా వీరి సమక్షంంలో అవి విచారించ బడతాయి.
ఈ కోయజాతి కోయగూడెంలో పదవులు వారి వారి వంశ పారం పర్యంగా సంక్రమిస్తుంటాయి. ఆస్తి పంపకాలు కూడా ఇదే పంథాలో సాగు తుంది. వారి 15 గ్రామాలు కలిసి ఒక సమితి ఉంటుంది. బలమైన ఈ గిరిజన సాంఘీక ఐక్యత ముందు నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఏదైనా తప్పుచేసాక అది అబద్ధం కాదని వారి కోయజాతిలో ఎవరైనా ఆవుతో కనుకళ్లకు కట్టుకుని ప్రమాణం చెయ్యాల్సివుంటుంది. వీరి జాతిలో పెళ్లిళ్లు మూడు రోజులు జరుగుతాయి. వీరి వ్యవసాయ క్షేత్రాలు సమిష్టి ఆస్తిగా పరిగణింపబడుతుంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో వీరి భూములను తెల్లవారు బలంతంగా పరాయి కరణం చేసారు. వార్ని వారి భూముల నుంచి వెళ్లగొట్లడం చెప్పుకోదగిన అంశం. వీరిలో పెద్ద దొరకు కోయగూడెంలో భూముని అమ్మే అధికారమం మాత్రం ఉంటుంది. గిరిజనేతరులు ఈ మధ్య కాలంలో అడవుల్లో ప్రవేశించి అడవ లను నరికి నందువల్ల కోయ జాతి వలస పోవడం ప్రారంభించింది. పోడు వ్యవసాయం చేసుకుని జీవించే వీరి గుడిసెలు పొలాలకు ఆనుకునే నిర్మించు కుంటారు.
పెండ్లి విషయకంగా చెప్పాల్సి వచ్చినట్లైతే పెళ్లికొడుకు పెండ్లికుమార్తెకి చెందిన రెండు కుటుంబాల మధ్యతో సరిపెట్టుకోరు. ఆ ఇద్దరి తండాలు అంటే గ్రామాలలో పెండ్లి జరుగుతుంది. ప్రజ లంతా ఈ వివాహ వేడుకలో పాలు పంచుకుంటారు. అయితే ఈ పెండ్లి తంతులో పాల్గొనే ప్రతికోయ వ్యక్తీ కొంత ధాన్యం, మద్యం పట్టుకొని వస్తారు. మగ పెళ్లి వారు, ఆడపెళ్లి వారికి పెండ్లి నిశ్చయం చేసుకున్న రోజున రెండు కడవల మద్యం, ఆడమగ రెండు మేకలు, ఒక గొడ్డలి, పువ్వులు ఇస్తారు. బహుశా ఇది కన్యాశుల్కమే మోమరి. ఈ కోయ కుటుంబాలను కుతుం అనివ్యవహరిస్తుంటారు. ఒక స్త్రీకి ఒకే భర్త అన్నదే ప్రాచుర్యంలో ఉంది. వీరి భౌగోళిక పరిసరాలను ముతా అంటారు.వీరిలో సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో సాగుతాయ.
కోయజాతి జనులు నేడు వ్యవసాయానికి ఎన్ని ఆధునిక పద్ధతులను అవతలించినా అనాదిగా వస్తున్న అనుష్ఠానాలకు వారు విస్మరించక పోవడం విశేషం. ఆ అనుష్ఠాలివి 1. విత్తనాలు వేసే దానికి ముందు కావించే అనుష్టానం 2. కాలనిర్ణయం కోసం సుంకువేయటం 3. విత్తనం వేసేముందు చేసే అనుష్ఠానం 4. పంటకు తెగులు తగిలితే చేసే అనుష్టానం వరి పొట్టుకు వచ్చిన ప్పుడు చేసే అనుష్టానం 6. వరి చెెనుకోసేటప్పుడు అనుష్టానం 7. వరి కోసిన తర్వాత చేసే అనుష్టానం ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం, ప్రాంతవాసులైన కోయజాతులే ప్రసిద్ధంగా నేటికీ కొన సాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో కొన్ని వైయ్యక్తిక ములైతే మరికొన్ని సామూహికాం షాలని చెప్పు కోవచ్చును.
ఈ జాతివారిలో కొందరు కోయపూజారులుంటారు. నమ్మ కాలు విశ్వాసాలు వీరిలో బాగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇదే ప్రాంతంలో శానాపురం అనే ఊళ్లో ఒకరింట్లో చీపురు దయ్యం ఉండేదట. అతగాడు కళ్లం వేస్తే ఆ ఊళ్లో మరెవ్వరూ కళ్లంవేయరు. ఆ ఇంటి యజమాని కల్లం అయిపోయాక ఒకరి తర్వాత ఒకరు వేయాలి. ఇదేం వింత ఆచారామో వీరు విత్తనాలు జల్లే ముందు భూదేవికి భూమి దేవర పండుగ అనేదాన్ని చేస్తారు. ఆపండుగ రోజు పందిని బలిస్తారు. దీనికి పూర్వగాధ ఏమైనా ఉందా అంటే ఉన్నట్లు చెబుతారు. మన ఇతిహాసాలలో హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టుతుండగా భూమిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన అంశం ప్రస్తావన కొస్తుంది. ముఖ్యంగా ఈ కోయతెగల్లో పాండవులు అడుగిడిన చోటు చాలా పవిత్రమైన దిగా భావిస్తారు. పంటలకు చీడలు పడితే కొడిశ ఆకునీరు పోయే మొదళ్లలో నీరు పోయేదారిలో వేస్త్‌ ఆ పురుగులు నివారించ వచ్చన్న బలమైన నమ్మకం వారికి ఉంది. ఇది శాస్త్రీయ దృక్పధమా! అశాస్త్రీయమా అన్నది వారి ఆలోచనల్లోకి రాదు. పెద్ద వెంకటాపురం అనే గ్రామంలో బుడుగుమైసమ్మ ఉంది. ఆమెను వీరు బాగాఆరాధిస్తుంటారు.
ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!చఙిిఈడొ ఖిొటసిికోయజాతి గిరిజనులు
సంస్క ృతి సంప్రదాయాలు
dŸ్శdŸా ొ dŸ్శ్ఘŸ్ష‘ిలిి
భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 తెలంగాణాలోని భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో 24, 329 మంది బస్తర్‌ వంటి కోరాపుట్‌ ప్రాంతాలలో మూడు లక్షల వరకు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల రెంటిలో ఉన్న గిరిజన జాతుల్లో కోయజాతి ఆదివాసీలు సంఖ్యా పరంగా ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందు చెప్పిన ప్రాంతాలలో వారు బాగా విస్తరించి వున్న, తూర్పు గోదా వరి, పశ్చిమగోదారి, ఖమ్మం, వరంగల్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో
కూడా వీరి సంఖ్య సుమారుగా కనిపిస్తుంటుంది. ఈ కోయ జాతి జనులు అటవీసంపదపై ఆధారపడి బతుకుతుంటారు. అడవితల్లే వారికికన్న తల్లిగా భావిస్తారు.
కోయల్లో వ్యవసాయం ముఖ్యవృత్తిగా జీవించేవారి సంఖ్య తక్కువేంకాదు. ఈ వ్యవసాయక తెగల్లో కొండదొర, కొండరెడ్డి, కోలం, తోటి, జతపు అనే వారు ముఖ్యులు. ఓరుగల్లు (వరంగల్‌) జిల్లాలో కోయలు అధికంగా నర్సంపేట, ములుగు, మహబూబా బాద్‌, ఇంకా ఖమ్మం జిల్లాలో భద్రా చలం కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గుం పాడు, నూగూరు,మధిర, పాల్వంచ మొదలైన చోట్ల కనిపిస్తుంటారు. నాలుగు జిల్లాలో కలిసివారి సంఖ్య దాదాపు 14.33 లక్షలుంటారు.
4.92 లక్షల మంది వరకూ భూమిని సాగుచేసుకుంటూ వ్యవ సాయం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా భూమి పుట్రాలేని వారైతే 1.50 లక్షల వరకూ ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరు గతంలో ఎన్నో రాజకీయ పోరాటాలలో పాల్గొన్న దాఖలు కనిపిస్తున్నాయి. వాటిలో 1969లో శ్రీకాకుళ గిరిజ నోద్యమం కొండమొదలు గిరిజనపోరాటం, తెభాగా గిరిజన పోరాటం ప్రధానమైనవిగా చెప్పుకోవాలి.
బేరీజు వేసి చెప్పుకోవాల్సి వస్తే ఈ కోయజనం ఒక్క శ్రీకాకుళ గిరిజనోధ్యమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారంటే అతిశయోక్తికాదు. ఇదే మాదిరిగా నేటి తెలంగాణాలోని ఆది లాబాద్‌ లోగల ఇంద్రవెల్లిలోకూడ ఉద్యమంలో 13మంది గిరిజ నులు కాలగర్భంలో కలిసి పోయి సంగతి అసత్యం మాత్రం కాదు. కోయజాతిలో అధికంగా తెలుగుభాష, ఇదే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. కొన్ని అక్కడ కొండ ప్రాంతపు మండలి కాలకూడా వారి భాషలో చోటు చేసుకున్నాయి. వీరిని గుర్తించి ప్రత్యేకించి చెప్పాల్సొస్తే ముఖ్యంగా నక్సలైట్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. 1970 సంవత్సరం నుంచి ఈ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కోయలలో ఒక్క ఆదిలాబాద్‌లోనే 18
ఉపజాతులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఖమ్మం, కరీంనగర్‌, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వీరి ఉపజాతులుగా ఈ విధంగా చెబుతున్నారు. అవి రాజకీయ గుత్తకోయ, (గొత్తి), అడవికోయ, డొల్లకోయ, బొమ్మకోయ, మన్నెకోయ, చిత్తకోయ, పుష్టికోయ, లింగకోయ మొదలైన వర్గాలుగా చెప్పుకోవడం పరిపాటి.
మనం పైన చెప్పుకున్న వేకాకుండా వారివారి వృత్తిపరమైన విభజన చేస్తూ మరికొన్ని అవాంతర విభాగాలుగా చేసి పిలవడంకూడా పరిశీలిద్దాం! కమ్మరి కోయ (వీరు పని ముట్లు తయారు చేసేవాళ్లు) కావ చ్చు, ముసరకోయ, ఒడ్డి కోయ, వీళ్లంతా అటవీ సంబంధమైన సంపదపైన ఆధారపడి బతు కుతుంటారు. కొండదేవర పేరు, చెబుతూ కొందరు పల్లెలు, గ్రామాలు పట్టణాలలో తిరుగుతూ జ్యోతిష్యం చెప్పటం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం! వీరు అడవుల్లో సంచారం చేస్తూ బెల్లం, తేనె, చింతపండు, మూలికలు, జింక చర్మాలు, వేర్లు, పులిచర్మాలు, పులి గోళ్లు, పాము చర్మాలు, జీడిపప్పు, ఇప్పపువ్వు, తునికాకు, కరకోయలు, వేపతేనె, పులినెయ్యి, గోందు లేక బంక (జిగుర్లు) ఉసిరి కాయలు మొదలైనవి భాగా సేకరిస్తుంటారు. వాటిని ఎంత దూరమైనా వెళ్లి అమ్ముకుపోతుంటారు. బాగా రేటు బాగా పలికితే బజార్లలో గాని విక్రిస్తారు. వారు వెదురు బొంగులు, కారెగడ్డి, తుంగతతో (అదొకరమైన గడ్డి) గుడిసెలు వేసుకుని గూడేలలో జీవిస్తుంటారు. ఎడమ చేతి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కోయస్త్రీలలో బాగా ఉంది. ఎక్కువగా హిందూ సాంఘీక ఆచారాలే వీరు పాటిస్తుంటారు. హిందువుల పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన వాటిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా వీరికి భూమాత, మూర్పక, అమ్మోరు మొదలైన పండుగ జాతర్లు నిర్వహించడం గమనించవలసిన అంశం.
పాటలు పాడుతూ ఆడుతూ ఉన్నప్పుడు తలలపై మగవారు పశువుల తలలతో చేసిన కిరీటం లాంటి దాన్ని ధరించే అలవాటు ఈ కోయ జాతివారికి వుంది. డప్పులు, బూరలు వాయిస్తూ స్త్రీ పురుషులున్నట్లు చేస్తారు. అమ్మోరు జాతరలో ఎన్నో మేకలను, గొర్రెలను బలిస్తుండటం వీరికి అనాదిగావస్తున్న ఆచారం. ఒకానొకప్పుడు అనాగరికులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లన్ని
కన్నెపిల్లల్ని బలిచ్చే సంప్రదాయం ఉండేదట. పిల్లాపాపలు పాడి పంటలు బాగా పండాలని వారి క్షేమం కోసం ఈ జాతర్లు చేస్తుంటారు. వరంగల్‌ జిల్లాలో గల సమ్మక్క-సారలమ్మ జాతర ఇంకా మగద పూర్ణిమ రోజున జరిగే కోయ జాతర్లు పేరు పొందాయి. తెలంగాణా ప్రాంతంలో నివసించే కోయజాతులే వంశ పారంపర్యంగా లింగదారి, కోయ, రాజకోయ, కమ్మర, అరితదోలు అనే శాఖలు కనిపిస్తుంటాయి. కోయగ్రామ పెద్దమ్మను ముత్యాలమ్మ, లేక దేవర అని వ్యవహరిస్తుంటారు. గూడేల్లో ఎలాంటి నేరాలు జరిగినా వీరి సమక్షంంలో అవి విచారించ బడతాయి.
ఈ కోయజాతి కోయగూడెంలో పదవులు వారి వారి వంశ పారం పర్యంగా సంక్రమిస్తుంటాయి. ఆస్తి పంపకాలు కూడా ఇదే పంథాలో సాగు తుంది. వారి 15 గ్రామాలు కలిసి ఒక సమితి ఉంటుంది. బలమైన ఈ గిరిజన సాంఘీక ఐక్యత ముందు నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఏదైనా తప్పుచేసాక అది అబద్ధం కాదని వారి కోయజాతిలో ఎవరైనా ఆవుతో కనుకళ్లకు కట్టుకుని ప్రమాణం చెయ్యాల్సివుంటుంది. వీరి జాతిలో పెళ్లిళ్లు మూడు రోజులు జరుగుతాయి. వీరి వ్యవసాయ క్షేత్రాలు సమిష్టి ఆస్తిగా పరిగణింపబడుతుంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో వీరి భూములను తెల్లవారు బలంతంగా పరాయి కరణం చేసారు. వార్ని వారి భూముల నుంచి వెళ్లగొట్లడం చెప్పుకోదగిన అంశం. వీరిలో పెద్ద దొరకు కోయగూడెంలో భూముని అమ్మే అధికారమం మాత్రం ఉంటుంది. గిరిజనేతరులు ఈ మధ్య కాలంలో అడవుల్లో ప్రవేశించి అడవ లను నరికి నందువల్ల కోయ జాతి వలస పోవడం ప్రారంభించింది. పోడు వ్యవసాయం చేసుకుని జీవించే వీరి గుడిసెలు పొలాలకు ఆనుకునే నిర్మించు కుంటారు.
పెండ్లి విషయకంగా చెప్పాల్సి వచ్చినట్లైతే పెళ్లికొడుకు పెండ్లికుమార్తెకి చెందిన రెండు కుటుంబాల మధ్యతో సరిపెట్టుకోరు. ఆ ఇద్దరి తండాలు అంటే గ్రామాలలో పెండ్లి జరుగుతుంది. ప్రజ లంతా ఈ వివాహ వేడుకలో పాలు పంచుకుంటారు. అయితే ఈ పెండ్లి తంతులో పాల్గొనే ప్రతికోయ వ్యక్తీ కొంత ధాన్యం, మద్యం పట్టుకొని వస్తారు. మగ పెళ్లి వారు, ఆడపెళ్లి వారికి పెండ్లి నిశ్చయం చేసుకున్న రోజున రెండు కడవల మద్యం, ఆడమగ రెండు మేకలు, ఒక గొడ్డలి, పువ్వులు ఇస్తారు. బహుశా ఇది కన్యాశుల్కమే మోమరి. ఈ కోయ కుటుంబాలను కుతుం అనివ్యవహరిస్తుంటారు. ఒక స్త్రీకి ఒకే భర్త అన్నదే ప్రాచుర్యంలో ఉంది. వీరి భౌగోళిక పరిసరాలను ముతా అంటారు.వీరిలో సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో సాగుతాయ.
కోయజాతి జనులు నేడు వ్యవసాయానికి ఎన్ని ఆధునిక పద్ధతులను అవతలించినా అనాదిగా వస్తున్న అనుష్ఠానాలకు వారు విస్మరించక పోవడం విశేషం. ఆ అనుష్ఠాలివి 1. విత్తనాలు వేసే దానికి ముందు కావించే అనుష్టానం 2. కాలనిర్ణయం కోసం సుంకువేయటం 3. విత్తనం వేసేముందు చేసే అనుష్ఠానం 4. పంటకు తెగులు తగిలితే చేసే అనుష్టానం వరి పొట్టుకు వచ్చిన ప్పుడు చేసే అనుష్టానం 6. వరి చెెనుకోసేటప్పుడు అనుష్టానం 7. వరి కోసిన తర్వాత చేసే అనుష్టానం ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం, ప్రాంతవాసులైన కోయజాతులే ప్రసిద్ధంగా నేటికీ కొన సాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో కొన్ని వైయ్యక్తిక ములైతే మరికొన్ని సామూహికాం షాలని చెప్పు కోవచ్చును.
ఈ జాతివారిలో కొందరు కోయపూజారులుంటారు. నమ్మ కాలు విశ్వాసాలు వీరిలో బాగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇదే ప్రాంతంలో శానాపురం అనే ఊళ్లో ఒకరింట్లో చీపురు దయ్యం ఉండేదట. అతగాడు కళ్లం వేస్తే ఆ ఊళ్లో మరెవ్వరూ కళ్లంవేయరు. ఆ ఇంటి యజమాని కల్లం అయిపోయాక ఒకరి తర్వాత ఒకరు వేయాలి. ఇదేం వింత ఆచారామో వీరు విత్తనాలు జల్లే ముందు భూదేవికి భూమి దేవర పండుగ అనేదాన్ని చేస్తారు. ఆపండుగ రోజు పందిని బలిస్తారు. దీనికి పూర్వగాధ ఏమైనా ఉందా అంటే ఉన్నట్లు చెబుతారు. మన ఇతిహాసాలలో హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టుతుండగా భూమిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన అంశం ప్రస్తావన కొస్తుంది. ముఖ్యంగా ఈ కోయతెగల్లో పాండవులు అడుగిడిన చోటు చాలా పవిత్రమైన దిగా భావిస్తారు. పంటలకు చీడలు పడితే కొడిశ ఆకునీరు పోయే మొదళ్లలో నీరు పోయేదారిలో వేస్త్‌ ఆ పురుగులు నివారించ వచ్చన్న బలమైన నమ్మకం వారికి ఉంది. ఇది శాస్త్రీయ దృక్పధమా! అశాస్త్రీయమా అన్నది వారి ఆలోచనల్లోకి రాదు. పెద్ద వెంకటాపురం అనే గ్రామంలో బుడుగుమైసమ్మ ఉంది. ఆమెను వీరు బాగాఆరాధిస్తుంటారు.
ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమాజ హితం – చౌడప్ప శతకం

సమాజ హితం – చౌడప్ప శతకం

Added At : Sun, 03/08/2015 – 03:26

వమన, సుమతీ పద్యాలను గురించి తెలిసిన వారికి కవి చౌడప్ప శతకంలోని పద్యాలను గురించి కొంతైన తెలిసి ఉంటుంది. చౌడప్ప పద్యాలు అంటే చాలా మంది వారివన్నీ బూతు పద్యాలేనని అనుకుంటారు. కానీ చౌడప్ప రాసిన పద్యాలు ఎక్కువగా నీతి పద్యాలే ఉన్నాయి. అయితే కొన్ని బూతు పద్యాలు లేకపోలేదు. హాస్యానికి బూతు ప్రధానమని భావించిన రోజులలో జన్మించాడు కనుక పద్యాలలో అక్కడక్కడ బూతులు, ఆశ్లిdల శృంగార కనిపిస్తుంది.తెలుగు సాహిత్య ప్రక్రియలో శాఖోపశాఖలుగా వికాసం పొందిన కావ్యప్రక్రియలలో శతకం ఒకటి. ప్రాకృత సంస్కృత ప్రక్రియలను అనుసరించి తెలుగు శతక రచన ప్రారంభమై కాలక్రమమున విశిష్ట స్థానం పొందింది. తెలుగులో 12వ శతాబ్దంలో శతకం ఆవిర్భవించింది. భారతీయ భాషల్లో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుమఖ వికాసాన్ని పొంది వైశిష్ట్యం పొందలేదు. శతకాన్ని ఒక ప్రక్రియగా పేర్కొన్న సంస్కృత అలంకారికుల్లో 13వ శతాబ్దినాటి అమృతానంద యోగి మొదటివాడు. తెలుగు లాక్షిణుకుల్లో విన్నకోట పెద్దన, అనంతుడు శతక ప్రక్రియను పేర్కొన్నారు.
”శతేన శతకం ప్రోక్తమ్‌” అనే నియమం అనుసరించి శతక కర్తలు శత సంఖ్య గల శతకాలు రచించారు. సంస్కృతంలో మొదట 100 శ్లోకాలతో రాసేవారు. తర్వాత 108,116 సంఖ్యలతో రాయటం జరిగింది. కాని శతక కర్మలు అందరు ఈ సంఖ్య నియమాన్ని పాటించారు. ఒక్కో వేమన మాత్రం పాటించలేదని చెప్పవచ్చు. శతక లక్షణాలలో పద్యం చివర ఒకే మకుటం ఉండటం శతక లక్షణం. ముఖ్యంగా శతకాలు వస్తువును బట్టి భక్తిశతకం, నీతి, శృంగార, వైరాగ్యం, హాస్య, దేశభక్తి, రాజకీయ శతకాలుగా వర్గీకరించారు.
తెలుగులో వేమన సరసన పీఠం వేయదగిన ప్రజాకవి, సంఘ దురాచారాలను తూర్పూరబబట్టిన సంఘసంస్కర్త అయిన చాటుకవి కుందవరప కవి చౌడప్ప. ఈయన నియోగి బ్రాహ్మణుడు. (1580-1640) సంవత్సరం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. చౌడప్ప కడపజిల్లా ‘కుందవరం’ గ్రామానికి కావచ్చు లేక పుల్లూరు గ్రామ నివాసి అయిన ఉండవచ్చు అని పండిత విమర్శకులు నిర్ణయించారు. ఇంకా మట్లి అనంతభూపాలుని చేతనూ, తంజా వూరు, రఘునాథరాయల చేతను మేపుపొందాడని చెప్తారు. చౌడప్ప, ఘంటన అనే ఇద్దరు కవులు మట్లి అనంత భూపాలుని ఆస్థానంలో ఉన్నట్లు ఒక చాటువు వల్ల తెలుస్తుంది. ఆ చాటువు వారిరువురును మంచివారు, విమలాత్ములు, హాస్యకళాదురంధరుల్‌, సన్నుత నీతి పారుగులు ‘జాణలు’ నైపుణ్యాలు అని వర్ణించుచున్నది. కవి చౌడప్ప రచించిన శతకంలోని పద్యాలలో 10,12 తప్ప అన్నీ కంద పద్యాలే. కంద పద్య రచనలో తిక్కన సోమయాజితో తాను సమానుడనని కవి చెప్పుకొనెను. ”నా నీతిని వినని వానిని…వానను తడియని వానిని కాననురా కుందవరపు కవి చౌడప్పా” అని తన కవితకు దక్కిన గౌరవం గురించి ప్రజల మన్నలను పొందిందిగా సగర్వంగా చెప్పుకున్నాడు. ‘హాస్యకవి జాణ’ గాన విద్యాప్రవీణుడు అనే ప్రశంసలు పొందారు.
తెలుగు శతకాలలో అధిక్షేప శతకాలు అధిక ప్రాచుర్యం పొందినవి. తెలుగులో కొందరు వ్యక్తి దూషణ మరికొందరు వక్రోక్తి, వ్యాజోక్తి. సమకాలీన సాంఘీక రాజకీయ వ్యవస్థలో కలిగిన మార్పులు. అధిక్షేప శతక కర్తలలో కొందరు మితవాదులు మరి కొందరు అతివాదు వేరొక కొందరు విప్లవాదులు. చౌడప్ప శతకంలో ఆత్మసంబుద్ధి పరంగా చెప్పిన కవి తెలుగు శతకాలలో ఆద్య్తమైనది. పండితుల, పామర జనురంజకం పొంది బహుళ ప్రాచుర్యం పొందింది. హాస్య చమత్కృతి, బూతులు నీతులు ప్రధానగుణములు పది నీతులు పది బూతులు పది శృంగారాలు గలిగిన పద్యాలు సభలో జదివినవాడే యధికుడు అని చౌడప్ప శృంగారం నీతుల గురించి సభలలో చదివినవాడెె.
నీతుల కేమి యొకించుక బూతాడక దొరకు నవ్వు పుట్టదని కవి చౌడప్ప చాటినాడు. లోకజ్ఞతను, స్వానుభవం వల్ల ఈయన శతకంలో నీతులు బూతులు లోకఖ్యాతులురా అని కచ్చితంగా నొక్కి చెప్పినాడు. నీతులను బోధించుటలో కవి చౌడప్ప చమత్కారంగా తిట్లను కూడ జోడించాడు. ఇలా హాస్యానికి బూతు ప్రధానమని భావించిన రోజులలో జన్మించిన కవి చౌడప్పని పద్యాలలో బూతులు, అక్కడక్కడ ఆశ్లిdల శృంగారం కనిపించిన, వేమనలా ధర్మకోపంతోనే అతడు సంఘాన్ని తిట్టినట్లు కనిపిస్తుంది.
చౌడప్ప అక్కడక్కడ చంపక ఉత్పలమాల, మత్తేభ శార్ధూల పద్యాలను వాడినాడు. ఈయన అందరి కవులలాగే మకుట నియమం వాడాడు. కుందవరపు కవి చౌడప్పా అని కుందవరపు పావన చౌడ కవీశ్వరోత్తమా అనే మకుటం వాడినాడు. కవిత్వాన్ని మెచ్చుకొనే విధంగా ఉండాలిగానీ, హేళనగా దాన్ని నలుగుర్నీ అవమానం చేయకూడదని ఈ పద్యం ద్వారా కవి తెలుపుతాడు.
వేడుక పడివినవలెనా
దోడుకవిత్వంబునైన తులువనలువురన్‌
గోడిగము సేయువాడే
గాడిదరా కుందవరపు కవి చౌడప్పా
ఇంకా చౌడప్పా తిట్టును ఎంత సమర్థవంతంగా వాడగలడో చెప్పవచ్చు. ఎద్దులు కొడుకులు గలిగిన /కొద్దిధర్మంబు జేసికొనరు తరించేబుద్ధినెరిగి తమ పిండము/గ్రద్ధలుదిన కుందవరపు కవి చౌడప్పా అని కొడుకులు ఎద్దుల్లాంటి వారు కలిగినవారు తరించాలనే బుద్ధితోనైనా కొద్దిపాటి ధర్మం కూడా చెయ్యరు. అలాంటి వారిని వాళ్ల పిండాలు గద్దలు తినా అంటూ శపిస్తాడు కవి. వేమన, సుమతీ పద్యాలను గురించి తెలిసిన వారికి కవి చౌడప్ప శతకంలోని పద్యాలను గురించి కొంతైన తెలిసి ఉంటుంది.
చౌడప్ప పద్యాలు అంటే చాలా మంది వారివన్నీ బూతు పద్యాలేనని అనుకుంటారు. కానీ చౌడప్ప రాసిన పద్యాలు ఎక్కువగా నీతి పద్యాలే ఉన్నాయి. అయితే కొన్ని బూతు పద్యాలు లేకపోలేదు. హాస్యానికి బూతు ప్రధానమని భావించిన రోజులలో జన్మించాడు కనుక పద్యాలలో అక్కడక్కడ బూతులు, ఆశ్లిdల శృంగార కనిపిస్తుంది. చౌడప్పకు శబ్దంపై గొప్ప అధికారం కలిగి అప్రయత్న సిద్ధంగా శబ్దాలంకారాలను నేర్పుతో కూర్పుతో గ కవిగా పేరుపొందాడు కుందవరపు కవి చౌడప్ప.
ఏవి ప్రశస్తంలో తెలుపు ‘పస’ పద్యాలు కొన్ని, దేనికి రక్షణమో వివరించే పదిలము పద్యాలు కొన్ని చౌడప్ప శతకంలో కలవు. ఇంత గొప్ప ప్రజాకవి పద్యాలు కాలగర్భంలో కలిసిపోకుండా నేటి తరానికి అందించాలని తపన. ఆధునికులతో శ్రీశ్రీవంటి మహాకవులకు ఎందరినో ప్రభావితులను చేసిన అక్షరశిల్పి కుందవరపు కవి చౌడప్ప. కాని ఎందువల్లో ఈయన పద్యాలు ఎక్కువగా నేటి తరానికి అందలేదనే చెప్పాలి. ఇలాంటి కవి సంఘదురాచారాలను, సమాజానికి హితం చేకూరేలాగా ప్రభావితం చేసిన శతకం చౌడప్ప శతకం. ఇంకా నీతులు, రీతులు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తీర్ధ యత్రలకూ సబ్సిడీ ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం కొన్ని దశాబ్దాలనుండి ముస్లింల మతపరమైన మక్కాకు వెళ్లే హజ్‌ తీర్థయాత్రకు ప్రభుత్వపు సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. గత సంవత్సరం, రూ.1300 కోట్లు ఇలా ఇచ్చింది. ఏటేటా ఈ సబ్సిడీ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు హజ్‌ యాత్రికుల సౌకర్యార్థం, హజ్‌ హౌస్‌ లకై స్థలాన్ని, ధనాన్ని ఇస్తున్నాయి. (హైదరాబాద్‌లో ఒకటి, రెండోది శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముస్లింలకై శాదీఖానాలు ఉర్దూ ఘర్‌లూ ప్రజల సొమ్ముతో అనేక పట్టణాల్లో కట్టింది.
రాష్ట్రంలోని క్రైస్తవులకై ఏపీ స్టేట్‌ క్రిస్టియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను పూర్వపు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రభుత్వం నుండి సొమ్ముని పొంది, రాష్ట్రంలో ఆ సొమ్మునుపయోగించి, ఒక్కొక్క గ్రామానికి 2 లక్షలు ఇచ్చి 2013 వరకు చర్చిలను కట్టించింది. ప్రభుత్వపు సొమ్ముతో జెరూసలెంకు తీర్థయాత్ర తీసే ప్రతి క్రైస్తవునికి రూ.25,000 ధన సహాయం చేస్తోంది.
ఈ విధంగా రాజ్యాంగం ప్రకారం సెక్యులర్‌గా ఉండవలసిన ప్రభుత్వాలు, పన్నుల ద్వారా వసూలు చేసిన సొమ్మును, ముస్లిం, క్రైస్తవ మత పోషణకు, వ్యాప్తికి, దుర్వినియోగం చేస్తున్నాయి. కొంతమంది ముస్లిం ప్రభువుల పాలనలో, హిందువులపై జిజియా అనే పన్నువేసి, అలా వచ్చిన సొమ్మును ముస్లింల సంక్షేమం కోసం ఉపయోగించేవారు. స్వతంత్ర భారతంలో, సెక్యులర్‌ ప్రభుత్వాలు తిరిగి, పరోక్షంగా జిజియాను ప్రవేశపెట్టి, హిందువులు చెల్లించే పన్నులను పాక్షికంగా హైందవేతర మతస్తులకై ఉపయోగించడం గర్హనీయం.
ఇక హిందువులపై ప్రత్యక్ష వివక్షతను తిలకిద్దాం. క్రైస్తవుల చర్చ్‌లు, ముస్లింల మసీదులూ, ఆయా మతసంస్థల యాజమాన్యంతో, వారి పాలనలోనే ఉన్నాయి. కాని మంచి ఆదాయం ఉన్న హిందువుల దేవాలయాలు మాత్రం ప్రభుత్వపు యాజమాన్యం, పాలనలో ఉన్నాయి, ఈ సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి, దేవాదాయ ధర్మాదాయ శాఖలు వీటి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, కమిషనర్లూ, ప్రభుత్వాధికారులు, కొన్ని దేవాలయాల ఇ.వోలు క్రైస్తవులు, ముస్లింలు కొంతమంది తమ మతమార్పిడిని కప్పిపుచ్చుకుని, రిజర్వేషన్‌ ద్వారా ప్రభుత్వోద్యోగం పొందినవారు. ఇలా హిందువుల దేవాలయాలు, హిందూసంస్థల అధీనంలో లేవు. భక్తులిచ్చే కానుకల రూపంలోని ఆదాయంలో కొంత శాతం ముఖ్యమంత్రి ఇష్టానుసారం కేటాయించడానికి కామన్‌ గుడ్‌ ఫండ్‌లో పడుతుంది. ముఖ్యమంత్రి క్రైస్తవులు, ముస్లింలు అయిఉండవచ్చు. సి.జి.ఎఫ్‌. నిధులు మసీదు, చర్చ్‌ల మరమ్మతులకు కట్టడాలకు ఇచ్చిన దృష్టాంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అంటే హిందూమతాన్ని ద్వేషించి, దాన్ని మటుమాయం చేసే కార్యక్రమాలు చేపట్టే, హైందవేతర మతాల పుష్టికి, హిందూ భక్తులు తమ దేవుళ్ళకిచ్చే

సొమ్ము, మళ్లింపబడుతోంది. ఎంత అన్యాయం? ముస్లింలు, క్రైస్తవులు తమ తీర్థయాత్రలకు ప్రభుత్వపు సొమ్మును పొందుతుంటే, హిందూభక్తులు తమ సొమ్ముతో ప్రయాణం చేయాలి, తమ దేవుణ్ణి చూడటానికి టిక్కెట్‌ కొనుక్కోవాలి! ఎంత దారుణం! హిందువులకు పై చూపబడుతున్న వివక్ష, వారి సొమ్మును అన్యమతస్తులకై ఉపయోగింపబడటాన్ని కొంతవరకైనా తగ్గించాలంటే తక్షణం ఈ చర్యలు తీసుకోవాలి.
తి.తి.దే, దే.ధ.శా లు హిందూభక్తులు సమర్పిస్తున్న ధన వనరులను, ప్రతి సంవత్సరం ఒక లక్షమంది హరిజనులను, గిరుజనులను, ఇతర బీద హిందువులను, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి, ఉచితంగా వేంకటేశ్వరుని దర్శనం చేయించాలి, ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించాలి.
– సంవత్సరానికి కనీసం వెయ్యిమందిని అమర్‌నాధ్‌ యాత్రకు, దేవాలయ ఆదాయాన్ని వెచ్చించి పంపి తీసుకురావాలి.
– ప్రతి దళిత వాడల్లో, గిరిజన గ్రామాల్లో పట్టణాల్లోని మురికివాడల్లో, నివాసులు కోరిన దేవతకు, దేవునికి మందిరం కట్టి ఆ సముదాయంలోని వారినే అర్చకులుగా తీసుకుని, వారికి పూజా విధానంతో పాటు హిందూ ధర్మాన్ని బోధించి, తత్ప్రసార కర్తలుగా, బోధకులుగా శిక్షణ ఇవ్వాలి. వారికి, నెలకు కనీసం రూ.5,000/- జీతం ఇవ్వాలి. ధూపధీప నైవేద్య, పండుగల నిర్వహణకై, సంవత్సరానికి కనీసం, ప్రతి గుడికీ రూ.50,000/- ఇవ్వాలి.
-తి.తి.దే. పాలక మండలిలో, దేవాలయాల ధర్మకర్తల మండళ్లలో హిందూ ధర్మరక్షణ, ప్రచారం, అనుష్ఠానమందు అంకితభావమున్న, రాజకీయమే వృత్తిగా లేని, గుణవంతులను, జ్ఞానసంపన్నులను, పాలనా దక్షణ, అనుభవం ఉన్న వారినే, సభ్యులుగా నియమించాలి.
– ఈ సంస్థల యొక్క ఆదాయ వ్యయపట్టికను, వార్షిక పాలన -నిర్వహణ -కార్యక్రమ నివేదికలను, ప్రచురించి, ప్రజలకందేట్లు చేసి, ప్రజాభిప్రాయాన్ని మన్నించే విధిని పై సంస్థలకు నియమించాలి.
చివరిగా, ప్రజాభిప్రాయాన్ని, విజ్ఞుల సలహాలను, సూచనలను ఆహ్వానించి, చట్టం ద్వారా హిందూ దేవాలయాల పాలన, యాజమాన్యం ప్రభుత్వం నుంచి వేరుజేసి, సవ్యమైన ధర్మసంస్థలకు అప్పజెప్పాలి. సిఖ్‌ పంధీయుల గురుద్వారాల యాజమాన్యం, పాలన, నిర్వహణ గురుద్వారా ప్రబంధక్‌ కమిటీలకు, అప్పజెప్పిన చట్టంను ప్రాతిపదికగా తీసుకుని, మరో సర్వాంగ సౌష్టవశాసనం, నియమాలను రూపొందించవచ్చు.
హిందూ బంధువులందరూ, ఈ విషయాలను రాజకీయ పార్టీలకు, నాయకులకు, శాసనసభ్యులకూ తెలియపరచి హిందువులకు, అన్యమతస్తులకున్న, స్వతంత్య్రాన్ని, సంఘటనా సౌకర్యాన్ని, వ్యవస్థనూ, సమకూర్చేలా అర్థించి, కార్యాన్వితం చేయాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సీత రాముడికి హితోపదేశం

రామలక్ష్మణులు సీతా సమేతంగా అడవిలో సుతీక్షుణ్ణి కలుసుకుని, ఆయన ఆశీర్వాదాలు పొంది మరలా ప్రయాణం సాగించారు. వారికి ఆ మహర్షి అందరి ఋషులను కలుసుకోమని చెప్పగా, అట్లేనని బయలు దేరారు. దండకారణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. సీతకు ఏదో సంకోచం మనస్సులో వుండిపోయింది. రామచంద్రమూర్తితో ఇలా అన్నది. రామా! ధర్మం అనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయి కదా, అలాంటప్పుడు స్వీయ ధర్మమేదో తెలుసుకోవడం అంత తేలిక కాదు కదా! మనస్సులో కోరికలు లేనివారు మాత్రమే తలవెంట్రుక వాసిలో గల ధర్మాన్ని తప్పకుండా ఈ లోకంలో చరించగలరు. ధర్మాన్ని అవలంభించడానికి మూడు దృక్పధాలు అవసరం. అసత్యం పలుకకుండుట, ఇతరుల భార్యలను పొందాలని కోరుకోవడం, మూడవది తమకు హాని చేయని వారిని హింసించడం. రామా! నీకు అసత్యమాడుతావన్న నింద లేనేలేదు. మీరంత వరకూ అసత్యమాడలేదు. ఇక ముందు అసత్యం నిశ్చయంగా పలుకవు. కావున రెండవ పాపం కూడా నిన్ను అంటదు. నన్ను తప్ప మీరు ఇంకెవ్వరినీ కన్నెత్తి చూడనైనా చూడలేదు. సీత చెప్పడం ఒక్క క్షణం ఆపింది. రాముడి వంక చూసింది. రాముడు చిరునవ్వు నవ్వాడు.
సీతతో ‘నీవు చెప్పదల్చుకుంది చెప్పు. సంకోచించకు, నేను వింటు న్నాను’ అన్నాడు. సీత ఎంతో సరళంగా చెప్పడం ప్రారం భించింది. ఇక మూడవ పాపం నీకు చుట్టుకుంటుందేమో నన్న భయం కలుగుతుంది. ఎందుకంటే నీవు ఈ అరణ్యంలోని ఋషుల ఎడల పక్షపాత వైఖరి అవలంభించి, నీకు ఏ విధంగానూ, ఎలాంటి హబుూనీ కలిగించని రాక్షసులతో పోరుకు సిద్ధమయ్యావు. ఇందుకేనా నీవు ధనుర్భానాలు చేతపట్టి అరణ్యానికి వచ్చావు. మనకు ఇకముందు కలుగబోయే దు:ఖానికి ఇది సంకేత మను కోనా? నాధా! మీరు అరణ్యంలో వున్న రాక్షసులందర్నీ హత మారుస్తానని మాట ఇచ్చినప్పటి నుండీ నాకు భయం భయంగా వుంది. నాలో ఆందోళన పెరుగుతూంది. ఇక మీరు ఈ అరణ్యంలో ముందుకుపోవడం నాకిష్టంలేదు. ఎందుకంటే మీరు రాక్షసులను చూడగానే వెంటనే ఆచరణలో పెట్టడం మీ నైజం. అగ్నిలో కట్టెలు వేస్తే అగ్నికి ఇంకా బలం చేకూరినట్లుగా, ధనుర్భాణాలు క్షత్రియుని అతిశయాన్ని ఇంకా ఇనుమడింప జేస్తాయి. రామా! నేనిలా మాట్లాడటం నీయందు గౌరవం లేకకాదు. నీకు ధర్మాన్ని బోధించాలని కూడా కాదు. ఒక్కసారి ఆలోచించండి మీరు చేస్తున్నది సరైనదో కాదోనని, నీవు తాపస వేషం ధరించావు. ఆ వేషానికి తగ్గట్లే నీవు నివసించాలి. నీకు ఆగ్రహం కలిగించితే తప్ప మీరు రాక్షసులను సైతం హతమార్చడం సరైనది కాదు. తిరిగి మనం అయోధ్యకు పోయిన తర్వాత, క్షత్రియ ధర్మాన్ని అనుసరించవచ్చును. ధర్మ సారమే ఈ లోకం. ధర్మమే అన్ని పురుషార్థాలనూ ప్రసాదించి ప్రశాంతిని చేకూరుస్తుంది. ధర్మాన్ని తప్పక నడుచుకునే వారికి అన్నీ లభిస్తాయి. రామా! నీవేమి చేయాలో చెప్పుతున్నందుకు నన్ను క్షమించు. ఏమీ జరుగుతుందో నన్న భయం స్త్రీలకు సహజంగా వుంటుందని తెలుసుకదా! ఆభయమే నన్ను ఈ విధంగా మాట్లాడేలా చేస్తున్నది. నీవు ధర్మానికి ప్రతిబింబానివి. నేను ఈ విధంగా నీతో మాట్లాడరాదు. నీవు నీ సోదరునితో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రావల్సింది అంటూ సీత ఎంతో భయాందోళనలతో చెబుతూంటే రాముడు ఆమె మాట లను మెచ్చుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. సీతా! నేనెప్పుడూ ధర్మమార్గాన్ని తప్పనని నీకు తెలుసును కదా! నీవు జనకుని కుమార్తెవు. జనకుడు పరమ సాధువు. కావున నీకు ధర్మ సూక్ష్మాలు బాగానే తెలిసి ఉంటాయి. అందులో ఆశ్చర్యం లేదు. అయితే ఈ అరణ్యంలోని ఋషుల దుస్థితికే నాకు విచారంగా వుంది. సీతా నువ్వు ఒక్కసారి ఆ ఋషులు గురించీ వారిదీన స్థితి గురించీ ఆలోచించి చూడు.
వారు సన్యాసి వేషాలు ధరించి, భోగ భాగ్యా లన్నింటినీ త్యజించి తపస్సు చేసుకోడానికి మాత్రమే ఇక్కడకు వచ్చారు. రాక్షసులు వీరిని వేధిస్తూ, భక్షిస్తున్నారు. రాక్షసుల మూలంగా వీరి ప్రశాంత జీవనానికి భంగం వాటిల్లింది.వారు నన్ను రక్షణ కల్పించమని కోరగా, వారికి సరేనని మాట ఇచ్చాను. తపస్సు అంటే చాలా కఠినమైనది. అలాంటి తపస్సును వారంతా చేస్తుంటే, వారి నమ్మకాన్ని నేను ఎలా వమ్ముచేయడం చెప్పు. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, నా ప్రాణాన్నీ, లక్ష్మణునిగానీ, నిన్ను సైతం పోగొట్టు కోవడా నికైనా వెనుకాడను. అసలు అడగక పోయినా, క్షత్రియుడిగా నా అంతట నేనే వారిని రక్షించాల్సి వుంది.
సీతా! నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావంటే నాకు ఎంతో ఆనందం వేస్తున్నది. ఇతరుల క్షేమాన్నీ, శ్రేయస్సునూ కోరేవారే హితాన్ని ఉపదేశిస్తారు. నాశ్రేయస్సు కోరి నీవు నీ జన్మను సార్థకం చేసుకున్నావు. ఈ దండకారణ్యంలో నివసించే వారికి సుఖమూ, భద్రతా కల్పించేందుకే నిర్ణయించాను అంటూ సీతారామ వ్యవస్థకు ఆదర్శ దంపతులుగా మనకు దర్శనమిస్తారు సీతారామ చంద్రులు. యుగాలుగా గడిచినా నేటికీ వివాహం అనగానే సీతారామ కల్యాణమే ఆదర్శంగా హిందూ వ్యవస్థ కొనసాగుతూ వుంది. కల్యాణ వేదికపై చేసుకున్న బాసలను జీవితాంతం నిలుపు కోవాల్సి వుంది.
ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించు కుంటూ ముందుకు సాగాలని ఈ రామా యణం లోని అరణ్యకాండలో ఆ దంపతులు లోకానికి చక్కటి సందేశాన్నందించారు.
నీవు ధర్మానికి ప్రతిబింబానివి. నేను ఈ విధంగా నీతో మాట్లాడరాదు. నీవు నీ సోదరునితో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రావల్సింది అంటూ సీత ఎంతో భయాందోళనలతో చెబుతూంటే రాముడు ఆమె మాట లను మెచ్చుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు. సీతా! నేనెప్పుడూ ధర్మమార్గాన్ని తప్పనని నీకు తెలుసును కదా! నీవు జనకుని కుమార్తెవు. జనకుడు పరమ సాధువు. కావున నీకు ధర్మ సూక్ష్మాలు బాగానే తెలిసి ఉంటాయి. అందులో ఆశ్చర్యం లేదు. అయితే
ఈ అరణ్యంలోని ఋషుల దుస్థితికే నాకు విచారంగా వుంది. సీతా నువ్వు ఒక్కసారి
ఆ ఋషులు గురించీ వారిదీన స్థితి గురించీ ఆలోచించి చూడు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శమంతక పంచ తీర్ధం

శమంతక పంచతీర్థం లేదా శమంత పంచక క్షేత్రం అన్నా ఒక్కటే. అతి ప్రాచీన కాలంలో దేవతలు ఈ క్షేత్రానికి తరచుగా వచ్చి వెడుతూ ఉండేవాడు.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ విలసిల్లుతూనే ఉంది.
కురువంశానికి మూల పురుషుడు అయిన కురు మహారాజు శమంత పంచక క్షేత్రం సందర్శించటం జరిగింది. ఈ క్షేత్రంలో కాలిడగానే కురుమహారాజు అద్వితీయమైన అలౌకిక భావనకు చేరువైనాడు. ఏదో అంతరంగ శక్తి ఆయనను తపం చేయుటకు ప్రోత్సహించింది. శమంతక పంచ తీర్థంలో నివాసం ఏర్పర్చుకొన్నాడు. ప్రతి రోజు ప్రాత: కాలంలో తపమాచరించిన తరువాత భూమిని ప్రతి రోజు నాగలితో దున్నేవాడు. నియమం తప్పక ప్రతిరోజు ఈ విధంగా చేసేవాడు. ఈ కురుమహారాజు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు అనే అనుమానం దేవేంద్రుని మదిలో మొదలాడసాగింది. ఈ మహారాజు తన సింహాసనానికి ఎసరు పెట్టలేదు కదా అని తలచి కురు మహారాజును కలసినాడు. క్షేమ సమాచారాలు తెలుసుకున్న తరువాత దేవేంద్రుడు మహారాజా మీరు ప్రతి రోజు భూమి దున్నుతూ తపం ఆచరిస్తున్నారు కదా. ఇదుకు ప్రత్యేకించి విశేషమైన కారణం కలదా అని ప్రశ్నించాడు.
అప్పుడు కురుమహారాజు అవును దేవేంద్రా అవును. ఈ క్షేత్ర సందర్శనంతోనే నా మనసు పులకించింది. అందుకని ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారు ఈ క్షేత్రంలో నివసించు వారు వారి మరణానంతరం వారికి స్వర్గ ప్రాప్తి కలుగుటకు తపం చేస్తున్నానని వివరిం చాడు. ఓస్‌ ఇంతేనా ఇంకా పదవికి ముప్పు వాటిల్లిందని అనుకున్నా హమ్మయ్యా అని మనసులోనే నిట్టూర్చి కురు మహారాజు వద్ద సెలవు తీసుకుని తన స్వర్గానికి బయలు దేరాడు.
ఒకసారి మాటల సందర్భంలో దేవ గురు బృహస్పతికి ఈ విషయం దేవేం ద్రుడు వివరించాడు. అప్పుడు బృహస్పతి ఇలా స్పందించినాడు మహారాజా దేవేంద్ర మీరు తక్షణమే కురుమహబుూరాజును కలవండి. ఎందుకంటే ఆయన కోరికను భగ వంతుడు అంగీకరిస్తే ఈ స్వర్గంలో నిలబడటానికి కూడా చోటు ఉండదు ఎందుకంటే ఆ క్షేత్రంలో సందర్శించిన వారు, ఆ క్షేత్రంలో నివసించినవారితో ఈ స్వర్గంలో నిండి పోతుంది. దేవ తలు వెతలు పడవచ్చు కనుక మీరు ఏదో విధంగా కురుమహారాజుతపం ఆపు చేయమని తెలిపి నాడు. దేవగురు బృహస్పతి చెప్పిన విషయంలో నిజం గ్రహిం చిన వెంటనే కురుమహారాజు చెంతకు చేరిన ఇంద్రుడు మహా రాజా మీరు చేసే తపం దయ చేసి విరమించండి. మీ కోరిక సఫలీకృతమైతే ఈ భువిపై ఉండే మానవులందరూ ఈ క్షేత్రాన్ని సందర్శించగలరు. ఫలితంగా అమరావతి మనుగడ కష్టం కాగలదు. దేవతల సంఖ్య మిక్కుటంగా పెరిగి పోతుంది. పైగా భూలోకంలో నిర్వహించే యాగాలలో మాకు వచ్చే భాగం మృగ్యమవుతుంది. మా ఉనికి ప్రశ్నార్థకం అవు తుందని తెలియ చేయగా కురుమహారాజు తల పంకించెను. ఈ క్షేత్రంలో నిద్రాహారాలు మాని తపం చేయదలచిన వారికి, యుద్ధంలో వీర మరణం పొందిన వారికి స్వర్గప్రాప్తి కలిగేటట్లు నేను వరం ఇవ్వగలవాడను అని తెలియ చేసెను. కురుమహారాజు ఆలోచించి తన సమ్మతిని తెలియ చేసెను. ఆనందపడిన దేవేంద్రుడు మహారాజా మీ విజ్ఞత ఎన్నదగినది అని ప్రశ్నిస్తూ మహారాజా నేటి నుండి ఈ శమంతక పంచక్షేత్రం కురుక్షేత్రంగా పిలువ బడుతుందని చెప్పి అక్కడ నుండి నిష్క్రమించినాడు. ఇంతటి మహిమ గల ప్రదేశం అవటం వల్ల ఈ ప్రదేశం మహాభారత యుద్ధానికి వేదిక అయింది. మాన్యులైన ద్రోణుడు, భీష్ముడు, అభిమ న్యుడు వంటి వీరుల క్షత గాత్రిములతో తడిసిన నేల ఇది. ఈ క్షత్రెం సందర్శింనంత మాత్రం చేతనే వడలు పులకించునని అనేక మంది విజ్ఞుల అభి పాయం. ఇక్కడ యుద్ధం లో మరణించిన ప్రతి వీరుడు వీర స్వర్గమలంకరించినాడు.
దేవగురు బృహస్పతి చెప్పిన విషయంలో నిజం గ్రహిం చి వెంటనే కురుమహారాజు చెంతకు చేరిన ఇంద్రుడు మహా రాజా మీరు చేసే తపం దయ చేసి విరమించండి. మీ కోరిక సఫలీకృతమైతే ఈ భువిపై ఉండే మానవులందరూ ఈ క్షేత్రాన్ని సందర్శించగలరు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంక్షేమం పట్టని జైట్లీ బడ్జెట్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన స్మృతులు-శ్రీ అరవింద రావు మరియు కంచి ఆలయ జీర్ణోద్ధారణ వివరాలు

మన స్మృతులు

న సంప్రదాయంలో శ్రుతి, స్మృతి అనే మాటలు వింటూంటాం. ఇటీవలే మన ప్రధానమంత్రి ‘భారతరాజ్యాంగం మా యొక్క స్మృతిగ్రంథం’ అన్నారు. ఆ స్మృతులకున్న ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం.
శ్రవణం అంటే వినడం. కావున శ్రుతి అంటే వినబడినది అని అర్థం. స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవడం. కావున స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోబడినది అని అర్థం. వేదాల్నీ, ఉపనిషత్తుల్నీ శ్రుతులు అంటారు. ఋషులు తపస్సు చేసి గ్రహించిన సత్యాలు, శిష్యులకు వినిపించిన విషయాలు. ఇవి రామాయణం, భారతం మొదలైన వాటిలాగ పుస్తక రూపంలో కాకుండా కేవలం గురువు శిష్యుడికి చెప్పడం. ఆ శిష్యుడు తన శిష్యుడికి చెప్పడం అనే పరంపరలో నడిచాయి. అందువల్ల వీటిని శ్రుతులు అన్నారు. వేల సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకుల్ని అడ్డుకుని ఇదే విధంగా రక్షింపబడిన పరంపర ఇది. మాక్స్‌ ముల్లర్‌ వేదాల్ని ముద్రించే వరకూ ఇవి వ్రాత రూపంలో లభించలేదు.
శ్రుతుల్లో చెప్పిన విషయాల్ని గుర్తుంచుకుని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన పుస్తకాలు స్మృతులు. ఇవి రెండు రకాలు. శ్రుతిలో సూత్రప్రాయంగానో, ప్రతీక రూపంలోనో (సింబాలిక్‌గానో) చెప్పిన వాటిని ఉదాహరణలతో విశదీకరించి కథల రూపంలో తెలిపేవి మొదటిరకం. శివపురాణం, విష్ణుపురాణం మొదలైనవి. శ్రుతిలో ఉన్న స్ఫూర్తితోనే సమాజానికి మార్గనిర్దేశం చేయడం, ఆచారవ్యవహారాల గురించి చెప్పడం రెండవరకం. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారదస్మృతి మొదలైనవి. వీటినే ధర్మశాసా్త్రలని కూడా అంటాం.
శ్రుతులు చెప్పే విషయాన్ని రెండు విధాలుగా విభజించవచ్చు. జీవుడి స్వరూపమేమిటి, పరమాత్మ స్వరూపమేమిటి, స్వర్గం, నరకం స్వరూపమేమిటి మొదలైన విషయాల్ని గూర్చి చెప్పడం మొదటిది. దీన్ని సిద్ధాంతస్థాయి అనవచ్చు. సమాజంలో మనిషిని సరైన మార్గంలో నడపడానికై కొన్ని కర్మలను (యజ్ఞం, దానం, వ్రతాలు, యాత్రలు మొదలైనవి) చెప్పడం, వ్యక్తుల మధ్య వర్గాల మధ్య సంబంధాల గూర్చి చెప్పడం రెండవది. దీన్ని సమాజస్థాయి అని చెప్పవచ్చు. దేశ , కాల పరిస్థితులు మారినా, సమాజంలో మార్పులు వచ్చినా సిద్ధాంతంలో మార్పులుండవు. రెండవ అంశంలో మాత్రం మార్పులు సహజంగా ఏర్పడతాయి.
వేదంలోనూ, ఉపనిషత్తుల్లోనూ చెప్పిన సిద్ధాంత భాగాన్ని స్మృతులలో కథలరూపంలో చెప్పినా విషయంలో మార్పు ఉండదు. సామాజికాంశాన్ని చెప్పేటప్పుడు కాల పరిస్థితుల్ని బట్టి కొన్ని మార్పులు రావచ్చు. దీన్ని వేదమే అంగీకరిస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తులో (1-11) ‘‘అథ యది తే ధర్మ విచికిత్సా వా’’ అంటూ మొదలయ్యే వాక్యం ఇలా అంటుంది. – ‘‘ఒకవేళ నీవు వెళ్ళిన ప్రాంతంలో ధర్మాన్ని గూర్చి గాని, ప్రవర్తనను గూర్చి గానీ సందేహం వస్తే ఆ దేశంలో స్వార్థంలేని వారు, సత్యనిష్ఠ సమబుద్ధి ఉన్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో దాన్నే ధర్మంగా గ్రహించు’’ అని అర్థం. బ్రహ్మసూత్ర భాష్యంలో శ్రీ శంకరాచార్యులు ఒక చోట ఇదే ధోరణిలో వ్రాస్తారు.- ‘‘ఒకానొక ప్రదేశంలో, కాలంలో, సందర్భంలో ఒక విషయం ధర్మమనిపించుకున్నదే మరొక ప్రదేశంలో, కాలంలో, సందర్భంలో అధర్మం కావొచ్చు. అందువల్ల దీని నిర్ధారణలో శ్రుతియే ప్రమాణం’’.
భగవంతుడి గూర్చి, జీవుని గూర్చి, ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి పుస్తకాలు చెప్పే విషయంలో మార్పు ఉండదు. కానీ స్మృతుల్లో (ధర్మశాసా్త్రలలో) మార్పు కనిపిస్తుంది. మనకు అనేక స్మృతులు ఉన్నాయి. అష్టాదశ (పద్దెనిమిది) స్మృతులు ప్రసిద్ధి చెందినవి కాగా మిగతా అనేక స్మృతులు కూడా ఉన్నాయి. బ్రిటీష్‌ వారు అందించారని భావించే మన న్యాయవ్యవస్థ చాలా మటుకు యాజ్ఞవల్క్యస్మృతి, దానిపై ఉన్న మితాక్షర అనే వ్యాఖ్యపై ఆధారపడి వచ్చిందే. బ్రిటీష్‌ వారు మనుస్మృతిలోని కొన్ని సామాజిక అంశాలను ఎక్కువగా విమర్శించడం వల్ల మనుస్మృతి అందరి దృష్టికీ వచ్చింది. అంతేగాని దీనిలోని విషయాలు దేశమంతటా ఒకే రీతిలో అనుసరించబడ్డవి కావు. మనుస్మృతి కృతయుగానికై (అంటే అనేక వేల యేండ్ల క్రితం) చెప్పబడిన ధర్మం. త్రేతాయుగంలో నారదస్మృతి అనీ, ద్వాపరయుగంలో శంఖ, లిఖితస్మృతి అనీ, కలియుగంలో పరాశరస్మృతి అనీ ఒక సంప్రదాయ శ్లోకం ఉంది. (ఈ శంఖ, లిఖితులు మన తెలుగువారే. కడప జిల్లాలో చెయ్యేరు, అంటే బాహుదానది తీరంలో ఈ ఇద్దరు సోదరులకై కట్టిన గుడిని కూడా మనం చూడగలం). అందుకే ఒక స్మృతికీ, మరో స్మృతికీ కొంత తేడా కనిపిస్తుంది. నేడు విమర్శింపబడే వర్ణవ్యవస్థ పట్ల వీటి దృష్టి కోణంలోని మార్పును గూర్చి ఒక ఉదాహరణ- ‘‘క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శ్రద్ధావంతులు, శుచిగలవారు అయినప్పుడు వాళ్ళ గృహాలలో జరిగే హవ్య, కవ్యాది కర్మలలో బ్రాహ్మణులు భోజనం చేయాలి’’ (పరాశరస్మృతి 11-13). అంటే యజ్ఞం చేయించినా, శ్రాద్ధ కర్మలు చేయించినా వారి ఇండ్లలో భోంచేయాలి అని అర్థం. మరొక శ్లోకంలో ‘‘మన ఇంట్లో పనిచేసేవారు, గోపాలురు, కులానికి మిత్రులు అయిన శూద్రులందరూ భోజ్యాన్నులు (పరాశరస్మృతి 11-22). భోజ్యాన్నులు అంటే వీరిచ్చిన అన్నం తినవచ్చు అని అర్థం. ఇలా కాలానుగుణంగా పరాశరస్మృతియే కాక తరువాత వచ్చిన స్మృతులు కూడా మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి, సమాజాన్ని సంఘటిత పరచడానికి అనేక సూచనలు ఇచ్చాయి. బ్రాహ్మణుడు తన వేదాధ్యయనానికి ఎలాంటి భంగం లేకుండా ఆచరించదగిన విషయాలు ఇవి. అలాగే సమాజంలో వర్గాల మధ్య దూరం పాటిస్తున్న మిగతావారు కూడా ఆచరించదగినది.
ఇవన్నీ ఎందుకు అంటే సనాతనధర్మం ఎప్పటికప్పుడు సామాజిక మార్పును దృష్టిలో ఉంచుకొని maximum good for maximum people అనే దృష్టిలో మార్పు చెందగల సామర్థ్యం ఉన్నది అని గ్రహించడానికే. తెలుగు రాషా్ట్రలలో ప్రసిద్ధి పొందిన సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ప్రేరణతో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ‘కౌండిన్యస్మృతి’ (ఎమెస్కో వారి ప్రచురణ) అనే పుస్తకాన్ని రాశారు. ఇది పైన చెప్పిన విషయాల్ని ఇంకా వివరంగా తెలుపుతుంది. ఇది విద్యావంతులందరూ పరిశీలించల్సిన గ్రంథం.
ఒకప్పుడు వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ సమాజంలో మానవ సంబంధాలు, నైతికత (agricultural morality)కు, తర్వాత వచ్చిన పారిశ్రామిక సమాజ నైతికతకూ(industrial morality)కి నేటి సాంకేతిక విప్లవాన్ని సాధించిన సమాజంలోని నైతికతకు చాలా తేడా ఉండడం సహజం. గ్రామీణ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పూర్తిగా మారిన సమయంలో నైతిక విలువల్ని నిలపడం చాలా అవసరం.
సమాజం విడిపోకుండా సంఘటితంగా ధరించి ఉండేదే ధర్మం. (ధారణాత్‌ ధర్మ: అన్నారు). కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాలు, సమాజంలోని వర్గాల మధ్య సంబంధాలు, ఒక సమాజం యొక్క శక్తిని సూచిస్తాయి. సంబంధాలు పటిష్టంగా ఉంటే సమాజం పటిష్టంగా ఉంటుంది. ఈ శక్తినే నేటి భాషలో Social Capitalఅంటారు. సమాజంలోని మార్పుకు అనుగుణంగా మారే శక్తి ధర్మశాసా్త్రల్లో ఉంది. కానీ వీటి అవగాహన మనందరికీ లేదు. అవగాహన ఉన్నా వ్యక్తిస్థాయిలో ఆచరించగలం కానీ విస్తృత స్థాయిలో ఆచరింపజేయడం సాధ్యపడదు. వీటిని అవగాహన చేసుకోవడం, ఆచరణలోకి తేవడం మన ధర్మ సంస్థలు, మతాధిపతులు చేయగల విషయం.
కంచిలో ఆలయ జీర్ణోద్ధరణ విరాళాలకై భక్తులకు పిలుపు

ప్రముఖ శక్తిపీఠంగా విలసిల్లుతున్న కంచి కామాక్షి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయనున్నట్లు కంచి దేవస్థాన ధర్మాధికారి చల్లా విశ్వనాథ శాసి్త్ర వెల్లడించారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కామకోటి పీఠం ఆధ్వర్యంలోనే పునరద్ధరణ జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో కూడా కామకోటి పీఠం ఆధ్వర్యంలోనే ఆలయ జీర్ణోద్ధరణ జరిగినట్లు వివరించారు. ప్రస్తుత పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నేతృత్వంలో 1975లో పునరుద్ధరణ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారని.. ఈ కమిటీకి ఏసీ ముత్తయ్య చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఈ పుణ్యకార్యంలో భక్తులు కూడా పాలుపంచుకోవచ్చని విశ్వనాథశాసి్త్ర తెలిపారు. వారు తాము అందజేసే విరాళాలను ‘‘శ్రీ కంచి కామకోటి పీఠం, శ్రీకామాక్షీ అంబాల్‌ దేవస్థానమ్‌ రినోవేషన్‌ కమిటీ, నెం 1, సాలై, స్ర్టీట్‌ కాంచీపురం, 631502 చిరునామాకు పంపాలని విజ్ఞప్తి చేశారు.
దక్షిణ భారత మోక్షపురి
దక్షిణ భారత దేశంలో ఏకైక మోక్ష పురిగా విలసిల్లుతున్న కంచికి ఎన్నో విశిష్టతలున్నాయి. 64 వేల శక్తి పీఠాలలో అత్యంత ముఖ్యమైన శక్తిపీఠమైన కంచిలో కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ కామాక్షి దేవాలయాన్ని పల్లవులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. తర్వాత కాలంలో ఆదిగురువు శంకరాచార్యులు ఇక్కడ శ్రీపీఠాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత కాలంలో 16 వశతాబ్దంలో మరోసారి ఆలయ పునరుద్ధరణ చేశారు. 19వ శతాబ్దంలోనూ, 20 వ శతాబ్దంలో మరో రెండు సార్లు ఆలయ జీర్ణోద్ధరణనను కామకోటిపీఠం పూర్తి చేసింది.
ఆదాయపన్ను మినహాయింపు పొందాలనుకునే భక్తులు తమ విరాళాలను చెక్కులు, డీడీల రూపంలో ఈ కింది చిరునామాకు పంపాలని ఆలయ అధికారులు వెల్లడించారు.
HIS HOLINESS SRI JAYENDRA  SARASWATHI SWAMANGAL GOLDEN JUBLEE
 CHARITABLE TRUST
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ వారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు

శ్రీ వారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు

మంచీ మర్యాదా లతో అనుభూతి

మేము అంటే గబ్బిట దుర్గాప్రసాద్ ,మా శ్రీమతి ప్రభావతి  మా బావమరది టి వి ఎస్ బి ఆనంద్ ,భార్య రుక్మిణి కలిసి 6-3-15 శుక్రవారం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ముందే ఏర్పాట్లు చేసుకోన్నాం .మేమిద్దరం సీనియర్ సిటిజన్ లం .టికెట్లు అక్కర్లేదు ..వాళ్ళిద్దరూ ౩౦౦ రూపాయల టికెట్ పై దర్శనానికి వచ్చారు .సీనియర్ సిటిజెన్స్ అయిన మా ఇద్దరినీ బాటరీకార్ పై  దర్శన క్యూ ప్రదేశానికి చేర్చి ఏంతో ఆనందాన్నికల్గించారు దేవస్థానం వారు .అక్కడ  మా ఐడెంటిటి చెక్ చేసి ,లెఫ్ట్ హాండ్ చూపుడు వ్రేలు ప్రింట్ తీసుకొని ,ఫోటో తీసుకొని కంపార్ట్ మెంట్ లో చాలా మర్యాదగా కూర్చోబెట్టారు .మధ్యాహ్నం 1-30 కు అక్కడ కు చేరాం .ఇంతలో వాలంటీర్లు అందరికి చల్లని మంచినీళ్ళు అడిగి అడిగి అందజేశారు .తర్వాత సాంబారు అన్న ప్రసాదాన్ని ప్లేట్ లలో పెట్టి అందించారు .అది రుచికరం గా శుచిగా ఉంది .కడుపార తిన్నాం .కావాలంటే మళ్ళీ పెట్టారు .కొద్ది సేపటి తర్వాత వేడి వేడి పాలను గ్లాసులలో ప్రతి వొక్కరి దగ్గరకు వచ్చి ఆప్యాయం గా అందించారు .మళ్ళీ మళ్ళీ అడిగి అవసరమైన వారికి అందజేశారు. చాలా ముచ్చటేసింది దేవాలయం మర్యాదలకు .2-45 కు దర్శనానికి గేట్ తీశారు .పై నుండి కిందికి స్లోప్ మీద దిగి క్యూ లో నెమ్మదిగా కదిలాం. మా బాచ్ లో వికలాంగులు ,అసలే నడవ లేని వారు దేకుకొంటూ వెళ్ళేవారుకూడా ఉన్నారు .వారికేవ్వరికి ఇబ్బందికలుగాకుండా అందరూ జాగ్రత్తపడ్డారు .ఎగుడు దిగుడులు లేని సమతల ప్రదేశం మీదనే నడక హాయిగా ఉంది .బంగారు వాకిలి వరకు వెళ్లాం .అక్కడి నుండి లోపలి కొద్దిగా రష్ గా ఉంది. ఒక పండుముసలాయన వీల్ చైర్ లో అక్కడికి వచ్చారు .వారికి కదిలే శక్తి ఏడూ అయినా శ్రీవారి దర్శనం తో ధన్యం అవాలని వచ్చారు .వారి అబ్బాయిలు అక్కడినుండి చేతుల మీద మోసుకొని వెళ్లి లోపలి బంగారు వాకిలి ద్వారా లోపలి తీసుకొని  వెళ్లి అత్యవసర దర్శనం చేయించి ఆ ముసలిప్రణానికి గొప్ప  ఆనందాను  భూతి కలిగించారు .దేవాలయ  సిబ్బంది కూడా ఎంతో సహకరించారు .నాకు వారందరిలో మానవత్వం పరిమళించినట్లని పించింది .ముప్పావుగంటలో మాకు శ్రీవారి దివ్య దర్శనం మహా వైభవం గా లభించి మనసునిండా సంతృప్తి తో  బయటికి వచ్చాం .౩౦౦ రూపాయల టికెట్ తీసుకొన్న మా బావమరది భార్య కూడా హాయిగా దర్శనాను భూతి పొంది బయటికి మాతో పాటే  వచ్చారు .ఈ అనుభూతి మరువ రానిదిగా మరచిపోలేనిదిగా   సంతోష సంతృప్తి కరం గా  నిలిచి పోయింది .దీనికి మహా విరుద్ధం గా మర్నాటి దర్శనం కల్లోలం రేపి  దారుణం గా బాధగా నిలిచింది .

వి ఐ పి దర్శనం కాదు వి పి .దర్శనం

మా తిరుపతి పెళ్ళివారు 7-3-15  శనివారం ఉదయం 6 గంటల బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికి 500 రూపాయల టికెట్లు కొని మా ఇద్దరికీ ,మ బంధువులావిడ రమాబాయి అనే 85 ఏళ్ళ వృద్ధురాలికి 65 ఏళ్ళ ఆమె కుమార్తెకూ మాతో పాటు రిజర్వ్ చేయించారు .తెల్లవారుజ్హామున రెండున్నరకే లేచి స్నానాలు చేసి నాలుగు గంటలకు పెళ్ళివారు ఏర్పాటు చేసిన ఇండికా కారులో బయల్దేరి అయిదింటికే దర్శనం క్యూ దగ్గరకు చేరుకొన్నాం .మాకు ఇబ్బందికలుగాకుండా మానిటర్ చేయటానికి ఇద్దరు ఉద్యోగులనూ మావాళ్ళు మాతో పంపారు .నాలుగైదు చోట్ల మేడమేట్లు ఎక్కి ,దిగి ముసలీ ముతకా నానా ఇబ్బందిపడ్డారు .కంపార్ట్ మెంట్ లలో కూచుని కూచుని విసుగు కూడా పుట్టింది .అక్కడేమీ శ్రీవారి నామ స్తోత్రాలు కాని ఏవీ పెట్టలేదు .పవిత్రమైన మనసు ఆందోళనకు గురైంది .అలాగే బాధ పడి చివరికి గేటు దగ్గరకు చేరాం .సెక్యూరిటీ చెక్ పూర్తీ చేసుకొని గుంపులో గోవిందలాగా నడకే నడక .ఈ వయసులో ఇంత దూరం నడవాల్సి వచ్చిందని పెద్దవాళ్ళు లబో దిబో .వాళ్ళను బైపాస్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడ్డా ససేమిరా అన్న వాలంటీర్లు .చచ్చీ చెడి బయటి బంగారు వాకిలి దాటాము ముసలివాళ్ళతో .అక్కడ తోపులాట .ఇంకేరకమైన దర్శనం లేకపోయినా సరైన అవగాహన తో అధికార్లు పని చేయక పోవటం తో తీవ్ర ఇబ్బంది .కంపార్ట్ మెంట్ ఖాళీ కాగానే రెండో దానిలోకి వెడితే ముందు వెళ్ళిన వారికే సీటు దక్కింది మిగాతా వాళ్ళందరూ  స్టాండింగ్ .ఇది మరీ కలచి వేసింది .చివరికి లోపలి బంగారు వాకిలి దాటి శ్రీవారి సన్నిధికి చేరాం .అది బాగా స్లోప్ గా ఉండటం తో ముసలివారు చేతిలో కర్ర సాయం తో నడిచేవాళ్ళు చాలా ఇబ్బందిపడ్డారు .మాతో వచ్చిన ముసలావిడను అక్కడి వాలంటీర్లు పక్కి లాగడం తో ఆమె కిందపడి కళ్ళ జోడు జారి పడిపోయి స్వామివారిని చూడలేక పోయింది కళ్ళజోడు కోసం వెతుక్కుంటుంటే వాలంటీర్లు కస్సు బస్సూ .వాళ్ళంతా దడి కట్టి స్వామివారి దర్శనానికి తీవ్ర అవరోధం గా నిలిచారు .వారి సంభాషణ ,ప్రవర్తన అత్యంత హేయం గా అవహేళనగా ,జుగుప్సగా ఉంది .పెద్దలను చేయిపట్టుకొని  ముందుకు తీసుకు వెళ్లి   దర్శనం  చేయించి సాయపడటం పోయి   ,జర్మన్ నాజీ  కాంపులలో చూపిన దారుణమైన ట్రీట్మెంట్ జుగుప్సను కలిగించింది.అప్పటికీ ముసలావిడ కళ్ళ జోడు జారింది అది పెట్టుకొని దర్శనం చేసే దాకా ఓపిక పట్టండి అనిబతిమిలాడినా వినలేదు ‘’ఇక్కడ అంతే .ఎవరూ ఏమీ చెయ్యలేరు .అంత ఇష్టం లేక పొతే పొండి ‘’అన్నారు .మా శ్రీమతి పొట్టి  ఆవిడ కనుక ఆవిడకూ దర్శనం బాగా జరగలేదు. అందరూ దడి కట్టి నట్లు నుంచుని వాలంటీర్లే దర్శనానికి తీవ్ర విఘాతం కలిగించారు .మొదటి నుంచి వీరి తీరు చాలా అమర్యాదకరం గా ఉంది .వి ఐ పి లను ‘’వి పి ‘’లను చేసి అవమాన పరచారు  ఈ తీరు  మార్చుకోవాల్సిన అవసరం ఆలయ అధికారులకు ,పర్య వేక్షకులకు ఉంది .నిన్నటి సీనియర్ సిటిజెన్ దర్శనం పరమానందం గా ఉంటె ,ఇది పరమ ఘోరం గా ఉంది .అసలు ఆమాటలు, వాళ్ళ చేష్టలు మానవత్వాన్ని మరచి రాక్షస ప్రవ్రుత్తి ప్రవేశించిన వారి లాగా ఉన్నాయి ‘’షేం టు టి టి డి’’.

సీనియర్లయినా వికలాన్గులైనా బయటికి వచ్చిన తర్వాత ఏంతో దూరం వెడితెకాని లడ్డూ కౌంటర్లు కనపడవు .అంత దూరం వెళ్ళలేని వారి గతి ఏమిటి ?వారిని అనుసరించేవారు లేకపోతె లడ్డూలు అందవుకదా.కనుక సీనియర్, వి ఐ పి దర్శనాలవారికి లైన్ లోనే లడ్డూలు ఇచ్చే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ..

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-3-15  .

 

 

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మదనపల్లి లో శ్రీరామినేని భాస్కరేంద్ర గారి ఇంట్లో మాకు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,సత్కారాలు .శ్రీ భాస్కర్ గారి ”సరస్వతీమహల్ ”వారి శ్రీమతి శ్రీదేవి గారి” పూజామందిరం ”,సుందరకాండ పారాయణ ,ఇంట్లో అడుగడుగునా ”శ్రీ షిర్డీ సాయి బాబా మహా విభూతి దర్శనం” ,ఒరిజినల్ తిరుమల ”నామాల కొండ ”

7-3-15 శనివారం మధ్యాహ్నం మదనపల్లి లో శ్రీరామినేని భాస్కరేంద్ర గారి ఇంట్లో మాకు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,సత్కారాలు .శ్రీ భాస్కర్ గారి ”సరస్వతీమహల్ ”వారి శ్రీమతి శ్రీదేవి గారి” పూజామందిరం ”,సుందరకాండ పారాయణ ,ఇంట్లో అడుగడుగునా ”శ్రీ షిర్డీ సాయి బాబా మహా విభూతి దర్శనం” ,వారింటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల ”నామాల కొండ ”

Posted in నా డైరీ | Tagged | Leave a comment