వీక్షకులు
- 1,160,268 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వక్తగా జవహర్లాల్(త్రివేణి )
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.34 వ భాగం.14.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.3 వ భాగం.14.6.26.
- జావా(త్రివేణి)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రు డు గారి బాలానందినీ వ్యాఖ్య.217 వ భాగం.14.6.26.
- సంగీత సింగీతం
- నేను గాంధీని కలిశాను(త్రివేణి )
- ఉర్దూ సాహిత్యంలో హిందూ రచయితలు(త్రివేణి )
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.32 వ భాగం.11.6.26.
- డెల్టా శిల్పి సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.1 వ భాగం.11.6.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,115)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘24(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా )’)
’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘24(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా )’)
ఆత్మీయ స్వాగతం – పుష్ప వృష్టి
‘’అందరూ వచ్చి వరుసగా నా మెడలో దండలు వేస్తున్నారు .పుష్ప వృష్టి కురిపిస్తున్నారు ఆ పూలలో నన్ను ముంచేశారు .ఆ పువ్వుల పరిమళం తో బాటు వారందరి ఆత్మీయ సురభిళం నన్ను పరవశింప జేసింది .ఈ’’ హార భారం ‘’ నేను మోయలేనంత బరువుగా ఉంది. కుంగి పోతానేమోనని పించింది .దాదాపు అన్నిరంగుల ,రకాల దండలూ కలిపి 45 దాకా ఉండచ్చు .ఒక పెద్దాయన నాదగ్గరకు వచ్చి వంగి నమస్కరించి ‘’లాల్ గోవింద్ ! నేను గుర్తున్నానా ?మనిద్దరం స్కూల్ లో కలిసి చదువుకొన్నాం ‘’అన్నాడు .’అరే భగవాన్ ! స్కూల్ లోనా ?అని ఆశ్చర్య పడ్డాను .నెమ్మదిగా జ్ఞాపకం వచ్చి పలకరించాను .యెంత అభిమానం నా మీద ?ఇంత దూరం నాకోసం వచ్చాడా శ్రమపడి అనుకొన్నాను .నిజంగా అతను నాకు జ్ఞాపకం లేడు. కాని ప్రేమగా పలకరించి కబుర్లు అడిగాను .నాకు గుర్తున్నదల్లా’’ కుమార్ ‘’ఒక్కడు మాత్రమె .దయ గల అతనికళ్ళు,వణికే చేతులు ఆప్యాయంగా నన్ను చుట్టేసుకోవటం జ్ఞాపకమున్నాయి ఆతను ఉన్నాడా?ఏం చేస్తున్నాడు ?ప్రశ్నలు నాలోసుళ్ళు తిరిగాయి ,అప్పుడు నాలో ఏదో కొంత భాగం జాగ్రుతమైంది .ఇండియా అంతా ఇక్కడికి రాలేదుకదా ! సముద్రం దాటి బయటి దేశాలకు వెళ్ళిన నన్ను సాంప్రదాయ బ్రాహ్మణులు ఆహ్వానిస్తారా ?అని ప్రశ్నలు నాలో చెల రేగాయి .’’
‘’ కమ్యూనిస్ట్ లు , వామ భావ సంస్థల వారు నాకు ఆత్మీయంగా స్వాగతం పలికారు .ఇప్పుడు అంతా బాగానే ఉంది .పరిస్తితులు సర్దుకోన్నాయనిపించింది .నేను నిజమైన భారత దేశం లోనే ఉన్నాను ,ఏదో ఊహా లోకం లో లేను అని తెలిసింది . కమ్యూనిస్ట్ లు వామ పక్షాల వారు ఉన్నారు అంటే ఇండియాలో రైటిస్ట్ భావాల వారూ ఉన్నారన్నమాట .కనుక ఇండియా కు మార్గం అంత సులభమైనదికాదు అనుకొన్నాను .ఈ కళ్ళు ,ఈ నవ్వులు నాకు చిరపరిచితాలే .జో ,అలేక్సీలు ,గుయనీస్ చెడ్డి అందరు ఒకసారి గుర్తుకొచ్చారు .దయా హ్రుదయుడు దేనికీ లొంగని స్వభావుడు అయిన మా నాన్న ఆత్మబలం ,స్థిర సంకల్పం జ్ఞాపకం వచ్చాయి .మానవ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం అది పొందిన ప్రతి దాన్నీ విసర్జించటం కాదు ,దూరం గా ఇంకా దూరంగా ముందుకు వెళ్ళటమే .భారత దేశమా మళ్ళీ మనం కలుసుకొన్నందుకు మహదానందం గా ఉంది ‘’.నా సోదర సోదరీమణులారా !ఇదిగో నేనొచ్చేశా .మీ ముందున్నా.నేనే నేను నేనే . భారతీయుడిని ,సోవియెట్ యూనియన్ పౌరుడిని .అందుకే నేను మీకు ‘’హలో బ్రదర్’’ లా ‘’డబుల్ బ్రదర్’’ ని .తేడా ఏమీ లేదు .ఒక వ్యక్తికీ రెండు మాత్రు దేశాలు ఉన్నాయి అంటే భవిష్యత్తులో ప్రపంచమంతా ప్రజలంద మాతృదేశం అవుతుందన్నమాట .’’
‘’మీ ముందు నేను వినమ్రంగా నిలబడి ఉన్నాను .ఈ భూమిమీదనే నిలిచి ఉన్నాను .కాని నా పాదం ఒకటి ఇండియా లో ,రెండవది రష్యాలో ఉంది .ఈ రెండు స్థిరమైన బలమైన ఆధారాల మీదనే నిలిచి ఉన్నాయి .ఇలా నిలబడి చూస్తుంటే భవిష్యత్తు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది .ప్రకాశ వంతమైన ప్రపంచాలు నాముందు ఆవిష్కారం అయినట్లు గోచరిస్తోంది .అవి ‘’స్ప్రింగ్ బీటిల్స్ ‘’లాగా ‘’స్పుత్నిక్ ‘’ల లాగా నా చుట్టూ ఎగురు తున్నట్లు అనిపిస్తున్నాయి .నా భుజాలపై వెలుగు లీనే సప్త వర్ణ ఇంద్ర ధనుస్సు కాంతు లీను తోంది .సూర్యుడిని నా దోసిట్లో పట్టుకొన్నాను .అది భూమిపై వెచ్చదనాన్నిఅందరికీ అందిస్తోంది .’’
ఎంత భావ గర్భితం గా కవి తాత్మకంగా రామయ్య గారు తన అనుభూతిని వివరించారో మనకు తెలుస్తోంది ఆయనలో ఒక సైంటిస్ట్ మాత్రమేకాదు ఉత్తమ భావుకుడు ఉత్తమకవి మనకు దర్శన మిస్తారు . .
భారత్ లో యాత్రా సందర్శనం
‘’ఇండియాలో నా పర్యటన అంతా ఎక్కడా ఆపులేకండా నాన్ స్టాప్ గాఉత్సవంలాగా సాగిపోయింది .దీనికి నేను ఎవరికి కృతజ్ఞతలు తెలపాలో అర్ధం కాలేదు .అదృష్టం అందామా అంటే నాకు దానిపై నమ్మకం లేదే !దేవుని దయ అనుకొందామా అంటే నా ఒంటికి వాళ్ళు పడరే .’’చాన్స్’’ అను కొంటె ఏ సమస్యా ఉండదు .నా పర్యటనను ప్రగతి శీల వ్యక్తులు,సంస్థలు ఏర్పాటు చేసి నిర్వహించారు .రోజులు గడుస్తున్న కొద్దీ నాకు నమ్మకం కుదిరింది .ఇండియాకు నాపై నమ్మకం కలిగింది అనుకొన్నాను . అవును అది సాధ్యమే .అతను చేయ గలిగాడు .మనం కూడా చేయగలం .అతను సాధించాడు అన్నీ. మనమూ ప్రయత్నం చేస్తే సాధించి తీరుతాం అనుకొన్నారు ప్రజలు నన్ను చూసి అనిపించింది .
‘’ ఆంద్ర దేశం లో నా స్వగ్రామం ఉయ్యూరు వెళ్ళేదారిలో మా రైలు అనుకోకుండా ఒక చోట ఆగింది .అక్కడేమైనా రోడ్డు ప్రమాదం జరిగిందేమోననుకోన్నాను .అది యాక్సి డెంట్ ను మించిన విషయం అయింది .రైతు ప్రతినిధులు మా కంపార్ట్ మెంట్ లోకి ఒక్క సారి దూసుకు వచ్చారు .నా దగ్గరకొచ్చి ఆత్మీయ స్పర్శ తో కౌగిలించుకొని నాపేరు చెక్కిన విలువైన గడియారాన్ని నాకు కానుకగా ఇచ్చారు .ఎవరు వీళ్ళు ?నన్నెప్పుడూ చూడలేదే ?అందులో ఏ ఒక్కరూ నాకు తెలిసిన వారు కాదే?నేను వస్తున్నట్లు వాళ్లకు ఎలా తెలిసింది ?అదీ నాకు తెలియ లేదు .రైలు ఆగటానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ?నాకు అసలేదీ తెలియదు .వాళ్లకు నేనొక’’ ప్రతీక ‘’ను అయ్యాను అనుకొన్నాను .కీర్తి చాలా బరువైనది .మళ్ళీ పూల దండలు ,అభి మానపు పలకరింపులు ,పూల జల్లులు . కృతజ్ఞత తో తడిసి ముద్ద అయ్యాను.ఇంతటి అభిమానానికి నేను అర్హుడినా?మొదలైన ప్రశ్నలు నన్ను కలవర పెడుతున్నాయి . వంగి వంగి నమస్కారాలు, కులాసా పలకరింపులు , ,స్వాగతాలు అన్నీ ఆర్భాటం గా ఉన్నాయి .వారిలో ఏదో తెలీని ఉత్సాహం ,ఉత్సుకత ,ఆనందం తాండవిస్తోంది .అభిమానం కురిపించి మరీ నన్ను కుంగ దీసేస్తున్నారు .అ మనుషుల కళ్ళు తలలు ముఖాలు నవ్వులే నాకు కనిపించాయి .ఇంతకంటే మహోత్కృష్టమైన ఆనందం ,సంతోషం ,అనుభూతి మరెప్పుడూ నేను అనుభవించలేదు .మనసంతా ఆనంద కోలాహలం గా ఉంది .ప్రతి సారీ నాకు యువకులే కనిపిస్తున్నారు .వాళ్ళను చూస్తుంటే నేనూ యువకుడిగా మారిపోయానని పించింది .ఇండియా నుండి మళ్ళీ మాస్కో చేరిన తర్వాత నాకు సన్నిహితులు నవ్వుతూ ‘’మీరు అక్కడ ముసలి తనాన్ని వదిలేసి యవ్వనాన్ని మోసుకొచ్చారు ‘’అని జోక్ చేశారు దానికి నేను ‘’అవును .నిజమే .నేను యాభై ఏళ్ళు వెనక్కు వెళ్లాను ‘’అన్నాను నేనూ నవ్వుతూ .అంతటి ఉత్సాహం నాకు నా ఇండియా ప్రయాణం కలగ జేసి నన్ను యవ్వన వంతుడిని చేసింది మానసికం గా .ధన్య వాదాలు భారత మాతా ధన్యవాదాలు ఆంద్ర మాతా ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-15 ఉయ్యూరు
“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23
కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-23
రామయ్య గారి సాహిత్య కృషి
ఏటుకూరి బలరామ మూర్తి రాసిన ‘’ఏ బ్రీఫ్ సర్వే ఆఫ్ ది హిస్టరి ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంద్ర ‘’అని పుస్తకాన్ని రామయ్యగారు రష్యన్ భాషలోకి అనువదించారు ఈ అనువాదానికి జోర్యా పెట్రుచినోవా ,అనే తెలంగాణా ఉద్యమ విద్యార్ధి సహకరించాడు .అతనే మొట్టమొదటి సోవియెట్ ఫైలాలజిస్ట్ .ఆతను తెలుగు భాష ,సాహిత్యం లో ప్రత్యేక కృషి చేశాడు రష్యన్ అనువాదం 1956 లో మాస్కో లో ప్రచురింపబడి విడుదలయింది .రామయ్య గారు మొదటి తెలుగు –రష్యన్ నిఘంటు నిర్మాణానికి కృషి చేశారు .దీనికి కొందరు ఇండాలజిస్ట్ లు స్వెత్లానా జీనిట్ ఆధ్వర్యం లో సహకరించారు .
‘’ ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు విజ్ఞానపు వెన్నెలొచ్చెనమ్మా ,వెల్లువచ్చే నమ్మా ‘’
రామయ్య గారి మాటల్లో ఇండియా సందర్శన విశేషాలు
‘’1963 ఏప్రిల్ లో విమానం ధిల్లీ లో దిగింది .బయట ఉష్ణోగ్రత 45 డిగ్రీలుంది .అంత వేడిని నేనెప్పుడూ భరించలేదు .ఉత్తర దేశాలలోనూ ఇంత ఎండ చూడలేదు .ఏం చేయాలో పాలుపోలేదు .ఎవరొ ఒకరు కరు నన్ను కలవటానికి వస్తారని ఎదురు చూస్తున్నాను .రష్యన్ ఎ౦బసీకి మాత్రమె నా రాక తెలుసు .బంధువులనుండి అప్పుడప్పుడు గ్రీటింగ్ కార్డ్ లు అందాయి . వారెవరో నాకు పూర్తిగా తెలియదు .భగవంతుడికే తెలియాలి ఆ బంధుత్వం .దాదాపు అర్ధ శతాబ్దకాలం ఈ నేల మీద అడుగు పెట్టనే లేదునేను .
విమానం దిగుతూ మెట్లమీద కొంత గందర గోళం లో నేను నిలిచిపోయాను .ఎదుట జనం బాగా ఉన్నట్లు కనిపించారు .వారందరూ ఎవరికోసమో వచ్చినవారు అనిపించింది .నాకోసం అని నేననుకోలేదు నావెనక ఎవరైనా ఉన్నారేమో చూశాను. కాని ఎవరూ లేరు .నేనే విమానం దిగిన చివరి వాడిని .అప్పుడు తెలిసింది ఈ వచ్చిన వారంతా నాకోసమే, నన్ను కలవటానికే వచ్చారని .అక్కడ చేరిన జనం నవ్వుతున్నారు .కొందరు పాటలు పాడుతున్నారు .వారందరూ యువకులే అనిపించింది ఆ క్షణంలో .అన్ని వయసుల వారూ అందులో ఉన్నారు .మగ వారు ,ఆడ వారూ కనిపించారు .అందరు అత్యుత్సాహం గా నాదగ్గరకు వచ్చి స్వాగతం చెప్పారు .నాకు ఉక్కిరి బిక్కిరి అయింది .ఆనందం కలిగింది .కంగారు పడ్డాను .విచిత్రం ఏమిటంటే అందులో ఎవరూ నాకు తెలిసిన వారు లేరు .అంతమంది అంత ఉత్సాహం గా అక్కడ చేరి నాకు మనస్పూర్తిగా ఆహ్వానం పలకటం నేనెప్పుడూ చూడలేదు .కాసేపు మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయాను .కాసేపటికి తేరుకొని వచ్చిన వారిలో ఎక్కువ మంది నా బంధువులు కూడా ఉన్నారని తెలుసుకొన్నాను .అర్ధ శతాబ్దం తర్వాత వచ్చిన నాకు వారందరూ కొత్త వారే .కాని అక్కడున్న వారిలో నా ఆంద్ర జనం చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించింది .అక్కడ చేరిన వారిలో ధిల్లీ వాసులు తమిళులు ఎక్కువ మంది ఉన్నారు .కేరళ నుంచి వచ్చిన వారూ ఉన్నారు .అప్పుడు నాకు ‘’ భారత మాత ‘’నన్ను ఆహ్వానిస్తోంది అనిపించింది .ఒక ఆవిడకు వంగి నమస్కరిస్తే ఆమెకూడా అలాగే చేసింది .ఆమె నవ్వింది .రెండు చేతులు జోడించి సంప్రదాయ బద్ధం గా నమస్కరించింది .’’మీకు కృతజ్ఞులం లాల్ ‘’అన్నదామె .వాళ్ళు నాకు కృతజ్ఞత చెప్పటం ఏమిటి అని పించింది .ఇన్నేళ్ళు అయినా నేను నా భాషను ,ఆచార వ్యవహారాలను మర్చిపోలేదని తెలుసుకొన్నాను .నేను వచ్చింది నాకు ఆరంభాన్నిచ్చిన ఈ నేలకు నేను గౌరవ వందనం ,కృతజ్ఞత చెప్పాలని . వాళ్ళను మర్చిపోలేదని ,తేలిక భావం తో చూడలేదని వారు గ్రహించారు. వాళ్ళ ఆశలను వమ్ము చేయ లేదని సంతోషించారు .వాళ్ళు అనుకొన్నట్లు నేను తాసీల్దార్ కాలేక పోయానని ,పనికి రాని పువ్వుగా ఉండిపోలేదని తెలుసుకొన్నారు .నన్ను చూసినందుకు వారందరికీ సంతోషం సంతృప్తి కలిగింది .నా జీవితం ఆ దేశం లో వ్యర్ధం కాలేదని పొంగిపోయారు .నేను నా జీవితం లో ఇండియాకు రష్యాకు సమానంగా చెందినా వాడిలాగానే ఉన్నాను .భారత మాత పుత్రుడొకడు రష్యాలో ప్రసిద్ధు డయ్యాడని వారు తెలిసి సంబర పడ్డారు .నన్ను చూసి గర్వ పడ్డారు .నాలో వారు కష్టమైన మార్గం లో పయనించి సత్యం ,సంతోషం లకు చేరువయ్యే భారత దేశాన్ని చూశారనిపించింది ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15 –ఉయ్యూరు
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-22
కాన్ స్టాన్టిన్ సెర్జియో విచ్ –అనే రామయ్య
1959లో మాస్కో లో ఒక ఇంటర్వ్యు ఇస్తూ రామయ్య ‘’ఇండియా, రష్యా ప్రజలకు సహాయం చేయటం నావిధి .వారు ఒకరినొకరు పరస్పరం అర్ధం చేసుకోవాలి .’’అన్నారు చెప్పటమేకాడు అక్షరాలా చేసి చూపించారు .ఈ ఇంటర్ వ్యూ ను ‘’సోవియట్ లాండ్ ‘’పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు అందులో రామయ్యగారు భౌతిక ,రసాయన శాస్త్రాలలో చేసిన కృషిని వివరిస్తూ ఆయన అందించిన విశిష్ట సేవలను ప్రస్తుతించాడు ఇంటర్వ్యు చేసిన అయన .రామయ్య గారు తన ఫ్లాట్ లో తరచుగా ఇండియన్ ,రష్యన్ స్నేహితులతో కలిసి మాట్లాడేవారు .’’ఓరియెంటల్ స్టడీస్ ‘’,ఇండాలజీ ‘’లకు చెందిన విద్యార్ధులు వచ్చి తెలుగు నేర్చుకొనేవారు రామయ్యగారి వద్ద .’’ప్రోగ్రెస్ ‘’అనే ప్రచురణ సంస్థ రామయ్య గారి దగ్గరకు వచ్చి ,తమ ఇండియా ప్రచురణల పై ,ఇండియాను గురించి తెస్తున్న ప్రచురణలపై సలహాలు తీసుకొనే వారు .సంప్రదింపులు జరిపే వారు . వారందరికీ భారతీయమైన సంప్రదాయమైన ఆతిధ్యం ఇవ్వటం రామయ్య గారి ప్రత్యేకత .వారు అడిగే ప్రశ్నలకు వివరంగా సమాధానాలు చెప్పేవారు .అవసరమైతే ఇండియా పై,సోవియట్ పై ఉపన్యాసాలు చేసేవారు .వచ్చిన అతిధులకు తెలుగు జానపద గీతాలను రికార్డ్ ప్లేయర్ పై వినిపించి ఆనందం కలిగించేవారు .ఇండియా నుంచి వచ్చే రష్యా యాత్రికులూ క్యూ కట్టే వారు .అందరికి చిరునవ్వు తో ప్రశాంత వదనం తో భార్య కాత్యా ఆతిధ్యమిచ్చేది .ఆమె వారందరికీ ‘’రష్యన్ సీత ‘’ అయి పోయింది .ఆమె వికసిత నీలి కనులతో ,అందమైన నల్లని కురుల మధ్యలో తెల్లని పాయలలతో ,చెరగని చిరు నగవుతో ,గాంభీర్య వదనం తో అపర అన్నపూర్ణా దేవి అనిపించేది .కాత్యా కాదు ఆత్మీయులకు ‘’కాత్యాయనీ దేవి ‘’అనిపించేది .వాళ్లకు ఆంధ్రా రామయ్య- రష్యన్ ఆంధ్రుడుగా ,సోవియెట్ ఆంధ్రునిగా, మాస్కో ఆంధ్రునిగా దర్శనమిచ్చేవారు. ఆ అనుభూతి పొంది వారు ధన్యులమయ్యాం అనుకొనేవారు .సోవియట్ ప్రజలు ఆయన్ను ‘’కాన్ స్టాన్టిన్, సెర్జియో విచ్ ‘’అనే రష్యన్ పేరుతొ సంబోధించేవారు .కాని ఉత్తర ప్రత్యుత్తరాలలో ‘’రామయ్య’’ అనే సీతారామయ్య గారు రాసేవారు .అందుకని రామయ్య పేరే అందరికి బాగా పరిచయమై ప్రాబల్యమైంది .
రామయ్యగారి మహోన్నత మూర్తిమత్వం
రామయ్య గారి మర్యాదపూర్వక సౌజన్యానికి అందరూ ముగ్దులయ్యేవారు .ఎక్కడా ఎప్పుడూ ఆయనలో’’ ఈగో ‘’అనేది కనిపించేదికాదు .ఈగో ను ‘’గో ‘’అని తరిమేసిన పెద్దమనిషి రామయ్య .యెంత పెద్ద పెద్ద ప్రముఖ వ్యక్తులోచ్చినా ,ప్రసిద్ధ శాస్త్ర వేత్తలు వచ్చినా వారితో అనువుగా, చనువుగా, అణకువగా సంచరించేవారు .ఆధిక్యం ఏ కోశానా కనపరచేవారుకాదు .రామయ్య గారు డబ్బు మనిషి కాదు. సంపదల వెంట పరుగులు తీయ లేదు .ఆయన ఉన్న అపార్ట్ మెంట్ లో కనీస సౌకర్యాలు మాత్రమే ఏర్పాటు చేసుకొన్నారు ఇండియా నుంచి వచ్చిన వారు అందజేసిన బహుమతులు ,ప్రతిమలు ,అల్లికలు , కేలెండర్ లు విలువైన తెలుగు గ్రందాలతో ఫ్లాట్ నిండిపోయి ఉండేది .వారికి తెలుగు మహాకావ్యాలలోని తనకిష్టమైన పద్యాలను మరీమరీ చదివి వినిపించేవారు . తనకు అభిమానులైన మహాకవి తిక్కన ,మధురకవి బమ్మెర పోతన ల రస గుళికల వంటి వందలాది పద్యాలు రామయ్యగారికి కంఠతా ‘వచ్చు .కృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద ప్రబంధం అంటే ఆయనకు పరమ ప్రీతీ .అందులోని ప్రతిపద్యం, తాత్పర్యం లోతైన విషయాలు ఆయనకు కరతలామలకాలే .సంప్రదాయ సాహిత్యం అంటే ఎంతటి’’ మోజు’’ ఉండేదో రామయ్య గారికి, విప్లవ భావాలతో శ్రీ శ్రీ రాసిన మహా ప్రస్తాన గేయాలన్నా అంతటి ‘’క్రేజు ‘’ఉండేది .అందులో గీతాలను గుక్క తిప్పుకోకుండా అప్పగించినట్లు ఉదాహరిస్తూ చెప్పి ఆశ్చర్య పరచేవారు .కవిత్వం పై అంతటి సమ ద్రుష్టి ఆయనది .కొడవటిగంటి కుటుంబరావు రాసిన వాస్తవ నవలలు ఆసక్తిగా చదివారు .
యువజన విద్యార్ధి బృందానికి ఆతిధ్యం
కాట్రగడ్డ గంగయ్య అనే ఆయన ముగ్గురు యువకులతో ఆంద్ర దేశం నుండి మాస్కో నగరానికి 1957 లో’’ ‘’ ఆరవ ప్రపంచ యువ జన విద్యార్ధి ఉత్సవాలకు ‘’ వచ్చి రామయ్యగారిని దర్శించి అమితానందాన్ని పొందారు .వాళ్ళు హోటల్’’ ఆస్టాన్ కినో ‘’లో ఉండి రామయ్యగారికి ఫోన్ చేశారు .ఫోన్ నంబర్ ను ‘’అతడు –ఆమె ‘’నవలా రచయిత రష్యాలో అనువాదకుడిగా పని చేసిన ఉప్పల లక్ష్మణ రావు గారి నుండి తీసుకొన్నామని రామయ్య గారికి చెప్పారు .ఫోన్ అందుకొన్న రామయ్య గారు అచ్చమైన తెలుగులో ‘’నమస్కారం గంగయ్య గారూ !మా ఊరికి ఎప్పుడోచ్చారు?’’అని కుశల ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకొన్న మనసున్న మనిషి. వారు రామయ్య గారిని తామున్న చోటుకు రావద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ,అప్పటికి తనకున్న ఎంగేజ్ మెంట్ లనన్నిటిని రద్దు చేసుకొని ,తన కూతురు లీలావతి ని వెంట తీసుకొని ఒక గంట లోపే హోటల్ కు చేరారు .వాళ్లకు కూతురిని పరిచయం చేస్తూ ‘’ఈమె లీలావతి మా పెద్దమ్మాయి .వ్యవసాయ శాస్త్రం చదువుతోంది .’’అని కమ్మని తెలుగులో చెప్పారు .తెల్లబోయారు గంగయ్య .ఒకరికొకరు బాగా పరిచయమై వివరాలన్నీ మాట్లాడుకొన్నారు .వారిమధ్య సంభాషణ తెలుగులోనే దాదాపు జరిగింది .ఆంద్ర నుండి వచ్చిన వారికి మాట్లాడేటప్పుడు సరైన తెలుగు మాట స్పురించక పొతే రామయ్య గారే వెంటనే సరైన మాట చెప్పి ఆశ్చర్య పరచేవారు .గంగయ్య బృందం పదిహేను రోజులు ఉంది మాస్కో లో తరచూ వీరితో సమావేశామయేవారు .రామయ్యగారి ఫ్లాట్ కు వచ్చి ఆతిధ్యం తీసుకొన్నారు . కాత్యా వారందరికీ ఆంధ్రా వంటకాలు చేసి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టింది .రామయ్య గారి స్టడీ రూమ్ లో తెలుగు దినపత్రికలైన ఆంద్ర పత్రిక ,కృష్ణా పత్రిక ,విశాలాంధ్ర కట్టలు కట్టలుగా ఉండేవి .ఇందులోకొన్ని 1930 కాలం నుండి కూడా ఉన్నాయి. వీటిని ఇంత భద్రం గా బంగారంగా దాచుకొన్నారు ఆంధ్రాభిమాని రామయ్య .అవన్నీ అప్పుడు విజ్ఞాన సర్వస్వాలుగా ఉండేవి .ప్రతి సంచికా దాని ప్రత్యేకత కలిగి ఉండేది .అదొక అక్షర నిధి .అందుకే రామయ్య అంత జాగ్రత్తగా పదిల పరచుకొన్నారు .గ్రామఫోన్ లో తెలుగు పాటలు వారికి వినిపించారు .వీరినీ వీరితో బాటు వచ్చిన యువజన విద్యార్ధి బృందాన్ని తాన ఇన్ ష్టి ట్యూట్ కు ఆహ్వానించి అక్కడ జరుగుతున్న పరిశోధనలపై అవగాహన కలిగించారు . రామయ్య గారి యెడల ఆయన సహచరులు చూపిన గౌరవ మర్యాదలకు,ప్రేమానురాగాలకు అతిధులు ఆశ్చర్య పోయారు .అక్కడి’’ టోస్ట్’’ ను స్వీకరించి న తర్వాత అతిధులను రామయ్యగారు మాట్లాడమన్నారు ‘’మీరు తెలుగులో మాట్లాడండి .నేను రష్యన్ లోకి తర్జుమా చేసి వారికి తెలియ జేస్తాను ‘’అని చెప్పి అలానే చేశారు .గంగయ్య గారి బృందం రామయ్య గారితో ‘’అయ్యా రామయ్య గారూ ! దయ చేసి ఒక సారి మనదేశం ఇండియా ను సందర్శించ వలసినదిగా వినయ పూర్వకం గా మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాం ‘’అని ప్రార్ధనా పూర్వకం గా వేడుకొన్నారు .’’ .కాలం కలిసి వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను ‘అని క్లుప్తంగా సమాధానం చెప్పారు రామయ్య . దటీజ్ సీతా రామయ్య .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15-ఉయ్యూరు
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-21
పోస్టల్ బాంబ్ ?
విజ్ఞాన శాస్త్ర మహా వృక్షపు శాఖలన్నిటినీ సమర్దులైనవారు తీర్చి దిద్దుతున్నారు .రామయ్య గారి ప్రయోగ శాలలో ఎప్పుడూ ,ఎన్నడూ తగాదాలు ,అపోహలు రాలేదు . ఎప్పుడూ చిరునవ్వులే వికసించేవి .మనస్పూర్తి అభినందనలే ఉండేవి .అకస్మాత్తుగా ఒక రోజు ఒక ఉత్తరం రామయ్యగారికి ‘’బాకు ‘’లో ఉండే స్నేహితుల నుండి వచ్చింది .దానిపైన పొగలుకక్కే ఒక గుండ్రని బాంబు బొమ్మ దాని ,కింద ‘’జాగ్రత్త .ఒక గ్రెనేడ్ ను పంపుతున్నాం ‘’అని రాసి ఉంది. టెన్షన్ మొదలైంది .ఒక రోజు తరవాత ఒక పార్సిల్ వచ్చింది .విప్పి చూస్తె అందులో పళ్ళు ,దానిమ్మ పళ్ళు ఉన్నాయి .ఒక హెచ్చరిక కూడా రాసి ఉంది ‘’కొత్త విధానం లో మీరు నిర్వహించిన పరీక్షలు దిగ్విజయం అయినాయని తెలిసి సంతోషం తో అభినందిస్తున్నాం .త్వరలో ప్రోటోకాల్ పంపుతున్నాం .drink to your health ‘’అని చదివి అందరూ తేలికగా హాయిగా ఊపిరి పీల్చుకొన్నారు .సైంటిస్ట్ రామయ్య’’ సక్సెస్ రామయ్య’’అయ్యారు .
రామయ్య గారింటికి భారతీయల రాకపోకలు
యాభవ దశకం లో (1950) ఇండియా నుంచి ఎక్కువగా భారతీయులు మాస్కో కు రావటం ప్రారంభించారు .ఇందులో సైంటిస్ట్ లు ,వివిధ విషయాలలో స్పెషలిస్ట్ లూ ,రిసెర్చ్ స్కాలర్లు ,పోస్ట్ గ్రాడ్యుయేట్లు ,విద్యార్ధులు ఉన్నారు .కళాకారులు రచయితలూ వచ్చేవారు .అందులో రామయ్య గారి ఆంద్ర దేశ బంధు గణమూ ఉండేది .
రామయ్య గారి తెలుగు నిఘంటు నిర్మాణం
అనుకోకండా ఒక సారి రామయ్యగారు తెలుగు నిఘంటు నిర్మాణం ప్రారంభించారు .దీనితో పరిచయాలు మరీ విస్తృతమైనాయి .భాషా శాస్త్ర వేత్తలు ,భాషా తత్వ శాస్త్ర్జులు (ఫైలాలజిస్ట్ లు ),అనువాదకులు ఇంటికి వచ్చి చర్చలలో పాల్గొనేవారు .తెలుగు నేర్చుకోవాలన్న అభిలాష గల విద్యార్ధులు వచ్చి రామయ్యగారి వద్ద తెలుగు నేర్చుకొనేవారు .ఒక సారి ‘’ఆంధ్రుల చరిత్ర ‘’ను రష్యన్ భాషలోకి అనువదించమని కోరటం జరిగింది .చాలా సంతోషం గా దీన్ని నిర్వహించారు .ఇండో రష్యన్ ప్రజలు పరస్పరం అర్ధం చేసుకొని సహకరించుకోవాల్సిన అవసరం ఏంతో ఉంది అనిపించింది .మంచి స్నేహితులు ,ఇండాలజిస్ట్ లు ఆయనతో కలిసి పని చేసేవారు .తనను వారందరూ జ్ఞాపకం చేసుకొంటూనే ఉంటారని ,మనసులలో ఆత్మీయ భావాన్ని చూపుతూ ఉంటారని భావించారు రామయ్య .
అన్నపూర్ణ గృహం
మాస్కో వచ్చిన ప్రతి భారతీయుడు తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం పొంది స్వంత ఇంట్లో ఉన్న అనుభూతికి లోనయ్యేవారు .అప్పటికే రామయ్యగారికి 78 ఏళ్ళు వచ్చాయి .వయసురీత్యా తాను ఇండియన్ కమ్యూనిటీలో పెద్ద వాడినని అనుకోవటం లేదన్నారు .అంతేకాదు తాను ఆ జన సమూహం లో లేరు కూడా .తానొక సోవియట్ పౌరుడినని ,ఇదే తన ఇల్లు అని అనుకొనేవారు .అయినా ఇండియా నుంచివచ్చే యువకులు , వృద్ధులు రామయ్య గారింటికి వచ్చి టీ తాగి హాయిగా కబుర్లు చెప్పుకొని వెడుతూ ఉండేవారు .వారందరికీ తను పెద్ద అంతే .వారిని చూడటం వారితో మాట్లాడటం రామయ్యగారికీ ఎక్కువ సంతోషంగా నే ఉండేది .వారంతా తన సోదరులనుకోనేవారు. తాను పెద్దన్న .ఇన్నేళ్ళుగా తాను రష్యాలో ఉంటున్నా తన మాత్రుదేశమైన తెలుగు దేశం తెలుగుభాష సంస్కృతీ ,పద్ధతులను మరచిపోలేదని గర్వంగా రామయ్య గారు చెప్పుకొన్నారు .వారికి సదా ఆహ్వానం అనేవారు రష్యన్ పద్ధతిలో వారికి ఆతిధ్యమిస్తాను అన్నారు .భారతీయ సంస్కృతికి దూరం కాలేదన్నారు .తనకు జన్మ నిచ్చిన దేశమాత ఋణం తీర్చుకోలేనిదనేవారు. తనను పెంచుకొన్న తండ్రి నేర్పిన సంస్కార బలమే ఇదంతా అనేవారు .
శక్తి తగ్గి పోతుండగా ఒక సారైనా తనను కనీ ,పెంచి ఇంత దూరంలో ఇంత అందమైన దేశానికి పంపిన మాత్రు దేశం ఇండియా వెళ్లి చూసి రావాలనిపించేది .ఆంద్ర దేశపు శ్రావ్య సంగీత ధ్వనులు చెవులలో రింగున మారు మోగుతూ ఉండేవి .భారత దేశం సందర్శించమని ఎందరో ప్రముఖుల నుండి సంస్థలనుండి ఆహ్వానాలు వస్తూ౦డేవి .వీటన్నిటికి సమాధానం గా 1963లో 42 ఏళ్ళ తర్వాతా 42 రోజులు ఇండియాలో గడపటానికి రామయ్య గారు వచ్చారని మొదట్లోనే చెప్పుకొన్నాం .రామయ్యగారి’’ కేమోటాలజి ‘’ని ఇప్పుడు ‘’ట్రైబో కేమిస్ట్రి’’అని పిలుస్తున్నారు .కేమోటాలజిపిత ‘’ ఇప్పుడు’’ ట్రైబో కెమిస్ట్రీ పిత ‘’అయ్యారన్నమాట .
రామయ్య గారి కుటుంబం
రామయ్య గారు మాస్కో చేరిన కొన్నేళ్ళకు జర్మన్ జాతికి చెందిన వోల్గా తీరం లోని పావ్ లోఝీ ప్రాంతానికి చెందిన ఏంజెల్ వాసి ‘’ఎకటేరినా లోగన్నోవ్నా బెల్జేర్ అనే ఆవిడను వివాహం చేసుకొన్నారు .ఈవిడనే’’ కాత్యా’’ అంటారు .ఆమె అతిదులపాలిటి ‘’కాత్యా ‘’యనీ దేవి .1934 లో ఈ కాత్యా ,రామయ్య దంపతులకు లీలావతి అనే కుమార్తె జన్మించింది .ఈమె బయలాజికల్ సైన్సెస్ లో మాస్టర్ డిగ్రీ సాధించి ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ జెనరల్ జెనెటిక్స్ R.A.N .లో సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ గా ఉంది .1936 లోనే రామయ్య సోవియట్ పౌరులయ్యారు .సోవియట్ లో ఉండటం వలన ఆ దేశం తో బాటు తానూ కష్టమూ సుఖమూ రెండూ అనుభవించాను అంటూ ఉండేవారు .తాను ఇండియాలో పుట్టినా జీవితం లో ఎక్కువ భాగం రష్యాలో గడిపానని ,సోవియట్ పౌరుడుగా ఉన్నందుకు గర్వం గా ఉందని చెప్పేవారు .1945లో రామయ్య దంపతులకు రెండవ ఆడపిల్ల నీల వేణి పుట్టింది .ఆమె స్టేజి నటి .డెన్మార్క్ కు వెళ్లి ,అక్కడ నటన లో శిక్షణ నిచ్చి కోపెన్హాం లో ధీరిటికల్ ఇన్స్టిట్యూట్ ను నడుపుతోంది .
మాస్కో లో ఉన్న రామయ్య నిజమైన సోవియెట్ పౌరునిగా ఉండేవారు . అంతమాత్రం చేత భారత దేశాన్ని ,తన మూలాలున్న స్వగ్రామం ఉయ్యూరును విస్మరించలేదు .ఆయన ఆల్బం లో వీటి తాలూకు తీపి గుర్తుల ఫోటోలున్నాయి .వాళ్ళ పొలాలు ,నీటిబావి ,బిల్డింగులు అన్నీ భద్రం గా ఫోటోలలో భద్ర పరచుకొన్నారు .మాతృభూమి అభిమానం అంత గొప్పది .తన బంధు గణం గురించి చాలా ఏళ్ళు ఆయనకు తెలియనే తెలియదు .కుటుంబం లో వచ్చిన మార్పులూ తెలియవు .బ్రిటిష్ వారు పరి పాలిస్తున్న రోజులు కదా అవి .అందుకని ఇంటికి ఉత్తరం రాస్తే ప్రభుత్వం వారిని ‘’బ్లాక్ లిస్టు ‘’లో పెడుతుందేమో అనే అనుమానమూ ఉండేది, ఉందికూడా .1947లో భారత దేశం స్వాతంత్ర్యాన్ని పొందటం అందరికి సంతోషమైంది .అప్పటి నుండి రామయ్యగారు స్వగ్రామానికి ఉత్తర ప్రత్యుత్తరాలు కొన సాగించారు .ఇప్పుడు ఉయ్యూరులో ఉన్నవారందరూ తన కుమారులు ,మనవళ్ళు అయిపోయారు .ఉయ్యూరు బంధువులను రామయ్యగారు భార్యా పిల్లలకు పరిచయం చేసేవారు .పిల్లలు కూడా తమ తండ్రిగారి ఉయ్యూరు మూలాలు చూసి, విని పులకించి పోయేవారు .ఎంత దూరమైనా రక్త సంబంధం అంత తియ్యగా ఉంటుందన్నమాట .ఒక సారి రెండవ కూతురు నీలవేణి తన తోటి సెకండరీ క్లాసు పిల్లలకు ఇండియా, దాని భౌగోళిక పరిస్తితుల గురించి చక్కని రిపోర్ట్ ఇచ్చిందని రామయ్య గారు గర్వంగా చెప్పుకొన్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15 –ఉయ్యూరు
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-20
రామయ్య గారి మిత్రబృందం లో మరి కొందరు ప్రముఖులు
రెజెర్ ఫోర్డ్ ను తన స్నేహితుడు అని చెప్పుకొనే సాహసం చేయలేను అంటారు రామయ్య .మహోన్నతుడైన ఆ మహానుభావుడి పరిధిలో జీవించాను అని గర్వ పడ్డారు. ఆయనకు రామయ్యగారంటే మహా అభిమానం .కాని మర్యాదకు ఆయన మాత్రం రామయ్య గారిని ‘’నీకు తెలుసా మిత్రమా ?’’అని సంబోది౦చే వాడట .అలాగే ఎకడమీషియన్స్ గుబ్కిన్ ,నమేట్కిన్ కూడా అదే తీరున మాట్లాడేవారు .రబీందర్ సరే సరి .రబీందర్ తో బాంధవ్య విషయం లో మర్యాద పూర్వకమైన దూరాన్ని కలిగి ఉండేవాడినని,ఆతను తనకు నిజమైన మిత్రుడు అనటం లో ఏ సందేహమూ లేదన్నారు. ఆతను కూడా రామయ్య గారిని అలానే భావించేవాడు .
వెర్నాడ్ స్కి
వెర్నాడ్ స్కి మాత్రం ఆశ్చర్యకరమైన మనిషి .ఆయనకున్న అపార జ్ఞానం రామయ్యగారిని సంభ్రమ పరచింది. ఆయనతో మాట్లాడటం ఏంతో సంతోషంగా ఉండేది . అతనికి ఇండియన్ ఫిలాసఫీ పై ఉన్న అపార జ్ఞానానికి ,పట్టుకు అతనిపై గౌరవం పెరిగింది కూడా .ప్రపంచ దృష్టిలో భారత దేశం పై గౌరవం వెర్నాడ్ స్కివలన పెరిగింది అనుకొనేవారు .అతని శాస్త్రీయ కీలక భావనలకు రామయ్య గారు తోడ్పడ్డారు. .అందులో ఆనందాన్ని అనుభవించానని రామయ్య గారు చెప్పుకొన్నారు .
లెనిన్ శిష్యుడు – క్రేజినోవ్ స్కి –
ఎకడమీషియన్ క్రిజినోవ్ స్కి తన మీద గొప్ప ప్రభావం కలిగించాడు అంటారు రామయ్య .అతనిలో రష్యా విప్లవ చాయలు దర్శించానన్నారు .ఆయన రష్యా రివల్యూషన్ కు ప్రతీక గా భావించారు రామయ్య .అంతే కాదు రష్యా దేశపు శాస్త్రీయ ఆధారం ,చారిత్రాత్మకంగా దాని అవసరం అన్నీ ఆయనలో కనిపిస్తాయట .ఆయన విదేశీయ విధానం లో కమిషరేట్ వర్కర్ అనిపిస్తాడు .అదే రామయ్య గారి మనసుపై భద్రమైన ముద్ర వేసింది .ఇద్దరూ ఒకే విధమైన భావాలు కలిగి ఒకే తీరున వ్యవహరించటం ఒకే రీతిలో రూపు దిద్దుకోవటం ఆశ్చర్యమేసేది రామయ్యగారికి .చాలా శక్తి గలవాడే అయినప్పటికీ సహృదయ సంపన్నుడు . ఈ ఇద్దరూ విదేశీ విధాన వాతావరణం లో గణనీయమైన, భావాత్మక మైన ,సగుణాత్మకమైన మార్పులు తెచ్చారు .వీరిద్దరిని చూస్తే ధ్వని శాస్త్రం లో ఉపయోగించే ‘’ట్యూనింగ్ ఫోర్క్ ‘’లా అనిపించేవారట రామయ్యగారికి .అయితే ఇందులో క్రేజేనోవ్ స్కి అంటేకొంచెం ఎక్కువ వీరాభిమానం ఉండేదట .అసదృశ వ్యక్తీ అనిపిస్తాడట .పవర్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ అయిన ఆయన లోపలి భావాగ్ని తో నిత్యం రగులుతూ ఉండేవాడట .పని యెడల ఆయనకున్న అమితాసక్తి, దీక్ష ,అంకితభావం అంటువ్యాధిలా అందరికీ సోకుతుంది .అదీ ఆయన ప్రభావం .లెనిన్ నాయకత్వం వహించిన బోల్షేవేక్ పార్టీకి చెందినవాడని చూడంగానే చెప్పేయచ్చు .జీవించి ఉండగా రామయ్య గారు లెనిన్ ను చూడలేక పోయారు .కాని క్రేజినవ్ స్కి ని చూస్తె లెనిన్ ఎలా ఉండేవాడో ఊహించుకో వచ్చు ట.శిష్యుడిని చూసి గురువు స్వభావాన్ని తెలుసుకో వచ్చుకదా అంటారు
గ్లేబ్ మాక్షి మిలియోనోవిచ్ తో తాను తన సైంటిఫిక్ సమస్యలను చర్చి౦చేవాడి నని ,ఈయన కూడా పని విషయం లో క్రేజేనోవ్ స్కి లాగే చరిత్ర సృష్టించాడని చెబుతారు .ఎందరో స్నేహితులు .,వారు పాడే విప్లవ గీతాలు రామయ్యగారికి బాగా ఇష్టం .అందులో ‘’వర్షావ్యాంకా ‘’గీతం మరీ ఇష్టం రామయ్య గారికి .ముసలి తనం లోనే కాదు యవ్వనం లోనూ ఆ గీతం ప్రభావితం చేసిందిట .ఒకప్పుడు దేశాన్ని ఉర్రూత లూగించి విప్లవోన్ముఖులను చేసిన ఈ గీతం ఇప్పుడు జానపద గీతమై పోయింది .ఈ గీతాన్ని క్రేజోనోవ్ స్కి రాశాడని తెలిసి రామయ్యగారికి వీరాభిమానం మరీ పెరిగిపోయింది .సోవియట్ సైన్స్ కు గొప్ప నిర్దేశకుడు ,నిర్వాహకుడు ,లెజెండరీ పర్సనాలిటి, మర్యాదాపురుషుడు ,ఎప్పుడూ సర్వసిద్ధం గ ఉండేవాడు అయిన క్రిజినోవ్ స్కి నిజం గా అద్భుత వ్యక్తీ కాదా ?అవును అవును అవును .
సామాన్య అసామాన్య కృషి
వీళ్ళందర్నీ గుర్తుకు తెచ్చుకొంటు౦టే వారిలో సామాన్యుడు అసామాన్యుడు కలిసి ఉండటం యాదృచ్చికం కాదని పించింది రామయ్యగారికి .సామాన్య విషయాలలో వారి అసామాన్యత ప్రతి ఫలింఛి సోవియెట్ దేశ ప్రగతికి తోడ్పడేది .కొత్త తరహా వ్యక్తిత్వం ఆవిష్కరింప బడేది .కొత్తపాటలు బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి .వాటిని గాయకులు పాడుతుంటే అందులోని భావ గాంభీర్యానికి ముగ్దులయ్యేవారు .క్రిజనేస్కి రచయిత ,ఆయన ,ఒక ప్రాఫెట్ లాగా ,ఒక బోధకుడులాగా సామాన్య జనాలకు అతీతంగా ఉన్నట్లు కనిపించేదికాదు .ఆయన కామ్రేడ్ లలో ఒక కామ్రేడ్ లాగా ఉండేవాడు .అంటే వాళ్ళపని తనపని అనుకోవటమే ఇందులో ఉన్న విశేషం .పోక్రాస్ ఇంటి పేరున్న సైంటిస్ట్ లతో రామయ్య గారు పని చేశారు .పండగ ,పబ్బాలలో,ఉత్సవాలలో వాళ్ళతోకలిసి రామయ్యగారు ‘’మాస్కో ఇన్ మే ‘’గీతం ,ఉత్సాహం గా పాడేవారు .ఈ పాట సోవియట్ యూనియన్ అంతటా బహుళ వ్యాప్తమైంది అంటే ఆశ్చర్య పడాల్సిన పని లేదని ఈ గీతాన్ని వారి సోదరులే రాశారని తెలిసి కూడా ఆశ్చర్యపడలేదు అన్నారు.
ఏదో ఒక కాన్ఫరెన్స్ లో సహోద్యోగి రామయ్యగారితో ఒకతన్ని చూపించి ‘’ఈయన ఎవరో తెలుసా? ఫాదీవ్- లేవిన్ షన్ కేరక్టర్.కు తానే మాటలు రాసుకొన్నాడు .’’అని చెప్పినా ఆశ్చర్యం కాలేదు అదేమీ పెద్ద ప్రాధాన్య మైన విషయం అనిపించలేదు . తన ముందు ఫదీవ్ రాసిన ప్రసిద్ధ నవలలోసజీవ నాయకుడు ఉన్నాడు .అయినా మామూలు విషయం గానే తోచింది .అంతర్యుద్దం ముగిసిన తర్వాత ఈ హీరో గారు మామూలు పనిలో చేరి కొత్త దేశ పునర్నిర్మాణం లో భాగస్వామి అయ్యాడు .ఇలాంటి హీరో లెందరితోనో రామయ్య గారు పని చేశారు .వీరంతా చాలా సాదా సీదాగా, ధైర్యంగా గొప్ప పనులు చేసుకు పోయేవారు .ఇందులో ఎక్కువ మంది పుస్తకాలు రాయలేదు .రచయితలూ వీరిలో కొద్దిమందే ఉండేవారు వీరిలో చాలామంది తాము చేస్తున్న పని మహత్కార్యం అని ఎన్నడూ విర్ర వీగలేదు .కర్తవ్యమ్ చేస్తున్నాం అనే అభిప్రాయమే వారికి ఉండేది .అందుకే సామాన్యుడికి ,అసామాన్యుడికి అందరికి పనికి వచ్చే ‘’కామ్రేడ్ ‘’అనే గొప్ప మాట పుట్టి సార్ధకమయింది అంటారు రామయ్య .
రామయ్య గారి సంస్కారం
వీరందరితో తరచుగా సమావేశాలు జరపటం విషయ చర్చ,సమస్య పరిష్కారం చేయటం నిజంగా ఆనంద దాయకమైన విషయం గా ఉండేది రామయ్య గారికి .అంతేకాదు ఆసియా ఆఫ్రికా దేశాలు ‘’కాలనీ కాడిని ‘’విప్పి అవతల పారేసి తమతో చేతులు కలిపినప్పుడు సైన్స్ లో వారికి ఏమికావాలన్నది కూడా చర్చించేవారు .సైన్స్ చరిత్ర గురించి, దాని భవిష్యత్తు గురించి ,ప్రజల భవితవ్యాన్ని గూర్చి విపులంగా చర్చ జరిగేది .గొప్ప సైంటిస్ట్ లందరూ వీరిలో నుంచే వచ్చారు. వారు సైన్స్ కు ,ప్రజలకు చేసిన సేవ నిరుపమానం .వారి ప్రజాస్వామ్య భావాలు దెబ్బతిన కుండా వారి ప్రకృతికి విరుద్ధం కాకుండా ,పౌర జీవితం అందించటం ఒక పెను సవాలుగా ఉండేది .వెర్నాడ్ స్కి చెప్పిన ‘’మా ప్రజాస్వామ్యం లో ఆదర్శాలు సహజ ప్రకృతితో కలిసే ఉంటాయి .అందుకే మా భవిష్యత్తుపై నమ్మకం ,భరోసా కలిగి ఉంటాం .అది మాచేతుల్లో ఉన్నపనే ,దాన్ని జారిపోనివ్వం ‘’అని చెప్పిన మాట రామయ్య గారి చెవిలో అనుక్షణం ప్రతిధ్వనించేది .ఈ మాటలు చెప్పిన వాడు ముసలి వాడుకాదు .నవ యువకుడు .జీవిత ప్రాంగణం లోకి అడుగు పెడుతున్నవాడు ,సుదీర్ఘ ప్రయాణం ప్రారంభిస్తున్నవాడు అతనిలో ఎంతటి ఆత్మ విశ్వాసం ఉందో నని పించింది .ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ వలన ఏర్పడిందన్నారు రామయ్య. సోవియట్ దేశపు సైన్స్ స్వభావం వలన ఏర్పడిన ఆశ ,ఆత్మ విశ్వాసం అది అంటారు రామయ్య .అదే దాని నిర్మాతల(ఫౌండర్స్) కృషిలో దర్శనమిచ్చింది .
తాను ఇంతకాలం సైన్స్ లో ఇలాంటి సామాన్య వర్కర్లతో పని చేశానని, వారు సిద్ధాంతాలనుజీవిత ప్రయోగాలు గా మార్చి ఫలితాలు అందించారని అంటారు రామయ్య .వాళ్ళ సుఖ దుఖాలలో తానూ పాత్రధారిగా ఉండే వాడినని నని అన్నారు .వారి క్రుతజ్ఞతకు పాత్రత వీరందరి సహకారం వల్లనే నన్నారు .ఈ యువత లేకపోతే తన సిద్ధాంత బీజం మొలకెత్తి వృక్ష రూపం పొందేదే కాదన్నారు. తమ విధానాలకు వాళ్ళు జీవం పోశారు .వాళ్ళే తనతో బాటు ఉండి పని చేసి తన ఆలోచనలకు రూపు రేఖ లేర్పరచి నవీన పరికరాల సృష్టిలో భాగ స్వామ్యులై తోడ్పడ్డారని గర్వంగా చెప్పారు రామయ్య .వీరందరి సహకారం వల్లనేసోవియట్ యూనియన్లో కొత్త సాంకేతికతలో ప్రమాణాలు (స్టాండర్డ్ లు) సాధించగలిగామని కృతజ్ఞతా భావం గా చెప్పారు .అదీ రామయ్యగారిలో ఉన్న విశేషం .అంతా తానే అయి చేశానని ఎన్నడూ ఎక్కడా చెప్పుకోలేదు .అందరి సహకారం వల్లనే అద్భుతాలు సాధించామంటారు .ఎవరి కృషినీ విస్మరించరు .సమష్టి భాగస్వామ్యం వల్లనే ఇవి సాధ్యాలయ్యాయని వినమ్రంగా ప్రకటించటం రామయ్య గారి ప్రత్యేకత .ఇందులో కొందరితో కొన్నేళ్ళు కలిసి పని చేశారు .ఒక రకంగా వారందరూ తనకు బంధువులయ్యారు అనటం రామయ్య గారి సంస్కారానికి గొప్ప ఉదాహరణ .వీడరాని ఆత్మీయ బంధమేర్పడింది. వారితో .’’In fact we had become in fact relatives ,in separable from the work into which I imported my scientific talents ‘’ అని రామయ్యగారు మాత్రమే నిగర్వంగా చెప్పగలరు .వారు తన కింద పని చేశారు అనలేదెప్పుడూ .వారితో తానుకలిసి పని చేశాను ,దానివల్ల తన విజ్ఞాననైపుణ్యం పెరిగింది అన్నారు ఈమాటలు అనటానికి ఎన్నో జన్మల సంస్కారం కావాలి. అది ఉంది కనుకనే ఆ మహానుభావుడు కోలాచల సీతా రామయ్య గారి గురించి ఇంత గా చెప్పుకొంటున్నాం .చెప్పుకొని మనం ధన్యులమవుతున్నాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-15- ఉయ్యూరు
అందరివాడు అన్నమయ్య -నేడు అన్నమయ్య జయంతి

గబ్బిట దుర్గా ప్రసాద్
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-19
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-19
రామయ్యాగారి దృష్టిలో ‘’అలెక్సీ మిఖైలోవిచ్ ‘’
తాను చాలా లావుగా ఉంటె అలెక్సీ భారీ మనిషి అన్నారు రామయ్య .ఒక రకంగా పెద్ద రాక్షసావతారం .కళ్ళు నీలిరంగుతో మిరుమిట్లు గొలుపుతాయి .పెద్ద నవ్వు ఆయన ఆభరణం .ఎందుకోకాని ఆయన మంచు లోంచి వచ్చినట్లు అనిపించేవాడు .చలికి ఎర్రబడ్డట్టు ఉండేవాడు .నెత్తిమీద ,ఒళ్ళంతా పడిన స్నో ను దులుపుకొంటూ రావటం అయన ప్రత్యేకత .సరాసరి హాల్ లోకొచ్చి కూర్చునేవాడు .ఆయన కూర్చోటానికి చాలా స్థలమే పట్టేది.అయితే ఆయన వస్తే ఎవరికీ చికాకు అనిపించేదేకాడు .క్రిస్మస్ నాడు శాంతాక్రజ్ వచ్చిసంచీలోంచి బహుమతులు తీసి పంచి పెడుతున్నంత ఆనందంగా ఉండేది .రామయ్యగారమ్మాయిలు స్వీట్ల కోసం ఎదురు చూసేవారు .గడ్డం అదీ ఉండేదికాదు కాని అదే అనుభూతిని పంచేవాడు .ఆతని ఆకృతి మనసుపొరల్లో ముద్ర పడి స్థిరంగా ఉండిపోయింది .
అలెక్సీ ది గ్రేట్
అలెక్సీ తో ఎన్నో విషయాలు చర్చించేవారు .ఆయనకు తెలియని విషయం లేదంటే ఆశ్చర్యం లేదు .అన్ని విషయాలు తెలుసు అన్నీ ఆయనకు కావాల్సినవే .ఒక రకం గా ‘’సమాచార సేకరణ సాధనం ‘’అలెక్సీ .అయన బయో డేటా కూడా ఈ విషయాలనే రుజువు చేస్తాయి .ఆయన ఒక డాక్టర్ కాని ప్రాక్టీస్ వదిలేశాడు .చరిత్ర అధ్యయనం చేశాడు .దాని తర్వాత మానవ వంశ శాస్త్రం (ఎత్నోగ్రఫీ ) ని భాషా శాస్త్రం (లింగ్విస్టిక్స్ )చదివాడు . అందరూ ప్రయాణించే మార్గం లోకాక వేరే మార్గాలను ఎన్నుకొని ఏంతో దూరం వెళ్ళాడు. కజాన్ మెడికల్ కాలేజి నుండి గ్రాడ్యుయేట్ అయి పామీర్ పీఠభూమికి వెళ్లి జబ్బు పడ్డ వాళ్లకు చికిత్స చేశాడు .ఆ దేశం ఆయన్ను అత్మీయునిగా చూసింది ఎత్తైన పర్వత శిఖరాలమీద ,పీఠ భూముల మీద పాద చారియై సంచరించాడు .కనిపించిన ఆసియా ,యూరోపియన్ ల నందరితో మిత్రత్వం పెంచుకొన్నాడు .అందులో మాసిడోనియాకు లో అలేక్సాండర్ వంశానికి చెందిన బాక్త్రియన్లున్నారు .ఈ కలయికలో ఆయనకు ఎన్నోశతాబ్దాల జాతుల వలస వాసుల లక్షణాలు గమనించాడు .పామీర్ ఖాళీ అయి చాలా మోసపుచ్చింది అనిపించింది .అందుకని మానవ వంశ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు ఆయన ఊహించకుండానే అనేక విషయాలు కనిపెట్టాడు .సుదూరంగా ఉన్న ఇండియా చాలా దగ్గరగా ఉండేదని పించింది .ఎత్తైన పర్వతాలు అడ్డంగా ఉన్నప్పటికీ పురాతన బంధాలు ఉండేవని అవి చాలా దృఢంగా ఉండేవని కనుగొన్నాడు .మధ్య ఆసియా తో మరీ దగ్గర సంబంధం ఇండియాకు ఉండేది .
‘’ అఫనాసి నికిటిన్ ‘’ అనే యాత్రికుడు సముద్ర మార్గం ద్వారా ఇండియా సందర్శించాడు .అలాగే ఇండియన్లు సుదూర ఉత్తర ప్రాంతాలకు చేరుకొన్నారు అని అభిప్రాయ పడ్డాడు .అంతే కాదు ఇండియన్స్ ఇక్కడికి వచ్చి ఉజ్బెకిస్తాన్ లో ‘’ఉలుబెక్’’ వేధ శాల ‘’(అబ్సర్వేటరి .)నిర్మించారని తెలియజేశాడు .పామీర్ల కళ్ళు ఇతర దేశీయుల కళ్ళ కంటే తేడాగా ఉండటం గమనించాడు .అక్కడ మానవులు జీవించారు అని కూడా అలెక్సీ కనుగొని లోకానికి చాటి చెప్పాడు .ఉన్నత పర్వతాగ్రాలు ,పీఠ భూములు గత చరిత్రను నినదిస్తూనే ఉంటుంది అన్నాడు .దక్షిణాన ఉన్న దూర పర్వత శ్రేణి గొప్ప వింతైన ,ప్రేరణ కలిగించే భావోద్రేకాలను కలిగిస్తుంది అన్నాడు .ఇది చూస్తే ఇండియా తన అనంత బాహువులను తన వైపు సాచి ఆహ్వానిస్తున్నట్లుగా ఉందని పించింది అలెక్సీ మికిలోవిచ్ కి .
బహుభాషా వేత్త –రష్యాలో తెలుగు నేర్చిన మొట్ట మొదటి వ్యక్తీ
అతి స్వల్ప కాలం లో డయకోవ్ అలెక్సీ ఉర్దూ భాష నేర్చుకొన్నాడు .ఆ తర్వాత హిందీ మొదలైన భారతీయ భాషలను అధ్యయనం చేశాడు .అయన ఒక బహుభాషా వేత్త (పోలీగ్లాట్ )అయ్యాడు .ఇండాలజిస్ట్ గా(చరిత్ర సంస్కృతీ భాషల అధ్యయనం ) ,ఇండియాకు సంబంధించిన సర్వ విషయాలపై స్పెషలిస్ట్ గా పేరు పొందాడు .అంతేకాదు ఆంద్ర రాష్ట్రాన్ని కనుగొన్నాడు .సోవియట్ యూనియన్ లో ఉన్న వారిలో ‘’తన భాష తెలుగు’’ నేర్చుకున్న మొట్ట మొదటి వాడు ‘’అలెక్సీ మిఖైలోవిచ్ డయకోవ్ అని రామయ్య గారు గర్వ ఒపడ్డారు ‘’ అందుకే రామయ్యగారికి ఆతను అంటే మహాభిమానం .అలెక్సీ ‘’Nationalities question in India ‘’అనే గ్రంధం రాసి ప్రచురించాడు .దీనితో సోవియెట్ యూనియన్ లో ఉన్న చదువరులకు భారత దేశం ,అందులో హిందీ తో బాటు ఉన్న పన్నెండు ప్రధాన భాషల గురించి తెలిసింది .ఇందులో ప్రతి భాషనూ కనీసం పది మిలియన్ల మంది మాట్లాడుతున్నారని తెలుసుకోగలిగారు .
అలేక్సీకు రామయ్యగారిని పరిచయం చేసిన రాదా కృష్ణన్
రష్యా రాయబారి సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు రామయ్య గారిని అలెక్సీ కి పరిచయం చేశారు .ఆయన రామయ్య తో ‘’మీ దేశం లో ఇండియా పై ఒక గొప్ప ‘’ఎక్స్ పర్ట్ ‘’డయకోవ్అనే ఆయన ఉన్నారు తెలుసా?ఇప్పటిదాకా అలాంటి గొప్ప వ్యక్తిని మీరు కలుసుకోక పోవటం ఆశ్చర్యం గా ఉందే?’’అన్నారు రాదా కృష్ణ .ఆయన ‘’మీ దేశం లో ‘’అని అన్నమాట ‘’రష్యా దేశం ‘’ అని అర్ధమయింది రామయ్యగారికి .సర్వేపల్లి తనను రష్యావాడినని పోరబడ్డారని అనుకొన్నారు .అప్పుడు డయకోవ్ కు రామయ్యను పరిచయం చేశారు .మన రాయ బారి మహా ఘటికుడు .అనిపించింది .ఇంతకాలం అలేక్సీని కలుసుకోక పోవటం చిన్నతనం అనిపించింది .
మోటార్ ఆయిల్ పై ప్రయోగాలు ,విఫల పరీక్షలు ,జరుగుతున్న సమయం లో ఒక రోజు అలెక్సీ ఎన్నో కొత్త వార్తలు మోసుకొచ్చాడు .హిట్టిటైట్ రాష్ట్రం చరిత్ర ఇండియా తో సంబంధం కలిగి ఉండనే వార్త చెప్పి అప్పుడు రామయ్య గారు పడుతున్న టెన్షన్ ను తగ్గించి వాతావరణాన్ని తేలిక చేశాడు .ఆ తర్వాత ఒక యువ సోవియట్ రిసేర్చర్ ‘’మాయాస్’’ వారి స్క్రిప్ట్ ను డీకోడ్ చేసి అందులోని విషయాలను తెలియజేశాడు . ‘’పక్షి ప్రేమికుడు’’ అయిన అలెక్సీ చివరికి తనకు అభిమానమైన పక్షుల గురించి ఎన్నో విషయాలు చెప్పి అందరి మనసులను ఉల్లాస భరితం చేశాడు ..చాలా విషాద సమయాలు గడుపుతున్నప్పుడు రామయ్య గారి దగ్గరకొచ్చి బాధకు మంచిమాటలతో ఉపశమనం చేకూర్చేవాడు .విజయమూ సాధించేవాడు .ఈ విషయం లో .పని అయిన తర్వాత ఎక్కడికేక్కడికో తితిరిగే అలవాటు మార్చుకొని అలెక్సీ తో కలిసి వెళ్ళటానికి ఇష్టపడేవారు రామయ్య .
రష్యాలో నైటింగేల్ ,టాం-టిట్,పిచ్చుక ,సాధారణంగా కనిపించే పక్షులు .ఈ పక్షులంటే అలేక్సీకి ప్రాణం .అవి ఆయనకోసం పాటలు పాడేవి .రామయ్య గారు అలెక్సీ ఫ్లాట్ కు వెళ్ళినప్పుడు స్వంత ఇంట్లో ఉన్న ఆనందం పొందేవారు . ఆయన ఎదుట అతి భారీ మనిషి , తన చుట్టూ చిన్ని చిన్ని పక్షులు .ఇది చూడటానికి వింతగానే ఉండేది .అలెక్సీ ‘’ప్రతిదీ ఎలా జరగాలని ఉంటె అలాగే జరుగుతుంది .ఈ పక్షులు ఇక్కడ .ఇదిగో ‘’మాయా రాత ప్రతి’’.ఇక్కడే మీరు నేను .మనం సంస్కృతం లో మాట్లాడుకోగలం రష్యన్ ,తెలుగు లలో కూడా సంభాషించు కోగల౦ మనమ్. మనం ఎన్నో విషయాలపై పోట్లాడుకొనే వాళ్ళం కాని మనం ఎన్నో విషయాలపై బతకాలి .అంతమాత్రాన నిరాశ వద్దు .జరగాల్సింది జరుగుతుంది ‘’అనేవాడు .అతను చెప్పింది నిజమే .ప్రతిదీ జరగాల్సిన విధం గా జరగాల్సిన సమయం లో జరుగుతుంది.వారి నిత్య జీవిత విధానం అదే అయిపొయింది .
రామయ్య గారికి తాను చాలా అదృష్ట వంతుడిని అనుకొన్నారు .తాను అనుకొన్నది ప్రతిదీ చేయ లేకపోతున్నారనుకొన్నారు . .కొందరి దృష్టిలో రామయ్య వింతమనిషి ,అపజయాల వ్యక్తీ .దీనికి కారణం ఇంత గొప్ప పరిశోధన చేసినా ఆయన ఉద్యోగ స్థాయి పెరగలేదు .అయినా అదృష్ట వంతుడినే అనుకొనేవారు .ఎందరో మహాను భావులను చూశానని ,మరెందరో గొప్ప మిత్రులను పొందానని పొంగిపోయే వారు …
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-15 –ఉయ్యూరు
–
”నేను 8th డ్రా పౌట్ ” అన్న” ఉత్తమ విలన్ —కమల్ హసన్
|
||||||
సఫాయి రాణి ఎండ్లూరి సుధాకర్ కవిత –
|
ఆమె రెల్లిలోక వైతాళికురాలు
ఆమె పేరు చెబితే చాలు కక్షలు కట్టిన కుల వివక్షలు చెంబులు పట్టుకొని పారిపోతాయి మానవ మలమూత్రాల్ని పరిశుభ్రంచేసే గంగా భాగీరధురాలు అవమానాల గరళాన్ని దాచుకున్న తిట్ల కెరటాల సముద్రురాలు తరతరాల తాతల నేతివాసనల్నే కాదు వాళ్ళు వదిలేసి వెళ్ళిన వారసత్వాల పీతి వాసనల్ని పీల్చుకుంటూ వచ్చిన పీడితురాలు ఆమె పాదం మోపితేనే మరుగుదొడ్లకు విముక్తి భగవంతుడి ప్రసాదమైనా అమ్మవారి తీర్థమైనా ఆమె చేతిలో పవిత్రం కావాల్సిందే వేలవేల సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో భూమి పీతి గంపల చుట్టే తిరుగుతూ వస్తోంది ఉదయాన్నే సిగ్గులేని సూర్యుడు సత్తురేకుల మీదుగా చీపురు కట్టల మీదుగా ఉదయిస్తూంటాడు అది నిన్నటి కథ ఇప్పుడా వూళ్ళో కొత్త ఉషోదయం ఏ పాకీ పడతీ నెత్తిమీద మలం బుట్టలతో కనిపించట్లేదు ఏ వృద్ధ మెహతర్ మైళ్ళదూరం నడిచి అశుద్ధాన్ని అవతల పారేయట్లేదు ఇప్పుడే కార్మికురాలూ ఖర్మకాలి కంపుకొట్టే మరుగుదొడ్ల నరకంలో దుర్భర శ్వాస పీల్చుకోవట్లేదు ఉషా చామర్! సఫాయిరాణిలా దూసుకొచ్చి ఒక పోరాటమే ప్రకటించింది ఒక మల యుద్ధమే చేసింది సొంత ఆస్తి ఉన్నట్టు సొంత శౌచాలయాలు కట్టుకోవాలని కట్టడి చేసింది కుల నిర్మూలనే కాదు మల నిర్మూలన జరగాలని గర్జించింది పారిశుద్ధ్య కార్మికురాళ్ళకు పనిగౌరవం కల్పించింది అమానుషత్వ బానిసత్వంలోంచి బాలకల్ని బయటికి లాగింది ఒకస్వేచ్ఛా ప్రపంచాన్ని చూపించింది ప్రపంచం ఆమెవైపు చూసేలా చేసింది ఆమె గొంతు వినబడిందా వీధులన్నీ వినయపూర్వకంగా నిలబడతాయి ఆమె కాలు కదిపిందా దుర్లభాలన్నీ ‘సులభా’లైపోతాయి ఆమె నోరు విప్పిందా ఆత్మగౌరవాలన్నీ అత్తరుపూల దండలై ఆమె కంఠాన్ని అలంకరిస్తాయి సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం దాకా ఆమె కీర్తి పరిమళం పరివ్యాప్తించింది ఇప్పుడు రాజస్థాన్లోని ఆల్వార్ గ్రామం రెల్లిపేటలో ఉషోదయమంటే ఆమె రూపమే కనిపిస్తుంది ఎండ్లూరి సుధాకర్
9246650771
(2008 న్యూయార్క్లో ‘ప్రిన్సెస్ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్’ కిరీటాన్ని దాల్చిన ఉషా చామర్ని బ్రిటన్ దేశం కూడా
|
బుద్ధుని తత్వం ‘ప్రతీత్య సముత్పాద’
|
||||||
సాహిత్య విమర్శకు చివరి ప్రతినిధి
|
ఇదివరకే ఎవరో రాసిన, చెప్పేసిన, అంశాలనే పునఃపునః ప్రదర్శించే ఎత్తిపోతల సిద్ధాంత గ్రంథాలకు ఎం.ఫిల్, డాక్టరేట్లు ప్రదానం చేసే తెలుగు రాష్ర్టాల్లోని విశ్వ విద్యాలయాలకు నరసింహమూర్తి లాంటి పరిశోధక ప్రభాకరుడు కనిపించరు.
పెద్దాయన యు.ఎ. (ఉపాధ్యాయుల అప్పల) నరసింహమూర్తి గారితో పరిచయ భాగ్యం ఎనభైల నాటిది. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదువుతున్నప్పుడు నా మిత్రుడు విజయనగరం జిల్లా వాసి డా. సూర్యనారాయణ ద్వారా పరిచయం. నా మొదటి కవితా సంపుటి వెలువడినపుడు సాంబశివరావు వంటి వారితో పాటు నా కవిత్వాన్ని విశేషంగా అభిమానించిన వారు నరసింహమూర్తి గారు. నా విశాఖ విద్యార్థి జీవితంలో ఎప్పుడు విజయనగరం సభలకు, సమ్మేళనాలకు వెళ్లినా వాటిల్లో ఆయన ప్రమేయం తప్పక వుండేది! నా కవిత్వాభిమానం వారిచేత 2008లో పెద్ద విశ్లేషణా వ్యాసమే రాయించింది.
ఆరోగ్యకరమైన తెలుగు సాహి త్య విమర్శకు ఆఖరు ప్రతినిధి నరసింహమూర్తిగారు. కోవెల సంపత్కుమార, జి.వి. సుబ్రహ్మణ్యం, వడలి మందేశ్వర్రావు, చేకూరి రామారావు, ముదిగొండ వీరభద్రయ్య వారి సహ విమర్శకులు. ఆయన మూలాలు ఎంత సంప్రదాయలోతుల్లో వున్నాయో, ఆయన ఆలోచనలూ,ప్రతిపాదనలూ అంత ఆధునికంగా ఉంటాయి. అందుకు సాక్ష్యం – జీవిత కాలంలో ఆయన సాగించిన సాహిత్య విమర్శా ప్రస్థానం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎస్వీ జోగారావు పర్యవేక్షణలో ‘ఔచిత్య ప్రస్థానము – పింగళి సూరన’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. బహుశా ఔచిత్యాన్ని ఔపోసన పట్టడం వల్లనేమో ఆయన తన జీవితంలోనూ, రచనల్లోనూ ఎన్నడూ అనౌచిత్యానికి చోటు యివ్వలేదు. ఆయన రచించిన ‘కవిత్వ దర్శనం’ అటు కవులకు, ఇటు కవిత్వ అధ్యయనపరులకు ఒక కరదీపిక వంటిది. సృజన, ఊహ, కల్పన, బుద్ధి, సౌందర్యం, ఔచి త్యం, ధార, ఉన్మాదం వంటి దాదాపు ఇరవై అంశాలను కవిత్వంతో జోడించి చెప్పడంలో ఆయన తెలుగు పద్యాలతో పాటు, ఇటు సంస్కృతశ్లోకాలు, అటు ఆంగ్ల కవుల నిర్వచనాలను సందర్భానుసారం ఉటంకించడం చూస్తే ఆయన ఎంత అధ్యయనశీలో అర్థమవుతుంది. నన్నెచోడుని కుమార సంభవంపై ఆయన రాసిన గ్రంథం ఆంధ్ర విశ్వవిద్యాలయం తన స్వర్ణోత్సవ ప్రచురణగా వెలువరించడం విశేషం. తెలుగు కథకు పాఠ్యాంశం అయిన చాగంటి సోమయాజులు కథలపై ఆయన రచించిన ‘కథా శిల్పి చాసో’ గ్రంథం కథా విమర్శకులకు మార్గదర్శనం చేయడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారం అందుకొంది. వివిధ సందర్భాల్లో ఆయన రాసిన సాహిత్య వ్యాసాలు ‘రంగుటద్దాల గది’, ‘చర్వణ’ పేరుతో వెలువడ్డాయి. వీటిల్లో సమకాలీన సాహిత్య సందర్భాలపై ఆయన నిక్కచ్చి అభిప్రాయాలను గమనించవచ్చు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి కృషిచేసిన సారస్వత మూర్తుల జీవిత చరిత్రలను ఆయన గ్రంథస్థం చేసారు. ఆ క్రమంలో వచ్చినవే ‘మానవల్లి రామకృష్ణ కవి’ గ్రంథాన్ని సాహిత్య అకాడెమీ ప్రచురించగా, ‘గిడుగు రామ్మూర్తి పంతులు’పై గ్రంథాన్ని స్వీయ ముద్రణగా వెలువరించారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాను పుట్టిన గడ్డ మీదే పుట్టిన తెలుగుల దీపధారి గురజాడ అప్పారావు గారంటే మూర్తి గారికి కంఠదఘ్న ప్రేమ – అందుకే ‘కన్యాశుల్కము’ నాటకాన్ని పంతొమ్మిదో శతాబ్దపు ఆధునిక భారతీయ నాటకాలతో పోల్చి ఆయన రూపొందించిన గ్రంథం, తొలినాటి విశ్వవిద్యాలయ ఆచార్యులు, తులనాత్మక సాహిత్యాన్ని తామే పరిచయం చేసామనే ఆచార్యులు, తెలుగు అధ్యయన శాఖలకు తులనాత్మకం అనే తోకలు తగిలించుకునే వారందరూ తల వొంచుకుని సిగ్గుపడే రచన ‘కన్యాశుల్కం- ఆధునిక భారతీయ నాటకాలు’ గ్రంథం. ఈ పరిశోధన కోసం ఆయన, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, హిందీ, ఒరియా, కన్నడ నాటక రంగ ప్రముఖులను స్వయంగా కలుసుకొని చర్చించడం, పాశ్చాత్య నాటక రంగ సాహిత్యాన్ని అవలోకనం చెయ్యడం ఆయన తప్ప మరొకరు చెయ్యలేని పనులు. శ్రీరంగం నారాయణబాబు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ‘రుధిరజ్యోతి’ కావ్య సంకలనం – కానీ, నారాయణబాబు రచించిన కథలు, నాటికలు, సాహిత్య వ్యాసాలను సేకరించి, నారాయణబాబులోని మరో సాహిత్య కోణాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చెయ్యడమే కాక, ఆ గ్రంథానికి ‘నారాయణ చక్రం’ పేరుతో మంచి విశ్లేషణాత్మక పీఠిక అందించారు మూర్తి గారు. ఇన్నీ చేసారంటే, రాసారంటే ఆయన మౌలికంగా సృజనకారుడు అయి వుండాలి. అక్షరాల నిజం. ఆయన తొలుత కవి. పిదప విమర్శకుడు. అందుకు నిదర్శనం ‘యశోధర’ లఘు కావ్యం నుంచి, ఇటీవల పత్రికల్లో అరకొరగా ప్రచురితమైన ఆయన వచన కవితలు. ఆర్.ఎస్. సుదర్శనం, దీశెట్టి కేశవరావు వంటి కవులను మింగేసినట్టుగానే విమర్శ మూర్తిగారిని మింగేసింది – ఆయన అంతరంగంలో అంతటి కవి కాబట్టే సుప్రసిద్ధ ఒరియా కవి జయంత మహాపాత్ర కవితలను హృదయానికి దగ్గరగా అనువదించగలిగారు. ఈ అనువాద కవితలను ఒకటి సాహిత్య అకాడెమీ ప్రచురించగా, మరొకటి పాలపిట్ట ప్రచురించింది.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన నోబెల్ సాహిత్య పురస్కార విజేతల ప్రసంగాలను, ‘నోబెల్ సాహిత్య పురస్కార ఉపన్యాసములు’ పేరుతో తెలుగులోకి అనువదించి ప్రపంచ రచయితల భావధారను తెలుగు ప్రజలకు పరిచయం చేసారు. వీటన్నింటికీ మించి తన జీవిత సాఫల్య కృషి ఫలితమా అన్నట్టుగా ఆయన 2014లో వెలువరించిన ‘తెలుగు వచన శైలి’ గ్రంథం దాదాపు వెయ్యి పుటలతో తెలుగు భాషలో ప్రవర్తిల్లిన వచనశైలీ విన్యాసాలను తనదైన శైలిలో ఆవిష్కరించింది.
కేంద్రంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుమీద వున్న ఫెలోషి్పకు ఎంపికయిన ఒకే ఒక తెలుగు రచయిత నరసింహమూర్తి గారు. నెలకు యాభైవేల రూపాయల గౌరవ వేతనంతో ‘భారతీయ ధార్మికత’ మీద ఆయన చేస్తున్న రచన మధ్యలోనే ఆగిపోవడం గొప్ప లోటు. తెలుగు నేల మీద కవులూ, రచయితలకూ మరణాంతరం పేరొస్తుందన్న మహాకవి శ్రీశ్రీ మాట నిన్న గురజాడకు వర్తిస్తే, నేడు నరసింహమూర్తికి వర్తిస్తుంది. రెండు అట్టల మధ్య అందమైన అబద్ధాలను, ఇదివరకే ఎవరో రాసిన, చెప్పేసిన, అంశాలనే పునఃపునః ప్రదర్శించే ఎత్తిపోతల సిద్ధాంత గ్రంథాలకు ఎం.ఫిల్, డాక్టరేట్లు ప్రదానం చేసే, తెలుగు రాష్ర్టాల్లోని విశ్వవిద్యాలయాలకు నరసింహమూర్తి లాంటి పరిశోధక ప్రభాకరుడు కనిపించరు. కేవలం అకాడెమీ అవార్డులే కాదు, డి.లిట్ లే కాదు, తెలుగు సాహిత్య విమర్శకు ఆయన చేసిన సేవకు పద్మశ్రీలు ఆయన పాదాలముందు వినమ్రంగా చేతులు కట్టుకు నిలబడాల్సిందే! అందుకు తెలుగు సమాజం, సాహిత్యం ఇంకా ఎంతో ఎదగాల్సి వుంది.
శిఖామణి
98482025261
|
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18
నూతన ఆవిష్కరణ-ప్లాస్టిక్ మీడియం సిద్ధాంతం
అప్పటిదాకా రామయ్యగారికి ప్లాస్టిక్ మీడియం మాత్రమే తెలుసు .ఇప్పుడు మోటార్ లూబ్రికంట్ ల రాజ్యం ‘’రెజీం ‘’కు సంబంధించిన లెక్కల షీట్లు అధ్యయనం చేశారు .అప్పుడు మనసులో అనిపించింది ‘’రామా !ధన్యుడివి .అభినందనలు .అసలైన తగిన మాటను ఉపయోగించావు .ఇప్పటి దాకా ఆకాశ విహారం చేశావు ఇక చాలించి నేలమీదకు దిగి అసలైన ఆలోచనలను చేయి .నీ శక్తి సామర్ధ్యాలను రుజువు చేసుకో .నువ్వు చెప్పిన ,కనుగోన్నదాన్ని నువ్వే నిరూపించాలి .దానికి తగిన వాదం తయారు చేసుకో .ఇలాంటి చిన్న బీజం నుండే మహోన్నత వృక్షం పెరుగుతుందని నమ్ము ‘’అని అంతరాత్మ ప్రబోధించిన అనుభూతి కలిగింది .’’దీని కీర్తి అంతా నాలోని వాడికే దక్కాలి ‘’అనుకొన్నారు ..అతను తాను చేసిన దాన్ని మెచ్చుకోవటమేకాకుండా దానికి సంబంధించిన సిద్ధాంతం రాయమని గోల చేస్తున్నాడు .ఇతరులు మెచ్చేట్లుగా రాయాలి ,ఒప్పించేట్లుగా ఉండాలి .రవీంద్ర లాంటి వారి మాటలు జనం వింటారు .అయినా తన’’ డిసర్టేషన్’’అందరికి నమ్మకం కలిగించాలికదాఅని గుంజాటన పడ్డారు .కొత్తది ఎప్పుడూ కొత్తదే .యుద్ధం పూర్తీ అయిన తర్వాత రామయ్య గారు ఈ నూతన సిద్ధాంతాన్ని సమర్ధింప జేసుకొని పేరుపొందారు .
కొత్తది కనిపెట్టటం ఆనందాన్ని ఇవ్వటమేకాక సైంటిస్ట్ కు దురద్రుస్టాన్ని తెచ్చి పెడుతుంది అన్నారు రామయ్య ..ఎందుకంటె ఒక కొత్త ఆవిష్కారం జరిగినప్పుడు ఒక శిఖరం మీద ఉండిపోవటమే కాని ఇక అంతకంటే అతను ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండదు .అంటే ఒక సమతల ప్రదేశాన్ని చేరుకోన్నట్లే .మళ్ళీ అలాంటిది ,లేక అంతకంటే గొప్ప విషయం కనిపెట్టే అవకాశం రాక పోవచ్చు .ఇలా రామయ్య గారు అనుకొంటుంటే రాజేంద్ర ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారని నవ్వేసి ‘’ప్రజలు మిమ్మల్ని చూసి అసూయ పడేట్లుగా అద్భుత విషయం కనిపెట్టారు .గొప్పనూతన ఆవిష్కరణ చేశారు మీరు .ఇంతకంటే మీకేం కావాలి సార్ !రెండోమాట కావాలని ఆలోచిస్తున్నారా ?అది దానంతటికి అదే వస్తుంది . ఆ మాట రావాలంటే మీరు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది .’’అన్నాడు అతను చెప్పింది నిజమనిపించింది రామయ్య గారికి .ఇక ఆ విషయంపై ఆలోచించలేదు ‘’.ఈ జన్మకు ఇది చాలు ‘.ధన్యుడిని .జన్మ సార్ధక మైంది ‘’అనుకొన్నారు మనస్పూర్తిగా .జీవితకాలమంతా కృషి చేసి సాధించిన అపూర్వ విషయం ఇది అనిపించింది .ఈ నవీన ఆవిష్కరణ తర్వాత తనను నిత్యం గతం లోకి లాక్కు వెళ్ళే అందమైన పడవ అనిపించింది ఆ స్మృతి .అంత తియ్యగా ఉండేది .ముందుకు నడవకుండా వెనక్కే పడవ ప్రయాణం చేయటం బాధగా ఉండేది .
కేమోటాలజి పిత
ప్లాస్టిక్ మీడియం సిద్ధాంతం కనుక్కొన్న తర్వాత ఇక తన జీవితం లో ఏ ముఖ్యమైన ,ఆసక్తికర సంఘటన జరగ దేమోననుకొన్నారు కాని రాజేంద్ర చెప్పిన’’ బీజమే వృక్షమవుతుంది ‘’ అన్నమాట మనసులో మెదులుతూనే ఉంది అది వృధాకాలేదు .దీనితో సైన్స్ లో కొత్త అధ్యాయం ఆరంభమైంది .కొంతకాలం గడిచిన తర్వాత దానికి ‘’ కేమొటాలజి’’ అనే ఒక ప్రత్యేక మైన పేరు వచ్చింది .’’అదే మోటార్ ఆయిల్స్ కు సంబంధించిన రసాయన శాస్త్రం అయింది ‘’. మండే లూబ్రికంట్ పదార్ధ స్వభావాలను విచక్షణతో ప్రయోగించే సాంకేతిక శాస్త్రం గా రూపు దిద్దుకోన్నది .దీన్ని సమర్ధించిన వారు వ్యతిరేకించిన వారూ ఏర్పడ్డారు .కాని అందరూ ఈ భావాన్ని అంటే ఐడియాను మాత్రం అంగీకరించారు .అదే ముందడుగు అయింది .బీజం క్రమగా అంకురించి మొలకెత్తి మహా వృక్షం గా ఎదిగిపోయింది. దాని విస్తరణను ఎవరూ ఆపలేక పోయారు .ఈ మహా వృక్షానికి కొమ్మలు రెమ్మలూ ఏర్పడ్డాయి .అన్నీ కలిసి అద్భుత ఫలితాల ఫలాలను అంద జేశాయి .లూబ్రికంట్ చరిత్రలో విప్లవమే వచ్చింది .అది మంచికి మార్గ దర్శనం చేసింది .కొత్త ఆలోచన ఆచరణ లోకి వచ్చి ఘన విజయాలను అందించింది . అందుకే రామయ్యగారిని ‘’కేమోటాలజి పిత ‘’-father of chemmotology’’అయ్యారు . ఈ విధానానికి మెచ్చి ‘’జాతీయ బహుమానం ‘’(స్టేట్ ప్రైజ్ )ను ప్రకటించారు .ఇక దీన్ని ఉత్పత్తి చేసి , పరీక్షించి నిగ్గు తేల్చుకోవాలి . ఇవి వేరే ఇన్ష్టిట్యూట్ లలో జరగాలి ‘’ధీరీ’’ రామయ్య గారిది ప్రాక్టికల్ విజయం వారు సాధించి చూపాలి .
పరీక్షా విధానం
రామయ్యగారు ,చీఫ్ ‘’నూర్న్’’ కలిసి ఓల్గా తీరం లోని నిర్మాణ సంస్థ దగ్గరకు వెళ్ళారు .ఇద్దరికీ విరుద్ధమైన భావాలున్నా ఇక్కడ ఈ విషయం లో కలిసి పని చేయటం తమాషా అనిపించింది .పరీక్షించే యూనిట్ లోకి వీరిద్దరిని పంపుతూ దాని డైరెక్టర్ వాళ్ళిద్దరిని ఒక సారి చూసి ఒక చిరునవ్వు నవ్వి ‘’మీ ఇద్దరివి రెండు దృఢమైన పిడికిళ్ళు .అంతమాత్రాన మీ రిద్దరూ పోట్లాడుకొంటారని నాకు అనిపించటం లేదు .మీ ఇద్దరి ద్రుష్టి చాలా ఆకర్షణీయంగా ఉంది .మీకు విజయోస్తు ‘’అన్నాడు ఆశాభావమైన దీవెనతో . చేసిన పరిక్షలు విజయ వంతమైనాయి. తనకు అక్కడ కావాల్సింది టెక్నాలజీ లో బాగా జ్ఞానం ఉన్న వారు కాదు .వాళ్ళ కమీషన్ లోనే రామయ్య గారి సిద్ధాంతాన్ని నమ్మని వారున్నారు .ఈ స్పెషలిస్ట్ లు ఆ మధ్యనే గ్రాడ్యుయేట్ లయిన వారు .రామయ్య గారికి వ్యతిరేకమైన ,ప్రాభవం ,పట్టూ ఉన్న వారి సంస్థలలో చదివి ఇక్కడ చేరిన వారే వీళ్ళు .ఏమైనా ట్రయల్స్ సక్సెస్ అని చెప్పేశారు .రామయ్యగారు ,నర్మ్ ఇద్దరూ అక్కడినుంచి బయల్దేరి ఆనందం గా విజయ విలాసంగా మాస్కో చేరారు .
రామయ్యగారు ఆ తిరుగు ప్రయాణాన్ని మనసులో భద్రం గా దాచుకొన్నారు. అది చిరస్మరణీయం గా ఉండిపోయింది .వెంటనే వచ్చిన ఆదివారం నాడు నర్మ్ తో బాటు మాస్కో-వోల్గా కాలువలో షిప్ లో ప్రయాణం చేశారు.చాలా ఆహ్లాదమైన యాత్రత అది .కాలువకు ఇరు వైపులా చెట్లు శిశిర శోభను సంతరించుకొని కను విందు చేశాయి పసుపు ఎరుపు ,ఊదా రంగుల ఆకులు రాలి పడుతున్నాయి . నిశ్శబ్దం గా ఉంది ప్రక్రుతి .ప్రకృతి ఇద్దర్ని పరవశుల్ని చేసింది .అనుభవించిన సంతోషం,,ప్రశాంతత శాశ్వతంగా మనసులో నిలిచిపోయాయి .ఆ ప్రశాంత సమయం లో నర్మ్ తన జీవిత చరిత్రను రామయ్యగారికి వివరంగా చెప్పాడు.ఆయనదీ తనలాంటి బతుకే అనిపించింది .ఆయన బీద ఈస్టోనియన్ రైతు కుటుంబం నుంచి వచ్చాడు.పని బరువు అతి చిన్నతనం లోనే తెలిసినవాడు .తనలాగానే ప్రపంచం సగం చుట్టి వచ్చిన వాడు .బాగా చదివుకొని ఏదో ఆకాశం లో ఆశగా విహరించాలని కాకుండా ప్రయోజన కరమైన కార్యం లో పని చేస్తున్నందుకు సంతృప్తిగా ఉన్నాడు .
చేతికి దక్కని ప్రైజ్ –ఆవరించిన నిరాశ
ఇంత ఆనందం అనుభవించిన వీరిద్దరికీ ఇన్ ష్టి ట్యూట్ లో చేదు అనుభవం ఎదురైంది .డైరెక్టర్ వాళ్ళిద్దరూ ఎందుకు ట్రయల్ ప్రోటోకాల్ పూర్తికాకుండా వచ్చారని ప్రశ్నించాడు .ప్రోటోకాల్ ను తర్వాత పంపిస్తామని,కమిషన్ లో అందరి సంతకాలు కాలేదని అయిన తర్వాత రిపోర్ట్ పంపిస్తామని అక్కడ వారు చెప్పారని వివరించారు .డైరెక్టర్ తల అడ్డంగా ఊపాడు .’’సమయం మించిపోతోంది కుర్రాళ్ళారా !’’ఆన్నాడాయన . నిజంగానే ఆయన అన్నట్లు సమయం గడిచిపోతోంది వేగంగా .డాక్యుమెంట్లు రావటానికి మరి కొద్ది రోజులే మిగిలాయి .ఈ లోపల అవి రాకపోతే ప్రైజ్ కమిటీకి వాటిని అందజేసే టైం దాటిపోతుందని భయం గా ఉంది అందరికి .కాని అదే జరిగింది . ఆనందంగా ఉన్న వారందరికీ నిరాశే మిగిలింది .పొందిన ఆనందం, సంతోషం ఒక్క సారిగా ఆవిరైపోయాయి .
రోజులు గడిచిపోతూనే ఉన్నాయి కాని ప్రోటోకాల్ రాలేదు .నర్మ్ టెస్ట్ లు జరిగిన ప్రదేశానికి వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చాడు .కమిటీలో ఇద్దరు సభ్యులు రామయ్యగారి సిద్ధాంతాన్ని అంగీకరించ లేదని మళ్ళీ ప్రయోగాలు జరపాలని సూచించి నట్లు తెలిసింది .మిగిలిన సభ్యులందరూ రామయ్య గారి సిద్ధాంతాన్ని పూర్తిగా సమర్ధించారు .మళ్ళీ ఒక డేటా అందజేస్తే చాలని తెలిపారు .అప్పుడు వాళ్ళు సరైన దారిలో పరిశోధన చేశారని తెలుస్తు౦దట .నర్మ్ కు ఇదంతా ఒక ఫార్సుగా అనిపించి విపరీతమైన కోపం వచ్చింది .అభిప్రాయ భేదం రావటం ఏమిటని విరుచుకు పడ్డాడు .ఆయన అన్నది కరెక్టే .ఎందుకంటె ఇప్పటికే వచ్చిన ఫలితాలు చాలు అభిప్రాయాలు ఏర్పరచుకోవటానికి.కాని ఆయన తీవ్ర పదజాలం సమస్యను మరింత జటిలం చేసింది .మళ్ళీ ప్రయోగాలు చేయాలని వారు నిర్ద్వంద్వంగా ప్రకటించేశారు .అంతలో ప్రైజ్ కమిటీ ముందు డాక్యు మెంట్లు అందజేసే సమయం అప్పటికే దాటి పోయింది ..డైరెక్టర్ భయపడింది సరైనదే అని రుజువైంది తర్వాత .ఈ విఫల యత్నం సఫలంయ్యేలోగా నర్మ్ తీవ్రంగా అస్వస్థతకు గురైనాడు.
విజయం పొందిన రామయ్య గారి సిద్ధాంతం
.రామయ్యగారికి సంతోషం ప్రశాంతత దక్కలేదని అభిప్రాయ పడ్డారు .అది చాలా కష్టం అనిపించింది .వీరిద్దరికీ ఆ ప్రైజ్ దక్కలేదు .అది దారుణం అనిపించినా, విధి కృతం అనుకొన్నారు .సైన్స్ కు సంబంధించినంత వరకు దానికేమీ నష్టం లేదు . రిసెర్చ్ లు క్రమంగా జరుగుతూనే ఉన్నాయి .రామయ్య గారి కొత్త సిద్ధాంతం నవీనం గానే పేరు పొంది ఆ పేరు కొనసాగిందికూడా ప్రయోగాలు జరిగి జరిగి చివరికి రామయ్య గారిదే రైట్ అయింది .అని దాన్ని వ్యతిరేకించిన వారు ఓడిపోయారు .రామయ్య ఘన విజయం పొందారు .
ఒక రోజు నర్మ్ తిరిగి వచ్చాడు .ఆయన ముఖం లో కళా కాంతులు కనిపించలేదు. నిరాశలో ఉన్నట్లు అనిపించింది రామయ్య గారి అమ్మాయి సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువు కొంటున్నది .ఆమె క్రిలోవ్ రాసిన నీతికధ బట్ట్టీ పడుతోంది .ఈ కధలో ఒక చిన్న కుక్క ఇంకో బుల్లి కుక్క ఏనుగును చూసి మొరుగుతుంటే ‘’నువ్వేదో మొరుగుతున్నావు ఆ ఏనుగుదాన్ని పట్టించుకోకుండా దాని దారిన అది పోతోంది చూడు ‘’అని చెపుతుంది. అది విన్న రామయ్య గారు ‘’అమ్మా !క్రిలోవ్ చెప్పింది చాలా నిజం ‘’అన్నారు .దీనితో మనసులో ఉన్న కొంత టెన్షన్ తగ్గి వాతావరణం తేలిక పడింది .మర్నాడు అనుకోని వ్యక్తీ ఒకతను వచ్చి తన స్వంత ఇంటికి వచ్చానన్న ఆనందం తో చేరి కొంత సుఖాన్ని పొందాడు .అతనే అలెక్సీ మైఖేలోవిచ్ డియకోవ్ .మూడ్ పాడైనప్పుడల్లా అతను అనుకోకుండా వచ్చి సంతోషం పంచి వెడుతూ ఉండేవాడు .ఇదొక రిలీఫ్ గా ఉండేది రామయ్యగారికి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-15-ఉయ్యూరు
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17
‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17
లూబ్రికంట్స్ లో విప్లవం
ఎకడమీషియన్ రవీంద్ర ‘’ఒక మనిషి ఒకటే మాట చెప్పాలి .అంటే రెండు పదాల సూత్రం మాత్రమె ఉండాలి ‘’అని చెప్పిన మాట సహజమే నని పించింది రామయ్య గారికి .కొత్తది కనిపెట్టటం (డిస్కవరీ )అనేది ఎప్పుడూ ఒక తరహా సూత్రమే .ప్రపంచ ప్రసిద్ధ శాత్ర వేత్త లందరూ ఒకటి రెండు మాటల్లోనే వారి పరిశోధనా ఫలితాలను తెలిపారు .న్యూటన్ ‘’గురుత్వాకర్షణ శక్తి ‘’,డార్విన్ ‘జాతుల పుట్టుక ‘’,పవ్లోవ్ ‘’కండి షండ్ రిఫ్లెక్స్ ‘’ఐన్ స్టీన్ ‘’సాపేక్ష సిద్ధాంతం ‘’, దీనికి ఉదాహరణలు అన్నారు రామయ్య .జీవితం మాత్రం అందరికి ఒకటే .రామయ్యగారు చాలా విలువైన పనే చేస్తున్నారన్నాడు రవీంద్ర .ప్రతి మనిషిలో అనేక మంది వ్యక్తులుంటారు .వారందరూ ఎవరి కర్తవ్యాన్ని వారు నేరవేరుస్తుంటారు అన్నారు రామయ్య .తన శక్తి యుక్తులనన్నిటినీ సంస్థాగత నిర్వహణకు ,సాంకేతిక సామర్ధ్యానికి వినియోగిస్తున్నానని భావించారు .మిగతా కాలమంతా ప్రత్యేక ప్రయోగాల నిర్వహణ ,వాటిని ప్రాముఖ్యంమైన వాటిలో ఉపయోగ పడేట్లు చేయటం . ఇదే సమయం లో తనలోని మరో వ్యక్తి తాను చేసిన పనిని సామాన్యీకరించేవాడు అన్నారు .ఈ రెండవ వ్యక్తియే మోటారులోని ఉపరితల ఘర్షణ కు ,కార్డాన్ షాఫ్ట్ ,బాల్ బేరింగ్ లకు మధ్య ఏం జరుగుతోందో అనే దానిపై ఆసక్తి చూపేవాడేట .ఈ మనిషే ఆయన జీవితం లో అన్ని ప్రయోగాలకు కింది అధికారిగా ఉండి (సబార్డినేట్ ) తనకు తెలీయకుండానే ఏర్పడే ప్రశ్నలన్నిటికి సమాధానాలు కనుక్కోనేవాడట .రెండవ సారి రామయ్య గారి పై బడిన ఇంసిడియరి బాంబ్ ఘటన తర్వాత లూబ్రికంట్స్ లో వేర్వేరు స్థాయిలలో జరిగే చలనాలలో జరిగే మార్పులను అర్ధం చేసుకోవటానికి వీలు కలిగించింది అంటారు .ఆ బాంబు రామయ్యగారి లోపలి వ్యక్తిలో’’ బల్బ్ వెలిగించాడ’’న్నమాట .
ఆ రోజు సాయంత్రం మెట్రో రైల్ లో రామయ్య ప్రయాణం చేస్తున్నారు .ఎస్కలేటర్ వద్ద రద్దీ గా ఉంటె కాసేపు ఆగి జనం తగ్గిపోగానే ఎస్కలేటర్ ఎక్కారు .అక్కడ ఆగి ఉన్న ప్పుడు జనం తలకాయల్ని లేక్కేశారు .ఎస్కలేటర్ దగ్గరకు చేరినప్పుడు హాయిగా స్వేచ్చగా ఉన్నజనం ,అది ఎక్కినప్పుడు అటూ ఇటూ క్రమపద్ధతి లేకుండా ఊగుతూ కదలటం గమనించారు .ఇది అచ్చంగా’’ బ్రౌనియన్ మువ్ మెంట్’’ లో మాలిక్యూల్స్ కదలిక లాగా ఉందని పించింది ఫ్లాష్ గా .ఇది వరకు ఎన్నో సార్లు ఎస్కలేటర్ ఎక్కి వెళ్ళారు. కాని ఈ సారి మాత్రమే ఈ ఆలోచన రావటం విరుద్ధం గా పారడాక్స్ లాగా ఉందని పించింది .ఆశ్చర్యమేసింది .జనం అంతా ఒకే చోట స్తిరంగా ఉండటం ,కాని పూర్తీ సామర్ధ్యం తో కదలటమే ఇందులో తమాషా .ఒక్కసారిగా మనసులో ఏదో తళుక్కున భావం పొడమరించింది .తాను చేస్తున్న ప్రయోగాలకూ దీనికీ ఏదో సంబంధం ఉండనుకొన్నారు . కొత్త ఆలోచనేదో ఒక్కసారిగా తట్టింది దీని సారాంశమే లూబ్రికంట్స్ లో ఏమి జరుగుతోందో తెలుసుకోవటానికి తోడ్పడింది అంటారు రామయ్య .ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు రామయ్య గారి ఆలోచన లూబ్రికంట్స్ లో విప్లవాన్నే తెచ్చింది .కారణాలు నిబంధనలకు దారి చూపుతాయి .మాలిక్యూల్స్ అవి ఉండే పరిస్తితులు ,వాటిలో వచ్చే చర్యలు పై ఆధార పడతాయి .ప్రతి చర్య ఫలితంగా అవే ,నిబంధనను మారుస్తాయి .ఈ ఆలోచన మెరపు వేగం గా రామయ్యగారికి తట్టింది. సమస్య పరిష్కారానికి దోహదం చేసింది .కళ్ళముందు అదంతా సినిమా రీల్ లాగా కనిపించింది .విపరీతమైన భావోద్రేకానికి గురై ఇంటికి చేరుకొన్నారు .ఒక సమాధి స్తితిలో ఉండిపోయి కోటుకూడా విప్పదీయకుండా ,తోచిన వివరాలను క్లుప్తంగా మననం చేసుకొని మనసులో స్తిరమైన భావన నేర్పరచుకొన్నారు .వాటి పర్యవసానాలను రాసి పెట్టారు .’’the lubricant is a special plastic medium ‘’అనేది ఈ ఆలోచనల మొత్తం సారాంశం .అది ఒక స్వతంత్ర వ్యక్తిత్వం గల సమ్మేళనం ‘’(it is a compound of integrity and plasticity ‘’) గా నిర్దారించుకొన్నారు రామయ్య .అందులోని మాలిక్యూల్స్ ల పరస్పర చర్యలు వాటి ధర్మాల పై ఆధార పడి ఉంటాయి కాని ప్రతి క్రియ అంటే రియాక్షన్ ఆ గుణాలనే మార్చేస్తుంది .అదీ ఇక్కడున్న తమాషా .కనుక దీనిని బాగా అర్ధం చేసుకోనేట్లు చెప్పటానికి కొత్త పద సృస్తి,కొత్త గుణాత్మక వివరణ ,అందుకోవటానికి కొత్త విధానం ఏర్పడాలి .పాత గణిత సూత్రాలేవీపని చేయవిక్కడ .అలాంటి మీడియం కాలం కూడా ప్రత్యేకంగా ఉంటుంది .ఆ స్పెషల్ టైం నే ‘’లేటేంట్ పీరియడ్ ‘’అన్నారు .ఈ కాలం లో జరిగే మార్పులు అర్ధమయ్యేట్లు వివరించాలి .దీనితో రామయ్య గారికి పూర్వం తాము ఎక్కడ పప్పులో సారీ తప్పులో కాలేశారో తెలిసింది .తర్వాత రామయ్య గారు మిగిలిన రిసెర్చ్ విద్యార్ధులు కలిసి కూర్చుని మీడియం పై మౌలిక భావన అంటే కాన్సెప్ట్ ను సాధించారు .దీన్ని గురించి రామయ్య గారు చెబుతూ ‘’In our calculations and formulations this was an abstract volume within whose limits ,like fish in an aquarium ,the moved periodically ,sometimes colliding and coming into contact .Actually every thing was the other way .The medium was the property of these molecules .It just like the molecules in their interaction .’’అని స్పష్టంగా అందరికి అర్ధమయ్యేట్లు వివరించారు . ఈ ఆలోచనలన్నీ బాంబు ప్రేలుడు సంఘటనల ద్వారా వచ్చినవే నంటారు .ఇంతటితో అయిపోలేదని తాను వెంటనే ఆలస్యం చేయకుండా సంవాద రూపాన్ని అంటే’’ interlocutor’’ ను కనుక్కోవాలని అన్నారు .అంటే ఇతరులకు చెప్పి అభిప్రాయం తెలుసుకోవాలని ఆయన భావం .’’యురేకా యురేకా ‘’అని ఆర్కిమిడీస్ లాగా బట్టలు లేకుండా రోడ్లవెంబడి పరి గేత్తలేదుకాని, రామయ్య గారు మహా ఉత్సాహం గా అదే భావోద్రేకం తో పరిశోధనా ఫలితం సాధించినందుకు ఇంటికి పరిగెత్తుకొచ్చి తలుపు తట్టారు .తన ఇంట్లో ఉంటున్న ఇంజినీర్ గారు లేరు ఇంజినీర్ భార్య పని చేసి అలసట తో నిద్ర పోతోంది .మంచీ మర్యాదా పాటించకుండా రామయ్య ఆమెను నిద్ర లేపి క్లుప్తంగా తానూ సాధించింది తెలిపారు .ఆమె కంగారులో తల ఊపుతోంది అర్ధంకాక .తానూ సరిగ్గా ఆలోచిస్తున్నాడా లేదా అని చెప్పటానికి తగిన వ్యక్తీ లేడు.తనను తానే సంబాళించుకొని తాను సరైన ఆలోచనలను సరైన మార్గం లోనే చేస్తున్నాను అని సంతృప్తి పడ్డారు .ఇంజినీర్ భార్య రామయ్యగారు కోటుకూడా విప్పలేదని గుర్తు చేసింది .సిగ్గుపడ్డారు .అప్పుడు స్పృహలోకి వచ్చి తాను ఎంచేశారో తెలుసుకొన్నారు .ఆమె వెంటనే వంటగదికి వెళ్లి టీ పెట్టి తెచ్చింది .బ్రెడ్ జామ్ ఇచ్చి తినమంది ‘’అన్నయ్యా !ఇలాంటిఒక శుభ సందర్భం వస్తుందనే వాటిని జాగ్రత్తగా దాచి ఉంచాను .ఇప్పుడు అవకాశం వచ్చింది .వాటిని తీసి తిందాం .మీ పరిశోధనా ఫలితా విజయాన్ని ఉత్సవం గా ఇప్పుడే చేసుకొందాం .మీరు కనిపెట్టిన విషయం సాధారణమైనదికాడు .మీ మేధస్సు అమోఘం .కూర్చోండి .రిలాక్స్ అవ్వండి .ఆనందంగా ఈ శుభ ఘడియలను పంచుకొందాం ‘’అన్నదామె
ఇద్దరూ జామ్ నంజుకొంటూ రొట్టె తిని టీ తాగి గొప్ప అనుభూతికి లోనయ్యారు .ఈ సంఘటన తానెప్పుడూ జీవితం లో మరచిపోలేదని రామయ్య గారు చెప్పేవారు .ఆ జామ్ రోజూకంటే రుచిగా ఉందట .దానికి కారణం దయగల యా ఇంజనీర్ గారి ఇల్లాలు పవిత్ర హృదయం తో ,ఆత్మీయంగా ఇచ్చి౦ది కనుక అంత గొప్ప రుచిగా ఉందట రామయ్య గారికి .రామయ్య గారు అంటే నిలువెల్లా కృతజ్ఞత నిండిన మహోన్నత వ్యక్తీ అని పిస్తుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-15 –ఉయ్యూరు
1949లో ప్రారంభమైన మోపిదేవి హైస్కూల్ -లో మేనెల 1,2,3, తేదీలలో జరిగిన ”65 వసంతాల పూర్వ విద్యార్ధుల అపూర్వ ,ఆత్మీయ కలయిక మరియు గురు సత్కారం” -రెండవ రోజు మే2 వతేదీ శనివారం నాటి దృశ్యాలు
వంగసీమ ‘పంచాయతీ’…
వంగసీమ ‘పంచాయతీ’…
- 01/05/2015
TAGS:
పశ్చిమ బెంగాల్ పురపాలక నగర పాలక మండలులకు జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం ఆశ్చర్యకరం కాదు. మమతా బెనర్జీ పట్ల బెంగాల్లోని అట్టడుగుస్థాయి ప్రజలకు అభిమానం పెరగం ఈ ఘన విజయానికి కారణం! ఇలా పెరగడానికి ప్రధాన కారణం గత శాసనసభ ఎన్నికలలోను, లోక్సభ ఎన్నికలలోను తృణమూల్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ప్రచారం పొందిన భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ పలుకుబడి పతనమైపోతుండడం! 2011 నాటి శాసనసభ ఎన్నికలలో మార్క్సిస్టు పార్టీ వారికి ఓట్లు వేసిన వారిలో చాలామంది ఆ పార్టీకి దూరం అవుతుండడం నాలుగేళ్ల చరిత్ర! ఇలా దూరమవుతున్నవారిలో అత్యధికులు తృణమూల్ కాంగ్రెస్కు దగ్గరయ్యారన్నది స్థానిక సమర ఫలితాల వల్ల నిగ్గుతేలిన నిజం. ఇలా మార్క్సిస్టు పార్టీకి వామపక్షాలకు దూరమైన వారిలో అత్యధికులు 2014 నాటి లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ వోటర్లుగా మారారన్నది నిర్ధారిత నిజం. అందువల్లనే భాజపా వోట్ల సంఖ్య అప్పుడు పదిహేడు శాతానికి పెరిగాయి. అయితే జాతీయస్థాయి ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు మధ్య ఉన్న తేడా ఇప్పుడు మరింతగా ప్రస్ఫుటించింది. 2014 నాటి లోక్సభ ఎన్నికల స్థాయిలో ప్రస్తుతం భాజపా విజయం సాధించలేకపోయింది. నలబయి రెండు లోక్సభ స్థానాలలో రెండింటిని కైవసం చేసుకున్న భాజపా అప్పుడు మార్క్సిస్టు పార్టీతో సంఖ్యా సమానత్వం సాధించగలిగింది. మార్క్సిస్టు పార్టీకి కూడ లోక్సభ ఎన్నికలలో రెండు మాత్రమే దక్కాయి. పెరుగుతున్న పార్టీగా భాజపా, అంతరించి పోతున్న పక్షంగా మార్క్సిస్టు పార్టీ లోక్సభ ఎన్నికలలో పేరుగాంచాయి. ఈ పెరుగుదల-్భజపా వారి పెరుగుదల-ఇప్పుడు జరిగిన స్థానిక సమరంలో ప్రస్ఫుటించకపోవడానికి ప్రధాన కారణం లోక్సభ ఎన్నికల సమయంలోను, పురపాలక సంస్థల ఎన్నికల సమయంలోను వోటర్లు విభిన్నమైన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం కావచ్చు! ఈ ప్రాధాన్య తారతమ్యం మరోసారి తృణమూల్ కాంగ్రెస్కు ఘనవిజయం చేకూర్చిపెట్టింది. మమతా బెనర్జీ ‘నియంతృత్వం’ గురించి కానీ, తృణమూల్ కాంగ్రెస్ వారి ‘రాజకీయ దౌర్జన్యం’ గురించి సామాన్య వోటర్లు పట్టించుకోలేదని ఈ ఎన్నికల ఫలితాలవల్ల మరోసారి ధ్రువపడింది! అంతేకాదు ‘శారద’ చిట్ఫండ్ అవినీతిలో తృణమూల్ పార్టీకి సంబంధం ఉందని జరిగిపోయిన ప్రచారం కూడ వోటర్లను ప్రభావితం చేయలేదు! వర్ధమాన్ జిల్లాలో బంగ్లాదేశీయ ఉగ్రవాదులు జరిపించిన బీభత్స కలాపాలను, రాష్టమ్రంతటా చాపకింది విషంలా విస్తరించిన జిహాదీ విద్రోహులను నిరోధించడంలో జరిగిన వైఫల్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందదని కూడ ఈ ఎన్నికల ఫలితాలవల్ల తేటతెల్లమైంది! అందువల్లనే తృణమూల్ ఘనవిజయం సాధించింది!
ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న రాజకీయ పట్ల సహజంగా వ్యతిరేకత ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందన్నది కూడ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక ఎన్నికలో ఘనవిజయం సాధించిన పార్టీ పట్ల క్రమంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. అందువల్లనే పదేళ్లపాటు అధికారం నిర్వహించిన పార్టీల పలుకుబడి తగ్గుతోంది! ఇలా తగ్గడంవల్ల చట్టసభలలో ఆయా పార్టీలకున్న సంఖ్య మాత్రమే తగ్గుతుందా? లేక మెజారిటీ కోల్పోవడం జరుగుతుందా? అన్నది తగ్గుదల తీవ్రతపై ఆధారపడి ఉంది! తృణమూల్ కాంగ్రెస్ పట్ల వోటర్లలో ‘అధికార వ్యతిరేకత’ ఏర్పడలేదు. లేదని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. పైగా తృణమూల్ పలుకుబడి మరింతగా పెరిగింది. వామపక్షాలకు ప్రధానంగా మార్క్సిస్టు పార్టీకి 2011 వరకు వోట్లు వేసిన వారు తృణమూల్కు ఈ ఎన్నికలలో వోట్లు వేసారు. భాజపా ఎదగకపోవడానికి ఇదీ కారణం. లోక్సభ ఎన్నికల సమయంలో వలె ‘వామ’ వోటర్లు ఇప్పుడు భాజపాకు బదిలీ కాలేదు. తొంబయి రెండు పురపాలక నగర పాలక మండలులకు ఎన్నికలు జరుగగా భాజపాకు సున్న స్థానాలలో మెజారిటీ లభించడానికి ఇదీ కారణం! లోక్సభా సమరాన్ని ప్రభావితం చేయగలిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఆకర్షణ అట్టడుగు స్థాయికి విస్తరించలేదు. ఫలితంగా వామపక్షాలకు జరిగిన నష్టం తృణమూల్ విజయ విస్తృతిని మరింత పెంచింది. 2010లో అరవై ఆరు మండలులలో సంపూర్ణ మెజారిటీ సాధించిన తృణమూల్ ఇప్పుడు డెబ్బయి ఒక్క చోట్ల విజయం సాధించడం పలుకుబడి పెరిగిందన్నదానికి ప్రమాణం! 2090 స్థానిక విభాగాలలో 1425 తృణమూల్ కైవసం కావడం పార్టీ మూలాలు మరింత బలపడినాయన్నదానికి నిదర్శనం!
తృణమూల్ పార్టీవారు శారదా చిట్ఫండ్ అవినీతి రెండేళ్లకు పైగా తృణమూల్ పార్టీని అప్రతిష్టపాలు చేసింది! పార్టీకి చెందిన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రులు ఇతర రాజకీయ వేత్తలు ఆరోపణగ్రస్తులయ్యారు, అభియోగగ్రస్తులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తమ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికై శారద అవినీతిలో తమ సహచరులను ఇరికించిందన్నది తృణమూల్ పార్టీ చేసిన ప్రచారం. శారద అవినీతి నిధులు వర్ధమాన్ జిల్లాలో పేలుళ్లు జరిపిన జిహాదీ టెర్రరిస్టులకు సైతం దక్కాయన్న ఆరోపణలు కూడ కొనసాగుతున్నాయి. ఈ టెర్రరిస్టులు బంగ్లాదేశ్నుండి చొరబడిపోయిన జిహాదీ మతోన్మాదులు! బంగ్లాదేశ్నుండి అక్రమంగా చొరబడిన వారిని అక్కున చేర్చుకుని వోటర్లుగా నమోదు చేయించిన ఆరోపణలు అన్ని పార్టీలకు వ్యతిరేకంగా వినిపిస్తునే ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎక్కువగా వినిపించాయి. మమతా బెనర్జీ నియంతవలె వ్యవహరిస్తోందని ప్రత్యర్థి రాజకీయ పార్టీల వారిని ప్రచార మాధ్యమాలవారిని హింసాకాండకు వేధింపులకు గురి చేస్తోందని కూడ ఆరోపణలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభావంతో భాజపా ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నది లోక్సభ ఎన్నికల నాటినుండి ఏర్పడిన భావం! 2016లో జరిగే శాసనసభ ఎన్నికల తరువాత పశ్చిమ బెంగాల్లో భాజపా ప్రభుత్వం ఏర్పడిపోవచ్చునని, లేదా అతి పెద్ద పార్టీ భాజపా అవతరించవచ్చునని ఉత్సాహవంతులు మాధ్యమాలలో ప్రచారం చేసారు. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నైనా భాజపా శాసనసభలో అవతరిస్తుందన్నది అందరికీ కలిగిన విశ్వాసం. ఇదంతా హుళక్కి అయింది. కాంగ్రెస్ మూడవస్థానంలోను భాజపా నాలుగవ స్థానంలో, వామపక్ష కూటమి రెండవ స్థానంలో ఉండడం యథాతథ స్థితికి నిదర్శనం! భాజపా గెలిచిన వార్డుల సంఖ్య 2010నాటి 85 నుండి 186కు పెరగడమొక్కటే జరిగిన మహా పరివర్తన! వామ కూటమి బలం మరింత తగ్గడం ఆశ్చర్యకరం కాదు.
వాల్మార్ట్వంటి విదేశీయ సంస్థలు చిల్లర వ్యాపారంలో చొరబడడానికి వీలు కల్పించడం వల్ల తమ పలుకుబడి తగ్గిందని 2013లో బెంగాల్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా వాపోయారు. 2014లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోవడానికి ఈ చిల్లర విదేశీయ వ్యాపారం కూడ ఒక కారణం! బెంగాల్లో ఎదిగినట్టే ఎదిగిన భాజపా మళ్లీ కూలబడడానికి కారణం భూమి సేకరణ సవరణ బిల్లు కూడ ఒక కారణం కావచ్చు! వ్యవసాయదారుల భూమిని పారిశ్రామిక వేత్తలకు అప్పగించే విధానాన్ని మమతమ్మ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ వ్యతిరేక ప్రాతిపదికగానే 2011లో బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధిం చింది. 1977 నుంచి ‘ఏలిన’ వామ కూటమి కుప్పకూలింది!
మాగ్లెవ్ ట్రెయన్ ‘పట్టా’ల్లేవ్… పగ్గాల్లేవ్…
మాగ్లెవ్ ట్రెయన్ ‘పట్టా’ల్లేవ్… పగ్గాల్లేవ్…
- 03/05/2015
- -రామానుజం
దినపత్రికలో వచ్చిన వార్తకు సంబంధించి ‘హెడ్లైన్’ను చదివేలోగా మీరు ప్రయాణిస్తున్న రైలు దాదాపు 2 కిలోమీటర్ల దూరం దూసుకుపోతుంది. నమ్ముతారా..! … నమ్మాల్సిందే.. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలులో అది నిజం కనుక. భూ వాతావరణంలో ధ్వనికన్నా ఐదారు రెట్ల వేగంగా, గంటకు 7వేల కిలోమీటర్ల వేగంతో అంటే విమానం కన్నా వేగంగా దూసుకువెళ్లే రైలు భవిష్యత్లో మీకు సేవలందిస్తుందంటే నమ్ముతారా! మనం వెంటనే నమ్మలేకపోవచ్చు…కానీ, శాస్తవ్రేత్తలు దాన్ని నిజం చేయగలమంటున్నారు. ఆశ, తపన, నమ్మకం లేకుండా మనిషి లేడు. అందుకు ఉదాహరణే జపాన్ తాజాగా ప్రయోగించిన ‘మాగ్లెవ్ ట్రెయిన్.’ *** ఆ రైళ్లకు ఇంజన్లు, చక్రాలు ఉండవు.. అయినా భద్రంగా, అతివేగంగా గమ్యానికి మనల్ని చేరుస్తాయి.. ఆ రైళ్లు ట్రాక్మీద కాకుండా గాలిలో దూసుకుపోతాయ్… అయినా ప్రమాదమేమీ ఉండదు. కుదుపులు, చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా మన చేరాల్సిన చోటికి చేరవేస్తాయి. ఆ రైళ్లు పరిగెడుతూంటే… గాలిని చీల్చే శబ్దం తప్ప మరేమీ విన్పించదు. కాదు…మరే శబ్దం ఉత్పత్తికాదు. ఆ రైళ్లలో వెడుతూ అద్దాల్లోంచి బయటి దృశ్యాలను చూస్తే తప్ప మనం ప్రయాణిస్తున్న విషయం తెలీదు.. ఈ రైళ్లు కొండవీటి చాంతాడంత పొడవునా ఉండవు. బోగీల కోసం వెతుక్కోనక్కరలేదు. అంతా కలిపితే ఏడు చైర్కార్లుంటాయంతే. ఓ హెలికాఫ్టర్కన్నా…ఓ ఫార్ములావన్ రేసు కారుకన్నా…వేగంగా దూసుకుపోయే ఆ రైళ్ల పేరు ‘మాగ్లెవ్ ట్రెయిన్స్’. పదేళ్లక్రితం నుంచే ఇవి రెగ్యులర్ సేవలు అందిస్తున్నాయి. అసమాన వేగంగా, పరిమిత దూరానికి ప్రస్తుతానికి ఇవి సేవలందిస్తున్నాయి. ఈ మధ్య జపాన్లో జరిపిన ప్రయోగంలో గంటకు 603 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయి గతంలో తాను సృష్టించిన రికార్డును బద్దలుకొట్టిన ఆ బుల్లి మాగ్లెవ్ ట్రెయిన్ గొప్పలు అన్నీఇన్నీకావు. దాదాపు నూట పదేళ్ల క్రితమే ఈ తరహా బీజం పడినా ఎడతెగని పరిశోధనల ఫలితంగా వాటి వేగంలో వచ్చిన మార్పులు ఇప్పుడు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. మనిషి మేధోమథనం ఇలాగే కొనసాగితే విమానాల కన్నా వేగంగా, భద్రంగా మనల్ని మోసుకెళ్లే వాక్టోట్రెయిన్స్ మరో 50 ఏళ్లలో మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇంతకీ ఏమా రైళ్లు..? ఏమా కథ..? కాలంతో పరుగు ఆధునిక మానవుడికి ప్రాణం తరువాత అత్యంత విలువైనది కాలం. కాలంతో పరుగులు తీస్తూ మనోవేగాన్ని మించి దూసుకుపోవాలన్నది అతడి తపన. ఆచరణలో ఒక్కో మైలురాయి దాటుతున్నాడు. పరుగు ప్రయాణంలో వేగంగా అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచం విశ్వనగరంగా మారిపోయింది. ఒకచోటి నుంచి మరోచోటికి, ఒక ఖండం నుంచి మరో ఖండానికి రోజువారీ పర్యటనలు చేయాల్సిన స్థితికి మనిషి అవసరాలు చేరాయి. ఉక్కిరిబిక్కిరిగా, ఊపిరి సలపని పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని మనసు ఉబలాటపడుతూంటే ఆ వేగానికి తగ్గట్లు సౌకర్యాలు ఉండాలి కదా! ఆ అవసరాలు తీర్చడానికి తగిన ప్రయాణ సాధనాలను కనుగొనే పని శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడు ఆ సాధనాల వేగం పెంచే పనిలో ఒక్కో అడుగూ ముందుకేస్తున్నాం. జపాన్లో మొన్న జరిగింది అదే. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మాగ్లెవ్ ట్రెయిన్ టెస్ట్ రన్ విజయవంతం కావడంతో ఆ దేశం వైపు, ఆ రైళ్లవైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. మాగ్లెవ్ ట్రెయిన్స్ అంటే… సంప్రదాయ రైళ్లు మొదట బొగ్గు, నీటి ఆవిరి, ఆ తరువాత డీజిల్, ఇప్పుడు విద్యుత్శక్తితో నడుస్తున్న విషయం తెలిసిందే. భారీ స్టీల్ట్రాక్లపై పెద్దశబ్దం చేస్తూ వెళ్లే ఈ రైళ్లను ఆధునీకరించి, వాటి వేగం పెంచి బుల్లెట్ ట్రైన్లుగా చెప్పుకుని మురిసిపోతాం. మనదేశంలో ఇంకా బుల్లెట్ రైళ్లు..కాగితాలపైకూడా ఇంకా పరుగులు తీయడం లేదు. కానీ, ఆసియా దేశాలైన జపాన్, చైనా,కొరియా, రెండు మూడు పాశ్చాత్య దేశాల్లో మాగ్లెవ్ రైళ్లు కాలంతో పరుగులు తీస్తూ దూసుకువెళుతున్నాయి. అయస్కాంత శక్తిని వినియోగిస్తూ నడిచే రైళ్లనే మాగ్లెవ్ రైళ్లుగా పేర్కొనవచ్చు. మాగ్నటిక్ (అయస్కాంతశక్తి), లెవిటేషన్ (గాలిలో తేలడం) అని అర్థం వచ్చినప్పటికీ అయస్కాంత శక్తివల్ల ట్రాక్పై తేలియాడుతూ దూసుకువెళ్లే రైళ్లుగా వీటిని అభివర్ణించవచ్చు. ఇలా రైళ్లు గాలిలో తేలుతూ వెళ్లడానికి అయస్కాంత శక్తే కారణం. అయస్కాంతంలో సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని, విజాతి ధృవాలు వికర్షించుకుంటాయని మనకు తెలుసు. రైలును ముందుకు నడిపించేందుకు, ట్రాక్పై బోగీలు తేలియాడేలా ఉండేందుకు ఈ సూత్రాన్ని వినియోగిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్ (గైడ్ వే) ఉంటుంది. రైలు బోగీల కింద కొన్ని మాగ్నెటిక్ కాయిల్స్, గైడ్ వేకు ఇరువైపులా క్రమపద్ధతిలో అమరుస్తారు. అందువల్ల ఆయా కాయిల్స్ ఆకర్షించుకున్నప్పుడు రైలు ముందుకు కదులుతూంటుంది. వికర్షణ శక్తివల్ల ట్రాక్పై బోగీలు తేలుతూంటాయి. ఇదంతా జరగడానికి విద్యుత్శక్తిని ఉపయోగిస్తారు. విద్యుత్శక్తిని వినియోగించనప్పుడు రైలు ముందుకు కదలదు. అంటే రైలు ఆగాల్సినప్పుడు విద్యుత్శక్తిని వినియోగించరన్నమాట. అత్యంత వేగంగా దూసుకుపోయే రైలు వేగం నియంత్రణ కూడా విద్యుత్శక్తి వినియోగం ఆధారంగా ఉంటుంది. ఈ రైళ్లతో లాభాలేంటి… ప్రస్తుతం జపాన్, చైనాలు మాత్రమే పూర్తిస్థాయిలో మాగ్లెవ్ రైళ్లను నడుపుతున్నాయి. జర్మనీ, అమెరికా,బ్రిటన్, దక్షిణ కొరియా,ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు ప్రయత్నాలు, ప్రయోగాల దశలో ఉన్నాయి. వీటిలో ఒకటీ అరా దేశాలు నామమాత్రపు సర్వీసులు నడుపుతున్నాయి. వాణిజ్యపరంగా ప్రజలకు సేవలందిస్తూ రెగ్యులర్ సర్వీసులు నడుపుతున్న దేశాలు మాత్రం రెండే. అవి జపాన్, చైనా. ఈ తరహా రైళ్ల వినియోగంలో చైనా ముందున్నా వేగం, ఆధునికత విషయంలో జపాన్ అగ్రస్థానం వైపు కదులుతోంది. ఉక్కుతో చేసిన పట్టాలపై పెద్దశబ్దం చేస్తూ, ఇరుకుగా ఉండే సంప్రదాయ రైళ్లకన్నా మాగ్లెవ్ రైళ్లతో ప్రయోజనాలు ఎక్కువ. ముఖ్యంగా వీటి నిర్వహణ వ్యయం సాధారణ రైళ్ల నిర్వహణ వ్యయంకన్నా చాలా తక్కువ. పట్టాలుండవు కనుక బోగీల వాడకంలో విడిభాగాల మార్పిడి అవసరం ఉండదు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల అవసరం ఉండదు. మామూలు రైళ్లకు వినియోగించే విద్యుత్లో చాలా తక్కువ విద్యుత్తో మాగ్లెవ్ రైళ్లను నడపవచ్చు. ట్రాక్ల నిర్వహణ కూడా సులభమే. వాతావరణ ప్రతికూలత ప్రభావం మామూలు రైళ్లు, ట్రాక్లపైకన్నా తక్కువే. వాయు ధ్వని కాలుష్యం ఉండదు. ఈ రైళ్లు పట్టాలపై నడవవు.వాటికి పది మిల్లీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో గాలిలో తేలుతూ ఉంటాయి కనుక శబ్దం ఉత్పన్నం కాదు. కేవలం గాలిలో దూసుకుపోవడంవల్ల కలిగే రాపిడి వల్ల వచ్చే శబ్దం మాత్రమే విన్పిస్తుంది. పరికరాల అమరిక కోసం బోగీలో ఎక్కువ స్థలం అవసరం ఉండదు. అందువల్ల సంప్రదాయ రైళ్లలోకన్నా ఈ బోగీలు విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా వీటికి ప్రత్యేకంగా ఇంజన్లు ఉండవు. అంతా గైడ్ వేలో ప్రయాణం సాగిపోతుంది. అందువల్ల మొదటి, చివరి బోగీలు ఒకేలా మంచి డిజైన్తో ఉంటాయి. తక్కువ బోగీలు, సురక్షిత గైడ్ వేవల్ల బోగీలు విడిపోవడం వంటి ప్రమాదాలు జరగనే జరగవు. ఈ తరహా రైలు వ్యవస్థకు భారమల్లా గైడ్ వే ఏర్పాటు. ఇది సంప్రదాయ రైల్ట్రాక్ నిర్మాణవ్యయం కన్నా వందల రెట్లు అధికం. ఇది పేదదేశాలకు మోయలేని భారం. అందువల్ల అగ్ర, సంపన్న రాజ్యాలు మాత్రమే వీటి జోలికి వెళుతున్నాయి. చైనా నడుపుతున్న షాంఘై మాగ్లెవ్ రైలు మార్గం వేయడానికి కిలోమీటరుకు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తం వ్యయమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు విధానాల్లో సేవలు మాగ్లెవ్ రైళ్లు రెండు విధానాల్లో సేవలందిస్తున్నాయి. 1901 ప్రాంతంలో జర్మనీ శాస్తవ్రేత్త మాగ్లెవ్ రైళ్ల ప్రస్తావన చేశారు. వీటికి సంబంధించి పరిశోధన పత్రాలు విడుదల చేశారు. జర్మనీ రూపొందించి అభివృద్ధి చేసిన మాగ్లెవ్ రైల్ సిస్టమ్ నిర్వహణ అంతా ఇఎంఎస్ విధానంలో ఉంటుంది. అంటే ఎలక్ట్రోమాగ్నటెక్ సస్పెన్షన్తో రైలు నడుస్తుందన్నమాట. ఈ విధానాన్ని అన్వయించుకుని చైనా సొంత సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేసుకుంది. అయస్కాంతశక్తితో రైళ్లు నడుస్తాయి. పరిమితంగా విద్యుత్ వినియోగిస్తారు. ఈ రైళ్లకు చక్రాలు అసలు ఉండవు. జపాన్ సొంతంగా తయారు చేసుకున్న విధానం దీనికి భిన్నం. వారు వాడే విధానాన్ని ఇడిఎస్ అని పిలుస్తారు. అంటే ఎలక్ట్రో డైనమిక్ సస్పెన్షన్. దీనివల్ల రైలు పరిమిత వేగాన్ని అందుకునేవరకు చక్రాలపై నడుస్తుంది. కేవలం పది సెకండ్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగం అందుకున్న వెంటనే రైలు చక్రాలపై కాకుండా గాలిలో తేలుతూ పరుగులు తీస్తుంది. ఈ రెండురకాల విధానంలో రైళ్లు ట్రాక్పై పది మిల్లీమీటర్ల (ఇఎంఎస్ విధానం) నుంచి పది సెంటీమీటర్ల ఎత్తులో(ఇడిఎస్) గాలిలో దూసుకుపోతూంటాయి. విద్యుత్ను వినియోగిస్తున్నప్పుడు అయస్కాంత శక్తి పనిచేస్తుంది. అప్పుడు రైలు నడుస్తుంది. విద్యుత్ను వినియోగించనప్పుడు రైలు ఆగిపోతుంది. ఈ రైళ్ల నిర్వహణలో కీలకమైన గైడ్వే (ట్రాక్-ఇరుప్రక్కలా గోడల్లాంటి, పట్టాల్లాంటి పలకలు)లోను, రైలు బోగీల అడుగు భాగంలోనూ అత్యంత శక్తివంతమైన మాగ్నెటిక్ కాయిల్స్ వాడతారు. వీటిని మరోవిధంగా ‘సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్’అని అనుకోవచ్చు. ఇవి వేడెక్కకుండా చల్లగా ఉండేలా వీటిని రేర్ఎర్త్ ఎలిమెంట్స్తో తయారు చేస్తారు. దాదాపు 15 రకాల మూలకాల మిశ్రమంతో వీటిని తయారు చేస్తారు. ప్రమాదాలు అతి తక్కువ మాగ్లెవ్ రైళ్ల నిర్వహణ ఈనాటిది కాదు. 1980 నాటికే ఇవి వినియోగంలోకి వచ్చాయి. 1984లో బర్మింగ్హామ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ రైల్వెస్టేషన్వరకు 600 మీటర్ల దూరానికి తొలి మాగ్లెవ్ రైలును నడిపారు. అప్పుడు ఆ రైలు గంటకు 42 కిలోమీటర్ల వేగంతో నడిచేది. 11 ఏళ్లపాటు అది సేవలందించింది. జర్మనీ 1984లో తొలి షటిల్ను నడిపింది. అయితే, ప్రమాదాలు, సాంకేతిక ఇబ్బందులు, నిర్వహణ భారం వల్ల కొంతకాలానికి రద్దు చేశారు. మళ్లీ 1980 తరువాత వీటిపై మమకారం ప్రారంభమైంది. 2001 నాటికి జపాన్, చైనా వీటిపై ఆసక్తి చూపి కార్యరంగంలోకి దూకాయి. ఇప్పటివరకు ఐదారు అగ్నిప్రమాదాలు తప్ప పెనుప్రమాదాలేవీ జరగలేదు. చైనా తన తొలి మాగ్లెవ్ రైలును 2001లో ప్రయోగాత్మకంగాను, 2004లో వాణిజ్యపరంగాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. షాంఘై మాగ్లెవ్ పేరుతో దీనిని పుడోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లాంగ్యాంగ్ రోడ్ మెట్రోస్టేషన్ వరకు, 30 కిలోమీటర్ల దూరం నడుపుతున్నారు. కేవలం 7 నిమిషాల్లో అది గమ్యం చేరుతుంది. గంటకు 431 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైలుగా రికార్డు సాధించింది. ప్రస్తుతం ఈ రైలు రోజుకు 115 ట్రిప్లతో సేవలందిస్తోంది. మున్ముందు ఈ రైలుమార్గాన్ని మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న జపాన్లో 603 కిలోమీటర్ల వేగంతో నడిచిన మాగ్లెవ్ రైలు ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగానే వినియోగించారు. జపాన్కు చెందిన లినిమో మాగ్లెవ్ రైలు ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రెండో రైలుగా రికార్డులు నమోదు చేసింది. 2005లో ఇది ప్రజల కోసం అందుబాటులోకి వచ్చింది. ఇది అందుబాటులోకి వచ్చిన తొలి మూడునెలల్లోనే కోటిమంది దీనిలో ప్రయాణించారంటే అది ఎలాంటి సేవలందిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక దక్షిణ కొరియా సైతం ఈ రంగంలో ప్రతిభ చూపింది. తన తొలి మాగ్లెవ్ రైలును గత ఏడాది ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రసిద్ధ ఇంచియాన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుండి యాంగ్యు వరకు దీనిని నడుపుతున్నారు. చైనా, జపాన్, కొరియా దేశాలు మరికొన్ని ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకువెళుతున్నాయి. ముఖ్యంగా జపాన్ తన టోక్యొ-ఒసాకా మాగ్లెవ్ రైలు వ్యవస్థను పూర్తిచేయాలని చూస్తోంది. 2027 నాటికి తొలిదశను అంటే నగొయా వరకు 286 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరేలా ప్రయత్నిస్తోంది. 2047 నాటికి ఒసాకాకు, అంటే 410 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఒకగంట ఏడు నిమిషాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కారులో టోక్యోనుంచి ఒసాకోకు చేరడానికి 5 గంటల సమయం పడుతోంది. మాగ్లెవ్ వ్యవస్థ పూర్తయితే కేవలం గంట 7 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. ఈ వ్యవస్థ ప్రకారం న్యూయార్క్-శాన్ఫ్రాన్సిస్కోల మధ్య ఉన్న 4,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడు గంటల్లో అధిగమించవచ్చు. అయితే ఈ ప్రయత్నంలో అమెరికా ఇంకా చాలాదూరం ప్రయాణించవలసి ఉంది. ఈ దేశంలో ఇప్పటికి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న రైలు ఆమ్ట్రెక్ అసెలా ఎక్స్ప్రెస్. ఇది గంటకు 241 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తోంది. ఇక ఇంగ్లండ్లో ప్రతిపాదనలో ఉన్న హెచ్ఎస్2 హైస్పీడ్ రైలు వేగం గంటకు 400 కిలోమీటర్లుగా ఉంది. వివిధ దేశాల్లో హైస్పీడ్ రైళ్లు, మాగ్లెవ్ రైళ్ల వేగం ఇలా ఉంది. షాంఘై మాగ్లెవ్ 431 కెఎంపిహెచ్, లినిమో-380, హార్మని సిఆర్హెచ్ 380ఎ-380, ఎజియు-ఇటలో-360, సిమన్స్ వెలరో(స్పెయిన్)-350, టల్గో-350 (స్పెయిన్) తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి. వీటి వేగం ఇదీ… భూమీద వేగంగా నడిచే ప్రయాణ సాధనాలను పరిశీలిస్తే ప్రస్తుతానికి మొన్న జపాన్లో రికార్డు సృష్టించిన మాగ్లెవ్ రైలుదే అగ్రస్థానం. దీని వేగం గంటకు 603 కిలోమీటర్లు. మరికొన్ని మగ్లెవ్ రైళ్లు 403 నుంచి హీనపక్షం గంటకు 350 కి.మీ.ల వేగంతో దూసుకువెళుతున్నాయి. ఫార్ములా-1 రేస్ కారు వేగం గంటకు 320 కిలోమీటర్లు కాగా జపాన్లోని ప్రతిష్టాత్మక షిన్కసు బుల్లెట్ రైలు వేగం 321 కెఎంపిహెచ్. యూరోస్టార్ హైస్పీడ్ రైలు వేగం గంటకు 300 మాత్రమే. కాలగతిలో ఆధునిక మానవుడు ఎలా అభివృద్ధి చెందాడో గమనిస్తే మున్ముందు మరిన్ని మేలైన ఆవిష్కరణలు సాక్షాత్కరిస్తాయనే విశ్వసించాలి. మానవాళి ప్రగతికి అవసరమైన సేవలు మరింత చౌకగా, భద్రంగా, చేరువగా రావాలంటే ఇలాంటి ప్రయోగాలు జరగాలి. ఒక్కో విజయం కొత్త ఆశలకు ఊపిరిలూదుతుంది. ఈ వేగం, విజయం జపాన్ సాధించినా, భారత్ సాధించినా ఒక్కటే. అది ముమ్మాటికీ మానవుడి విజయం. కాదంటారా..? ………………………………….. భారత్లో ఎప్పుడు..? భారత్లో హైస్పీడ్ రైళ్ల వేగం 160 (దిల్లీ-్భపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్) కిమీలకు మించదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ భారత్లో బుల్లెట్ రైళ్లకోసం పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. భారీ వ్యయం, ఎక్కువ సమయం తీసుకునే ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి రావడానికి చాలాకాలం పట్టవచ్చు. భారత్లో మాగ్లెవ్ రైళ్లు పరుగుపెట్టాలంటే ఒకటి రెండు దశాబ్దాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ, మనవాళ్లూ వీటిపై మనసుపడినమాట నిజం. కొన్ని ప్రతిపాదనలు, కొన్ని మార్గాల్లో వీటని నడపాలన్న ఆలోచనలు ఎప్పుడో చర్చకు వచ్చాయి. లాలూప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు ఒక అమెరికన్ కంపెనీ మాగ్లెవ్ రైళ్లపై ఓ నివేదిక సమర్పించింది. పూణె-ముంబయి మధ్య నిర్మించ తలపెట్టిన మాగ్లెవ్ రైలువ్యవస్థకు 30 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. లాభనష్టాలపై బేరీజు వేసిన లాలూ పేదలకు అందుబాటులో ఉండే ‘గరీభ్ రథ్’పై మొగ్గుచూపి మాగ్లెవ్ను పక్కనపడేశారు. నిజానికి ఈ మాగ్లెవ్ రైలును పూణెలోని పింపిల్ సౌదనగర్ నుంచి ముంబైలోని పడ్వేల్ వరకు నడపాలని ప్రతిపాదించారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 112 కి.మీ. దూరం ఉంది. నిజానికి అత్యంత రద్దీగా ఉండే ముంబయి-పూణె మార్గంలో రోజూ 14 వేల వాహనాలు తిరుగుతాయి. ఈ మార్గంలో మాగ్లెవ్ రైలు నడిపితే రెండు గంటల ప్రయాణ సమయంలో గంటన్నర సమయం ఆదా అవుతుంది. అంటే కేవలం 30 నిమిషాల్లో గమ్యం చేరవచ్చు. ఈ ప్రతిపాదనను మహారాష్టక్రు చెందిన ఓ మంత్రి చేసినా అది కాగితాలకే పరిమితమైంది. ముంబయి-్ఢల్లీ మధ్య కూడా ఇలాంటి రైలు నడపాలన్న ప్రతిపాదనలు వచ్చినపుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ కూడా సానుకూలంగా స్పందించారు. ఈ ప్రయోగం సఫలమైతే మరిన్ని ప్రాంతాల్లో అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ రైల్వెమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది. కానీ అమలు కాలేదు. ఇక చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఇలాంటి రైలును నడపాలన్న ప్రతిపాదన 2012లో కర్నాటక మంత్రి ఒకరు చేశారు. దీనిపై సౌత్ కొరియాకు చెందిన ఒక సంస్థ ప్రాజెక్టు రిపోర్డును కూడా ఇచ్చింది. ఆ తరువాత దానిపై ఎవరూ ముందుకు వెళ్లలేదు. ముంబయి-నాగపూర్ మధ్య వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహారాష్టల్రోని వెనుకబడిన (అహ్మద్నగర్, బీడ్, లాతూర్, నాందేడ్)ప్రాంతాల మీదుగా ఓ రైలు వేయాలన్న ప్రతిపాదన కూడా గతంలో తెరపైకి వచ్చింది. ఇవన్నీ రాష్టస్థ్రాయిలో జరిగిన మాటామంతీయే తప్ప సీరియస్ ప్రయత్నాలు కావు. ……………………………………………….. వాక్టో ట్యూబ్ ట్రైన్@6,400 కెఎంపిహెచ్ ఔను…అన్నీ అనుకున్నట్లు జరిగితే, పరిశోధనలు నిజమే అయితే- అవి సత్ఫలితాన్ని ఇస్తే శాస్తవ్రేత్తలు కంటున్న కలలు నిజమైతే..ఆ రైలు వేగం గంటకు కనీసం 6400 కిలోమీటర్లు. గరిష్ఠ వేగం..గంటకు 8వేల కిలోమీటర్లు. ఇది ప్రస్తుతానికి నమ్మశక్యం కాదు. కానీ వీటిపై చైనాకు చెందిన సౌత్వెస్ట్ జయాటోంక్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారని అంటున్నారు. ఈ రైళ్లకు వారు ‘వాక్టో ట్యూబ్ ట్రెయిన్స్’ అని పేరుపెట్టారు. గాలిలేని ట్యూబుల్లో ప్రయాణించే రైళ్లు అన్నమాట. గాలి ఒత్తిడివల్ల రైళ్లవేగం మందగిస్తుంది. గాలే లేని విధంగా నిర్మించిన టనె్నల్స్ లేదా ట్యూబుల్లో ప్రయాణించే రైళ్లను సృష్టించాలన్నది ఆలోచన. గాలి ఒత్తిడి లేనప్పుడు ఆ రైళ్లవేగం గంటకు 6 వేల కిలోమీటర్లపైగానే ఉంటుందన్నది వారి అంచనా. ఇది భూ వాతావరణంలో ధ్వనివేగం కన్నా ఐదారురెట్లు ఎక్కువ. వీరిలెక్కలు, అంచనాలు కార్యరూపంలోకి వస్తే బీజింగ్ నుంచి న్యూయార్క్కు రెండు గంటల్లో చేరిపోవచ్చు. ఆ వేగం ఓ విమానం ప్రయాణించే వేగంగా ఎక్కువ. నిజానికి 1970లోనే వీటిపై పరిశోధనాపత్రాలు వెలువడ్డాయని అంటారు. కానీ ఇదంతా పుక్కిట పురాణమేనని, ఇది అసాధ్యమని అంటున్నవాళ్లూ ఉన్నారు. చైనా యూనివర్శిటీ శాస్తవ్రేత్తలు ఒక్కటి మాత్రం స్పష్టం చేశారు- ‘తామేమీ పరిశోధనలు చేయడం లేద’ని. కానీ- చేసేవన్నీ ముందు చెబుతారా ఏంటి.? అదీ చైనాలో..! …………………………. జపాన్ మాగ్లెవ్-603 ఈ రైలు వేగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రయోగాత్మకంగా జపాన్ పరిశీలించింది. ఏడు బోగీలున్న ఈ మాగ్లెవ్ రైలు కేవలం 10.8 సెకండ్లలో 1.8 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంది. ఇది గంటకు 603 కిలోమీటర్ల వేగంతో సమానం. దీంతో ప్రపంచం కళ్లు జపాన్వైపు, ఆ మాగ్లెవ్ రైలువైపు పడ్డాయి. నిజానికి సరిగ్గా వారం ముందు అదే రైలు వేగాన్ని పరిశీలించినపుడు గంటకు 590 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది. అంటే తాజాగా తన రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డును నమోదు చేసిందన్నమాట. అది ఆ రైలుకు కొత్తకాదు. ఇదే రైలు తొలిసారి అంటే 2003లో గంటకు 581 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. జపాన్ మాగ్లెవ్ అంటే ఆషామాషీ కాదు కదా!
“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16
’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16
ప్లాస్టిక్ స్పేస్
ప్రత్యేకం గా చేస్తున్న పరిశోధనలు ఏవీ వృధా కాలేదు మంచి ఫలితాలనే ఇచ్చి ఉత్సాహపరచాయి .యుద్ధ టాంకు లకు పనికొచ్చే కొత్త రకాలైన ఇంధనాలు (ఫ్యుయెల్స్) ,వాటిలో కలిపే ‘’ఎడిటివ్స్’’ పైన చేస్తున్న కృషి రామయ్య గారి జీవితం లో ముఖ్య భాగమే అయింది .దీనితో ‘’ప్లాస్టిక్ స్పేస్ ‘’అనే కొత్త సూత్రాలకు దారి తీస్తుందని ఊహించలేదు .ఇది అనుకోకుండా జరిగిన సంఘటన .అప్పటికే మధ్యాహ్న భోజనం సమయమైంది .ఇంటికి ఫోన్ చేసి ఆ రోజు ఆలస్యంగా వస్తానని చెప్పారు .అక్కడే ఏదో దొరికింది తినేస్తాం అని తెలియజేశారు భార్య కాత్యాకు .మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఆ విషయమే మర్చిపోయారు .పని పూర్తీ చేసుకొని ఇంటికి చేరుకొనే సరికి అందరూ నిద్రపోతున్నారు .
హోం గార్డ్ రామయ్య –అదుగు దూరం లో యుద్ధభూమి కి దూరమైన రామయ్య
యుద్ధం మొదలైన రోజు నుండి దిన చర్యలో మార్పు వచ్చింది .రామయ్య గారు వాయంకోమాల్ వెళ్ళిన దగ్గర్నుంచి తనను యుద్ధ భూమికి పంపమని కోరుతూనే ఉన్నారు .ఆయన్ను హోమ్ గార్డ్ గా మిగిలిన వాలంటీర్ లతో బాటు తీసుకొన్నారు .అందరిలాగే వరుసలో నిలబడ్డారు .ఇది వరకటి లాగా అహింస ,ఇతరులను చంపరాదు ,యుద్ధం లో చస్తే అమరులౌతారు మొదలైన నీతి వాక్యాలేవీ అప్పుడు మనసులోకి రానే లేదు . అనాగరక కొత్త హూణులే ,వారి దుశ్చర్యలే మనసులో నిలిచాయి .హోమ్ గార్డ్ గా తన దేశాన్ని తన స్వేచ్చను సంరక్షించుకోవాలి అన్నదే ధ్యేయమైంది రెండో ఆలోచనే రాలేదు మనసులోకి .యుద్ధ సైనికుడినే అనుకొన్నారు .’’క్విక్ మార్చ్ ‘’అన్న కమాండ్ విని పించింది .యుద్ధ రంగం లోకి అడుగు పెట్ట బోతున్నారు .ఇంతలో ‘’ఇందులో రామయ్య ఎవరు ? ఆయన ఈ లైన్ ఫార్మేషన్ నుండి బయటికి రావాలి ‘’అన్న మాటలు వినిపించాయి .మిగిలిన వాలంటీర్లు ఆశ్చర్యం తో చూస్తుండగా రామయ్యగారు ఆ కమాండ్ విని ఆఫీస్ వైపు నడిచి వెళ్ళారు .అక్కడ ఆర్మీ రిప్రేసే౦టటివ్ తో బాటు, రామయ్య గారి ఇస్టిట్యూట్ డైరెక్టర్ కూర్చుని ఉన్నాడు .ఆయన ‘’కామ్రేడ్ మిత్రమా ! నీ దేశ భక్తీ పై ఎవరికీ అపనమ్మకం లేదు .కాని నీ బుర్ర శిక్షణ లేని సైనికుడు .కనుక అది శత్రువుల బులెట్ కు గురి కారాదు .మాకు నీ మేధస్సు పదునైన ఆయుధం గా ఉపయోగ పడాలి కాని యుద్ధ భూమిలో కాదు ‘’అన్నాడు .
రామయ్యగారు ఆజ్ఞను పాలించి ఇదివరకున్న ఇస్టిట్యూట్ ఖాళీ చేసిన చోటికి చేరుకొన్నారు .రామయ్యగారు తన కుటుంబాన్ని ఓల్గా తీరం లోని భార్య కాత్యా దగ్గర బంధువుల ఇంటికి పంపేశారు .మాస్కో కు రామయ్య గారు గుడ్ బై చెప్పారు .కానీ ఏడాది తిరిగొచ్చేసరికి మళ్ళీ ఇంటికి చేరుకొని పాత చోటులోనే మళ్ళీ ఏర్పడిన డిపార్ట్ మెంట్ లో చేరి పని చేయటం మొదలు పెట్టారు యుద్ధం తీవ్రం గా జరిగింది .రామయ్య గారు ఒంటరిగా ఉండిపోయారు తన భార్య ,పిల్లలు ఎక్కడున్నారో ఏమై పోయారో తెలియదు .కొన్ని నెలల తర్వాత వాళ్ళు క్షేమంగా ఉన్న వార్త మాత్రం తెలిసింది ..ఈ ఒంటరితనం తాను చేస్తున్న తీవ్ర పరిశోధనకు బాగా ఉపయోగ పడి సమయమే తెలియ కుండా పోయి గొప్ప వరమే అయింది .ఒంటరితనం మనుషుల్ని నిలువుగా అడ్డంగా కూడా వేరు చేస్తుంది .తరాల శృంఖలాను చేదిస్తుంది .భార్యా బిడ్డలు ఏమై పోయారో నన్న దిగులు తో బాటు తానూ జీవితం నడి దారిలో- క్రాస్ రోడ్స్ లో ఉన్నానన్న బాధా కలవరం కలిగించింది .తాను ఒక గుడ్ల గూబలా ఉండిపోయాను అని చెప్పుకొన్నారు రామయ్య .
ఈ ఒంటరితనం దూరం కావటం ఒక విధం గా జరిగి కొంత ఊరట కలిగించింది .’’హౌస్ మేనేజి మెంట్ ‘’వారు రామయ్య గారి పొరుగు వారైన ఒక ఇంజనీరు ,అయన భార్య ను తోడుగా ఉండే ఏర్పాటు చేశారు .యుద్ధప్రారంభం లో ఆ ఇంజనీర్ ఇంటి వద్ద బాంబు పేలిందట .అక్కడే బితుకు బితుకు మంటూ తల దాచుకొన్నారు ఇప్పటిదాకా . వారికి మళ్ళీ ఫ్లాట్ ఇచ్చేదాకా రామయ్య గారింట్లో నే ఉండే ఏర్పాటు చేశారు .కాసేపైనా మాట్లాడుకోవటానికి మనుషులు దొరికారని రామయ్య సంతోషించారు .వంట గది ఉపయోగం లోకి వచ్చినదుకు ఆనందమూ పొందారు . ఆ రోజుల్లో తినటానికి పెద్దగా ఏమీ ఉండేదికాదు ఉడికిన బంగాళా దుంప లే ఆహారం .తనదేమో ఏనుగు లాంటి భారీశరీరం .దానికి చిరు ఆహారాలేమీ ఆనటం లేదు .దీనికి తోడూ ఇన్ ష్టి ట్యూట్ లో పని ఎక్కువై టెన్షన్ పెరిగింది .ఈ కొద్ది ఆహారం ఏమూలకూ చాలక ఎప్పుడూ ఆకలిగా ఉండేది .అలసట నీరసం ,తల తిరుగుడు బాగా బాధించేవి .
మూడు బాంబులను తప్పించుకొని బతికిన రామయ్య
అందరిలాగే రామయ్య గారు జర్మన్ బాంబు దాడులు జరిగే రోజున సెర్చ్ లైట్లతో యుద్ధవిమానాలు ఎత్తుగా భీకర శబ్దం చేస్తూ ఎగురు తున్నాయి . విధి నిర్వహణలో బిల్డింగ్ పైభాగాన నిలబడి ఉన్నారు .గుడ్లగూబ చేసే ధ్వని లాంటిది వినబడింది .ఒక బాంబు పై నుండి పడి ప్రక్క బిల్డింగ్ దగ్గర ప్రేలింది .ఆ బాంబు ప్రేలుడు ప్రకంపనాలకు ఈ బిల్డింగ్ పై ఉన్న రామయ్యగారు కిందపడిపోయారు .దోర్లిపోయారు .తన కాళ్ళ కింద రూఫ్ గర్డర్లు పగిలి పోతూ కనిపించాయి .కాసేపటికి భయం తీరింది అని పించింది .బాంబు పేలిన పక్క ఇంటి పైభాగాన నుండి విపరీతమైన పొగ మేఘం లాగా కమ్మేసింది .కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి .కిందున్నవారు భయం తో అరుపులు కేకలు వేస్తున్నారు .ఇలా త్రుటికాలం లో మొదటి సారి బాంబు దాడి నుంచి రామయ్య తప్పించుకొని ప్రాణ భయం లేకుండా బతికారు .
రెండవ సారి సూటిగా బాంబు వచ్చి రామయ్య గారి చేతిలోనే పడింది .అదృష్టవశాత్తు అది అతి చిన్న ఇల్లు తగలబెట్టే దిమాత్రమే .ఈ సారికూడా రూఫ్ మీద డ్యూటీలోనే ఉన్నారు .ముందు జాగ్రత్తగా ఇసుక పెట్టె రెడీగా ఉంచుకొన్నారు .ఇవి’’ ఇన్సేన్డియరి’’ బా౦బు లాంటివి పడితే రక్షణకు ఉపయోగ పడతాయి .బాంబు పేలి రైలింగ్ కు తాకి సరాసరి వచ్చి రామయ్య గారి పాదాల దగ్గర పడింది .అప్రమత్తమై పట్టకారుతో దాన్ని పట్టుకొని ,అగ్ని జ్వాలలు కురిపిస్తున్న దాన్ని లాగి , సాండు బాక్స్ వైపుకు వదిలేశారు .అప్పుడు తాను ఒక కంసాలి పని చేసే వాడిలాగా అనిపించాను అనుకొన్నారు .మండే వస్తువులు ప్రాణాంతకమైనవి కాకూడదని రామయ్య గారు భావించారు .ఆయన భయపడనే లేదు .కాని ఇంకేదో ఉంది .ఆ స్పార్క్ లను తానూ సృస్టించ లేరు అనుకొన్నారు కాని ఆ వెలుగులు ఆయనలో కొత్త ఆలోచనల స్పార్క్ లను కలిగించింది .అవి తానూ చేస్తున్న పరిశోధనలకు సంబంధం ఉందనుకొన్నారు కాని తను చేస్తున్నది లూబ్రికంట్ ల పని .ఆ తర్వాత ఇంతకు ముందు వచ్చిన ఆలోచనను మర్చే పోయారు .
మూడో సారి పెద్ద భయంకర బాంబు నుండి తప్పించుకో గలిగారు .డ్యూటీకి వెడుతుండగా సైరన్లు వినిపించాయి .కాపాడుకోవటానికి దగ్గరేక్కడా షెల్టర్ కనిపించలేదు అనటం కంటే వాటిని పట్టించుకోలేదనటం సరైన మాట .యుద్ధానికి ముందు ప్రమాదాన్ని అంచనా వేయ లేక పోయాయమని రామయ్య అన్నారు .వీధిలో నడుస్తున్న రామయ్య గారికి కొన్ని అడుగుల దూరం లో భూమి మీద బాంబు పడింది .కదలకుండా అక్కడే ఉండిపోయారు .బాంబు ప్రేలుడు దాదాపు పూర్తీ అయి పోయింది .ఏదో అదృశ్య శక్తి తనను కాపాడింది అనుకొన్నారు .అవే తన చివరి క్షణాలనిపించింది .అదృష్ట వశాత్తు ఆ బాంబు పేలనే లేదు .పేలే అవకాశమూ కనపడ లేదు .కాని ఎప్పుడేది జరుగుతుందో ఎవరికి తెలుసు ?కానీ రామయ్యగారు భయ పడి పారిపోనే లేదు .బాంబు తన యెడల వీర విధేయత ప్రదర్శించిందేమో ?అక్కడ వారి దృష్టిలో తాను ఒక నల్లవాడు మాత్రమే .కాని అక్కడున్న జనం రామయ్యగారిని ప్రక్కకి లాగి అప్రమత్తం చేశారు .చుట్టూ దడికట్టి కాపాడారు .ఇలా మూడు సార్లు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకో గలిగారు .ప్రాణం పోకపోవటమే కాదు ,గాయాలు కూడా తగులకుండా బయట పడ్డారు .బాన్దేజి వేసిన డాక్టర్ ‘’రామయ్యా ! యు ఆర్ లకీ ‘’అనటం తమాషాగా ఉంది ఆయనకు .యుద్ధం లోని నైచ్యాన్ని ఏవ గి౦చు కొన్నారు .జనావాసాలపై ఈ బాంబు దాడులు ‘’mean absurdity ‘’ అని పించింది .ప్రపంచం లో సగం దూరం ప్రయాణం చేసి కొత్త దేశం లోదేశానికి కొత్త రూపు రేఖలు సంతరిస్తున్న సందర్భం లో ఈ బాంబు దాడులనుండి ‘’ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ ‘’ కాలం లో తప్పించుకోవటం అద్భుతం అని పిస్తుంది .ఆయన సాధించాల్సింది ఇంకా ఏంతో ఉందికదా .అందుకే ఆయన్ను భగవంతుడు రక్షించాడు అనుకోవాలి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-15 –ఉయ్యూరు
“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15
కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15
పల్లెటూరి పిల్లతో రామయ్య రెండో పెళ్లి
ఆ రాముడికి ఒకే బాణం ఒకే భార్య .కాని విధి వక్రించి ఈ రామయ్య కు రెండో వివాహం జరిగింది .అదీ యాదృచ్చికం గా .మొదటి అమ్మాయి అమెరికా కు చెందిన సారా .ఆమె ఈయనతో రష్యాకు రానన్నది .అక్కడే ఉండి పోయింది .రామయ్యగారి అన్ని ప్రయత్నాలు విఫలమై ఆమెను వదిలి రష్యాకు ఒంటరిగా రావాల్సి వచ్చింది .అప్పటి నుండి ఒంటరి జీవితమే గడిపారు .మళ్ళీ ఆయన జేవితం లోకి’’ కాత్యా’ అనే ఆమె ప్రవేశించి భార్య అయి సంతానం అంద జేసింది .రష్యా అంతర్యుద్ధం అనేక విధాలుగా ప్రజా జీవితాలను అస్త వ్యస్తం చేసింది .వేల కుటుంబాలకు నీడ లేకుండా పోయింది .ఆకలి తో జనం అల్లల్లాడారు .తీవ్రమైన జబ్బు పడ్డ మనిషి నెమ్మది నెమ్మదిగా కోలు కొన్నట్లుగా ఇప్పుడు రష్యా క్రమంగా కోలు కుంటోంది .రామయ్య గారు రష్యా చేరిన కొన్నేళ్ళకు విపరీతమైన కరువు కాటకాలోచ్చాయి .పంట బాగా తగ్గిపోయింది ఓల్గా తీరాన ఉన్న ‘’పావోల్జీ ‘’ప్రాంతం మరీ దెబ్బ తిన్నది .వేలాది మంది తిండి లేక చనిపోయారు .మిగిలిన వారు వారి స్వగ్రామలను వదిలి ఉపాధి, తిండి దొరికే ప్రాంతాలకు వలస పోయారు .అలాంటికరువు సమయం లో ఒక ‘’పల్లెటూరి పిల్ల’’సర్వస్వం కోల్పోయి అనాధ యై ,ఎన్నో కస్టాల కడలి దాటి నెమ్మదిగా మాస్కో నగరం చేరింది .కాయ కష్టం చేసి పొట్ట పోసుకొంటూ నగర జీవితానికి క్రమంగా అలవాటు పడింది .ఇక్కడ రామయ్యగారు తాను పూర్వం ఉయ్యూరు నుండి మద్రాస్ చేరిన సంగతి తో ఈ సంఘటనను పోల్చుకొన్నారు .తాను ఆ రోజుల్లో జ్ఞాన దాహం ,విజ్ఞాన ఆకలి తీర్చుకోవటానికి మద్రాస్ చేరారు కాని ఈ విధివంచిత కడుపు ఆకలి తీర్చుకోవటం కోసం , బతకటం కోసం మాస్కో నగరం చేరింది .ఇద్దరి విధి ఒకే తీరుగా ఉందనిపించింది .ఆమెను మొదటి సారి కలిసి నపుడు ఆమె తనను సానుభూతితో అర్ధం చేసుకొంటుంది అనిపించింది .క్రమంగాఒకరికొకరు దగ్గరయ్యారు .సారాలాగా ఈమె తనతో ఎప్పుడూ పోట్లాడి ఎరుగదు .ఆమె తనకంటే సాంఘికం గా ,విద్యా పరంగా చాలా తక్కువ స్తితిలో ఉన్నప్పటికీ ఆమె తనకు తగిన భార్య గా భావించి,పరస్పర అంగీకారం తో పెళ్లి చేసుకొన్నారు .ఇద్దరికీ మూలాల లో భేదం ఉన్నా ,’’రష్యన్ పిలుపు ‘’ఇద్దర్నీ దగ్గరకు చేర్చింది అంటారు రామయ్య .సలహా ,ప్రేమ తమను పరస్పరం కలిపాయి అన్నారు .ఆమె తనకు భార్య అయినందుకు రామయ్యగారు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు అదీ రామయ్య గారి సంస్కారం. తానేదో జీన జనోద్దరణ చేశానని డబ్బా కొట్టుకోలేదు ..ఆమె వలననే తనకు నెమ్మది నెమ్మదిగా రష్యా భాష మాట్లాడటం ఆలోచనలు , దేశం పరిస్తితుల్ని ఆకళింపు చేసుకోవటం జరిగింది అంటారు. తానూ ఎప్పుడైనా తప్పని సరి అయితే తెలుగు కాని సంస్కృతం కాని మాటలు నేర్పే వారామెకు .కనుక తాను రష్యా వచ్చిన కొన్నేళ్ళ వరకు భార్య కాత్యా పైననే ఆధార పడి ఉన్నానని నిస్సంకోచం గా తెలియ జేశారు .అన్ని రకాల అర్హతలున్న జీవిత భాగ స్వామిని లభించిందని సంతోషించారు .నిజం గా కాత్యా తనకు అర్ధాంగి .తాను రామయ్య అయితే ఆమె సీతమ్మ తల్లి .
నిజమైన ‘’సీతా’’ రామయ్య ‘’
ఆ రోజుల్లో తమ ఇల్లు ‘’హౌస్ ఆఫ్ సెవెన్ విండ్స్ ‘’లాగా ఉండేదట .ఎందరో ఇంటికి వచ్చి వెడుతూ ఉండేవారు అందులో సైంటిస్టులు ,ఇండియా నుంచి వచ్చే స్నేహితులు , తనతో పాటు పని చేసేవారు సహా విద్యార్ధులు కొమిటేర్న్ వారు ,ఇతర రిపబ్లిక్ దేశాలలో ఉన్న మిత్రులు వచ్చి ఆతిధ్యం అందుకొని వెళ్ళేవారు అందరికీ భార్య కాత్యా ఏంతో ఆదరం గా ఆత్మీయంగా వండి వడ్డించి అతిదిమర్యాదాలు చేసేది .ఆమె అందరి పాలిటి అన్నపూర్ణ అయింది .’’వండ నలయదు వేవురు వచ్చిరేని ,నడికి రే యైన –అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి ‘’అన్న పెద్దన గారి ప్రవరాఖ్యుని భార్యలాగా కాత్యా ప్రవర్తించి అందరిని ఆదరించింది . అందరితో చక్కగా మాట్లాడే గొప్ప సావకాశం కల్పించింది .ఆమెలో ఏంతో శక్తి నిండి నిబిడీకృతం గా ఉండేది . యెంత శ్రమ పడుతున్నా ఆమె ముఖం లో చిరునవ్వు చేరిగేదికాడు. అలసట కనిపించేదికాదు . రామయ్య గారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు .ఆమె పవిత్రమైన నవ్వుకు అందరూ జేజేలు పలికేవారు .అదృష్ట వంతులు రామయ్య. సరైన సమయం లో సరైన అర్ధాని లభించి ఆయనకు పూర్తిగా బాసట గా నిలిచింది .ఇప్పుడు నిజంగా ‘’సీతా ‘’రామయ్య ‘’అయ్యారు .
రామయ్య గారి రెండవ ప్రపంచ యుద్ధ జ్ఞాపకాలు
రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన రోజు ను గుర్తుకు తెచ్చు కొంటూ రామయ్యగారు ‘’ఆ రోజు మా కుటుంబం అంతా ‘’ఆల్ యూనియన్ అగ్రికల్చరల్ ఎక్సి బిషన్ ‘’ను చూస్తున్నాం .చాలా ప్రశాంతమైన రోజు అది .మా అమ్మాయి లీలావతి పూల తోటల మధ్య హాయిగా పరి రిగెత్తుతూ ఆడుకొంటోంది .ఆ ఆనందం శాశ్వతం అనుకొన్నాను .ఇలా ఆనందంగా చాలా ఏళ్ళుగా ఉన్నాం కూడా .అప్పుడే లౌడ్ స్పీకర్ల నుండి యేవో సూచనలు హెచ్చరికలు వినిపించాయి . మేము ఎమైనామో నని మా దగ్గరికిపిల్ల కంగారుగా పరిగెత్తుకొచ్చింది .’’ఇప్పడు ఏమౌతుంది ?’’ అని నా భార్య కాత్యా అడిగింది . మిగిలిన వారికి ఏమి అవుతుందో మనకీ అదే అవుతుంది కాత్యా ! అన్నారు రామయ్య .అక్కడున్న మిగిలిన అందరిభార్యలు భర్తలను అదే ప్రశ్న వేస్తున్నారు .కాత్యాకు అర్ధమై పోయింది విషయం .నా దగ్గర ఏడవ కుండా గుడ్ల నీరు కుక్కుకోన్నది .నేను ‘’వాన్ కొమాట్ ‘’వెళ్లి పోయాను వాళ్ళను అక్కడ వదిలేసి .ఇప్పుడు నా కర్తవ్యమ్ మా ఇంటినే కాదు నా భార్యా కూతుర్ని మాత్రమె కాదు నా దేశాన్ని రక్షించాలి .అదే ఇప్పుడు గౌరవం స్వేచ్చ .నాభారత దేశం పై నా ,ప్రపంచం పై నా ఆశ ‘’అని అంటారు .
ఎప్పుడో వస్తుందనుకొన్న యుద్ధం అనుకోకుండా ఒక్కసారి వచ్చి మీద పడింది .ప్రతిసారీ ఆయన ఆలోచనలు మూలాలలోకి వెడతాయి .హిట్లర్ దళాలు తన దేశం పై ఎందుకు దాడి చేస్తున్నట్లు ?అదీ రాత్రి పూట మరీ ?ప్రజలందరూ హాయిగా నిద్రలోకి జారుకున్న సమయం లో ఈ భయంకర యుద్ధ ప్రళయం ఏమిటి ?ఈ సమయమే వాళ్లకు చాలా అనుకూల సమయం అని ఎంచుకోన్నారా?ఈ అర్ధ రాత్రి వేళ జనమే కాదు సైన్యమూ ప్రమత్తతతో నిద్రపోతూ ఉంటుంది .కొద్దిమంది జర్మన్లకోసం ఇంత మందిని హిట్లర్ నరమేధం చేయాలా ?హిట్లర్ తన ప్రజల మీద ఆ మధ్య అంత ప్రేమ ఒలక బోస్తూ మాట్లాడాడు .ఇంతలో ఇంత మార్పా ?హిట్లర్ భయపడ్డాడా ?యూరప్ ను జయించినంత సులభం కాదు రష్యాతో పోరాటం .హిట్లర్ కు సోవియట్ రష్యా అంటే భయం ,ఒణుకు కూడా .అక్కడ తన పప్పులు ఉడకవు.ఇప్పుడిప్పుడే కోలుకొని ఎదుగుతున్న రష్యా పై ఇంత కసీ ,కక్షానా ?ఈ యుద్ధం లో హిట్లర్ విజయమన్నా సాధించాలిలేక పోతే చచ్చి అయినా పోవాలి. రెండే అతని ముందున్న మార్గాలు .రష్యాతో యుద్ధం మొదలు పెట్టిన రోజు నుండి ప్రతి రోజు సైన్యం వెంటే ఉండి నడిపిస్తున్నాడు .రష్యా సర్వస్వాన్ని ఒడ్డి ఎదిరిస్తోంది నిలవరిస్తోంది హిట్లర్ పురోగమనాన్ని .
అకడేమీషియన్ అయిన వేర్నాన్దిస్కి మాటల ప్రకారం జెర్మని ఫాసిసిజం చారిత్రాత్మకం గా పతనమైనట్లే .మానవ ప్రాధమిక పరిణామానికి వ్యతిరేకం గా హిట్లర్ ప్రవర్తిస్తున్నాడు .అందుకే వాళ్ళు తప్పక ఓడిపోవాలి .రామయ్యగారికీ అదే నిజమని పించింది .అయితే విజయ సాధనకు ఎంత మూల్యం చేల్లి౦చాలొ ?ఫాసిస్ట్ లకు ,రక్షణ లేని ఇండియా రష్యాను సమర్ధించటం మధ్య ఒక అడ్డంకిఉన్నట్లు అని పించింది .ఇలా చేస్తే తన బంగారు తల్లి భారత దేశాన్ని పతనం నుండి చావు నుండి కాపాడిన వాడినవుతాను అని భావించారు రామయ్య .
సర్వ శ్రేష్టమైన రష్యన్ టాంక్
ట్రాక్టర్ కు యుద్ధ టాంక్ కు చాలా భేదం ఉంది .వాటికి పని చేసే మోటార్ ల పని భిన్నంగా ఉంటుంది .ఆ రోజుల్లో అన్ని వాతావరణ పరిస్తితులలో యా మోటారర్ల లోని ఇంధనం అనుకూలం గా పని చేసేట్లు చేయటమే లక్ష్యం గా ఉండేది . భారీ యంత్రాలు చాలా సమర్ధంగా ఎక్కువ కాలం మన్నాలి .ఎక్కువ వేగంగా పని చేయాలి .టాంక్ అంటే ఆయుధాలున్న ట్రాక్టర్ కాదు అనిపించింది రామయ్యగారికి .చాలా చిక్కు సమస్యలు ఇందులో ఉన్నాయి వీటిని అత్యవసరంగా పరిష్కరించాలి ముందు .అందుకే కొత్త తరహా కిరోసిన్ ను కనిపెట్టి వాడారు అది బ్రహ్మాండమైన, అపూర్వమైన విజయాలనిచ్చింది .దీనితో రష్యా టాంకులు శత్రు జర్మనీ టాంకుల కంటే సర్వ సమర్ధంగా పని చేసి సామర్ధ్యాన్ని నిరూపించాయి .ఈ విజయం రామయ్య గారి టీం సాధించిన ఘన విజయమే .సర్వ శ్రేష్టమైన రష్యన్ టాంక్ ఆవిర్భావం రామయ్య గారి బృందం వలన ఏర్పడి అద్భుత యుద్ధ విజయాలను చేకూర్చి పెట్టాయి..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-15 –ఉయ్యూరు
“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14
’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14
శాంతి సంరక్షణలో రామయ్య
జర్మన్ ల కోరిక ప్రపంచాధిపత్యం .హిట్లర్ గురి సోవియట్ రష్యా మీదనే .జర్మనీ తుపాకులన్నీ రా ష్యాపైనే గురి పెట్టి ఉన్నాయని అర్ధమైంది .అమెరికా వదిలి వచ్చేటప్పుడు స్నేహితుడు జో చెప్పిన ‘’if not tractors ,then tanks –for the sake of defending peace ‘’ మాట చెవుల్లో రింగు మంటూనే ఉంది .ఒక సారి అశోక చక్రవర్తి గుర్తుకు వచ్చాడు కళింగ యుద్ధం గెలిచి ,ఆయుధ విసర్జన చేశాడు .లెనిన్ దేశాలమధ్య శాంతి ఉండాలన్నాడు .కాని ఇప్పుడు ఆస్ట్రియా ,జెకోస్లోవేకియా ,పోలాండ్ ,స్పెయిన్ లు యుద్ధ జ్వాలల పొగలతో నిండిపోయి ఉన్నాయి .మందు గుండు సామగ్రి పొగలే అవి .ఆ వాసన రష్యా సరిహద్దుల దాకా వచ్చేసింది .ఇలాంటి పరిస్తితులోస్తే అశోకుడు మళ్ళీ కత్తి పట్టేవాడు అనుకొన్నారు రామయ్య ఇలాంటి ఆలోచనలు మనసులో సుళ్ళు తిరిగి తిరిగి అకస్మాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు .తన శక్తి యుక్తులు సామర్ధ్యం అన్నీ రష్యా దేశ రక్షణ ను బలోపేతం చేయటానికే ఉపయోగించాలని నిర్ణయించుకొన్నారు .ఆ రోజుల్లో ఒక రోజు ఒక గంట లాగా గడిచిపోయింది రామయ్యగారికి ఆయన బృందానికి .
జర్మనీలో ఫాసిజం పతనం -రిపబ్లిక్ అవతరణ
గేర్నికా తర్వాత కొప్పెన్ చార్జి హాండ్ ఓవర్ చేయటానికి వచ్చాడు .ఆతను లేకుండా ఎలా పని చేయాలో అర్ధం కాలేదు .వెళ్ళ వద్దని చెప్పారు రామయ్య .అతను వినలేదు .రక్షణ లేని తన ప్రజలను ఆ ద్రోహులు విచక్షణా రహితం గా చంపేస్తుంటే ఇక్కడ ఉండలేనన్నాడు .అన్నిటికంటే ఆత్మ గౌరవం ముఖ్యం అన్నాడు .తానూ నిజాయితీగల మనిషిని అని రుజువు చేసుకోవాలన్నాడు .కోపెన్ తన రిపబ్లిక్ ను రక్షించుకోవటానికి క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు .యుద్ధం లో అతనికేమైందో తెలియదు .యుద్ధం అయిపోయిన తర్వాత అతను క్షేమంగా ఉన్నాడని తెలిసి సంతోష పడ్డారు .గాయాలైనా బతికి బయట పడ్డాడు .రిపబ్లిక్ పతనం అయిన తర్వాత పైరెంసేస్ నుండి ఫ్రాన్స్ కు వెళ్ళాడు .పోలీసుల కోరలనుండి తప్పించుకో గలిగాడు .అదృష్ట వశాత్తు కోపెన్ ను నాజీలకు అప్పగించటం జరగ లేదు .దేశభక్తి యుద్ధం లో కోపెన్ సోవియట్ యూనియన్ తరఫున పోరాడాడు .ఫాసిజం పతనం అయిన తర్వాతనే జర్మనీలో కాలు పెట్టాడు .జర్మనీ డెమోక్రాటిక్ రిపబ్లిక్ లో ప్రముఖ సైంటిస్ట్ లలో రాజకీయ వేత్తలలో ప్రముఖుడైనాడు కోపెన్ .ఒక సారి ‘’కాంగ్రెస్ ఆఫ్ దిడిఫెన్స్ ఆఫ్ పీస్ ‘’లో కోపెన్ కనిపించాడు .రామయ్యగారికి ఆనందంగా షేక్ హాండ్ ఇచ్చి ‘’ఇదీ నా జర్మనీ ‘’అని పొంగిపోతూ చెప్పాడు గర్వంగా .అప్పుడు రామయ్యగారికి’’ సంతోషపు అదృష్టం ప్రజల సుఖం కోసం పోరాడి నప్పుడే లభిస్తుంది’’అని తెలిసింది .
నిజమైన కామ్రేడ్
రామయ్యగారు తానూ రష్యన్ నిర్మాణపు పనివాడుగా ఉండేవాడినని పోల్చుకొన్నారు .తాను జియాలజిస్ట్ అయి ఉంటె గొప్ప నిర్మాణాలు చేసి ఉండేవాడిని అనుకొన్నారు .అయినా తాను కార్మికుల సమీపం లో ఉండే పని చేశారు .రామయ్య గారిలో ఉన్న పని నైపుణ్యాన్ని చూసి వాళ్ళు మహదానందం పొందేవారు .మిగిలిన వారిలాగా రామయ్య గారు ఉ౦డేవారు కాదు .’’నా శరీరం రంగు ను బట్టి కాదు .వారిని అర్ధం చేసుకోవటం లో నేను ముందుండే వాడిని ‘’ఆని చెప్పుకొన్నారు మాటల కామ్రేడ్ కాదు చేతల కామ్రేడ్ రామయ్య .అధికారులు హోదా ఉన్నవారు పెట్టుకొనే స్పెషల్ కాప్ ను కాకుండా వర్కర్లు పెట్టుకొనే టోపీ ని పెట్టుకొనే వారు రామయ్య .ఇదే చాలా సదుపాయం గా ఉండేది .లాబ్ లోని వారు దీనికి ఆశ్చర్య పోయేవారు .కాని తన పధ్ధతి మార్చుకోలేదు .వర్కింగ్ క్లాస్ కు అతి సన్నిహితం గా ఉండటం లో రామయ్య ఆనందాన్ని అనుభ వి౦చేవారు .
తనజీవితం లోని సంఘటనలను వారితో పంచుకోమని కోరేవారు .కాని రామయ్య ఏమీ మాటాడే వారుకాదు .చాలా సార్లు బతిమాలిన తర్వాత చెప్పారు తన గురించి వారికి .తన తండ్రి తనను తీర్చి దిద్దారని ,పని ఎలా చేయాలో బోధించారని ,తాను బొగ్గు రూమ్ లో ,బరువులు మోయటం లో పని చేశానని కనుక వర్కింగ్ క్లాస్ అంటే సహజంగా ఇష్టం అని చెప్పారు .ఈ టోపీ నే రామయ్యగారు జీవితాంతం పెట్టుకొన్నారు .అదే హాపీ ఆయనకు .రష్యా రివల్యూషన్ ప్రజలను అణచి వేతనుండి స్వేచ్చను ప్రసాదించి ,విద్య ,ఐచ్చిక సేవ లను అంద జేసింది .అంత మాత్రాన రివల్యూషన్ వారికి ఒక్క నిమిషం లో అన్నీ సమకూర్చలేదుకదా .అయితే ఒక గొప్ప మార్పు ‘’మనపని మన దేశం ,మన అకాడెమిక్ పావ్లోవ్ ,మన సోవిఎట్ మొదలైనవి మహా ఇష్టంగా ప్రజలు మాట్లాడుకొంటున్నారు. ఒకరికొకరు దగ్గరైపోతున్నారు .ఇప్పుడు రష్యా ఒక స్వయం సిద్ధ రాజ్యం గా ఎదుగు తోంది. దానికి తన సర్వ శక్తులు ఒడ్డు తున్నాను అనే గొప్ప సంతోషం రామయ్యగారికి కలిగింది .
రెండవ ప్రపంచ యుద్ధ భీభత్సం
జపాన్ అంతా అణుబాంబు దాడిలో ధ్వంసమై పోయింది .రాజధాని టోక్యో సగం బూదడిదయింది .స్నేహితుడు హషిమాటో చెప్పిన నిజాలు ఇవి .అతని ఇల్లు కుటుంబం అడ్రస్ లేరు .అయితేయేం ఇపుడు అసలైన జపాన్ ఏర్పడింది అని సంతోషించాడతను .శిధిలాలనుంచి నూతన జపాన్ ఆవిర్భ వించింది .హాషి మాటో ఆత్మహత్య చేసుకొందామనుకొన్నాడు కాని మారిపోయి రాజుకు విదేయుడైపోయాడు .అతనిది ‘’సమురాయ్ గర్వం ‘’జపాన్ ఆర్దికాభి వృద్ధిలో కనులు మిరుమిట్లు గొలిపే స్థాయిని చేరుకొన్నది .ఫీనిక్స్ పక్షి బూడిద లోంచి మళ్ళీ పుడుతుందట .అలానే జపాన్ కూడా ప్రపంచం లో నేడు అగ్రాభాగాన అన్నిటా నిల్చింది .అదీ ఆప్రజల ,పాలకుల వజ్ర సంకల్పం .కాలం అనేక మార్పులు తెస్తుంది .అందులో మనం ఒదిగి పోవాలి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-15-ఉయ్యూరు






































