గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79 -119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79

119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి

బాల్యం –విద్యాభ్యాసం

ఆరామ ద్రావిడ శాఖకు చెందిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి గారు 1876 లో గంగన్న ,సూరమ్మ దంపతులకు ఉర్లాం సంస్థానం వారి ఆశ్రమం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .బాల్యం ఉర్లాం లోనే గడిచింది .బళ్ళమూడి లక్ష్మణ శాస్త్రి గారి దగ్గర కావ్య ,నాటక అలంకార సాహిత్యాలలో ప్రజ్ఞ సాధించారు .పిమ్మట టుని సంస్థాన పండితులు ,షడ్దర్శన ప్రవీణులు మహా మహోపాధ్యాయ పరవస్తు రంగా చార్యుల వద్ద శిష్యులై వ్యాకరణ శాస్త్రం నేర్చారు .ఉర్లాం ‘’శ్రావణి’’వారి పరీక్ష రాసి  పండిత సత్కారం పొందారు .తర్వాత విజయనగర పండితులు ,తర్క వేదంత పారం ఎరిగిన కూరెళ్ళ సూర్య నారాయణ శాస్త్రి గారి  అంతేవాసియై భాష్యాంతం ,తర్కం అభ్యసించారు .భార్య చనిపోవటం తో కొంత వైరాగ్య భావన ఏర్పడింది .

సకలకళానిది

బంకుపల్లి కామ శాస్త్రి గారి వద్ద మంత్రం శాస్త్రం నేర్చుకొన్నారు .భువనేశ్వరీ మంత్రం దీక్ష గురువు గారి వద్ద తీసుకొని అనుస్టింఛి సిద్ధి సాధించారు .1897 లో శ్రీకాకుళం ఉన్నత పాఠశాల లో తెలుగు పండితులుగా ఉద్యోగించారు . విద్య నేర్పటం కన్నా విద్య నేర్వటం పైన శాస్త్రి గారికి ఆసక్తి మెండుగా ఉండేది .భల్ల మూడి దక్షిణా మూర్తి శాస్త్రి గారి దగ్గర పంచ దశ ప్రకరణం  ,గీతాభ్యాసం పూర్తీ చేశారు .తర్వాత శ్రీ కూర్మం వెళ్లి నౌడూరి వెంకట శాస్త్రి గారి నుండి మనోరమ ,పరిభాషేందుశేఖరం ,మొదలైన శాస్త్ర గ్రందాధ్యయనం చేశారు .భాష్యాంతము ,వ్యాకరణం బోధించే సామర్ధ్యాన్ని పెంపొందిం చుకొన్నారు .

పర్లాకిమిడి ఉన్నత పాఠశాల లో ఆంద్ర పండితులుగా రెండేళ్ళు పని చేసి ,రాజావారి అనుగ్రహ పాత్రులై పర్లాకిమిడి సంస్థాన పండితులుగా తర్వాత సంస్కృత ఉపన్యాసకులుగా నియమింప బడి గౌరవం పొందారు .ఇంతటితో సంతృప్తి చెందితే వారు బంకుమల్లి వారు అనిపించుకోరు .చదువుపై మంచి’’ మంకు పట్టు ‘’ఉండేది బంకుపల్లి వారికి .ఆస్థాన దైవజ్ఞులు నీల మణిపాణిగ్రాహి గారి వద్ద జ్యోతిష శాస్త్రం అభ్యసించారు .సూర్య సిద్దాంతం అను సరించి దృక్ సిద్ధాంత పంచాంగం గణించే నేర్పు సాధించి పంచాంగ రచన చేశారు .దీనితోనూ ఆగలేదు .గంటి సూర్య నారాయణ గారి దగ్గర వేదాంత ,మీమాంసా శాస్త్రాలు చదువుకొన్నారు .ఇంతటితోనూ ఆగలేదు .గిడుగు రామ మూర్తి గారి వద్ద ఆంగ్ల భాషాజ్ఞానమూ పొందారు .అయినా వీరి విజ్ఞాన తృష్ణ తీరలేదు .పోకల సింహాచలం గారి వద్ద సంగీతం నేర్చుకొన్నారు .శాస్త్రి గారి లయజ్ఞానం ఆది భట్ల నారాయణ దాసు గారినే ఆశ్చర్య పరచింది .

నిత్య నేర్వరి

నేర్వటం అనేది శాస్త్రి గారికి ఒక సద్గుణ వ్యసనం అయింది .భారత రామాయణాలను ,వసు చరిత్రాది ప్రబంధాలను ‘’పురాణ హరి కధ ‘’పేరు తో  నృత్యం ,గీతం ,తాళ,లయ బద్ధం గా పాడి ఆంద్ర దేశం లో పల్లె పట్టణం అనే తేడా లేకుండా తిరిగి పాడి ప్రదర్శించి పండిత పామర రంజనం చేశారు .పర్లాకిమిడి రాజా వారు స్థాపించిన ‘’నాటక సంఘం ‘’సభ్యులై సంస్కృతాంధ్ర నాటకాలలో పాత్ర ధారులై రసజ్ఞుల మన్ననలు అందుకొని నటనలోను తన కళా విశ్వ రూపాన్ని ప్రదర్శించారు .శాస్త్రి గారు సకల కళా వల్లభులని పించుకొన్నారు .ఇంతటి ఉపజ్న ఇన్ని విషయాలలో ప్రదర్శించిన వారు దాదాపు లేనే లేరని ఘంటా పధం గా చెప్ప వచ్చు .

ఆచరణ సంస్కర్త

సనాతన ధర్మాను రక్తులైన శాస్త్రి గారు గొప్ప సంస్కార వంతులు .ధర్మ శాస్త్రాన్ని మదించిన వీరు రజస్వలానంతర వివాహం ,హరిజనోద్యమం ,విధవా పునర్వివాహం శాస్త్ర  సమ్మతాలే నని పండిత సభలలో వాదోపవాదాలు చేసి దక్షిణ దేశమంతా ప్రచారం చేసి ఆధునిక భావాలకు అండగా నిలిచారు .పండితులతో చర్చించారు .వారిని మెప్పించారు ,ఒప్పించారు .వివాహ తత్త్వం ,అస్పృశ్యత అనే గ్రంధాలు తెలుగులో రచించి జనసామాన్యానికి ధర్మ రహస్యాలు తెలియ జేశారు .శాస్త్రి గారు అనర్గళం గా అసాదారణంగా యుక్తి యుక్తం గా చాతుర్యం గా సంస్కృతాంధ్రాలలో సంభాషించే మహా వక్త కూడా .    శాస్త్రి గారు మాటల మనిషి మాత్రమె కాదు చేతల మనిషి కూడా. అదే వారి విశిష్ట వ్యక్తిత్వం .స్త్రీ  పునర్వివాహం మొదలైన ఆదర్శాలను ప్రచారం చేయటమే కాదు తన కుమార్తెకు కూతురికి సంస్కరణ వివాహాలు జరిపించిన గొప్ప సంస్కార వంతులు .’’అధీతి బోదా చరణ ప్రచారం’’ తో జీవితాన్ని సార్ధకం చేసుకొన్న పుణ్య మూర్తి శాస్త్రి గారు .పండిత దిగ్గజం అని ప్రశంసింప బడ్డారు .

గ్రంధ రచన

కావూరి వినయాశ్రమం వారి ప్రేరణ తో విద్యారన్యుల భాష్యానికి అనుగుణం గా నాలుగు వేదాలను ఆంధ్రీకరించిన  అసాధ్య రచయిత.వీటిలో ఋగ్వేదాన్ని ఆశ్రమం వారి ముద్రించారు .వీరివి అముద్రిత గ్రందాలెన్నో ఉండిపోయాయి .వీటిలో అరవిందుని పురుషోత్తమ తత్త్వం ,ఆధారంగా భగవద్గీత పై రాసిన ‘’గీతా రహస్యం ‘’,అనేగ్రంధం ,సాహిత్య దర్పణానికి ఆంధ్రాను వాదం ఉండటం ఆంధ్రులు చేసుకొన్నా దురద్రుస్టమేమో ?.శాస్త్రిగారు ఎన్నో యక్షగానాలు రాశారు .వాటిలో పర్లాకిమిడి రాజ వారికి అంకితమిచ్చిన –చైతన్య చరిత్ర ,ముద్దాడ వెంకటప్పల నాయనకు అంకితం చేసిన రుక్మిణీ కళ్యాణం ముద్రణా భాగ్యానికి నోచుకోవటం మన  అదృష్టం .కంస వధ ,కృష్ణ జననం ,రామ కృష్ణ పరమ హంస చరిత్ర మొదలైనవి అచ్చు అవ్వాల్సినవి .

సంస్కృత హరికధలు

సంస్కృతం లో సీతా కల్యాణం ,జానకీ వహ్ని ప్రవేశం అనే హరికధలు రాసి ,చెప్పి ‘’చీకటి సంస్థానాదిపతులచే’’ ‘’పురాణ వాచస్పతి’’ బిరుదు పొంది భూరి బహుమతు లందు కొన్న పౌరాణిక విద్వాంస కవి శాస్త్రి గారు .భార్యా సమేతం గా కాశీ యాత్ర సంపూర్తి చేసి తిరిగి వస్తూ ఈ విద్వాన్మణి బంకుపల్లి మల్లన్న శాస్త్రి గారు ఖర్గ పూర్ లో అకస్మాత్తుగా డెబ్భై వ ఏట మరణించి తీరని లోటును సంస్కృతాంధ్ర సాహిత్యానికి కలిగించారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78 – 118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78

118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు  –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్

జననం విద్యాభ్యాసం

 

వెంకట రమణ అనే పేరు తో 1884 లో జన్మించిన భారతీ కృష్ణ స్వామీజీ  తండ్రి  నరసింహ శాస్త్రి మద్రాస్ రాష్ట్రం లోని తిన్నె వెళ్లి లో తహసీల్దార్ గా పంచేశారు .పదోన్నతి పొంది డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయ్యారు .తిన్నె వల్లి  తిరుచిరాపల్లి లోనే వెంకట రమణ కాలేజీ విద్యా భ్యాసం పూర్తీ చేశారు .1899 లో మద్రాస్ యూని వర్సిటీ నుండి మెట్రిక్ పరీక్ష సర్వ ప్రధములు గా  పాసైనారు .వీరి సంస్కృతా పరిజ్ఞానాన్ని వక్తృత్వ పాటవాన్ని  గుర్తించిన మద్రాస్ సంస్కృత సంస్థ ‘’సరస్వతి ‘’బిరుదును అందించి గౌరవించి సత్కరించింది .

వెంకట రమణ శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారి వద్ద సంస్కృతం అధ్యయనం చేశారు .తర్వాత బి ఏ .సర్వ ప్రధములుగా పాసై ,బొంబాయి లో ‘’అమెరికన్ కాలేజ్ ఆఫ్  సైన్సెస్’’నిర్వహించిన ఏం.ఏ.పరీక్ష లో  , ఉత్తీర్ణత సాధించారు .ఇరవై ఏళ్ళ వయసులో 1904 లో మరికొన్ని సబ్జెక్టులు సంస్కృతం ,తత్వ శాస్త్రం ,ఇంగ్లీష్ ,గణితం చరిత్ర లలో ఏం ఏ.పరీక్ష రాసి అన్నిటా సర్వ ప్రధములుగా ఉత్తీర్ణులయ్యారు .తత్వ శాస్త్రం ,సనాతన ధర్మం ,సామాజిక శాస్త్రం ,చరిత్ర ,రాజనీతి శాస్త్రం ,సాహిత్యం మొదలైన పలు విషయాలపై వెంకట రమణ రాసిన వ్యాసాలను చదివి అయన అవగాహనా పటిమకు అబ్బురపడి W..T.Stead పండితుడు ‘’రివ్యూ ఆఫ్ రివ్యూస్ ‘’లో 1905లో ప్రచురించాడు .

ఉద్యోగం –యోగ సాధన –

1905 లో గోపాల కృష్ణ గోఖలే మార్గ దర్శ కత్వం లో వెంకట రమణ జాతీయ విద్యా ఉద్యమం లో పాల్గొన్నారు .ఆడి నుండి ఆధ్యాత్మిక విద్య లో ఆసక్తి ఉన్న వెంకట రమణ 1908లో శృంగేరీ పీఠాదిపతి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామిని వారిని సందర్శించారు . తర్వాత రాజ మండ్రి జాతీయ కళా శాలకు మొట్ట మొదటి ప్రిన్సిపాల్ గా నియమింప బడి 1911వరకు పని చేశారు .పదవికి రాజీనామా చేసి శృంగేరీ పీఠం చేరి  జగద్గురువుల వద్ద వేదాంత విద్యనూ అభ్యసిస్తూ అరణ్య వాసం చేస్తూ ,యోగ సాధనలో ఎనిమిదేళ్ళు గడిపారు .

పీఠాదిపతిత్వం

పూనా బొంబాయి ,అలమనేరు మొదలైన చోట్ల ‘’శంకర దర్శనం ‘’పై ధారావాహిక మహోపన్యాసాలు చేశారు .1919జులై నాలుగున వారణాసి శారదా పీఠం లో జగద్గురువులు స్వామి త్రివిక్రమ తీర్ధజీ మహా రాజా గారి వద్ద సన్యాస దీక్ష గ్రహించి ‘’స్వామిశ్రీ భారతీ కృష్ణ తీర్ధ జీ మహా రాజా’’గా ప్రసిద్ధిపొందారు .1921లో  శారదా పీఠాన్ని అధిస్టిం చారు .వెంటనే భారత దేశ యాత్ర మొదలు పెట్టి సనాతన ధర్మం పై ఉపన్యాస పరంపర నిచ్చారు .1925లో గోవర్ధన పీఠాదిపతి పదవి స్వీకరించారు .

గణిత శాస్త్రం లో గణనీయ కృషి-వేద గణిత పిత

ప్రాచీన భారతీయ విజ్ఞానం లో స్వామీజీ కృషి గణ నీయమైనది .వారి గణిత శాస్త్ర సేవ చిరస్మరణీయం .వేదాలను వేదాంగాలను శాస్త్రీయ దృక్పధం తో పరి శోధించి’’ అధర్వణ వేదానికి అను బంధం ‘’ నిర్మించారు .గణిత శాస్త్రానికి సంబంధించిన 16 సూత్రాలను పునర్నిర్మించారు .ఈ సూత్రాల సహాయం తో పెద్ద పెద్ద లెక్కలను మానసికం గానే గణన చేసి జవాబులు తెలుసుకొనే వినూత్న ప్రక్రియను స్వామీజీ ఆవిష్కరించారు .అంక గణితం బీజ గణితం ,కలన గణితం (కాల్క్యులస్)అవకలన సంకలనాల లో ఎన్నో గణిత సమస్యలకు ,,5,10,15,40  వరకు సోపానాలు చేయటానికి బదులు ఒకే పంక్తి లో చేసే పద్ధతులను సోదాహరణం గా స్వామీజీ వివరించారు .

ప్రధాన సంఖ్యలన్నిటికి పాజిటివ్ నెగటివ్ ఆస్క్రు లేటర్స్(ధన ,రుణ వేస్టనం ) తో భాజనీయతా నికష అంటే డివిజబిలిటీ టెస్ట్ ను సూచిం చారు .అంటే గణిత శాస్త్రాన్నిఅత్యంత ఆకర్షణీయం గా ,ఆసక్తి దాయకం గా అతి సులభంగా తయారు చేశారన్న మాట .దీనితో గణిత శాస్త్రాన్ని ఒక కొత్త మలుపు త్రిప్పిన ఘనత కృష్ణ తీర్ధ స్వామీజీ కే దక్కింది .ఏదో పుస్తకాలు రాసి కూర్చో కుండా వీటిని విద్యార్ధులకు,ఉపాధ్యాయులకు ,ఆచార్యులకు విద్యాలయలో కాలేజీలలో విశ్వ విద్యాలయాలలో బోధింఛి చక్కని అవగాహన కల్పించి స్పూర్తినిచ్చారు .అందుకే స్వామిని ఫాదర్ ఆఫ్ వేద గణిత అంటే వేద గణిత పిత అంటారు

గ్రంధ రచన

1958 ఫిబ్రవరి లో స్వామీజీ అమెరికా ,కెనడా దేశాలు పర్య టించి ఉపన్యాసాలిచ్చారు .స్వామీజీ రాసిన భక్తీ శ్లోకాల సంఖ్య 3,000లకు పైనే ఉన్నాయి వీటిని సంకలనం చేసి ప్రచురించారు .సనాతన ధర్మం పై స్వామి కృష్ణజీ  రాసిన గ్రంధాన్ని బొంబాయ్ భారతీయ విద్యా భవన్ ప్రచురించింది .వీరి ప్రసిద్ధ గణిత గ్రంధం ఆంగ్లం లో రాసిన ‘’వేదిక్ మేధ మాటిక్స్ ‘’.దీన్ని వీరి మరణాంతరం ధిల్లీ లోని మోతీలాల్ బనార్సి దాస్ వారు  ముద్రిం చారు .అపూర్వ భారతీయ విజ్ఞాని ,గణిత మేధావి ,సనాతన సారధి -జగద్గురు శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్

డెబ్భై ఆరేళ్ళ వయసులో నిర్యాణం చెంది శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి చేరుకొన్నారు .

Inline image 1    Inline image 2  Inline image 3

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77

116-షడ్దర్శన తత్వావ గాహి –ముడుంబై నరసింహా చార్య స్వామి

1842లో పాలకొండ దగ్గర అచ్యుతాపురం లోముడుంబై నరసింహా చార్యులు జన్మించారు .తండ్రి రాఘవాచార్యులు తల్లి గంగమాంబ .చిన్నతనం లోనే తండ్రి చనిపోగా తాతగారి వద్ద కావ్యాలను దర్శన శాస్త్రాలను చదువుకొన్నారు. మరుగంటి కూర్మాచార్యుల దగ్గర ఆంధ్ర వ్యాకరణం చందోరీతులను అభ్యసించారు .తెలుగు కవిత్వం లో అసమాన ప్రతిభను చూపారు .తాతగారి మరణం తర్వాత ఇరవై ఏళ్ళ వయసులోనే తమ్మునితో కలిసి దక్షిణ దేశ యాత్ర  చేసి దివ్య క్షేత్రాలన్నిటిని దర్శించారు .ఆయా దేవస్తానాలలోని పండితులను తన కవనం పాండితీగరిమలచేత మెప్పించి సత్కరాలందు కొన్నారు .

గొట్టు ముక్కల కృష్ణం రాజు సహాయం తో విజయ నగర రాజు ఆనంద గజపతి సంస్థానం దర్శించారు .తన ఆంద్ర గీర్వాణ కవితా పాటవాన్ని రాజుగారి ముందు ప్రదర్శిం చారు . వీరి ఉభయ భాషా పాండిత్యం  అద్వితీయ కవితా వైభవం రాజుగారి మెప్పును పొందాయి ఘన సన్మానం అందుకొన్నారు .విజయనగరం లో  . నివాసం ఉన్నారు .రోజూ రాజాస్థానానికి వెళ్లి వచ్చేవారు .రాజు గారి తండ్రి విజయ రామ గజపతి సన్నిధిలోఒక రోజు ఆనంద గజపతి గారు మన కవిని సభకు పరిచయం చేశారు . ఆ రోజు  శ్రీ   కృష్ణ లీలా మహోత్సవం జరిగింది .అప్పుడు ఆచార్యుల వారు ఆశువుగా చెప్పిన పద్యానికి రాజుగారి తండ్రి విజయ రామ గజపతి   మెచ్చి ప్రతినెల భ్రుతిని ఏర్పరచి  ఆస్థా న కవిగా నియమించారు .

ఆచార్యుల వారు వేద వ్యాస మహర్షి గూర్చి నలభై రోజులు పంచాగ్ని మధ్యమం లో తపస్సు చేశారు .వ్యాస మహర్షి సాక్షాత్కరించి ఆర్ష ప్రతిభను ప్రదానం చేశాడు .అప్పటినుండి నరసింహాచార్య స్వామి అయ్యారు ..ప్రభువుకు స్వామి గారిపై అమిత గౌరవ ఆదరాలుం దేవి

వ్యాసుడు ప్రసాదించిన బుద్ధి కుశలత వలన దర్శనాలన్నిటికి విపుల విశేష వ్యాఖ్యానాలు రచిం చారు .దీనితో వీరి అసామాన్య ప్రతిభా విశేషాలను గుర్తించిన ప్రభువు  సన్నిధి లోని విద్వత్ పరి షత్తు కు అగ్రాసనాదిపతిని చేశారు .1873లో ప్రభువు ఆనంద గజ పతి రాజు కాల ధర్మ చెందారు .ఆచార్యుల వారికి ఉత్సాహం అంతా నీరుకారిపోయింది .

సదా భగవధ్యానం లో కాలం గడిపేవారు .భగవద్ వాజ్మయ సృష్టికి ఉపక్రమించారు .అమూల్య గ్రంధాలను రాసి ప్రచురించారు .అసం ప్రజ్ఞాత యోగ ఫలం గా ఆచార్య స్వామి శేష జీవితాన్ని గడిపారు .నిత్య భగవత్ సాక్షాత్కారం పొందిన మహా యోగ శ్రేస్టూలు స్వామీజీ .వేదాంత దర్శన శాస్త్రాలను శిష్యులకు నిరంతరం బోధిం చేవారు .స్వంత ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. మూడవ కూతురు పర్య వేక్షణలో తాను రాసిన గ్రందాలన్నిటిని ముద్రించారు .సర్వ దర్శనాలకు ఆచార్య స్వామి రాసిన వ్యాఖ్యానాలు యాభై కి పైనే ఉన్నాయి .సంస్స్కృత కావ్యాలు చంపువులు ,నాటకాలు రాశారు .తెలుగులో ‘’ముగ్ధ శృంగారం ‘’,ప్రౌఢ శ్రుంగారం ‘’,’’సంకీర్ణ శ్రుంగారం ‘’కామినీ దుస్ట శ్రుంగారం ,’’అంగ శ్రుంగారం ‘’రాశారు .

నృసింహా చార్య స్వామి పదహారవ ఏట రచించిన రుక్మిణీ కృష్ణుల విప్రలంభ శృంగారాన్ని వర్ణించే ‘’రంగేశ శతకం ‘’లోని ప్రతిపద్యం అమృత రస బిందువే .మొత్తం కావ్యం అమృత  సింధువే.ఒక రస పేటికే.ఇందులోని ఒక తెలుగు పద్యానికి వీరే సంస్కృతం లో రాసిన ఒక శ్లోక వైభవం చూద్దాం –

‘’తన్వంగీ కుసుమాస్త్ర ఝాంకరణ వజ్జ్యా దూత చాతూశుగాత్ .-భీతా ‘’కిం శరణం భావే దిహ మమే ‘’త్వాలోచ్య నద్యాం జనేః

సాకం జాత మ వేత్య పద్మమ భజత్ ,తడ్బాధాతే హంత తాం –‘’జ్ఞాతిస్చేదన లేన కిం’’ వచ  ఇదం స్వార్ధాత్ కదం స్స్ఖ్రలేత్ ‘’.

తొంభై  రెండేళ్ళ నిండు జీవితాన్ని అనుభ వించి ఆచార్య శ్రీ 1924లో వ్యాస సన్నిధికే చేరుకొన్నారు .

 

117-అజాత శత్రువు- పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యులు

ఆంద్ర ఆస్థానకవి శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారి అల్లుడుగారు పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యులు .ఆ పేరుకు అన్నివిధాలా సార్ధకతను సాధించిన విద్వత్కవి వరేన్యులు .15-6-1897న  నెల్లూరు  జిల్లా కోవూరు దగ్గర సంగం లో జన్మించారు .అనేక చోట్ల విద్య నభ్యసించారు .వేదుల సూర్య నారాయణ శాస్త్రి ,నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ల వద్ద వ్యాకరణం చదివారు వేమూరి రామ బ్రహ్మం ,దెందులూరి పానకాల శాస్త్రుల దగ్గర తర్కాన్ని అభ్యసించారు .ఈ శాస్త్రాలలో గురువును మించిన శిష్యుఅలని పించుకొన్నారు.గురుకుల విద్య చాలా క్లిస్టతరంగా సాగింది .

ఆచార్యుల వారు చివరికి గుంటూరు లో స్తిరపడ్డారు .కాశీ కృష్ణా చార్యుల  వారివద్ద కావ్యాలంకార ,వేదాన్తాలను నేర్చుకొన్నారు. కాశీ వారి అల్లుడై ‘’ఆంద్ర కాదంబరి’’ కావ్యం రాసి మామ గారికి అంకిత మిచ్చి ఋణం తీర్చుకొన్నారు .1916నుండి ఇరవై ఏళ్ళు గుంటూరు టౌన్ హైస్కూల్ ,1937నుండి మరో ఇరవై ఏళ్ళు గుంటూరు హిందూ కాలేజి లోను సంస్కృత ఉపాధ్యాయ ,అధ్యాపకులుగా పని చేసి పదవీ విరమణ చేశారు .తర్వాత కే వి కే .సంస్కృత కళాశాలలో ,సంస్కృతాంధ్ర పండితులుగా సేవలందిం చారు .

భాష్యాంత వైదుష్యం తో శోభిల్లిన ఆచార్యుల వారికి ఇసుమంతైనా అసూయ కాని గర్వం కాని లేక పోవటం మహా విశేషం .జీవితం అంతా ‘’పఠన ,పాఠనాలకే ‘’అంకితం చేసిన విద్వన్మూర్తి ఆచార్యుల వారు .ఆకాలం లో కొప్పరపు కవులకు తిరుపతికవులకు కవితా స్పర్ధలు తార స్థాయిలో ఉండేవి .పూర్ణ ప్రజ్ఞా చార్యుల వారు మాత్రం ఏ ముఠాకూ చెందకుండా సమకాలీన సాహితీ లోకం లో ‘’అజాత శత్రువు ‘’గా నిలిచారు .

ఆచార్యులవారు యెంత ప్రాచీన సంప్రదాయ వాదులైనా నవీనతను కాదనలేదు .మామగారు కృష్ణా చార్యుల వారితో కలిసి అష్టావధాన శతావధానాలను జంట వదానాలుగా  నిర్వహించారు .తానూ స్వయం గా కూడా అవధానాలు చేశారు .ఎన్నో ఆశుకవితా ప్రదర్శనలిచ్చారు .’’కవి శేఖర ‘’,మహోపాధ్యాయ ‘’,విద్యాలంకార ‘’,సాహిత్య రత్న ‘’,వంటి బిరుదాలు  పొందారు .ఆచార్యుల వారు రాసిన గ్రంధాలు వందకు పైనే ఉన్నాయి .6-3-1976నశ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి డి .లిట్ .బిరుదు నందు కొన్నారు .

వంద గ్రంధాలు రాసినా ఆచార్యులవారి ముద్రిత గ్రంధాలు నలభై మాత్రమె .’’శ్రీరామ కల్యాణం ‘’అనే పద్య కావ్యం తొలి రచన .’’కైకేయీ సౌశీల్యం ‘’మరో పద్య కావ్యం .’’ఆంద్ర కాదంబరి ‘’అనువాద రచన .ద్విపద మేఘ దూతం రచించారు సంస్కృత ,ప్రతిమ,ప్రతిజ్ఞా యౌగంద రాయణం ,చారుదత్త  నాటకాలకు  తెలుగు అనువాదం చేశారు .రాఘ వేంద్ర,,జయ తీర్ధ, వాదిరాజు ,వ్యాస రాయ ,పూర్ణ బోధ విజయ ‘’కావ్యాలలో ద్వైతమత సిద్ధాంతాలను పొందుపరచారు .ఆంద్ర మహా భారతానికి విరాట పర్వం వరకు ప్రామాణికమైన లఘు టీక రాశారు .ఆచార్య శ్రీ శాస్త్ర పాండిత్యానికి గొప్ప ఉదాహరణ ‘’శత లక్షిణి ‘’.అనే విమర్శ గ్రంధం .ఈ గ్రంధమే తిరుపతి కవులకు వాద ప్రతివాదాలలో ‘’కరదీపిక ‘’గా నిలిచింది అని అంటారు .ఎనభై ఏళ్ళ సంపూర్ణ సార్ధక జీవితం గడిపి పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యుల వారు 1977లో   ‘’పూర్ణ ప్రజ్న’’లోకి చేరుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బడుగు మేధావుల వౌనమేల?

బడుగు మేధావుల వౌనమేల?

  • – టంకశాల అశోక్ (సెల్ : 9848191767)
  • 07/12/2014
TAGS:

భారతదేశంలో దళితులు, అమెరికాలో నల్లవారి అణచివేతలకు మధ్య తేడా లేదు. వారి సంక్షేమం కోసమని ఒకవైపు రెండుచోట్లా చట్టాలుంటాయి. కొన్ని చర్యలు తీసుకుంటా రు. అదే సమయంలో మరొకవైపు విస్తృతమైన రీతిలో అణచివేతలు సాగుతుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా ఆధిపత్యంగలవారు ఈ పనిచేస్తుంటే, అందుకు పరోక్షమైన, ప్రత్యక్షమైన విధాలుగా అధికార వ్యవస్థల సహకారం కూడా ఉంటుం ది. ఇది అందరికీ తెలిసిన సాధారణ సత్యం. న్యాయం గా, నిష్పాక్షికంగా ఆలోచించేవారు ఈ పరిస్థితులనూ గుర్తించి అవి రెండుచోట్ల కూడా మారాలంటారు. కాని కొందరు బడుగు మేధావుల విషయంలో అట్లా జరగటం లేదు. వారు భారతదేశంలోని చెడును మాత్రం గుర్తించి ఖండిస్తూ, అమెరికాలో నల్లవారికి అంతా స్వర్గ్ధామమేనని వాదిస్తుంటారు. అందుకే ఈ వ్యాసం రాయవలసి వస్తున్నది.
అమెరికాలో నల్లవారిని ప్రస్తుతం రెండు హత్యలు కుదిపివేస్తున్నాయి. ఫెర్గ్యూసన్ పట్టణంలో మైఖేల్ బ్రౌన్ అనే 18 సంవత్సరాల నల్లజాతి యువకుడిని ఆగస్టులో డారెన్ విల్సన్ అనే తెల్లజాతి పోలీస్ కాల్చి చంపాడు. తర్వాత ఇటీవల తామీర్ రైస్ అనే 12 సంవత్సరాల నల్లజాతి బాలుడిని క్లేవ్‌లాండ్‌లో మరొక తెల్లజాతి పోలీస్ కాల్చివేసి ప్రాణాలు తీసాడు. ఈ రెండు ఘటనలను పురస్కరించుకుని మొత్తం అమెరికాలో నల్లజాతి అంతా ఆందోళనలు సాగిస్తున్నది. కాని, నేను గమనించినంతవరకు, ఇక్కడి బడుగు మేధావులు, రచయితలు ఎవరూ దానిపై స్పందించటం లేదు. అమెరికాలో నల్లవారికి ఎటువంటి సమస్యలు లేక స్వర్గం వంటి పరిస్థితులు ఉన్నాయనే తమ వాదనలను వారిపుడు ఇంకా సమర్ధించుకోవటమో, ఖండించుకోవటమో చేయాలి. కాదంటే, ఇతరత్రా అంతా గొప్పగానే ఉందని, ఈ రెండు ఘటనలు మినహాయింపుగా జరిగిన పొరపాట్లని రుజువుచేయాలి. మైఖేల్ బ్రౌన్, తామీర్ రైస్ ఇద్దరూ నిరాయుధులే. ఫెర్గ్యూసన్‌లో సాధారణమైన సమస్య ఏదో తలెత్తగా దానిని నియంత్రించేందుకు వెళ్లిన పోలీసు అందుకు ఇతర పద్ధతులేవీ అనుసరించకుండా నేరుగా గన్‌తో కాల్పులు జరిపాడు. రైస్ అనే బాలుని విషయంలో అంతకన్నా దారుణంగా జరిగింది. అతను ఒక పార్క్ దగ్గర బొమ్మ తుపాకీకి అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటున్నాడు. శే్వతజాతీయుడొకరు పోలీసులకు ఎమర్జెన్సీ ఫోన్ చేసాడు. పోలీసులు తమ వాహనంలో వచ్చి దిగీ దిగగానే ఆ పిల్లవాడిని కాల్చారు. ఇది నిజం కాదని వాదించారు గాని, తర్వాత వెలుగులోకి వచ్చిన ఫొటోలు వారు వాహనంలోంచి దిగటానికి కాల్పులు జరపటానికి మధ్య కేవలం కొన్ని క్షణాల వ్యవధి ఉన్నట్లు తేల్చి చెప్పా యి.
నల్లవారికి స్వర్గమైన అమెరికాలో ఇదెట్లా సాధ్యమైంది? ఇది చాలదన్నట్లు మరొకటి జరిగింది. 18 ఏళ్ల బ్రౌన్‌ను కాల్చిన పోలీసును ప్రాసిక్యూట్ చేయాలన్న డిమాండ్ నల్లవారినుంచి, ఇతర ప్రజాస్వామిక వర్గాలనుంచి వచ్చింది. బ్రౌన్ నిరాయుధుడైనప్పటికీ తనపైకి దూసుకువచ్చాడని, తనవద్దగల తుపాకీని లాక్కుని తననే కాల్చగలడన్న భయం కలిగిందని, అందువల్ల తన ప్రాణరక్షణకోసం కాల్చానని పోలీసు వాదించాడు. దానితో అక్కడి గ్రాండ్ జ్యూరీవారు ఆయనను ప్రాసిక్యూట్ చేయనక్కరలేదని తీర్పు చెప్పారు. బాలుని విషయమై ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. అమెరికాలో ఇటువంటివి అరుదుగా జరిగితే పట్టించుకోనక్కరలేదు. కాని ఇవి ఒక పద్ధతి ప్రకారం, వ్యవస్థీకృత రూపంలో, తరచు జరిగినా దానిని స్వర్గసీమ అనవచ్చునా? స్వర్గసీమగా అభివర్ణించే మన మేధావులు, రచయితలు కొందరికి అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏమిటో నిజంగానే తెలియదా?
నల్లవారికి ఇటువంటి అనుభవాలు అరుదుకాదని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. ఉదాహరణకు ‘మాల్కం ఎక్స్‌గ్రాస్‌రూట్స్ మూవ్‌మెంట్’, న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ నివేదికలతోపాటు, సాక్షాత్తూ శే్వత జాతీయులే నిర్వహించే ‘యుఎస్‌ఎ టుడే’ పత్రిక రిపోర్టులను గమనిస్తే, నల్లవారి అణచివేత ఎంత ఉద్దేశపూర్వకంగా, ఎంత వ్యవస్థీకృతంగా సాగుతున్నదో గ్రహించవచ్చు.
పోలీసులు, సెక్యూరిటీ గార్డులు, విజిలేంట్స్ అని తమనుతాము పిలుచుకునే గ్రూపులవారు 2012లో ‘‘కనీసం’’ 313 మంది నల్లవారిని కాల్చి చంపారు. కాని వాస్తవ సంఖ్య ఇంతకన్న చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో శాంతి భద్రతల సంస్థలు మొత్తం పదిహేడు వేలున్నాయి. (17,000). వాటిలో సుమారు 750 మాత్రమే ఈ తరహా ఘటనల వివరాలను డేటాబేస్‌కు అందజేస్తాయి. దానినిబట్టి వాస్తవమైన సంఖ్యలు వేలల్లో ఉంటాయనాలి. అమెరికా జనాభాలో నల్లవారి సంఖ్య సుమారు 13 శాతం. అటువంటి స్థితిలో కేవలం వారిని కాల్చి చంపటమే వేల సంఖ్యల్లో ఉంటే అదెంత గొప్ప స్వర్గమో మన మేధావులు మాత్రమే వివరించగలరు.
పోలీస్ సంస్థలు, ఇతర భద్రతా సంస్థలు ఈ స్థాయిలో కాల్పులకు పాల్పడుతున్నాయంటే, దాని వెనుక అణచివేతలు ఎంత తీవ్రంగా, ఎంత విస్తృతంగా ఉంటాయో ఊహించటం కూడా కష్టమే. నల్లవారి జనాభా 13శాతం కాగా, ఖైదీలలో వారు సుమారు 40 శాతం ఉంటారు. ఒకే విధమైన నేరాలకు నల్లవారిని, తెల్లవారిని అరెస్టుచేయటం నుంచి మొదలుకొని జైళ్లలోకి పంపడం వరకు అడుగడుగునా వివక్షతే. తెల్లవారికి కనీస శిక్షలైతే నల్లవారికి గరిష్ఠ శిక్షలని పై సంస్థలు రూపొందించినట్టు నివేదికలు చెప్తున్నాయి. న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అధ్యయనం ప్రకారం, అరెస్టయే నల్లవారిలో సుమారు 90 శాతం మంది అమాయకులు. కాల్పులకు గురై చనిపోయిన వ్యక్తులలో 44 శాతం మంది నిరాయుధులు. 27 శాతం సాయుధులైనట్లు పోలీసులు ఆరోపించి అందుకు ఆధారాలు చూపలేకపోయారు. దానిని కలిపితే నిరాయుధుల సంఖ్య 71 శాతం. అయినప్పటికీ పోలీసులు తమవద్ద ఆయుధాలు ఉండి కూడా, తాము ‘‘ప్రాణభయంతో’’ కాల్చామని వాదించారు. అట్లా వాదించినవారు 47 శాతం ఉన్నట్టు పైన పేర్కొన్న నివేదికలు వెల్లడించాయి. యుఎస్‌ఎ టుడే పత్రిక కథనం ప్రకారం, పోలీసులు కాల్చి చంపుతున్న నల్లవారిలో 18 శాతం మంది 21 సంవత్సరాల లోపు వయసువారు. ఇందుకు భిన్నంగా తెల్లవారి సంఖ్య 8.7 శాతం.
ఈ విధమైన నిర్బంధాలు, జైళ్లు, కాల్చివేతలకు మూలాలు నల్లవారిని బానిసలుగా మార్చి ఉపయోగించుకున్న అమెరికన్ పెట్టుబడిదారీ చరిత్రలో ఉన్నాయని, బానిసత్వం రద్దయిన అనంతరం ఏడు దశాబ్దాల కాలంలోనూ వారి పట్ల వివక్షలు ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో కొనసాగుతూనే ఉన్నాయని పై నివేదికలు చెప్తున్నాయి. నల్లవారిలో హింసా ధోరణులు ఎక్కువని, వారు ప్రమాదకారులని అసలు పోలీస్ రిక్రూట్‌మెంట్, శిక్షణ, విధానాల రూపకల్పన సమయాలలోనే తెల్లవారికి అభిప్రాయం కలిగింపజేస్తారు. ఇక సమాజంలో జాతి వివక్షాధోరణులు ఉండనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యం వల్లనే తెల్ల పోలీసులు నిర్భయమైన రీతిలో అతిగా వ్యవహరించి తామీ రైస్ వంటి పిల్లలను కూడా కాల్చి చంపుతున్నారు. అక్కడి నిపుణులు దీనిని నల్లవారికి, తెల్లవారికి మధ్య ‘‘నిరంతర యుద్ధం’’, ‘‘ప్రచ్ఛన్న యుద్ధం’’ వంటిదని అభివర్ణిస్తున్నారు.
దీనంతటి మధ్య నల్లవారికి అమెరికన్ స్వర్గం ఎక్కడున్నదనేది ప్రశ్న. నల్లవారు సాగించిన అనేకానేక ఉద్యమాలు, పోరాటాల అనంతరం బానిస వ్యవస్థ రద్దుకావటంతోపాటు వారికోసం అక్కడి ప్రభుత్వాలు వివిధ అవకాశాలు కల్పించాయి. అది జరగనట్లయితే అసంతృప్తి ఇంకా తీవ్రమై ఆ వ్యవస్థకు విపత్కరమైన పరిస్థితులు ఎదురై ఉండేవి. నల్లవాడైన ఒబామా దేశాధ్యక్షుడైనంత మాత్రాన వారికి మారింది ఏమీ కన్పించదు. మరి దీనంతటి మధ్య, మన బడుగు మేధావులు కొందరంటున్న అమెరికన్ స్వర్గమెక్కడ? ఈ తాజా ఘటనలు రెండు అక్కడి నల్లవారిని ఊపివేస్తున్న సందర్భంలో వారిందుకు వివరణ ఇవ్వాలి.
అసలు విషయమంటే ఈ తరహా మేధావులకు ఆర్థిక సంస్కరణలు, అమెరికా మెరుపులు కలిసి కళ్లు మిరుమిట్లు గొలిపించాయి. తమ వ్యక్తిగత కెరీరిజానికి అందులో అవకాశాలు కన్పించాయి. దానితో వాస్తవాలను, విచక్షణను బుద్ధిపూర్వకంగా విస్మరించారు. ఇండియాలో గాని, అమెరికాలోగాని ఈ వర్గాలకోసం జరుగుతున్నదేమిటి, వారి పట్ల గల అణచివేత ఏమిటి అన్న ప్రశ్నలను నిక్కచ్చిగా చూసి బేరీజువేయటానికి బదులు సమతులనాన్ని, సంయమనాన్ని కూడా కోల్పోయారు. అందుకే ఇండియా సంపూర్ణ నరకం వలె, అమెరికా సంపూర్ణ స్వర్గం వలె కనిపిస్తున్నాయి. రెండూ తప్పేనని, వాస్తవం ఆమధ్య ఎక్కడో ఉంటుందని మరిచిపోయారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బడుగు మేధావుల వౌనమేల?

బడుగు మేధావుల వౌనమేల?

  • – టంకశాల అశోక్ (సెల్ : 9848191767)
  • 07/12/2014
TAGS:

భారతదేశంలో దళితులు, అమెరికాలో నల్లవారి అణచివేతలకు మధ్య తేడా లేదు. వారి సంక్షేమం కోసమని ఒకవైపు రెండుచోట్లా చట్టాలుంటాయి. కొన్ని చర్యలు తీసుకుంటా రు. అదే సమయంలో మరొకవైపు విస్తృతమైన రీతిలో అణచివేతలు సాగుతుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా ఆధిపత్యంగలవారు ఈ పనిచేస్తుంటే, అందుకు పరోక్షమైన, ప్రత్యక్షమైన విధాలుగా అధికార వ్యవస్థల సహకారం కూడా ఉంటుం ది. ఇది అందరికీ తెలిసిన సాధారణ సత్యం. న్యాయం గా, నిష్పాక్షికంగా ఆలోచించేవారు ఈ పరిస్థితులనూ గుర్తించి అవి రెండుచోట్ల కూడా మారాలంటారు. కాని కొందరు బడుగు మేధావుల విషయంలో అట్లా జరగటం లేదు. వారు భారతదేశంలోని చెడును మాత్రం గుర్తించి ఖండిస్తూ, అమెరికాలో నల్లవారికి అంతా స్వర్గ్ధామమేనని వాదిస్తుంటారు. అందుకే ఈ వ్యాసం రాయవలసి వస్తున్నది.
అమెరికాలో నల్లవారిని ప్రస్తుతం రెండు హత్యలు కుదిపివేస్తున్నాయి. ఫెర్గ్యూసన్ పట్టణంలో మైఖేల్ బ్రౌన్ అనే 18 సంవత్సరాల నల్లజాతి యువకుడిని ఆగస్టులో డారెన్ విల్సన్ అనే తెల్లజాతి పోలీస్ కాల్చి చంపాడు. తర్వాత ఇటీవల తామీర్ రైస్ అనే 12 సంవత్సరాల నల్లజాతి బాలుడిని క్లేవ్‌లాండ్‌లో మరొక తెల్లజాతి పోలీస్ కాల్చివేసి ప్రాణాలు తీసాడు. ఈ రెండు ఘటనలను పురస్కరించుకుని మొత్తం అమెరికాలో నల్లజాతి అంతా ఆందోళనలు సాగిస్తున్నది. కాని, నేను గమనించినంతవరకు, ఇక్కడి బడుగు మేధావులు, రచయితలు ఎవరూ దానిపై స్పందించటం లేదు. అమెరికాలో నల్లవారికి ఎటువంటి సమస్యలు లేక స్వర్గం వంటి పరిస్థితులు ఉన్నాయనే తమ వాదనలను వారిపుడు ఇంకా సమర్ధించుకోవటమో, ఖండించుకోవటమో చేయాలి. కాదంటే, ఇతరత్రా అంతా గొప్పగానే ఉందని, ఈ రెండు ఘటనలు మినహాయింపుగా జరిగిన పొరపాట్లని రుజువుచేయాలి. మైఖేల్ బ్రౌన్, తామీర్ రైస్ ఇద్దరూ నిరాయుధులే. ఫెర్గ్యూసన్‌లో సాధారణమైన సమస్య ఏదో తలెత్తగా దానిని నియంత్రించేందుకు వెళ్లిన పోలీసు అందుకు ఇతర పద్ధతులేవీ అనుసరించకుండా నేరుగా గన్‌తో కాల్పులు జరిపాడు. రైస్ అనే బాలుని విషయంలో అంతకన్నా దారుణంగా జరిగింది. అతను ఒక పార్క్ దగ్గర బొమ్మ తుపాకీకి అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటున్నాడు. శే్వతజాతీయుడొకరు పోలీసులకు ఎమర్జెన్సీ ఫోన్ చేసాడు. పోలీసులు తమ వాహనంలో వచ్చి దిగీ దిగగానే ఆ పిల్లవాడిని కాల్చారు. ఇది నిజం కాదని వాదించారు గాని, తర్వాత వెలుగులోకి వచ్చిన ఫొటోలు వారు వాహనంలోంచి దిగటానికి కాల్పులు జరపటానికి మధ్య కేవలం కొన్ని క్షణాల వ్యవధి ఉన్నట్లు తేల్చి చెప్పా యి.
నల్లవారికి స్వర్గమైన అమెరికాలో ఇదెట్లా సాధ్యమైంది? ఇది చాలదన్నట్లు మరొకటి జరిగింది. 18 ఏళ్ల బ్రౌన్‌ను కాల్చిన పోలీసును ప్రాసిక్యూట్ చేయాలన్న డిమాండ్ నల్లవారినుంచి, ఇతర ప్రజాస్వామిక వర్గాలనుంచి వచ్చింది. బ్రౌన్ నిరాయుధుడైనప్పటికీ తనపైకి దూసుకువచ్చాడని, తనవద్దగల తుపాకీని లాక్కుని తననే కాల్చగలడన్న భయం కలిగిందని, అందువల్ల తన ప్రాణరక్షణకోసం కాల్చానని పోలీసు వాదించాడు. దానితో అక్కడి గ్రాండ్ జ్యూరీవారు ఆయనను ప్రాసిక్యూట్ చేయనక్కరలేదని తీర్పు చెప్పారు. బాలుని విషయమై ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. అమెరికాలో ఇటువంటివి అరుదుగా జరిగితే పట్టించుకోనక్కరలేదు. కాని ఇవి ఒక పద్ధతి ప్రకారం, వ్యవస్థీకృత రూపంలో, తరచు జరిగినా దానిని స్వర్గసీమ అనవచ్చునా? స్వర్గసీమగా అభివర్ణించే మన మేధావులు, రచయితలు కొందరికి అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏమిటో నిజంగానే తెలియదా?
నల్లవారికి ఇటువంటి అనుభవాలు అరుదుకాదని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. ఉదాహరణకు ‘మాల్కం ఎక్స్‌గ్రాస్‌రూట్స్ మూవ్‌మెంట్’, న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ నివేదికలతోపాటు, సాక్షాత్తూ శే్వత జాతీయులే నిర్వహించే ‘యుఎస్‌ఎ టుడే’ పత్రిక రిపోర్టులను గమనిస్తే, నల్లవారి అణచివేత ఎంత ఉద్దేశపూర్వకంగా, ఎంత వ్యవస్థీకృతంగా సాగుతున్నదో గ్రహించవచ్చు.
పోలీసులు, సెక్యూరిటీ గార్డులు, విజిలేంట్స్ అని తమనుతాము పిలుచుకునే గ్రూపులవారు 2012లో ‘‘కనీసం’’ 313 మంది నల్లవారిని కాల్చి చంపారు. కాని వాస్తవ సంఖ్య ఇంతకన్న చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో శాంతి భద్రతల సంస్థలు మొత్తం పదిహేడు వేలున్నాయి. (17,000). వాటిలో సుమారు 750 మాత్రమే ఈ తరహా ఘటనల వివరాలను డేటాబేస్‌కు అందజేస్తాయి. దానినిబట్టి వాస్తవమైన సంఖ్యలు వేలల్లో ఉంటాయనాలి. అమెరికా జనాభాలో నల్లవారి సంఖ్య సుమారు 13 శాతం. అటువంటి స్థితిలో కేవలం వారిని కాల్చి చంపటమే వేల సంఖ్యల్లో ఉంటే అదెంత గొప్ప స్వర్గమో మన మేధావులు మాత్రమే వివరించగలరు.
పోలీస్ సంస్థలు, ఇతర భద్రతా సంస్థలు ఈ స్థాయిలో కాల్పులకు పాల్పడుతున్నాయంటే, దాని వెనుక అణచివేతలు ఎంత తీవ్రంగా, ఎంత విస్తృతంగా ఉంటాయో ఊహించటం కూడా కష్టమే. నల్లవారి జనాభా 13శాతం కాగా, ఖైదీలలో వారు సుమారు 40 శాతం ఉంటారు. ఒకే విధమైన నేరాలకు నల్లవారిని, తెల్లవారిని అరెస్టుచేయటం నుంచి మొదలుకొని జైళ్లలోకి పంపడం వరకు అడుగడుగునా వివక్షతే. తెల్లవారికి కనీస శిక్షలైతే నల్లవారికి గరిష్ఠ శిక్షలని పై సంస్థలు రూపొందించినట్టు నివేదికలు చెప్తున్నాయి. న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అధ్యయనం ప్రకారం, అరెస్టయే నల్లవారిలో సుమారు 90 శాతం మంది అమాయకులు. కాల్పులకు గురై చనిపోయిన వ్యక్తులలో 44 శాతం మంది నిరాయుధులు. 27 శాతం సాయుధులైనట్లు పోలీసులు ఆరోపించి అందుకు ఆధారాలు చూపలేకపోయారు. దానిని కలిపితే నిరాయుధుల సంఖ్య 71 శాతం. అయినప్పటికీ పోలీసులు తమవద్ద ఆయుధాలు ఉండి కూడా, తాము ‘‘ప్రాణభయంతో’’ కాల్చామని వాదించారు. అట్లా వాదించినవారు 47 శాతం ఉన్నట్టు పైన పేర్కొన్న నివేదికలు వెల్లడించాయి. యుఎస్‌ఎ టుడే పత్రిక కథనం ప్రకారం, పోలీసులు కాల్చి చంపుతున్న నల్లవారిలో 18 శాతం మంది 21 సంవత్సరాల లోపు వయసువారు. ఇందుకు భిన్నంగా తెల్లవారి సంఖ్య 8.7 శాతం.
ఈ విధమైన నిర్బంధాలు, జైళ్లు, కాల్చివేతలకు మూలాలు నల్లవారిని బానిసలుగా మార్చి ఉపయోగించుకున్న అమెరికన్ పెట్టుబడిదారీ చరిత్రలో ఉన్నాయని, బానిసత్వం రద్దయిన అనంతరం ఏడు దశాబ్దాల కాలంలోనూ వారి పట్ల వివక్షలు ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో కొనసాగుతూనే ఉన్నాయని పై నివేదికలు చెప్తున్నాయి. నల్లవారిలో హింసా ధోరణులు ఎక్కువని, వారు ప్రమాదకారులని అసలు పోలీస్ రిక్రూట్‌మెంట్, శిక్షణ, విధానాల రూపకల్పన సమయాలలోనే తెల్లవారికి అభిప్రాయం కలిగింపజేస్తారు. ఇక సమాజంలో జాతి వివక్షాధోరణులు ఉండనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యం వల్లనే తెల్ల పోలీసులు నిర్భయమైన రీతిలో అతిగా వ్యవహరించి తామీ రైస్ వంటి పిల్లలను కూడా కాల్చి చంపుతున్నారు. అక్కడి నిపుణులు దీనిని నల్లవారికి, తెల్లవారికి మధ్య ‘‘నిరంతర యుద్ధం’’, ‘‘ప్రచ్ఛన్న యుద్ధం’’ వంటిదని అభివర్ణిస్తున్నారు.
దీనంతటి మధ్య నల్లవారికి అమెరికన్ స్వర్గం ఎక్కడున్నదనేది ప్రశ్న. నల్లవారు సాగించిన అనేకానేక ఉద్యమాలు, పోరాటాల అనంతరం బానిస వ్యవస్థ రద్దుకావటంతోపాటు వారికోసం అక్కడి ప్రభుత్వాలు వివిధ అవకాశాలు కల్పించాయి. అది జరగనట్లయితే అసంతృప్తి ఇంకా తీవ్రమై ఆ వ్యవస్థకు విపత్కరమైన పరిస్థితులు ఎదురై ఉండేవి. నల్లవాడైన ఒబామా దేశాధ్యక్షుడైనంత మాత్రాన వారికి మారింది ఏమీ కన్పించదు. మరి దీనంతటి మధ్య, మన బడుగు మేధావులు కొందరంటున్న అమెరికన్ స్వర్గమెక్కడ? ఈ తాజా ఘటనలు రెండు అక్కడి నల్లవారిని ఊపివేస్తున్న సందర్భంలో వారిందుకు వివరణ ఇవ్వాలి.
అసలు విషయమంటే ఈ తరహా మేధావులకు ఆర్థిక సంస్కరణలు, అమెరికా మెరుపులు కలిసి కళ్లు మిరుమిట్లు గొలిపించాయి. తమ వ్యక్తిగత కెరీరిజానికి అందులో అవకాశాలు కన్పించాయి. దానితో వాస్తవాలను, విచక్షణను బుద్ధిపూర్వకంగా విస్మరించారు. ఇండియాలో గాని, అమెరికాలోగాని ఈ వర్గాలకోసం జరుగుతున్నదేమిటి, వారి పట్ల గల అణచివేత ఏమిటి అన్న ప్రశ్నలను నిక్కచ్చిగా చూసి బేరీజువేయటానికి బదులు సమతులనాన్ని, సంయమనాన్ని కూడా కోల్పోయారు. అందుకే ఇండియా సంపూర్ణ నరకం వలె, అమెరికా సంపూర్ణ స్వర్గం వలె కనిపిస్తున్నాయి. రెండూ తప్పేనని, వాస్తవం ఆమధ్య ఎక్కడో ఉంటుందని మరిచిపోయారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాన పట్టిన గంధం

సాన పట్టిన గంధం

  • – దాసోజు లలిత 8790516894
  • 01/12/2014
TAGS:

ప్రపంచ దేశాల్లారా కండ్లు మూసుకున్నారా
నోరు సూదితో కుట్టేసుకున్నట్లు
సామ్రాజ్యాల అగ్రదేశాల ఆధిపత్యాల
స్వీయ మానసిక దాడిలో చితికిపోతున్నారా
తెగిపడుతున్న గాజా దేశాలెనె్నన్నో..

పేలల్లా ఎగిరిపడుతుంటే
పెయ్యి వెయ్యి తునకలైన అవిటితనాలు
దాపురిస్తుంటే దాక్కున్నారెక్కడ?
కచ్చగట్టి శవాల గుట్టల్ని నిర్మిస్తుంటే
పంచేంద్రియాలు మూసుకున్నారెందుకు

పేకమేడల్లా శ్వాసలు కూలిపోతున్నా
ఆసరాకోసం తడుముకుంటున్నా
కంటి రెప్పల్లేని కళ్ళలా
దిగులు పెట్టుకుంటుండ్రు వాళ్ళు
క్షణకాలం చలించని
మతి తప్పని నిఘా పెట్టాల్సిన వాళ్ళు
నిద్దుర నటిస్తున్నారు

దేశాల్లారా కాసింత ఉనికైనా చూపండి
కురుస్తున్న నిప్పుల వానలో
జడిపిస్తున్న నిస్సహాయ స్థితి!
కరుగని కరుడుగట్టిన దేశాల్లారా
నోటిలో ముప్ఫై రెండు పళ్ళమధ్య
మీ నాలుక ఏమైంది

మేం మిమ్ముల్ని చూసి జాలిపడుతున్నాం
వీధి రణాలపై మారు మాట్లాడక
ప్రపంచ బ్యాంకు రుణం కోసమేనా
ఓ అంతర్జాతీయ వాదమా
అలీనమా! మూడో ప్రపంచమా!

నేత్రాలనీ, హృదయాలనీ
ఏ జమ్మికొమ్మపై దాచారు
నిరంతరం ఒరిగే అమాయకుల
పేలిన గాయాలకు మాలామూ లేదా

రేపు నీకూ ఇదే గతి పడితే
నేను మాత్రం
అక్షరాల్ని సానబట్టి తీసిన గంధాన్ని
మీకోసం భద్రంగా దాస్తాను
కళ్ళు మూసుకున్నా మీ గుండెల్ని మాత్రం
తెరిచేట్లు చేస్తా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాలకులకు పట్టని గురజాడ

పాలకులకు పట్టని గురజాడ

  • – రామతీర్థ, 9849200385
  • 01/12/2014
TAGS:

ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆది కారకుడు గురజాడ. ప్రపంచమంతా ఎప్పటికైనా ఆధునిక భాషవైపు మొగ్గు చూపక తప్పదన్న చారిత్రకమైన వాస్తవాన్ని ఎరిగినవాడు. తన జీవితకాలమంతా ఒక పూనికతో సర్వతోముఖ ఆధునికత పక్షాన నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. అలాంటి గురజాడ మన మధ్య లేని నూరేళ్ళూ, ఆయన ఆలోచనల ప్రాముఖ్యతను గుర్తించామా? ఈ శతాబ్ది కాలాన్ని కొంత స్వతంత్రం లేకా, తర్వాత స్వతంత్రంలోనూ మనం అశ్రద్ధ, అవిధేయత, అసమర్థతల మధ్యే ప్రధానంగా గడిపామన్నది ఒక కటువైన వాస్తవం. కొన్ని పరిశోధనలూ, కొంత విశే్లషణాత్మక విమర్శ వెలువడినా, దాని కోసం నిష్ణాతులు పనిచేసినా, ఇంకా జరగాల్సింది చాలా ఉన్నదన్నది పచ్చి నిజం. ఎవరో కథలు రాసిన వారిని చూపెట్టి, ఇంకేవో ఘనతలు ఒక రంగంలో సాధించిన వారిని చూపెట్టి, గురజాడను పక్కన పెట్టడం సాధ్యమయ్యే పనికాదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి రెడ్డి పోయె… నాయుడొచ్చె చందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా గురజాడను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. గురజాడ తర్వాత వందేళ్ళకు పుట్టిన కాళోజీ, జయశంకర్ వంటి ధీమంతులకు తెలంగాణ ప్రభుత్వం విశేషించి ఉత్సవాలు జరుపుతుండగా, గురజాడను గత ప్రభుత్వాలు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయం.
1903లో తన తెలుగు కథలకు ఏడేళ్ళు ముందే గురజాడ ఆంగ్లంలో ఒక కథ రాశారు. అది ‘స్టూపింగ్ టు రైజ్’. (గురజాడ ఈ పేరు పెట్టడంలో ‘స్టూపింగ్ టు కాంకర్’ పేరిట 1773లో ఆలివర్ గోల్డ్‌స్మిత్ రాసిన నాటకం గమనానికి వస్తుంది). అప్పటికి ఆంగ్లంలో కథలు రాసిన భారతీయ రచయితలు కొద్దిమందే ఉండొచ్చు. లేదా తొలి తరం భారతీయ ఆంగ్లకథా వికాసకర్తలు అయిన ఆర్.కె.నారాయణ్, రాజారావు, ముల్క్‌రాజ్ ఆనంద్‌ల కన్నా ముందున్నాడనడంలో సందేహం లేదు. ఈ గణాంకాలు ఏవి వెలికితీద్దామన్నా మన వద్ద ఆ కథ మూలం లేదు. దానిని పారేసుకున్న అశ్రద్ధ మనది. అనువాదం చేసిన అవసరాల సూర్యారావు గారు దానిని జాగ్రత్త చేయలేకపోయారు. విశాలాంధ్ర వారి మధ్య, స్టేట్ ఆర్కైవ్స్ శాఖ వారికి చేరేలోపు ఆ కథ ఎక్కడో గల్లంతు అయిపోయింది. పాత కవులవి దొరకలేదు అంటే ఓ అర్థం వుంది. కానీ నూరేళ్ళలోపే జరిగిన ఒక ప్రామాణిక రచనను ఆధారాలు లేకుండా పారేసుకున్న మన అశ్రద్ధ, మరే ఇతర భాషా సమాజానికి ఉంటుందని అనుకోలేం. కన్యాశుల్కం తొలి ముద్రణ ప్రతి సైతం అంతే. ఆరుద్ర దానిగురించి రాయగా రాయగా ఆ పూనికతో బండి గోపాలరెడ్డి (బంగోరె) దానిని మద్రాసులోని ప్రభుత్వ ప్రాచ్యలిఖిత ప్రతుల భాండాగారంలో కూచుని ఆనాడు జిరాక్స్ వెసులుబాటు లేనందువల్ల నకలు రాసుకున్నాడు. దీంతో ఆ రచన అక్కడ వుందన్న సమాచారం మనకు అప్పుడు తెలిసింది. ఒక వెలోరియమ్ ఎడిషన్ కూడా తీసుకురావాల్సిన అవసరాన్ని బంగోరె ప్రస్తావించాడు. ఆ కన్యాశుల్కం ప్రతి జీర్ణావస్థలో వుంటే, దానిని డిజిటల్ కాపీ చేసి భద్రపరిచే జాగ్రత్తలు ఇటీవలే మొజాయిక్ సాహిత్య సంస్థ తీసుకుంది. గురజాడ 150వ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్రలో, విజయవాడలో దానిని 2012లో బహిరంగ ప్రదర్శనకు పెట్టింది. తొమ్మిది గంటల కన్యాశుల్కం నాటకాన్ని ఎవరికి తోచిన కత్తిరింపులతో వారు ప్రదర్శించడం తప్పితే – ఈ నాటకం గురించి ఒక సమ్యక్ అవగాహన, దృష్టి ఈ నూరేళ్ళలో మనం ఏర్పరచుకోలేదు. చక్కని టెలిఫిల్మ్స్‌లా తీయతగ్గ చిత్రపరిశ్రమ మనకున్నా, గురజాడ రెండు కథలు అలాగే ఉన్నాయి. కన్యాశుల్కం సినిమాని 1955లో నిర్మించిన నిర్మాతలు తమకేదో దివ్యమైన హక్కులున్నట్టుగా నాటక ముగింపును మార్చివేశారు. ఇదే పని ఇంకే ప్రపంచ నాటకానికి, సాహిత్య రూపానికి ఆ దేశంలో జరిగితే అక్కడి ప్రజానీకం సహిస్తారా అన్నది సందేహమే. తక్కువ సమయంలో ప్రదర్శితమయ్యే సంపూర్ణ నాటకం గురించి మనకు అసలు ఏ ఆలోచనలూ లేకపోవడమే ఒక శిఖరాయన జడత్వం. యువతరం ఈ దిశలో ఆలోచన చేస్తున్న ఒకే ఒక్క ఆశాకిరణం – ప్రముఖ రచయిత కుమారుడైన అట్టాడ సృజన్ గురజాడ వారి ‘దిద్దుబాటు’ కథను ‘కమిలి’ పేరిట ఒక లఘుచిత్రంగా రూపొందించి ప్రదర్శనలిచ్చాడు. గురజాడ గేయ కథానికలైన పూర్ణమ్మ, కన్యక, లవణరాజు కల, డామస్ పీతియస్ – ఏదీ కూడా మన నాటకాలవాళ్లకీ, రూపకాలవాళ్లకీ, రేడియోవాళ్లకీ, టెలివిజన్ వాళ్లకీ, సినిమావాళ్లకీ, రాష్ట్ర చలనచిత్ర మండళ్ళ దృష్టిలో పడలేదు. ఏవో స్కూల్ వార్షికోత్సవాల్లో పిల్లలు ప్రదర్శనలు ఇచ్చుకోవడం తప్ప, మన సాంస్కృతిక సమాజం వీటి గురించి పెద్దగా చేసిందేమీ లేదు. గురజాడ రాసిన నీలగిరి పాటలు చక్కని సంగీత ప్రదర్శనగా రూపొందించడానికి ఎంతో పనికొస్తాయి. వాటిని పాడే గాయకుడూ కనిపించడు, సంగీత దర్శకుల మాట సరేసరి. షేక్‌స్పియర్, టాల్‌స్టాయ్, గోర్కీ, టాగోర్, శరత్, వల్లథోల్, సుబ్రహ్మణ్య భారతి, ఫకీర్ మోహన్ సేనాపతి వంటి వారి పట్ల ఆయా భాషా సమాజాల స్పందన, మన తెలుగువారి కన్నా మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. అనువాదాల విషయానికొస్తే – అమ్మకానికి అమ్మాయిలు (గర్ల్స్ ఫర్ సేల్) పేరిట వేల్చేరు నారాయణరావు చేసినది అనువాదం కాదు, అపరాధం. ఇంకో జాతిలో అయితే మూల రచనలో ఆయన తీసుకున్న స్వాతంత్య్రానికి, అనువాదకుడు, ప్రచురణకర్తలపై చట్టపరమైన చర్యలు మొదలై వుండేవి. గురజాడ వ్యక్తిత్వం గిరీశంలో ఉందని భావించేవారి సంఖ్య ఎంత ఉన్నా, వాల్మీకి రావణుడిలో ఉన్నాడంటే ఎంత నొచ్చుకుంటామో అటువంటిదే ఈ వదరుబోతుతనం కూడా.
గురజాడ జ్ఞాపకాలను పదిలపరుచుకోవడంలోనూ పాలకులూ, మనం చూపిన, చూపుతున్న అశ్రద్ధ అంతా ఇంతా కాదు. తాను నివసిస్తున్న ఇల్లు తనకు ఎలా వచ్చిందో తన లేఖల్లో వివరంగా రాశారు. పెద్ద దావా సెటిల్ చేయడంతో తన సేవలకు పారితోషికంగా ఇస్తామన్న సొమ్ములో రెండువేలో, పదిహేను వందలో చెల్లుబాటు చేసుకుని ఖాళీ జాగా కూడా ఇస్తే ఇల్లు కట్టుకుంటానని కూడా గురజాడ రాసిన లేఖల్లో వుంది. ఇప్పుడుంటున్న ఇల్లు ఇరుకుగా వుందని, కొత్త ఇంటికోసం నూయి తవ్వించి, ఇంటి నిర్మాణ సామగ్రి కుప్పలు వేసి, కాపలావాడిని పెట్టిన వైనాలన్నీ ఆయన డైరీలో స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోకపోవడం వల్ల, గురజాడ కుటుంబ సభ్యుల ఆర్థిక సమస్యల వల్ల ఆయన కట్టుకున్న ఇల్లు ప్రైవేటు వ్యక్తుల పరమై నేలమట్టమై పోయింది. గురజాడ మరణించేవరకూ నివసించిన ఇల్లు ఒకప్పటి గుర్రపుశాల. దానినే కొన్ని దశాబ్దాల కింద అప్పటి ప్రభుత్వం ఒక చిన్న స్మారక మందిరంగా మార్చింది. చెక్క సున్నంతో కట్టిన పాతకాలపు హెరిటేజ్ కట్టడం అది. పక్కనే పెద్దఎత్తున లోతుగా పునాదులు వేసి, వ్యాపారపరమైన నిర్మాణాలు జరిపితే, అది కూలిపోవడం ఖాయం. దీన్ని అడ్డుకునే ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్దకానీ, విజయనగరం స్థానిక అధికారుల వద్దకానీ ఉన్నట్టుగా లేవు. అది కూలిపోయిన వార్త కూడా ఈ శతవర్ధంతి వత్సరంలో వింటామేమో. ఇదీ మన సమర్థత!
గతంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుండి మేల్కొని, గురజాడ 150 జయంతి సందర్భంలో ఆయన పేరిట ఐదుకోట్ల నిధి ప్రకటించింది. అందులో, ఆ ఏడాది హడావిడికి ఒక ముప్ఫయి లక్షల కన్నా ఖర్చు అయిన దాఖలాలు లేవు. ఇప్పటి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను గౌరవించడమో, ఆ నిధిని ఇంకా పెంచడమో చేస్తే తెలుగు జాతికి సాంస్కృతిక ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. అమ్ముడైపోయిన గురజాడ స్వంత ఇంటి స్థలాన్ని పక్కనే ప్రస్తుతం ఉన్న చిన్న మెమోరియల్‌ను కలిపి ఒక సముచిత స్మృతి కేంద్రంగా విజయనగరంలో నిర్మిస్తే తెలుగు జాతి సంతోషపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి జిల్లా ముఖ్య కేంద్రంలో గురజాడ కళామందిరాలు ఏర్పాటుచేయడం, నాటక సమాజాలకు ఒక సెంట్రల్ హాల్, సాహిత్య సంఘాల సభలకు చిన్న సమావేశ మందిరాలు, ఆధునిక వసతులు కలిగిన గ్రంథాలయం సమకూర్చడం తెలుగు జాతి ఖ్యాతికి దోహదపడే చర్య. కొత్త రాష్ట్రంలో, గురజాడ శతవర్ధంతి వత్సరంలో ‘దృశ్య మాధ్యమాల్లో గురజాడ సాహిత్యం’ అనే దానిపై దృష్టి పెట్టి, కార్యాచరణ రూపొందించి అమలు చేయడం ఎంతైనా అవసరం. ఇప్పుడైనా ఇది మొదలుపెడితే, గురజాడ మనకు దూరమైన ఈ రెండో శతాబ్దిలో, కనీసం, ఒక బాధ్యతాయుతమైన జాతిగా తలెత్తుకు నిలబడగలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామేశ్వర స్వామి ధర్శనంసకల శుభప్రదం

రామేశ్వర స్వామి ధర్శనంసకల శుభప్రదం

  • – చివుకుల రామమోహన్
  • 27/10/2014
TAGS:

హిందువులందరికి భారతదేశములోని నలు దిశలా వెలసియున్న అనేక పుణ్యతీర్థాలను అనవరతం దర్శించి, విశేష పూజలు చేయుట, విశేషించి పర్వపు రోజులలో క్షేత్ర దర్శనం పుణ్యప్రదమని, ముక్తిదాయకమని భక్తజనుల నమ్మిక. అందుకు తగినటులనే ఈ పుణ్యక్షేత్రము నదీ పరీవాహక ప్రాంతములలోనే ఎక్కువగా కొలువు తీరుట కూడా పుణ్యనదీ తీర్థ స్నానాదుల కొరకేయని నిశ్చయంగా చెప్పవచ్చు.
కృష్ణానదీ తీరాన వెలసియున్న ప్రసిద్ధమైన ‘‘టేకుపల్లి’’ శ్రీ రామేశ్వరస్వామి క్షేత్ర ప్రాముఖ్యత ఇంతింత అని చెప్పరానిది. ఆదిశంకరులు భారతదేశాన్ని మూడు పర్యాయాలు పర్యటించి నాలుగు పీఠాలను ఏర్పాటుచేశారు. అంతేగాకుండా ఆలయాల పునరుద్ధరణా కార్యక్రమం కూడా విరివిగాజరిగింది.
‘టేకుపల్లి’ (కృష్ణాజిల్లా)లోని శ్రీ రామేశ్వరస్వామి దేవాలయం కూడా కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని వెలసింది. దీనిని అగస్త్యముని ప్రతిష్ఠించారు. శతాబ్దాలుగా ఆరాధన జరుగుతున్న ఒక విశిష్ఠ క్షేత్రరాజము ఈ టేకుపల్లి శ్రీ రామేశ్వరస్వామి దేవాలయం. గత శతాబ్దంలో 1930 సంవత్సరంలో యడివల్లి రంగమ్మ కళ్ళేపల్లి గ్రామంలోవున్న తన 4 ఎకరాల సారవంతమైన మాగాణి భూమిని గుడి నిత్య పూజాది కార్యక్రమాలు జరుపు నిమిత్తం దానంగా అందజేశారు. అదే రీతిలో అద్దేపల్లి కుటుంబ సభ్యులు 56 సెంట్ల మాగాణ స్థలాన్ని ఆలయ ఖర్చులకు గాను అందజేశారు. అనంతరం విష్ణ్భుట్ల అన్నపూర్ణమ్మ ధ్వజస్థంభ నిర్మాణం చేయగా, ఐ.డి.బి.ఐ రిటైర్డ్ డైరెక్టరు పిల్లుట్ల నరసింహం 2010 దేవాలయానికి పునఃప్రతిష్ట చేశారు. ఈ మధ్యకాలంలో టేకుపల్లి శ్రీ రామేశ్వరస్వామిని దర్శించటానికి విశేష సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేస్తున్నారు.
క్షేత్ర దేవతలు
శ్రీ రామేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ బాలాపార్వతి అమ్మవారు, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వార్లు విచ్చేసి ఉన్నారు. ఆలయ దైనందిన కార్యక్రమం మరియు నిత్య పూజాది కార్యక్రమములు మరింత పటిష్టంగా నిర్వహించుటకు యడవల్లి కుటుంబ సభ్యులు ఈ ఆలయాన్ని శ్రీ కంచి కామకోటి పీఠమునకు 19.06.2014 దత్తతగా ఇవ్వటం జరిగింది. తదాదిగా ఈ దేవాలయంలోని అన్ని కార్యక్రమాలు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్రసరస్వతి స్వామివారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతిస్వామివార్ల అనుగ్రహముతో జరుపుతున్నారు.
ఈ దేవాలయం శ్రీ వల్లీ దేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నెలకొనియున్న మోపిదేవి గ్రామానికి 6 కిలోమీటర్ల దూరములోను అలాగే కృష్ణానదీ సముద్ర సంగమమైన పెదకళ్ళేపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గానాగేశ్వరస్వామి దేవస్థానమునకు 5 కిలోమీటర్ల దూరములో వున్నది. ఈ మూడు దేవాలయములు 11కిలోమీటర్లలో మధ్యస్తంగా వుండటం ఒక విశేషం.
టేకుపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామేశ్వరస్వామి దర్శించగోరు భక్తజనులు, విజయవాడ, మచిలీపట్నం, రేపల్లె పట్టణాల నుండి వస్తే చల్లపల్లి గ్రామంలో గాని లేదా మోపిదేవి గ్రామాన గాని బస్సుదిగి ఆటోరిక్షాలో సౌకర్యవంతంగా చేరవచ్చు. మరొక ముఖ్య విశేషం ప్రపంచప్రఖ్యాతమైన కూచిపూడి నాట్యానికి ప్రసిద్ధమైన కూచిపూడి గ్రామం ఇచ్చటకు 25 కిలోమీటర్లదూరములోనే వున్నది.
విశేష పూజలు
ప్రతి సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు శ్రీ బాలాపార్వతి అమ్మవారి శరన్నవరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. దైనందినంగా శ్రీ రామేశ్వరస్వామివారికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం మరియూ అమ్మవారికి లక్ష్మి అష్టోత్తర, దుర్గస్తోత్ర, బాలసహస్ర నామార్చన. శ్రీ ఆంజనేయస్వామివారికి, వీరభద్రస్వామి వార్లకు అర్చన, ధూపదీప నైవేద్యములు నిత్యం జరుగుతుంటాయ. సాయంత్రం వేళ బాల పార్వతిదేవికి లలితాసహస్ర నామవళి పఠిస్తారు. క్షేత్రదర్శనం ఉపాసనాపరంగానే గాక, భక్తితత్పరతతో క్షేత్ర దేవతామూర్తులను కొలచినవారికి సకల శుభాలు జరుగుతాయని ఇక్కడి ప్రజల నమ్మిక. సర్వరోగ నివారణార్థం, సకలాభివృద్ధికి శ్రీ రామేశ్వరస్వామి క్షేత్ర దర్శనం అత్యంత శుభప్రదం.
ఇక్కడ ఆవిర్భవించిన ఈ స్వయంభూః శ్రీ రామేశ్వరస్వామి క్షేత్ర దర్శనం సకల శుభప్రదం మోక్షదాయకం. కనుక భ క్తజనులందరూ స్వామివారిని, అమ్మవారిని దర్శించి వారి అనుగ్రహ పాత్రులవ్వాలని ఆశిద్దాం.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాటక సాహిత్యంపై విజ్ఞాన సర్వస్వం..

నాటక సాహిత్యంపై విజ్ఞాన సర్వస్వం..

  • -ద్వా.నా.శాస్ర్తీ
  • 06/12/2014
TAGS:

తెలుగు పద్య
నాటకములు-అనుశీలన (సిద్ధాంత గ్రంథం)
-డా.దేవరపల్లి ప్రభుదాస్
వెల: రు.350
ప్రతులకు రచయిత,
ఫోన్ నం. 9440448948

పద్య నాటక స్వరూప స్వభావాలు, పద్యనాటకాల వర్గీకరణ, విశే్లషణ, ప్రదర్శనా విధానం, ప్రేక్షకుల స్ఫూర్తి, పద్యనాటక ప్రముఖ నటులు-సమాజాలు…అనే విధంగా నాలుగు అధ్యాయాలుగా వింగడించబడింది. చివరలో అనుబంధం ఉంది గానీ అది వ్యక్తిగతం తప్ప పాఠకుడికి లాభించేది కాదు. నాట్యకళ ఆవిర్భావం, రాజుల నాట్య గాన ప్రసక్తి, యక్షగానాలు, ఆరుబయలు రంగస్థలం వంటి వాటిని పూర్వ రంగంగా వివరించారు. అయితే తొలిగా సుగ్రీవ విజయం పేర్కొనాలి. (ఇది రాసిన కవి కందుకూరి రుద్రయ్య అన్నారు-రుద్రకవి గదా!) పద్య నాటకాల ప్రారంభ దశను విశే్లషిస్తూ మంచి సమాచారమిచ్చారు. ప్రభుదాస్ పరిశోధన, విశే్లషణలు ఎంత లోతుగా ఉన్నాయో ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. పురాణం సూరి శాస్ర్తీ గారిచ్చిన నాటక రచనల వర్గీకరణ జాబితాను పట్టుకుని మనకి అందించారు. తెలుగులో మొత్తం 1410 పద్యనాటకాలు రచించబడ్డాయని తెలిపి వాటిని పేర్కొనడంవల్ల పరిశోధన మరింత ప్రామాణికమయింది. నాటక సమాజాలు ప్రారంభంలో ఎన్ని ఉన్నాయో తెలిపే పట్టిక నేటి పరిశోధకులకి ఉపయుక్తంగా ఉంటుంది.

తెలుగులో నాటక వాజ్ఞ్మయం అనగానే డా. ప.ఎస్.ఆర్. అప్పారావు గుర్తుకురావాల్సిందే. వీరి ‘తెలుగు నాటక వికాసము’ అనే ప్రామాణిక గ్రంథం నేటికీ గొప్ప ఆకర గ్రంథమే. ఆ తర్వాత చాలా పుస్తకాలు వెలువడ్డాయి. దేవరపల్లి ప్రభుదాస్ తెలుగు విశ్వవిద్యాలయంలో పద్య నాటకాలపై ప్రత్యేకంగా పరిశోధన చేసారు. ఆ సిద్ధాంత గ్రంథాన్ని అందుబాటులోకి తేవడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. పరిశోధక విద్యార్థులకి, నాటక రంగం వారికి మార్గదర్శకంగా ఉంటుంది.
పద్య నాటక స్వరూప స్వభావాలు, పద్యనాటకాల వర్గీకరణ, విశే్లషణ, ప్రదర్శనా విధానం, ప్రేక్షకుల స్ఫూర్తి, పద్యనాటక ప్రముఖ నటులు-సమాజాలు… అనే విధంగా నాలుగు అధ్యాయాలుగా వింగడించబడింది. చివరలో అనుబంధం ఉంది గానీ అది వ్యక్తిగతం తప్ప పాఠకుడికి లాభించేది కాదు. నాట్యకళ ఆవిర్భావం, రాజుల నాట్య గాన ప్రసక్తి, యక్షగానాలు, ఆరుబయలు రంగస్థలం వంటి వాటిని పూర్వ రంగంగా వివరించారు. అయితే తొలిగా సుగ్రీవ విజయం పేర్కొనాలి. (ఇది రాసిన కవి కందుకూరి రుద్రయ్య అన్నారు-రుద్రకవి గదా!) పద్య నాటకాల ప్రారంభ దశను విశే్లషిస్తూ మంచి సమాచారమిచ్చారు. ప్రభుదాస్ పరిశోధన, విశే్లషణలు ఎంత లోతుగా ఉన్నాయో ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. పురాణం సూరి శాస్ర్తీ గారిచ్చిన నాటక రచనల వర్గీకరణ జాబితాను పట్టుకుని మనకి అందించారు. తెలుగులో మొత్తం 1410 పద్యనాటకాలు రచించబడ్డాయని తెలిపి వాటిని పేర్కొనడంవల్ల పరిశోధన మరింత ప్రామాణికమయింది. నాటక సమాజాలు ప్రారంభంలో ఎన్ని ఉన్నాయో తెలిపే పట్టిక నేటి పరిశోధకులకి ఉపయుక్తంగా ఉంటుంది. సురభి సమాజంలోని పనారస గోవిందరావు కృషిని కళ్లకి కట్టించారు. ప్రభుదాస్ సూక్ష్మ పరిశీలన చేసారనడానికి విశాఖపట్నంలోని సంగీత మానినీ సమాజం గురించి పేర్కొనడమే నిదర్శనం. మారేపల్లి రామచంద్రశాస్ర్తీగారు(కవిగారు) 1902లోనే దీనిని స్థాపించి వేశ్యలలో మార్పు తీసుకు వచ్చి వారిచేత పాత్రలు వేయించిన సంఘ సంస్కర్త.అందరూ మరిచిపోయిన కవిగారి గురించి సేకరించి రాయడం పరిశోధనకి వనె్న చేకూర్చింది. ఒకే వస్తువు గల నాటకాన్ని ఎవరెవరు రాసారో విశేష సమాచారం ఇచ్చారు.
పద్య నాటకాలకే పౌరాణిక నాటకాలని పేరు. ఇతి హాసాలలో పురాణాలలో గల ఇతి వృత్తాలు పద్య నాటకాలకి మూలాలు. అయితే నాటక రచయితలు తమ కల్పనలు జోడించి ప్రేక్షకుల మెప్పుకోసం, ప్రదర్శనా సౌలభ్యం కోసం రాసేవారు. నాటకాల వర్గీకరణ కూడా రచయిత శ్రమ ఫలితమే! ‘సుప్రసిద్ధ పద్యనాటకాల విశే్లషణ’లో పేర్కొన్న ఏడు నాటకాలూ సుప్రసిద్ధమే కానీ- ‘రక్తబలి’ వీటిలాగ సుప్రసిద్ధమని తెలియదు. ఈ నాటికల ఇతివృత్తం, అంకాల సారాంశం ఇస్తూ విశే్లషించారు. ‘కురుక్షేత్ర’ నాటకంలో కృష్ణుడు కర్ణునితో నువ్విటు వచ్చేస్తే ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుందనే పద్యం ఉదహరించారు. అయితే అమూలకమని చెప్పడం సమంజసం. సత్య హరిశ్చంద్ర నాటక విశే్లషణలో ‘కాటిసీను’లో జాషువా పద్యాలు పాడతారని చాలామందికి తెలీదు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన పద్యాలు కావివి ఈ సంగతి సమాజం వారు చెప్పకపోవడం అన్యాయం. ప్రభుదాస్ చెప్పిన కొత్త అంశం ఏమిటంటే జాషువా పద్యాలు కాటిసీనులో చేర్చి పాడడం అనేది బండారు రామారావుగారితో ప్రారంభమైందనడం! జాషువా పద్యాల వల్లనే ఆ సీను కరుణ రస ప్లావితం అవుతోంది. తాండ్ర సుబ్రహ్మణ్యం రాసిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ (ఇది కూడా కల్పితమంటారు), విద్వాన్ కణ్వశ్రీ రాసిన ‘బాలనాగమ్మ’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తీ గారి ‘బొబ్బిలి యుద్ధం’, కాళ్లకూరి నారాయణరావుగారి ‘చింతామణి’ నాటకాలను విశే్లషించారు. ‘చింతామణి’ నాటకంలో ప్రదర్శించే వారి నోటినుంచి వచ్చే మితిమీరిన అసభ్య పదాలు తక్కువే. ఇది సంఘ సంస్కరణ నాటకం. కాళ్లకూరి వారు రాసిన మూడు నాటకాలు సంస్కరణాత్మకమైనవే. అసలు ఆయన జీవితమే సంస్కరణ దిశగా సాగింది. చివరగా ‘ఆంధ్ర భీమ’ గుంటుపల్లి ఇన్నయ్య రాసిన క్రైస్తవ తొలి నాటకం ‘రక్తబలి’ గురించి వివరించారు.
మూడో అధ్యాయంలోని ప్రదర్శనా పద్ధతులు అనే అంశం మొదటి అధ్యాయంలోనే రావాల్సి ఉంది. ఇందులో ‘పద్యం చదవడమా? పాడడమా?’ అని వివరించారు కానీ టూకీగా ఉంది. పద్యం రాగభరితమైతే రాగం బాగుందనిపిస్తుంది కానీ పద్యం బాగుందనిపించదని చెప్తారు. కానీ రాగం లేకుండా చదివితే వచనానికి పద్యానికి తేడా ఏముంది? ప్రభుదాస్ చెప్పినట్టు ‘వన్స్‌మోర్’ల కోసం, ఆధిక్యతను ప్రదర్శించడం కోసం రాగాలుతియ్యడం అలవాటైపోయింది. కాబట్టి భావయుక్తంగా, తగిన రాగంలో శ్రుతిపక్వంగా పాడడం సముచితం. ఇంకా పద్యానికి వాద్య సహకారాలు, సంగీతం పాత్ర, రసాభాస, నంది నాటకోత్సవాలు వంటి వాటిని కూడా వివరించారు. నాటకాల విమర్శ మరింత అవసరమనిపిస్తుంది. ఆయా నటుల ప్రత్యేకతల్ని ప్రదర్శనలోగల లోపాలు, చమత్కారాలను కూడా చేరిస్తే బాగుండేది. ఏమైనా పద్యనాటకాలపై ఈ గ్రంథం ప్రామాణికం. మినీ విజ్ఞాన సర్వస్వం!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓ తెలుగు సైనికుడి భాషా బాణాలు

ఓ తెలుగు సైనికుడి భాషా బాణాలు

  • -సన్నిధానం నరసింహశర్మ
  • 06/12/2014
TAGS:

తెలుగు భాషంటే అలుసా?
-డా.తూమాటి సంజీవరావు,
134 పుటలు,
వెల: రూ.100/-
ప్రతులకు: శ్రీమతి టి.హైమవతి,
35/16, సెకండ్ ఫ్లోర్,
15వ వీధి, అశోక్‌నగర్,
చెన్నై- 600 083.

తమిళనాడు దొరతనం తెలుగు వాచకాల్ని అచ్చువేసిన ఓ సందర్భంలో- వాటిలోని తప్పుల్ని సరిదిద్దవలసిందేనని చెన్నయ్‌లోని ఓ బడిపంతులు న్యాయస్థానానికి వెళ్ళారు; నెగ్గారు. అంతేకాదు ప్రాచీన భాషగా తెలుగు గుర్తింపును వ్యతిరేకించిన కుట్రదారులకి వ్యతిరేకంగా తనంతట తానే ప్రతికక్షిగా ధైర్యంగా నిలబడ్డారు. ఆయనే డా.తూమాటి సంజీవరావు- ఈ ‘తెలుగంటే అలుసా?’ అనే పొత్తానికి రచయిత, సంస్కృతం, ఆంధ్ర భాషల్లో పదప్రయోగ రహస్యాలు, వ్యాకరణాంశాలూ తెలిసిన పండితుడు.
ఉపోద్ఘాత ఉపసంహారాలతో కలసి 27 శీర్షికలుగా సాగిన చిన్న చిన్న వ్యాసాలు- తెలుగు భాషాక్షరాలు, పదాలు, వ్యవహారాలు, మార్పులు, చేర్పులు, పత్రికలవారుప్రయోగించే పదప్రయోగాలపై తమ భావాలు వంటివెన్నింటికో వివరణాత్మక, విమర్శనాత్మక విశేషాలు, విశే్లషణలూ నిండి వున్నాయి. ఇందులో కొన్ని ఇతరులు ఇదివరకే తడిమినవీ వున్నాయి, తాముగా క్రొత్తగా చెప్పేవీ వున్నాయి. విద్యార్థి జనానికే కాక పెద్దవారూ తెలుసుకోవలసినవీ వున్నాయి.
2014 మార్చి బెంగుళూరు పత్రిక ‘తెలుగుతేజం’లో ఇచ్చిన అరవై ఆరు పదాల అపశబ్ద సుశబ్ద పట్టికని ఇవ్వడం ప్రయోజనకరం. పదాల ఒప్పుతప్పుల నిగ్గుతేల్చి చెప్పాలనేది ఒక సామాజికాంశం. అయితే నిజాయితీ అభినందనీయమే అయినా కొన్ని సందర్బాలలో దూకుడుతనం అంత అక్కరలేదనిపిస్తుంది. రామోజీ ఫౌండేషన్‌వారు అత్యుత్సాహంతో తెలుగు భాషకు ఈనాడు, ఈటీవీ ద్వారా చేస్తున్న సేవలు-చాలవని తెలుగువెలుగు మాసపత్రికను ప్రారంభించారు. కాని భాషపై సరియైన అవగాహన లేనివారి ద్వారా వెలుగును ప్రసాదిస్తామంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది’’అన్నారు. (పుట.43). ఇక్కడ ‘అత్యుత్సాహంతో’ అని అనవలసిన అవసరం లేదేమోననిపించింది. మళ్ళీ ఆ పేరాలోనే ముందు వాక్యం ‘కొందరికిగల ఉత్సాహాన్ని ప్రోత్సహించవలసింది’ అని కూడా రచయితే అన్నారు.
గురుభ్యోన్నమః అనకూడదు; గురుభ్యోనమః అనాలని, ‘అథమ’ ప్రయోగం మానుకోవాలని ఇలా కొన్ని చెప్పడం గ్రహించడానికి మంచిదే. అయితే వాడుక భాషలో ప్రజలు కొన్నిటి మార్చడం కొన్నిటికి అర్థాలు కాలార్థాలు చేయడం పరిపాటే. సుస్వాగతం వాడడం మంచిది ఎందుకు కాదో వేత్తలు చెబుతారు. స్వాగతం చెప్పేదానికి బలకరంగా చెప్పినట్లుగా భావించుకుని సుస్వాగతాన్ని ప్రజలు వాడడాన్ని స్వాగతించవలసిందే.
‘‘ఇంటర్‌లో సున్నాల పాపం విద్యార్థులదా? అధ్యాపకులదా?’’ అనే వ్యాసం రచయిత సమస్యాధ్యయన శక్తికి దర్పణం పట్టింది. పాఠశాలల్లో భాషాబోధన విషయంలో ఈయన సూచనలు ఆలోచనాత్మకాలు (పుట 57) తిరుపతిలో 2012లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన సందర్భంలో ‘ఆహూతులకు స్వాగతం’ బానర్ని అర్థవంతంగా విమర్శించారు. అయితే ఒక్కొక్కప్పుడు చెప్పేదానికి సాగతీతతో చెప్పినట్లనిపించింది.
‘్భష కాలానుగుణంగా మారుతుంది. మారటం దాని సహజ లక్షణం. మారుతుంటేనే అది జీవభాష/ జీవద్భాష అవుతుంది. ఆ మార్పులో కృతకత్వం కంటె సహజత్వం ఉండాలి. అటువంటిదే సమాజంలో అంగీకారమవుతుంది’’(పుట 66) అన్నారు. అందువల్లనే కొన్నిటిని సర్దుబాట్లతో చూడాలి.
బ్లాక్‌బోర్డు అంటే నల్లబల్ల సరిపోతుంది. బ్లాక్‌మనీ అంటే ‘నల్లడబ్బు’ ఎలా సరిపోయింది. అది పత్రికలవారు వాడేది అంటారీయన. ఇక్కడ నలుపు భావించుకోవలసింది. పదుగురాడుమాట పాడియై ధర జెల్లింది, నల్లడబ్బు ప్రజాస్థీరీకరణ అయింది. ‘నల్లబజారు’నూ వాడుతున్నాం గదా! అయితే శబ్దమూలాలను వాటి ఆనుపానులను గ్రహించడం మంచిదే. ‘వాల్‌పోస్టరును కుడ్యపత్రిక అని తర్జుమా చేసి వ్రాశారు. తరువాత గోడపత్రిక అని వ్రాస్తున్నారు. గోడ దేశ్యపదం, పత్రిక తత్సమం ఈ రెండింటినీ ఎలా కలిపారో ఆ కలిపినవారికే ఎరుక’ (పుట 67) అన్నారు. భాష ప్రవాహశీలం, కాలానుగుణం అని ఒకప్రక్క ఒప్పుకొంటున్నప్పుడు ఈపాటి మిశ్ర సమాస పదాలను ముఖ్యంగా పాతుకుపోయిన వాటిని ఆహ్వానించకపోతే ఎలా?
సంజీవరావు ఆలోచనలు ఆలోచించవలసినది. అధ్యయనం అభినందించదగినది. భాషకు సంబంధించిన సామాజిక సమరం ప్రస్తుతించవలసింది అని ఎవరికైనా అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే.
ఓసారి ఏదో సందర్భంలో ఎవరో చెళ్లపిళ్లవారితో ‘దీనికి వ్యాకరణం’ ఒప్పుకుంటుందా? అంటే శ్రవణ వ్యాకరణం ఒప్పుకుంటే చాలన్నారట.
తూమాటి సంజీవరావు సంస్కృత శబ్దాల విషయంలో ఎక్కువ చెప్పారు. తెలుగు మాటల విషయంలో కూడా వారు రచనలు కొన్నిచేస్తే అవీ ఉపయోగకరంగా ఉంటాయి. తెలుగు భాష అంటే అలుసుగా చూడకుండా ఉండడానికి ఇటువంటి పుస్తకాలు అవసరం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విచ్చిన పూరేకుల జీవన సౌందర్య నాదం

విచ్చిన పూరేకుల జీవన సౌందర్య నాదం

  • -మల్లెల నరసింహమూర్తి
  • 06/12/2014
TAGS:

పూలండోయ్ పూలు కవిత్వ సంకలనం చదివిన ప్రతి రసహృదయుడూ ఒక రంగుల ప్రపంచం లాంటి ప్రసిద్ధ చిత్రకారుని ‘ఆర్ట్‌గ్యాలరీ’లోకి వెళ్లి వర్ణనకు భాష చాలని ఒక అద్భుత ‘వర్ణానుభూతిని’ పొంది తన్మయత్వంతో వెలుపలికి వస్తాడనటంలో సత్యసౌందర్య పూర్వకమైన సాహిత్య ప్రమాణమున్నది. బహుశ మనం సాధారణంగా అలవాటుపడ్డ Verbal expression కవి ప్రసాదమూర్తి “heightened emotions’ ని అంధుకోవడానికి, అభివ్యక్తం చెయ్యడానికి చాలా సిమితమైన మార్గంగా అగుపిస్తుంది. అతని కళాత్మక అనుభూతి పూలతోటల్లోకి సీతాకోక చిలుకలై ఎగిరిపోవాల్సిందే.
సుప్రసిద్ధ సాహితీవేత్త సోమసుందర్‌గారు ప్రసాదమూర్తి కవిత్వంలో ప్రసాద గుణం స్పష్టంగా కనిపిస్తుంది అని, విశిష్ట కవి అని అభినందించారు. ప్రసాదమూర్తి సహజంగానే సౌజన్యమూర్తి, భావుకుడు, సౌందర్యోపాసకుడు, ప్రకృతి ఆరాధకుడు, సాత్వికుడు, సదాసంచారి, సత్యానే్వషి, సంఘమిత్రుడు, ఉలిపట్టని కవిశిల్పి.
‘పూలండోయ్ పూలు’ కవిత్వాన్ని ‘చిత్రచిత్రాలు’గా రంగురంగులుగా, నది పాయలు పాయలుగా చదువుతూ, అనుభూతి చెందుతూ ఉంటున్నప్పుడు ఒక అనిర్వచనీయమైన తాదాత్మ్యంలోకి వెళదాం. చైనా దేశపు తాత్త్విక పరిభాషలో ‘తావోయిజం’ పదజాలంలో అక్షరీకరించాలంటే అదొక “Transcendental consciousness’.
‘పూలండోయ్ పూలు’ కవిత ఇటీవల తెలుగు కవిత్వంలో వచ్చిన “the most melodious, magical, mesmerising and enchanting poem గా సహృధయుల్ని సమ్మోహపరిచింది. తన్నుతాను గానం చేసుకుంటూ, సరసుల హృదయ సరస్సుల్లోనే, హంసలా భావతరంగ మాలికలపై డోలలూగుతున్నది.
ఈ కవితలో ఈ చరణాలు.. ప్రసాదమూర్తి విలక్షణమైన ఊహాశక్తికి అద్దం పడుతున్నాయి.
‘‘మనుషులంతా పువ్వులైపోయినట్టు..,
పువ్వులు మనుషుల్ని మూటలుగట్టి
మంచికీ, మానవత్వానికీ మధ్య,
ఆదానప్రదానాలు చేస్తున్నట్టు..,
పై చరణాల్లోంచి ఒక సారాంశాన్ని పిండుకోవడానికి వీలుంది. కవిత్వ కళ ఆత్మకళగా, హృదయ కళగా విమర్శ పరిభాషలో ప్రస్తావించబడుతూ వుంటుంది. అది మనిషిని తన అంతస్సీమలలో గూడుకట్టుకున్న చీకటి నుంచి తేజస్సుదిశగా ప్రస్థానం సాగింపచేసే కళాత్మక సాధనం. మనిషిలోని negative impulses, క్రూరత్వం, ధ్వేషం, అసూయల్ని సమూలంగా ‘ప్రక్షాళన’ చేసి, వాటి స్థానంలో నిష్కళంక ప్రేమ, అవ్యాజమైన కరుణ, మైత్రి వంటి positive emotionsని ప్రతిష్టించే సంస్కారోన్నత ప్రక్రియ. దీనినే (catharisis (purgation) కెథారిసిస్ అని ప్రసిద్ధ గ్రీకు సాహిత్య తత్త్వవేత్త అరిస్టాటిల్ విశే్లషించాడు.
ప్రసాదమూర్తిపై కవితలోనే ‘పరమార్థం’ అనే మాటలో టాల్‌స్టాయ్ భావన “poetic justice’ ద్వారా నీతిబద్ధత, ధర్మాచరణ, మానవతాదీప్తి స్ఫూర్తిని ప్రతిష్టించగలడు అన్న భావన అంతర్గతంగా ప్రవహిస్తున్నది.
ఈ కవితలో మరొక విలక్షణత కనిపిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని మనిషి తనకు సంబంధించి కేవల పదార్థంగా కాకుండా దాన్ని తనలో పెనవేసుకున్న మానవీయ సంబంధాల్లోంచే చూస్తాడు. కనుక సాహిత్యం ఎప్పుడైనా మానవ సంబంధాలకు అతీతంగా బాహ్యప్రపంచాన్ని దర్శించలేదు. తత్త్వానేషణకు ప్రయత్నించదు. సాహిత్యంలో హృదయపరమైన, నిర్మలమైన, నిసర్గమైన ఊహలకు ఉన్నతమైన స్థానం కలదు. అదే కళాత్మక స్థానం. ఈ ప్రక్రియలోనే బాహ్యప్రకృతి మానవీకరణ చెందింది. ప్రాచీన సాహిత్యంలో నదులు జవనాశ్వాలుగా, పరుగెత్తే గోవులుగా పోల్చబడ్డాయి. కవుల సృజనల్లో నదులు, సముద్రాలు మానవీకరణ చెందాయి.
ఇక్కడ ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ కవితలో విలక్షణంగా, మనుషులంతా పువ్వులైనట్లుగా భావించాడు. మానవులు వాళ్లకంటే ఉదాత్తమైన, ప్రేమ పాత్రమైన సుమనోహరమైన, సుకుమారమైన పువ్వులుగా రూపాంతరం చెందారు. అంటే మనుషులు పుష్పీకరణ చెందారు అనవచ్చునేమో. ప్రసాదమూర్తి భావన ప్రకారం మానవత్వం కన్నా పూలతనం (పుష్పతనం) (Flowerliness) మరింత ఉదాత్తమైనది. మానవ సహజం తనకుతాను ఒంటరితనంతో కుంచించుకుపోకుండా సామూహికత్వాన్ని పొందాలి. తద్వారా మానవ సంబంధాలు బలపడతాయి. అదే మానవప్రగతి. మనిషిని మరొక మనిషికి మరింత సమీపానువర్తిగా చేయటంలో దోహదపడటమే సాహిత్యంయొక్క అంతిమ లక్ష్యం. మానవ జీవితాన్ని మరింత సంస్కారవంతంచేసి, ఉత్తమంగా ఉన్నతీకరించడం సాహిత్యంయొక్క ఉదాత్తమైన బాధ్యత. ఈ సామాజిక సత్యం తెలిసినవాడు సాహిత్య సూత్రం కమ్యూనిజం, హ్యూమనిజం ద్వారా అధ్యయనం చేసినవాడు కనుకే ప్రసాదమూర్తి.
కవి ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ కావ్యంలో ఎన్నో కవితలు, అమ్మ పుట్టినరోజు, వాన, వాన, వాన, చిలకల రైలు డబ్బా, చెల్లి అమెరికా యాత్ర, పురాప్రియురాలు మొ… అన్నీ ఈ కవిచిత్రకారుని కవిత్వ చిత్రశాల (పొయెట్రీ ఆర్ట్‌గ్యాలరీ)లో కళాఖండాలు. మాలాంటి కరువుసీమలో వజ్రకరూరు వజ్రాల్లాంటి వడ్లగింజలు, సన్నబియ్యపు గింజల లాంటి వాన చినుకులు, కవి చిత్రకారుడు (Poet Painter) ప్రసాదమూర్తిగారి “Rare collection of poetry paintings”.
ఫ్రసాదమూర్తి కవిత్వ నిర్మాణ పద్ధతి ఒక చిత్రకారుడు దృశ్యాన్ని కళ్లద్వారా మనసులోకి ఒంపుకునే ధ్యాన మార్గం. శిల్పిశిల్పాన్ని మలిచే ముందు సంభావించిన శిల్పానికి అనుగుణమైన శిలను ఉలితో హస్తస్పర్శతో పరిశీలించే నిపుణత్వం. నైశిత్యం.
అందుకే చివరగా ప్రసిద్ధ చిత్రకారుడు పి.మోహన్ ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు డావిన్సీ, మొనాలిసా చిత్ర రచననుచేసే రసాత్మక సౌందర్య సమయ వర్ణన ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
‘‘డావిన్సీ నవ్వుతూ కుంచెను, రంగుల పలకను అందుకున్నాడు. ఈజిల్‌పై అప్పటికే కొంత ఆవిష్కృతమైన మోనాలిసా వర్ణచిత్రాన్ని నిశితంగా చూశాడు. కుంచెను లేత గోధుమ, రోజా రంగులను కొద్దిగా అద్దుకుని పలకపైనే వాటిని కలిపాడు. మోనాలిసా ముఖంపై ఆవరించిన వెంటాడే నవ్వును, వెలుగునీడలను కళ్లలోకి ఆవాహన చేసుకున్నాడు. తూలికాచాలనం మొదలైంది. అందులోంచి సౌందర్యోపాసనానాదం మంద్రంగా విస్తరిస్తోంది. మోనాలిసా మనోదేహాలు అతని కుంచెలో రంగుల స్నానంచేసి తడితడిగా చిత్రంలోకి ఒదిగిపోతున్నాయి.’’
ఈ వర్ణనతో పొయెట్ పెయింటర్, అనే్వషి, సంచారజీవి ప్రసాదమూర్తిగారిని నిండు గుండెతో అభినందిస్తూ. మనసున మల్లెల మాలలూగుతూ ఉండగా, అతని కవిత్వపు కర్పూర వెనె్నలలో కరిగిపోతా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెయ్యి వారాలు లేజాయేంగే

వెయ్యి వారాలు లేజాయేంగే

  • 07/12/2014
  • — ఆదిత్య

* ఊరూరా ప్రభంజనమే.. ఓ తీర్థానికో, ఓ పుణ్యక్షేత్రానికో వెళ్తున్నట్లు కుటుంబాలకు కుటుంబాలు ఎడ్లబండ్లు కట్టుకుని మరీ ఆ సినిమా చూసేందుకు తరలి వెళ్లేవారట! ఎన్టీఆర్, అంజలీదేవి ఎక్కడ కనిపించినా వారిని ‘సీతారాములు’గానే భావించి మంగళహారతులు పట్టేవారు.. ‘తెలుగింటి సీత’ అంజలీదేవి ఎదురైతే చాలు- ‘ఎన్ని కష్టాలు పడ్డావు తల్లీ..’ అని కన్నీళ్లు పెట్టుకునేవారట! 1963లో తెలుగునాట ‘లవకుశ’ విడుదలైనపుడు ఎక్కడ చూసినా ఇలాంటి ముచ్చట్లే.. *** * మొట్టమొదటి ‘సంపూర్ణ తెలుగు టాకీ’గా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ‘భక్తప్రహ్లాద’ సినిమా 1932లో మద్రాసులోని ‘నేషనల్ పిక్చర్ ప్యాలెస్’లో విడుదలైంది.. ‘ప్రేక్షకులచే హాలు క్రిక్కిరిసి పోవుచున్నది.. గనుక ముందుగా స్థలము కొరకై జాగ్రత్త పడుడు.. ఈ 100% సంపూర్ణ తెలుగు టాకీ చూచు యవకాశము పోగొట్టు కొనకుడు..’ అంటూ అప్పట్లో ఇచ్చిన ప్రకటనలు- సినిమాల పట్ల జనాలకు ఎంత మోజుందో చెప్పకనే చెబుతాయి… *** * భారతీయ చలనచిత్ర పితామహుడు దాదా ఫాల్కే మొదటి ప్రపంచ యుద్ధం చివరి దశలో తన రెండో చిత్రం ‘లంకాదహన్’ (1917) ఎన్నో వ్యయప్రయాసల నడుమ పూర్తి చేశారు.. ఆ సినిమా విడుదలైనపుడు టిక్కెట్లకు అంచనాలకు మించి డిమాండ్.. కౌంటర్ల వద్ద అదుపుచేయలేనంతగా జన సందోహం.. మామూలు ప్రదర్శన వేళలతో ఇక లాభం లేదని భావించి బొంబాయిలోని ‘వెస్ట్‌ఎండ్’ థియేటర్ యాజమాన్యం ఉదయం నుంచి సాయంత్రం చీకటిపడే వరకూ వరుసగా ఆటలు ప్రదర్శించినా తగ్గని ప్రేక్షక జనం.. దూరప్రాంతాల నుంచీ జనం తండోపతండాలుగా రావడంతో థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఎటుచూసినా ఎడ్లబండ్లే.. ఇదే ‘లంకాదహన్’ను చూసేందుకు పూణెలోని ‘ఆర్యన్’ థియేటర్‌లోకి జనం తలుపులు బద్దలు కొట్టుకుని లోనికి చొచ్చుకుపోయినంత సాహసం చేశారట! మద్రాసులో ఈ సినిమా ప్రదర్శించినపుడు భారీగా వచ్చిన వసూళ్లను ఎడ్లబండిపై పెట్టుకుని పోలీసుల కాపలాతో తరలించారట! *** ఒక సినిమా నూరు రోజులు ఆడితేనే గొప్ప వేడుక చేసుకుంటారు అభిమానులు… అదే సినిమా ఏళ్లు, దశాబ్దాలు పూర్తి చేసుకుంటే యావత్ భారతీయ సినీ ప్రేక్షకులకూ అరుదైన సంబరమే… ఒక సినిమా తొలిసారి చూసిన అనుభూతే- ఇరవయ్యోసారి చూసినా కలిగిందంటే, ముప్ఫయి ఆరోసారి ఇంకాస్త కొత్తగా అనిపించిందంటే, ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందంటే- నిస్సందేహంగా ఆ సినిమాను ‘క్లాసిక్’ అనక తప్పదు. అచ్చంగా అలాంటి సినిమా- ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’. చాలా చిత్రాలు సాదాసీదాగా ఉంటూ కాలగర్భంలో కలిసిపోతాయి. కొన్ని మాత్రమే జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని, రాబోయే సినిమాలకు దిశానిర్దేశం చేస్తాయి. ఎన్ని వేల సినిమాలు వచ్చినా తమ ప్రత్యేకతను పదిలంగా నిలబెట్టుకుంటాయి. 1995 అక్టోబర్ 20న దేశ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించిన ‘దిల్‌వాలే..’ను ఇప్పటికీ ముంబైలోని ‘మరాఠా మందిర్’ థియేటర్‌లో నిరాటంకంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ నెల 12వ తేదీ నాటికి అక్షరాలా ‘వెయ్యి వారాల’ ప్రదర్శన పూర్తికాబోతోంది.. అందుకే ఈ శతాబ్దపు అద్భుత చలన చిత్రంగా ఇది కొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలైనపుడు ఇంతటి సంచలనాత్మక విజయం సాధిస్తుందని, వెయ్యి వారాల సుదీర్ఘ ప్రదర్శనతో ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దర్శక,నిర్మాతలు ఊహించి ఉండరు! ఎన్నిసార్లు చూసినా… టీవీ ముందు కూర్చుని చేతిలో రిమోట్ కదులుతూంటే- అనుకోకుండా ఏదో ఒక చానల్‌లో ‘దిల్‌వాలే..’ తగులుతుంది… ఎప్పుడో చూసిన సినిమా అయినా మనం దృష్టి మరల్చుకోలేం.. సరదాగా కొద్దిసేపు చూసి మరో చానల్‌కు వెళ్లామనుకుంటాం.. అయితే- ఆ సంగతే మరచిపోతాం… సన్నివేశాలు మారుతుంటాయి.. సమయం గడిచిపోతుంటుంది.. ఆ సినిమాలో మమేకమైపోతాం.. ‘శుభం’ కార్డు పడేవరకూ అప్రయత్నంగానే సినిమా చూసి ఆస్వాదిస్తాం.. ప్రతిసారీ ఇదే విధమైన అనుభూతి.. ఎనే్నళ్లు గడిచినా ఇలాంటి అనుభవమే.. ఇదీ- ‘దిల్‌వాలే..’ ఘనత! ‘యశ్‌రాజ్ ఫిలింస్’ నిర్మాణంలో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటించగా నిర్మించిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ ప్రేమకథా చిత్రాల్లో కలికితురాయిగా నిలిచింది. టీనేజీ ప్రేమకథలను వెండితెరపై ఎంత అద్భుతంగా, రసరమ్యంగా ఆవిష్కరించవచ్చో నిరూపించిన ఈ సినిమా ఇప్పటి తరానికి ‘మార్గదర్శి’గా నిలిచింది. కొన్ని పాత్రలు కొందరి కోసమే పుట్టాయని అనిపిస్తుంది. ఆ పాత్రల్లో మరొకరిని ఊహించలేం. ఈ సినిమాని వేరే నటీనటులతో మళ్లీ నిర్మించినా ‘రీ ప్లేస్‌మెంట్’ ముమ్మాటికీ అసాధ్యం. ఇంత గొప్పగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మెప్పించినందునే ఈ సినిమా భారతీయ చలనచిత్ర సీమలో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. అచ్చమైన ప్రేమకథ… ‘దిల్‌వాలే..’లో ప్రేమజంట రాజ్ (షారుఖ్), సిమ్రన్ (కాజోల్)లను చూస్తున్నంత సేపూ మన ఇంటి పక్కనే- మనకు తెలిసిన ఓ అమ్మాయి, అబ్బాయిని చూసిన అనుభూతిని పొందుతాం. అచ్చమైన ప్రేమకథతో కుటుంబ నేపథ్య చిత్రాలకు ఇది ప్రేరణగా నిలిచింది. సరదా ఇతివృత్తం, గిలిగింతలు పెట్టే ప్రేమ సన్నివేశాలు, హాయిగా సాగే కామెడీ, హృదయాలను బరువెక్కించే దృశ్యాలే లేని కథనం, మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురమైన పాటలు, కమ్మటి నేపథ్య సంగీతం, అలరించే విదేశీ లొకేషన్లు… ఇవన్నీ సమపాళ్లలో సమకూరి ప్రేక్షకుల్ని మెప్పించాయి, మత్తెక్కించాయి, మైమరపించాయి.. విమర్శకుల ప్రశంసలనూ అందుకున్నాయి.. ఎన్ని వసంతాలు గడిచినా ఈ సినిమాను నిత్యనూతనంగా నిలబెట్టాయి.. తరాలు మారినా తరగని వినోదం అందించాయి.. టీనేజీ యువత ప్రేమకు సంబంధించిన కథే అయినప్పటికీ- వైవిధ్య భరితంగా కథనం సాగిన తీరు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక, కథ గురించి చెప్పాలంటే- సెలవుల్లో విదేశీ పర్యటనకు వెళ్లిన యువజంట రాజ్, సిమ్రన్ అక్కడ అనుకోని రీతిలో కొన్ని సంఘటనలను ఎదుర్కొంటారు. ఆ నేపథ్యంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది ప్రేమగా చిగురిస్తుంది. సిమ్రన్ తల్లిదండ్రులను మెప్పించి, ఒప్పించి చివరికి ఆమెకు మూడుముళ్లు వేసి హీరో విజయం సాధిస్తాడు. తండ్రి చూసిన వరుడికి బదులు రాజ్‌నే ఆమె పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. సంప్రదాయ బద్ధమైన రెండు కుటుంబాలకు చెందిన పెద్దల మనసులను గెలిచి, ఎన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి హీరో,హీరోయిన్లు తమ ప్రేమను సాకారం చేసుకుంటారు. విదేశాల్లో ఉంటున్న భారతీయ కుటుంబ నేపథ్యాన్ని బాలీవుడ్‌కు పరిచయం చేసిన సినిమాగా ‘దిల్‌వాలే..’ చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రేమ సన్నివేశాలే కాదు, అమెరికా, స్విట్జర్లాండ్, భారత్‌లో అద్భుత ప్రకృతి దృశ్యాలు ఇందులో కనువిందు చేస్తాయి. 1995 అక్టోబర్ 20న ఈ సినిమా విడుదలైనపుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ విశే్లషకులు సమీక్షలు చేసి నటీనటులను, దర్శక నిర్మాతలను పొగడ్తలతో ముంచెత్తారు. బాలీవుడ్‌లో అత్యధిక స్థాయి వసూళ్లను సొంతం చేసుకున్న రెండో చిత్రంగా ‘దిల్‌వాలే..’ నిలిచింది. (సల్మాన్ ఖాన్ నటించగా 1990లో విడుదలైన ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ అత్యధిక వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది.) ప్రపంచంలోనే వంద కోట్ల రూపాయలు వసూలు చేసిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. పది ‘్ఫల్మ్‌ఫేర్’ అవార్డులతో పాటు ‘ఉత్తమ వినోదాత్మక చిత్రం’గా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. వందేళ్ల కాలంలో అభిమాన సినిమా… భారత్‌లో సినీ పరిశ్రమ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయన సందర్భంగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ఆన్‌లైన్ సంస్థ ‘సనోనా’ నిర్వహించిన సర్వేలో అధికశాతం మంది తమ అభిమాన చిత్రంగా ‘దిల్‌వాలే..’ వైపు మొగ్గు చూపారు. ‘రొమాంటిక్ కామెడీ’గా ఇంతగా అలరించిన భారతీయ సినిమా మరొకటి లేదని ఆన్‌లైన్ సర్వేలో తేలింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక వెబ్‌సైట్లలోనూ ఈ సినిమా అగ్రభాగాన నిలిచింది. బాలీవుడ్ సినీ నిర్మాతల్లో దిగ్గజమైన యాశ్ చోప్రా కుమారుడైన ఆదిత్య చోప్రా ఈ సినిమాకు కథను రూపొందించి దర్శకత్వం వహించారు. షారుఖ్, కాజోల్ నటనతో పాటు జ తిన్-లలిత్ అందించిన స్వరాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. విదేశాల్లో చిత్రీకరించినప్పటికీ అప్పట్లో కేవలం నలభై మిలియన్ల రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించారు. బాలీవుడ్‌లో ‘ఆల్ టైమ్ క్లాసిక్’లుగా నిలిచిన మొదటి పది సినిమాల్లో ఇది ప్రథమ స్థానంలో నిలిచింది. రాజ్‌కపూర్ నిర్మించిన ‘ఆవారా’ (1951), మెహబూబ్ ఖాన్ రూపొందించిన ‘మదర్ ఇండియా’ (1957), రమేష్ షిప్పీ సృష్టించిన ‘షోలే’ (1975) సినిమాలను వెనక్కి నెట్టేసిన ఘనత ‘దిల్‌వాలే…’కే దక్కింది. షారుఖ్‌కు అనుకోని ఛాన్స్… ‘రాజ్’గా మెప్పించిన షారుఖ్ ఖాన్‌కు ఈ సినిమాలో అనుకోని రీతిలో హీరో పాత్ర లభించింది. మొదట హీరో పాత్రకు సైఫ్ అలీఖాన్‌ను ఎంపిక చేయాలని ద ర్శక, నిర్మాతలు భావించారు. ఆ తర్వాత ఊహించని విధంగా షారుఖ్‌ను ఎన్నుకున్నారు. తన 30వ జన్మదినం ముందు విడుదలైన ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదని, తన నట జీవితంలో మైలురాయిలా నిలుస్తుందని అనుకోలేదని షారుఖ్ ఇప్పటికీ చెబుతుంటాడు. ఇందులో ఆయన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతుంటాయి. నట దిగ్గజం రాజ్ కపూర్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇందులో హీరో పేరును ‘రాజ్’గా దర్శకుడు ఆదిత్య చోప్రా ఖరారు చేశారు. ప్రఖ్యాత నటుడు అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ ఈ సినిమాకు పేరును సూచించారు. అనుపమ్ ఈ సినిమాలో షారుఖ్ తండ్రిగా నటించారు. ఇలాంటి మరెన్నో ప్రత్యేకతలు ‘దిల్‌వాలే..’కు ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. టీవీ నటి మందిరా బేడీ ఈ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. ఇందులో ఆమె షారుఖ్‌ను ప్రేమిస్తుంది. అయితే, షారుఖ్ మాత్రం కాజోల్ వెంటపడతాడు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ షారుఖ్ స్నేహితుడిగా నటించారు. ఈ సినిమా పాటల కోసం సుదీర్ఘ కాలంపాటు కసరత్తు జరిగింది. గీత రచయిత ఆనంద్ బక్షీ, సంగీత దర్శకులు జతిన్-లలిత్‌లను విసిగించి మరీ పాటలన్నీ అద్భుతంగా వ చ్చేలా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత షారుఖ్‌కు భారత్‌లోనే కాదు విదేశాల్లో సైతం అభిమానుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. బాలీవుడ్‌కు సంబంధించి ఉత్తమ ‘వెండితెర జంట’గా షారుఖ్-కాజోల్ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ ఇద్దరిలాగే ప్రేమలో విజయం సాధించాలన్న తపన ఎంతోమంది యువతీ యువకుల్లో మొదలైంది. టీనేజీ ప్రేమికులంతా తమను షారుఖ్, కాజోల్‌తో పోల్చుకోవడం ఈ సినిమాతో ప్రారంభమైంది. ఎన్ని అవాంతరాలు, వైరుధ్యాలు ఉన్నా ప్రేమకు అవి అడ్డుగోడలు కావని, ప్రేమదే అంతిమ విజయం అని భావించే యువత సంఖ్య పెరిగింది. దశాబ్దాలు గడిచినా ‘రాజ్,సిమ్రన్’ పాత్రలు నిజమైన ప్రేమకు ప్రతీకలుగా నిలిచిపోయాయి. కొత్త ట్రైలర్ విడుదల… ఈ నెల 12 నాటికి వెయ్యి వారాల ప్రదర్శన పూర్తవుతున్న సందర్భంగా ‘దిల్‌వాలే..’ కోసం సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. ప్రపంచ చరిత్రలోనే సుదీర్ఘ కాలం పాటు ఆడుతున్న సినిమాగా అద్భుత రికార్డును సృష్టించిన సందర్భాన్ని పురస్కరించుకుని ట్రైలర్‌ను విడుదల చేసినట్లు ‘యశ్‌రాజ్ ఫిలింస్’ సంస్థ ప్రకటించింది. * ‘మరాఠా మందిర్’ మాయాజాలం.. ముంబైలోని ‘మరాఠా మందిర్’లో 1995 అక్టోబర్ 20 నుంచి నిరాటంకంగా నడుస్తున్న ‘దిల్‌వాలే…’ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదే ముంబైలోని మినర్వా థియేటర్‌లో అమితాబ్, ధర్మేంద్ర నటించిన ‘షోలే’ (1975 నుంచి 1980 వరకూ) అయిదేళ్ల పాటు నడిచింది. ఆ రికార్డును ‘దిల్‌వాలే..’ ఏనాడో అధిగమించడంతో ‘మరాఠా మందిర్’ దేశ వ్యాప్తంగా చిరపరిచితమైంది. చాలాకాలం రోజుకు నాలుగు ఆటలుగా నడిచినా, కొన్నాళ్లుగా ఉదయం ఆటకే దీన్ని పరిమితం చేశారు. ఇప్పటికీ ప్రతి రోజూ సగటున 50 శాతం వరకూ సీట్లు నిండిపోతాయని, వారాంతాల్లో, సెలవుదినాల్లో మాత్రం ‘హౌస్ ఫుల్’ అవుతుందని ‘మరాఠా మందిర్’ యాజమాన్యం చెబుతోంది. షారుఖ్, కాజోల్‌తో పాటు బాలీవుడ్ నటీనటులెందరో ఈ థియేటర్‌కు వస్తుంటారు. 100 వారాలు, 500 వారాలు, 700 వారాలు గడిచిన సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు జరిపారు. కూలీలు, గృహిణులు, మధ్య తరగతి వారు, గృహిణులు, విద్యార్థులు … ఇలా అన్ని వర్గాలకు చెందిన వారూ ఇప్పటికీ థియేటర్ వద్ద ‘క్యూ’ కడుతుంటారు. ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా తమకు కొత్తగానే ఉంటుందని వారు చెబుతుంటారు. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో పోర్టర్లు (కూలీలు) ఖాళీ దొరికినపుడల్లా దీన్ని చూస్తుంటారు. ఈ సినిమాను 80-90 సార్లు చూసినవారు కూడా తమకు తెలుసునని థియేటర్ సిబ్బంది చెబుతుంటారు. రైల్వే స్టేషన్‌కు, బస్ స్టేషన్‌కు, మంచి రెస్టారెంట్లకు సమీపంలో ఉన్నందున మరాఠా థియేటర్‌కు వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ థియేటర్‌లో ఏసీ, సౌండ్ సిస్టమ్, సీటింగ్ తమకు నచ్చుతాయని ప్రేక్షకులు ఎగబడుతుంటారు. టిక్కెట్ ధరలు కూడా అందుబాటులో ఉండడంతో ఈ థియేటర్‌లో సినిమా చూసేందుకు పేద, మధ్య తరగతి ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు. ఇదే థియేటర్‌లో 1953లో విడుదలైన ‘మొఘల్-ఇ- అజామ్’ నాలుగేళ్లు నడిచిందని పాతతరం వారు గుర్తు చేస్తుంటారు. షాగిర్డ్, జానీ మేరా నామ్, ఇత్త్ఫోక్, ఖిలాడీ, కర్మ, ధరమ్ కాంటా, మిస్టర్ ఇండియా, కూలీ నెంబర్ 1, సర్ఫ్‌రోష్, గదర్- ఏక్ ప్రేమ్ కథ వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఇదే థియేటర్‌లో ప్రదర్శించారు. లాభాలు లేకున్నా.. కొన్నాళ్లు కలెక్షన్ల కనక వర్షం కురిసినా, ఇటీవలి కాలంలో లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నామని ‘మరాఠా మందిర్’ మేనేజర్ మనోజ్ దేశాయ్ చెబుతున్నారు. సినిమా ప్రదర్శనకు సంబంధించి నెలకోసారైనా యశ్‌రాజ్ ఫిలింస్ ప్రతినిధులతో తాము సమావేశమవుతుంటామని ఆయన తెలిపారు. వెయ్యి వారాలు పూర్తవుతున్న సందర్భంగా భారీ ఎత్తున వేడుకలు జరిపే విషయమై ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని ఆయన అంటున్నారు. హీరో, హీరోయిన్లు షారుఖ్, కాజోల్‌తో పాటు దర్శక, నిర్మాతలతో చర్చించి వేడుకలను నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని దేశాయ్ చెప్పారు. వెయ్యి వారాల అనంతరం ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అవకాశం ఉన్నంత వరకూ ఈ సినిమాను ప్రదర్శించాలని దర్శకుడు ఆదిత్య చోప్రా, తాను కలిసి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 11-30 గంటలకు ఒక ఆట మాత్రమే ప్రదర్శిస్తున్నామని, మిగతా మూడు షోలు వేరే సినిమాలు నడుస్తాయని ఆయన చెప్పారు. ‘ఆట’ల్లో మేటి.. ఈ చిత్రాలు.. బాలీవుడ్‌లో ఎక్కువ ఆటలు ప్రదర్శించిన పది అగ్రశ్రేణి సినిమాల్లో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘టాప్ టెన్’ జాబితా ఇలా ఉంది.. 1. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995) – ఇప్పటికీ ఆడుతోంది. నటీనటులు: షారుఖ్ ఖాన్, కాజోల్, అమ్రిష్ పురి, అనుపమ్ ఖేర్ దర్శకుడు: ఆదిత్య చోప్రా 2. షోలే (1975) – 286 వారాలు (5 ఏళ్లు) నటీనటులు: అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని, సంజీవ్ కుమార్ దర్శకత్వం: రమేష్ షిప్పీ 3. మొఘల్-ఇ-అజామ్ (1960) – 150 వారాలు ( 3 ఏళ్లు) నటీనటులు: పృథ్వీరాజ్ కపూర్, మధుబాల తదితరులు దర్శకత్వం: కె.ఆసిఫ్ 4. కిస్మత్ (1943)- 150 వారాలు – ( 3 ఏళ్లు) నటీనటులు: అశోక్‌కుమార్, ముంతాజ్, షాన్‌వాజ్ దర్శకత్వం: జ్ఞాన్ ముఖర్జీ 5. బర్సాత్ (1949)- 100 వారాలు నటీనటులు: రాజ్ కపూర్, నర్గీస్, ప్రేమ్‌నాథ్ దర్శకత్వం: రాజ్ కపూర్ 6. మైనే ప్యార్ కియా (1989)- 50 వారాలు నటీనటులు: సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ దర్శకత్వం: సూరజ్ ఆర్ బర్జాత్యా 7. కహోనా ప్యార్ హై (2000) 50 వారాలు నటీనటులు: హృతిక్ రోషన్, అమీషా పాటిల్ దర్శకత్వం: రాకేష్ రోషన్ 8. హమ్ ఆప్‌కే హై కౌన్ ( 1994)- 50 వారాలు నటీనటులు: సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ దర్శకత్వం: సూరజ్ ఆర్ బర్జాత్యా 9. మహాబతీన్ (2000)- 50 వారాలు నటీనటులు: అమితాబ్, షారుఖ్ ఖాన్, ఉదయ్ చోప్రా దర్శకత్వం: ఆదిత్య చోప్రా 10. రాజా హిందుస్థానీ (1996)- 50 వారాలు నటీనటులు: అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ దర్శకత్వం: ధర్మేష్ దర్శన్ విసుగన్నదే లేదు.. ‘దిల్‌వాలే..’ సినిమాను ఇన్నాళ్లుగా ప్రదర్శిస్తున్నా తన పనికి సంబంధించి విసుగన్నదే లేదని ‘మరాఠా మందిర్’లో ప్రధాన ప్రొజెక్టర్ ఆపరేటర్ జగ్జీవన్ మారు అంటున్నారు. నలభై ఏళ్లుగా ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, దాదాపు 19 ఏళ్లుగా ‘దిల్‌వాలే..’కు రీళ్లు మార్చే పనిలో ఉన్నా ఏనాడూ విసుగు పుట్టలేదని ఆయన అంటున్నారు. ఇప్పటికీ ఆయనే స్వయంగా రీళ్లను ఎక్కించే పని చేస్తుంటారు. తక్కువ మొత్తంలో టిక్కెట్ ధరలు, సంతృప్తికరమైన సీటింగ్ వంటి కారణాలతో తమ థియేటర్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోందని ఆయన అంటున్నారు. ముంబై నగరాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు చాలామంది ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతుంటారని ఆయన తెలిపారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పక్కింటి మీనాక్షమ్మ – కథ

పక్కింటి మీనాక్షమ్మ – కథ

  • 07/12/2014
TAGS:

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక రిలాక్స్‌గా సోఫాలో కూర్చుని ‘ఒసేవ్! ఆండాళ్లూ! కాఫీ పట్రా’ అంటూ కేకపెట్టాడు సదాశివం. ‘ఆ! వస్తున్నానండీ..’ అంటూ స్టౌ దగ్గర కాఫీ కలుపుతూ అక్కడే నిలబడి ‘పక్కింటి మీనాక్షమ్మను చూశారా? వాళ్లాయన కొనిచ్చే నగలు నట్రా చూశారా? మీరూ ఉన్నా రు, ఎందుకు? ఓ ముద్దూలేదు, ముచ్చటా లేదు. ఊ.. ఊ..’ అంటూ ఏడుపు రాగంతో శోకగీతమాలపిస్తోంది.
‘ఇదిగో తెస్తానన్నది కాఫీ. ఇంకా తేలేదేమిటి? ఆ పాట ఎక్కడో రేడియోలో విన్నట్లుందే! టీవీలొచ్చాక రేడియో లెక్కడున్నాయి. అయినా మనింట్లో రేడియో లేదాయె!’ అంటూ సోఫాలో నుంచి లేచి వంటింట్లోకి వెళ్లి చూశాడు సదాశివం.
ఆండాళ్ మళ్లీ అదే పాట రిపీట్ చేస్తోంది. భర్తని చూడగానే చీర కొంగు నోటికి అడ్డంగా పెట్టుకుంది. శోకగీతం వాయిస్ మరికాస్త పెంచింది.
‘నువ్వా.. ఆ పాట పాడేది. ఎక్కడో రేడియోలో నుంచి వినిపిస్తోందనుకున్నాను. నేను నీ ముద్దూ ముచ్చట తీర్చటం లేదా? ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చాక నువ్వడిగినన్ని ముద్దులిస్తున్నానుగా! ఇంకా ఎందుకేడుస్తావు?’ కాస్తంత కటువుగానే కోప్పడ్డాడు.
‘ఓయబ్బో! మహా ఇచ్చారులే ముద్దులట! ముద్దులు!! ఊరికే ఇచ్చేవి, ఎన్నయినా ఇస్తారు’ మెటికలు విరిచింది ఆండాళ్లు.
‘మరైతే నీకేం కావాలంటావు? రేపటి నుంచి అవీ మానేస్తాను. ఏం కావాలో చెప్పు’ అని గద్దించాడు.
‘మన పెళ్లయినప్పటి నుంచి ఒక నగ కొన్నారా? చేతికి గాజులు చేయించారా? నడుముకి ఒడ్డాణం చేయించి పెట్టారా? మా పుట్టింటి వాళ్ళు పెట్టిన మెళ్లో ఈ తాడు తప్ప, మరేమైనా ఉన్నాయా? ఆ మీనాక్షిని చూడండి! మెడ నిండా ఎనె్నన్ని నగలు దిగేసుకుంటుందో..! రోజుకో పట్టుచీర కడుతుంది. ఇంటి నిండా ఖరీదైన సామానులున్నాయి. రోజూ నాకు చూపించి తెగ మురిసిపోతుంది’ పక్కింటావిడ చిట్టా విప్పింది ఆండాళ్.
‘ఓహో! అదా అసలు సంగతి. వాళ్లాయన అందరి దగ్గరా లంచాలు తీసుకొని రెండు చేతులా సంపాదిస్తాడు’ చిరాగ్గా అరిచాడు సదాశివం.
‘మీరూ ఆ పని చేయచ్చుగా! ఇందులో తప్పేముంది?’
‘లంచం తీసుకోవటం మహా నేరం. పట్టుబడితే ఇంతే సంగతులు. కటకటాలు లెక్కబెడుతూ కూర్చోవాలి. ఆ సంగతి నీకు తెలీదా?’ గద్దించాడు.
‘ఓ! మాగొప్పగా చెప్పొచ్చారులెండి. తెలివితేటలుంటే సరి. మీనాక్షి వాళ్లాయన చేయటం లేదా? నగలు చేయించటం చేతగాకపోతేసరి. కబుర్లకేం బాగానే చెప్తారు. పోనీలెండి! నా ఖర్మ ఇంతేననుకొని సరిపెట్టుకొంటాను. చేతగాని మొగుణ్ణి చేసుకుంటే ఏం లాభం?’ అంటూ ముక్కు చీదింది.
‘నేనేమైపోయినా ఫరవాలేదు. నీక్కావలసింది నగలే కదా! అలాగే చేయిస్తానులే’ అన్నాడు కోపంలోనూ కొంత శాంతించి. వారం రోజుల్లో మీనాక్షి వాళ్ల ఇంటి మీద ఏసిబి దాడులు జరిగాయి. ఇల్లంతా సోదాలు చేసి మీనాక్షి ఒంటి మీద నగలే కాకుండా అంతకుముందున్న పాత నగలు కూడా లెక్కలు చూపించి పట్టుకెళ్లిపోయారు. మీనాక్షి వాళ్ళాయన్ని పోలీసులొచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. మీనాక్షి ఏడుస్తూ చెప్పింది విషయమంతా ఆండాళ్‌కి.
‘పాపం! ఎంతపని జరిగిపోయింది. మీనాక్షిని చూస్తుంటే జాలేస్తోంది. ఖరీదైన వస్తువులన్నీ పట్టుకుపోయారు. నా అంత గొప్పవాళ్లు లేరని మీనాక్షి ఎగిరెగిరి పడింది. అంతాపోయాక ఇంట్లోంచి బయటికి రాలేక లోపలే కుమిలిపోతోంది. తప్పుచేస్తే శిక్ష పడాల్సిందే మరి. మా వారికి ఆ గతి పట్టకూడదు. పాపిష్టిదాన్ని. నగల కోసం ఆయన్ని లంచం తీసుకోమని పోరాను. నా భర్త నాకు క్షేమంగా ఉంటే చాలు’ అనుకుంటూ సమాధానపడింది ఆండాళ్లు.
సదాశివం ఇంట్లోకి వస్తూనే ‘ఆండాళ్ళూ..! చూశావా? నీ కోసం ఏంతెచ్చానో! త్వరగా రా!..’ అంటూ కేకలేశాడు.
అందమైన బాక్స్‌లో నుంచి ఎరుపు, తెలుపు రాళ్ల నెక్లెస్, పెద్ద హారం! బయటికి తీసి ఇవిగో నువ్వడిగినవి తెచ్చాను. రేపటి నుంచి అలక మానేయాలి సుమా! వంటింట్లో గినె్నలు విసిరికొట్టడం, నన్ను దూరం పెట్టటం మానుకోవాలి’ అంటూ నెక్లెస్ తీసి మెడలో వేయబోయాడు సదాశివం.
‘ఏమండీ! ఆ నగలు నాకొద్దండీ. మిమ్మల్ని జైలుకి పంపడం నాకిష్టం లేదండీ. ఆ మీనాక్షి గతి ఏమైందో తలుచుకుంటేనే బాధగా ఉంది. లంచం తీసుకుని కొన్న ఆ నగలు నాకొద్దండీ. బుద్ధితక్కువై అడిగాను. ముందా నగలు ఎక్కడకొన్నారో అదే షాపులో ఇచ్చి రండి’ ఏడుపు లంకించుకుంది ఆండాళ్లు.
‘ఇప్పటికైనా తెలిసిందా? తోటివాళ్లు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటానన్నదిట నీలాంటావిడ! పక్కింటి వాళ్లతో, ఎదురింటి వాళ్లతో మనల్ని పోల్చుకోకూడదు. నాగురించి నీకా భయం అక్కర్లేదులే! ఇది లంచం డబ్బుతో కొన్నది కాదు. మంచి బంగారం అసలే కాదు. ఒన్ గ్రాము గోల్డ్ నగలు. అచ్చం బంగారం లాగానే ఉన్నాయి. పెట్టుకో! భయమేమీ లేదు!! కావాలంటే ఇలాంటివి ఎన్నయినా కొనిపెడతాను’ అంటూ భార్య మెడలో నెక్లెస్ అలంకరించాడు సదాశివం. అద్దంలో చూసుకుని ‘చాలా బాగుందండీ. బంగారం లాగానే ఉంది కదండీ! మీరు ప్రేమతో నిజాయితీగా ఇచ్చిన గిల్ట్ నగలైనా చాలు. మీరెంత మంచివారు’ అంటూ భర్త ఎదపై వాలిపోయింది. మీనాక్షి తన భర్తతో కలిసి నాటకమాడిన సంగతి పాపం ఆండాళ్‌కి తెలియదు. అందుకు సంతోషించి ముసిముసిగా నవ్వుకున్నాడు సదాశివం.

తాటికోల పద్మావతి,
గుంటూరు.
మొబైల్ : 9441753376

మార్పు తెచ్చిన కాలం

చిన్ని కథ

కృష్ణలంకలో భగవతి గారింట్లో అద్దెకుండే రోజుల్లో వారి ఏకైక పుత్రరత్నం కులాంతర వివాహం చేసుకుని, ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చాడు. కొడుకుని క్షమించలేని ఆయన అరిచిఅరిచి గుండెపోటుతో పోయాడు.
‘సర్దుకుపోవడం రాలేదాయనకి’.. అంది భగవతి. కోడలిని కూతురిలా చూసుకునేది. ఆ పిల్ల కూడా నాకు అమ్మలేని లోటు అత్తగారు తీర్చారంటూ ఒకరిని ఒకరు పొగుడుకుంటూ వుండేవారు. ఆ అత్తాకోడళ్లని చూసి ముచ్చటపడ్డారు అందరూ. భవానీపురంలో ఇల్లు కొనుక్కుని వెళ్లిపోయారు. ఇరవై సంవత్సరాల తరువాత చందన బ్రదర్స్‌లో షాపింగ్ చేస్తూ.. ‘ఆ పిల్లని గుర్తుపట్టారా?’ అడిగింది మా ఆవిడ.
నాకు గుర్తురాలేదు. ‘్భగవతి గారి కోడలు’ అంది. ‘బొమ్మరిల్లు’ జెనీలియాలా వుండే పిల్ల ‘కితకితలు’ గీతాసింగ్‌లా మారిపోయింది. ముఖాన బొట్టు లేదు. అయినా మా ఆవిడ గుర్తుపట్టింది.
‘బాగున్నావా అమ్మా’ అని పలకరించి వాసు ఎక్కడ? అని అడిగింది. ‘యాక్సిడెంట్లో పోయారు’ పుల్లవిరుపుగా సమాధానం.
‘మీ అత్తగారు ఎలా వున్నారు?’ అని అడిగింది.
‘గుండ్రాయిలా వుంది.. తండ్రీకొడుకులిద్దరినీ మింగింది. నాకు బిపి, షుగర్, నన్ను కూడా..’ అంటూ ఆపేసింది.
గుడ్లప్పగించి చూస్తుండిపోయాం. మా ముందు నుంచే పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది.
‘ఆ అమ్మాయి అలా మాట్లాడుతోందేమిటి?’ తేరుకుని అడిగేను.
‘కాలం చాలా మార్పుల్ని తెస్తుంది. ఒకప్పుడు దేవతలాంటి అత్తగారు ఇప్పుడు దెయ్యాంలా కనిపిస్తున్నారామెకు’ అంది మా ఆవిడ.
‘మగవాళ్లిద్దరూ పోయారు. ఇంటికి తనే మహారాణినని అనుకుంటోంది. మొన్న సుశీలగారు కనిపించి ఆ ఇంటి విషయాలు చెప్పారు. తల్లీ, పిల్లలు పెద్దావిడని నానామాటలూ అంటారట. భగవతిగారు పూజగదిలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారట. ‘కుక్కకి వున్న విశ్వాసం ఈ మనిషికి లేదయ్యోయ్’ పాట వినిపిస్తోంది. అది ‘ఇలాంటి వాళ్లకి సరిపోతుంది’ అంది మా ఆవిడ బాధగా!

చావలి సూర్యం, కార్పొరేషన్ ఆఫీసు, విజయవాడ.

వెంటాడే పద్యం..

మూర్ఖంగా ప్రవర్తిస్తే మూడినట్లే..!

మకర ముఖాంతరస్తమగు మానికమున్ బెకలింపవచ్చు, బా
యక చలదూర్మికా నికరమైన మహోదది దాటవచ్చు, మ
స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు, మ
చ్ఛిక ఘటియించి మూర్ఖజన చిత్తముదెల్పన సాధ్యమేరికిన్!
మొసలి నోటిలో వున్న మాణిక్యాన్ని కష్టపడి బయటకు తీయవచ్చు. వీడకుండా వచ్చే మహోగ్రమైన అలలతో కూడిన సముద్రాన్నైనా దాటవచ్చు. కాలకూట విషాన్నిగక్కే పామునైనా మెడలో దండవలే ధరించవచ్చు. బుజ్జగించి గానీ, ఎన్ని మంచి మాటలు చెప్పినా గానీ మూర్ఖుడి మనసును లేశమాత్రమైనా మార్చలేము- అని ఈ పద్య భావము.
ఇది భర్తృహరి రాసినది. ‘సుభాషిత త్రిశతి’ పేరిట మూడు వందల శ్లోకాలను సంస్కృతంలో రాశాడు. దీన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణకవి, ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన రాశారు. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రాసినది. లోకంలోని నీతి రీతులను బోధిస్తూ ఎన్నో పద్యాలు రాశారు. కవి నీతిని, మానవీయ మూల్యాలను, సాంస్కృతిక విలువలను, సంఘ వ్యవస్థను తన పద్యాల్లో అపూర్వంగా ప్రబోధించారు
మానవుణ్ణి దివ్యునిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఈ పద్యం మానవునిలో ఉన్న అంతర్గత మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తుంది. వీరి శతకాల్లోని పద్యాలు ఒక్కో పద్యం ఒక్కో అనర్ఘ మహారత్నంగా భాసిల్లుతుంది. మానవుడు మూర్ఖత్వం వీడి జ్ఞానాన్ని పొందాలంటారు కవి. ఈ పద్యం చదువుతున్నప్పుడు విష్ణుశర్మ, చిన్నయసూరి పంచతంత్ర కథలు గుర్తుకు వస్తాయి. ఈ పద్యానికి ఉదాహరణగా చిన్ని కథ –
ఒక విపినములో ఒక జింక, నక్క, గాడిద, ఒక ఎలుగుబంటు స్నేహం చేస్తూ కలసిమెలసి కష్టసుఖాలు పంచుకుంటూ జీవిస్తుండేవి. జింక సాధు జంతువు. తను రోజూ అడవికి వెళ్లి వేటాడి తనకు దొరికిన ఆహారాన్ని మువ్వురు స్నేహితులకూ పంచేది. గాడిద కూడా అలుపెరుగని అమాయకపు జంతువు. తను కూడా సంపాదించిన దాంట్లో స్నేహితులకి పంచేది. ఇక జిత్తులమారి నక్క తను వేటాడకుండా మాయమాటలు చెప్పి తన స్థానం కదలకుండా మిత్రులు తెచ్చిపెట్టేది భుజిస్తూ సుఖంగా జీవనం సాగించేది. ఎలుగుబంటు పైముగ్గురు మిత్రులకన్నా బలవంతుడననీ, తెలివితేటలు కలవాడననీ, అందరూ తనకే తెచ్చిపెట్టాలనీ దౌర్జన్యంతో బెదిరిస్తూ స్నేహితులు సంపాదించేది భుజిస్తూ కాలం వెళ్లబుచ్చేది.
జింక చిన్న జంతువు కావటం వల్ల ఆహార సముపార్జన కష్టతరమై శక్తిహీనురాలైంది. ఎలాగో భారంగా రోజులు గడిపేస్తోంది. ఎలాగా జీవనం అని తనలో తనే కుమిలిపోయేది జింక. చివరకు భారమంతా గార్ధవముపై పడింది. భారంగా ఆహారం సంపాదిస్తోంది మిత్రుల కోసం గాడిద. మిత్రులు తెచ్చే ఆహారం అందరికీ సరిపడటం లేదు. టక్కరి నక్కకు అసహనం ఎక్కువైపోతోంది. వారిద్దరూ అక్కడే ఆరగించి మిగిలినది తమకు తెస్తున్నారని ఎలుగుబంటుకు మిత్రుల మీద చాడీలు చెప్తోంది. సోమరిపోతు ఎలుగుబంటు నక్క తియ్యని మాయమాటలు నమ్మేది. మిత్రుల మీద దానికి ఆగ్రహం పెరిగిపోతోంది. వారిని ఎలా దెబ్బతీయాలా? అని ఆలోచిస్తోంది ఎలుగు. నక్కకి సంతోషం పెరిగింది. చివరకు కలహాలు మొదలయ్యాయి వారిలో వారికి.
ఒకరోజు జింక తన మిత్రులతో ‘మనలో మనకు వైరాలు తగవని, కలసిమెలసి ఉందామని’ హితవు చెప్పింది. నక్క, ఎలుగుబంటు మిత్రుని మాటలు పెడచెవినపెట్టి ‘నీవా మాకు నీతులు చెప్పేది? నీ మాటలు మేము వినాలా? ఛీ! ఛీ! వెళ్లిపో ఆవలకు’ అని ఛీకొట్టాయి. ఇలా అనునిత్యం ఏదో ఒక సందర్భంలో తగవులాడుకుంటూనే ఉన్నాయి. మేము గొప్పంటే మేము గొప్పనీ, నాతో పెట్టుకోవద్దనీ హెచ్చరికలు చేసుకుంటున్నాయి.
ఓరోజు ఈ రీతిగా మూర్ఖపు ఎలుగుబంటు, నక్క తగవులాడుకుంటూ రక్తాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడుకుంటున్నాయి. అదే సమయంలో అటుగా సింహం వెళుతూ వాటిని చూసింది. తనకు ఆహారం దొరికిందని సంతసిస్తూ అమాంతం వచ్చి ఎలుగుబంటును దొంగదెబ్బ తీసి చంపేసింది. జిత్తులమారి నక్క తన యుక్తితో ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలను కాపాడుకుంది. మూర్ఖపు ఎలుగుబంటు ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకోక తన ప్రాణాలకు తనే అపాయం తెచ్చుకుని జీవితాన్ని కోల్పోయింది చివరకు.
ఈ కథనుబట్టి ‘కలసి వుంటే కలదు సుఖం అనీ, మూర్ఖత్వాన్ని వీడి జ్ఞానాన్ని పొందాలని, చెప్పుడు మాటలు వింటే తగిన శాస్తి జరుగుతుందనీ మనకు అర్థవౌతుంది. చిన్నయ సూరి నీతికథలు, విష్ణుశర్మ కథలు బాలల వికాసానికి దోహదపడతాయి. నీతి శతకాల్లోని పద్యాలు మానవునిలోని అజ్ఞానం అనే అంధకారాన్ని పారదోలి జ్ఞానం అనే వెలుగులను ప్రసాదిస్తాయి. ఈ పద్యాలు విద్యార్థులు, యువతలో వికాసం, సంస్కార భావాలు నాటుతాయి. ఈ పద్యాలు చదివిన ప్రతీ మనిషి నిత్యం జ్ఞానమార్గాన్ని అనే్వషిస్తూ నైతికతను పాటిస్తూ సమాజంలో ఉన్న వైషమ్యాలను పారదోలి నీతివర్తనుడై మనుగడ సాగిస్తాడు. అందరూ అలానే మనుగడ సాగిస్తారని ఆశిద్దాం!

రావూరి ఇందుమతి (ఇందునాథ్),
తెలుగు పండిట్,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.
మొబైల్ : 9533721776

మనోగీతికలు..

హత్య!
మనసిచ్చిన ఒక మగవాడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందం – కథానిక

అందం – కథానిక

  • 07/12/2014
TAGS:

‘‘యుఆర్ లుకింగ్ సో క్యూట్’’
ఎవరా అని తలతిప్పి చూసింది వర్ధనమ్మ. తనకేసే చూస్తూ కనిపించిందో అమెరికన్ లేడీ. గబుక్కున తడబడి మెల్లగా ‘‘్థంక్యూ’’ అంది. వెల్‌కం అన్నట్లుగా తల ఊపి వెళ్లిపోయింది. సెక్యూరిటీలో తీసిన గాజులు, వాచీ, గొలుసు రెస్టురూంలో మార్చుకుంటుంటే ఈ కామెంట్ విని ఆనందం అనిపించింది. ఈ దేశంలో ఇది రెండవసారి. శోక్రిమెంట్ మాల్‌లో యువర్ సారీ వెరీ బ్యూటీఫుల్ యు ఆర్ లుకింగ్ సో స్వీట్ అంటుంటే ననే్ననా అనే సందేహంతో ఉండిపోయింది. మెల్లిగా థ్యాంక్స్ అని బైటకు వచ్చింది.
ఇక్కడి వాళ్ళని చూసి తనకి ఒకే ఆలోచన. మనం లంబాడీ వనితల్ని చూసిన ఫీలింగ్ మనల్ని చూస్తే వీళ్ళకు కలుగుతుందేమో అని. ముక్కూ మొహం తెలియకపోయినా స్వచ్ఛంగా మెచ్చుకున్నది అబద్ధం అవదు కదా? ‘‘ఏమిటీ నవ్వుకుంటూ వస్తున్నావ్?’’ అన్నాడు కొడుకు ప్రసాద్. ‘‘ఏమీ లేదు. అదిగో వెడుతున్నావిడ నేను చాలా అందంగా ఉన్నాను అంది’’.
‘‘అందుకనా ఈ ఆనందం’’ అని వెక్కిరింతగా అన్నట్లనిపించి ఉడుక్కుంటూ….
‘‘కన్నవాళ్లూ, కట్టుకున్నవాళ్లూ, కనుకున్నవాళ్లూ ఎవరూ చెప్పని మాట వింటే ఆనందమేగా’’ అంది వర్ధనమ్మ. ‘‘సారీ అమ్మా! ప్రత్యేకించి చెప్పకపోయినా మా అమ్మ రాజమాతలా ఉంటుందని అందరికీ చెప్పుకుంటూ ఉంటాం’’.
‘‘సరేలేరా! దాని గురించి వాదనెందుకు. నువ్వు సరాదాగా అన్నదానికి జవాబు చెప్పాను అంతే….’’
కూర్చుని ఉంటే ఆలోచనలు గతాన్ని స్మృతిలోకి తెచ్చాయి. పెళ్ళి చూపులకి వచ్చి పిల్ల ఎలా ఉందిరా అంటే అమ్మలా ఉంది అన్నాడు. అంటే నాలానా….నేను బాగాలేనా అంటే అమ్మగా బాగుంటావు పెళ్లాం నీలా ఉంటే ఎలాగా….మరి ఆ రోజుల్లో పెళ్ళాంగా తన మార్కులెన్ని?
అందానికి నిర్వచనం ఏమిటి? బారెడు జడ ఉండి, ఏడు వంకల్ని కప్పే ఎర్రరంగు ఉంటే అందగత్తె అనే వారు. ప్రస్తుత కాలానికి అది నప్పదు. కాలానుగుణంగా పూర్వం జాకెట్టు తీరుమారినా చీరకట్టు మారలేదు. ఇప్పుడు అవి వేసుకునే వారు అనాగరికులు. అబ్బదాని సోకు జబ్బల్దాక జాకెట్టు అని కూనిరాగాలు తీసేవారు. చేతులు, బాక్‌లేని జాకెట్లకి సోకులద్దుతున్నారు. కనిపించీ కనిపించని అందాలు ఊరీ ఊరని ఊరగాయాల్లాగ మురిపిస్తాయి. అంతా బట్టబయలైతే తరవాతి మెట్టు మొహం మొత్తడమే…..అలాగని పాత రోత కాదు……కొత్త వింత కాదు.
జట్టు విరబోసుకుంటే పిశాచాలు ఆవహిస్తాయని జడ కూడా వేసుకునే ఉండాల్సి వచ్చేది. జడ ఎరుగని ఈ జనసంద్రానికి ఆవహించడానికి ఎన్ని పిశాచాలు కావాలో జడగంటలు పెట్టి పూలజడ అందాలు పండగల్లాగే టివిల్లో చూడాలేమో.
నల్లపిల్లగా పుట్టిన దీనికి పెళ్ళి ఎలా అనే అమ్మానాన్నల దిగులు, ఆనందరావు పెళ్ళికి సై అనడంతో తీరిపోయింది. అత్తగారింట్లో అందరూ తెల్లని వాళ్లే. కొత్తలో వాళ్ళకి అసంతృప్తిగా ఉండేది. కాలక్రమేణా కలిసిపోయినా ఇరుగుపొరుగు నల్లావిడ అంటే మనస్సు చివుక్కుమనేది. పిల్లలు పుట్టాక తండ్రి పోలికా అని ఎవరన్నా మనస్సు వౌనంగానే మూలిగేది. తిరిగి వచ్చిన ప్రసాద్ ‘‘ఇంకా ఆలోచిస్తున్నావా?’’ అంటూ సామాను చేతిలో తీసుకున్నాడు.
మరునాడు ఇంటికి చేరేసరికి గుమ్మంలో కూర్చుని తనని చూసి సంతోషం నిండిన కళ్ళతో ఆహ్వానించాడు. కాఫీ ఇచ్చి ‘‘స్నానం చేసిరా. అన్నాలు తిందాం’’ కొడుకు ఉన్నాడని ప్రేమని కంట్రోలు చేసుకుంటున్నాడు కానీ ఆప్యాయత, ఆరాధన మాట తీరువలోనే తెలిసిపోతోంది. భోజనం చేసి సామాన్లు విప్పబోతుంటే ‘‘తర్వాత చూద్దాం కాసేపు నడుం వాల్చు’’ అంటూ ఎసి ఆన్‌చేసి తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు.
ఇంతమంది ఆప్యాయతని అంది పుచ్చుకున్న తరువాత అందం గురించి ఆలోచించడం అవసరమా? అత్తగారి నుంచి అందుకున్న ఆప్యాయత కోడలికి అందించలేమా….అత్తమ్మ అందరి లాంటి వారు కాదు పాత కాలం ఆప్యాయత…. మోడ్రన్ ఆలోచనలు అని కోడలు ఎవరితోనో చెబుతుంటే ఈ జన్మకి ఈ సున్నితమైన బంధాలు ఇంకా బలపడనీయి స్వామీ! అని దేముడికి మొక్కింది. పిల్ల పుట్టగానే పాపలో తన పోలికలు వెతుక్కుని తన పేరు కలిపారు.
నాలుగు రోజులు ఉండి వెనక్కి వెళుతున్న ప్రసాద్‌కి చంటిపాపని గురించి, కోడలి గురించి జాగ్రత్తలు చెబుతూ ఆడపిల్లని అత్తవారింటికి పంపే తల్లిలా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటుంటే ‘‘ఇదే ఆప్యాయత నీకు స్వాభావిక అందం అమ్మా’’ అన్నాడు. ‘‘ఇంకా నువ్వా విషయం మర్చిపోలేదా?’’ అంది.
‘‘ఎలా మర్చిపోతాను కన్నవాళ్ళని, కట్టుకున్న వాళ్ళనే కాక కనుకున్న వాళ్ళనీ చేర్చావు కదా. మేం నీ పోలిక వచ్చింది నీ స్వభావం రావాలని మురిసిపోతుంటే మాటల్లో వ్యక్తం చెయ్యపోయినా నీకు అర్థం అవుతుంది అనుకోవడం మా పొరపాటు కదా’’ అంటే ‘‘ఒరేయ్!’’ అంటూ కొట్టబోతున్నట్లు నవ్వుతూ చెయ్యెత్తింది. వంగి నమస్కారం చేసి కారులో కూర్చున్నాడు.
వచ్చిన రోజు నుండి పది రోజులు ఫోన్‌కి విరామం లేదేమో….అందరూ ఆప్యాయంగా యోగక్షేమాలు, కొత్త పాపాయి సంగతులూ…. తనని ఎంత మిస్ అయిందీ చెబుతుంటే తాను ఆర్జించుకున్న ఆత్మీయతకు ముగ్ధురాలైంది. అప్పుడే అనిపించింది అందానికి కాలపరిమితి ఉంది. అది క్రమంగా కనుమరుగవుతుంది. జీవితం తరువాత కొన్ని ఏళ్ళయినా మిగిలే జ్ఞాపకాలు మంచి అనే చోట మనం గుర్తుకి రావడం పూర్వ జన్మసుకృతం. ప్రేమ ఉంటేనే కాని పలుకరించరు. పగ ఉంటేనే కాని తిట్టరు. మహర్షి మహేంద్రయోగి చెప్పినట్లుగా మన మాటలన్నీ కొంత శక్తిని విడుదల చేస్తాయి. చెడ్డమాటలు మాట్లాడితే చెడ్డశక్తి, మంచి మాటలు మాట్లాడితే మంచి శక్తి. చివరగా ఏది మిగులుతుందో అది మన అందం.

– గొర్తి శారద, బెంగుళూరు
ఫోన్ : 08861309977.

చిన్నకథ

మా మంచి నాన్నారు!

‘‘గోపీ ఫస్ట్ యూనిట్ పరీక్షలో నీ ర్యాంక్ ఎంత?’’ అని అడిగాడు రామారావు కొడుకు గోపీని.
‘‘నా ర్యాంక్ ఇరవైఐదు నాన్నారు’’ అన్నాడు గోపి భయం భయంగా.
‘‘ఆ ….గొప్ప ర్యాంక్ వచ్చిందిలే, వాడి క్లాసులో ఉన్న పిల్లలే ముప్పయి మంది, అందులో వీడు ఇరవైఐదవ వాడు….ఆ లెక్కన వీడి కన్నా ఇరవైనాలుగు మంది మంచి ర్యాంకర్స్ ఉన్నారన్న మాట’’ అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది గోపీ వాళ్ళమ్మ సంధ్యారాణి.
‘‘అలా ఎందుకనుకుంటున్నావు, మరో ఐదుగురు కన్నా మనవాడే బెటర్ కదా…ఆ లెక్కన మనవాడూ తెలివైనవాడే’’ అని నవ్వుతూ అన్నాడు రామారావు.
‘‘అలా వాడిని నెత్తినెక్కించుకొండి….రేపు వచ్చే పరీక్షలో గుండుసున్నాలు తెచ్చుకుంటాడు’’ అంటూ చిరచిరలాడింది సంధ్యారాణి.
‘‘గోపీ….వెరీగుడ్ ఫస్ట్ యూనిట్‌లోనే మంచి ర్యాంక్ సాధించావ్…..అలా వీథిలోకి వెళ్ళి ఫ్రెండ్స్‌తో ఆడుకో’’ అని గోపీని బయటకు పంపి, ‘‘సంధ్యా…. మనమెప్పుడూ పాజిటివ్‌గానే వుండాలి, ఆలోచించాలి, మాట్లాడాలి….. ముఖ్యంగా పిల్లల దగ్గర పాజిటివ్ కామెంట్స్ చేస్తేనే మంచిది, నెగిటివ్ కామెంట్స్‌తో వాళ్ళను హర్ట్ చేస్తే వాళ్ళ బుర్రల్లో నిరాశ నిస్పృహలు పేరుకుపోయి, భవిష్యత్‌లో సెన్సిటివ్‌నెస్ పెరిగి….. లేని పోని అనర్థాలకు దారి తీయొచ్చు’’ అంటూ భార్య సంధ్యని సున్నితంగా మందలించాడు రామారావు.
‘‘ఓరేయ్! రాజూ మా నాన్నారు నాకు 25వ ర్యాంక్ వచ్చినా దెబ్బలాడ లేదురా…..పైగా వెరీగుడ్ అన్నారు….అదే నాకు ఇంకా మంచి ర్యాంక్ వస్తే నాన్నారు నన్ను ఎక్స్‌లెంట్ అంటారు’’ అన్నాడు సంతోషంగా గోపి తన ఫ్రెండ్ రాజుతో ఆడుతూ…… పాడుతూ…..
‘‘మీ నాన్నారే బెటర్‌రా….మా డాడీ నాకు థర్డ్‌ర్యాంక్ వచ్చినా నానా చీవాట్లూ పెట్టారు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేదని’’ అని అన్నాడు రాజు, ఆటపాటల ఆనందం కానరాలేదు అతని ముఖంలో.
‘‘ఏమోరా…..మా నాన్నారే ది బెస్ట్ నాన్నరు రా’’ అంటూ ఎగిరి గెంతులేస్తూ నాన్నరుకి కితాబిచ్చాడు గోపి.
* * *
‘‘నాన్నా గోపి రెండవ యూనిట్ రిజల్ట్స్ వచ్చినట్లున్నాయి….నీ ర్యాంక్ ఎంత నాన్నా’’ అని అడిగాడు రామారావు కొడుకు గొపీని, ‘మీ గోపీ రిపోర్ట్ కార్డు పంపాం’ అని స్కూల్ మేనేజ్‌బెంట్ పెట్టిన మేసేజ్ చూసి
‘‘పద్దెనిమిదో ర్యాంక్ నాన్నారు….ఎక్కువ సిలబస్ కవరు చేసినా మంచి ర్యాంకే వచ్చింది కదా….నాన్నారు’’ అన్నాడు గోపి చిలిపి కళ్ళు చిటపటలాడిస్తూ….
‘‘వెరీ……వెరీ గుడ్ చూశావా! నీవెంత ఇంప్రూవ్ అవుతున్నావో…..్ఫస్ట్ యూనిట్‌లో 25వ ర్యాంక్ వస్తే, సెకండ్ యూనిట్‌లోనే 18వ ర్యాంక్ వచ్చింది….వెల్‌డన్ మై బాయ్’’ అంటూ కొడుకుని అభినందిస్తూ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు రామారావు. గోపి మనసంతా హాయిగా ఉంది….మా మంచి నాన్నారు అనుకున్నాడు మనసు.
‘‘అయినా మీరు గారాబం కాస్త తగ్గిస్తే కాస్త భయంతో చదివి….ఈసారి ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకునే వాడు’’ అంది సంధ్యారాణి, తన కొడుకు టాప్ ర్యాంకర్స్‌లో ఉండాలనుకునే సగటు తల్లి మనసుతో.
‘‘నీకే ముందు ముందు తెలుస్తుందిలే,…..మనవాడి గొప్పతనం…..‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్’ అని ఊరికే అనలేదు పెద్దలు’’ అని అన్నాడు నవ్వుతూ రామారావు.
‘‘ఓరేయ్ రాజా ఈసారి మా నాన్నారు నన్ను ఇంకా గొప్పగా మెచ్చేసుకున్నారురా…..అదే నేను కనుక పదిలోపు ర్యాంకర్నయితే….నా సామిరంగా….నాన్నారు ఎంత మెచ్చుకుంటారో నన్ను….ఊహిస్తేనే గొప్ప థ్రిల్‌గా ఉందిరా’’ అన్నాడు గోపి రాజుతో హుషారుగా….
‘‘మా ఇంట్లో షరా మామూలేరా….ఈసారి థర్డ్‌ర్యాంక్ వచ్చిందని మమీ డాడీ ఒకటే నస, ఓ తెగ బాధపడిపోయారురా….ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఫస్ట్‌ర్యాంక్ రాకపోతే తిట్లే రా తిట్లు’’ అంటూ డల్‌గా మాట్లాడాడు రాజు.
‘‘ఏమోరా! ఈసారి మాత్రం నేను టాప్ టెన్ ర్యాంకర్స్‌లో ఉంటాను’’ అన్నాడు గోపి నిబ్బరంగా ఊపిరి పీల్చుతూ.
* * *
‘‘గోపి నీకు క్వార్టర్లీ పరీయల్లో నైన్త్ ర్యాంకట నిజమేనా!’’ అని అడిగాడు రామారావు కొడుకు గోపీని.
‘‘అవును నానారు….టాప్ టెన్ ర్యాంకర్స్‌లో ఉండాలని బాగా చదివాను….మంచి ర్యాంక్ వచ్చిందంతే….నేనూ బెటరీ కదా….’’ అని అన్నాడు గోపి అమాయకంగా ‘‘నువ్వు బెటరేటి నానా….‘‘ నువ్వే ‘ది బెస్ట్’ ’’ అన్నాడు రామారావు గోపీ భుజం తడుతూ.
సంధ్యారాణి మిడిమిడిగా చూస్తోంది తండ్రీ కొడుకుల వైపు.
‘‘అవును నా కొడుకూ బెటరే, ఇక ది బెస్ట్ అవ్వగలడు’’ అని మనసులోనే పాజిటివ్ థాట్స్‌కి బీజం వేసుకుంది.
‘‘గోపీ మా డాడీ నన్ను మెచ్చుకున్నార్రా…. థర్డ్ ర్యాంకర్‌నని…. ఇందాక మీ నాన్నారు మా డాడీతో ఏదో మాట్లాడారులే’’ అన్నాడు రాజు గోపితో ఆనందంగా.

– ఎం.వి. స్వామి, చోడవరం,
విశాఖ జిల్లా. ఫోన్ : 7893434721

పుస్తక సమీక్ష

ఉషోదయ జీవన నవ్యత నిండిన కవిత్వం శిథిల చిత్రాల జాతర

తెరచిన కిటికీలోంచి కాదు, మూసిన గుండె గవాక్షాన్ని మనసారా చూడు, ముద్దాడే కవిత్వం ఉబుకుతుంది. అక్షరాలను ఎక్కుపెట్టి సమాజంపైకి సంధించమంటాయి. ఎందరో అభాగ్యుల జీవనచిత్రాలు నీ కళ్ళ ముందు దయనీయంగా దర్శనమిస్తాయి. ఎద పర్వతం నుండి ఎగజిమ్ముతుంది అసలైన కవిత్వం అంటున్న యువకవి తేళ్ళపురి సుధీర్‌కుమార్. కొయిలకుంట్ల, కర్నూలు జిల్లా వాసి. తన పదునైన 45 కవితల కవాటంతో ప్రథమ ప్రయత్నంగా కవిగా ముందుకొచ్చి కవితాప్రియులను తన శిథిల చిత్రాల జాతరలో నడిపించారు. నవ్యతను అందించారు.
ఈ కవిది తెచ్చిపెట్టుకునే కవిత్వం కాదు, ఒకరిని అనుకరించేది అసలే కాదు, అక్షరాలకు అర్రులు చాచని ఆత్మస్థయిర్యం, పదముల పేర్పుకి పాకులాడని ప్రతిభా సంపదన, భావాలకు బానిసయై పరుగులెత్తని సహజధోరణి, చెప్పదలచుకున్నది సూటిగా, వాడి నాడి ఎరిగిన సత్తా గల కవిగా గోచరిస్తాడు. భావితరంలో రాణించగల కవిగా ఎదిగే పోకడలు దర్శనమిస్తాయి ఈతని కవితల్లో. నాకు జన్మనిచ్చింది అమ్మే అయినా, జీవితాన్నిచ్చింది, అక్షరం అంటూ, అక్షర ప్రీతిని ఆవిష్కరిస్తాడు. పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నా, నల్ల కలువల విషాదగీత ఆర్తనాదాలు, తీవ్రవాదుల గుప్పిట్లో బందీలవుతూనే ఉన్నాయని, అక్కడ నేలరాలుతున్న వందలాది కుసుమాలు, ఇక్కడ యువతుల మెడల్లో వజ్రాల్లా మెరుస్తున్నాయంటూ ఆర్ద్రత చెంది, కళ్లు చెమ్మగిల్ల జేస్తాడీ కవి. ఓ! అబలా!! నీ శక్తి ఇంతేనా? అని ప్రశ్నిస్తూ ప్రేమోన్మాది కసాయి కత్తికి బలయ్యే మేకపిల్లలా మారుతున్న నువ్వు వాడిని హతమార్చే, సివంగిలా మారేదెప్పుడు? నీ కళ్ళలో చండ్రనిప్పులు చెరిగేదెప్పుడు? అని హెచ్చరికతో కొండంత ధైర్యాన్నందిస్తాడు, అండగా నిలుస్తాడు. సమాజంలో మార్పుని వాంఛిస్తాడు. కవి తన బాల్యాన్నిలా నెమరువేసుకుంటూ పాఠకుల బాల్యాలనూ స్మరణకు తెస్తాడు. కాగితం పడవనెక్కి పిల్ల కాల్వల వెంట పరుగులు తీసిన నా బాల్యపు ఆనవాళ్ళు విరగబూసిన మల్లెల్లా స్వచ్ఛంగా నా కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. జీవన అలజడుల మధ్య నలిగి, ‘జాషువా’ కవి గురించి వెలివేసిన సమాజంలో పాడుబడ్డ మసీదే నిన్ను ప్రతిష్ఠించుకుంది. సమ సమాజం కోసం వెలుగులు పంచే కాగడాగా నిల్చేవు అంటూ అతని వ్యక్తిత్వాన్ని కవిత్వాన్ని కీర్తిస్తాడు. తెలుగు భాష మాధుర్యాలనిలా వ్యక్తీకరిస్తాడు. వీర బెబ్బులి సాహసం మన తెలుగు వీరనారుల పుట్టినిల్లు మన తెలుగు కదం తొక్కు ఒంగోలు గిత్త పౌరుషం మన తెలుగు విశ్వమంతటా వాసికెక్కిన, మువ్వ సవ్వడి కూచిపూడి మన తెలుగు చేలగట్టున పాలపిట్టల్లా ఎంకి పాటతో ఎక్కిరించే కనె్నపిల్లల జాణతనం మన తెలుగు. ‘రుధిర సందేశం’ కవితలో అక్కడ కోయిలలు విప్లవ గీతాలనే పాడతాయి నేడు సూర్యుడు అస్తమిస్తున్నాడంటే రేపు ఉదయించడానికే ఇలా కవిత్వం కదం తొక్కింది. కావ్యానందాన్నిచ్చింది. ప్రతులకు ఫోన్ నెం.9885632727కు సంప్రదించగలరు. నా మదినిండా పరుచుకున్న కవిత్వం నాలో ఉషోదయ కేతనాన్ని ఎగురవేస్తుందన్న కవి ప్రశంసనీయుడు. ఈ యువకవిని అభినందిస్తూ భవిష్యత్‌లో మరిన్ని కావ్యాలను అందించాలని ఆకాంక్షిద్దాం.

– చెళ్లపిళ్ల సన్యాసిరావు, సెల్ : 9293327394.

నిత్యసత్యాలు

ఉట్టి కొట్టే పట్లు నేర్పాలి కదా!

దాని కోసం ఇప్పుడు ఈ సంతోషాలన్నీ వదులుకోడం కష్టంరా! ఏవో నాలుగు గైడ్లు చదివేస్తే చాలదా? అన్నిట్లోనూ అన్ని విషయాలూ గట్టిగా తెలియాలా? అదేంటి? మానవీయ విలువలు! ఆ పరీక్షలోనూ గట్టెక్కి తీరాలిట! మనకీ గండాలు గడిచే మార్గాలు కొట్టిన పిండే కదా! ఏ మాత్రం చొరవ చూపించినా మూడేళ్లల్లో డిగ్రీ పట్టా చేతికి రాదా? ఇలా రోజూ వచ్చి చెప్పినవన్నీ విని చెయ్యమన్నవన్నీ చేసి తీరా ఇంత రోష్టూ పడితే అవసరమైనప్పుడు కనుచాటు చెయ్యరట! ఎలాగోలా బతికేయడానికి ఇంత అవసరమంటావా? ఆడాలి! పాడాలి! చదవాలి కూడానా? మనవల్ల కాదు బాబూ మరో మార్గం ఉంటే చెప్పు!
ఎక్కువ డబ్బు ఖర్చయినా సరే రేపటికి పనికొస్తుంది కదా అని చదువు మొదలెడితే ఈ అరకొర పరిస్థితులేంటి? పుస్తకాలే గతయితే లోకంలోకి వెళ్ళాక పనిచేయడానికి పనికొస్తామా? ఏలికలకి తీరిక లేనట్టుంది. కొత్త చదువులు చదివించండంటారు కానీ వాటికి వసతులు కల్పించాలని మర్చిపోతారు. ప్రైవేట్ చదువులు బతుకులు చితక్కొడుతున్నాయి. ఇష్టంగా కష్టపడే వాళ్ళని అరకొర సత్తువతో ఆకాశానికి ఎగరమంటే మోకాళ్ళరుగుతాయ్. కొత్తతరం కోరికలు కొడిగట్టే కొరతలు తీరిస్తే రేపటికి మేం తయారవుతాం. స్వేచ్ఛగా స్వచ్ఛంగా స్వతంత్రంగా సాగిపోతాం.
చదువా? చట్టుబండలా? రోజూ రాకపోయినా ఏమీ అనకూడదు. వింటున్నట్టు నటిస్తేచాలా? ఏడాది చివరి తెల్లకాయితాల మీద గిలికిందే లెక్కా? మేం చెప్పింది వాళ్ళకేం తెలిసిందో తెలియాలంటే వాళ్ళు నిత్యం మా కనుసన్నల్లో ఏదో ఒక రాత రాసి తీరాలి. కొంచెం కూత ద్వారా కూడా తెలియాలి. మూగజీవాల్లా కళ్లూ చెవులూ అప్పగిస్తే సరిపోదు. అడుగూబొడుగూ అంతా తీసి చదువుకుందామంటే అందుబాట్లో ఆ అవకాశం కల్పించకపోతే ఎలా? మట్టిలో మాణిక్యాలకి మెరుగు పెట్టడం మంచిదే కదా? ఎలాగోలా గోడ దాటేస్తే చాలనుకునేవాళ్ళు ఎక్కువయితే ప్రమాదం కదా! ఇష్టపడి కష్టపడేవాళ్ళే రేపటి వెలుగులు వెదజల్లుతారు. నీటిమూటల్లాంటి వాగ్దానాల మీద నడవడం కష్టం కాని కనీసం ఉట్టయనా కొట్టే పట్లు నేర్పాలి.

– కాండూరి లక్ష్మీపతి, సెల్ : 9440559398.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా గొంతు వినడానికే సినిమాలు చూసేవాళ్లున్నారు

నా గొంతు వినడానికే సినిమాలు చూసేవాళ్లున్నారు

చిన్మయి అంటే అందరూ గుర్తు పట్టకపోవచ్చు. కాని సమంతకు డబ్బింగ్‌ చెప్పే అమ్మాయి అంటే చాలు అందరూ గుర్తుపడతారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, గాయని అయిన చిన్మయి కథక్‌, ఒడిస్సీ నృత్యకారిణి. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు, జర్మన్‌ భాషలు కూడా వచ్చు ఈమెకి. ఇంత టాలెంట్‌ ఉన్న చిన్మయి శ్రీపాదతో నవ్య చేసిన ఇంటర్వ్యూ…
గాయకురాలు కావాలని చిన్నప్పట్నించీ అనుకునేవారా?
బడికెళ్లే వయసులోనే సింగర్‌ కావాలనుకునేదాన్ని. అందుకు కారణం మా అమ్మ పద్మహాసిని. తను మంచి సింగర్‌. సంగీతంలోనూ దిట్ట. అమ్మే తొలి గురువు కావటం నా అదృష్టం. చిన్నపుడే కర్నాటక, హిందుస్తానీ సంగీతం నేర్పించింది. సంగీతం నేర్చుకునే రోజుల్లో రేవతి, సురేష్‌మీనన్‌ నటించిన ఓ సినిమాకి తీసుకెళ్లింది. ఆ సినిమాలో పాటలు నాకు బాగా నచ్చాయి. ‘రంగీలా’ సినిమాలో స్వర్ణలత పాడిన ‘హాయ్‌ రామా యే క్యా హువా…’ పాట పాడాలన్న స్ఫూర్తి కలిగించింది.
పాటల పయనం ఎలా మొదలైంది? 
సన్‌టీవీ వాళ్లు నిర్వహించిన ‘సప్తస్వరంగళ్‌’ అనే పాటల రియాలిటీ షోలో గెలిచాను. అప్పుడే సింగర్‌ శ్రీనివాస్‌ నన్ను రెహ్మాన్‌ దగ్గరికి పరిచయం చేశారు. మణిరత్నంగారు తీసిన ‘కన్నథిల్‌ ముత్తమిత్తల్‌’ చిత్రంలో ‘ఒరు దైవం తంట పూవే…’ పాడాను. అదే సినిమా తెలుగులో ‘అమృత’గా విడుదలైంది. అందులో ‘ఏ దేవి వరమో నీవు’ పాట పాడాను. గాయనిగా అది నా మొదటిపాట. మంచి హిట్టయ్యింది. మొదటి పాట సక్సెస్‌ కావడంతో నా బాధ్యత పెరిగింది.
మొదటిపాటకే రెహ్మాన్‌తో కలిసి పనిచేశారు కదా ఆ అనుభవం గురించి…
రికార్డింగ్‌ థియేటర్‌కి వెళ్లాక ‘నీ స్టైల్‌లో పాడు’ అన్నారు రెహ్మాన్‌. ఎటువంటి ఒత్తిడి పడకుండా పాడాను. లిరిక్స్‌, ట్యూన్‌, పిక్చరైజేషన్‌ వల్ల నా గాత్రం ఎలివేట్‌ అయింది. రెహ్మాన్‌ తో పనిచేయటమంటే ఓ ఎడ్యుకేషన్‌. నేర్చుకోవాలనే తపన ఉండాలే గానీ అనునిత్యం కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే రెహ్మాన్‌తో కలిసి పనిచేయడటమంటే గుడికెళ్లి ప్రార్థన చేసినట్లు ఉంటుంది. గాయకులకి స్వేచ్ఛనిచ్చే మనస్తత్వమున్న వ్యక్తి. కొత్త గాయకుల ప్రతిభను గుర్తించి, ఏ పాట ఎవరుపాడితే నప్పుతుందని అంచనా వేయడంలో రెహ్మాన్‌ నిష్ణాతులు. ఇప్పటివరకూ నలభై పాటలు రెహ్మాన్‌ వద్ద పాడాను.
తెలుగు, తమిళ పాటల గురించి…
మొదటిపాట తర్వాత శివాజీ చిత్రంలో ‘సహానా..’ పాట పాడి తమిళంలో బిజీ అయ్యాను. తెలుగువాళ్లు ‘చిన్మయి’ ని ఇంతలా స్వాగతించటం అదృష్టం. 2002 నుండి తెలుగులో అవకాశాలు వచ్చాయి. తమిళంతో పోలిస్తే తెలుగులో లవ్‌సాంగ్స్‌ చాలా నచ్చుతాయి. బాలీవుడ్‌కి కూడా రెహ్మాన్‌గారే నన్ను పరిచయం చేశారు. ‘గురు’ తర్వాత ఐదేళ్లకి హిందీలో మంచి అవకాశం వచ్చింది. సంగీత దర్శకులు విశాల్‌-శేఖర్‌ ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ మూవీ పనిమీద చెన్నయ్‌కి వచ్చి ‘తేరే బినా’ పాట పాడిన అమ్మాయి ఎవరని ఆరాతీసి. ఫోన్‌ నంబరు కనుక్కొని మరీ నాకు ఫోన్‌ చేశారు. ఆ సినిమాలో నేను పాడిన ‘బన్‌ కే తిత్లీ దిల్‌…’ పాట మంచి పేరు తెచ్చింది. ‘టుస్టేట్స్‌’ సినిమాకి పాడిన ‘మస్తుమగన్‌’ యువతని ఆకట్టుకుంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, మరాఠీ, తుళు భాషల్లో పాటలు పాడాను.
పాటల ప్రయాణం మీకెలా అనిపిస్తోంది. ఇందులో మీ బలాలు, బలహీనతలు…
ఒక్కోసారి చాలా టఫ్‌గా, కొన్నిసార్లు గ్రేట్‌గా అనిపిస్తుంది. నాలోని బలాలు తెలీదు గాని బలహీనత మాత్రం నన్ను నేను తిట్టుకోవడం. నా పాటలు నేను పూర్తిగా వినను. ఒక్కోసారి బాగా పాడలేదని నన్ను నేనే తిట్టుకుంటాను. అలా తిట్టుకోవడమే నాకు ప్లస్‌ అని చెప్పొచ్చు. నాకు బెస్ట్‌ క్రిటిక్‌ అమ్మ. నా పాటలు విన్నవాళ్లు, స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌ చూసిన వాళ్లు అభినందిస్తే, మా అమ్మ మాత్రం ‘అది అలా పాడాలి… ఇది ఇలా పాడాలి’ అని చెప్తుంటుంది. ‘ఏంటమ్మా అలా చెప్తావు’ అనంటే ‘అందరిలా నేనూ పొగిడితే ఎలా’ అంటుంది.
గమ్మత్తుగా పలికే మీ గొంతు వెనక ఉన్న రహస్యం?
రహస్యాలేమీ లేవు. గొంతు కోసమని ప్రత్యేక శ్రద్ధ తీసుకోను. శాకాహారం ఎక్కువగా తింటాను. చాక్లెట్‌ మిల్క్‌షేక్‌, ఐస్‌క్రీమ్స్‌ అంటే మహా ఇష్టం. పాటలు పాడేవాళ్లు ఐస్‌ క్రీమ్‌లు తినకూడదంటారు. కాని ఐస్‌కీ రమ్‌ తిన్నాక గోరు వెచ్చని నీళ్లు తాగితే సరిపోతుంది.
డబ్బింగ్‌లోకి ఎలా వచ్చారు?
అనుకోకుండా జరిగింది. గౌతమ్‌మీనన్‌ రూపొందించిన చిత్రం ‘సిల్లును ఒరు కాదల్‌’లో భూమిక పాత్రకి డబ్బింగ్‌ చెప్పమన్నారు. ‘పాటలు పాడతాను కానీ నవ్వడం, ఏడవడం నా వల్ల కాద’న్నాను. కాని భూమిక పాత్రకి చిన్మయే డబ్బింగ్‌ చెప్పాలన్నారు గౌతమ్‌మీనన్‌. దానికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘సూర్య సన్నాఫ్‌ క్రిష్ణన్‌’ తమిళ, తెలుగు వెర్షన్స్‌లో సమీరారెడ్డికి డబ్బింగ్‌ చెప్పించారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా స్టార్డమ్‌ అనేది గౌతమ్‌మీనన్‌ వల్లే వచ్చింది. ఆయన రూపొందించిన ‘వినైతాండి వరువయా’ చిత్రంలో త్రిష నటించిన ‘జెస్సీ’ పాత్రకు గొంతు ఇచ్చాను. ఆ సినిమా తెలుగు వెర్షన్‌ ‘ఏం మాయ చేశావే’లో సమంతకి డబ్బింగ్‌ చెప్పాను. హిందీలో వచ్చిన ‘ఏక్‌ దివానా థా’ సినిమాలో అమీజాక్సన్‌ నటించిన జెస్సీ పాత్రకీ డబ్బింగ్‌ చెప్పాను. ఒకేసారి తమిళ, తెలుగు చిత్రపరిశ్రమలో డబ్బింగ్‌ చెప్పటానికి కారణమైన ఏమాయ చేశావే సినిమాని చాలామంది ప్రేక్షకులు, చిత్రపరిశ్రమకు సంబంధించిన వాళ్లు నా గొంతు వినటం కోసమే చూశామని చెప్పారు. పాటలతో పాటు వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు దక్కింది. డబ్బింగ్‌తో మాస్‌ ప్రేక్షకులకి చిన్మయి ఎవరో తెలిసింది.
సమంతాతో స్నేహం గురించి…
‘నటిగా నాకు మంచి పేరొచ్చింది చిన్మయి గొంతు వల్లే’ అని చాలాసార్లు చెప్పింది తను. భేషజాలు లేని స్టార్‌ హీరోయిన్‌ ఆమె. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. సమంతా నటనకి నా గొంతు బాగా నప్పుతుంది. ఆమె నటించిన ‘బృందావనం, ఆటోనగర్‌ సూర్య, జబర్దస్త్‌’ సినిమాలకి తప్ప మిగతా అన్నింటికీ నేనే డబ్బింగ్‌ చెప్పాను.
డబ్బింగ్‌లో ఇబ్బందులైవేనా ఉంటాయా?
డబ్బింగ్‌ చెప్పడం ‘మైకుమీద సామే’. గొంతు మీద ఒత్తిడి పడుతుంది. నేను కూడా త్వరగా అలసిపోతాను. ఒక రోజు డబ్బింగ్‌ చెప్పానంటే రెండు రోజులు విశ్రాంతి తప్పనిసరి. నటీనటుల తప్పుల్ని డబ్బింగ్‌తో సరిచేస్తారనే విషయం తెలిసి ఆశ్యర్యపోయాను. డబ్బింగ్‌ చెప్పాలంటే భాషపై పట్టు ఉండాలి. నటుల హావభావాలు, సీన్‌ డిమాండ్‌, మూడ్‌ బట్టి ప్రవర్తించాలి. పాత్రకి గొంతుతో జీవం పోయడం అంత సులువేం కాదు. పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని రిహార్సల్స్‌ చేసుకోవాలి. మాటల్లో చిన్న పొరపాటు కూడా దొర్లకుండా చూసుకోవాలి. దర్శకుడు ‘ఓకే’ అనేవరకు ఎన్ని రీటేకులైనా చేయాలి. ఇప్పటివరకూ 70 చిత్రాలదాకా డబ్బింగ్‌ చెప్పాను. తెలుగు హీరోయిన్‌ అనుష్క చేసే వాణిజ్య ప్రకటనల కోసం నా గొంతే ఉండాలని అడిగి మరీ చెప్పించుకుంది. అది నాకు గర్వంగా అనిపించింది.
మీ ప్రేమపెళ్లి గురించి…
అందాల రాక్షసి సినిమా అప్పుడే రాహుల్‌ పరిచయమైంది. ‘మీ డబ్బింగ్‌ సూపర్‌’ అని రాహుల్‌ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ‘మీ యాక్టింగ్‌ బావుంద’ని నేనన్నాను. ఆ తర్వాత ట్విట్టర్‌లో కలిశాను. ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. వాట్సప్‌ మెసేజ్‌లతో మరికాస్త దగ్గరయ్యాం. రాహుల్‌ ప్రపోజ్‌ చేశాక ఏడాదిన్నర తరువాత పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. తను స్నేహితుడిలా ఉంటాడు. వేరొకరి గురించి చెడ్డగా మాట్లాడడు. రూమర్స్‌ వినడు. రాహుల్‌ లాంటి మంచి మనసున్న భర్త దొరకటం నా అదృష్టం.’’
చిన్నప్పుడే శాస్ర్తీయనృత్యం నేర్చుకున్నాను. కథక్‌, ఒడిస్సీ నృత్యాలు చేస్తాను. నాకు తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు, జర్మన్‌ భాషలపై పట్టుంది. మాకు ‘బ్లూ ఎలిఫెంట్‌’ అనే ట్రాన్స్‌లేషన్‌ కంపెనీ ఉంది. ఇందులో మేము 130 భాషల్ని తర్జుమా చేస్తాం. పుస్తకాలు, సినిమాలు ఏదైనా అనువాదం చేసి పెడతాం. పుస్తకాలు చదవటం, కొత్తభాషలు నేర్చుకోవటం అంటే నాకెంతో ఇష్టం.
గజల్స్‌ అంటే చాలా ఇష్టం. వాటివల్ల రిఫ్రెష్‌ అవుతాను. నా పదిహేనో యేట నించే గజల్స్‌ పాడుతున్నాను. గులాం అలీ సాబ్‌, మెహదీ హాసన్‌ గజల్స్‌ అంటే ప్రాణం. గజల్స్‌లో తెలీని అనుభూతి, పొయెట్రీ మ్యాజిక్‌ ఉంటుంది. అంతకంటే మించి మంచి సోల్‌ ఉంటుంది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవాస్తవ చరిత్ర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిబద్ద న్యాయ మూర్తి జష్టి స్ కృష్ణయ్యర్-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నైతిక విలువలకు నిలువు టద్దమ్ -ఆచార్య రంగ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రైతన్న చుట్టూ రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -76 115-ఆధునిక యుగ మహా గీర్వాణ పండితకవి –వేదాల తిరువేంగళాచార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -76

115-ఆధునిక యుగ మహా గీర్వాణ పండితకవి –వేదాల తిరువేంగళాచార్యులు

వేదాల తిరు వేంగళా చార్యుల వారు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దవరం అగ్రహారం లో 1895లో జన్మించారు .వైష్ణవ కుటుంబం లోని వీరు సంస్కృత ఆంధ్రభాషలను చిన్నతనం లోనే అభ్యసించారు .ఈ రెండు భాషల్లో మహా పాండిత్యాన్ని సంపాదించారు .దర్శన ,అలంకార శాస్త్రాలను మధించారు .స్వంత గ్రామం లోనే పండితుల వద్ద ప్రాధమిక విద్య నేర్చారు .ఒంట బట్టిన గీర్వాణ తెలుగు భాషా  పాండిత్యాల  వలన సంతృప్తి చెందక  విద్యా తృష్ణ తీరక ఆచార్యుల వారు దేశ పర్యటన చేశారు .

విజయ నగరం చేరి మహా మహోపాధ్యాయ తాతా సుబ్బరాయ శాస్త్రి గారి వద్ద ను ,పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి దగ్గరా న్యాయ ,వ్యాకరణ ,అలంకార శాస్త్రాధ్యయనం కూలం కషం గా నిష్టతో చేశారు .న్యాయ శాస్త్ర శిరోమణి పరీక్షకు హాజరై సర్వోత్తములుగా ఉత్తీర్ణత సాధించారు .పిఠాపురం రాజాస్థాన విద్వాంసులు శ్రీ గుది మెళ్ళవెంకట రంగా చార్య స్వామి సన్నిధిలో న్యాయ ,వేదాంత ,మీమాంస ,సాహిత్య ,వ్యాకరణ ,తంత్ర సంప్రదాయక విజ్ఞానం లో మెరుగులు దిద్దుకొని సంపూర్ణ ప్రజ్ఞా వంతులని పించు కొన్నారు .అంటే సమస్త శాస్త్రాలలో అపార ప్రజ్ఞా పాటవాలను సాధించి తమ దీమత్వాన్ని ప్రకటించారు .సమకాలీనులలో వేదాల వారి వంటి వారెవరూ లేరని చెప్పుకొనేవారు .

విశిష్టాద్వైత సిద్ధాంతం లో పరిపూర్ణులైన ఆచార్యుల వారు ద్వైత ,అద్వైత ,శుద్దాద్వైతసిద్ధాంతాలలోనూ అపూర్వ  ప్రావీణ్యం పొందారు .ఇంతటి సమ ద్రుష్టి ఉన్న వారు ఆ కాలం లో  చాలా అరుదుగా ఉండేవారు .’చతుర్మత తత్వ సారం ‘’అని వీరు రాసిన అపూర్వ గ్రంధం తెలుగు భాషా సమితి వారి బహుమతిని పొందింది .సంస్కృత   అధ్యాపకులు  గా వీరి సేవలు నిరుపానమై నిలిచాయి .మహా పండితులైన శ్రీ శ్రీనివాస శిరోమణి వంటి వారు ఆచార్యుల వారి ప్రముఖ శిష్యులై వర్దిల్లారు .

పూరీ జగన్నాధ క్షేత్ర సంస్కృత కళాశాల ,కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం,చిట్టి గూడూరు శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృత కళాశాల లలో ఆచార్యుల వారు సంస్క్రుతాధ్యాపకులుగా సేవలు అంద జేశారు .గుంటూరు ఆంద్ర క్రైస్తవ కళాశాల  వీరి ప్రతిభను గుర్తించి సంస్కృత అధ్యాపకులుగా స్వీకరించి సేవలుఅందుకొన్నది .

ఆచార్యుల వారు ఆంద్ర ధ్వన్యాలోకనం ,(లోచన సహితం )కావ్యాలం కార సూత్ర వ్రుత్తి,రస గంగాధరం (పూర్వ ,ఉత్తర ఖండాలు )వ్యక్తీ వివేకం ,(ఆంధ్రానువాదం )తెనాలి రామకృష్ణుని కవిత్వం భారతోపన్యాసాలు ,భాగవత ఉపన్యాసాలు ,రాజ్య ప్రదానం అనే నవల ,జాతక కధలు ,గోపికా వల్లభ శతకం ,చతుర్మత తత్వ సారం,కావ్య ప్రకాశిక (ఆంధ్రానువాదం )వంటి ఎన్నో గ్రంధాలు రచిం చారు .చివరి రోజులు గుంటూరులోని ఆనంద తీర్ధ అగ్రహారం లో గడిపారు .డెబ్భై ఏడవ ఏట వేదాల తిరు వేంగళా చార్యుల వారు మార్చి 1972 లో పరమ పదం చేరుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -75- 114-వైయాకరణి-వజ్ఝల చిన సీతారామ శాస్త్రి

గీర్వాణ  కవుల కవితా గీర్వాణం -75

114-వైయాకరణి-వజ్ఝల  చిన సీతారామ శాస్త్రి

వైయాకరణి అని పేరు పొందిన వజ్ఝల చిన సీతా రామ శాస్త్రి గారు ముఖ లింగేశ్వర శాస్త్రి ,వేంకటాంబ దంపతులకు 25-6-1878 నజన్మించారు .ఒజ్జ(ఉపాధ్యాయుడు ) అనేపేరు వజ్ఝల గా మారి ఉండచ్చు .వీరి  కుటుంబం లో గణిత శాస్త్రాధ్యయనం ,ముహూర్త నిర్ణయం ,జాతక పరిశీలన మొదటి నుంచి ఉన్నాయి .శాస్త్రిగారికి గొప్ప పాండిత్యం ఉపజ్న ,బుద్ధి సూక్ష్మత ,సూక్ష్మ పరిశీనా బుద్ధి ,భుద్ధి తీక్ష్ణత ,వివేచన ,విషయ సంగ్రహణం సహజం గా అబ్బిన గొప్ప లక్షణాలు .ఆంద్ర శబ్ద చింతామణి ,వికృతి వివేకం లను తన వ్యాకరణ పరి శోధనకు మూల గ్రంధాలుగా స్వీకరించారు .వీటిని జోడించి ‘’వైయాకరణ ,పారిజాతం’’ ,’’వ్యాకరణ సంహితా సర్వస్వం’’ అనే రెండు అపూర్వ వ్యాకరణ గ్రంధాలను రచించారు .ఆంద్ర విశ్వవిద్యాలయం లో వజ్ఝల వారు భాషా పండితులుగా నియమింప బడ్డారు .విజయ నగర సంస్కృత కళాశాల ,మద్రాస్ ,ఆంద్ర విశ్వ విద్యాలయాలలో బోధనా వృత్తిలో దశాబ్దాల పాటు పని చేసి భాషా సేవ చేశారు .చిన తాత గారు చిన వెంకట సిద్ధాంతి గారి వద్ద ముహూర్త సిద్ధాంత విభాగాలు ,లీలావతి గణితం అభ్యసించారు .మరొక చిన తాత గారి వద్ద సంస్కృత వ్యాకరణ ,ధర్మ శాస్త్రాలను నేర్చారు .నడాదూర్ అనంతాల్వార్ దగ్గర తర్క వేదాన్తాలను నేర్చుకొన్నారు .

మూల గ్రందాలలోనికొన్ని సంజ్ఞా పరిచేద సూత్ర కారికలను కలిపి ‘’వైయాకరణ పారిజాతం’’రాశారు .ఇందులో ప్రత్యేకతలు కవి సంశయ విచ్చేదనాల ననుసరించి ధ్వని శాస్త్రాన్ని వివవివరణాత్మకం గా శాఖాద్యాదులననుసరించి లిపి స్వభావాన్ని నిర్ణయించారు .ప్రాచీన శాసనాలలో ఉన్న లేఖన సంప్రదాయాలను పరి శోధించారు .పూర్వ లాక్షణికులు చేసిన రేఫా ,శకట రేఫల పరిశోధనలను సమీక్షించారు ‘’సంహితా సర్వస్వం ‘’లోచింతామణి ,వికృతి వివేకాలను బాల వ్యాకరణ ప్రణాలికా బద్ధం గా విభజన చేసి ,కల్ప తరు వ్యాఖ్యను చేర్చి మహాద్భుత బృహద్గ్రంధం గా  గా రచన చేశారు . బాల వ్యాకరణ సంజీవనీ వ్యాఖ్య దీనికి ముఖ్యమైన అను బంధం గా ఉంది .దీనిలో అనేక లక్షణ గ్రందాల పరామర్శ ఉంది .

వజ్ఝల వారి నిశిత పరిశీలనా దృష్టికి దృష్టాం తాలే –అధర్వ కారికావళిపీఠికలు ,బాల సరస్వతీయ పీఠిక,చింతామణి విషయ పరిశోధనలు .వీరి బాల వ్యాకరణ ఉద్యోతం వ్యాకరణ సంహితా సర్వస్వం అని చెప్ప వచ్చు .వీరు రాసిన ‘’ద్రావిడ భాషా పరిశీలనం ‘’భాషా పరం గా శాస్త్రి గారి పరిశోధనా తీక్ష్ణ దృష్టికి గీటు రాయి .ఇందులో ప్రతిపాదించిన సిద్ధాంత సారమే’’ద్రావిడ భాషా సామ్యాలు ‘’అనే ఉత్క్రుస్ట గ్రంధం  .వీరి నిశిత పరిశీలనా నై పుణ్యానికి  గొప్ప ఉదాహరణలే –‘’వసు చరిత్ర విమర్శ’’,,’’హరిశ్చంద్ర నలోపాఖ్యాన పీఠిక ‘’ లు .ఈ బహుముఖ ప్రజ్ఞా శాలి 29-5-1964న ఎనభై అరవ ఏట పరమపదించారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

మరో అన్నపూర్ణ,కరుణాంత రంగ –శ్రీమతి కైవారం బాలాంబ

మరో అన్నపూర్ణ,కరుణాంత రంగ  –శ్రీమతి కైవారం బాలాంబ

ప్రాతస్మరణీయులు

నిరతాన్న ప్రదాతలు  అంటే ఆంద్ర దేశం లో ముందు గుర్తు కొచ్చేది అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు .ఆ తర్వాత శ్రీ బందా పరదేశి గారు .పిమ్మట శ్రీమతి జిల్లెళ్ళమూడి అమ్మగారు .వీరి చేతి భోజనం తిని తరించని వారు లేరు అంటే అతిశయోక్తికాదు .అంతే కీర్తి వైభవాన్ని నిరతాన్నదానం చేతపొందిన మరో దివ్యవ్యక్తి శ్రీమతి కైవారం బాలాంబ గారు .ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా వారి ఆప్యాయత ,ఆదరణ,ప్రేమ సేవా భావం తెలుగు జనం గుండెల్లో  స్తిరం గా  నిలిచిపోయాయి .వీరిలో బాలాంబ గారి గురించి ఈ తరం జనానికి పెద్దగా తెలిసి ఉండక పోవచ్చు .ఆమెను గురించి తెలియ జెప్పటానికే నేను చేస్తున్న ప్రయత్నం ఇది .

బాలాంబ గారి జీవిత విశేషాలు

గుంటూరు జిల్లా లోని అంగల కుదురు   గ్రామం లో బాలాంబ గారు 1849లో జన్మించారు వీరి తండ్రి గారు శ్రీ దేవులపల్లి సుబ్బన్న గారు .తల్లి గారు శ్రీమతి వెంకమాంబ గారు .ఈ కుటుంబం మొదటి నుండి దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందినది .బాలాంబ గారు చిన్నప్పటి నుండి దాన ధర్మాలపై గొప్ప శ్రద్ధ చూపేవారు .ఇవి తలి దండ్రుల నుండిఆమె కు  సంక్రమించిన సద్గుణాలు .బాల్యం లో నే రామాయణ ,భాగవతాదిఆధ్యాత్మిక గ్రంధాలను చదివి సారాన్ని జీర్ణించుకొన్నారు .’’అమ్మా !అన్నం ‘’అనే కేక యెంత దూరం నుండి వినిపించినా ఆమెకు  వినపడేది .వెంటనే ఇంటి నుండి అన్నం కూరలు ,పచ్చళ్ళు తీసుకొని వెళ్లి  వాళ్లకు  పెట్టి సంతృప్తి చెందేవారు .వారు కడుపునిండా తింటే ఆమెకెంతో సంతోషం గా ఉండేది .వారిలోనే పరమాత్మ ను దర్శించేవారామే .

వివాహం –దాంపత్యం

గుంటూరు జిల్లా మంగళ గిరి నివాసి కైవారం సుబ్బన్న గారితో బాలాంబ గారికి వివాహం జరిగింది .పెండ్లి అవగానే కాపురానికి అత్తవారిల్లు మంగళగిరీ వచ్చారు .సుబ్బన్న గారితో కాపురం ఏంతో అన్యోన్యంగా  కొన్నేళ్ళు కొనసాగింది .ఇంతలో దైవ ఘటన మరో రకం గా ఉంది .సుబ్బన్న గారు అకస్మాత్తుగా చనిపోయారు .మొదటి నుంచి శ్రీ మంగళ గిరి లక్ష్మీ నృసింహ స్వామిఉపాసనలో బాలాంబ గారు గడిపేవారు . భర్త మరణం తో ధ్యాస అంతా స్వామి మీదే లగ్నం చేసి  స్వామి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు  .కొంతకాలం మంగళ గిరి కొండపైనే ఉంది తపస్సు చేశారు .అనుకో కుండా బాలాంబ గారికి ఒక రోజు జ్ఞానోదయం అయింది .అన్నదానం చేయాలనే ప్రేరణ కలిగింది .

నిరతాన్న దాన కార్యక్రమం

మంగళ గిరి గ్రామం లో అన్నదాన కార్య క్రాన్ని బాలాంబ గారు ప్రారంభించారు .అన్నం పెట్టెటప్పుడు ఏ భేదమూ  పాటించే వారు కాదు . అదే ఆమె విశిష్ట వ్యక్తిత్వం .ఆ నాటి సంఘ ఆచార వ్యవహారాలలో ఇదొక గొప్ప ముందడుగే .నిరాడంబరం గా ,అదొక సేవా భాగ్యం గా అన్నదానాన్ని నిర్వహించేవారు .స్వ,పర భేదాన్ని ఏనాడు పాటించని సమద్రుష్టి బాలాంబ గారిది .ఆడంబరాల జోలికి పోకుండా ప్రశాంత చిత్తం తో నిరతాన్న దానాన్ని కొన సాగించారు ..క్రమంగా బాలాంబ గారి వితరణ  అందరికీ తెలిసి అందరి అభిమానానికి పాత్రురాలయ్యారు బాలాంబ గారు .ఆమె వారికి ఒక అన్నపూర్ణా దేవిగా గోచరిం చేవారు .

గ్రామం లోను ,చుట్టు ప్రక్కల గ్రామాలలోను బాలాంబ గారి సేవా తత్పరత ను గుర్తించిన దాతలు సహాయం చేయటానికి ముందుకొచ్చారు .వారి సహాయ సహకారాలను స్వీకరింఛి  బాలాంబ గారు అన్నదానాన్ని క్రమం గా విస్తరింప జేశారు .నిత్యం బాటసారులు ,పేదలు  భక్తులు ,వందలాదిగా వచ్చి బాలాంబ గారి ‘’అన్న దాన సత్రం ‘’లో అన్నదానాన్ని స్వీకరించి సంత్రుప్తిపొంది దీవించి వెళ్ళేవారు .పుణ్య క్షేత్రమైన మంగళ గిరి పానకాల స్వామిని దర్శించటానికి వచ్చే భక్తులకు ,బాటసారులకు ఇతరగ్రామాలనుండి స్వంత పనుల నిమిత్తం వచ్చేవారికి  అది ఒక కేంద్రమై నిలిచింది .బాలాంబ గారు అనే ఒక వ్యక్తీ ఇప్పుడు ఒక మహా సంస్థ గా ఎదిగారు .ఇంతటి భారీకార్య క్రమానికి కావలసిన వనరులు కూడా భారీగానే అవసరం కదా .

వనరుల సేకరణ

అందుకని బాలాంబ గారు ఎద్దుల బండీ మీద గ్రామాలలో పర్య టిం చేవారు .రైతులు అంద జేసే బియ్యం ,పప్పులు కూరలను సేకరిం చేవారు .రైతులు కూడా ఇదొక పవిత్ర యజ్ఞం అని భావించి తామూ అందులో భాగాస్వాములవుతున్నందుకు అధికమైన సంతోషం తో ఇష్టపూర్తిగా అన్నీ అందజేసి ,అది తమ పని గా భావించి సహాయ పడేవారు .పంటలు చేతికొచ్చినప్పుడు రైతులు బాలంబ గారి సత్రం లో సరుకులు తోలుకొని వెళ్లి పడేసేవారు  మంగళ గిరి స్వామి తిరునాళ్ళకు వచ్చే అసంఖ్యాక భక్త జనాలకు సత్రం లో కమ్మని రుచికరమైన శుచికరమైన భోజనాన్ని వండించి దగ్గరుండి వడ్డింప జేసేవారు బాలాంబ గారు .1926లో బాలాంబ గారు ‘’మంగళ గిరి అన్న పూర్ణ సత్రం ‘’అనే పేరుతొ ఒక ధర్మ సంస్థను నెలకొల్పారు. అన్నదానం ఒక నిరంతర కార్య క్రమంగా మారిపోయింది .ఆమె కీర్తి ప్రతిష్టలు జిల్లాలు దాటి రాష్ట్రమంతా వ్యాపించాయి .

యోగిని బాలాంబ గారు

ఫల ప్రాప్తికోసం కాకుండా అన్నదానం ఒక కర్తవ్యమ్ గా భావించి చేస్తున్న బాలాంబ గారు కేవలం ఒక యోగిని లాగా నే జీవించారు .యోగం లో ఆమెకు కొన్ని అద్భుత శక్తులు అలవడ్డాయి .ఎన్నో మహత్తులు ప్రదర్శించేవారని చెప్పుకొనేవారు .గుంటూరు సీమ అంటేనే ఆ నాడు కరువు ప్రాంతం .మెట్టపంటలేకాని మాగాణి భూములు చాలా తక్కువ .ఇంట్లో ఉన్న బావి నుండి నీరు తోడాలంటేనే మంగళ గిరి కొండ అంత ఎత్తున్న పొడవైన చేంతాడు కావాల్సి వచ్చేది .ఎక్కడో పాతాళం లో ఉన్నట్లు నీరు బావిలో కనిపించేది .దాన్ని చిన్న బొక్కేనతో పైకి తోడాలంటే చేతులు అరిగిపో యేవి బుజాలు నొప్పి పుట్టేవి .ఒక బకెట్ నీరు లాగిన వాడు బాల చంద్రునితో సమాన పరాక్రమం గలవాడనే వారు .అదీ ఆనాటి  పరిస్తితి .ఎవరైనా పొడుగ్గా ఉంటె ‘’మంగళ గిరి చాంతాడంత ఉన్నాడు ‘’అనే సామెత లోకం లో బాగా ప్రచారమైంది .ఇవన్నీ బాలాంబ గారు స్వయం గా అనుభవించిన కష్టాలే .ప్రజల బాధ ,వారి కాలేకడుపులు ,గుక్కెడు మంచి నీటి కోసం అర్రులు చాచే దైన్యం చూసి చూసి ఆమె కడుపు తరుక్కు పోయేది .ఏదో చేయాలనే తపన మొదలై  అన్నదానం చేసి వారికి కనీసం రొజు అన్నం తినే యోగ్యం కలిగించాలన్న భావనే ఆమెను అన్నదాన సత్ర నిర్మాణానికి ప్రోత్సహించి ఇంతటి మహత్కార్యాన్ని చేయించింది .

బాలాంబ గారు చిన్నప్పటి నుంచీ పురాణాలు చదివి అర్ధం చేసుకొని పారాయణ  చేసేవారని చెప్పుకొన్నాం .ఇప్పడు వైధవ్యం ,దైవ భక్తికి తోడై అన్నదాన మహత్కార్యానికి దోహద పడింది .అందర్నీ తన ఆత్మీయులు గా చూసుకొనే మహత్తర ఆత్మ సంస్కారం వారికి అబ్బంది .బాలాంబ గారిని చూస్తె సంస్కృత శ్లోకం ఒకటి గుర్తుకు వస్తుంది –

‘’శతేషు జాయతే శూరః –సహస్రేషు చ పండితః –వక్తా శత సహశ్రేషు –దాతా భవతా వా నవా ‘’

అంటే-శూరుడనే వాడు వందల్లో ఒకడు ఉంటాడు .పండితుడు అనేవాడు వేలల్లో ఒకడే ఉంటాడు .వక్త లక్షల్లో ఒకడు ఉండచ్చు .కాని ‘’దాత ‘’అనే వాడు అసలు ఉంటాడో ఉండడో.అంటే దాత అనే వాడు లభించటం బహు అరుదు అని భావం .సంప్రదాయపు కట్టు బాట్లను అతిక్రమించి అన్నదానం అనే పవిత్ర కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు .కరువు కాటకాతో అలమటించే బీదల కాలే కడుపులకు ఇంత అన్నం పెట్టి ఆదుకొన్న మరో అన్న పూర్ణ ,శాంతానికే శోభావైభవం బాలాంబ గారు .ఎవరి మెప్పుదలా మేహర్బానీకోసం చేసిన పనికాదు .ఆత్మ సంతృప్తికోసం  బాధితుల కన్నీరు తుడవటానికోసం ఆమె గారు చేసిన ఉడతంత సాయం .అదే మహద్భాగ్యం ఆ రోజుల్లో .అందుకే ఆమె మహా దాతల శ్రేణిలో చేరారు .నిరతాన్న దానం చేస్తూ ఆత్మ సంతృప్తి పొందుతూ దారిద్ర నారాయణ సేవతో పునీతమవుతూ జీవితాన్ని ధన్యం చేసుకొంటూ  భగవద్భక్తిలో తాదాత్మ్యం చెందుతూ 95ఏళ్ళ నిండు జీవితాన్నిసంతృప్తిగా  గడిపి ,కైవారం బాలాంబ గారు 12-8-1944న మన స్వాతంత్ర్యం రావటానికి సరిగ్గా ఏడాది ముందు స్వర్గస్తులయ్యారు .’’అన్న దాతా సుఖీ భవ’’

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-14-ఉయ్యూరు

 

.

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సావిత్రి కన్నీళ్ళు పెడుతుంటే చూడలేక పోయాను – విజయనిర్మల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆడశిశువులకు ‘నో ఎంట్రీ’! -లాస్య

ఆడశిశువులకు ‘నో ఎంట్రీ’!

  • -లాస్య

లింగ వివక్షను నిర్మూలించాలని ప్రభుత్వం ఎనె్నన్ని పథకాలను ప్రవేశపెట్టినా, భారీగా నిధులను ఖర్చు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చట్ట విరుద్ధ గర్భస్రావాలు, లింగ నిర్థారణ పరీక్షలు, భ్రూణహత్యలతో ఆడశిశువులు పుట్టకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు ఇంకా చాలా రాష్ట్రాల్లో కొనసాగుతున్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో లింగ నిష్పత్తి తగ్గినట్లు ప్రభుత్వం తాజాగా పార్లమెంటు సమావేశాల్లో అంగీకరించింది. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారమన్న భావజాలం నేటి ఆధునిక సమాజంలోనూ కొనసాగుతున్నందున లింగ నిష్పత్తి తీరు ఆందోళనకరంగానే ఉంది. ప్రతి వెయ్యి మంది బాలురతో పోల్చి చూస్తే దేశ వ్యాప్తంగా ఆడపిల్లల సంఖ్య 1991లో 945గా నమోదైంది. 2001లో ఆ సంఖ్య 927గా, 2011లో 918గా ఉంది. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. దక్షిణాదితో పోల్చి చూస్తే ఈ పరిస్థితి ఉత్తరాదిలో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వధువుల కోసం ఉత్తరాది రాష్ట్రాల యువకులు పొరుగు రాష్ట్రాలకు వెళుతున్న పరిస్థితులే లింగ నిష్పత్తి తగ్గిందనడానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.
దేశంలో ఇతర ప్రాంతాల కంటే హర్యానాలోని పనె్నండు జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. ఆ జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది బాలురకు 834 మంది బాలికలు ఉన్నారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. పంజాబ్‌లోని 11 జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది బాలురకు 846 మంది బాలికలు ఉన్నారు. రాజస్థాన్, మహారాష్ట్ర, యుపిలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా లేదు.
గత మూడు దశాబ్దాలుగా జననాల తీరును విశే్లషిస్తే ఆడశిశువులు వద్దనుకుంటున్న దంపతుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కుమారుడు పుడితేనే వంశం పెరుగుతుందని, కుటుంబానికి అండగా ఉంటాడన్న భావన ఇంకా అనేక కుటుంబాల్లో బలంగా ఉంది. సామాజిక పరిస్థితులు, సాంప్రదాయాల కారణంగా ఆడపిల్లలపై పలు రూపాల్లో వివక్ష కొనసాగుతోంది. ఆడపిల్లకు పెళ్లి చేయడం పెనుసమస్య అని ఇప్పటికీ ఎంతోమంది భావిస్తున్నారు. లింగ నిర్థారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో ఆడశిశువులు భూమీద పడకుండా అడ్డుకుంటున్నారు. గర్భస్రావాలు, భ్రూణహత్యలకు సైతం పాల్పడుతున్నందున ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని వైద్య నిపుణులు అంగీకరిస్తున్నారు. 1991లో దాద్రా, నగర్ హవేలి ప్రాంతంలో ప్రతి వెయ్యి మంది బాలురకు ఆడపిల్లల సంఖ్య 1013 కాగా, 2011లో ఆ సంఖ్య 926కు తగ్గింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాలికల సంఖ్య 1991లో 975 ( ప్రతి వెయ్యి మంది బాలురకు) కాగా, 2011లో ఆ సంఖ్య 939గా నమోదైంది. 1991- 2011 మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్ ఆ సంఖ్య 967 నుంచి 956కు తగ్గింది. మణిపూర్ (974 నుంచి 936), మేఘాలయ (986 నుంచి 970), నాగాలాండ్ (993 నుంచి 943) వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ బాలికల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒక్క మిజోరంలో మాత్రమే స్వల్పంగా ( 969 నుంచి 970కి) పెరిగింది. పంజాబ్‌లో 11 జిల్లాల్లో బాలికల సంఖ్య ఆందోళనకరంగా ఉన్నా, మిగతా జిల్లాల్లో 2001 నుంచి 2011 వరకూ స్వల్పంగా పెరుగుదల (798 నుంచి 846) కనిపించిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో బాలికల సంఖ్య 2001లో 975గా, 2011లో 915గా నమోదైంది. కేరళలో బాలికల సంఖ్య 1991లో 958గా, 2011లో 960గా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ సంఖ్య 1991లో 951గా, 2001లో 896కి తగ్గి, తిరిగి 2011లో 909గా పెరిగింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

janata parivaar

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -74 113-ధర్మ శాస్త్ర నిధి ,న్యాయాధీశ కవి –గుండేరావు హర్కారే

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -74

113-ధర్మ శాస్త్ర నిధి ,న్యాయాధీశ కవి –గుండేరావు హర్కారే

బహుభాషా వేత్త ,సంస్కృతానేక భాషా రచయిత ,ధర్మ శాస్త్ర నిధి శ్రీ గుండేరావు హర్కారే  13-3-1887 నహైదరాబాద్ లోరామారావు ,సీతా బాయి దంపతుల కు జన్మించారు .అరబ్బీ పారశీక భాషలను నేర్చి ,మెట్రి క్ చదివి   ,హైదరాబాద్ న్యాయ స్థానం లో గుమాస్తాగా ఉద్యోగం ప్రారంభించారు .తర్వాత తెలుగు ,మరాఠీ సంస్కృతం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పాండిత్యాన్ని సాధించారు .వృత్తిని  అంకిత భావం తో నిర్వహించటం గమనించి వీరిని అనువాదకునిగా చేసి పిమ్మట ఉన్నత న్యాయ స్థాన మండలి ప్రధాన న్యాయ  మూర్తి ఆంతరంగిక కార్య దర్శిగా ప్రభుత్వం నియమించి వారి బహుభాషా పాండిత్యానికి సరైన గౌరవాన్ని కలిగిం చింది .న్యాయ రాజస్వ ,గణాంకశాఖలలో ఉన్నత పరీక్షలు ఉద్యోగం సక్రమంగా నిర్వహిస్తూనే వ్రాసి ఉత్తీర్ణులయ్యారు .

సాహిత్యం లో గుండెలు తీసిన బంటు

భట్టు మూర్తి వసుచరిత్ర లోని మొదటి ,రెండు ఆశ్వాసాలను మరాఠీ లోకి అనువదింఛి ,అందులోని  కావ్య సౌందర్యాన్ని గొప్పగా వివరించారు గుండారే హర్కారే గారు .గద్వాల సంస్థానం లో 1919లో మున్సిఫ్ మేజిస్ట్రేట్ గా హర్కారే నియమింప బడ్డారు .క్రమంగా పదోన్నతి పొందుతూ ,జిల్లా న్యాయా దీశునిగా ,కలెక్టర్ గా ,సెషన్స్ జడ్జి గా ఎదిగి పదవీ విరమణ చేశారు .

న్యాయాదీశులుగా ఉంటూనే తీరిక వేళల్లో న్యాయ ,వ్యాకరణ ,పూర్వ మీమాంస మొదలైన శాస్త్రాధ్యయనం చేసి   లోతైన పరిశోధన చేసి,మద్రాస్ విశ్వ విద్యాలపు న్యాయ శిరోమణి ,సాహిత్య శిరోమణి పరీక్షలు రాసి,ఉత్తీర్ణులైనారు .ధర్మ శాస్త్రం లో ,తులనాత్మకసాహిత్యశాస్త్రాలలో పి. ఒ.ఎల్. పరీక్షనిచ్చి అత్యద్భుత ప్రతిభతో పాసైనారు .

ప్రతిభా పురస్కారం

హర్కారే గారి న్యాయ శాస్త్ర కోవిదత్వానికి మెచ్చి న్యాయ శాస్త్ర కేంద్రమైన నవ ద్వీపం లో పండిత పరిషత్తు  మెచ్చి ‘’వాచస్పతి ‘’బిరుదు ప్రదానం చేసి గౌరవించింది .   అయోధ్య ,బెల్గాం నగర పండిత సభలు ‘’విద్యా భూషణ ‘’నిచ్చి గౌరవించాయి .ఆలివర్ గోల్డ్ స్మిత్ఆంగ్లం లో  రాసిన ‘’ట్రావెల్’’ను సంస్కృతం లో పద్యాను వాదం చేశారు .దీనికి మైసూరు ప్రభుత్వం స్వర్ణ పతాకాన్ని ప్రదానం చేసి సమ్మానించింది.పూనా తిలక్ విద్యా పీఠం వీరిని పూర్వ మీమాంసా శాస్త్ర పరీక్షకులు గాను  ,మైసూర్ విద్వత్ పరీక్షకు సాహిత్య శాస్త్ర పరీక్షకులుగా సగౌరవం గా నియమించి వారి విద్వత్తును వినియో గించుకోన్నాయి .

వైవిధ్య భరిత రచనలు చేయటం లో హర్కారే గారు సర్వ సమర్ధులని పించుకొన్నారు .ఆంగ్లం లో ధామస్ గ్రేరాసిన ‘’ఎలిజీ’’,గోల్డ్ స్మిత్ రచించిన ‘’ద డిజర్తెడ్ విలేజ్ ‘’వర్డ్స్ వర్త్ రచన ‘’ఇంటి మేషన్ టు ఇమ్మోర్టా లిటి ‘’షేక్స్ పియర్ హేమ్లెట్ మిడ్ సమ్మర్ నైట్స్’’ లను సంస్కృతం లోకి శ్లోకానువాదం   చేశారు . ,పార్శీ లోని ‘’మస్నావీ షరీఫ్’’,అరబ్బీ భాషలో ఉన్న  ‘’ఖురానే షరీఫ్ ‘’ను సంస్కృతం లోకి అనువాదం చేసి తన పాండిత్య సామర్ధ్యాలను నిరూపిం చారు .యాజ్ఞ వల్క్య స్మృతికి ‘’మితాక్షారా’’అనే వ్యాఖ్యానం ,ఖురాన్ కు ‘’ఖురానే మితాక్షరా’’పారిభాషిక పద వివరణలతో ఉర్దూ భాష లోకి అనువదించారు .యాస్కుని నిరుక్తం ను కొంత వరకు   రాశారు .మరాఠీ సాహిత్య చరిత్రను తెలుగులోకి అనువదించారు .శబ్ద బోధ ప్రక్రియకు న్యాయ మీమాంస లను  ఆధారం గా సులభ వివరణ రచించారు .తెలుగు విజ్ఞాన సర్వస్వం ,సంగ్రహ ఆంద్ర విజ్ఞాన కోశం లలో హరారే రచిం చిన ‘’ఉర్దూ భాషా చరిత్ర’’ ‘’కుమరిల భట్టు ‘’వ్యాసాలు చోటు చేసుకొన్నాయి .

అఖిల భారత ప్రాచ్య విద్మన్ మహా సభ లో ‘’అభినవ గుప్త పాదుని రస వివరణ’’ పై ప్రత్యభిజ్నా సిద్ధాంత ప్రభావాన్ని గూర్చి రాసి న విమర్శనా వ్యాసం అత్యుత్తమమైనదిగా,తలమానికమైనదిగా  గుర్తింపు పొందింది .ఇలాంటి పరిశోధనావ్యాసాలు గుండే’రావు గారి లేఖిని నుంచి ఎన్నో ప్రవహించాయి .’’ప్రత్యయ కోశం ‘’,వీరు రచించిన వ్యారణ గ్రందాన్ని  ఉస్మానియా విశ్వ విద్యాలయ సంస్కృత శాఖ   ప్రచురించి గౌరవించింది .’’సంస్కృతం ‘’,’’భారతి ‘’ ‘’మధుర వాణి’’,ఎడ్యుకేషనల్ రివ్యు ‘’,’’ఇస్లామిక్ కల్చర్ ‘’మొదలైన పత్రికలో వీరి రచనలు వెలువడటం ఆ పత్రికలు చేసుకొన్న అదృష్టం .రేడియోలో అనేక భాషలలో శాస్త్రీయ వైజ్ఞానిక విషయాలపై  సూఫీ-బారతీయ వేదాంతాల తులనాత్మక పరి శీలనపై హర్కారే గారు మాట్లాడిన ప్రసంగాలు దాదాపు ఎనిమిది వందల పేజీల పైనే ఉన్నాయి అంటే అమితాశ్చర్యమేస్తుంది .

చెన్నై కుప్పుస్వామి శాస్త్రి పరిశోధనా సంస్థ ,ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వం ,తెలుగు రచయితల సంఘం ,వీరిని సగౌరవం గా ఆత్మీయం గా సన్మానిం ఛి తమను తాము సన్మానం చేసుకొన్నాయి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి  వీరిని విశిస్టసభ్యులుగా స్వీకరించింది .భారత రాష్ట్ర పతి’వీరి శాస్త్ర నిస్టకు ప్రతీక గా ’మాన్యతా ప్రమాణ పత్రం ‘’(సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్ ) అందజేసి సత్కరించారు .పాణినీయ సంస్కృత వ్యాకరణం ఆధునిక విజ్ఞాన శాస్త్రాల వంటిదే నని నిరూపిస్తూ ,రూప నిష్పత్తి ప్రక్రియ ను సులభం గా బోధించటానికి వీలుగా ‘’వ్యాకరణ యంత్రం ‘’ను నిర్మించిన సాంకేతిక విజ్ఞాని హర్కారే .దీనికోసం  ఒక పరిశోధనా విభాగాన్ని ఏర్పరచి ,కంప్యూటర్ విధానం లో ఆ యంత్రాన్ని ప్రవేశ పెట్టాలని కోరుకొన్నారు .ఆ కల సాఫల్యం కా  కుండానే మహా శాస్త్ర విజ్ఞాన కవిపండిత  బహుభాషా మర్మజ్న న్యాయాదిపతి శ్రీ గుండూరావు హర్కారే తొంభై వ ఏట 3-12-1979న కైవల్యం పొందారు .వారు లేని లోటు పూరింప రానిది .

Photo of Gunde Rao HarkareFront Cover

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -73 111-కాళిదాస సములు –శ్రీ పేరి కాశీనాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -73

111-కాళిదాస సములు –శ్రీ పేరి కాశీనాధ శాస్త్రి

‘’యదా కాళిదాస స్తధా కాశీ నాదః  ‘’అని పించు కొన్న మహా సంస్కృత విద్వాంస కవిపండితులు శ్రీ పేరి కాశీ నాద శాస్త్రి గారు .విశాఖ పట్నం మండలం గజపతి నగరం తాలూకా పురిటి పెంట గ్రామం లో 1885లో జన్మించారు .తండ్రి వెంకట శాస్త్రి, తల్లి మహాలక్ష్మమ్మ గార్లు .తండ్రి గారే ప్రధమ గురువులు .తండ్రివద్ద వ్యాకరణాన్ని ఔపోసనపట్టారు .మధ్వశ్రీ భీమా చార్యుల వారి వద్ద న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు .కొల్లూరు కామ శాస్త్రి గారి దగ్గర వేదాంత ,అలంకార శాస్త్రాలను నేర్చారు .

కాశీ నాద శాస్త్రి గారు విజయ నగర మహా రాజా ఆస్థాన పండితులు .తర్వాత రాజావారి సంస్కృత కళాశాలలో సంస్కృత ఉపాధ్యాయునిగా చేరి జీవితాంతం కొనసాగారు .పాఠ ప్రవచనం లో ప్రసిద్దులనిపించుకొన్నారు .వాద శక్తిలో ప్రతివాద భయంకరులే .మహా విద్వాంసులైనా, కవిగా కూడా కీర్తి గాంచారు .మహారాజు ఆనంద గజపతి భోజరాజు అని కాశీనాధ శాస్త్రిగారు కాళి దాసమహాకవి అని ఆరోజులలో అందరూ చెప్పుకొనేవారు .అనేక కవితలు రాసి వెలువరిస్తూ నానా రాజ సందర్శనం చేస్తూ సత్కార పురస్కారాలు అందుకొంటూ జైత్ర యాత్ర చేశారు .పండిత, కవి మహా జనమధ్యఎన్నో  కనకాభిషేకాలు  అందుకొన్న మహా శాస్త్ర విద్వాంసులు .

గోదావరీలహరి ,బ్రహ్మ సూత్ర భాష్యానువాదం అనే రెండు గ్రంధాలు రాసి ముద్రించారు .ఉత్తర శాకుంతలం అనే గ్రంధ వ్రాత ప్రతి ఇప్పటికీ విజయ నగర రాజ గ్రంధాలయం లో ఉందని చెబుతారు .శాస్త్రి గారు పూర్తిగా  గ్రాంధిక వాది .ఆ నాటి మరోగ్రాన్ధిక భాషా వాది అయిన కల్లూరి వెంకట రామ శాస్త్రి గారికి వత్తాసుగా ఉండేవారు .ఉర్లాం మొదలైన సంస్థానాల్లో శాస్త్రిగారు విద్వత్ పరీక్షకులుగాఉండి సన్మానాల నందుకొన్నారు .వీరి సంతానం ఆరుగురు .అందులో ఇద్దరుకుమారులు నలుగురు కుమార్తెలు .ప్రసిద్ధ శాస్త్ర పారంగతులు మహామహోపాధ్యాయ శ్రీ తాతాసుబ్బరాయ శాస్త్రి గారు కాశీ నాధ శాస్త్రిగారికి అల్లుడుగారు .అరవై రెండేళ్ళు జీవించి శాస్త్రిగారు 1920లో మరణించారు .

 

112- సంస్కృతం లోనే  ఉత్తరాలు రాసిన –నాగ పూడి కుప్పుసామయ్య

1864లో తమిళనాడు లోని తిరుత్తని లో కుప్పుసామయ్యగారు జన్మించారు .అసలుపేరు రామ కృష్ణ శర్మ .మద్రాస్ లో చదివారు తిరుపతిలో న్యాయ వాదిగా ఉండి,ఇక్కడే స్తిరపడ్డారు .సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితులని పించుకొన్నారు .రెండుభాషల్లో కవిత్వం చెప్పి అనేకమైన గ్రంధ రచన చేసిన సవ్య సాచి .

శత ఘంటం వెంకట రంగ శస్త్రి గారు అనే మహా విద్వాంసుల శిష్యుడై సంస్కృతం అభ్యసించారు .వట్టిపల్లి నర కంఠీరవ శాస్త్రి ,వేదం వెంకట రాయ శాస్త్రి ,జనమంచి శేషాద్రి శర్మ వంటి ఆనాటి ప్రసిద్దులు వీరికి ప్రాణ స్నేహితులు .వీరి విద్వత్తును గుర్తించి ప్రభుత్వం తిరుపతి సంస్కృత కళాశాల పాలక మండలిలో సభ్యులనుగా నియమించి గౌరవించి వీరి అమూల్య సేవలను అందుకొన్నది .

నైష్టిక జీవనం వినమ్రత ,రుజువర్తనం వీరికి సహజ భూషణాలు .వీటికి శిష్యులు ఆకర్షింప బడి ఆరాధించారు .పారిజాతాపహరణం అనే నంది తిమ్మన ప్రబంధానికి ఎవరూ వ్యాఖ్యానం రచించ నందున వీరు చక్కని ‘’పరిమళోల్లాస వ్యాఖ్యానం’’బహు సుందరంగా సులభ శైలిలో 1929లో రాసి  ప్రచురింఛి ఆ లోటును తీర్చారు .సంస్కృతాంధ్రాలలో వీరు రచించిన కృతులు అనేకం ఉన్నాయి .అయితే చాలాభాగం అముద్రితాలే కావటం మన దురదృష్టం .మిత్రులకు శిష్యులకు కుప్పుసామయ్యగారు రాసే ఉత్తరాలలో ఎక్కువగా సంస్కృతమే రాసేవారు .అప్పుడప్పుడు తెలుగుపద్యాలతోనే ఉత్తరాలు రాసేవారు .సంస్కృతం లో రాసిన కావ్యాలనన్నిటిని  కావ్య సంపుటం గా చేసి ‘’సప్త రత్నావళి ‘’పేరిట ‘’1927లో ముద్రించారు .ఇందులో పది హేడు లఘుకావ్యాలున్నాయి . పారిజాతాపహరణం వ్యాఖ్యానం లో తన పుట్టుపూర్వోత్తరాలను పేర్కొన్నారు . నాగ పూడి  గ్రామం లో జన్మించానని ,భారద్వాజస గోత్రమని ,సామగద్రాహ్యాన సూత్రీకులమని ,యజ్నేశ్వరార్య పుత్రుడినని కుప్పుసామి పండితుడనని  ,రాసుకొన్నారు డెబ్భై ఏడేళ్ళు జీవించి ఈ మహా పండతకవి  1941లో పరమ పదించారు ..

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-14-ఉయ్యూరు  .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆమెకు శునకాలే కన్నకొడుకులు

ఇవే కన్న కొడుకులు

మనుషులు చూపే ప్రేమలో వెనకాముందు ఆలోచనలేవైనా ఉంటాయేమో కాని.. శునకాలు చూపించే వాత్సల్యంలో నూటికి నూరు శాతం సహజత్వం ఉంటుంది. అందుకే మనుషులకు లేని విశ్వాసం కుక్కలకు ఉంటుందంటారు. ఆలాంటి మూగజీవులను చేరదీసి.. ఇద్దరు కొడుకులు లేరన్న లోటును తీర్చుకుంది విజయవాడకు చెందిన పాలడుగు సుజాత.
తను చేరదీసిన ఆ వీధిశునకాలు కన్నబిడ్డలకంటే ఎక్కువయ్యాయిప్పుడు. జీవితంలో ఎదురైన పెను విషాదాన్ని సైతం తుడిపేశాయవి. ఆ విషయాలనే ‘నవ్య’తో పంచుకున్నారు సుజాత..
‘‘మాది విజయవాడ. భర్త బాబూరావు వన్‌టౌన్‌లోని పాలఫ్యాక్టరీ ఉద్యోగి. నాకు చదవడం తప్ప రాయడం రాదు. అందుకనే గృహిణిగానే ఉండిపోయాను. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దోడు సాయితేజ బీటెక్‌ పూర్తిచేశాడు. విజయవాడలోనే ఎయిర్‌టెల్‌లో ఉద్యోగం వచ్చింది. రెండో అబ్బాయి సందీప్‌ విశాఖపట్టణంలో ఎంబీఏ చేస్తున్నాడప్పుడు. ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతున్న సమయం అది. ఒక రోజున – ఢిల్లీలోని నోకియా కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని తమ్ముడిని కూడా వెంటబెట్టుకెళ్లాడు సాయితేజ. పదిహేను రోజుల తర్వాత ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది మాకు. ఆ వార్త విని కుప్పకూలిపోయాం. మా ఇద్దరు కొడుకులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని, అక్కడే లోయలో పడి చనిపోయారని తెలిసింది. కాళ్లు చేతులు ఆడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చెట్టంత కొడుకులు, జీవితమంతా ధారపోసి పెంచి పెద్ద చేసిన కొడుకులు.. హఠాత్తుగా మాయమైపోతే ఆ తల్లిదండ్రుల కడుపుకోత చెప్పేదేముంది? భరించిన వాళ్లకే తెలుస్తుంది ఆ బాధ! ఒక దశలో నేను పిచ్చిదాన్ని అవుతానేమోనన్నంత భయం. ఇక ఎవరి కోసం బతకాలన్నంత కుంగుబాటు. అంతా శూన్యంలా తోచేది. పిల్లలు లేని జీవితం ఇక ఎందుకు? ఏం సాధించాలని? ఎవరి కోసం బతకాలని? అనిపించేది.
అవే నా లోకం..
నా భర్తతో కలిసి కారులో వెళుతున్నప్పుడు – షడన్‌గా కారు డోర్‌ ఓపెన్‌ చేసి రోడ్డు మీద పడి చచ్చిపోవాలని చాలాసార్లు అనుకున్నాను. రెండేళ్లపాటు అవే ఆలోచనలు పట్టి పీడించాయి నన్ను. ఎవరితో మాట్లాడుతున్నా కళ్లలో నీళ్లు మెదిలేవి. అలాంటి విషాద సమయంలో ఒక రోజున – మా ఇంటి ముందు కాళ్లు ఈడ్చుకుంటూ బాధతో మూలుగుతూ ఒక శునకం కంటపడింది. దాని వెనక కాళ్లు రెండు నుజ్జు నుజ్జు అయిపోయాయి. బహుశా ఏదో వాహనం దాని మీద నుంచి వెళ్లినట్లుంది. ఆ కుక్క అవస్థను చూస్తూనే నా గుండె కరిగిపోయింది. అప్రయత్నంగానే అమాంతం వెళ్లి రెండు చేతుల్లోకి తీసుకున్నాను. అప్పుడది నా వైపు కృతజ్ఞతాభావంతో చూసిన చూపుకు మాటలు రాలేదు. అప్పటికప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లి సపర్యలు చేశాను. అది కాస్త తేరుకుంది. ఇంట్లో ఎక్కడికి వెళ్లినా ఆప్యాయంగా నా వెనకే వచ్చేది. కొద్ది రోజుల్లోనే దాంతో అనుకోని బంధం ఏర్పడింది. ఆ కుక్కకు నేను పెట్టుకున్న ముద్దు పేరు శేషు. ఆ తర్వాత – మెడకు ఏదో బిగుసుకుపోయి దిక్కుతోచక పరుగులు తీస్తున్న మరో కుక్క నాకు తారసపడింది. దాన్ని అక్కున చేర్చుకుని వైద్యం చేయించాను. కొన్నాళ్లకు అది కూడా తేరుకుంది. ఈ రెండో శునకానికీ జిమ్మీ అని నామకరణం చేశా. ఆ రెండు పేర్లతో నేను పిలవగానే ఎక్కడున్నా అవి పరుగు పరుగున నా వద్దకు వచ్చి.. రెండు కాళ్లతో ఆప్యాయంగా నా మీదికి ఎగిరి.. ఎక్కడలేని ప్రేమను చూపించేవి. అలాంటిదే మరో కుక్కకు ఆశ్రయం ఇచ్చాను. ఆ మూడింటి పోషణ నాకొక వ్యాపకంగా మారిపోయింది. నాలో నాకు తెలియకుండానే.. నా ఇద్దరు కొడుకులు లేరన్న బాధ మెల్లగా తగ్గిపోవడం మొదలైంది. పిల్లల మీదున్న ఆ ప్రేమను ఈ శునకాల్లో చూసుకునేదాన్ని.
ఆసరా కావాలిప్పుడు..
విజయవాడలోనే కాళీకృష్ణ భగవాన్‌ ఆలయానికి సమీపంలోని ఓ అద్దె ఇల్లు వీటి నివాసం. నెలకు రెండువేలు అద్దె. ఒక్కొక్కటిగా తోడైన శునకాలు 34 అయ్యాయి. అవన్నీ షావుకార్లు పెంచుకున్న జాతికుక్కలు కాదు. వీధి శునకాలు. ఏ దిక్కూమొక్కులేని నిర్భాగ్య మూగజీవులు. వీధుల్లో తిరుగుతూ ఏ ప్రమాదాలకో, జబ్బులకో గురైనవి. నా బిడ్డలకంటే ఎక్కువయ్యాయి. ఇప్పుడు శునకాలే నా లోకం. వాటి ఆలనా పాలనతోనే సమయం గడిచిపోతోంది. ప్రతి రోజు ఉదయం ఆరింటికే బిస్కెట్లు తినిపించి, పాలు తాగిస్తాను. మధ్యాహ్నం మజ్జిగ అన్నం పెడితే ఆవురావురుమని తింటాయి. రాత్రికి కూడా ఏదో ఒక తిండి ఉంటుంది. ఆది, బుధవారాలప్పుడు మాత్రం మాంసాహారం అందజేస్త్తాను. శుక్రవారం నాడు మజ్జిగ అన్నానికి బదులు.. సాంబారు అన్నం వడ్డిస్తాను. ప్రతి ఆరు మాసాలకోసారి అన్ని శునకాలకు వైద్య పరీక్షలు ఉంటాయి. ఏడాదికి ఒకసారి వ్యాధినిరోధక ఇంజక్షన్లు తప్పనిసరి చేశాను. ఈ రోజుల్లో ఇద్దరు ముగ్గురున్న కుటుంబం గడవడానికే వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇన్నేసి మూగజీవులకు తిండి సమకూర్చడం ఆషామాషీ వ్యవహారం కాదు. శునకాల కోసం తీసుకున్న ఇంటి అద్దె, తిండి, వైద్యం ఇలా అన్నీ కలుపుకుంటే సుమారు నెలకు పాతికవేలు అవుతోంది. ఈ మొత్తంలో ఓ పదివేలు మాత్రం నా భర్త సమకూరుస్తున్నాడు. మిగిలిన డబ్బును నా సోదరి ముగ్గురు కూతుళ్లు తలా ఒక చేయి వేస్తున్నారు. అందరి ఔదార్యంతోనే బండి సజావుగా సాగుతున్నా.. ఈ మధ్యనే ఒక ఇబ్బంది వచ్చిపడింది. శునకాల కోసం తీసుకున్న ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తోంది. వీధికుక్కల వల్ల చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బందులు వస్తున్నాయని ఇల్లును ఖాళీ చేయమన్నారు. దీంతో ఈ కుక్కలన్నింటినీ ఎక్కడికి తరలించాలో అర్థం కావడం లేదు. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న వీటిని ఉన్నఫలంగా నడి రోడ్డుమీద వదిలేయలేము కదా! నాకిప్పుడు కాస్త దాతల ఆసరా కావాలి. ఎవరైనా మూగజీవుల మీద ఔదార్యం చూపించే సహృదయ మానవతామూర్తుల అండ కావాలి. ప్రభుత్వం కూడా స్పందించి ఒక మార్గం చూపిస్తే అదే పదివేలు.
పాలడుగు సుజాత ఫోన్‌ : 99493 45644
‘‘మా ఇద్దరు కొడుకులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారని, అక్కడే లోయలో పడి చనిపోయారని తెలిసింది. కాళ్లు చేతులు ఆడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చెట్టంత కొడుకులు, జీవితమంతా ధారపోసి పెంచి పెద్ద చేసిన కొడుకులు.. హఠాత్తుగా మాయమైపోతే ఆ తల్లిదండ్రుల కడుపుకోత చెప్పేదేముంది? భరించిన వాళ్లకే తెలుస్తుంది ఆ బాధ! ఒక దశలో నేను పిచ్చిదాన్ని అవుతానేమోనన్నంత భయం. ఇక ఎవరి కోసం బతకాలన్నంత కుంగుబాటు. అంతా శూన్యంలా తోచేది. పిల్లలు లేని జీవితం ఇక ఎందుకు? ఏం సాధించాలని? ఎవరి కోసం బతకాలని? అనిపించేది..
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒకే వ్యక్తీ ఆరుమతాలు -శ్రీ అరవింద రావు

హిందూమతంలో ప్రముఖంగా ఉండే మూడు సంప్రదాయాల్ని ప్రచారం చేసిన ఆచార్యులు శ్రీ శంకరాచార్యులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీమద్వాచార్యులు. వీరి పేర్లు మనలో చాలామందికి తెలుసు. చరిత్ర క్రమంలో వీరిలో మొదటివాడు ఎనిమిదవ శతాబ్దికి చెందిన శంకరాచార్యులు. ఈయన కే రళలో పుట్టాడు. కేవలం 32 సంవత్సరాలే జీవించాడు.ఆ స్వల్పకాలంలోనే దేశం నలుమూలలూ తిరిగాడు. కేరళ నుండి కాశ్మీర దేశం వెళ్లి అక్కడి పండితులతో వాదోపవాదాలు చేసి సర్వజ్ఞపీఠాన్ని ఎక్కాడు. పశ్చిమంలో ద్వారకలోనూ, తూర్పున ఉన్న పూరీ నగరంలోనూ పీఠాల్ని ఏర్పాటు చేశాడు. ఆయన రాసిన పుస్తకాలు అపారం. చాలా మూలగ్రంఽథాలపై వ్యాఖ్యలు వ్రాశాడు. ఇవన్నీ సాధారణంగా తెలిసిన విషయాలే. అయితే అతనికి షణ్మతస్థాపకాచార్యుడు – అంటే ఆరు మతాల్ని స్థాపించినవాడు అనే పేరు ఉందని చాలామందికి తెలీదు. ఒక వ్యక్తి ఆరు మతాల్ని స్థాపించడమేమిటి? ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే.
మిగతా మతాల్లో లాగ హిందూమతంలో ఒక సంస్థాగత నిర్మాణం (ౌటజ్చుఽజీట్చ్టజీౌుఽ్చజూ ట్టటఠఛ్టిఠట్ఛ) లేకపోవడం వల్ల ఎవరికి వారే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి ఆచార్యులు, మహర్షులు అనుకునే ప్రమాదం ప్రాచీన కాలం నుంచీ ఉంది. పరమాత్మను ఏ విధంగానైనా ఉపాసన చేయవచ్చని ఉపనిషత్తులు కూడా స్వాతంత్య్రం ఇచ్చాయి. అందువల్ల శంకరాచార్యుల కాలంనాటికే విచ్చలవిడి సంప్రదాయాలు సమాజంలో ఏర్పడ్డాయి, శివుడు, శక్తి, సూర్యుడు, విష్ణువు మొదలగు దేవతా స్వరూపాలన్నీ వేదాల్లో చెప్పినవే. ఇవన్నీ ఒకే తత్త్వంలో వివిధ కోణాలనుంచి చూస్తే వచ్చే పేర్లు. ఇందులో భరత ఖండంలోని ఒక్కొక్క దేవుడి ఆరాధన ప్రముఖంగా ఉండేది. ఉదాహరణకు కాశ్మీరదేశంలో శివుడి ఆరాధన, బెంగాల్‌ ప్రాంతంలో విష్ణువు ఆరాధన, ఒరిస్సా ప్రాంతంలో సూర్యుడు, తమిళ ప్రాంతంలో షణ్ముఖుడు ఇలాగ. వీరిని ఉపాసన చేసే మార్గాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో ఉండేవి. మనిషి స్వభావాన్ని బట్టి కూడా పూజా పద్ధతులు ఉంటాయి. శ్రీకృష్ణుడు దీన్నే సాత్విక, రాజస, తామస విధానాలు అని గీతలో చెబుతాడు. సాత్వికులు శ్రద్ధ, భక్తి, నియమనిష్ఠలతో పూజ చేసేవారు. రాజ గుణం ఉన్నవాళ్లు కొంత డాంబికంగా, తీవ్రమైన ఫలాకాంక్షతో పూజించేవారు. తామస ప్రవృత్తి కలవాళ్లు శాస్త్రవిరుద్ధంగా ఘోరమైన రీతిలో పూజలు చేసేవారు.
శంకరాచార్యుల కాలం నాటికి దేశంలో దాదాపు అరవై వరకూ విభిన్న సంప్రదాయాలు ఉండేవట. ఒకే దేవుణ్ని వివిధ సంప్రదాయాల్లో, వివిధ రీతుల్లో పూజించే వారట. వీటిని ముఖ్యంగా దక్షిణాచారము, వామాచారము అనే పేర్లతో రెండు తరగతులుగా చెబుతారు. ఈ పదాల్ని ఈనాటి ఉదాహరణతో బాగా అర్థం చేసుకోవచ్చు. ఒక పై ఆఫీసరు మన కార్యాలయం తనిఖీకి వచ్చినప్పుడు సంపత్సరం పాటు శ్రద్ధగా మనం చేసిన పనిని చూపించి మెప్పించడం అనేది దక్షిణాచారము. అలా కాకుండా పై ఆఫీసరుకు మద్యమాంసాదులు నైవేద్యం చేసి మంచి సర్టిఫికేట్‌ కొట్టడానికి ప్రయత్నించడం వామాచారము. దేవుడైనా, పై ఆఫీసరైనా మనిషి స్వభావం ఒకటే. అందువల్ల మనిషి మంచి ప్రవర్తన కలిగివుండి శ్రద్ధతో పూజించడం దక్షిణాచారం. శ్మశానాల్లో కూర్చుని మద్యమాంసాలు సేవిస్తూ, పూజ చేస్తున్నట్లు భావించుకోవడం వామాచారం.
శంకరాచార్యుల కాలం నాటికి ఇలాంటి వామాచారం అధికంగా ఉండేది. గణేశుడిని పూజించడంలో గణేశుడి బొమ్మపై మద్యాన్ని ఉమ్మి, గణేశుడు తన భార్యతో రతిచేస్తున్నట్లు భావిస్తూ కొద్దిమంది గడిపేవారు. ఇది ఉచ్ఛిష్టగణపతి సంప్రదాయం. కాపాలికులు అనేది మరొక సంప్రదాయం. మనుషుల పుర్రెల్ని మాలగా మెడలో వేసుకుని శ్మశానంలోని బూడిదను ఒంటికి పూసుకుని తాము జ్ఞానులమంటూ తిరిగేవారు మరికొందరు. బొటనవేలు కోసుకుని ఆ రక్తంతో సూర్యుడికి తర్పణం చేసేవారు మరొకరు. ఒంటినిండా శూలాలు గుచ్చుకుని తిరిగేవారు మరొకరు. మరికొందరు మన్మధుణ్ణి పూజించేవారు. మరికొందరు కుబేర భక్తులు. కొందరు భేతాళుణ్ణి, భూతపిశాచాల్నీ వశంలో పెట్టుకునేవారు. వీళ్లందరూ తీవ్రంగా ఉపాసన చేసేవారే. కానీ సమాజానికి సరియైున మార్గదర్శకం చేయ లేదు. ఈ రీతిగా వెర్రితలలు వేస్తున్న సమయంలో నాస్తికవాదం కూడా బలంగా ప్రచారంలోకి వచ్చింది.
శంకరాచార్యులు ఇలాంటి వామాచారాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది ఉపనిషత్తుల సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధమని వాదించి అనేక దురాచారాల్ని మాన్పించారు. దేశమంతా గమనిస్తే ముఖ్యమైనవి ఆరు సంప్రదాయాలు ఉండేవి. అవి విష్ణువు, శివుడు, శక్తి, వినాయకుడు, సూర్యుడు, షణ్ముఖుడు (కుమారస్వామి) అనే దేవతారూపాలకు చెందిన సంప్రదాయాలు. శంకరాచార్యులు వీటికి సంబంధించిన దక్షిణాచారాన్ని మాత్రం సమర్థించి వీరందరిపై స్తోత్రాలు రాశారు. ఈయన స్తోత్రాలన్నీ వేదాంతపరంగా ఉంటాయి. ఆయా దేవుళ్లను కేవలం కోరికలు కోరడం కాకుండా పరబ్రహ్మ స్వరూపాలుగా వర్ణించడం, తనకు సరైన జ్ఞానం, వైరాగ్యం ఇవ్వమని కోరడం ఈయన స్తోత్రాల్లోని ప్రత్యేకత. పై ఆరు ఆచారాల్ని సమర్థించి, ఆ ఆరు రూపాలు కూడా పరమాత్మ రూపాలుగా చెప్పడం వల్ల ఇతడిని షణ్మతస్థాపకాచార్యుడు అన్నారు. ఈయన కొత్తమతాన్ని దేన్నీ స్థాపించలేదు. ఉన్నవాటి మధ్య ఘర్షణలు లేకుండా సమన్వయం చేశాడు. ఈనాటి భాషలో చెప్పాలంటే ఈయన ఒక గొప్ప సంఘసంస్కర్త.
మనం నేడు కూడా దక్షిణ భారత దేశమంతటా గమనించే పంచాయతనం అనే పద్ధతి శంకరాచార్యుల ప్రభావమే. పంచాయతనం అంటే ఐదు దేవతల్ని ఒకేచోట ఉంచి పూజించటం. ఉదాహరణకు విష్ణు దేవాలయం ఉంటే గర్భగుడిలో విష్ణుమూర్తి విగ్రహం ఉండి, ప్రాకారం నాలుగు మూలలా మిగతా నలుగురు దేవుళ్లు (శివుడు, గణపతి, శక్తి, సూర్యుడు) ఉండడం. శివుడి గుడి అంటే గర్భగుడిలో శివుడిని స్థాపించి మిగతా నాలుగు మూలలా మిగతా దేవుళ్లు ఉండడం. దేవాలయాల్లోనే కాకుండా తమ తమ ఇండ్లలో పంచాయతన పూజ చేసుకునేవాళ్లు కూడా ఇలాగే చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన దేవతా చిహ్నాన్ని (సాలగ్రామము లేదా లింగం మొదలైనవి) మధ్యలో ఉంచి మిగతా చిహ్నాల్ని చుట్టూ ఉంచడం. వివిధ సంప్రదాయాల మధ్య శత్రుత్వం లేకుండా అందరినీ గౌరవించే సంప్రదాయం సమాజంలో స్థాపించడానికి శంకరాచార్యుల ప్రచారమే ముఖ్యకారణం. పాశ్చాత్యదేశాల్లో లాగ పరమతదూషణ మనలో లేదు. వైష్ణవులు విష్ణువే దేవుడని చెప్పినా మిగతావారిని రాక్షసులంటూ దూషించలేదు. శైవులు శివుడే దేవుడని చెప్పినా విష్ణువును రాక్షసుడని దూషించలేదు. విభిన్న సంప్రదాయాలన్నింటినీ ఉపనిషత్తుల గొడుగు కిందికి తేవడం, వాటి మధ్య సంఘర్షణలు లేకుండా చేయడం శంకరాచార్యుల గొప్పదనం.
భిన్నత్వంలో ఏకత్వం చూడటం అంటే ఇదే. ఉపనిషత్తులు ఇలాంటి ఏకత్వాన్నే బోధిస్తాయి. ఈ వాతావరణం దాదాపు 14-15 శతాబ్దాల వకకూ కొనసాగినట్లు తెలుస్తుంది. క్రమక్రమంగా ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పిన బోధనలు బలహీనపడటం వల్ల శైవులు, వైష్ణవులు అనే పేరిట దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ జరగడం దురదృష్టకరమైన పరిణామం. మన మూల గ్రంథాల్లో చెప్పిన ఉదారమైన, శాశ్వతమైన భావాల్ని సరిగా అర్థం చేసుకోవడం, చాటిచెప్పడం ప్రపంచ శాంతికి ఒకే ఒక మార్గం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

న్యాయ భీష్ముడు ధర్మ మూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘రేపు’ తీపి- జ్యోతిష్కులు వేదుల కామేశ్వరశర్మ-గొల్లపూడి మారుతీరావు-జీవన కాలమ్

‘రేపు’ తీపిగొల్లపూడి మారుతీరావు

జీవన కాలమ్

‘ఇతను ఇంతకంటే వృద్ధిలోకి వస్తాడు. రాజకీయాలలోకి వెళ్తాడు’
అన్నారు. హీరో నవ్వారు. శర్మగారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. మానవ స్వభావానికి విశ్వాసం దగ్గర తోవ.
అది మతాలకు అతీతంగా మనకు తెలియని రేపు వైపు దృష్టి
సారిస్తుంది. అదే దాని రుచి. జిజ్ఞాస దాని పెట్టుబడి.

ఈ మధ్య మానవవన రుల మంత్రి స్మృతీ ఇరానీ భర్తతో కలసి నాథూలాల్ అనే జ్యోతిష్కుడితో జాత కాన్ని చూపించుకున్నారు. ఆవిడ మంత్రి అవుతారని లోగడ నాథూలాల్ చెప్పా రట. ఇప్పుడు రాష్ట్రపతి అవుతారని జోస్యం చెప్పా రు. ఇది బొత్తిగా మత ఛాందసమని పత్రికలవారు ఆమెను నిలదీశారు. ‘అది నా వ్యక్తిగత వ్యవహారం’ అన్నారు స్మృతీ ఇరానీ. ‘నాకూ జ్యోతిషం మీదా ఖగోళశాస్త్రం మీదా నమ్మకాలున్నాయి’ అంటూ మం త్రిని వెనకేసుకొచ్చారు నజ్మా హెప్తుల్లా.

‘ఆవిడ మానవ వనరుల మంత్రి. శాస్త్రీయమైన విశ్వాసాలనే ప్రోత్సహించాలి’ అన్నారు కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యర్‌గారు. వారికి గుర్తు లేని విషయమేమిటంటే జ్యోతిషం ఒక శాస్త్రంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం వంటి ఎన్నో విశ్వ విద్యాలయాలలో పాఠ్యాంశం. కాగా, అయ్యరు గారూ! వంద అనుభవాల పెట్టుబడి- విశ్వాసం. వంద సంవత్సరాల విశ్వాసాల పరిణతి -శాస్త్రం.

 మన దేశంలో చిలకలనీ, పావురాలనీ నమ్ము కొని వాటి పేరిట కలల్ని అమ్ముకుని పొట్టపోసుకునే పేవ్‌మెంట్ జ్యోతిష్కుల మధ్య, శాస్త్రీయమైన అన్వ యమూ, ప్రతిభా కల ఒక్క ప్రముఖుడిని గుర్తు పట్ట డం కష్టం. మిగతా తొమ్మిది మంది శాస్త్రాన్ని గబ్బు పట్టిస్తారు. దేశంలో తెలియని రేపుని బులిపించి డబ్బు చేసుకొనేవారెందరో. వీరంతా శాస్త్రం పేరు చెప్పి కాయలమ్ముకునే అవకాశవాదులు. రేపు గురిం చి ఎవరికెంత తెలుసో, ఆ రేపు వచ్చేవరకూ తెలి యదు. కాని వారికి లోనయ్యే లేదా నమ్మేవారి విశ్వా సం కల్మషం లేనిది. నమ్మించడంలోనే అవినీతి ఉంది. నమ్మడంలో అకుంఠితమైన విశ్వాసం మూలాలు ఉన్నాయి.

భవిష్యత్తు గురించి తు.చ. తప్పకుండా చెప్ప గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఫ్రెంచ్ జ్ఞాని నోస్టర్‌డామస్‌ల ‘కాలజ్ఞానం’ ఇప్పటికీ ప్రపంచా న్నంతటినీ ఆశ్చర్యపరుస్తోంది. పిడపర్తి దక్షిణా మూర్తిగారి జీవితచరిత్ర అద్భుత సంఘటనల మణి హారం. మిత్రుడు భమిడిపాటి రాధాకృష్ణ తన మృత్యువుకి ముహూర్తాన్ని తనే నిర్ణయించుకు న్నాడు. ముత్తుస్వామి దీక్షితార్ తన అవసానాన్ని గుర్తుపట్టి, శిష్యులను పిలిచి ‘మీన లోచన పాశమో చని కదంబ వనవాసిని’ (మీనాక్షి మేముదం దేహి’ కీర్తన – పూర్వీ కల్యాణి) అనే చరణాన్ని నెఱవల్ చెయ్యమంటూ తనువు చాలించారు. ఇది చరిత్ర. గ్రహధర్మాన్ని ఎరిగిన వారికి భవిష్యత్తు కరత లామలకం.

ఇందుకు నేనెన్నయినా ఉదాహరణలు చెప్పగ లను. పాతికేళ్ల కిందట మా నాన్నగారు విశాఖ కింగ్‌జార్జ్  ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నారు- హార్ట్ అటాక్ వచ్చి, క్షయతో రెండు ఊపిరితిత్తులూ చెడి, కోమాలో. ఈ స్థితిలో మా తమ్ముడు మా కుటుంబ జ్యోతిష్కులు వేదుల కామేశ్వరశర్మగారిని కలుద్దామన్నాడు. నాన్నగారు వెళ్లిపోతున్నారనడా నికి జ్యోతిష్కుని ప్రమేయం అవసరం లేదు. అయి నా ఆశపోదు. వెళ్లాం. కామేశ్వరశర్మ గారు మా నాన్న గారి మిత్రులు. ఆయనకు కుష్టు. విషయం తెలిసి ఆయనా నివ్వెరపోయారు. దాదాపు గంటసేపు లెక్క లు వేశారు. అవతల ఆసుపత్రిలో చావుబతుకుల్లో నాన్నగారు. ఇక్కడ కాగితం మీద లెక్కలు వేస్తున్న జ్యోతిష్కుడు. ఆ క్షణంలో జ్యోతిషం మీదా, మా తమ్ముడి మీదా, ఆయన మీదా కలిగిన కోపం, అస హ్యం వర్ణనాతీతం. ఆఖరికి లెక్కలు పూర్తి చేసి తేలికగా, ‘మరేం పరవాలేదయ్యా! గండం గడిచి పోతుంది’ అన్నారు. నాకు కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. లేచి వచ్చేశాను. ఆ తర్వాత నాన్నగారు కోలుకుని, 14 ఏళ్లు జీవించి, నిద్రలో వెళ్లిపోయారు.

నేను సినీనటుడినయ్యాక ఇదే విషయాన్ని ఓ ప్రముఖ హీరోకి, హీరోయిన్‌కి చెప్పాను. వారిద్దరూ తమ జాతకాలు ఇచ్చారు. వారి పేర్లు చెప్పకుండా కామేశ్వరశర్మగారికిచ్చాను. ఆయన పరిశీలించి రెండు రోజుల తర్వాత చెప్పారు, ‘ఈ అమ్మాయి చాలా పాపులర్. త్వరలో పెళ్లవుతుంది’ అని. ఆ మాట విని హీరోయిన్ నవ్వేసింది- వేళాకోళంగా. కొన్ని నెలల లోనే ఆవిడ అమ్మ పైదేశానికి వెళ్లినప్పుడు అర్ధాం తరంగా పెళ్లి చేసేసుకుంది. ఆ పెళ్లి చాలాకాలం నిలవలేదు. అది వేరే కథ.

ఇక హీరో గురించి. ‘ఇతను ఇంతకంటే వృద్ధి లోకి వస్తాడు. రాజకీయాలలోకి వెళ్తాడు’ అన్నారు. హీరో నవ్వారు. శర్మగారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి.

మానవ స్వభావానికి విశ్వాసం దగ్గర తోవ. అది మతాలకు అతీతంగా మనకు తెలియని రేపు వైపు దృష్టిని సారిస్తుంది. అదే దాని రుచి. జిజ్ఞాస దాని పెట్టుబడి. విశ్వాసం ఇంధనం. అన్నిటికీ మిం చి ‘బంగారు భవిష్యత్తు’ దాని పదును.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాన్న పాటకు నిత్య శ్రోతను ! అంటున్న కుమారుడు రత్నకుమార్

D25608368

నాన్న పాటకు నిత్య శ్రోతను !
అమృతం ఎన్నిసార్లు తాగితే తనివి తీరుతుంది? ఘంటసాల సంగీతం కూడా అంతే! మధు కలశంలో మధురమైన గీతాలను ముంచి శ్రోతలకు అందించినప్పుడు.. ఆ సంగీత దాహం ఎన్ని తరాలైనా తీరదు గాక తీరదు. ఆయన పాటల్ని ఎప్పుడు విన్నా మళ్లీ మళ్లీ వినాలన్నంత కొత్తగా ఉంటుంది.
ఆయన జ్ఞాపకాలు కూడా అంతే! ఎన్నిసార్లు స్మరించుకున్నా.. సంగీత సాగర సముద్రంలో హాయిగా విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. నేడు ఘంటసాల జయంతి సందర్భంగా ఆయన కొడుకు ఘంటసాల రత్నకుమార్‌ను కలిసింది ‘నవ్య’.
‘‘ఘంటసాల అంటే శ్రోతలకు మహాగాయకుడు. నాకు తండ్రి, సంగీతవిద్వాంసుడు, మహానాయకుడు కూడా! మూర్తీభవించిన మానవత్వం ఆయనది. అందుకే అప్పటికీ, ఎప్పటికీ నాన్నే నా హీరో. నేను పీయూసీ చదివే రోజుల్లో చనిపోయారాయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్నను తలుచుకోని రోజు లేదు. ఆయన్ని స్మరించుకున్న తరువాతే ఏ పని అయినా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నేను డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నిలదొక్కుకున్నానంటే – అది నాన్నగారి పుణ్యమే. ఘంటసాలగారి నుంచి సంక్రమించిన భాష, గాత్రం, సంస్కారం వల్లనే అది సాధ్యం అయింది. ఏ అర్థాన్ని, ఏ భావాన్ని ఎలా వాడాలో నాన్న నుంచే నేర్చుకున్నాను. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్నాను. అయితే – నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేసి, గౌరవనీయమైన స్థానానికి వెళ్లాలన్నది ఆయన కోరిక. అయినా సరే సంగీతం మీదున్న మమకారంతో ఆయనే నాకు ఆ విద్య నేర్పించారు. మొదట్లో నేనంత ఉత్సాహం చూపేవాడ్ని కాదు. మా అన్నయ్యకు సంగీతమంటే ఆసక్తి ఎక్కువ. అందుకే అతడిని సినిమా రంగంలో కొనసాగమన్నారు నాన్న. అన్నయ్య సుమారు ఇరవైకి పైగా వాయిద్యాలను పలికించేవారు. నాన్న సంగీత దర్శకత్వం చేపట్టిన సినిమాలకు అన్నయ్య పని చేశారు. అతను తమిళనాడు సంగీత కళాశాలలో కర్నాటక సంగీతంలో విద్వాన్‌ పట్టా అందుకోవడం విశేషం. అప్పట్లో అన్నయ్య పియానో అద్భుతంగా వాయించేవారు. నాన్నగారు పాడిన భగవద్గీతకు అన్నయ్య కీ బోర్డు ప్లేయర్‌. దురదృష్టం కొద్దీ అన్నయ్య అర్ధాయుష్షుతోనే తనువు చాలించడం విషాదం.
ఇసుకమీద చాప పరుచుకుని..
నాన్నగారితో మధురమైన జ్ఞాపకం మద్రాసులోని మెరీనా బీచ్‌కు వెళ్లడం. ఆయన విలాసవంతమైన ఆడంబరాలకు దూరంగా ఉండేవారు. అందుకనే – ఎప్పుడు ఖాళీ దొరికినా అందర్నీ మెరీనాబీచ్‌కు తీసుకెళ్లడం అలవాటు. అక్కడ ఇసుకతిన్నెల మీద చాప పరుచుకుని హాయిగా పడుకునేవారు. మేమంతా ఆయన చుట్టూ చేరి అల్లరి చేసేవాళ్లం. ఇంట్లో కూడా అంతే! మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరుగుతున్నా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆడుకునేవాళ్లం. పిల్లల అల్లరికి ఏమాత్రం ఇబ్బంది పడేవారు కాదు నాన్న. పల్లెత్తు మాట అని ఎరగం. కోపం కూడా చాలా తక్కువ. పిల్లల గురించి ఎవరు ఫిర్యాదు చేసినా పెద్ద మనసుతో నవ్వి ఊరుకునేవారు. ఇక చదువు సంగతికొస్తే ఫలానా కోర్సు చేయండని, ఫలానాదే చదవండని కాని చెప్పేవారు కాదు. ‘‘పిల్లలకు ఏం కావాలో వాళ్లే నిర్ణయించుకుంటారు’’ అనేవారు తప్ప జోక్యం చేసుకునేవారే కాదు. అప్పుడప్పుడు నేను రికార్డింగ్‌ థియేటర్‌కు వెళ్లేవాడ్ని. అంతకుమునుపే ఇంట్లో రిహార్సల్స్‌ను వినడం వల్ల సగం పాట వచ్చేది. ఆటల్లో ఉన్నాసరే, నాన్నగారి పాటలు పిల్లలందర్నీ అంతగా ఆకట్టుకునేవి. అయితే సంగీతం పట్ల ముందు తరాల వారి అభిరుచి ఏవిధంగా ఉండేదో నాన్న అంచనా వేసేవారట. అప్పుడప్పుడు అమ్మతో ‘‘నా తదనంతరం నా పాటల్ని నా పిల్లలు వింటారంటావా?’’ అనేవారట. ఆ విషయాన్ని మాతో చాలాసార్లు చెప్పింది అమ్మ. ఈ తరం సంగతి ఎలాఉందో కాని మా వరకు నాన్న పాటల్ని వినని రోజు ఉండదు. ఆయన పాటలు వినడంతోనే రోజు మొదలవుతుంది. ముగుస్తుంది. నాన్న పాట వినందే నిద్ర కూడా పట్టదు.
కులమతాలకు దూరం..
నాన్నకు కుల, మత పట్టింపుల్లేవు. మాది సో్త్రత్రియ బ్రాహ్మణ కుటుంబం. 1950 దశకం నాటి పరిస్థితులు ఏవిధంగా ఉండేవో అందరికీ తెలుసు. ఇవేవీ పట్టించుకునేవారు కాదు ఆయన. చాలా సందర్భాల్లో హరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలను చేసేవారు. ఒక రోజున గుర్రం జాషువాగారు మా ఇంటికి వచ్చారు. నాన్నగారు ఇంట్లో నుంచి ఎదురెళ్లి ఆయనకు స్వాగతం చెబుతూ ఇంట్లోకి వెళ్లారట. జాషువాగారు వెనకే వస్తున్నారనుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు నాన్న. వెనక్కి తిరిగి చూస్తే జాషువాగారు ఇంటి బయటే నిల్చుండిపోయారు. ‘‘అయ్యో, జాషువాగారూ.. ఎందుకు బయటే నిల్చుండిపోయారు?’’ అన్నారు నాన్న. ‘‘మీరు బ్రాహ్మణులు కదా! ఇంట్లోకి రావచ్చో.. లేదో’’ అని చెప్పారట ఆ మహాకవి. ఆ మాటలు విన్న నాన్న దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఇద్దరు కలిసి భోజనాలు చేశారప్పుడు.
హిందుస్తానీ సంగీత విద్వాంసుడు బడేగులాం అలీఖాన్‌ ఎప్పుడు చెన్నై వచ్చినా మా ఇల్లే ఆతిథ్యం. నాటి సంగీతకారులంతా ఆయన శిష్యులే! నాన్నగారిని దక్షిణ భారతీయ శిష్యుడని అలీఖాన్‌ చెప్పేవారు. మా ఇంటికి వచ్చినప్పుడు భోంచేయమని అమ్మ అడిగితే ‘‘వద్దమ్మా, మీరు బ్రాహ్మణులు కదా’’ అనేవారాయన. మా ఇంటి పైభాగంలోనే ఆయన వంట చేసుకునేవారు. ఒక్క రోజు మాత్రం మాతోనే భోంచేసేవారు.
సంకల్పబలం నిజమైంది..
అప్పటికే లాతామంగేష్కర్‌ భగవద్గీత బాగా పాపులర్‌ అయ్యింది. వాటిని నాన్నగారు విన్నారు. ఆవిడ సంస్కృత శ్లోకాలు చెబితే వాటికి ఆంగ్లంలో వాఖ్యానం వినిపించేవారు. అందుకే అది సామాన్యులకు, పామరులకు అందుబాటులో లేదన్నది నాన్నగారి భావన. ఆ లోటును పూడ్చేందుకు ఆయనే తెలుగు భగవద్గీతను పాడాలని నిర్ణయించారు. ఆ మహత్‌కార్యాన్ని 1973లో పూర్తి చేశారు. రికార్డు అయిన తర్వాత శ్రోతలు ఎలా స్వీకరిస్తారోనని మదనపడ్డారు. దురదృష్టం ఏంటంటే – ఆ రికార్డులు విడుదల కాకముందే నాన్నగారు మాకు దూరం అయ్యారు. ‘‘భగవద్గీత తరువాత సినిమా పాటలు పాడను’’ అని ఆయన ఏ క్షణాన ప్రతిన పూనారో తెలియదు కాని.. అదే నిజం అయ్యింది. అది ఆయన సంకల్పబలానికి నిదర్శనం.
‘‘ఇప్పుడు ఎంత మంది కొత్త గాయకులను ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు కాని.. ఆ రోజుల్లో కొత్త వాళ్లకు బోలెడన్ని అవకాశాలు ఇచ్చారు నాన్న. ‘మాయాబజార్‌’లో ‘వివాహ భోజనంబు…’ పాటను కావాలనుకుంటే తనే పాడేవారు. కాని పాడలేదు. మాధవపెద్దిగారిచేత పాడించాలన్నది ఆయన ఆలోచనే! పిఠాపురం నాగేశ్వరరావు, పీబీ శ్రీనివాస్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వాళ్లను ఎంతో ప్రోత్సహించారు’’
‘‘మనిషి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చెప్పేది భగవద్గీత. అలాంటిది మనిషి చనిపోయినప్పుడు భగవద్గీతను వినిపిస్తున్నారు. దాని వల్ల ఏమిటి ఫలితం..? అలా చేయడం నాన్నగారికి గౌరవం ఇచ్చినట్లు కాదు.’’
ఆఫీసుల్లో పనిచేసే బాయ్‌లను చూసినా ఆయన కనబరిచే ఆప్యాయత మాటల్లో చెప్పలేము. ఒకసారి స్టూడియోలో కాఫీ, టీలు తీసుకొచ్చే బాయ్‌ హఠాత్తుగా కనిపించలేదు. ‘‘ఆ కుర్రాడు ఏమయ్యాడయ్యా’’ అనడిగితే ‘‘రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు’’ అన్నారు. ఆ బాయ్‌ని గుర్తుచేసుకుంటూ.. ‘‘బహుదూరపు బాటసారి, ఇటు రా ఒక్కసారి…’’ అనే పాట రాశారు. ఆ పాట అప్పట్లో సూపర్‌హిట్‌.
ఈ రోజుల్లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చిత్రసీమ ఏ విధంగా స్పందిస్తున్నదో.. ఆ రోజుల్లోనే నాన్నగారు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి కొంత మొత్తాన్ని పోగు చేసి.. ప్రభుత్వాలకు అందివ్వడం చాలామందికి స్ఫూర్తినిచ్చింది.
గొంతు కేన్సర్‌తో నాన్న చనిపోయారన్న ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదు. వైద్యానికి సంబంధించి ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మే అలవాటు నాన్నది. ఆయనకు కేన్సర్‌ లేదు. హృద్రోగంతో చనిపోయారు. కొంతమందిని నమ్మి సరైన వైద్యం చేయించుకోకపోవడం వల్ల గొంతు పోయింది.
ఘంటసాలను తెలుగు సమాజం ఎన్నటికీ మరిచిపోదు. అమెరికాలో స్టాంపు విడుదల చేశారు. మన దగ్గర ఆయనవి పాతిక విగ్రహాలు వెలిశాయి. వర్ధంతులు, జయంతులు ఘనంగా చేస్తున్నారు. పాటలు వింటున్నారు. ఇంతకంటే ఏం కావాలి?
విజయవాడలోని సంగీత కళాశాల నాన్నపేరు మీదనే ఉంది. అక్కడే మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది నా చిరకాలవాంఛ. మ్యూజియంలో నాన్నగారి వస్తువులన్నీ పెడితే బావుంటుంది. చివరగా ఆయన వేసుకున్న చెప్పులు, కళ్లజోడు, జుబ్బా, ఇతర వస్తువులన్నీ ఇస్తాను. నా వద్ద మూడు వేల పాటల రికార్డులు ఉన్నాయి. వాటిని కూడా మ్యూజియం కోసం అందజేస్తాను.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళ పై ఆల్బర్ట్ కాము భావనలు -నా వ్యాసం -తెలుగు విద్యార్ధి- అక్టోబర్

kamus 001

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 74 వ సమావేశం – దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ – ఆహ్వానం

సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

74 వ సమావేశం –  దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ – ఆహ్వానం

తేది ,సమయం -10-1-2015-ఆదివారం –సాయంత్రం -5 గం .లకు

వేదిక –శ్రీ సువర్చలాం జనేయ స్వామి దేవాలయం-మహితమందిరం(రావి చెట్టు బజారు ) –ఉయ్యూరు

కార్యక్రమం

సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భం గా –సా 5గం నుండి –శ్రీ పి .ఇంద్రకీలాద్రి శర్మ (ఏ గ్రేడ్ రేడియో ఆర్టిస్ట్ ) గారి బృందం చే సంగీత కచేరి

సాయంత్రం -6గం నుండి –-శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80వ జన్మ దినోత్సవ సందర్భం గా- ‘’దర్శనీయ           దైవ క్షేత్రాలు ‘’గ్రంధావిష్కరణ  మహోత్సవం

సభా ధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్  –సరసభారతి అధ్యక్షులు ,మరియు గ్రంధ కర్త

ముఖ్య అతిధి మరియు గ్రంధా విష్కర్త –శ్రీ జలదంకి ప్రభాకర్ –‘’నది’’ మాస పత్రిక సంపాదకులు

గౌరవ అతిధి –శ్రీ బొండాడ రామ మోహన రావు (రాం పండు)-ఉపాధ్యక్షులు -అఖిల భారత శ్రీ వాసవి ట్రస్ట్ –పెనుగొండ

గ్రంధం  అంకితం అందుకొనే వారు  –కపట మెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి –శ్రీ కోగంటి సుబ్బారావు గారు

గ్రంధ ప్రాయోజకులు (స్పాన్సర్)-శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు –అమెరికా-

సభా ప్రారంభం –శ్రీమతి జోశ్యుల  శ్యామలాదేవి  -సరసభారతి ,గౌరవాధ్యక్షులు

ఆత్మీయ అతిధులు –శ్రీ చలపాక ప్రకాష్-రమ్య భారతి ,సంపాదకులు

శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు ,శ్రీమతి శ్రీదేవి

శ్రీ కోగంటి శివప్రసాద్ ,శ్రీమతి పుష్పలత

మొదలైన కోగంటి వారి బంధు, మిత్ర వర్గం

పూర్తీ వివరాలతో త్వరలో ఆహ్వాన పత్రిక ను అంద జేస్తాం

జోశ్యుల శ్యామలా దేవి –మాదిరాజు శివ లక్ష్మి –గబ్బిట వెంకట రమణ – సాంకేతిక నిపుణులు

గౌరవాధ్యక్షులు            కార్య దర్శి               కోశాధికారి                వీరమాచనేని బాల గంగాధర రావు

గబ్బిట దుర్గాప్రసాద్

సరసభారతి అధ్యక్షులు

సాహిత్య  సాంస్కృతిక  సంస్థ –ఉయ్యూరు

9989066375,08676-232797,

తెలుగులో మాట్లాడటం మన జన్మహక్కు

 

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

 

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

బెంగాల్ లో సంపన్న కుటుంబం లో 1883లోమే నెల ఏడవ తేదీన బెహ్రంపూర్ లో జన్మించింది .తండ్రి నఫార్ చంద్ర భట్ట ఆలిపూర్ కోర్టు లో సబ్ జడ్జి గా పని చేశాడు .బాల్యం లో నే వివాహం జరిగి పదిహేనవ ఏటనే భర్తను కోల్పోయి భాగల్పూర్ లో ఉన్న తలి దండ్రులను చేరింది .ఈ సమయం లో ఆమెకు అనురూపా దేవి అనే ప్రసిద్ధ రచయిత్రి తో పరిచయం కలిగి జీవితాంతం ఈ మైత్రిని కొన సాగించింది .పవిత్రం గా వితంతు జీవితాన్ని గడుపుతూ కవిత్వం రాయటం ప్రారంభించింది .శ్రీమతీదేవి అనే మారు పేరుతొ మొదట్లో రచనలు చేసింది .
భాగల్పూర్ నివాసి ప్రసిద్ధ నవలా రచయిత శరత్ చంద్ర చటర్జీ (శరత్)కేంద్రం గా ఒక సాహితీ మిత్ర బృందమేర్పడింది .తాను సాంప్రదాయక వితంతు మహిళ అయి నందువలన ఆ బృందం సమావేశాలు వెళ్ళేది కాదు ,కాని తాను రాసిన కవితలను వారికి అందులో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తన సోదరుడి ద్వారా అంద జేసేది .ఆ కవితలను చదివిన శరత్ వాటిని మెచ్చుకునే వారు .ఇది ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేది .నిరుపమ కు గొప్ప సమర్ధకుడిగా శరత్ నిలబడ్డారని సంబర పడేది .ఆమెను వచనం లో రచన చేయమని శరత్ హితవు చెప్పాడు .వచన రచన లో మహా ప్రసిద్ధుడైన శరత్ వచనం ముందు తాను చేసే వచన రచన వెలవెలబోతుందేమో నని భయపడి మొదట సాహసించ లేక పోయింది .కాని సహరచయిత్రులైన అనురూపాదేవి ,సురూపా దేవి ప్రోద్బలం ,పట్టుదలతో ,ఒప్పించటం వలన వచన రచన కు ఒప్పుకొని ,ప్రయత్నం ప్రారంభించింది .

నిరుపమా దేవి రాసిన మొదటి వచన రచన ‘’ఉచ్చ్రంఖాల్ ‘’అనే నవల .గొప్ప సంచలనాన్ని సృష్టించి ,అందరి అభిమానాన్ని పొందింది ..’’దీదీ’’(పెద్దక్కయ్య)అనే నవల 1915రాస్తే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది . అంతకు రెండేళ్ళ ముందు ‘’అన్నపూర్నార్ మందిర్ ‘’(అన్నపూర్ణ దేవాలయం )ను ,1919లో ‘’శ్యామాలి ‘’నవలరాసింది ఇవీ గొప్ప సంచలన విజయాలను పొందాయి .వీటిలో పాత్రలు సజీవంగా ,ఆదర్శ ప్రాయం గా ఉంటాయి .సామాజిక ద్రుష్టి ,తో రాసిన నవలలు ఇవి .దీదీలో సురోమా పాత్ర చాలా విశిష్టమైనది .సాంప్రదాయ జీవితాన్ని గడుపుతూ ,ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చుకొంటూ సమాజ హితం గా మారాలనేది ఇందులో ఉన్న ముఖ్య సిద్ధాంతం .సంఘ సంస్కరణ అనేది సహజ సిద్ధం గా రావాలని కొరుకునేది .సానుభూతి ,సహవేదన, విస్తృత లోకజ్ఞానం ,ఆత్మ గౌరవం సాధించి ,మార్పు తేవాలని అభిప్రాయ పడింది .
నిరుపమా దేవి రచనలు చేసే కాలం లో మనదేశం లో ముఖ్యంగా బెంగాల్ లో స్వదేశీ ఉద్యమం మాహోద్రుతం గా నడుస్తోంది .సామాజిక మార్పు తో సంఘం ముందడుగు వేస్తోంది .కాని నిరుపమ మాత్రం వ్యక్తీ మానసిక పరివర్తన వల్లనే మార్పు పొందాలనే విషయాలనే రచనల్లో ప్రతి బింబింప జేసింది .సామాజిక బంధాలు విచ్చిన్నం కారాదని భావించింది .ధనిక వర్గాలవారు (భద్రకులు) అందులోని హీరో అమరనాద్ ను బాగా అభిమానించారు . అతనిలాగానే వారూ పల్లెలను వదిలి పట్నాలకు చేరి రాజీయ శూన్యం లో బతుకుతున్నారు .సరోమా అనే వ్యక్తిత్వం ధైర్యం ఆధునిక భావాలు ,ఉన్న మహిళను తీర్చి దిద్దిన తీరు ప్రశంసనీయం గా ఉంది .ఈ పాత్ర శరత్ సృస్టించిన పాత్రలకు విభిన్నం గా ఉండటం గమనించాల్సిన విషయం .సురోమా స్వయం సిద్ధ గా ,స్వయం సమృద్ధితో తనకాళ్ళ పై నిలబడే మహిళగా ,సనాతన ఆచారాలను పాటిస్తూనే ముందడుగేసే ఆదర్శ మూర్తిగా అందరిని ఆకర్షిస్తుంది .ఉమ అనే బాల వితంతువును ప్రకాష్ ప్రేమిస్తున్న విషయం తెలిసి ,ఉమ ను తనతో తీర్ధ యాత్రకు తీసుకొని వెళ్లి ,ప్రకాష్ కు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తుంది .సురోమా ను ప్రకాష్ ప్రేమిస్తాడుకాని ఆమె కరుదనాన్ని అర్ధం చేసుకో లేక పోతూ ఉంటాడు .ఆ కాలం లో ఉమ లాంటి బాల వితంతువు కు పునర్వివాహం నిషిద్ధం . అందుకే ఉమను అతనికి దూరం చేసింది .చాలా ఏళ్ళ తర్వాత ఏంతో ఆలోచించి అమర నాద్ ప్రేమను అంగీకరించింది సురోమ .

జీవితాలం లో తొమ్మిది నవలలు రాసింది .ముందే మనం చెప్పుకొన్న నవలలు కాక ‘’అమేయ ‘’‘’,’’బిదిల్పి’’,’’బంధు’’’’అమర్ డయరి ‘’.’’యుగాంతరేర్ కధ ‘’,’’అనుకర్ష’’ నవలలు రాసింది .ఏ నవలల రాసినా అందులో కుటుంబ నేపధ్యం ఉంటుంది .భారత స్వాతంత్ర్య స్వదేశీ ఉద్యమ సమయం లో ఎన్నో దేశ భక్తీ గేయాలు ,కవితలు ప్రోబోధ గీతాలు రాసి దేశ భక్తిని రగుల్కొల్పింది .అవన్నీ వివిధ పత్రిక లలో ప్రచురితమైనాయి .1938లో ‘’భువన మోహిని స్వర్ణ పతక ‘’పురస్కారాన్ని నిరుపమా దేవి పొందింది .1943లో ‘’జగత్తారిణి బంగారు పతకాన్ని ‘’సాహిత్య సేవకు కలకత్తా యూని వర్సిటి నుండి అందుకొన్నది .జీవిత చరమాంకం లో వైష్ణవ భక్తురాలి గా మారి శ్రీ కృష్ణ దివ్య క్షేత్రమైన బృందావనం లో ప్రశాంత జీవితాన్ని గడిపింది . 7-1-1951న నిరుపమా దేవి 68వ ఏట మరణించింది.

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

పశ్చిమ బెంగాల్‌లో అశాంతి

పశ్చిమ బెంగాల్‌లో అశాంతి

  • -తాడేపల్లి హనుమత్ ప్రసాద్
  • 02/12/2014
TAGS:

కలకత్తా ఒకప్పుడు దేశభక్తుల నిలయం. భరతమాత దాస్య శృంఖలాలను త్రెంచేందుకు అసంఖ్యాకంగా విప్లవకారులు విజృంభించిన కర్మభూమి. ఓ అరవిందుడు, ఓ వివేకానందుడు, ఓ నేతాజీ, ఓ రామకృష్ణ పరమహంస ఇలా అనేకమంది తమ జీవన కసుమాలను దేశమాత ముందుంచారు. ‘వందేమాతరం’ నినాదామిచ్చి బంకించంద్రుడు చరితార్థుడయ్యాడు. అది భారత స్వాతంత్రోద్యమ తారకమంత్రమైంది. అలాంటి బెంగాలు స్వాతంత్య్ర సమయంలో పశ్చిమ బెంగాలు, తూర్పు బెంగాలుగా విడిపోయింది. పాకిస్తాన్ పరమైన ఆ తూర్పు బెంగాలు 1971లో పాకిస్తాన్‌నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. ముస్లింలు అధికంగా గల ప్రాంతాలు దేశ విభజన సమయంలో మనదేశంనుంచి విడిపోయాయి.
ఇది బ్రిటిషు విభజించు పాలించు విధానానికి పరాకాష్ఠ అయితే, పాకిస్తాన్‌నుంచి బంగ్లాదేశ్ ఏర్పడడం ముస్లింలు సైతం కలిసి జీవించలేరని, ఒక జాతిగా మనలేరని, అంతఃకలహాలతో కాపురం చేయలేరన్న సత్యాన్ని స్పష్టం చేస్తోంది. 1965లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధానంతరం 1971లో పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించింది. తమ దేశ ప్రజలని కూడా చూడకుండా పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) ప్రజల్ని చిత్రవధలు చేసారు. ఆడపడచులను వివస్తల్రను చేసి హింసించారు. వారి కిరాతక చర్యలకు బతకలేని లక్షలాది తూర్పు పాకిస్తాన్ ప్రజలు భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందారు. వలస వచ్చేవారిని మత భేదం లేకుండా తిండి, బట్ట, ఆశ్రయం ఇచ్చి సంవత్సరానికి పైగా పోషించింది పుణ్య భారత్. ప్రపంచంలో ఏ దేశం కూడా ముందుకొచ్చి ఈ బెంగాలీలకు నిష్కృతి మార్గం చూపని రోజుల్లో భారత్ సహాయ సహకారాలనందించింది. బంగ్లాదేశ్ అవతరించింది. ఈ విశాల విశ్వంలో తమకు స్నేహపాత్రులు అనదగ్గవారు భారతదేశ ప్రజలే, తమ అత్యంత మిత్రదేశం హిందూ దేశమే అని వేనోళ్ల కీర్తించారు బంగ్లాదేశ్ పాలకులు, ప్రజలు 1972లో. కాని గత 42 ఏళ్లలో బంగ్లాదేశ్ 20 కోట్లమంది హిందువులను తన్ని భారత్‌కు తరిమేసింది. భారత్ చేసిన మేలు మరిచి మత పిచ్చితో పేట్రేగిపోయింది. శత్రు ఆస్తి చట్టం పేర, తరిమివేయబడ్డ హిందువుల భూమిని స్వాధీనం చే సుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువుల కన్నీటి గాథ ఎంత చెప్పినా తక్కువే.
నేడు పశ్చిమ బెంగాలు బాంబుల తయారీ కేంద్రంగా, తీవ్రవాదుల అడ్డాగా మారి భారత్‌లో అస్థిరత్వం సృష్టించే విదేశీ కుట్ర జరుగుతోంది. బంగ్లాదేశ్ కేంద్రంగా ‘జమాత్ ఉల్ ముజహిదీన్ బంగ్లాదేశ్’ ఉగ్రవాద సంస్థ ఇందుకు తగిన ప్రణాళిక రచించి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ వర్గాల దర్యాప్తులో వెల్లడైంది. అక్టోబర్ 12, 2014 నాడు పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో ఖాగ్రాగర్‌లో ఒక అద్దె ఇంట్లో జరిగిన పేలుడులో షకీల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను బంగ్లాదేశీయుడు. 7 ఏళ్లుగా భారత్‌లో ఉంటున్నాడు. పేలుడు పదార్ధాల తయారీ సమయంలో ఈ పేలుడు జరిగింది. ఆ సందర్భంగా బద్రుల్ అలమ్ మొల్లా, మరో ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్టు చేసారు. వారి విచారణనుబట్టి వారికి బంగ్లాదేశ్‌నుంచి ఆర్థికంగా, ఇతరత్రా అన్నివిధాల సహాయం అందుతోందని తెలిసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. తరువాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసారు. పశ్చిమ బెంగాల్‌ను ఒక ఉగ్రవాద అడ్డాగా మార్చేందుకు జరుగుతున్న కుట్ర గురించి చర్చించారు. అప్రమత్తంగా ఉండమన్నారు. మమత ముందు కేంద్రాన్ని విమర్శించారు. కేంద్రం అతి క్రియాశీలత్వం ప్రదర్శిస్తోందన్నారు. కాని విషయం లోతు మమతకు తెలియనిదా? అందరు రాజకీయ నాయకుల్లాగే ఆమె కూడా సెక్యులర్ రంగు పులుపుకున్నారు. 2011లో నాడు శివశంకర్ మీనన్ బంగ్లాదేశ్‌తో తీస్తా జలాల పంపకం గురించి చర్చిస్తే 2014కు పరిస్థితి ఇలా ఎందుకుమారిపోయింది?
‘తాకి’ పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లా బంగ్లాదేశ్‌తో వున్న చిట్టచివరి భారత సరిహద్దు జిల్లా. అక్కడ బంగ్లాదేశ్‌నుంచి జనం వలసలు మామూలే. జనంతోపాటు సరుకు, అన్నీ అక్రమ రవాణా అవుతాయి. నిజానికి ‘తాకి’ రమణీయమైన పర్యాటక ప్రాంతం. 2011లో విజయదశమి రోజున లక్షమంది దుర్గాదేవి నిమజ్జనోత్సవ సమయంలో యచ్చామటి నది గుండా బంగ్లాదేశ్‌నుండి అక్రమంగా చొరబడ్డారు. అక్టోబర్ 2, 2014 తరువాత ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. కేవలం 110 మంది ముస్లిం కుటుంబాలున్న సరిహద్దు గ్రామం సయ్యద్‌పూర్‌లోకి బంగ్లాదేశ్‌నుంచి ముస్లింలు వస్తూపోతుంటారు. ఆ గ్రామ ప్రజలకు ‘చొరబాటు’కు అర్ధం తెలీదు. చేపలు పట్టుకునే నూర్ మహమ్మద్ సర్దార్ భద్రత కట్టుదిట్టం చేసినా ఈ చొరబాట్లు ఆగలేదని ఒప్పుకున్నాడు. లక్షమంది చొరబాటు గురించి అడిగితే ఆ ఏడాది దుర్గాదేవి ప్రతిమల నిమజ్జన సమయంలో ‘గందరగోళం’ నెలకొందని ఒప్పుకున్నాడు. ‘జీవనోపాధి కోసం వస్తుంటారని’ పెదవి విరిచాడు. నకిలీ పాన్ నంబర్లతో, ఐడిలతో ఇలా యదేచ్ఛగా చొరబాట్లు జరగడానికి భారత్ ధర్మ సత్రమా? ‘తాకి’ వద్ద నియక్తులైన సరిహద్దు భద్రతాదళ అధికారి శివరతన్ సింగ్, నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తరువాత సరిహద్దులు భద్రంగా ఉన్నాయని, చొరబాట్లు ఆగాయని ఒప్పుకున్నాడు.
బుర్ద్వాన్ పేలుళ్ల తరువాత అనుమానాస్పద వ్యక్తుల్ని, సమూహాల్ని సరిహద్దు గ్రామాల ప్రజలు గుర్తించి సరిహద్దు భద్రత దళాలకు అప్పగిస్తున్నారట. అక్రమ చొరబాటుదార్లలో చాలామంది వ్యవసాయ కూలీలుగా, నిర్మాణ కార్మికులుగా వచ్చి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తారు. బంగ్లాదేశ్‌తో ‘సరిహద్దు భూమి ఒప్పందం’ (లాండ్ బౌండరీ అగ్రిమెంట్) బిల్లు 2013 నవంబర్‌లో యుపిఎ పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. కాని ఇంతవరకు పార్లమెంట్ దాన్ని ఆమోదించలేదు. సుమారు 70 లక్షలమంది బంగ్లాదేశీయులు బంగ్లాదేశీయులు భారత్‌లో పనిచేస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆ విధంగా సుమారు సంవత్సరంలో 25 కోట్ల పనిదినాలను మనం బంగ్లాదేశీయులకిస్తున్నాం! అయినా వారికి, బంగ్లాదేశ్ ప్రభుత్వనికి భారత్‌పట్ల కృతజ్ఞత లేదు.
త్రిపుర, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ మీదుగా శిక్షణ పొందిన తీవ్రవాదులు భారత్‌లోకి చొరబడడం విషయమై భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటిరోజే చొరబాటుదార్లు పెట్టే బేడా సర్దుకోవాలని హెచ్చరించారు. బెంగాల్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బిజెపి తమ రాజకీయ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. బీర్‌భూమి వంటి బిజెపి బలంగా ఉన్న ప్రాంతాలలో మమత ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోంది. నిజానికి జమాత్ ఎ ఇస్లామీ వంటి సంస్థల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.బంగ్లాదేశ్ సీనియర్ మంత్రి ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ ‘1971 యుద్ధ నేరాలకు పాల్పడిన జమాత్ ఎ ఇస్లామీ నాయకులకు బంగ్లాదేశ్ కోర్టు శిక్ష విధించిందని, ఇపుడు వారు పాకిస్తాన్ మద్దతుతో భారత భూభాగం ఆసరాగా విజృంభిస్తున్నారని, భారత్ దీన్ని నిరోధించాలని’ కోరారు. 2014 ఎన్నికల తరువాత బెంగాల్ ప్రజలు క్రమంగా మమత చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. 34 ఏళ్ల కమ్యూనిస్టుల కంచుకోటను పగలకొట్టి నందుకు 40 నెలల క్రితం మమతను అంతా అభినందించారు. కాని మమత కూడా కమ్యూనిస్టుల హింసా తత్వాన్ని వొంటబట్టించుకుంది. తాజాగా 2013లో మిడ్నపూర్ జిల్లాలో మతకల్లోలాలు జరిగాయి. 2014 ఎన్నికల్లో 825 హింసాత్మక సంఘటనలు జరిగాయి. బుర్ద్వాన్‌లో జరిగిన పేలుళ్ల విచారణ జరగకుండా, సాక్ష్యాలు ఏవీ ఎన్‌ఐఏకు లభించకుండా స్థానిక పోలీసులు మాయం చేయడం మమత చిత్తశుద్ధిని శంకించేలా చేసాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా విచారణపై ముందు తాత్సారం చేసింది. అందులో ఎన్‌డిఏకు రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చు.
ఎన్‌ఐఎ రంగప్రవేశంతో 150 మంది జిహాదీ తీవ్రవాదుల దురాగతాలు బట్టబయలు కానున్నాయి. అస్సాం పోలీసులు అంతకు ముందే ఆరుగుర్ని అరెస్టు చేసారు. మరో 30 మందిని అనుమానితులుగా గుర్తించారు. అందులో కొన్ని మదరసాలు, స్వచ్ఛం ద సంస్థలు కూడా ఉన్నాయి. బుర్ద్వాన్ పేలుళ్లకు, పాట్నా గాంధీ మైదాన్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ల పేలుళ్లతో ఉన్న సామ్యాన్ని కూడ ఎన్‌ఐఎ గుర్తించింది. సిములియా మదరసాలో తీవ్రవాదుల శిక్షణ విషయం గురించి కూడా ఎన్‌ఐఏ పేర్కొంది.
ఏతావాతా తెలిసేదేమంటే, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బాంబులు కురిసిన నేల జిహాదీ తీవ్రవాదుల బాంబులతో బెంబేలయ్యే పరిస్థితి నేడు నిర్మాణమైంది. పాలకుల ఓటు బ్యాంకురాజకీయాలు, జాతీయ సమగ్రతకు సమైక్యతకు సవాలయ్యాయి. మా, మాటి, మనుష్ నినాదంతో అధికారంలోకి వచ్చిన మమతకు మాతృభూమిని రక్షించుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం. లేదా, బెంగాల్‌లో మరో వందేమాతర ఉద్యమం పురుడుపోసుకుంటుంది. 2016 ఎన్నికల్లో జాతీయ శంఖారావం మార్మోగిపోతుంది. అందులో ఉన్మాదులతోపాటు ఉపేక్షాధోరణితో ఉన్న రాజకీయం కూడా మట్టి కరవడం ఖాయం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయవాడ లో అమెరికన్ కాన్సోలేట్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

బెంగాల్ లో సంపన్న కుటుంబం లో 1883లోమే నెల ఏడవ తేదీన బెహ్రంపూర్ లో జన్మించింది .తండ్రి నఫార్ చంద్ర భట్ట ఆలిపూర్ కోర్టు లో సబ్ జడ్జి గా పని చేశాడు .బాల్యం లో నే వివాహం జరిగి పదిహేనవ ఏటనే భర్తను కోల్పోయి భాగల్పూర్ లో ఉన్న తలి దండ్రులను చేరింది .ఈ సమయం లో ఆమెకు అనురూపా దేవి అనే ప్రసిద్ధ రచయిత్రి తో పరిచయం కలిగి జీవితాంతం ఈ మైత్రిని కొన సాగించింది .పవిత్రం గా వితంతు జీవితాన్ని గడుపుతూ కవిత్వం రాయటం ప్రారంభించింది .శ్రీమతీదేవి అనే మారు పేరుతొ మొదట్లో రచనలు చేసింది .
భాగల్పూర్ నివాసి ప్రసిద్ధ నవలా రచయిత శరత్ చంద్ర చటర్జీ (శరత్)కేంద్రం గా ఒక సాహితీ మిత్ర బృందమేర్పడింది .తాను సాంప్రదాయక వితంతు మహిళ అయి నందువలన ఆ బృందం సమావేశాలు వెళ్ళేది కాదు ,కాని తాను రాసిన కవితలను వారికి అందులో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తన సోదరుడి ద్వారా అంద జేసేది .ఆ కవితలను చదివిన శరత్ వాటిని మెచ్చుకునే వారు .ఇది ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేది .నిరుపమ కు గొప్ప సమర్ధకుడిగా శరత్ నిలబడ్డారని సంబర పడేది .ఆమెను వచనం లో రచన చేయమని శరత్ హితవు చెప్పాడు .వచన రచన లో మహా ప్రసిద్ధుడైన శరత్ వచనం ముందు తాను చేసే వచన రచన వెలవెలబోతుందేమో నని భయపడి మొదట సాహసించ లేక పోయింది .కాని సహరచయిత్రులైన అనురూపాదేవి ,సురూపా దేవి ప్రోద్బలం ,పట్టుదలతో ,ఒప్పించటం వలన వచన రచన కు ఒప్పుకొని ,ప్రయత్నం ప్రారంభించింది .

నిరుపమా దేవి రాసిన మొదటి వచన రచన ‘’ఉచ్చ్రంఖాల్ ‘’అనే నవల .గొప్ప సంచలనాన్ని సృష్టించి ,అందరి అభిమానాన్ని పొందింది ..’’దీదీ’’(పెద్దక్కయ్య)అనే నవల 1915రాస్తే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది . అంతకు రెండేళ్ళ ముందు ‘’అన్నపూర్నార్ మందిర్ ‘’(అన్నపూర్ణ దేవాలయం )ను ,1919లో ‘’శ్యామాలి ‘’నవలరాసింది ఇవీ గొప్ప సంచలన విజయాలను పొందాయి .వీటిలో పాత్రలు సజీవంగా ,ఆదర్శ ప్రాయం గా ఉంటాయి .సామాజిక ద్రుష్టి ,తో రాసిన నవలలు ఇవి .దీదీలో సురోమా పాత్ర చాలా విశిష్టమైనది .సాంప్రదాయ జీవితాన్ని గడుపుతూ ,ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చుకొంటూ సమాజ హితం గా మారాలనేది ఇందులో ఉన్న ముఖ్య సిద్ధాంతం .సంఘ సంస్కరణ అనేది సహజ సిద్ధం గా రావాలని కొరుకునేది .సానుభూతి ,సహవేదన, విస్తృత లోకజ్ఞానం ,ఆత్మ గౌరవం సాధించి ,మార్పు తేవాలని అభిప్రాయ పడింది .
నిరుపమా దేవి రచనలు చేసే కాలం లో మనదేశం లో ముఖ్యంగా బెంగాల్ లో స్వదేశీ ఉద్యమం మాహోద్రుతం గా నడుస్తోంది .సామాజిక మార్పు తో సంఘం ముందడుగు వేస్తోంది .కాని నిరుపమ మాత్రం వ్యక్తీ మానసిక పరివర్తన వల్లనే మార్పు పొందాలనే విషయాలనే రచనల్లో ప్రతి బింబింప జేసింది .సామాజిక బంధాలు విచ్చిన్నం కారాదని భావించింది .ధనిక వర్గాలవారు (భద్రకులు) అందులోని హీరో అమరనాద్ ను బాగా అభిమానించారు . అతనిలాగానే వారూ పల్లెలను వదిలి పట్నాలకు చేరి రాజీయ శూన్యం లో బతుకుతున్నారు .సరోమా అనే వ్యక్తిత్వం ధైర్యం ఆధునిక భావాలు ,ఉన్న మహిళను తీర్చి దిద్దిన తీరు ప్రశంసనీయం గా ఉంది .ఈ పాత్ర శరత్ సృస్టించిన పాత్రలకు విభిన్నం గా ఉండటం గమనించాల్సిన విషయం .సురోమా స్వయం సిద్ధ గా ,స్వయం సమృద్ధితో తనకాళ్ళ పై నిలబడే మహిళగా ,సనాతన ఆచారాలను పాటిస్తూనే ముందడుగేసే ఆదర్శ మూర్తిగా అందరిని ఆకర్షిస్తుంది .ఉమ అనే బాల వితంతువును ప్రకాష్ ప్రేమిస్తున్న విషయం తెలిసి ,ఉమ ను తనతో తీర్ధ యాత్రకు తీసుకొని వెళ్లి ,ప్రకాష్ కు వేరే అమ్మాయితో పెళ్లి చేస్తుంది .సురోమా ను ప్రకాష్ ప్రేమిస్తాడుకాని ఆమె కరుదనాన్ని అర్ధం చేసుకో లేక పోతూ ఉంటాడు .ఆ కాలం లో ఉమ లాంటి బాల వితంతువు కు పునర్వివాహం నిషిద్ధం . అందుకే ఉమను అతనికి దూరం చేసింది .చాలా ఏళ్ళ తర్వాత ఏంతో ఆలోచించి అమర నాద్ ప్రేమను అంగీకరించింది సురోమ .

జీవితాలం లో తొమ్మిది నవలలు రాసింది .ముందే మనం చెప్పుకొన్న నవలలు కాక ‘’అమేయ ‘’‘’,’’బిదిల్పి’’,’’బంధు’’’’అమర్ డయరి ‘’.’’యుగాంతరేర్ కధ ‘’,’’అనుకర్ష’’ నవలలు రాసింది .ఏ నవలల రాసినా అందులో కుటుంబ నేపధ్యం ఉంటుంది .భారత స్వాతంత్ర్య స్వదేశీ ఉద్యమ సమయం లో ఎన్నో దేశ భక్తీ గేయాలు ,కవితలు ప్రోబోధ గీతాలు రాసి దేశ భక్తిని రగుల్కొల్పింది .అవన్నీ వివిధ పత్రిక లలో ప్రచురితమైనాయి .1938లో ‘’భువన మోహిని స్వర్ణ పతక ‘’పురస్కారాన్ని నిరుపమా దేవి పొందింది .1943లో ‘’జగత్తారిణి బంగారు పతకాన్ని ‘’సాహిత్య సేవకు కలకత్తా యూని వర్సిటి నుండి అందుకొన్నది .జీవిత చరమాంకం లో వైష్ణవ భక్తురాలి గా మారి శ్రీ కృష్ణ దివ్య క్షేత్రమైన బృందావనం లో ప్రశాంత జీవితాన్ని గడిపింది . 7-1-1951న నిరుపమా దేవి 68వ ఏట మరణించింది.

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

– See more at: http://vihanga.com/?p=13318#sthash.k0U6nG0v.dpuf

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -71-

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం -71-

109-  స్వాతంత్ర్య సమరయోధ కవి పండితులు- శ్రీ జటావల్లభుల పురుషోత్తం

బాల్యం –విద్య –ఉద్యోగం

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయ పురం నివాసి  జటావల్లభుల కృష్ణ సోమయాజులు మహా లక్ష్మమ్మ దంపతులకు జటావల్లభుల పురుషోత్తం గారు 17-2-1906లో మాతామహుని ఇంట నడవ పల్లి లో జన్మించారు .మహా పండిత ప్రకాండుడైన పుల్య ఉమా  మహేశ్వర శాస్త్రి గారి వద్ద ముంగండ అగ్రహారం లో సంసృతం నేర్చారు .విజయ నగరం మహా రాజా కళాశాలలో చేరి ఇంగ్లీష్ లో బి .ఏ .డిగ్రీ పొందారు .పిఠాపురం మహా రాజా కాలేజిలో ట్యూటర్ గా చేరి కొంతకాలం పని చేశారు .పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు  ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠంలో ప్రిన్సిపాల్ అయ్యారు .ఆ  విద్యా సంస్థ కార్య దర్శి వల్లూరి సూర్య నారాయణ రావు గారి కోరిక పై  ‘’స్మృతి కాలం స్త్రీలు’’,’’వేదకాలపు స్త్రీలు ‘’అనే రెండు పరి శోధనాత్మక గ్రంధాలు రాశారు  .

కొవ్వూరు లో పని చేస్తున్నప్పుడే మద్రాస్ యూని వర్సిటి నుండి సంస్కృతం లోను తెలుగు లోను ఏం ఏ .పట్టా పొందారు .1948లో పదవికి  రాజీ నామా చేసి విజయవాడ ఎస్. ఆర్. .ఆర్ అండ్ సి .వి .ఆర్ .ప్రభుత్వ కళాశాలలో సంస్కృత శాహాధ్యక్షులుగాచేరి 1961వరకు పదమూడు సంవత్సరాలు   సేవలందించారు .మళ్ళీ కొవ్వూరు గీర్వాణ విద్యా పీఠంలో సంస్కృత శాహాధ్యక్షులై ,తారవాత కాకినాడ పిఠాపురం రాజ వారకాలేజికి బదిలీ  అయి  1966ఉద్యోగ విరమణ చేశారు .1956-60 వరకు నేను విజయవాడ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ కాలేజిలో ఇంటర్ ,డిగ్రీ లు చదువుతుండగా శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు సంస్కృత శాక్షాధ్యక్షులుగా పని చేశారు .వారిని నిత్యం చూస్తూ వారి ఉపన్యాసం వినే అదృష్టం  పొందిన వాడిని .

సంస్కృతీ సేవ

ఉద్యోగ విరమణ పిమ్మట పురుషోత్తం గారు భారతీయ సంస్కృతీ పై అభిమానాన్ని పెంచుకొని అందులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణం గా అధ్యయనం చేసి అపూర్వ గ్రంధ రచన చేశారు .వేదాలు ,ధర్మ శాస్త్రాలు ఇతిహాస పురాణాలు మొదలైన వాటిలో ప్రతి విషయం పై  ‘’హిందూ మతం ‘’,’’భారతీయ విజ్ఞానం ‘’,’’ధర్మ మంజరి ‘’,భారతీయ వైభవం ‘’,ఆధ్యాత్మిక వ్యాసాలూ ‘’,’’భగవద్గీతా ప్రవేశం ‘’,’’మహా కవి సందేశం ‘’అపూర్వ పండితీగారిమతో సుబోదాం గా రాశారు .వీరిది పూర్తిగా శాస్త్రీయ ద్రుష్టి .’’చిత్ర శతకం సంస్కృతం లో  రాశారు  ‘’జగద్గురు ప్రశస్తి ‘’అనే ఆవ్యాన్ని అంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల పై సంస్కృతం లో రచించారు .చిత్ర శతకం లో అనేక అంశాల పై చమత్కారంగా సంస్కృతం లో శ్లోకాలు రాశారు .

వేసవులలో ప్రతి ఏడాది ‘’ధర్మ శాల పాఠశాల ‘’నడిపారు .అందులో సుమారు రెండు నెలలు వివిధ ధర్మ శాస్త్ర విషయాలను బోధించేవారు .పురుషోత్తం గారు స్వాతంత్ర్య పిపాసి భారత స్వాతంత్ర్యోద్యమం లో పాల్గొని ‘’క్విట్ ఇండియా ‘’ఉద్యమం లో ప్రముఖపాత్రనుపోషించారు దీనికి ఫలితం గా  అరెస్ట్ కా బడి దాదాపు ఆరు నెలలు 1-4-1943-10-11-43 వరకు కారాగార వాసం అనుభవించారు  .ఆయన ఎప్పుడూ శుద్ధ తెల్ల ఖద్దరునే ధరించేవారు ఆకు పచ కండువా వేసేవారు ధోవతి ,,లాల్చీ వేసేవారు .

గౌరవాలు –   పురస్కారాలు

 

ఆంద్ర ప్రదేశ్ భాషాభి వృద్ధి సంఘం లో ప్రభుత్వం వీరిని సభ్యులను గా నియమించి సలహాలు స్వీకరించింది .సంస్కృత భాషాభి వృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్చలను ఒక నివేదిక గా రాసి ప్రభుత్వానికి అంద జేశారు .1972ఒ కాకినాడ పుర జనులు పురుషోత్తం గారికి కనీ వినీ ఎరుగని రీతిలో ఘన సన్మానం చేసి కృతజ్ఞతను తెలియ జేసి ధన్యులయ్యారు .ఆ సందర్భం గా ‘’పురుషోత్తమ దర్శనం ‘’అనే ప్రత్యెక పుస్తకం ప్రచురించారు .అరవై ఆరేళ్ళు మాత్రమె జీవించి ఈ సాహితీ జీవి పురుషోత్తం గారు 28-10-1972న ‘’పురుషోత్తమ ప్రాప్తి ‘’పొందారు .

గంగా సమానః ఖలు శుద్ధ ధర్మః
సత్ కామ ఏవం యమునోపమశ్చ
తన్మేళనం యత్ర తదేవ పూతం
క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి

ధర్మం అనే గంగ ,కామం అనే యమున ,దాంపత్యమనే అంతర్వాహినియైన సరస్వతితో కలిసి త్రివేణీ సంగమమై తనరారే ప్రయాగనే భార్య అట.ఇది పురుషోత్తం గారి ఒకానొక ముక్తకం .

 

.  ప్రాచీన కాలమ్ లో ఎందరో మహానుభావులు ,కవి పండితులు ,సంస్కృత భాషా వ్యాప్తికి జవ జీవాల  నిచ్చి ,ప్రజల మధ్యకు సంస్కృతాన్ని తెచ్చారు .వారికి వందనాలు ..ఆధునిక కాలమ్ లో అమరావానికి నీరాజనం పట్టి ,సులువుగా నేర్చుకొనే దారి చూపి ,ఆ భాషోద్ధరణకు బాలలు కూడా సులభం గా నేర్చుకొనే వీలుగా సంస్కృత ప్రబోదినులను రచించి జీవిత సర్వస్వం దేవభాషా సేవనం లో కరగించిన  త్యాగధనుల్లో ఆస్థానకవి శ్రీ కాశీ కృష్ణాచార్యులు ,శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మ ,శ్రీ జటావల్లభుల పురుషోత్తం గార్లు చిరస్మరనీయులు ,ప్రాతస్మరనీయులు .వారికి ప్రత్యెక నమో వాకాలు .

ఇప్పుడు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు వ్రాసిన కొని ముక్తకాలను మీకు పరిచయం చేస్తాను .వారు విజయ వాడ లో srr ,cvr  కళాశాలలో సంస్కృత శాఖ ఆచార్యులు గా పని చేశారు .ఇవి ఈ నాటి సాంఘిక స్థితికి ,ధర్మ చ్యుతికి అద్దం పడతాయి .మన బాధ్యతనూ బాగా గుర్తు చేస్తాయి .చమత్కారం గానూ వుంటాయి .ముందుగా సంస్కృత భాషామతల్లికి వారి శ్లోకం తోనే వందనం చేస్తాను .

”సుధా స్రవంతీ సుర భాషి తాయా –సుచ్చానా సూక్తి సురత్న వార్ధిహ్—సుకావ్య సందోహ నిదిశ్చ వాణీ —సా  సంస్క్రుతాఖ్యా ,సుకృతి కలాభ్యా ”

”   మాతాహి   భాష వితతెస్చ లోకే —మాతేవ రక్ష్య త్య పితాశ్రితాన్హి —నా మాత్రు భాషా భువి సంస్క్రు తాఖ్యా —వాచ్యః కదం మాత్రు పడేవ చాన్యాః /.”

01 -అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేస్తుందట భారత దేశం .ఆమె ఉదాత్త బుద్ధి ,ఎత్తైన హిమాలయ శిఖరమనే శిరస్సు వల్లనే తెలిసి పోతుందట

”పున్యావనే ,ద్రోహమతీ న్విదేశ్యం ——సద్గర్భ నిష్టాన్ ,ఖలుసే హిషే ,త్వం —వుచ్చైస్శిరత్వం ,తవ శూచితం ,హి —హిమాద్రి శ్రుమ్గేన మహోన్నతేన ”

02 –    ఆ పరబ్రహ్మను ప్రత్యక్షం గా చూసిన రమణ మహర్షి ,శ్రీ రామ కృష్ణ పరమహంస మున్నగు మహర్షులు ఈ భూమి మీద నే ఎందుకు పుట్టారు?అని ప్రశ్నించే వారికి సమాధానం ”నక్షత్రాలు ఆకాశం లోనే పుట్టి ఎందుకు ప్రకాశిస్తున్నాయి?”

”నాన్యస్య భూమే ర్భారతాస్య జాతాః -శ్రీ రామ కృష్ణో రమణాదయశ్చ –అత్రైవకిం ,బ్రహ్మవిదాం ,సుజన్మ –తారోదయః కిం గగనే న భూమౌ .”

03 – లోకం లో అందమైన వాటిని చూసి మానవుడు తృప్తి చెందుతాడు .కానీ స్త్రీ ని చూసి వికారం చెందటం వాడి దౌర్భాగ్యం

”ద్రుస్టాహి శోభాం ,గగనే మలే తాం —-తార గానశ్యా౦ భసి పద్మ పంక్తి ః –జనః తుస్తో స్కాత్కిమ భాగ్యమస్య —–స్త్రీ రత్న మాలోక్య వికార మేగతి ”

04 – కొత్తగా కాపురానికి వచ్చి నట్టింట్లో ఎప్పుడు తిరుగుతుందా అని వువ్విల్లూరిన అత్త గారు –కోడలు రాగానే ఆమె వ్యక్తిత్వాన్ని  సహిం చ లేదట. ఇది లోక సహజం ‘

”కదా స్నుశామే గృహవర్తినేశ్యాత్ -కదాను పుత్రస్య తయా శుఖం స్యాత్ –స్వశ్రూర్వి లపైవ మనల్ప కాలమ్ —సమాగాతాం న సహేత చిత్రం ”

05 –  -భార్య అంతే ఎవరో కాదట .ధర్మం అనే గంగా ,కామం అనే యమునా ,అంతర్వాహిని గా దామ్పత్యమనే సరస్వతి తో కలిసే ప్రయాగ త్రివేణీ సంగమమే నట

”గంగా సమానః ఖాలు శుద్ధ ధర్మః–సత్కామ ఏవం యమునోపమస్చ –తన్మేలనం యత్ర తదేవ పూతం —క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి .

06 – స్త్రీ కి గౌరవం ఇవ్వాలి అనే ప్రబుద్ధుడు తన కుమార్తె వంటచేయటానికి ఒప్పు కోడు .కానీ వంటలక్క తో వండించుకొని తృప్తిగా తింటాడు .ఆమె కూడా స్త్రీ అన్న స్మృతి వాడికి వుండదు ఇదీ లోక రీతి

”చిత్రోహి వా దోస్తీ మదీయ కన్యా –మహానసే నైవ నియోజ నీయా –పూజ్యా శ్రియః స్థార్హి కధన్ను భుక్తి –ర్భ్రుత్యాహి పక్త్రీ;దకిం న సా స్త్రీ ;”

07 – ఈ రోజు మెడలోపూల  దండ వేసి ,హారతు లిచ్చి ,గౌరవించి మెచ్చి మేక తోలు కప్పు తారు .రేపే ఏదో నెపం మోపి ఆ  కంఠాన్నే  నరికేస్తారు .అందుకని కీర్తిని నమ్మ రాదు

”కన్చిత్ప్రజానే ,త్రుపదేని వేశ్య –స్వదేశ విద్రోహిని ,మా మానమతి   –కన్తేద్య నిక్షిప్యచ ,పుష్ప మాలాం —శ్వస్తీ ప్రదండం పరికల్ప ఏరన్ ”

08 -మానవుడు చిత్ర స్వభావుడు .తన కొడుకు చేసే దోషాలు తెలుసు కోడు .వాడిలో లేని మంచిగుణాలన్నీ వున్నాయని భావిస్తాడు .వాడి కోసం ఎన్నో తప్పులు చసి లోకాప వాదం పొందుతాడు .పుత్ర ప్రేమ

గుడ్డిది .గుడ్డి రాజు ద్రుత రాష్ట్రుడు దీనికి మంచి  ఉదాహరణ .

”జనో న జానాతి ,హి పుత్ర దోషాన్ —గుణాంశ్చ తస్మిన్న సతోపి పశ్యేత్ –పాపం తదర్ధం  ,బహుదా కరోతి —బలీః ,లోకే సుత మూల మోహః

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70

గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70

108-ఆంద్ర ఆస్థాన కవి –శ్రీ కాశీ కృష్ణార్యుల వారు

బందరు జననం  –గుంటూరు నివాసం

1872లో శ్రీ కాశీ కృష్ణా చార్యుల వారు కృష్ణా జిల్లా మచిలీపట్నం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .తండ్రి లక్ష్మణాచార్యులు ,తల్లి అక్కి పిచ్చమాంబ .గుంటూరులోని శ్రీ రామ చంద్రాపురం అగ్రహారం వారైనశ్రీ కాశీ కృష్ణమాంబ ,వేద వ్యాస దంపతులు కృష్ణాచార్యుల వారిని దత్తత తీసుకొన్నారు .

బహుముఖీన పాండిత్యం

.గుంటూరులో అధరాపురపు శ్రీనివాసాచార్యుల వద్ద సాహిత్యాధ్యనం చేశారు .తరువాత నడిచి విజయనగరం చేరి మహిశూర భీమా చార్యుల దగ్గర తర్కాన్ని అభ్యసించారు .పేరి వెంకట శాస్త్రి గారి నుండి పాణినీయ వ్యారణం నేర్చారు .అక్కడ నుండి గోదావరీ తీరం చేరి కాకర పర్తి  నివాసి గుమ్ములూరి సంగమేశ్వర శాస్త్రి గారి దగ్గర తర్క శాస్త్రానికి మెరుగులు దిద్దుకొని ,ఆనాటి మహా మహులైన తార్కిక శిరోమణులతో సరి సమాన పాండిత్యాన్ని పొందారు .వేదాంత శాస్త్ర అంతాన్ని చూశారు .సంగీతం లో ప్రవేశించి నిధి అనిపించుకొన్నారు .వీణా వేణు ,వాయులీన ,మ్రుదంగ జంత్ర వాద్యాలలో  నిష్ణాతుడయ్యారు .ఇవే కాక కుమ్మరి, కమ్మరి, నేత ,వడ్రంగం పనులలోను అధిక ప్రావీణ్యం సాధించి తనకు రాని  విద్య లేనే లేదు అనిపించారు .విజయ నగరం లో సకల కళా ప్రపూర్ణులు అయ్యారు .

వివాహం –సంతానం –ఉద్యోగం

కృష్ణాచార్యుల వారికి పదకొండేళ్ళ వయసు లోనే శ్రీ మతి కుంభారిలక్ష్మీ నరసాంబ తో వివాహం జరిగింది .ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలకు జన్మ నిచ్చారు .గుంటూరు టౌన్ హైస్కూల్ ,గుడివాడ హైస్కూల్ లో దాదాపు పదేళ్ళు సంస్కృత ,ఆంద్ర అధ్యాపకులుగా ఈ ‘’పుంభావ సరస్వతి’’ పని చేశారు .

క్రిష్ణాచార్యీయం

పదేళ్ళ వయసులోనే కృష్ణాచార్యుల వారు పద్య రచన చేశారు .పందొమ్మిదవ ఏట మొదటి అవధానాన్ని గుంటూరు లో చేశారు .తర్వాత వారి అవధాన ప్రక్రియ నిర్వక్ర పరాక్రమం తో జైత్ర యాత్రలా సాగింది .1-12-1911 న బందరులో శతావధానం చేసి దేశం నలు మూలల నుంచి ప్రశంసా వర్షాన్ని అందుకొన్నారు ప్రతిభను నిరూపించుకొన్నారు .పలు చోట్ల అవధానాలు చేసి అవధాన కీర్తిని దశ దిశలా చాటారు .వినుకొండ ,అనపర్తి ,గద్వాల ,ఆత్మకూరు ,వెంకట గిరి ,నూజివీడు ,పిఠాపురం ,విజయనగరం మొదలైన సంస్థానాలలో శతావధానాలు చేసి ,ఆశు కవితలు చెప్పి మెప్పించి శెభాష్ అని పించి సంస్థానాధీశుల చేత ఘన సన్మానాలను అందుకొన్నారు. అవధాన సరస్వతిని ఊరూరా ఊరేగించిన అవధాన సరస్వతి శ్రీ క్రిష్ణాచార్యులవారు .

క్రిష్ణాచార్యులవారు జీవితాన్ని గీర్వాణ భాషా ప్రచారానికే  అంకితం  చేశారు .దీనికోసం ‘’మాతృభాషా సమాజం ‘’అనే సంస్థ ను స్థాపించి కృషి చేశారు .విద్యార్ధులు తేలికగా  సంస్కృతం నేర్చుకోవటానికి మూడు భాగాలుగా ‘’బాల బోధినులు ‘’రాశారు .’’క్రియాదర్శం,’’సంవాదం ‘’,’’వాల్మీకి  చరితం ‘’,’’ఆంద్ర సంస్కృత నిఘంటువు ‘’,అనే గ్రంధాలు రాశారు .ఇవే కాక ‘’గోస్టీవన మహాత్మ్యం ‘’(సంస్కృతం , తెలుగు లలో )’’అవధాన యాత్ర ‘’,అనేక మంది దేవీ దేవతలపై అష్టకాలు ,దండకాలు ,శతకాలు ,స్తోత్రాలు ఈ సాహితీ సరస్వతి లేఖిని నుండి జాలువారాయి .ఒక సారి నెల్లూరు లో ఒక అరగంటలో ‘’శ్రీ రంగ నాయక శతకాన్ని ‘’సంస్కృతం లో ఆశువుగా చెప్పి ఆశ్చర్య చకితులను చేశారు .ఆచార్యుల వారు మహా వక్త .ధారాళం గా ఎంతసేపైనా అనర్గళం గా ఉపన్యసించే నేర్పున్న వారు .

బిరుదులు- సత్కారాలు

శ్రీ కృష్ణాచార్యుల వారికి అవధాన శిరోమణి ,మహా మహోపాధ్యాయ ,విద్యా వారధి ,పౌరాణిక రత్న ,కళా ప్రపూర్ణ ,డి .లిట్ మొదదలైన బిరుదులూ గౌరవాలతో  సన్మానాలందు కొన్నారు .ఇవన్నీ వీరి కవితాశక్తికి పాండిత్య ప్రకర్షకు నిదర్శనాలు .వీరి సంస్కృత భాషా సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పతి చేత 15-8-1960 న ఘన సన్మానం చేయించింది .గుంటూరు పురప్రముఖులు ఆచార్యులవారికి 1961 ఫిబ్రవరి 15,16తేదీలలో ‘’సంస్కృత సామ్రాజ్య పట్టాభి షిక్తుని ‘’గా చేసి ,రత్న ,కనక కిరీటాలతో అలంకరించి అపూర్వ వైభవం తో నభూతో నభవిష్యతి అన్నట్లుగా కలకాలం నిలిచిపోయే ఘనాతి ఘన తర ,ఘన తమ సత్కారం చేసి  తమ ఆత్మీయతను ,ఆప్యాయాన్ని ,గౌరవాన్ని విధేయతను ప్రదర్శించారు .

1962లో కాశీ కృష్ణాచార్యుల వారిని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ‘’నడయాడే సరస్వతి’’ని ’’ ‘’ఆస్థాన కవి ‘’గా నియమించి గౌరవం కల్గించి అద్భుత సత్కారం చేసి తన బాధ్యతను నెర వేర్చుకోన్నది .1963లో నేను రాజ మండ్రి ప్రభుత్వ ట్రెయినింగ్ కాలేజిలో బి .ఇ .డి .చేస్తుండగా మా కాలేజి సాంస్కృతిక వారోత్సవాలలో పాల్గొన టానికి ‘’ఈ వృద్ధ తాపసి’’ 91ఏట వచ్చారు .సభ పై అనంతస్తులో జరుగుతోంది వారు .మెట్లు ఎక్కి పైకి రాలేరని ఒక కుర్చీలో వారిని కూర్చో బెట్టి  నేనూ మిగిలిన మిత్రులం కలిసి మా చేతులతో వారిని నెమ్మదిగా మెట్ల మీదనుంచి సభా వేదికకు మోసుకొంటూ  చేర్చాం .ఆ సాహిత్య సంగీత సరస్వతిని స్పృశించి ,పైకి మోసుకొని వెళ్ళే మహద్భాగ్యం నాకు కలిగిందని మహా నందం పొందాను .అలాగే మళ్ళీ కిందికి దించి తీసుకొచ్చి పాదాల పై  ప్రణ మిల్లాం.వారు సంస్కృతం లోనే మాట్లాడారు అతి సరళమైన భాషలో .అందరికి అర్ధమయ్యింది .వారు ఇతరులతోనూ సంస్కృతం లోనే మాట్లాడేవారని చెప్పుకోగా విన్నాను . అవసరం వస్తే తప్ప అంతా సంసృతం లోనే సంభాషించే వారట .అంతటి దీక్ష వారిది .వారి బాల బోధినులు చదివి ఎందరో సంస్కృతం అభ్యసించారు వారు. ప్రతి ఏడాది పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసేవారు .ప్రతి పట్టణం లోను పరీక్షా  కేంద్రాలు ఉండేవి . సంస్కృత భాషా వ్యాప్తికోసం తన జవ సత్వాలను ధారపోసి న ఈ అపర సరస్వతి  శ్రీ కాశీ క్రిష్ణాచార్యుల వారు 96వ ఏట 1967  బ్రహ్మైక్యం చెందారు .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69

106-మహా వ్యాఖ్యాన కర్త,శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిష్ట చేసిన  –అద్దేపల్లి కృష్ణ శాస్త్రి

దివి సీమ రత్నం

కృష్ణా జిల్లా దివితాలూకా టేకు పల్లి లో(ఘంటసాల గారు పుట్టిన ఊరు ) అద్దేపల్లి శివావధాని కుమారులు అద్దేపల్లి కృష్ణ శాస్త్రి 1846లో జన్మించి అరవై ఒక టవ ఏట 1907లో నిర్యాణం చెందారు .ఈయన సోదరులు అయిదుగురూ మహా విద్వాం సులే.ఆంగ్ల విద్య నేర్చుకోమని అన్నగారు ధవళేశ్వరం లో చేరిస్తే ,ఆ చదువుపై ఇష్టం లేక విజయనగరం వెళ్లి అప్పన భొట్ల గోపాల శాస్త్రి గారి వద్ద చాలాకాలం శుశ్రూష చేసి సాహిత్య ,తర్క వ్యాకరణాలలో పాండిత్యాన్ని సాదిం చారు .గురువు గారి మంత్రం శాస్త్ర విద్య శిష్యునికీ సంక్ర్రమించింది .కృష్ణ శాస్త్రి గారికి రాని శాస్త్రమే లేదు ఈయన తో ఆయనకు రాని  దానిపైన కూడా  వాదం చేయటానికి ఆనాటి మహా పండితులు జంకేవారు .గణపతి, బాల మహా మంత్రొపాసకులు .పాదుకాంత దీక్ష పొంది మూడు నెలలలో ప్రస్తాన త్రయాన్ని చదివేసిన అపర అగస్త్యులు .వీరి ప్రజ్ఞను కధలు గాధలుగా చెప్పుకొనేవారు .

గోపాల పుర వాసి

తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా గోపాల పురపు నివాసి ఉప్పల పాటి జానకమ్మ అనే క్షత్రియ స్త్రీ విజయ నగర ప్రభువు అనుమతితో పన్నెండు మంది పండితులను తన గ్రామానికి దగ్గరలో పొడగట్ల పల్లిలో ఒక్కో పండితుడికి ఒక్క్కో ఇల్లు ,నాలుగు ఎకరాల సేద్య భూమి ఇచ్చి పండితులపట్ల తనకున్న భక్తిని చాటుకొన్నది. ఇలా వచ్చి స్థిరపడిన వారిలో మన కృష్ణ శాస్త్రి గారూ ఒకరు .ఇది గాక గురువుగారు గోపాల శాస్త్రి గారు  చనిపోయినప్పుడు రాసిన వీలునామా ప్రకారం అయిదేకరాలపోలం ,మొత్తం డబ్బూ కృష్ణ శాస్స్త్రి గారికి సంక్రమించింది .శిష్యునిపై గురువుగారికున్న వాత్సల్యానికిది నిదర్శనం .గురువు ములికి నాటి వారైతే శిష్యుడు వెలనాటి వారు .పుత్రునిలా ఆదరించారు శిష్యుని. గురువుగారి అంత్య క్రియలను శిష్యులు శాస్త్రి గారి చేతుల మీదుగశాస్త్రోక్తం గా జరిగాయి .

కృష్ణ శాస్త్రి ప్రజ్ఞ

1892లో కృష్ణ శాస్త్రి గారు శ్రీ సత్యనారాయణ స్వామిని అన్నవరం లో ప్రతిస్టిం చారు .అప్పటికి అన్నవరానికి ఏమీ ప్రాముఖ్యత లేదు .శాస్త్రి గారి మంత్రోపాసన ఎందరికో ప్రేరణ కల్గించింది .విదేశీయులు కూడా ఆయన వద్ద మంత్రం శాస్ట్ర రహస్యాలను తెలుసుకొనేవారు .’’జగన్మోహన మంత్రం ‘’లో గొప్ప ఉపాసకులు. దీన్ని గురించిన పుస్తకం శాస్ట్రి గారు రాస్తే అది జర్మనీ చేరిందట .

గోపాలపురం రాజా వారి ఆస్థాన పండితులుగా కృష్ణ శాస్త్రిగారు చాలాకాలం పని చేశారు .పురాణ ప్రవచనం లో అందే వేసిన చెయ్యి .వీరికి మించిన వారు ఆనాడు లేరట .వీరి ప్రజ్న బహు విచిత్రమైనది .ఒకో శ్లోకానికి 108రకాల అర్ధాలు చెప్పగల మహా నేర్పరి .దీనితో పండితపామరులందరూ వారి పురాణ శ్రవణం కోసం ఎదురు చూసేవారు .

సంస్కృత భాషలో వీరు రాసిన గ్రంధాలకు లెక్క లేదు .శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానం ను విచిత్ర విధానం లో రాసి ముద్రించారు .వాల్మీకి రామాయణం లోని ఒక్కో శ్లోకానికి వంద రకాల వ్యాఖ్యానం రాసి కాశీ పండితులను మెప్పించిన మహా జ్ఞాని .ఈ గ్రంధానికి ‘’ఏక శ్లోక వ్యాఖ్యానం ‘’అనే పేరు పెట్టారాయన .’’ఆలంకార ముక్తావళి ‘’అనే వ్యాఖ్య రాసి ఆ శాస్త్రం లోను తన అసాధారణ పాండిత్య ప్రకర్షను నిరూపించుకొన్నారు .తర్క శాస్త్రం లో ‘’తర్కామృత తరంగిణి ‘’అనే గ్రంధం రాశారు కాని అముద్రితం .

107-నృత్త రత్నావళి రాసిన జాయప సేనాని

జాయప సేనాని కృష్ణా జిల్లా దివిసీమ కు చెందిన వాడు .కాక తీయ గజ సైన్యాధ్యక్షుడు .నాట్యకళా మర్మజ్ఞుడు .వెలనాటి క్రోయ్యూరు రాజు అయ్య వంశం వాడు భీమయ్యకు ప్రపౌత్రుడు .దుర్జయ సైన్యాధిపతి నారప నాయకుని పౌత్రుడు. పిన్న చోడుని కుమారుడు .తల్లి దానమ్మ .ఇతని సోదరులు పృధ్వీ ,నారప నాయకులు .నారమ్మ ,పేరమ్మ సోదరిలు .ఈ అయ్య  వంశం వారందరూ సామంత రాజులే సేనాదిపతులే .వెలనాటి చోళ భూపతికి సామంత రాజులుగా ఉండేవారు .

దివిసీమ నుండి –ఓరుగల్లుకు

1213లో కాకతీయ గణపతి మహారాజు తూర్పు ఆంద్ర పై దాడికి వచ్చి వెలనాటిని జయించాడు .జాయప సోదరీమణులైన నారమ్మ పేరమ్మలను పెళ్లి చేసుకొన్నాడు .జాయప శౌర్య పరాక్రమాలకు ఆకర్షితుడై తనతో ఓరుగల్లు తీసుకొని వెళ్లి గజసేనాదిపతిని చేశాడు .అతనికి ‘’వైరి గోదూమఘ రట్ట’’అంటే శత్రువుల్ని తిరగలిలో గోధుమలను పిండి చేసినట్లు చేసేవాడు అనే బిరుదినిచ్చి సత్కరించాడు .జాయప కృతజ్ఞతాపూర్వకం గా ‘’గణపతీశ్వరాలయం ‘’నిర్మించాడు.అనేక గ్రామాలను ఈ ఆలయానికి దానం చేసి స్వామి భోగాలకు ఉపయోగపడేట్లు చేశాడు . ఈ నాటి చేబ్రోలు ఆ నాటి తామ్ర పురం లో తండ్రి పేరిటచౌడే శ్వరాలయం నిర్మించాడు .

ఆలయానికి ఎదుట దేవదాసీలు ఉండటానికి రెండేసి అంతస్తుల భవనాలు కట్టించాడు  .

జాయప సేనానీయం

కాకతి ప్రభువు గణపతి దేవుడికి సంగీత ,నాట్య శాస్త్రాలపై అపారమైన అభిరుచి ఉండేది. జాయపకు కూడా యవ్వనం నుండి వీటిపై గొప్ప ఆరాధన ఉంది  .జాయప భరతుని నాట్య శాస్త్రం ,సోమేశ్వర దేవుని మానసోల్లాసం అప్పటికే చదివి లోతైన పాండిత్యాన్ని సంపాదించాడు .ఇవికాక అనేక ఆధునిక ప్రాచీన గ్రంధాలను చదివి జీర్ణం చేసుకొన్నాడు జాయప లో ఉన్న ఈ ప్రతిభ ను గురించిన చక్రవర్తి  ఆయనను ‘’నృత్త రత్నావళి ‘’గ్రంధాన్ని రాయమని కోరాడు కాదు కాదు శాసించాడు .వెంటనే మోదలు పెట్టి రాశాడు జాయప .దీని తాళ పత్ర ప్రతులు రెండు తంజావూర్ సరస్వతీమహల్  లో ఉన్నాయి .ఇందులో మొత్తం ఎనిమిది అధ్యాయాలు .అయిదవ అధ్యాయం లేదు .చివరి మూడు అధ్యాయాలను దేసీ నృత్యానికి కేటా ఇంచాడు  .అయినా చాలా లోతైన అధ్యయనం తో రాసిన గ్రంధం అనిపిస్తుంది నృత్త గీతాలలో ఉండే మార్గ  దేశి లపై చర్చ చేశాడు .మార్గ విభాగానికి భరతుని గ్రంధం, దేశీయ విధానానికి సోమేశ్వర గ్రంధం లను ఆధారం చేసుకొని రాశాడు .కీర్తి ధర ,భట్ట తండు రాసిన వాటినీ చర్చించాడు .నృత్త గీతాలలో జరిగిన పరిశోధన అంతాతెలియ జేశాడు .సిద్ధాంత రహస్యాలను సంస్కృతీ వైభవాన్ని గొప్పగా నిరూపించాడు .దేశి నృత్యాలలో పేరిణి ,ప్రేక్ఖనం రాసకం ,చర్చరి ,నాట్య రాసకం ,దండ రాసకం ,శివప్రియం ,చిందు ,కన్డుకం  భాన్దికం ఘంట సరి ,చరణం బహురూపం కోలాటం మొదలైన జాన పద నృత్య రీతులపై కూడా రాశాడు .వీటిలో పేరిణి శివ తాండవాన్ని అత్యధిక ప్రచారం చేసిన వారు నట రాజ రామ కృష్ణ గారు .వారికి ఏమిచ్చినా ఆంద్ర జాతి ఋణం తీర్చుకోలేదు .,జాయప ‘’గీత రత్నావళి ‘’అనే సంగీత గ్రందాన్నికూడా రాశాడు .నృత్త రాత్నావలిలోని నృత్యాలకు ఇందులోని సంగీతాన్ని ఉపామ్గం గా ఉండేట్లు రాశాడు కాని ఏ ఏ గ్రంధం శిధిలమైంది .జాయప సేనాని నృత్త రత్నావళిని 1254లో రాసినట్లు భావిస్తున్నారు .

Inline image 1 Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కథ ప్రియమైన పాపాయికి.. (కథ)

కథ ప్రియమైన పాపాయికి.. (కథ)

  • -ఎం.విజయకుమార్
  • 29/11/2014
TAGS:

కథల పోటీలో ఎంపికైన రచన
……………….

‘‘ఒక్కొక్కళ్ళకి ఇకఇకలు.. పకపకలు.. చదువూ సంధ్యాలేదు.. వేలకు వేలు డబ్బులు పోసి ఇంటి దగ్గరవాళ్ళు పంపితే, ఇక్కడికొచ్చి సోకులు పోవడం…’’ వాక్ ప్రవాహం సాగిపోతోంది.. ఎదురుగా తలలు దించుకొని ఆడపిల్లలు.. నరకానికి మారుపేరైన ఓ కార్పొరేట్ కాలేజీలో ఐఐటి ఓరియెంటెడ్‌లో ఇంటర్ చదువుతున్న పిల్లలు వాళ్ళు.. తిట్టిన తిట్టు తిట్టకుండా అరగంట నుంచి తిట్ల ప్రవాహం కొనసాగిస్తున్న ఆమె ఆ క్యాంపస్ ప్రిన్సిపాల్..
‘‘ఒక్కొక్కరూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు… కాకపోతే ఏంటి.. ఆ మార్కులు.? స్టడీ అవర్‌కి రమ్మంటే ఆలస్యంగా రావడం… వచ్చినాక చదుతారా? అంటే అదీ లేదు.. ఒక్కోదానికీ కబురు, ఒక్కోదాన్నీ…’’ పదాన్ని సాగదీస్తూ మధ్యలోనే ఆపింది ప్రిన్సిపాల్. తరువాత వాళ్ళ ఊహకే వదిలేస్తూ. వాళ్ళూ ఊహించుకోగలరు… ఆ తరువాత ఎంత ఛండాలంగా నైనా తిట్టగలిగేది- ఆ క్యాంపస్ డీన్. ప్రిన్సిపాల్ అయినా కొంచెం పర్లేదు. ఈ డీన్ మేడమ్ నోటికి అడ్డూ అదుపూ అసలు వుండదు. పిల్లల్ని తిట్టడం కోసమే ఆమెను అపాయింట్ చేసారేమో అన్నట్లు వుంటుంది.
ఓ పెద్ద సైజు సిలిండర్‌కి చీర కట్టినట్లు కింద నుంచి పైకి సమానంగా ఒకే రకంగా వుంటూ హడావుడిగా క్యాంపస్ అంతా తిరుగుతూ… నానా హైరానా పడే ఆమెను చూస్తే… కొద్దిమందికి భయం.. చాలామందికి అసహ్యం. వారాంతపు పరీక్షల్లో.. కొంచెం మార్కులు తగ్గినాయని చెప్పి ‘్ఫడ్‌బ్యాక్’ పేరుతో ఆ తిట్ల పురాణం. ఆడుతూ పాడుతూ చక్కగా చదవవలసిన పిల్లలను- కార్పొరేట్ కాలేజీ అని పిలువబడే ఓ జైలుకి తల్లిదండ్రుల ఆశ చేర్చింది. అనుక్షణం మఫ్టీలో వున్న పోలీసుల్లాంటి కాలేజీ సిబ్బంది కాపలా మధ్య పుస్తకాలకు వేలాడుతూ వుంటారు. పాఠం అర్థమయిందా..? లేదా..? అన్నదానితో పనిలేదు. స్నానం, తిండి, నిద్ర, వికాసం వంటి వాటితో ఏం పని లేదు. అదృష్టమో, దురదృష్టమో కానీ వీళ్ళు కొంచెం తెలివిగల పిల్లలే. అందుకే ‘్ఫస్ట్‌ట్రాక్’ బ్యాచ్ పేరుతో అనుక్షణం పుస్తకాల గుదిబండను మోస్తూనే వుండాలి. మనుషులతో పనిలేదు. మనసులతో పనిలేదు. మార్కులు ఏ మాత్రం తగ్గినా ‘్ఫడ్‌బ్యాక్’ అనో కౌనె్సలింగ్ అనో.. ఏదో ఒక పేరుతో తిట్ల పురాణం. కాలేజీ యాజమాన్యాల కంటికి వీళ్ళు పిల్లలు కాదు. తరువాతి సంవత్సరానికి అడ్మిషన్లు పెంచే యంత్రాలు. వాళ్ళ విద్యా వ్యాపారానికి పెట్టుబడి సాధనాలు.
పిల్లల మనసుల్లో ఎన్నో ఆలోచనలు. ఎదురుగా ఉన్న ప్రిన్సిపాల్‌ని, డీన్‌ని పొడిచి పారేద్దామన్న కసి. కాలేజీలో పడేసిన అమ్మానాన్నలమీద ఏదో తెలియని కోపం.. కానీ.. ఏమీ చేయలేని నిస్సహాయత. ఒక్కొక్కరి కళ్ళు వర్షించే మేఘాలుగా వున్నాయి. పంటి బిగువున దుఃఖాన్ని భరిస్తున్నారు. చచ్చిపోవాలన్నంత బాధ వుంది కొందరిలో. ఎప్పుడు వదిలేస్తారా..? వెళ్లి తనివిదీరా ఏడుద్దామా.. అన్నట్లు నిలబడి వున్నారు.
‘‘పోయి తగలడండి… ఈసారి మార్కులు తగ్గితే సహించేది లేదు’’ అన్న ప్రిన్సిపాల్ మాట పూర్తయ్యేలోపే… బతుకు జీవుడా అనుకొంటూ అక్కడినుంచి వేగంగా హాస్టల్ గదులవైపు వారు సాగిపోయారు.
***
అర్ధరాత్రి సమయం.. చాలామంది ఏడ్చి.. ఏడ్చి.. అప్పుడే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. నెమ్మదిగా స్వప్న లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. మిగతా రూమ్మేట్లు ముగ్గురూ నిద్రలో వున్నారు. వాళ్ళ మనసుల్లో గూడు గట్టుకున్న దైన్యంలా బెడ్‌లైట్ వెలుతురు. ఆ గుడ్డి వెలుతురులోనే- మెల్లగా, శబ్దం రాకుండా తన పెట్టెలోనుంచి ఒక పుస్తకం తీసింది. పుస్తకం మధ్యలో ఓ కవరు లోనుంచి కాగితం తీసి.. టార్చిలైట్ వెలుగులో చదవసాగింది. చదవడం పూర్తయినాక.. కాగితం కవరులో ఉంచి నెమ్మదిగా పెట్టెలో వుంచి పడుకుంది. తనని ఎవరూ గమనించలేదనుకుని నిద్రలోకి జారుకుంది. తనని రెండు కళ్ళు గమనించాయని, ఆ కళ్ళు రూమ్మేట్ ఈశ్వరివని ఆమెకి తెలియదు.
***
ఈశ్వరి నెమ్మదిగా హాస్టల్ గదిలోకి ప్రవేశించింది. క్లాసులు జరుగుతుండగా తనకు ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చేసింది. తరచూ అర్ధరాత్రి వేళ స్వప్న చదివేది ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఆమెలో పెరిగింది. స్వప్న పెట్టెని సమీపించింది. దానికి తాళం వేసి లేదు. పెట్టె తెరచి వెతుకులాట ప్రారంభించింది. అడుగున ఎక్కడో ఓ పుస్తకంలో కవరు కనబడింది. అందులో నుంచి ఓ కాగితం తీసింది. ‘‘స్వప్న ఏం చదువుతున్నదో, అది బాయ్‌ఫ్రెండ్ రాసిన లవ్‌లెటరో ఏంటో.. తేలిపోతుంది’’ అనుకుంటూ కాగితం మడతలు విప్పింది. చూపులు అక్షరాల వెంట పరుగు తీయసాగాయి.
ప్రియమైన పాపాయికి…
ఓ సగటుజీవి అయిన నాన్న వ్రాయునది. మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు అక్షర రూపంలో పొందుపరుస్తున్నాను. బహుశా నామీద ఎంతో కోపం వుండవచ్చు.. ‘నాన్న’ అన్న నా పెద్దరికాన్ని గౌరవిస్తూనో లేదా భయపడుతూనో.. నా నిర్ణయాన్ని నీవు ఆమోదించి వుండవచ్చు. చూసేవాళ్ళకి చిన్న విషయంగానో, హాస్యాస్పదంగానో అనిపించవచ్చు. కానీ నీ వైపునుంచి ఆలోచిస్తే ఎంతో బాధాకర విషయం. చదువు పేరుతో ఇంటికి దూరంగా.. ఓ కార్పొరేట్ కాలేజీలో నువ్వు చేరడం. పేరుకే అది కాలేజీ, నిజానికి అది ఒక జైలు అని తల్లిదండ్రులందరికీ తెలుసు, కానీ.. తప్పదు. తాము నెరవేర్చుకోలేని కలలు తమ పిల్లలన్నా నెరవేర్చాలన్న ఓ పెద్ద ఆశ. పోటీ ప్రపంచంలో పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారేమోనన్న భయం, బలహీనత. అందుకే వద్దు మొర్రో… అన్నా బతిమాలో, బెదిరించో స్థాయికి మించినదయినా అప్పో సోప్పో చేసి చేర్చటం, అక్కడినుంచి వొత్తిడి పెంచడం, ఊహల్లో బతకడం…
అప్పటివరకూ అమ్మానాన్నల ప్రేమను పొంది, చిరు అలకలు, బుజ్జగింపులతో.. ఆనందాలను ఆస్వాదిస్తూ ఓ అందమైన చిన్ని ప్రపంచంలో ఆనందంగా వున్న మిమ్ములను చదువు నెపంతో- కాలేజీ నాలుగు గోడల మధ్య బందీలను చేస్తాం. సగటు తల్లిదండ్రులను అందమైన ప్రకటనల మాయాజాలంలో ముంచేసే ఓ విద్యా వ్యాపార సంస్థలోకి మిమ్ములను నెట్టేస్తాం. మాటలకి, చేతలకు పొంతన లేకపోయినా.. రకరకాల పేర్లతో నిలువు దోపిడీ చేస్తున్నా నోరు విప్పలేని సగటు జీవులం. కాలేజీ వాళ్లు ఎంత దోపిడీ చేసినా ‘ఇదేమిటి..?’ అనే ప్రశ్నించే ధైర్యం చాలక, అనుక్షణం ఆత్మవంచన చేసుకుంటూ ముసుగులో బతికే పిరికివాళ్ళం.
మిమ్ముల్ని కలవడానికొచ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులుగా మాకెంత నరకమో.. మెత్తని కత్తితో గుండెను కోస్తున్న ఫీలింగ్. మా బాధలు వింటే.. ఎక్కడ మీ మనసు మారుతుందో అని.. మాట మారుస్తూ.. మిమ్ములను ఏమారుస్తూ.. ప్రేమ పేరుతో తినుబండారాలను మీ నోటిలో కుక్కేస్తూ.. మీ నోరు తెరవనివ్వం. తిరిగివెళ్ళే ప్రతిసారీ.. గేటులోపలి నుంచి మీరు చేతులూపుతుంటే.. చెమ్మగిల్లిన మా కళ్ళు మీకెక్కడ కనబడతాయోనని.. మీరెక్కడ నొచ్చుకుంటారో అని.. ధైర్యంగా మీ కళ్ళలోకి చూసి వీడ్కోలు చెప్పలేని దౌర్భాగ్యులం..
ఇక మీ పరిస్థితి చూస్తే ఏముంది.? స్వేచ్ఛగా ఎగిరే పక్షి రెక్కలు విరిచి, పంజరంలో పడేసినట్లుగా అనుక్షణం మీకు నరకమే. మీరు పుస్తకాలనే తినాలి. పుస్తకాలనే తాగాలి.. పుస్తకాలనే శ్వాసించాలి.. అంటూ… ప్రతిక్షణం ఒత్తిడికి గురిచేసే కళాశాల యాజమాన్యం. ఆడపిల్లలుగా మీకు కలిగే ఇబ్బంది అర్థం చేసుకోకపోగా, మాటలతో మనసును గాయపరుస్తూ సాటి మహిళలే మిమ్మల్ని హింస పెడుతుంటారు. ఎవ్వరినీ ఏమీ అనలేక.. ఏమీ చెయ్యలేక, కోపాన్ని బాధలను దిగమింగుకుంటూ.. మీరు చదువుకునే యంత్రాల్లా మారతారు.
కానీ, కన్నా.. ఓ చిన్న అనుమానం నీకు రావచ్చు. ఇన్ని తెలిసి, ఇంత బాధపడే నాన్న… ఇక్కడ ఎందుకు చేర్పించినట్టు? ముందే చెప్పానుగా- సగటు తండ్రినని. తెలివిగల పిల్లను కార్పొరేట్ కాలేజీలో చేర్పించకుంటే అందరూ తిడతారన్న భయం. రేపు పోటీ పరీక్షల్లో నీకు మంచి ర్యాంక్ రాకపోతే నువ్వు చిన్నబుచ్చుకొని- ‘‘నన్ను అక్కడ చేర్చితే బాగుండేదేమో..’’ అని అనుకోకుండా ఉండాలన్న ఆశతో మంచి కాలేజీలో చేర్చాను.
ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియని నీకు.. హాస్టల్‌లో మిగతా పిల్లల మధ్య గడిపితే… ప్రపంచం అంటే కొంతయినా తెలుస్తుందని మరో ఆశ. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే మనస్తత్వం అలవడుతుందనే ఆలోచనతో హాస్టల్‌కి పంపాను. అయతే- నీకు నేనొక హామీ మాత్రం ఇవ్వగలను. ర్యాంకుల కోసం నువ్వు పరుగెత్తనక్కరలేదు. పరీక్ష అనగానే రాత్రింబవళ్లు హైరానా పడనక్కర్లేదు. చదువులో నీ సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నించు. కొన్నిసార్లు నువ్వు విజయం పొందవచ్చు.. ఇంకొన్నిసార్లు అపజయం పొందవచ్చు. విజయం సాధిస్తే గర్వం వద్దు. ఓటమిలో నిరుత్సాహం చెందకు. ఎవరేమన్నా సీరియస్‌గా తీసుకోకు, అలాగని వారి మాటలను నిర్లక్ష్యం చేయబోకు. మంచి మార్కులు పొందినా నిన్ను మెచ్చుకోని వారు- ఏ కొంచెం మార్కులు తగ్గినా నొచ్చుకొనే మాటలు అనటానికి ముందుంటారు. ఓ చిన్న మాట… కాలేజీ వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు బాధపడొద్దు, కానీ బాధపడినట్లు నటించు. నీ మోములో బాధలాంటి ఏ భావం కనబడకపోతే.. నిర్లక్ష్య ధోరణిలో వున్నావని వారి అహం సంతృప్తి చెందక- మరింతగా మాటలనే ప్రమాదముంది. అప్పుడు ఎంత వద్దనుకున్నా నీ మనసు గాయపడవచ్చు. వీలయినంతవరకు ఏదైనా అనే అవకాశం వాళ్ళకివ్వకుండా చూసుకో.. ఎక్కువగా ఆలోచించి దిగులు పడకు. ఇలా రాశానని ఏమి అనుకోవద్దు. రాయాలనిపించి రాశాను.
ఒక్కటి మాత్రం గుర్తుంచుకో- ‘‘ప్రతిసారీ విజయం రాదు.. అలాగని అపజయం కూడా తిష్టవేసుకొని కూర్చోదు. నిజాయితీగా ముందు ప్రయత్నించాలి. ఫలితం తరువాత. నీ విజయానికి ఎంత మురిసిపోతానో.. నీ అపజయానికీ అంతే బాసటగానే వుంటాను. సగటు తండ్రినే గాని.. బాధల్లో నిన్ను ఒంటరి చేసేవాడిని మాత్రం కాదు. ఆల్వేస్ యువర్ లివింగ్ డాడ్… వుంటాను.. సెలవ్’’.
***
ఏదో అలికిడి వినబడటంతో- అప్పటికే ఉత్తరం చదవేసిన ఈశ్వరి తలెత్తి గుమ్మం వైపు చూసింది. ఎదురుగా స్వప్న. కోపంతో అరుస్తుందనుకుంటే.. అందుకు భిన్నంగా చిరునవ్వు చిందిస్తూ నిలబడి వుంది. ‘‘నాకు తెలుసు నువ్వు గమనిస్తున్నావని… ఏదో ఒక రోజు ఇలా చేస్తావని ముందే ఊహించాను… నీవు ఊహించుకొనే రహస్యాలేమీ లేవు నాకు’’ అంటూ దగ్గరికొచ్చి ఈశ్వరి భుజంపై చెయ్యి వేసింది. ‘‘బాగా దిగులుగా అనిపించినపుడు.. మా డాడీ రాసిన ఉత్తరం చదువుకుంటాను. నా పక్కన కూర్చొని నన్ను ఓదార్చుతున్నట్లుగా వుంటుంది, అందుకని…’’ వాక్యం పూర్తయ్యేలోపే.. స్వప్నను ఒక్కసారిగా ఈశ్వరి వాటేసుకుంది. ఈశ్వరి మనసులో కూడా ఏదో భారం తొలగిపోయినట్లుగా వుంది. ఇద్దరూ కొద్దిసేపు అలా వుండిపోయారు. స్వప్న ఆ ఉత్తరాన్ని మరోసారి ప్రేమగా చూసుకుంది. ‘‘ఐ లవ్ యు మై డాడ్.. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్’’ -అని ఉత్తరం అడుగున ఆమె రాసుకున్న వాక్యాలు మెరుస్తున్నాయి- వాళ్ళ కళ్ళల్లో కొత్త మెరుపులా.
*

రచయత ఫోన్ నెంబర్:
76600 91053

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆశ్రమాలు.. ఆధ్యాత్మిక వేదికలు

ఆశ్రమాలు.. ఆధ్యాత్మిక వేదికలు

  • 01/12/2014
TAGS:

శ్రీకాకుళం, నవంబర్ 30: పవిత్ర తపోవనాలు, భక్తి, ముక్తి, బాధ్యతలను ప్రసాదించే అసలైన వేదికలని, ఎందరో మహనీయులు ప్రాచీన కాలంలో ఇలాంటి వన, జ్ఞాన సంపదల నుంచి తపస్సు చేయడం ద్వారా ఆధ్యత్మిక మార్గాలను పామురులకు సైతం అందించగలిగారని రాష్టప్రతి పురస్కార గ్రహీత, సూర్యపీఠం అధిపతి సద్గురు కృష్ణయాజీ పేర్కొన్నారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం పెద్దబాడాం అమరగురు బాబాజీ సిద్ధయోగ తపోవనం మంగళకర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏర్పాటు చేసిన పీఠాపధితులు, స్వామిజీల వేదికలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తల్లి సౌజ్ఞానం, తండ్రి అక్షరజ్ఞానం అందిస్తారని ప్రజ్ఞానం గురుబ్రహ్మలే బోధిస్తారంటూ గురుతర బాధ్యతను తపోవనం వ్యవస్థాపకులు, పరమేశ్వరానంద గిరి స్వామిజీ ధన్యులన్నారు. సర్వసంగ పరిత్యాగులైన సాధుసజ్జనులు అసలైన దైవస్వరూపులని, వారి సూక్తులను ఆచరించి జీవితాన్ని పునీతం చేసుకోవాలని భక్తులకు హితవుపలికారు. ఈ సందర్భంగా వేదికపై గల పీఠాధిపతులు, సాదుపుంగవులను దుస్సాలువాతో కప్పి ఫల, పుష్పాలు సమర్పించి పాదాభివందనం చేసి అందరికీ గురుబాధ్యతను గుర్తుచేశారు. నెమలికొండ శాంత్యాక్రమ దత్త పీఠాధిపతులు సద్గురు సదానంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ, తపోవనం అందరి భాగ్యమని, విశ్వకల్యాణం కోసం ఇందులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దైవత్వాన్ని గురించి దైవికంగా జీవించాలన్నారు. పాత్యాశ్చ దేశాల్లో లేని బ్రహ్మ, ఆత్మజ్ఞానాలను, శాంతి ఆనందాలను ఈ దేశంలో చూడవచ్చునన్నారు. నాది-నేను- నావారు అనే ధ్యాసలో దైవానికి దూరం కారాదని సూచించారు. అదేవిధంగా ఆనందాశ్రమం వ్యవస్థాపకులు, స్వాభిమాన్ ట్రస్టు అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతీ, ఉత్తరాంధ్ర సాదుపరిషత్ గౌరవ అధ్యక్షులు, దుర్గాపీఠం వ్యవస్థాపకులు సమతానంద సరస్వతీ, నైమిశారణ్యాశ్రమ పీఠాధిపతి బాలబ్రహ్మనందస్వామి వారి ప్రసంగాల ద్వారా జన్మరహస్యం తెలుసుకోవాలని, రామాయణ, భారత, భాగవతం వంటి సనాతన ధర్మాన్ని ఉపదేశించే గ్రంథాలను పారాయణం చేయాలన్నారు. ఆశ్రమాలు, తపోవనాలను సంరక్షించడం ద్వారా జన్మను ధ్యానం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

చిత్రం.. కార్యక్రమంలో మాట్లాడుతున్న కృష్ణ యాజీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అగ్నిసరస్సులో ఈదాల్సిందే… మదర్ ఇండియా సినిమా పాటలు –

అగ్నిసరస్సులో ఈదాల్సిందే…
శ్రమైక జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లు తీసిన చిత్రం ‘మదర్‌ ఇండియా‘ . నర్గిస్‌ తన అసమాన ప్రతిభను ప్రదర్శించిన ఈ చిత్రం 1957లో విడదల అయ్యింది. ఇందులోని ‘దునియా మే హమ్‌ ఆయేతో జీనా హి పడేగా’ అనే పాట ప్రతి భారతీయ హృదయాన్నీ ఉర్రూతలూపింది. శకీల్‌ బదాయునీ రాసిన ఈ పాటను , నౌషాద్‌ స్వరబద్ధం చేస్తే లతా మంగేష్కర్‌ తన చెల్లెళ్లు మీనా మంగేష్కర్‌, ఉషా మంగేష్కర్‌లతో కలిసి గానం చేశారు.
దునియా మే హమ్‌ ఆయే హై తో జీనా హీ పడేగా
జీవన్‌ మే అగర్‌ జెహర్‌ తో పీనా హీ పడేగా /దునియా మే/
(లోకంలోకి వచ్చాక మనం జీవించాల్సిందే
జీవితంలో విషమే ఉన్నా తాగాల్సిందే)
ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, జీవితం అపురూపమైనదే. ఈ కష్టాలకూ, బాధలకూ అతీతమైన ఒక జీవితానందం సజీవత్వంలోనే సిద్ధిస్తుంది. సుఖ సంతోషాలు, జీవన మాధుర్యాలూ అన్నిసార్లూ లభించవు. ఆ మాటకొస్తే జీవితంలో అత్యధిక భాగం సంఘర్షణలూ, సంక్షోభాలే ఉంటాయి. తేనెల జలపాతాలకన్నా, విష ధారలే ఎక్కువగా ఉంటాయి. ఒక వేళ అలా జీవితంలో విషఽభాండాలే ఉన్నా, ఆ విషాన్ని సైతం జీర్ణించుకోవాలి. ఎందుకంటే, ఆ విషాన్ని చిలికితే గానీ, జీవిత సత్యాలు బోఽధపడవు. ఆ సత్యాల్ని అక్కున చేర్చుకుంటే గానీ, అమృత భాండాలు మన చేతికందవు
గిర్‌గిర్‌కే ముసీబత్‌ మే సంబల్‌తే హి రహేంగే
జల్‌ జాయే మగర్‌ ఆగ్‌ పే చల్‌తే హీ రహేంగే
గమ్‌ జిస్‌నే దియే….
గమ్‌ జిస్‌నే దియే హై వొహీ గమ్‌ దూర్‌ కరేగా -2 / దునియా మే /
(కష్టాలు పడీ పడీ తిరిగి నిలదొక్కుకుంటాం
కాలిపోతున్నా సరే, నిప్పులమీద నడుస్తూనే ఉంటాం
ఎవరీ బాఽధలిచ్చారో…
ఎవరీ బాధలిచ్చారో వారే వాటిని దూరం చేస్తారు- /లోకంలోకి/)
ప్రశాంతంగా, ప్రసన్నంగా సాగిపోయేదే జీవితమనే భ్రమల్లోంచి ఎప్పటికైనా బయటపడాల్సిందే.. జీవితమంటే నిరంతర యుద్ధమనే సత్యం బోధపడేదాకా మనిషి ఎదిగినట్లు కాదు. మనలో మనకే జరిగే అంతర్యుద్ధమే కావచ్చు. చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల మీద యుద్ధం కావచ్చు. మొత్తానికి యుద్ధం తప్పదు. నిజానికి జీవితంలో పోరాటం చేయనిదే శాంతీ లేదు, ప్రసన్నతా రాదు. ఈ నిజాన్ని స్వీకరినంచినప్పుడే ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేచే ప్రయత్నం చేస్తాం. ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి గెలిచే ప్రయత్నం చేస్తాం.
ఔరత్‌ హై వో ఔరత్‌ జిసే దునియా కి శరమ్‌ హై
సంసార్‌ మే బస్‌ లాజ్‌ హీ నారీ కా ధరమ్‌ హై
జిందా హై జో…
జిందా హై జో ఇజ్జత్‌ సే వో ఇజ్జత్‌ సే మరేగా -2 / దునియా మే/
లోకం పట్ల వినయవిధేయతలున్న ఆడదే ఆడది. లోకపు గౌరవాన్ని నిలబెట్టే ధర్మమూ ఆడదారి మీదే ఉంది.
సజీవులెవరు?
పరువుగా బతికి పరువుగా మరణించినవారే లోకంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. /లోకంలోకి /)
లోకం నుంచి మనం ఏవి ఆశిస్తామో.. లోకానికి మనం అవే ఇవ్వాలి. ఆ క్రమంలో లోకం పట్ల మనం వినమ్రంగా ఉండాలి. వినయంగా ఉండాలి. అనాదిగా మహిళ ఆ విలువల్ని పాటిస్తూనే ఉంది. అంత వినయంగా ఉంటూనే కుటుంబ గౌరవాన్నీ తద్వారా సామాజిక గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కూడా మహిళ మీదే ఉంది. అయితే, లోకంలో కోటానుకోట్ల మంది పుట్టారు, గిట్టారు. కానీ, నిజమైన బతుకు బతికిందెవరు? కడ ఊపిరి దాకా పరువుగా బతికి, పరువుగా ప్రాణాలు వదిలిన వాళ్లే కదా! గెలిచావా లేదా అన్నదొక్కటే ముఖ్యమా? ఆ నిలిచి, గెలిచే క్రమంలో ఏ విలువల మీద నడిచావన్నది అత్యంత ముఖ్యమవుతుంది.
మాలిక్‌ హై తేరే సాథ్‌ న డర్‌ గమ్‌ సే తూ యే దిల్‌
మెహ్నత్‌ కరే ఇన్సాన్‌ తో క్యా కామ్‌ హై ముష్కిల్‌
జైసా జో కరే….
జైసా జో కరేగా యహాఁ వైసా హీ భరేగా -2 / దునియా మే/
(దైవం నీ తోడుగా ఉన్నాడు బాధలకు భయపడాల్సిన పనేముంది?
మనిషి శ్రమించాలే గానీ, సాఽధ్యం కానిది ఏముంది?
ఎవరు ఎంత చేస్తే….
ఎవరు ఎంత చేస్తే వారికి ఇక్కడ అంతే ప్రాప్తిస్తుంది)
అన్నీ ఊరకే వచ్చిపడాలనుకునే వారికి తన శరీరమే తనకు పూర్తిగా సహకరించదు. అలా కాకుండా, తన శ్రమను నమ్ముకున్నవారిలో , శ్రమైక జీవన సౌందర్యాన్ని దర్శించిన వాళ్లల్లో అన్నేళ్లూ తనలో నిగూఢంగా పడి ఉన్న సర్వశక్తులన్నీ పెల్లుబికి వస్తాయి. ఆ సమయాన సాటి మనుషులూ, సమస్త ప్రకృతీ, చివరికి లోకంలోని దివ్యశక్తులు సైతం మనిషికి అండగా నిలబడతాయి. చేసిన వారికి చేసినంత అన్నట్లు, మనిషి ఏం చేస్తే దాని తాలూకు ఫలితమే వస్తుంది. తుమ్మ మొక్కను నాటి మామిడి పళ్లు కావాలంటే అది అయ్యే పనేనా? ఏమైనా సుఖంగా బతకాలనుకునే వారిని కష్టాలే వెంటాడతాయనేది వాస్తవం. కష్టాన్ని ప్రేమించేవారికే సకల సౌఖ్యాలూ సంప్రాప్తిస్తాయనేది ఏనాడూ మొక్కవోని ఓ పరమ సత్యం.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment