సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం త్యాగరాజస్వామికి లో ప్రాతః కాల పూజ 

10-1-15 శనివారం పుష్య బహుళ పంచమి -సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం త్యాగరాజస్వామికి లో ప్రాతః కాల పూజ

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పుట్టిన రోజు శుభాకాంక్షలు

సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జన్మ  దినోత్సవ (10-1-15)సందర్భం గా మా కుటుంబం తరఫునా సరసభారతి తరాఫునా శుభాకాంక్షలు అంద  జేస్తున్నాం మంచి ఆరోగ్యం తో ఆనందం గా జీవితం కొన న సాగాలని అందరి వాంచితం ..

 మరో శుభ వార్త కూడా -నేను అంతర్జాలం లో 140 మంది సంస్క్రుతకవులపై రాసిన ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”ను ఆన్ లైన్ లో శ్రీ గోపాల కృష్ణ గారికి అంకితమిచ్చిన సంగతి మీకు తెలిసిందే . దాని సి డి ని రేపు  అంటే 11-1-15 ఆదివారం సరసభారతి 74 వ సమావేశం గా నిర్వహిస్తున్న ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”గ్రంధా విష్కరణ సందర్భం గా మైనేని వారి మెంటార్ ,మార్గ దర్శి సచివులు సన్నిహితులు సారధి ప్రియ నేస్తం,  కపటమెరుగని సౌశీల్య సౌజన్య మూర్తి శ్రీ కోగంటి సుబ్బారావు గారు  ఆవిష్కరిస్తారు
 మరొక  శుభ వార్త”గీర్వాణ కవుల కవితా గీర్వాణం  ”గ్రంధానికి స్పాన్సర్ గా ఉండి ముద్రణ ఖర్చులు  భరించి సరసభారతి తరఫున  పుస్తకం  ముద్రించటానికి సౌజన్యం తో స్వచ్చందం గా ముందుకొచ్చి, మేనమామ శ్రీ గోపాలకృష్ణ గారిపై ఉన్న ఆదరాభిమానాలకు  నిదర్శనం గా నిలిచిన డాక్టర్ శ్రీమతి జ్యోతి (అమెరికా)గారికి సరసభారతి కృతజ్ఞత తెలియ జేస్తూ అభినందనలను అంద  జేస్తోంది
ఇంకొక శుభవార్త -ఈ గ్రంధాన్ని సరసభారతి15-3-15 బుధవారం సాయంత్రం  నిర్వహించే శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలలో ఆవిష్కరింప జేస్తామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాం  మేము కోరిన వెంటనేముద్రణ బాధ్యతలు స్వీకరించటానికి అంగీకరించిన  శ్రీ చలపాక ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటు న్నాం .
 అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
            మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -ఉయ్యూరు

Watch Live
దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ –
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా దొడ్లో పండిన అరటి గెల

DSCN0351 DSCN0352 DSCN0353 DSCN0354 DSCN0355 DSCN0356

మా దొడ్లో పండిన అరటి గెల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నవల ,కదా విమర్శకు కొత్త రాచ మార్గాలు వేసిన రాచపాలెం – నిజాం తో ఎదిరించిన సురవరం ప్రతాప రెడ్డి -మూసి -జనవరి

rachapalem 1 001rachapalem 2 001rachapalem 3 001suravaram 1 001 suravaram2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహాభారత యుద్ధంలో అస్త్రాలన్నీ మిస్సైల్సే!

మహాభారత యుద్ధంలో అస్త్రాలన్నీ మిస్సైల్సే!

ANDHRAPRABHA –   Sat, 3 Jan 2015, IST

మహాభారత యుద్ధంలో గ్రహాంతరవాసుల కారణంగా లభించిన అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారితీశాయి. దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయో గించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు? అత్యంత ఆసక్తికరమైన ఈ అంశాలపై ప్రత్యేక కథనమిది…

హరివంశం చారిత్రాత్మక గ్రంథం. చారిత్రాత్మకంగా ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో ఇదమిద్ధంగా తెలియచెప్పేదే చరిత్ర. చారిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. కుణాలుడు రాసిన మాగధ (మగధరాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి లాంటి చారిత్రాత్మక గ్రంథమే. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశపు రాజుల చరిత్ర చంద్రవంశపు రాజుల చరిత్రలో వున్నాయి.

క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతకన్నా దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాస పీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీనదిని గురించిన ప్రస్తావన వుంది. ఎటొచ్చీ హరివంశం ఒక చారిత్రాత్మక గ్రంథం. క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు వ్యాసుడు రాశాడు. హరివంశం శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చారు.

మహాభారత యుద్ధ కాలం

దీని ప్రకారం భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించి జీవించాడని తెలుస్తుంది. భీష్ముడు సైన్యాధిపతిగా పదిరోజులు యుద్ధం చేశాడు. పదోరోజు సాయంత్రం శిఖండితో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో అస్త్ర సన్యాసం చేశాడు. అంటే 68 రోజుల పూర్వం మహాభారత యుద్ధం ప్రారంభమైందన్నమాట. 22 డిసెంబర్‌ 5561లో భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు గనక మహాభారత యుద్ధం సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైంది. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షలమంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే (89 వేలు) నమోదు చేశారు.

గ్రహాంతర వాసుల ద్వారా మిస్సైల్స్‌

దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చాలామంది చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావిస్తారు. కోల వేంకట చలపతి రాసిన మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు? ఈ సాంకేతిక పరిజ్ఞానం గ్రహాంతర వాసుల చేత వాళ్లకి లభించి వుండవచ్చని పరిశోధకులు అంటున్నారు. శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశంలో సూర్యవంశపు రాజులు, చంద్ర వంశపు రాజులు అని పేర్కొన్నారు. సిరియాలో లభించిన పురాతత్వ అవశేషాల్లోనూ గుహల్లోని రాతిగోడలపై చెక్కిన బొమ్మల్లో అంతరిక్ష యాత్రికులు ధరించినట్లుగా శిరస్సుపై అంటినా కలిగిన బొమ్మలు వున్నాయి.

భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతంలో వుంది. ఈ నారదుడు 372 కాంతి సంవత్సరాల దూరంలో ఎబ్సులా అనే నక్షత్ర మండలంలోని బర్హోస్‌ అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం ఈ గ్రహాంతరవాసులకు వుండేదనీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గ్రహాంతరవాసులు భూలోకంలోకి వచ్చేవారని సిరియాలోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది. మహాభారతంలో అతి అరుదుగా పేర్కొన్న దుంధుమ గాల్వి యయాతి గ్రహాంతర వాసులేనని భావిస్తున్నారు.

అస్త్ర శస్త్ర తయారీలో వీరు నిపుణులు. వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానం శ్రీకృష్ణుని సహకారంతో పాండవులకు లభించినట్లుగా తెలుస్తోంది. ఖాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడనే గ్రహాంతరవాసి శ్రీకృష్ణునికి అర్జునునికి ఇచ్చిన సుదర్శనచక్రం గాండీవం (లాంచర్‌) అక్షయ బాణ తూణీరాలు (మిస్సైల్స్‌) రసాయనికి ఆయుధాలుగానే పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌గానే భావించవచ్చు. దాదాపు 3వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ రసాయనిక అస్త్రాల వినియోగం వల్ల కాలి బూడిదైపోయింది.

గ్రహాంతరవాసులే దేవతలు

మహాభారతంలో పేర్కొన్న దేవతలందరూ గ్రహాంతరవాసులే. భూమి మీద నివసించే అలనాటి మానవులకన్నా ఈ గ్రహాంతరవాసులకు అధిక శక్తి సామర్థ్యాలు వుండడం వల్ల సహజంగానే గ్రహాంతరవాసులను దైవాలుగా భావించి పూజించారు. కాగా ఈ అస్త్రాలను వినియోగించేందుకు పాస్‌వర్డ్‌లాంటి టెలిపతిక్‌ అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛ రించేవారని కొందరు పరిశోధకులు విశ్లేషి స్తున్నా రసాయనిక అస్త్రాలను ట్రిగ్గర్‌లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కాగా ఒక పాస్‌వర్డ్‌లాంటి పదాన్ని ఉచ్ఛరించినంత మాత్రానా ఆ పదం (అక్షరం) గ్రహాంతరవాసి కర్ణపుటాలకు చేరి ఆ గ్రహాంతర వాసి తన సాంకేతిక విజ్ఞానంతో (రిమోట్‌ కంట్రోల్‌తో) ఆ అస్త్రాన్ని పేల్చేవాడని కూడా కొందరు భావిస్తున్నారు.

మహాభారత యుద్ధంలో ఇతర గెలాక్సీల్లో ఇతర సూర్య కుటుంబంలోని గ్రహాంతరవాసులు తమ రిమోట్‌ కంట్రోల్‌తో పాస్‌వర్డ్‌ను గ్రహించి విస్ఫోటనం కలిగించేవారని కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు. రష్యాకు చెందిన మార్విల్‌ సెనెటోవ్‌ తను రాసిన (1976) ఎస్‌ వొయేజ్‌ టు అదర్‌ యూనివర్స్‌ అనే గ్రంథంలో భూమిపైకి 6 వేల సంవత్సరాల క్రితం వరకూ గ్రహాంతరవాసులు వచ్చినట్లు ఆధారాలు వున్నాయని పేర్కొన్నాడు. భూమిపై నిర్మలమైన ఆక్సిజన్‌ కలిగి ఓజోన్‌ పొర నిష్కల్మషంగా వున్నంతవరకు గ్రహాంతరవాసులు భూమిపైని మానవులతో సంబంధాలు కలిగి వుండేవారని పేర్కొ న్నాడు. ఆ తర్వాత భూమిపైకి వచ్చిన కొందరు గ్రహాంతరవాసులు కల్మషమైన వాతావరణానికి తట్టుకోలేక మరణించారని మార్విల్‌ సెనెటోవ్‌ అన్నారు. 3వేల సంవత్సరాల కాలం నాటి కొన్ని గ్రహాంతరవాసుల అవశేషాలు సైతం లభ్యమైనట్లు, వాటిపై పరిశోధనలు జరుగుతున్నట్లు ఆయన తను రాసిన పుస్తకంలో ప్రస్తావించాడు. ఈ మార్విల్‌ సెనెటోవ్‌ 2001లో తన 79వ యేట మరణించాడు.

రిమోట్‌ ద్వారా అస్త్రాల ప్రయోగం

మహాభారత యుద్ధంలో గ్రహాంతర వాసుల కారణంగా లభించిన అస్త్రాలు మహా భీకర యుద్ధానికి దారి తీశాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారధులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. అయితే ఇతర గెలాక్సీలో ఇతర సూర్య కుటుంబంలోని గ్రహాంతరవాసులచే రసాయనిక అస్త్రాల ప్రయోగం ఎలా నియంత్రించబడేవో అనే అనుమానం కలగవచ్చు. అయితే ఈ నియంత్రణ సాధ్యమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్లోబల్‌ పొసిషనింగ్‌ సిస్టమ్‌ (జిపిఎస్‌) ద్వారా ఈ నియంత్రణ రిమోట్‌ వ్యవస్థ ఏర్పాటైవుండేందుకు అవకాశం వుంది.

జిపిఎస్‌ పరిజ్ఞానం గ్రహాంతర వాసులకు వుండడంలో ఆశ్చర్యంలేదు. 7వేల సంవత్సరాల క్రితమే రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గ్రహాంతరవాసులకు జిపిఎస్‌ అడ్వాన్స్‌డ్‌ జ్ఞాన సంపత్తి తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు. అస్త్రాలను ఉపయోగించడంలో నైపుణ్యం సాధించిన వ్యక్తికి గ్రహాంతరవాసులు వేరువేరు పాస్‌వర్డ్‌ కేటాయించేవారు.

ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్నా ఆ అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌ ఉచ్ఛరించి నంత మాత్రాన టెలీపతీ ద్వారా గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు. ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!

అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. ఈ విద్యలో సైతం గ్రహాంతరవాసులే శిక్షణను ఇచ్చినా మరీ భీకర అస్త్రాల నియంత్రణ గెలాక్సీ నివాసుల చేతుల్లోనే వుండివుండాలి. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటు న్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి.

మహాభారత యుద్ధంలో ఉపయోగిం చిన శస్త్రాల్లోనుంచి భయానక గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయ రక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.

ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది. మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.

18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు.

ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.

క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన ‘అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.

అస్త్రాల వివరాలు

మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రు కలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.

మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.

శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు అవునో కాదో కాని యుద్ధ చాతుర్యం కలిగినవాడు. అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా పాండకులకు విజయం సాధించి పెట్టి కౌరవులను భూమిపై లేకుండా చేయగలిగాడు.

– రమాకాంత్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు కావ్యాలలో చితక్రళ

తెలుగు కావ్యాలలో చితక్రళ

andhraprabha –   Sun, 4 Jan 2015, IST

కళా జీవితమన్నది వాస్తవిక జీవితానికి పూర్తి దూరమైనది కాదు. దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో నేర్పు, ప్రతి కూర్పు కళగా చూస్తే సమస్తం సృజనాత్మకంగానే ఉంటుంది.

కళారూప సృష్టిలో బాహ్యరూపాలు వేరైన, కళాధర్మాలు మాత్రం ఒక్కటే. ఒకరు రాయిని శిల్పంగా మలుస్తారు. మరొకరు చిత్రాన్ని సృజిస్తారు. మరొకరు నాట్యం చేస్తారు. మరొకరు గానం చేస్తారు. కవి అయినపుడు భాష తన స్వాధీనంలో ఉంటుంది కాబట్టి కావ్యరూపంలో మన ముందుంచుతారు. అందుకే ప్లూటార్క్‌ అంటాడు ‘పెయింటింగ్‌ ఈజ్‌ మ్యూట్‌ పోయిట్రీ, పోయిట్రీ ఈజ్‌ స్పీకింగ్‌ పిక్చర్‌’.

ఒక దృశ్యాన్ని చూసి తదనుభూతిని పొందగలిగిన వారందరూ ఆ అనుభూతిని మరొకరి చేత భావింప చేసి, వారుపొందిన స్థితిని మరొకరు పొందేటట్లు చేయడమన్నది కత్తిమీద సాములాంటిది. ఇది కవులకు, కళాకారులకే సాధ్యమనవచ్చు. కవి అనుభవ భావాన్ని భాషలో చదివి మనం ఆనందించగలుగుతున్నాం. అందుకే ఇది కవిత్వ కళ. కవులు గీస్తున్న చిత్రాలు కావ్యాలు.

ప్రతిభావంతుడైన కవి సృష్టిలో ఏ వస్తువునైనా స్వీకరించి సుందర కవితా స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయగలడు. మరి అలాంటి కవికి సుందరమైన ప్రకృతి, ఎదురుగా ఉంటే మరింత సుందర కావ్యాలను సృష్టించగలరు.

హృదయాన్ని తట్టిలేపినంత మాత్రాన అది ఉత్తమ కావ్యం కాదు. ఉత్తమ సంస్కృతిని కూడా పాఠకునికి ఇచ్చినపుడు అది ఉత్తమ కావ్యం కాగలదు. మేథ్యూ ఆర్నాల్డ్‌ ఈ విషయమై ప్రస్తావిస్తూ మానవునిలో కల పశుత్వ లక్షణాలు పోగొట్టి ఉత్తమునిగా చేయగలిగినదే ఉత్తమ సంస్కృతి అంటాడు.

భోజుడు చిత్రకారుని లక్షణాన్ని పేర్కొంటాడు.

నవేత్తి శాస్త్ర విత్కర్మ / న శాస్త్ర మపి కర్మవిత్‌/ యోవేత్తి ద్వయ మప్యేతత్‌/సహి చిత్ర కరోవర:’- శాస్త్రం తెలిసిన వారికి కర్మజ్ఞానం అరుదు. కర్మజ్ఞానం కలవానికి శాస్త్ర జ్ఞానం అరుదు. కర్మ, శాస్త్రం రెండింటిలోనూ సమాన ప్రజ్ఞకలవాడే ఉత్తమ చిత్రకారుడు అంటాడు.

కావ్యానికి ఆరు లక్షణాలు చెప్పబడ్డాయి. అవి వస్తువు, వాస్తవికత, ప్రకృతి నేపథ్యం, కళాత్మకత, తాత్త్వికత, లక్ష్యం వీటితో కవి ప్రతిభ చేత సృజన దృష్టి, మానవీయ భావనతో కావ్యం సంపూర్ణత పొందుతుంది.

భీష్మ పర్వం ప్రధమాశ్వాసం లోని పద్యంలో అర్జునుడు కురుక్షేత్రలో శ్రీకృష్ణుని విశ్వరూపం సందర్శించి ప్రకృతి యొక్క వివిధ తత్వాలు శ్రీకృష్ణునిలో చూసిన విషయాన్ని కవి వర్ణించిన విధము

”అంబు పవమాన సూర్యచంద్రాన లాది

వివిధ తత్త్వంబులును నవీ విశ్వలోక

సంప్రవర్తన కరుడవు శాశ్వతుండ

వచ్యుతుండవు పుండరీకాక్షనీవు”

సముద్రం అన్నది అత్యంత పురాతనమైనది. సృష్టిలోనూ సముద్రం మొదటిది. గ్రీకుల తాత్వికులు నీట తేలుతున్న గ్రహంగా భూమిని పేర్కొన్నారు. తెలుగులోనూ సముద్ర వర్ణన మొదటగా చెప్పబడుతుంది. ఆదికవి నన్నయ చెప్పిన ప్రకృతి వర్ణనలో, కడి వర్ణన మొదటిది.

కద్రూ వినతలు సాయంకాల విహారం చేస్తూ, సముద్ర ప్రాంతానికి వచ్చి, వారు దర్శించిన సముద్ర దృశ్యాన్ని మహాభారతం లోని ఆదిపర్వం, ద్వితీయాశ్వాసం లోని 27,28,29,30 పద్యాలలో చిత్రకారుని వలే చిత్రిస్తాడు నన్నయ.

ఆకాశం వైపు ఉవ్వెత్తుగా లేచే కడలి తరంగాలలోనూ, ఆ అలల తాకిడికి చలిస్తున్న తీరం, ఆపరిసరాల్లోని వనాలు, మనోహర దృశ్యాన్ని తన భాషా చమత్కృతితో చిత్రిస్తాడు. ఈ వర్ణనలలో నన్నయ మూడు విధాలు అనుసరించాడు. చిత్రకారుడు రేఖలతో రంగులతో చిత్రాన్ని చిత్రించినట్లుగా, పదాలతో దృశ్యచిత్రణ చేస్తాడు. ఇది మొదటి అంశం. ఇక రెండవ అంశంగా చెప్పబడేది ఇతర వస్తువులతో పోలిక చెప్పడం ఇందులో సాధారణ ఉపమాన శబ్దాలలోనే కాక, పోలిక లేని వస్తువులలో, సముద్రాన్ని వర్ణిస్తాడు. సముద్రం నాటక రంగం వలె ఘన రసపాత్ర శోభితమంటాడు. మూడవ అంశంగా సమయ కాలాల ద్వారా వర్ణించి చెప్పడం. సముద్రం రత్నగర్భ అని, అందులో బడబాగ్ని ఉన్నది అనడం. ఇలా నన్నయ కవి అయినా చిత్రకారునిలో పరకాయ ప్రవేశం చేసి దృశ్యాన్ని చిత్రించగలిగాడు.

నదిని స్త్రీతో పోలిక చెప్పారు. ”రసరేఖలు’ లోని ప్రకృతి చిత్రాలు అన్నవ్యాసంలో సంజీవదేవ్‌ గారంటారు భారతీయ చిత్రకళలో కేవలం దృశ్యచిత్రాలు కొన్ని దొరికి నప్పటికీ, కేవల దశ్య చిత్రణ వ్యాప్తి చెందలేదు. పర్వతాలను కలిపి మూర్తి కల్పన చేసిన మానవ వ్యక్తిగాను, అదే విధంగా ప్రవాహ రూపంలో నదిని స్త్రీ రూపంలో చిత్రించడం; అయినా భావ రూపాత్మకమైన భారతకళ యొక్క ఔన్నత్యానికి భంగం ఏమి వాటిల్లలేదు అంటారు.

దృశ్య చిత్రాన్ని కంకంటి పాపరాజు ”ఉత్తర రామాయణ’ కావ్యంలో గంగానది వర్ణనలు చేస్తూ

”చెంగటం గనెన్‌ లతాంగి శీతలా నిలాహతో

త్తుంగ భంగ తీరసంగ తుంగ నాగరంగ నా

రంగ రంగ దంబు జాంగ రంగ నృత్త చంగ సా

రంగ రంగ నంత రంగ మంత బొంగగాన్‌”

సీతాదేవి వాల్మీకి ఆశ్రమానికి వెళుతూ దారిలో గంగానదిని దర్శించిన దృశ్యాన్ని పాపరాజు వర్ణనలో గంగానది నీటివలె అలలతో లయలతో కదులుతూ నదీ ప్రవాహాన్నీ స్ఫురిస్తుంది.

గోదావరిని అడవి బాపిరాజు ఉగ్రకాళిగా చిత్రించారు. ఉప్పొంగి పోయింది గోదావరీతాను/ తెప్పన్న ఎగసింది గోదావరీ/ కొండల్లు ఉరకింది కోనల్లు నిండింది/ ఆకాశ గంగతో హస్తాలు కలిపింది” స్వాభావిక వర్ణనతో దృశ్యాన్ని చిత్రించారు బాపిరాజు.

పర్వతాలను కవులు మనోహరంగా వర్ణించారు. శ్రీశ్రీ ”మహాప్రపంచం” కవితలో సమాజ మార్పును, మానవ హృదయ సంక్షోభాన్ని చిత్రిస్తూ ”సింహాచలం కదిలింది/హిమాచలం కరిగింది/వింధ్యానగరం పగిలింది/ సింహాచలం హిమాచలం/వింధ్యాచలం సంధ్యాచలం/మహానగాలెగరుతున్నాయి/” ఇలా ఉంటుంది శ్రీశ్రీ దృశ్య చిత్రణ.

సూర్యోదయాన్ని వర్ణించిన మొదటి కవి నన్నెచోడుడు అంటారు టి.వి. నారాయణరెడ్డి, కుమార సంభవం, అష్టమాశ్వాసంలోని 184వ పద్యంలో సూర్యోదయానికి ముందు కోడి కూత వినిపిస్తుంది. దీన్ని దృశ్యమానం చేశారు.

తొలుకొని కుక్కుట రవములు

చెలగుడు దదనంతరంబ చెఱువుల నదులం

గొలకుల వనముల సత్యవి

రలమై బహు విహగని వహ రవములు సెలగెన్‌

ప్రకృతిని విపులీకరించి వర్ణించిన మొదటి కవి నన్నెచోడుడు.

ప్రాచీన కవులు చంద్రుని ఆకాశాన సముద్రంలో తేలిపోవు ఓడగాచిత్రించారు. దువ్వూరి రామిరెడ్డి వెన్నెలను జాజి తీవగా చిత్రించారు. తన ”ప్రణయాహ్వానము” నందు-

చదుల పందిట వెన్నెల జాజితీవ

చుక్కలను పూలు పూచి యో సుందరాంగి

ప్రణయ మోహన మైన యీ ప్రకృతి నెల్ల

సురభిళోచ్ఛ్వాస వీచుల సొగయ సూచు

అనాది నుండి అన్ని దేశాలలోనూ చిత్రకారుని ప్రతిభకు గీటురాయి స్త్రీ చిత్రం. కవుల భావనకు, చిత్రకారుల ఊహలకు అందని అపురూపం స్త్రీ. ప్రకృతిలోని అనేకానేక వస్తువులను సేకరించి బ్రహ్మదేవుడు స్త్రీ రూపాన్ని సృష్టించాడంటారు.

అదే విధంగా స్త్రీని శక్తి స్వరూపిణిగాను, సమరాంగణగానూ, చదువుల తల్లిగా, సంపదలిచ్చే సిరుల లక్ష్మిగానూ, వర్ణించి చెప్పారు. పూర్ణచంద్ర మనోరమ, సుందర హాస శోభితగా చిత్రించారు కవులు, చిత్రకారులు.

ఆధునికుల అభిప్రాయం ప్రకారం కళ అన్నది ఏదైనా కావచ్చు. అది పదిమందికి అర్థమవుతూ నలుగురికి మంచికి దోహదపడుతూ మనలో బలమైన భావోద్రేకాన్ని కలిగించే సృజన మాత్రమే కళగా చెప్పబడుతుంది.

ఇలా తెలుగు కావ్యాలలో అనేక మంది కవులు, చిత్రకారులు వలే వర్ణనలను భాషద్వారా పదచిత్రాలు, భావచిత్రాల ద్వారా అందించారు. సాహిత్యాన్ని వర్ణమయం చేశారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన భారతీయ విద్యాలయాలు

ప్రాచీన భారతీయ విద్యాలయాలు

andhraprabha –   Sun, 21 Dec 2014, IST
ప్రాచీన భారతీయ విద్యాలయాలు

ఇక్కడ ‘ధర్మగంజ్‌’ అనే పెద్ద గ్రంథాలయం ఉండేది. ‘ధర్మ గంజ్‌’ అనగా ధర్మం కావలసిన వారు దానిని స్వీకరించ టానికి సిద్ధంగా వుంచిన చోటని అర్థం. ఇందులో రత్నసాగరం, రత్నోదధి, రత్నరంజయ అనే మూడు అంతస్థుల భవనాలు ఉండేవి. ఇక్కడ 10 సరోవరాలుండేవి.

తక్షశిల వైదిక విద్యాలయాలలోకెల్లా ప్రసిద్ధమైనది. ఇది అతి పెద్ద వైదిక విశ్వవిద్యాలయం. దేశంలోని వివిధ ప్రాంతాలలోని విద్యాకేంద్రాలు తక్షశిల విశ్వకళా పరిషత్తుకు అనుబంధంగా ఉండేవి. వైద్యవిద్యను సంపూర్ణం కావించుటకు జీవకుడు తక్షశిలలో ఏడు సంవత్సరాలు నివసించాడు. వైద్యశాస్త్రం, యుద్ధ విద్య, వేదవిద్యలు, తర్కశాస్త్రం వంటివి ఇక్కడ బోధించేవారు.

భారతదేశంలో రామాయణం, వి జ్ఞాన నిలయలు జరిగిన కాలం నుండీ ప్రసిద్ధ విద్యాలయాలుండేవి. బదరిక, నైమిశార్యం కాశీ, తక్షశిల వైదిక విద్యాకేంద్రాలు. నలంద, వల్లబి, విక్రమశిల, బదంతపురం బౌద్ధవిద్యాకేంద్రాలు. ఈ విద్యాలయాలు ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతి గాంచినవి. అందువల్ల వీటిని విశ్వవిద్యాలయాలుగా పేర్కొనవచ్చు.

బ్రాహ్మణ గురువులు వైదిక విద్యాకేంద్రాలలో విద్యాబోధన చేసేవారు. ఈ విద్యాకేంద్రాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్వవ ర్ణాల వారికి మాత్రమే ప్రవేశం ఉండేది. శూద్రులను విద్యార్జ నకు నాడు అనర్హులుగా పరిగణించేవారు. బ్రాహ్మణ విద్యార్థు లకు మతం, తత్త్వ విచారం, వేదాలు – బ్రాహ్మణికాలు, ఉపని షత్తులు బోధించేవారు.

క్షత్రియులకు రాజనీతి, యుద్ధ విద్యలు బోధించేవారు.

విద్యార్జన దశలో విద్యార్థులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తొలుత పండిత గృహంలో తరువాత వనభూములలోని ఆశ్రమాలలు విద్యాబోధన జరిగేది. వీరికి ఖగోళశాస్త్రం శబ్ద ఉత్పత్తి శాస్త్రం, వ్యాకరణం వేదాధ్యయనంతో పాటు నేర్పించే వారు. అధ్యయనంతోపాటు ఆశ్రమ విద్య నియమాల ననుస రించి శారీరక శ్రమ చేయాలి. మత ఉత్సవాలు నిర్వహించాలి సామాన్యజీవనం గడపవలసి వుంటుంది.

పరిషత్‌లు అని పిలువబడే వైదిక విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, ధర్మశాస్త్రాలు, తత్త్వశాస్త్రాలను విద్యార్ధులు అధ్యయనం చేసేవారు.

బదరిక విద్యాలయం హరిద్వార్‌ వద్ద ఉండేది. వేదాంత విద్య లకు ఈ విద్యాలయం ప్రసిద్ధి చెందినది. బ్రహ్మసూత్రాలలోని వేదాంత సారాన్ని ఇచట బోధించేవారు. వ్యాసమహర్షి మహాభారతాన్ని ఈ ప్రాంతం నుంచే ప్రచారం చేసారని, శంకరాచార్యుల వారు క్రీ.శ. 8వ శతాబ్దంలో రామానుజా చార్యులు ఇక్కడికి వచ్చి విశిష్టాద్వైత మతాన్ని ప్రచారం చేసి ప్రాచు ర్యంలోకి తెచ్చారు. తరువాత కాలంలో మధ్వాచార్యుల వారు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిం చారు.

వైదిక విద్యాల యాలలో ప్రసి ద్ధిగాంచి నది కాశీ. ఆయు ర్వేద విద్యారహస్యాలు తెలి సిన జీవకుడు ఇక్కడ ఉండే వాడు. చరకుడను వైద్యశాస్త్రవేత్త

కూడా ఇక్కడ ఉండేవాడు. అష్టాంగ వైద్య శాస్త్రాన్ని ఇతడు వ్యాప్తిచేసాడు. బించి సారుడు, బుద్ధుడు మొదలగు వారు ఇక్కడ చికిత్సలు చేయించుకొనేవారని ప్రతీతి. స్వదేశీ విద్యార్థులతోపాటు విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడ విద్యను అభ్యసించేవారు.

తక్షశిలవైదిక విద్యాలయాలలోకెల్లా ప్రసిద్ధమైనది. ఇది అతిపెద్ద వైదిక విశ్వవిద్యాలయం. దేశంలోని వివిధ ప్రాంతాలలోని విద్యాకేంద్రాలు తక్షశిల విశ్వకళా పరిషత్తుకు అనుబంధంగా ఉండేది. వైద్యవిద్యను సంపూర్ణం కావించుటకు జీవ కుడు. తక్షశిలలో ఏడు సంవత్సరాలు నివసించాడు. వైద్య శాస్త్రం, ఆయుద్ధ విద్య, వేదవిద్యలు, తర్కశాస్త్రం ఇచట బోధించేవారు.

ఈ విద్యాలయంలో ప్రవేశా కి విద్యార్థులు 1000 నాణలు చెల్లించి అనుమతి పొందేవారు. ధనం చెల్లించలేని విద్యార్థులు పగలు గురువుకు చేసి, రాత్రిపూట విద్యాభ్యాసం చేసేవారు.

రాజులు విద్యాలయ పోషణకు ధనాన్ని విరాళాలుగా ఇచ్చేవారు.

బౌద్ధయుగంలో నలంద ప్రసిద్ధి పొందిన విద్యాలయం. పాట్నా జిల్లాలోని బౌరగాన్‌ ప్రాంతంలో ఈ విశ్వవిద్యా లయం ఉండేది. దీనిని శక్రాదిత్యుడను రాజు నిర్మించగా తరు వాత కాలంలో ఇచట బుధగుప్తుడు, తధాగత గుప్తుడు, బాలా దిత్య, వజ్ర అనే రాజులు అనేక భవనాలు నిర్మించారు.

ఇక్కడ ‘ధర్మగంజ్‌’ అనే పెద్ద గ్రంథాలయం ఉండేది. ‘ధర్మ గంజ్‌’ అనగా ధర్మం కావలసిన వారు దానిని స్వీకరించ టానికి సిద్ధంగా వుంచిన చోటని అర్థం. ఇందులో రత్నసాగరం రత్నోదధి, రత్నరంజయ అనే మూడు అంతస్థుల భవనాలు ఉండేవి. ఇక్కడ 10 సరోవరాలుండేవి.

ఇందులో ప్రజ్ఞాపారమితా సూత్రాలు, దివ్యగ్రంథాలు, తాంత్రిక విద్యాగంథ్రాలు వుండేవి. ఈ విశ్వవిద్యాలయంలో 18 బౌద్ధ దర్శనాలు, మహాయానము, హేతువిద్య, శబ్ద విద్య చికిత్సా విద్య, తంత్రశాస్త్రం, సాంఖ్య, వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేసేవారు.

సూత్రాలకు వ్యాఖ్యానం చేసేవారు 1000మంది, 30 రకాల శాస్త్రాలను బోధించేవారు 500 మంది, 50 శాస్త్రాలను బోధించ గలవారు 10 మంది ఉండే వారు. సర్వశాస్త్రాలను బోధించగల ఆచార్యుడు ఒక్కడు ఉండేవాడు. అతనే శీలభద్రుడు ఇతనినే ధర్మనిధి అని అంటారు.

ఈ విశ్వవిద్యాలయంలో 8 కళాశాలలు 300లకు పైగా భవనాలు ఉండేవి. ఇక్కడ నాగార్జునుడు, అశ్వఘోషుడు వసు బంధు, దిజాగుడు, కమల శీల, సంఘమిత్ర, శాంతి రక్షిత, వీరదేవ, మంజ శ్రీదేవ మొదలైగు ప్రసిద్ధ ఆచా ర్యులుండేవారు.

ఇక్కడ విద్యాకార్యక్రమాలు నిర్ణీత కాల బద్ధమై ఉంటాయి. దినానికి ఎనిమిది జాములుగ నుండేది. ప్రతిజాముకు నాలుగు సార్లు ఢంకానినాదం, ఖారావము చేసేవారు.

మొదటి జాము ఢంకా నినాదానికి అందరూ స్నాన మాచరిచేవారు. రెండవ జాముకు ముందే భోజనం పూర్తి చేసేవారు.

విద్యాభ్యాసం కోసం బొఖారా, కొరియా,చైనా, టిబెట్టు దేశాల నుండి విద్యార్థుల ఇక్కడికి వచ్చేవారు.

ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు శాంతి రక్షితుడు. పద్మ సంభవుడు టిబెట్‌లో బౌద్ధ సంస్కృతిని వ్యాప్తి చేసేవారు.

విక్రమశిల విశ్వవిద్యాలయం బీహార్‌ లోని భగల్‌ పూర్‌ సమీపంలో ఉండేది. క్రీ.శ. 9వ శతాబ్దంలో ధర్మపాలుడను రాజు దీనిని స్థాపించాడు. ఈవిశ్వవిద్యాలయంలో విద్యా భ్యాసం చేసిన వారికి ప్రత్యేక గౌరవ సూచకమైన బిరుదు నిచ్చేవారు. పండిత అనే బిరుదుతో వారిని పిలిచేవారు. ఇక్కడ ఆరు కళాశాలలు ఉండగా, ఒక్కొక్క కళాశాలలో 108 మంది ఉపాధ్యాయులుండేవారు. ఇందులో 800 మంది ఉపాసకులు ఒకేసారి సమావేశమగుటకు ఒక సమావేశ ప్రదేశం ఉండేది. రాజుల పోషణతో ధర్మ సత్రాల ద్వారా ఇచటి వారికి భోజన సదుపాయాలు ఏర్పరచారు.

ఇచట బౌద్ధతంత్రం, వ్యాకరణం, వేదాంతం తర్కం శాస్త్రా లను బోధించేవారు, చాణిక్యుని కాలంలో ఆరుగురు తార్కి కులు ద్వారపాలకులుగా ఉండేవారు. తూర్పు ద్వారం వద్ద రత్నాకర శాంతి, పశ్చిమ ద్వారం వద్ద, వాగీశ్వర కీర్తి, ఉత్తర ద్వారం వద్ద నరోపుడు, దక్షిణ ద్వారం వద్ద ప్రజ్ఞాకర మతి, ప్రధమ సింహ ద్వారం వద్ద రత్న వ్రజుడు, గర్భద్వారం వద్ద జ్ఞాన శ్రీమిత్రుడు ఉండేవారు. ధర్మపాలుని కాలంలో ఈ విద్యా లయానికి కులపతిగా జ్ఞాన పాదుడు ఉండేవాడు. జ్ఞానపాదు డు రాసిన తంత్ర శాస్త్రం టిబెట్‌ భాషాసాహిత్యంలో ముఖ్యమైన గ్రంథాలు. వైరోచన రక్షితుడు వంజిక, రత్నవాద చక్రం వంటి సంస్కృత గ్రంథాలను రాసాడు. మైత్రిక రాకు మారి దుడ్డాదేవి వల్లభి విహారాన్ని నిర్మించినది క్రీ.శ. 6వ శతాబ్దంలో ధారానేనుడు శబప్ప పాదవిహారాన్ని నిర్మించడానికి ధనం సహాయం చేసాడు. దీని నిర్మాణం బాధ్యాతలు భదంత స్థిరమతి నిర్వహించాడు. స్థిరమతి, గుణమతి అనే ఆచార్యులు ఈ విశ్వవిద్యాలయంలో ఉండేవారు. ఇచట విద్యార్థులు మూడు సంవత్స రాల కాలం వుండి విద్యాభ్యాసం చేసేవారు. ఇచట 10,000 మంది భిక్షకులు వుండేవారని తెలుస్తున్నది. పాలవ వంశీకుడైన గోపాలుడు క్రీ.శ. 8వ శతాబ్దంలో బదంత పురం విద్యాలయాన్ని నిర్మించారు. ఇది బిహార్‌లో ఉండేది. ఈ విద్యాలయంలో బౌద్ధ, బ్రాహ్మణ విద్యలు రెండూ నేర్పించే ఏర్పాటు ఉన్నందున ఈ విద్యాలయానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఈ విద్యాలయాల వల్ల భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆసియాఖండమంతటా వ్యాపించాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అనివార్యం? అక్షర సత్యాలకు పట్టం గట్టిన విమర్శకుడు

అక్షర సత్యాలకు పట్టం గట్టిన విమర్శకుడు

adhraprabha –   Mon, 29 Dec 2014, IST
  • అతడు అక్షరాల ఆకాశంలో అభ్యుదయ నక్షత్రాలను మెరిపించిన ప్రగతిశీల భావాల కవి.
  • అతడు ఆధునిక తెలుగు సాహితీ విమర్శను కొత్తపుంతలు తొక్కించిన విమర్శ
  • కుడు.

మార్క్సిజం కన్నుతో కథను నవలను కవిత్వాన్ని నిశితంగా పరిశీలించిన పరిశోధకుడు

ప్రాచీన సాహిత్యానికి ఆధునిక భాషలో, వర్తమాన సామాజిక స్పృహతో భాష్యం చెప్పిన ఆధునికుల్లో అత్యాధునికుడు

అతడు ఒక చేత్తో అభ్యుదయ భావాల లావాలను అక్షరాల్లో వెదజల్లి కవిత్వపు మంటల్లో గుండెల్ని రగిలించగలడు

మరో చేత్తో కలాన్ని బలంగా కదిలిస్తూ నిర్భయంగా తన భావాలను వెల్లడిస్తూ సాహితీ విమర్శ రాయగలడు.

అతడొక కవి, సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, అటు విద్యార్థులను ఇటు సమాజంలోని ప్రజలను ఏకకాలంలో చైతన్యవంతం చేసే ఉపన్యాసకుడు, అన్నింటికీ మించిన మానవతావాది. ఆయనే రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి..

తెలుగు సాహిత్య విమర్శారంగంలో రాయలసీమ సాహితీ విమర్శకులకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక రాళ్ళపల్లి ఒక పుట్టపర్తి, ఒక కట్టమంచి, ఒక రాచమల్లు ఇలా ఎందరెందరో సాహితీ విమర్శకులు రాయలసీమనుండి పుట్టుకొచ్చారు. వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, సాహితీ విమర్శను కొనసాగిస్తూ 2014 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కైవసం చేసుకున్నారు మార్క్సిస్టు విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. నిబద్ధతకు, నిజాయితీకి, నిలువెత్తు నిదర్శనం ఆయన. నిర్మొహమాటంగా నిక్కచ్చిగా, సాధికారికంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఆయన ఏనాడు వెనకడుగు వేసిందేలేదు. కవిత్వంతోపాటు విమర్శరాసి అందరి ప్రశంసలు అందుకున్న విమర్శకుడాయన. అందుకు కారణాలు లేకపోలేదు. సీమలో వేమన, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, సర్ధేశాయ్‌ తిరుమలరావు, లాంటి ఎందరో విమర్శకులను ప్రేరణగా తీసుకుని ఆయన విమర్శారంగాన్ని ఎన్నుకున్నారు. రా.రా. తర్వాత శూన్యత ఏర్పడిన సంధికాలంలో తెలుగు విమర్శవినీలాకాశంలో తళుక్కున మెరిసిన వేగుచుక్క ఆయన. తెలుగు సాహిత్య విమర్శకు మార్క్సిజం సొబగులద్దిన నిబద్ధత కలిగిన సద్విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి. పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడే పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నం కావ్యాన్ని డాక్టరేట్‌ పట్టాకోసం ఎంచుకుని శిల్పప్రభాతి అన్న అంశంపై సాధికారికమైన పరిశోధన చేశారు. దీని మూలంగా ఆయన తదనంతరకాలంలో కథ, నవల, కవిత్వంపై సాధికారిక విమర్శనా గ్రంథాలెన్నో వెలువరించగలిగారు. ప్రాచీన సాహిత్యాన్ని బాగా చదువుకున్న రాచపాళెం, ఆ సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో చూసే ఒక అరుదైన దృష్టిని అలవరచుకున్నారు. అంతేకాదు దాన్ని తన విమర్శలో ప్రవేశపెట్టారు. అందుకే కచదేవయాని లాంటి చర్చలకు తెలుగు సాహిత్యంలో తెరతీశారు. సర్దేశాయ్‌ తిరుమలరావు రాసిన నూరేళ్ల కన్యాశుల్కమంటే రాచపాళెం గారికి ఎంతో ఇష్టం. అందుకేనేమో గురజాడ కథలపై ఒక మంచి విమర్శాగ్రంథాన్ని వెలువరించారు. అలాగే దళిత, స్త్రీవాద, ముస్లిం అస్తిత్వ ఉద్యమాలను విపరీతంగా ప్రేమించారు. ఆయా ఉద్యమాల, కవులను, రచయితలను ఎక్కువగా అభిమానించారు. వారి రచనలపై ఎన్నో సమీక్షలు, వ్యాసాలు రాసి ప్రోత్సహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన విమర్శలో మార్పులు మనం గమనించవచ్చు. అభ్యుదయం ఆయన హృది, మార్క్సిజం ఆయన విమర్శకు పునాది. అయినప్పటికీ స్థలకాలాను దృష్టిలో ఉంచుకుని విమర్శలు రాశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న మార్పులను పసిగడుతూనే రచయితల వస్తుశిల్పాల్లో వచ్చిన పరిణామాలను కూలంకషంగా పరిశీలించారు. విమర్శలో సంయమనం పాటిస్తూ రాగద్వేషాలకు అతీతంగా విమర్శలు రాసిన ఏకైక విమర్శకుడాయన. ఒకేభావజాలానికి కట్టుబడిన విమర్శకుడైనప్పటికీ ఇతరులను భావజాలపరంగానే విభేదించి, విమర్శించినప్పటికీ ఏ భావజాలం కలిగిన వ్యక్తులనైనా గౌరవించే సంస్కారం రాచపాళెంలో ఉంది. అందుకే ఆయన అజాత శత్రువుగా అందరి ఆదరాభిమానాలు అందుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరంగా సాహిత్య కృషిచేస్తున్న రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డిగారు ఇప్పటివరకు 36 గ్రంథాలు వెలువరించారు. ప్రాచీన ఆధునిక కవులు రచయితల గ్రంథాలపై, వారి జీవిత సాహిత్యాలపై అరుదైన సాహిత్య విమర్శాగ్రంథాలెన్నో వెలువరించారు. ఆయన కలం నుండి వెలువడిన ప్రతి గ్రంథం ఏదో ఒక కొత్త కోణాన్ని, నూతన సత్యాన్ని, ఆవిష్కరించిందంటే అందులో అతిశయోక్తి లేదు. ప్రగతి శీలభావాలు, హేతువాదం, సామాజికస్పృహ, శాస్త్రీయ విజ్ఞానం, ప్రపంచ పరిణామాలు, అభ్యుదయ దృక్పథం, ఆర్థిక సాంఘిక రాజకీయ సాంస్కృతికరంగాల్లో వచ్చిన మార్పులు ఆయన విమర్శలో చూడవచ్చు. ఆ నేపథ్యంలోనే ఒక రచననుగాని, రచయితనుగాని అంచనావేస్తూ వారి రచనలను సమగ్రంగా పరిశీలించి వస్తుశిల్ప రహస్యాలను వింగడిస్తూ, సత్యాసత్యాలను ఆవిష్కరించడం రాచపాళెం విమర్శలో ఉన్న ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో రచయిత దృక్పథంలో, ఆలోచనా విధానంలో ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానంలో అభివ్యక్తీకరించే నైపుణ్యంలో ఏవైనా లోపాలుంటే సున్నితంగా రచయితల మనసులు గాయపడకుండా సలహాలు సూచనలను ఇస్తూ ప్రోత్సహించడం ఆయన నైజం. అందువల్లనే ఆయన ఒక మంచి విమర్శకునిగా, మార్క్సిస్టు విమర్శకునిగా అన్నివర్గాల మేధావుల మన్ననలు అందుకున్నారు. మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు మంచి విమర్శకుడవుతారనటానికి రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డిగారే ప్రత్యక్ష నిదర్శనం. ఇక ఆయన జీవిత విశేషాల్లోకి వెళితే చిత్తూరుజిల్లా కుంట్రపాక గ్రామంలో 1948 అక్టోబర్‌ 16న ఒక సాధారణ మధ్యతరగతి రైతుకుటుంబంలో రామిరెడ్డి మంగమ్మ దంపతులకు రాచపాళెం జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తల్లి ప్రేమకు దూరమయ్యారు. అయితే పినతల్లి రాజమ్మ ఆయనకు అవ్యాజమైన ప్రేమను పంచిపెట్టి తల్లిలేని లోటును తీర్చింది. అందుకే ఆయన హృదయం దయాపూరితంగా ఉంటుందనీ ఆయన గురించి తెలిసినవారంటారు. సహజంగా ఆయన మృదుస్వభావి.

మానవతావాది. యూనివర్సిటీ ఆచార్యులకున్న అకడమిక్‌ అహంకారం ఆయనలో ఏకోశానా కనిపించదు, అయితే విమర్శలో మాత్రం ఆయన నిజాలు నిర్భయంగా వెలువరించడానికి ఏమాత్రం సంకోచించడు. అదే సుగుణం ఆయనను విమర్శకునిగా అగ్రభాగాన నిలబెట్టింది. కరవు సీమలో చదువుకోవడం చాలాకష్టం. అందునా రైతుకుటుంబాల పిల్లలుచదువుకోవడం మరీ కష్టం. అయితే ఆ కష్టాలే ఒక్కోసారి కసిని, పట్టుదలను పెంచి బతుకు భయంవల్ల బాగా చదువుకోడానికి కారకాలు ప్రేరకాలు కూడా అవుతాయి. రాచపాళెం విషయంలో అదే జరిగింది. ఆయన ఎంతో కష్టపడి చదువుకున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో తెలుగు సాహిత్యం చదువుకుని అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో లెక్చర్‌గా, ప్రొఫెసర్‌గా, ఆంధ్ర భారతి శాఖాధిపతిగా పనిచేసి 2008లో పదవీ విరమణ చేశారు. అటు తర్వాత 2008 నవంబర్‌ నుండి కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో పనిచేస్తున్నారు. 31 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన పర్యవేక్షణలో 25 మందికి డాక్టరేట్లు, 18 మందికి ఎంఫిల్‌ పట్టాలందుకున్నారు. రాచపాళెంలో ఉన్న మరో పార్శ్వం సంగతి చాలామందికి తెలియదేమో! ఆయన రాసింది జీవితంలో ఆచరించాడు. సామాజిక ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్నారు. తన ఇంట్లోని వారికి కులాంతర మతాంతర వివాహాలు చేసి కులమతాలు లేవని చాటిచెప్పారు. విశ్వవిద్యాలయాల్లో స్మశానాల్లాంటి నిఘంటువులు చూపి, వ్యాకరణాల సర్ప పరిష్వంగంలో విద్యార్థులను బంధించి, పాత భావాల పాతర్లో వేసి పాఠాలు బోధిస్తున్న బోధగురువుల బారినుండి విద్యార్థులను తప్పించారు. తన ఆధునిక భావజాలాన్ని వారిలో ఇంజెక్టుజేసి, వారిని అభ్యుదయ వాదులుగా మలిచారు. ఆధునిక సాహిత్యబోధనా పద్ధతులు ప్రవేశపెట్టారు. అకడమిక్‌ సిలబస్‌లో ఆధునిక సాహిత్యానికి పెద్దపీట వేశారు. అంతకుమించి శిష్యులను అమితంగా ప్రేమించారు. నిరాడంబరంగా జీవించారు. అంతే కాదు వారిలో తానొక చేతనా దీపమై, చైతన్యకెరటమై, అభ్యుదయ ఉద్వేగ తరంగమై ఎగసిపడ్డారు. ప్రగతిశీల భావనా తటాకమై విద్యార్థుల జీవితాలను పచ్చని సాహితీ క్షేత్రాలుగా పల్లవింప జేశారు. రాచపాళెం కేవలం విశ్వవిద్యాలయాలకే పరిమితం కాలేదు. ఆయన సామాజిక బాధ్యతతో అనేక సామాజిక, సాంస్కృతిక దళిత ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి జిల్లా రచయితల సంఘం కవులు రచయితలతో కలిసి జిల్లా అంతటా పర్యటించి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు.

జనవిజ్ఞాన వేదికద్వారా ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి కృషి చేశారు. దళిత ఉద్యమాలను బలపరిచారు. ఉద్యమకారులకు తన మద్దతును ప్రకటించారు. ఆయన మంచి వక్తకూడా. ప్రభుత్వ విధానాలను, మేధావులు, కుహనా సంఘసేవకుల అశాస్త్రీయ భావజాలాన్ని తూర్పారబడుతూ ఆయన ఉపన్యసిస్తుంటే సామాన్య ప్రజలు కూడా ఆసక్తితో ఆలకించేవారు. వాస్తవాలను కళ్లముందు నిలిపి, బొమ్మకట్టించి, నిజాలను మార్క్సిజం అద్దంలో చూపించి, ఆయా వర్గాలవారిని నొప్పించక ఒప్పించే విమర్శనాత్మక ధోరణి ఆయన ఉపన్యాసాల్లో ఉండేది.

ఆధునిక కవులపై శ్రీశ్రీ ప్రభావం ఉన్నట్టే అనంత కవులపై రాచపాళెం ప్రభావం ఉంది. అవధాన సీమలో జూపల్లి, ప్రేమ్‌చంద్‌ లాంటి అభ్యుదయ అంగార పుష్పాలు వికసించాయంటే అందుకు రాచపాళెం భావజాల ప్రభావమే కారణం అనడంలో ఎట్టి సందేహం లేదు. శిల్ప ప్రభావతిపై పరిశోధన చేసినా, గుర్రం జాషువాలాంటి కవులపై విమర్శాగ్రంథాలు వెలువరించినా సాహిత్యంపై సాధికారికంగా చర్చలాంటి పుస్తకాలు రాసినా, మన నవలలూ మన కథానికలూ లాంటి విమర్శనా గ్రంథాలు వెలువరించినా… కవులు ఉద్యమాల గురించి ఇంకా అనేకమంది సాహితీ వేత్తలపై వారి రచనలపై వ్యాసాలు రాసినా, ఫ్యాక్షనిజం వస్తువుగా కవిత్వం రాసినా అది ఆయనకే చెల్లుచుంది. సాహిత్యంలో పునర్‌ మూల్యాంకనం అన్నపదానికి ఉన్నవ మాలపల్లె, వట్టికోట ఆల్వారుస్వామి ప్రజల మనిషి, లాంటి నవలలపై, రాచపాళెం రాసిన వ్యాసాల వల్లనే ప్రాచుర్యం వచ్చిందంటే అతిశయోక్తి లేదు. కాళీపట్నం యజ్ఞం, కొలకలూరి ఊరబావి లాంటి కథలపై ఆయన రాసిన వ్యాసాలు సంచలనాత్మక విమర్శాకథనాలుగా భావించవచ్చు. ఇక సాహితీ విమర్శకునిగా రాచపాళెం ఎంత గుర్తింపును పొందారో వ్యక్తిత్వమున్న ఒక మంచి వ్యక్తిగా, మానవతామూర్తిగా ఆయన అంతే కీర్తి గడించారు. వ్యక్తిత్వం లేనివాడు ఎంత గొప్ప కవిత్వం రాసినా విమర్శరాసినా కథలూ నవలలు రాసినా అది శిల్పశోభితం, కీర్తిదాయకం, కావచ్చునేమోగాని సామాజికామోదం పొందదు, అయితే అటు గొప్ప వ్యక్తిత్వంతో పాటు నిఖార్సయిన విమర్శరాసినందుకు రాచపాళెంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు రావడం అందరికీ ఆనందదాయకం. ఆ అవార్డుకు నూటికి నూరుపాళ్లు ఆయన అర్హుడని సాహితీ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. నా రాతలలో రాచపాళెం భావజాల ప్రభావముంది.

 

సాక్షి

andhraprabha –   Mon, 29 Dec 2014, IST

ఒకరు విహారి -జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిరెండోవారు శాలివాహన -త్రిపురారిభట్ల నారాయణమూర్తి

ఇద్దరూ ఎల్‌ఐసిలో పనిచేశారు. ఇద్దరూ కలిసి కథలు రాసి ప్రసిద్ధులయ్యారు. ఇద్దరూ కలిసి ”సాక్షి” అనే కవితా సంపుటి తీసుకువచ్చారు. అయితే ఎవరు ఏ కవిత రాశారో తెలీదు. ఎవరు రాసినా అది ”తిర్పతి వేంకటేయమే” అన్నట్టుగా వీరిద్దరూ రాశారు.

”అక్కడ. శాంతి కపోతాల్ని రాకాసిగద్దలు రక్కుతున్నాయి

అక్కడ న్యాయం ధర్మం తూటాలుగా తుపాకీ గొట్టాల్లో దట్టింపబడుతున్నాయి

అక్కడ పాలకుడు ఆవేశవశువై, పశువై, రాకాసియై వికట నాట్యం చేస్తున్నాడు.

అక్కడ భూతల నరకం సృష్టింపబడుతోంది

అక్కడ నరమేధం వడివడిగా సాగిపోతోంది”

అనే పంక్తులు చదవగానే ఏ దిగంబర కవో విప్లవకవో రాసి ఉంటాడను కొనేలా ఉన్నవి. విహారి శాలివాహనలవే. ”ఖండించడం, పండించడం కవికే చేతనవును. కవి చెడును ఖండిస్తాడు. మంచిని పండిస్తాడు. వీరి కవితల్లో నేను కాంతిమయ భవిష్యత్తు అడుగు జాడలు చూశాను. వీరికలాలు గళాలు జలపాత జలాలవలె చైతన్యవిద్యుత్తును ఉద్భవింపజేస్తున్నాయి.” అన్నారు దాశరథి, అప్పట్లో అభ్యుదయ కవుల్లో, కథకులలో కొందరు మధ్యతరగతి జీవులపై బాగా రచనలు చేశారు. ఈ జంట వచన కవులు కూడా ”మధ్యమ పురుషలో కథనం” అనీ కవి తను ఆంగ్లపదాలలో, వినూత్న శైలిలో రాశారు—

”ఇంక్రిమెంట్‌’కు ‘స్టాగ్నేషన్‌’ వచ్చింది నాకు తెలుసు నువ్‌ ఆడుతున్న రమ్మీలో నీకు ఎక్స్‌టెన్షన్‌ అందటం లేదు.

పదమూడో ముక్క పండటంలేదు

‘ప్రమోషన్‌’ కోర్టులపాలై పోయింది

నాకు తెలుసు

నువ్‌ చేస్తున్న ప్రయోగానికి

ఇదమిత్థమైన ‘ఫార్ములా’ లేదు”

చీట్లపేక గురించి జాషువా నుంచి చాలామంది కవితల్లో పేర్కొన్నారు. ‘నాకు తెలుసు’ అనేది పునరావృతం కావడం నొక్కి చెప్పే శిల్పం (తిలక్‌ నేను చూశాను నిజం.. గా లాగా) బడిపంతుళ్ళ జీవితాలు ఒకప్పుడు ”రూపాయి జీతం పన్నెండు రూపాయల ఖర్చు” లాగా ఉండేది. ఈ వస్తువు పై కవిత రాస్తూ

”జాతికి వెన్నెముక ఉపాధ్యాయుడు

మాట్లాడకుండా కాంపోజిషన్‌ వ్రాయి”

అని ముగించటం విశేషం. ఇలా అలనాడు వచన కవిత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. విహారి శాలివాహనలు వినూత్నంగా ”పద చిత్రాలు” కవిత రాశారు. ఇది ఒక ప్రయోగం. ”నారు పోసిన వాడు నీరు పొయ్యకపోడు” అనే సామెతవుంది. దీన్ని ఆధారంగా చేసుకొని రాసిన కవిత ఇలా ప్రారంభమవుతుంది.—

”నువ్వు చెప్పేది నిన్నటి నీతికావచ్చు

సామెత కావచ్చు

కానీ

ఈనాటి నిజం మాత్రం కానేకాదు

తాతలనాడు పోసిన నీ నారుకు

ఇవ్వాళ నీరందటం కష్టం

ఇండియా -దటీజ్‌ భారత్‌లో

నీటిఎద్దటి లేని పట్నమూలేదు. పల్లెలేదు

క్యూలో కాళ్ళను చచ్చుపరచుకున్నా

అందిన నీరు నీ నారుకు అక్కరకురాదు”

మానవుడు చిరంజీవి అంటూ అక్రమాల చీకటిని చించుకొని వెలుగులోకి వస్తాడనీ ఈ కవులు ఆశించారు.

కాశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అనివార్యం?

andhraprabha –   Fri, 9 Jan 2015, IST

కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తావించకుండా బిజెపి జాగ్రత్తపడినా, దానిపైనా,రాష్ట్రంలో అమలులో ఉన్న సైనికులకు ప్రత్యేకాధికారాలు కల్పించే చట్టం ఉపసంహరణపైనా బిజెపి మెత్తబడింది. అయితే ఢిల్లిd ఎన్నికల ప్రచారంలో ఇది బెడిసికొట్టవచ్చు

కనుక పీడీపీతో పొత్తు వాయిదావేయడమే బిజెపి ప్రస్తుత వ్యూహం అయివుండవచ్చు.

కాశ్మీర్‌లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం ఏ పార్టీకీ లేకపోవడం,సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు యత్నాలు ఈసారి సంక్లిష్టంగా మారడంతో గవర్నర్‌ పాలనకు రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వొహ్రా కేంద్రానికి సిఫార్సు చేశారు. రాష్ట్రానికి సంకీర్ణ ప్రభుత్వం కొత్త కాకపోయినా, ఈసారి ఉత్పన్నమైన సంక్లిష్ట పరిస్థితి ఇంతకుముందు ఎన్నడూ కనీవినీ ఎరుగునిది. ప్రభుత్వం ఏర్పాటుకు గత నెల 24వ తేదీ నుంచి జరుగుతున్న కసరత్తు ఒక కొలిక్కి రాకపోవడం,ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఒమర్‌ అబ్దుల్లా విముఖత వ్యక్తం చేయడంతో తప్పని పరిస్థితుల్లో గవర్నర్‌ సిఫార్సు చేశారు. రాజ్యాంగంలో నిర్దేశించిన గడువు ప్రకారం పార్టీలకు గడువు ఇవ్వడం తప్ప గవర్నర్‌ చేయగలిగిందేమీ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా కాశ్మీర్‌ విషయంలో ఏమాత్రం తొందరపాటును ప్రదర్శించకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం,ఇండిపెండెంట్లకు ఎరవేయడం వంటి చర్యలకు పాల్పడకుండా తమతో జత కట్టేందుకు ముందుకు వచ్చిన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ)తోనే సంప్రదింపులు సుదీర్ఘంగా జరిపింది.ఈ సంప్రదింపుల్లో పీడీపీ కోరిన వరాల్లో చాలా మటుకు అంగీకరించినా ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కాలేదంటే,పైకి చెప్పని కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమోనన్న అనుమానం కలగడం సహజమే.

ముఖ్యంగా,కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తావించకుండా బిజెపి జాగ్రత్తపడినా,దానిపైనా, రాష్ట్రంలో అమలులో ఉన్న సైనికులకు ప్రత్యేకాధికారాలు కల్పించే చట్టం ఉపసంహరణపైనా బిజెపి మెత్తబడింది. అయితే ఢిల్లిd ఎన్నికల ప్రచారంలో ఇది బెడిసికొట్టవచ్చు కనుక పీడీపీతో పొత్తు వాయిదావేయడమే బిజెపి ప్రస్తుత వ్యూహం అయివుండవచ్చు.

పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బిజెపి వివాదాస్పద విషయాలను పక్కన పెట్టాలని నిర్ణయించినా ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీకీ,పీడీపీకి వచ్చిన సీట్ల తేడా మూడు మాత్రమే.బీజేపీకి 25 సీట్లు,పీడీపీకి 28 సీట్లు వచ్చాయి. అయినప్పటికీ,పీడీపీ సీనియర్‌నాయకుడు ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌కి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు,కీలకమైన మంత్రి పదవులను ఆ పార్టీకి ఇచ్చేందుకు బిజెపి సిద్ధపడింది.కాశ్మీర్‌ లోయలో పీడీపీకి ఎక్కువ సీట్లు రావడం వెనుక వేర్పాటువాద సంఘాల సమాఖ్య అయిన హురియత్‌ కాన్ఫరెన్స్‌ మద్దతు ఆ పార్టీకి ఉందన్న విషయం బహిరంగ రహస్యమే.కనుక,పీడీపీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదనీ,పైగా ఎప్పటికప్పుడు కొత్త షరతులు పెడుతుందని ఊహించడం కష్టమేమీ కాదు.గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరడుకట్టిన ఉగ్రవాదులను జైళ్ళ నుంచి విడుదల చేసింది.ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఉభయ కాశ్మీర్‌లకు ఉమ్మడి కరెన్సీ ఉండాలని డిమాండ్‌ చేసేవారు. ఆక్రమిత కాశ్మీర్‌కు బస్సు సర్వీసును ప్రవేశపెట్టడంలో ఆయన ఒత్తిడి ఉందన్న వార్తలు అప్పట్లోవచ్చాయి.సరిహద్దురాష్ట్రం కనుక కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు పట్టువిడుపుల వైఖరిని ప్రదర్శించాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది.అప్పట్లో పీడీపీ కన్నా కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు వచ్చినా,ముఖ్యమంత్రి పదవిని వంతులవారీగా పంచుకునేందుకు అంగీకరించడమే కాకుండా,మొదటి అవకాశం ముఫ్తీకే ఇచ్చింది.ఇప్పుడు కూడా పీడీపీతో బిజెపి చర్చల్లో ఇలాంటి సర్దుబాట్ల ప్రతిపాదనలు వచ్చినట్టు,వాటిలో చాలా మటుకు బిజెపీ అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి.పీడీపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ,బిజెపి తరఫున ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి రాం మాధవ్‌లు అనేక దఫాలు చర్చలు జరిపారు.గవర్నర్‌ని తమ మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సహా కలుసుకున్నారు.వారు కోరిన గడువును గవర్నర్‌ ఇచ్చారు.ఆ గడువు లోగా ప్రభుత్వాన్ని వారు ఏర్పాటుచేయలేకపోయారు.మరో వంక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్‌ వైదొలగేందుకు ఒత్తిడి తెచ్చారు.సరిహద్దుల్లో ఆవలి వైపు నుంచి పాక్‌ సైనికులు ఈనెల ఒకటవ తేదీ నుంచి నిరవధికంగా కాల్పులు జరుపుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో పటిష్టమైన, శాశ్వతమైన ప్రభుత్వం అధికారంలో ఉండాల్సిన అవసరంఎంతైనా ఉంది,ఈ విషయాన్ని కూడా ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌తో తాను జరిపిన చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించినట్టు చెప్పారు.

అంతేకాక, ప్రస్తుత అసెంబ్లిd కాలపరిమితి ఈనెల 19వ తేదీతో ముగియనున్నందున ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. పీడీపీ,బీజేపీల మధ్య ఈలోగా పొత్తు కుదిరే అవకాశాలు కనిపించకపోవడం వల్ల గవర్నర్‌ పాలనకు వొహ్రా సిఫార్సు చేసి ఉండవచ్చు.రెండు పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏర్పాటుకు చొరవ చూపిన పార్టీపై ఉందంటూ పీడీపీని పరోక్షంగా ఒమర్‌ ఎత్తిపొడిచారు.పీడీపీతో వ్యవహారం తొందరగా తేలదని కూడా ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు.

పీడీపీ,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ల మధ్య రాజకీయ వైరం సంగతి అలా ఉంచితే,రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉన్న మాట నిజమే.పాక్‌ కవ్వింపు కాల్పుల వ్యవహారం అటుంచి,రాష్ట్రంలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల కొనసాగింపు కోసం పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడాలి.ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ పార్టీలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశాయి.వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు గవర్నర్‌ పాలనలో అమలు జరపగడమూ వాంఛనీయం కాదు.ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలోనే అవి అమలు జరిగినప్పుడే, బాధితుల గోడు పట్టించుకున్నట్టు అవుతుంది.ఈ నేపధ్యం నుంచిచూస్తే,గవర్నర్‌ సిఫార్సు చేసింది రాష్ట్రపతికే అయినప్పటికీ,కేంద్రాన్ని సంప్రదించకుండా ఆయన నిర్ణయం తీసుకోరు కనుక,కేంద్రం ఎటువంటి వైఖరి తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.ఈ విషయమై కేంద్రం రేపోమాపో నిర్ణయం తీసుకోవచ్చు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అస్పృశ్యత-బ్రాహ్మణిజం శ్రీ అరవిందరావు –

అస్పృశ్యత-బ్రాహ్మణిజం
ప్రపంచంలోని రెండు బలీయ సంస్కృతుల మధ్య పోటీతత్త్వం. దానిలో భాగంగా మతమార్పిడులు, దేశభద్రతపై దాని ప్రభావం అనే విషయాన్ని గత వ్యాసంలో కొంత చూశాం. మతమార్పిడులపై ప్రస్తుతం జరుగుతున్న వివాదాల జోలికి పోకుండా వాటి కారణాలను పరిశీలించి మనం ఆత్మవిమర్శ చేసుకోవల్సిన విషయం ఒకటి ప్రముఖంగా కనిపిస్తుంది. ఇదే అస్పృశ్యత, సామాజిక, ఆధ్యాత్మిక అసమానత.
మనిషికి ఆహారం, నీరు ఎంత నిత్యావసరాలో మత విషయంలో సమానత కూడా అంతే అవసరం. తానున్న వ్యవస్థలో ఈ సమానత దొరకనప్పుడు అతడు తన వ్యవస్థ నుండి మరొక వ్యవస్థలోకి వెళతాడు. మతమార్పిడిపై ఇతరుల ప్రచారం కొన్ని వర్గాలపైనే ఎక్కువ ప్రభావం ఎందుకు చూపగలిగింది అనడానికి కారణం ఆ వర్గాలు ఈ సంస్కృతిలో భాగంగా భావించుకోకపోవడమే.
అస్పృశ్యత, వర్ణవ్యవస్థ గురించి ఎలాంటి వివరణ ఇవ్వడానికి ముందు మొట్టమొదటగా హిందూసమాజం అసమానతకు గురైన ఈ వర్గాలతో క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం మతమార్పిడుల దృష్టితో కాదు. మన ఉపనిషత్తులలో చెప్పిన సంస్కారం దృష్ట్యా ఇది అవసరం. ఇతర సంస్కృతుల వారు మనల్ని తప్పుపట్టడానికున్న ఒకే ఒక అంశమిది. దురదృష్టవశాత్తూ మన సంస్కృతికి వ్యవస్థాగత నిర్మాణం (Organizational structure)లేకపోవడం వల్ల ఈ పనిని ఎవరు చేయాలి అనే ప్రశ్న వస్తుంది. దీన్ని బహుశా హిందూ సమస్యల్ని గూర్చి చర్చించే వి.హెచ్‌.పి. లాంటి సంస్థలు సాధు పరిషత్తుల ద్వారా చేయించడంపై ఆలోచించాలి.
అస్పృశ్యత అనే పేరు మనుస్మృతిలో కానీ, భారతం, రామాయణంలలో కానీ మరే ఇతర స్మృతిలో కానీ కనిపించడం లేదు. చండాలుడు అనే పదం ఉంది కానీ అది ఈనాడు మనం ఎస్‌.సి.లుగా భావించే వర్గాన్ని ఉద్దేశించి చెప్పింది కాదు. బ్రాహ్మణసీ్త్రకి, శూద్రుడితో కలిగిన సంబంధం వల్ల పుట్టినవాళ్లని చండాలురనీ, వారిని దూరంగా పెట్టాలనీ స్మృతుల్లో చెప్పారు. వీరిని శూద్రులలో భాగంగానే చెప్పారు. ఇది క్రమక్రమంగా ఇప్పుడు మనం చెప్పుకునే ఎస్‌.సి. వర్గాలకు ఎలా అన్వయించడం జరిగిందో చరిత్రకారులు పరిశీలించాల్సి ఉంది. భరతఖండంలో ఒకే సంస్కృతి ఉన్నంతకాలం ఈ వర్గాలవారు ఈ సంస్కృతిలో ఉన్నా ఇతర సంస్కృతులతో సంపర్కం కలిగిన తర్వాత వాటిలోకి క్రమక్రమంగా వెళ్ళడం జరిగింది. ఒకవైపు నుండి వెలివేత. మరోవైపు నుండి ఆహ్వానం- దీని పరిణామం చెప్పాల్సిన పనిలేదు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాంఘిక అసమానతలను తొలగించడానికి చట్టాలు వచ్చాయి. హిందూ మత పెద్దలు కానీ, సమాజం కానీ ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. చరిత్రలో ఏ శతాబ్దంలో గమనించినా సంఘంలో సంస్కరణల్ని మొట్టమొదట ప్రవేశపెట్టినవారూ, సమర్థించిన వారూ బ్రాహ్మణవర్గాలే. ప్రస్తుత వ్యవస్థలో ఎస్‌.సి. అధికారుల్ని ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్ణకుంభాలతో స్వాగతం చెప్పేది బ్రాహ్మణ పూజారులే. సామాజిక మార్పును పూర్తిగా అవగాహన చేసుకున్నవి బ్రాహ్మణ వర్గాలే. నగర ప్రాంతాల్లో అసమానతలు పూర్తిగా అంతరించినా, గ్రామాల్లో ఇలాంటివి దేవాలయ ప్రవేశం మొదలైన సందర్భాల్లో ఇంకా ఉంది. గ్రామాల్లో కూడా మార్పు తేవడానికి చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి.
అస్పృశ్యతకూ, బ్రాహ్మణవర్గాలకూ సంబంధాన్ని కల్పించడం, కేవలం బ్రాహ్మణ వర్గాన్ని మాత్రమే గురిపెట్టి నిందించడం, ఒక వ్యూహంలో భాగం. హిందూమతాన్ని అంతో ఇంతో ఆచరిస్తూ ఇతరులతో ఆచరింపజేస్తున్నది బ్రాహ్మణవర్గమే. ఈ కొద్దిపాటి అడ్డంకి కూడా తొలగిపోతే చాలా సులభంగా తమ సంస్కృతిని వ్యాపింప చేయవచ్చనే భావంతో ఈ వ్యూహాన్ని అమలు చేయడాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ఈ ప్రణాళికతోనే కొందరు మేధావులు ‘బ్రాహ్మనిజం’ అనే పదాన్ని ప్రతి సందర్భంలోనూ వాడుతూ ఒక వర్గం పట్ల ద్వేషం రెచ్చగొట్టే రచనలు చేయడం బాధాకరం.
చరిత్ర పాఠ్యపుస్తకాలు వ్రాసేవాళ్లు ఎన్ని విషయాలను దాచినా అనేకమంది మేధావులు చరిత్రలోని అన్ని కోణాలనూ పరిశీలించి వాస్తవాలు వ్రాసారు. భారతదేశ చరిత్రలో ముఖ్యంగా పదవ శతాబ్దం తర్వాత సమాజంలోని అన్ని వర్గాలకంటే ఎక్కువ హింసను ఎదుర్కొన్నవారు బ్రాహ్మణులు, రాజులు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నా కేవలం రెండింటిని మాత్రం చెబుతాను. హిందుత్వవాదుల రచనల్ని పక్కనబెట్టి అంబేద్కర్‌ వ్రాసిన “Revolution and Counter-Revolution in india ‘ అనే పుస్తకాన్ని చూస్తే ఇస్లాం దండయాత్రల ప్రారంభ కాలంలో పురోహిత వర్గాలపై దాడి ఎలా జరిగింది. బౌద్ధం ఎలా నశించింది. హిందూమతం ఎలా నిలదొక్కుకుంది అనే విషయంపై ఆయన ఇలా వ్రాశారు. “The Buddhist priesthood perished by the sword of islam and could not be resusciated.On the other hand it was not possible for islam to annihilate the brahmanic proesthood”.
బౌద్ధపండితులు ముఖ్యంగా ఒకేచోట, అంటే వాళ్ళ ఆరామాలలో ఉండటం వల్ల చాలామంది హతమయ్యారు. పుస్తకాలు కాల్చివేయబడ్డాయి. కొందరు టిబెట్టుకు పారిపోయారు. హిందూమతంలో వేదాల్నీ, మిగతా శాసా్త్రల్నీ పుస్తకరూపంలో వ్రాయకపోవడం, కేవలం కంఠతాపెట్టడం, ప్రతి బ్రాహ్మణుడూ తన వేదశాఖను నేర్చుకోవడం వల్ల గ్రామగ్రామాల్లో ఉన్న పండితులందరినీ నిర్మూలించలేకపోయారని ఇదే సందర్భంలో అంబేద్కర్‌ వివరించారు.
“Donald lach ‘  వ్రాసిన “Asia in the Making of Europe” అనే పుస్తకం మూడు వాల్యూముల్లో ఉంది. మొదటి వాల్యూములో పదహారవ శతాబ్దం చివర్లో ఫ్రాన్సిస్‌ జేవియర్‌ అనే మత ప్రచారకుడు గోవాలో బ్రాహ్మణులపై సాగించిన హింసాకాండ వర్ణింపబడింది. ఈ వర్గాన్ని నాశనం చేస్తే తప్ప తమ మతాన్ని వ్యాపింపజేయలేమంటూ ఈయన స్పెయిన్‌లో ఉన్న రాజుకు లేఖ పంపాడు. బ్రాహ్మణుల్ని చాలామందిని చంపడం, చేతులు తెగకొట్టడం జరిగింది. దాని స్మృతిచిహ్నంగా ఈనాటికీ పాత గోవాలో ఒక స్తూపం ఉంది. ఈ వివరాలు చాలా మటుకు ఇంటర్నెట్‌లో కూడా లభిస్తాయి. ‘బ్రాహ్మనిజం’ అనే భావనకి ఇతడే మూలం. తర్వాతి కాలంలో ఈ వ్యూహాన్నే ఇతరులు అనుసరించారు. మాసిన పంచ కట్టుకుని షర్టు లేకుండా పగలంతా గుడిలో నిల్చుని ఉండే బ్రాహ్మణుడంటే అందరికీ కనికరమే ఉంటుంది. ఈ బ్రాహ్మణులకు పెళ్లిళ్లు కూడా కావడం లేదు. ఇలాంటి పేద బ్రాహ్మణుడు మన మేధావికి వర్గ శత్రువు. భారతదేశంలో వెనుకబడ్డ వర్గాలవ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు కానీ పూజారి కాలేడు అంటూ వ్రాస్తూంటారు. ఇది చాలా బాధాకరం.
ఇటీవలి వరకూ బ్రాహ్మణుడికి అంటరానితనం ఇంట్లోనే మొదలయ్యేది. మడిబట్ట కట్టుకుని వంటచేసే తల్లిని లేదా పూజచేస్తున్న తండ్రిని పిల్లలు ముట్టడానికి వీలులేదు. తాము పవిత్రంగా ఒక పనిని చేస్తున్నామనే భావన వారిలో ఉండటమే దీనికి కారణం. అలాగే తాము ఎవరినైనా ముట్టుకున్నపుడు ఇంటికి వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేసారే కానీ మరేమీ చేయలేదు. ప్రస్తుతం ఇలాంటి వాతావరణం కూడా లేదు. ప్రపంచంలో మిగతా దేశాల్లో అంటరానితనం పాటించలేదు గానీ మతప్రచారంకోసం ఇతర దేశాలపై దాడులు చేసి మనుషుల్ని బానిసలుగా బంధించి తీసుకెళ్ళారు. మార్కెట్‌లో వేలం వేశారు. కాళ్ళకు సంకెళ్లు వేసి కొరడాలతో హింసించారు. తమ సిద్ధాంతాన్ని నమ్మని లక్షలాదిమందిని మంటల్లో కాల్చివేశారు. చరిత్ర చదవకపోవడం మనకు ప్రమాదకరం.
అనాదిగా సమాజంలో పేదరికాన్ని అనుభవిస్తూ చరిత్రలో ఎన్నో హింసల్ని అనుభవించిన నేపథ్యంలో అంటరానితనాన్ని బహిష్కరిస్తే మొట్ట మొదటిగా స్వాగతించేది బ్రాహ్మణవర్గాలే.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నైజీరియాలో నర మేధం- ఫ్రాన్స్ లో కల్లోలం – ధోనీ మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శనీయ దైవ క్షేత్రాలు -కవర్ పేజీలు

Watch Live
దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ –

inner cover3 001 inner cover4 001 kshetra book 1 001 kshetra book2 001

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గాడ్సే గుడి – గొల్లపూడి మారుతీరావు

గాడ్సే గుడి

గాడ్సే గుడిగొల్లపూడి మారుతీరావు

జీవన కాలమ్
గాడ్సే జాతిపితని హత్య చేశాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది.
శిక్ష అమలయింది. సమాజమంతా సమర్థించని నెగిటివ్ దేవుళ్లు వీరు.
మరి కుష్బూ గుడినీ సమాజమంతా సమర్థించదు కదా!
అఖిల భారత హిందూ పరి షత్ ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూ ర్‌లో జాతిపిత హంతకుడు గాడ్సే స్మృతికి ఒక దేవాలయా న్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించా రు. గాడ్సే మేనకోడలు హిమా నీ సావర్కర్ దాచిపెట్టిన గాడ్సే చితాభస్మాన్ని పుణే నుం చి తీసుకువచ్చి ఈ ఆలయం లో భద్రపరుస్తారని ఉన్నావ్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు సాక్షి మహరాజ్ ప్రకటించారు.
జాతిని నడిపించే నాయకుడిని ‘దేవుడి’ని చేయడం ఈ దేశపు ప్రాథమిక విశ్వాసాలకు మూల సూత్రం. దీనికి న్యూరో-సోషియో కాంప్లెక్స్ అని ఒకాయన నామ కరణం చేశారు.
ఒక దశలో విశ్వాసం, అభిమానం కూడా మైకమే. ప్రశంసించి, అభిమానించి, ఆరాధించి, ఆఖరికి దేవుడిని చేసి, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట చేసి సంతోషపడతాం. మన దేశంలో గుడులు బోలెడు. శంబల్‌పూర్‌లో గాంధీ జీకి గుడి ఉంది. కర్ణాటకలో రజనీకాంత్‌కి గుడి ఉంది. తిరుచినాపల్లిలో కుష్బూకి గుడి ఉంది. తిరునల్వేలిలో నమితా అనే నటీమణికి గుడి ఉంది. బుందేల్‌ఖండ్‌లో మాయావతికి గుడి ఉంది. దక్షిణ కలకత్తాలో అమితాబ్ బచ్చన్‌కి గుడి ఉంది. ఇందిరాగాంధీకి బోలెడు గుడులు ఉన్నాయి. తెలంగాణను ప్రసాదించినందుకు నాటి శాస నసభ్యులు శంకరరావుగారు సోనియాను ‘తెలంగాణ దేవత’గా అభివర్ణిస్తూ గుడి నిర్మించారు. మన దేశంలో సచిన్ తెండూల్కర్ దేవుడు. ఒక ప్రాంతాన్ని సస్యశ్యా మలం చేసి, తరతరాల జీవన ధోరణినే మార్చిన సర్ ఆర్థర్ కాటన్ దేవుడు. ఓట్లతో గెలిచిన రాజకీయ నాయ కుడు దేవుడు.
అయితే రాజీవ్‌గాంధీ మారణహోమానికి కారణమ యిన శివరాసన్‌ని మహా త్యాగమూర్తి అని తమిళ నాడులో ఊరేగింపులు జరిపారు. ఇందిరాగాంధీని కాల్చి చంపిన బియంత్‌సింగ్, సత్వంత్‌సింగ్‌లను అమృత్ సర్‌లో అఖల్‌తఖ్త్ (సిక్కుమత ప్రధాన పీఠం) అమర వీరులుగా గుర్తించి, అక్టోబర్ 31న అంటే, బియంత్ సింగ్‌ను ఉరి తీసిన రోజును స్మారకదినంగా పండుగ చేస్తోంది.
ఒక మతం అంగీకరించి, హత్యని ఆత్మత్యాగంగా గుర్తించిన సందర్భమది. ఒక ప్రధాని మారణహోమాన్ని ఒక వర్గం నెత్తిన పెట్టుకుని కుట్రదారుడిని వీరుని చేసిన సందర్భం శివరాసన్ అనే హంతకుడికి నివాళి. గాడ్సే జాతిపితని హత్య చేశాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. శిక్ష అమలయింది. సమాజమంతా సమ ర్థించని నెగిటివ్ దేవుళ్లు వీరు. మరి కుష్బూ గుడినీ సమా జమంతా సమర్థించదు కదా! వీరు మైనారిటీ దేవుళ్లు. మొదటిరకం దేవుళ్లు వ్యవస్థ మీద తిరుగుబాటు దేవుళ్లు.
ఒక ఉదాహరణ.
గురువుగారు సిగరెట్లు కాల్చడం నేరం అని బోధించారు. మీకు గురువుగారి మీద అంతులేని కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎలా ప్రకటించాలి? గబగబా నాలుగు సిగరెట్లు కాల్చి, సిగరెట్లు కాల్చానని గురువుగారి ముందు బోర విరిచారు. ఇప్పుడేం చేస్తారు? పర్యవసానం కాదు, కేవలం ఆ చర్యే తన ‘తిరుగుబాటు’కి ఉపశమనం. ఈ నెగిటివ్ గుడుల లక్ష్యం అదే.
మాయావతి, కుష్బూ, అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్‌ల గుడులు కూడా ఒక వికారమే. శివరాసన్, బియంత్‌సింగ్, గాడ్సేల గుడులు వికారానికి ఆవలిగట్టు.
కొందరికి దేవుడు ఆరోగ్యకరమైన ఆలోచనల పర్య వసానం. మరికొందరికి తమ ఆలోచనలకు అద్దం పట్టని వ్యవస్థని నిర్మూలించినందుకు దేవుడు. ఏ దేవుడు మీకిష్టం?
విశ్వాసానికి ఏది అంగీకరించడానికి యోగ్యమైన కొలమానం? నలుగురి నమ్మకాన్ని ఆకాశంలో నిలిపిన మెజారిటీ విలువా? పదిమంది కోపానికి కారణమయిన ఒక మైనారిటీ భావించే అన్యాయమా?
శిష్ట సమాజానికి ఒక నియతి ఉంది. నలుగురితో చావు- అది అవాంఛనీయమైనా- అది పెళ్లి. ఒక్కడితో చావు- అది అతనికి సహేతుకమైనా- ప్రమాదకరమైన చావు. ఈ కొలబద్దతో చూస్తే గాంధీని చంపిన గాడ్సే నేరాన్ని‘పొరపాటు’ అని సరిపెట్టుకుని గుడి కట్టే సాక్షి మహరాజుల చర్య భయంకరమైన, ప్రమాదకరమైన అవినీతి. నీకు నచ్చకపోతే వేంకటేశ్వరస్వామికి దండం పెట్టకు. రజనీకాంత్‌కి గుళ్లో హారతి ఇవ్వకు. ఇబ్బంది లేదు. కాని సమాజం- అది నీకు సబబుగా కనిపించక పోయినా- తిరస్కరించిన హంతకుడిని ‘దేవుడి’ని చేసే హక్కు నీకులేదు. ఇది బియంత్‌సింగ్‌కీ వర్తిస్తుంది. శివ రాసన్‌కీ వర్తిస్తుంది. గాడ్సేకీ వర్తిస్తుంది. మా మిత్రుడి మాటల్లో ఇది న్యూరో- సోషియో డిజార్డర్. గుడి సంగతి తర్వాత- ముందు ఈ గుడి నిర్మాతలకి వైద్య సహాయం కావాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

పి.ఆర్. జూనియర్ కళాశాల (కాకినాడ) పునరుద్ధరణ కార్యక్రమం రెండవ విడత ఈ నెల ప్రారంభం

పి.ఆర్. జూనియర్ కళాశాల (కాకినాడ) పునరుద్ధరణ కార్యక్రమం రెండవ విడత ఈ నెల ప్రారంభం

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

ఇటీవల మేము ప్రకటించినట్లుగా పి.ఆర్. జూనియర్ కళాశాల (కాకినాడ) రెండవ విడత భవన పునర్నిర్మాణ కార్యక్రమం ఈ నెలాఖరులోగా  ప్రారంభం అవుతుంది అని మీకు తెలియజేయడానికి ఆనందంగా ఉంది. మా విన్నపాలని మన్నించి సహృదయంతో భారత దేశంలోనూ, అమెరికాలోనూ అనేక ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ రెండు విడతల రిపేర్ల పనులకూ కలిపి సుమారు  20 లక్షల రూపాయల విరాళాలను అందించిన ఈ క్రింది దాతలకు మా బృందం తరఫునా, కళాశాల యాజమాన్యం, విద్యార్థినీ, విద్యార్థుల తరఫునా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా వారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం.

ఇప్పుడు మొదలుపెడుతున్న Quadrangale Hall పునర్నిర్మాణం పనులలో అనుకోని అదనపు ఖర్చులు, రాబోయే మూడు నెలల “బీద విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం” అమలుకూ అదనపు విరాళాలని స్వాగతిస్తున్నాం. (సుమారు $5000). ఈ పథకాన్ని ప్రిన్సిపాల్ గారి కోరిక మీద మొదలుపడుతున్నాం. ఏ దేశం నుంచి అయినా విరాళాలు on-line లో ఈ క్రింది లంకె ద్వారా పంపించవచ్చును.

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=MSV3XK94WDYRE

We sincerely thank the following kind hearted donors for their generosity & support for this PRGC Junior College Renovation Project ( As of January 5, 2015)

  • Grand Sponsors: (సార్వభౌమ పోషకులు): సుమారు $5000 ( Rs. 3 Lacs)

నల్లపరాజు బంగార రాజు (New Delhi), యండమూరి రవీంద్ర నాథ్ (హైదరాబాద్), ధూళిపాళ సీతారామయ్య (బెంగుళూరు)

  • Grand Benefactors: (చక్రవర్తి పోషకులు) : సుమారు $2500 (Rs. 1 Lac)

కూనపులి వారి కుటుంబం, ఇవటూరి సోదరులు , భారతి సిద్దవరపు, దేశరాజు కృష్ణబాబు & సీత (Houston, TX), చావలి రామసోమయాజులు & బాల (Houston, TX), చెరుకూరి పద్మనాభం (Bloomfield Hills, MI), సూర్యనారాయణ గొర్తి (Redmond, WA) & రావు భమిడిపాటి.

  • Grand Patron (మహారాజ పోషకులు): సుమారు $1000 (Rs. 50000)

వేణుగోపాలరావు కలపటపు & లక్ష్మి (Houston, TX), శంకర్ ప్లంజేరి & రాజ్యలక్ష్మి (Houston, TX), శ్రీనివాస్ చావలి (Redmond, WA), రమాకాంత్ చలికొండ (North Brunswick, NJ),

ప్రొఫెసర్ రవీంద్ర విప్పర్తి.

  • Patron (రాజ పోషకులు) సుమారు $500 (Rs. 25000)

(స్వర్గీయ) ములుకుట్ల అచ్యుత రామయ్య, ప్రకాశ రావు అనంతనేని  (Richmond, TX), కృష్ణ ఆర్జా  (Samamish, WA), మధు పెమ్మరాజు (Houston, TX),

ఉమా భారతి కోసూరి & మురళి (Houston, TX), టి. ప్రసాద్

  • Grand Supporters (యువరాజ పోషకులు) : సుమారు $250 (Rs.10000)

చంద్రశేఖర్ బాదం, సుందర రావు బాదం, శ్రీరామారావు అడబాల, Esather Caroline

రవికాంత్, బి. సత్యనారాయణ, U. శ్రీనివాస్, ఇ.వి.ఎస్. రామకృష్ణ , జే.ఎస్.ఆర్. శేఖర్, మాధవ్ దుర్భా (Atlanta, GA), హరి & సవిత మద్దూరి (Austin, TX),  కృష్ణ కామాక్షి శిష్ట్లా (Henderson, NV), డా. షణ్ముఖ రామ్, కే. సత్యానందం, శ్రీమతి వాణి.

  • Supporters (సామంత రాజ పోషకులు) : సుమారు $100 (Rs.5000)

కె. నాగేశ్వర రావు, ఎస్. లలితా దేవి, ఆర్. శేషు, డా. ఎస్.వి. రమణ, బాదం నాగేశ్వర రావు, ద్రోణంరాజు శ్రీరామకృష్ణ (Woodridge, IL.), సత్యవాణి వాడ్రేవు (Chicagao, IL), మాధురి, రామలింగ శర్మ దంతుర్తి (Elizabeth Town, KY),వేముల రావు,  రమేష్ వడ్లమాని, కట్టా మూర్తి, బాబు మారెళ్ళ ,  సురేష్ వేమూరి,        నారాయణ గరిమెళ్ళ,      రాయవరపు ఆదినారాయణ రావు,  జే. పెద్దిరాజు, సుభద్ర & సత్యనారాయణ గవరసాన,  పాండురంగా రావు & రమ తడికమళ్ళ, వై.వి. భాస్కర్, డా. ఆర్. మధు, డా. పి. ఎస్. రామకృష్ణ.

ఈ పట్టికలో ఏమైనా పొరపాట్లు దొర్లినా, ఎవరి పేరు అయినా మర్చి పోయినా మమ్మల్ని మన్నించి, ఆ సమాచారం మాకు తెలియపరచండి…

భవన పునర్నిర్మాణం పూర్తి అయిన తరువాత ఫొటోలు, దాతల సూచించిన విధంగా కళాశాల ప్రాంగణంలోనూ, భవనాల మీదా గుర్తింపు వివరాలతో మరొక నివేదిక సమర్పిస్తాం.

దాతల సత్వర స్పందనకు, దాతృత్వానికి  మరొక్క సారి ముందుగానే మా ధన్యవాదాలు.

For more information, please contact any of the following volunteers.

 

Sincerely,

 

వంగూరి చిట్టెన్ రాజు: (Houston, TX)

Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com

Chandra Turaga (Kakinada):

e-mail: cturaga@nhsiusa.com,  Phone: 093913-87368

YSN Murthy: (Kakinada)

E-mail: murtyyenamandra@yahoo.com

Dr. Murty Mutyala (Houston, TX.),

E-mail: mutyala41@yahoo.com

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శుభ్రతపై ప్రజలలో మొదటిసారిగా అవగాహన కలిగించడానికి ప్రయత్నించినది శ్రీ యన్ టీ రామారావు !

శుభ్రతపై ప్రజలలో మొదటిసారిగా అవగాహన కలిగించడానికి ప్రయత్నించినది శ్రీ యన్ టీ రామారావు !

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ  ‘తెలుగు వెలుగు” మాస పత్రిక  మార్చి, 1986 (సంచిక 1 సంపుటి 3) నుంచి :

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గుంటుపల్లి బౌద్ధ క్షేత్రం -బుద్ధభూమి -జనవరి

guntupalli3 001 guntupalli4 001 guntupalli5 001 guntupalli6 001 undavalli1 001 undavalli2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాపకాల కవులు… వాయనాల రచయితలు – –”సాహిత్య తలంటి ”-జయధీర్ తిరుమలరావు

ప్రాపకాల కవులు… వాయనాల రచయితలు

  • – జయధీర్ తిరుమలరావు, 9951942242
  • 05/01/2015
TAGS:

సాహిత్యం – విమర్శ : కొన్ని ఆలోచనలు

వర్తమానంలో సాహిత్యానికి కాలం దగ్గరపడుతోందా అనిపిస్తుంటుంది. దూరం కానున్నదా అనికూడా అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది కొందరికి.
వాస్తవానికి ఎన్నడూ లేనంతగా సాహిత్యం ఎక్కువగా ప్రచారం అవుతున్న కాలం కూడా ఇదే. అచ్చు అనే చట్రంలోంచి బయటపడి అక్షరం అంతరిక్షయానం చేస్తున్నది. క్షణాలలో లోకంలోని కోటానుకోట్ల మంది జేబు ఫోనుల్లో ప్రత్యక్షం అవుతున్నది. వెబ్‌సైట్లలో, బ్లాగుల్లో, చివరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నది. ఒక అతిపెద్ద దినపత్రిక తప్ప రెండు రాష్ట్రాలలో ఏడు ఎనిమిది దినపత్రికల సాహిత్య పేజీలు వెలువడుతున్నాయి. ఓ అతి పెద్ద దినపత్రికలో సాహిత్య పేజీ లేని లోటు తీర్చడానికా అన్నట్లు ఒక మాసపత్రిక ప్రారంభించి భాషా సాహిత్య రంగాలకు తనదైన రీతిలో ఊతం ఇస్తున్నది. ఆదివారం ఆంగ్ల దినపత్రికల ప్రత్యేక సంచికలలో సాహిత్యం గురించి, పుస్తకాల గురించి చాల వ్యాసాలు వెలువడుతున్నాయి. ఐనా చాలామందికి సాహిత్యానికి రోజులు దగ్గరవుతున్నాయా అని ఎందుకు అనిపిస్తున్నది? అందుకు గల కారణాలు ఏమిటి?
ప్రింట్ మీడియాతో పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు, ఇ-పత్రికలు, బ్లాగులు, చివరకు సోషల్ మీడియాలో సైతం లక్షల సంఖ్యలో సాహిత్య పేజీలు పాఠక లోకానికి అందుతున్నాయ. ఇవేకాకుండా పుస్తకావిష్కరణలు, సాహిత్య సభల వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. అన్ని పత్రికల ఆదివారం ప్రత్యేక సంచికలలో పుస్తక సమీక్షలు నిరాటంకంగా వెలువడుతునే ఉన్నాయి. ఆంధ్రభూమి దినపత్రికలో ప్రతి శనివారం సమీక్షల కోసం ప్రత్యేకంగా ఒక పూర్తి పేజీనే కేటాయించారు. ఐనా సాహిత్యం తన అస్తిత్వం కోసం ఊగిసలాడుతున్నదా?
ఈ పత్రికలే కాకుండా ఎన్నో ఇ-పత్రికలు వెలువడుతున్నాయి. వివిధ సాహిత్య సంస్థలు ఏర్పాటుచేసిన ఇ-పత్రికలూ ఉన్నాయి. ఇతర రూపాలలో సాహిత్య ప్రచారం జరుగుతునే ఉంది. కొన్ని ఆన్‌లైన్ పుస్తక విక్రయ సంస్థలు సైతం తమ వెబ్‌సైట్లలో మంచి పుస్తకాల గురించి రాస్తూనే ఉన్నాయి. వ్యక్తులు, రచయితలు తమ వెబ్‌సైట్లలో వ్యాసాలు రాస్తున్నారు. సాహిత్యం గురించి వ్యాసాలు అభిప్రాయాలు, చర్చలు సోషల్ మీడియాలో తగినంతగానే కనువిందు చేస్తున్నాయి. కొందరు రచయితలు వ్యక్తిగత సమాచారం, పుస్తకాలు, ముందుమాటలు, మొత్తం పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. ఇదొక ప్రత్యేక సాహిత్య లోకం. ఎందుకంటే డబ్బున్న, సాంకేతిక పరిచయం ఉన్నవారే ఈ సమాచారం చూడగలరు. దానిని అందిపుచ్చుకోగలరు. కాగితంపై కాకుండా కంప్యూటర్ తెరపై మాతమే కానవచ్చే సాహిత్యం ఇది. ఈ సాహిత్యానికి కాయినేజి మారకం ఎక్కువ. ఒక వేలు ఒత్తుతో వేల మందికి రచనలను పంపవచ్చు. ఏక కాలంలో వేలాది మంది దానిని చదవగలరు. లోగడ ‘దూరం’వల్ల సాహిత్యానికి అంతగా ప్రచారం ఉండేది కాదు. కాని ఇవ్వాళ రచనకీ-పాఠకుడికీ మధ్య దూరం తగ్గిపోయింది. నిజానికి లేదు కూడా. ఐనా ఏదో కానరాని దూరం కానవస్తున్నది.
లోగడ సమాజంలో సాహిత్యానికి తగినంత గౌరవం ఉండింది. ఇప్పుడు అది తగ్గిపోయినట్లు అనిపిస్తున్నది. సాహిత్య గౌరవం సమాజం అంతటా ప్రతిబింబించేది. ప్రచార పటాటోపం తక్కువైనా సమాజంలో సాహిత్యానికి ‘స్థానం’, ‘గౌరవం’ ఎక్కువ. సృజనకారులకు సామాజిక స్థాయి, అంతరాలు తక్కువగా ఉండేది. విభిన్న వర్గాలనుండి వచ్చినవారు సైతం సాహిత్యస్థాయి అనే కొలబద్దముందు నిలిచినప్పుడు పాండిత్యంతో, సాహిత్య విలువలతో పోటీకి నిలిచేవారు. ఐతే ఆనాడు కూడా సాహిత్య రాజకీయాలు లేవని కాదు. కాని అవి సాహిత్య తత్వాన్ని, పాండిత్యాన్ని దాటిపోలేదు. ఎంతోమంది ‘ప్రాపకం’ కవులు, రచయితలు ఆనాటికి ప్రచారం పొందినా తదుపరి కాలంలో వారిని తలిచేవారు లేరు. కాని ఇవ్వాళ అలాకాదు. మొత్తం వ్యవస్థని అస్తవ్యస్తం చేసి ధనం వెదజల్లి, అధికారం ఆసరాతో పేరుప్రఖ్యాతులు అవార్డులు, రివార్డులు పొందాలని పథక రచన చేయడం గమనించవచ్చు. అలాంటివారి పట్ల సమాజం ఓ కనే్నసి ఉంచుతున్నది. ఇలాంటి వాతావరణాన్ని చూసి చాలామంది సాహిత్యం పట్ల ఏవగింపు కలిగి ఉంటున్నారు. కేవలం మామూలు కవులూ రచయితలే కాదు సమాజంకోసం త్యాగాలు చేసే పార్టీలు, వామపక్ష భావజాలం కలిగిన కవులు కూడా ఇలాంటి చర్యలు చేపట్టడం సాహిత్య విలువను మరింత దిగజార్చుతున్నది.
లోగడ సాహిత్య సంస్థలు ఒకే లక్ష్యంతో, ధ్యేయంతో ఏర్పడ్డాయి. ఇప్పుడు వ్యక్తుల ప్రచారం కోసం ఏర్పడుతున్నాయి. నాకో అవార్డు ఇవ్వు, నీకోటి ఇస్తాను అన్న చందంగా తయారయ్యాయి. నా సంస్థకు నిన్ను ముఖ్యఅతిథిగా పిలుస్తాను. నీ సంస్థ సమావేశానికి అదే హోదాతో వస్తాను వంటి కనబడని ఒడంబడికల వల్ల కూడా సంస్థల కీర్తి తగ్గిపోతున్నది. అమెరికాలోనే కాదు, మన రాష్ట్రంలో కూడా కొన్ని సంస్థలు కులాలవారీగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వాలలో కీలక హోదాల్లో ఉన్న వ్యక్తులు రోజుకో సంస్థ ఏర్పాటుచేసి సాహిత్యేతరులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాహిత్య సంస్థలు వ్యక్తుల జేబు సంస్థలు అయ్యాయి. ముఖ్యమంత్రుల కార్యాలయాలనుండి కొన్ని సంస్థలు ఆరంభం కావడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రభుత్వమే సాహిత్య సంస్థలు నడిపితే ఇకముందు ఎలాంటి సాహిత్యం వెలువడుతుందో ఊహించవచ్చు. ఏర్పాటుచేసిన ఆ సభలలో ఎలాంటి ఉపన్యాసాలు చేస్తారో తెలుసుకోవచ్చు.
సాహిత్యంలో పెడధోరణులు, అపసవ్య సాహిత్యం ఎక్కువ మొత్తంలో వెలువడితే ఆ సమాజాన్ని బాగుచేయడం సాధ్యంకాదు. కళాసాహిత్యం ప్రజల తరఫున నిలిచినప్పుడే ఆ సమాజం సమతౌల్యంగా ఉంటుంది. అక్షరం ప్రజల తరఫు ఆయుధం. పాలక పక్షాలకది ప్రతిపక్షం. ఈ సరిహద్దు గీత చెరిగిపోతున్న వేళ, ప్రజల తరఫున నిలిచిన కవిగాయక సమాజం జీ హుజూరంటూ చేతుల చాచి నిలబడడం చూస్తుంటే బాధేస్తుంది. లోగడ కొద్దిమంది మాత్రమే ప్రభుత్వ బాకా ఊదేవారు. వారు దానిని దాచేవారు కాదు. ఇప్పుడు ప్రభుత్వం అలాంటి వారితో ఒక బాకా సైన్యం ఏర్పాటుచేయబూనడం ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో ప్రగతిశీల సమాజం యావత్తూ చూసీచూడనట్లు నటిస్తున్నది. తమతమ చంచాలు అలాంటి బాకా పనులు చేస్తుంటే చూసి ఊర్కోవడం వింత కలిగించే పరిణామం. ఓ ప్రగతిశీల విప్లవ అభిమాని ఒక పత్రిక వెలువరించి రాజకీయ అధి నాయకుడితో ఆవిష్కరింపచేయడం విచిత్రం కాదు. కాని దానిని ఆమోదించే విప్లవ సాహిత్య శిబిరం నేతల చేష్టని గమనించాల్సిన సందర్భం ఇది.
***
ఇక మరికొందరు రచయితలు కేవలం జయంతులు, వర్ధంతులు ఎప్పుడా అని ఎదురుచూస్తూ నిరంతరం వాటిపైనే వ్యాసాలు రాయడం చూస్తుంటే సాహిత్య విషయకంగా వీరు మరేమీ రాయలేరా అనే అనుమానం వేస్తున్నది. ప్రతి ఏడాది అదే కవిది జయంతో, వర్ధంతో వస్తుంటుంది. శత జయంతి సందర్భంగా ప్రారంభం, ముగింపులు ఉంటాయి. ఈ రచయితలు పుంఖానుపుంఖంగా ఆ సందర్భాల్లో – రాసిన వ్యాసాలనే మరోసారి రాయడమే వారి పని. మరొక ధోరణి ఏమంటే, ఒక రచయిత పైనో, కవిపైనో వ్యాసాలు రాయడం. ఆ తరువాత ఈ కవి మళ్ళీ రాసిన ఆయనపై తిరిగి రాయడం. ఇచ్చుకుంటి వాయనం- పుచ్చుకుంటి వాయనం అన్న రీతిలో వ్యాసాలు ఎక్కువగా వస్తున్నాయి. పాత కవులు, రచయితలపై ఇతర పుస్తకాలనుండి సమాచారం గ్రహించి, తరగతి గదిలో చెప్పిన పాఠాలను వ్యాసాలుగా రాసి పత్రికలకు పంపుతున్నారు. నిజానికి వారి వ్యాసాలలో చాలావరకు లోగడ ముద్రితమైన వ్యాసాల నుండి, పుస్తకాలనుండి గ్రహించిన విషయాలే ఎక్కువ. ఎవరైనా చూస్తారు అనే ఆలోచన లేకుండా రాయడం జరుగుతున్నది.
సాహిత్య పేజీలను రచయతలు వ్యక్తిగతంగా వాడుకోవాలని చూసే దృక్పథం ఎక్కువగా కనుపిస్తోంది తప్ప, సాహిత్య విశే్లషణ, చర్చ, విలువలు వంటి అంశాలపై అంత ఆశించిన రీతిలో వ్యాసాలు రావడం లేదన్నది వాస్తవం. అలాంటి వ్యాసాలు రాసే విమర్శకులు తగ్గిపోయారా? అలాంటి విమర్శ అవసరంలేదని భావిస్తున్నారా? నిజానికి సాహిత్య విమర్శ స్థాయి దిగిపోవడానికి కారణాలు వేరే ఏమైనా ఉన్నాయా అని ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.
అవును. ఇదివరకటిలా సాహిత్యరూపం ఒకే మొత్తంలో ఘనీభవించి లేదు. అంటే ఏక ఖండంగా లేదు. వర్తమానంలో అది భిన్న శకలాల్లా విభాజితమై ఉంది. అది ప్రవాహంలా కనుపిస్తోంది. అస్తిత్వ ఉద్యమసాహిత్య ప్రవాహాలు అనేకం. అవి ఏకశిలా సదృశంగా లేవు. మన సమాజం కూడా అలాగే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటువల్ల తెలుగు సాహిత్య స్వరూపం, స్వభావం గురించి మాట్లాడ్డం కొంత క్లిష్టతకు గురిచేస్తున్నది. నిర్దిష్టతకు లొంగడం లేదు. ఐనా సాహిత్య విలువలు, ఆలోచనలు ఒక రకంగానే ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. కన్నడ, మరాఠీ, తమిళ సాహిత్యాల కథలు, నవలలు, నాటకాల గురించి మాట్లాడుకున్నప్పుడు వాటి రచనాశక్తి, ఇతివృత్తం, శైలి, భాషల గురించి మాట్లాడుతాం. రచన ప్రాశస్థ్యం, శక్తి, రచయిత ప్రతిభల గురించి చూస్తాం. ప్రక్రియాపరంగా పరిశీలించడం ఎక్కడైనా ఒక్కటే. దేశ కాల పరిస్థితిని బట్టి ఐదు పది శాతం తేడాలు ఉంటే ఉండవచ్చును. అది ఎక్కువగా ఇతివృత్తానికి సంబంధించినదై ఉంటుంది.
తెలుగులో మంచి రచనలు రాకపోవడంవల్ల మంచి విమర్శ రావడం లేదని ఒక అభిప్రాయం. కాని మంచి సాహిత్యం వెలువడడానికి బలమైన విమర్శ అవసరం. సద్విమర్శ నవ్యసాహిత్య సృజనకు ఊతం ఇవ్వగలదు. స్తబ్దుగా ఉన్న సాహిత్య సమాజంలో ఆలోచనలు రేకెత్తించడం విమర్శకులు బాధ్యత.
సాహిత్య విమర్శకుల మీద విమర్శ చేయడం అవసరం అనిపిస్తోంది. వృత్తి, ప్రవృత్తి విమర్శకులు తగ్గిపోయిన కాలంలో ఎవరిని ఏమి అనగలరు. అది సమాజం ఇచ్చిన అనధికార బాధ్యత. దానిని ధైర్యంగా, సమర్థంగా పాటించడం విమర్శకుని ధర్మం. నిజానికి అస్తిత్వ సాహిత్య పాయలు పెరిగాక విమర్శ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఆ సాహిత్యాల అంతర్గత విమర్శ, బాహ్య విమర్శల మధ్య ఏకీభావం కుదరలేదు. దళిత, స్ర్తివాద సాహిత్యాలపై ఇతర వర్గాలవారు విమర్శ చేసినప్పుడు ‘వ్యక్తి’ కేంద్రంగా ప్రతి విమర్శ జరిగింది. దానివల్ల అసలు విమర్శ చేయడమే తగ్గిపోయింది. ఒక్కొక్కప్పుడు కేవలం మెప్పుకోలుకే విమర్శ పరిమితం అయింది. ఇలాంటి విమర్శ పుస్తకాల ముందు మాటలలో, సభలలో ఉపన్యసించినప్పుడో బయటపడింది. అంటే విమర్శేతర మార్గాలలో వ్యక్తం అయ్యింది. అంతే తప్ప ఒక విమర్శ చట్రంలోంచి నిశజూజఔళశజూళశఆగా వెలువడ లేకపోవడం గమనించాలి. దృక్పథ విమర్శ అంటే, మార్క్సిస్టు విమర్శ, దళితవాద సాహిత్య విమర్శ, స్ర్తివాద సాహిత్య విమర్శ, ప్రాంతీయవాద సాహిత్య విమర్శ దేనికది విడివడిగానైనా సమగ్రంగా ఎదగలేదు. కలగలసిన అస్తిత్వ సాహిత్య దృక్పథం అయినా ఒకటి ఏర్పాటుకాలేదు. ఇకపోతే ప్రక్రియాపరంగా విమర్శ కూడా ఎదగవలసినంత ఎదగలేదు. ప్రక్రియ గురించి మాట్లాడితే రూప విమర్శ అని కొట్టిపడేసిన ప్రగతిశీల సాహిత్యకారులు ప్రతిగా దానిని తాత్వికంగా ఎలా చూడాలో చెప్పలేకపోవడం కూడా ఒక లోటే. నిజానికి పాత విమర్శసూత్రాలు, చూపు, దృక్పథాలు ఇవ్వాళ పాతపడిపోయాయి. ఏ విమర్శకుడైనా సమాజాన్ని ముందుకు నడపగలిగే ఆలోచనతో విమర్శ విధానాన్ని తనకైతాను రూపొందించుకోవలసి వస్తున్నది. మార్క్సిస్టు పడికట్టు పారిభాషిక పదాలతో చేసిన విమర్శకూడా బలహీనపడింది. ప్రత్యామ్నాయ సాహిత్య రంగాన్ని గుర్తించని ఆ విమర్శకులు మెల్లిమెల్లిగా ఆ రంగంనుండి నిష్క్రమించి ఘనీభవించిపోయారు. కొత్త తరం, కొత్తతరహా విమర్శ అప్పుడప్పుడు కనుపించినా అదీ స్థిరం కాలేదు. ఈ నేపథ్యంలో తెలుగు విమర్శ దిక్కుతోచక బలహీనపడింది. తన చేతగానితనం వలలో తానే చిక్కుకుపోయింది.
ఇప్పుడు విమర్శక రక్షకులు లేని సాహిత్యం బలహీనపడింది, దిగాలుగా కానవస్తున్నది. యువతరం పట్టించుకోని తల్లిదండ్రుల మాదిరి సాహిత్యం సుక్కి వడలిపోతోంది. ఎక్కువగా పాత తరం, అతి కొద్దిమంది యువతరం కనిపిస్తూ ఉన్నా భావితరం సాహిత్యానికి దగ్గర కారేమో అనే ఆలోచన అందరిలోనూ పెనుగులాడుతున్నది. అందుకే సాహిత్య భవిష్యత్తు గురించి నిరాశాజనకమైన అభిప్రాయాలు వినవస్తున్నాయి. వాటిని అబద్ధం అని కొట్టిపారేయగలిగే రోజులు రావాలి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గ్రంథాలయ సాహితీమూర్తి వెలగా వెంకటప్పయ్య

గ్రంథాలయ సాహితీమూర్తి వెలగా వెంకటప్పయ్య

  • – సన్నిధానం నరసింహశర్మ, 9292055531
  • 05/01/2015
TAGS:

–స్మృతి–
వెలగా వెంకటప్పయ్య పేరు వినగానే గ్రంథాలయ రంగం ఠకీమని గుర్తుకు రావడమే ఆ రంగంతో ఆ వ్యక్తి శక్తి ఎంతగా మమేకమయిందో తెలుస్తుంది. అందుకు ఎన్ని నాళ్ళు ఎన్ని ఏళ్ళు సేవ చేస్తే దక్కుతుంది ఆ యశస్సు. అయ్యంకి వెలగా ‘నా వారసుడు’ అని ప్రకటించారు. ‘విజ్ఞాన వికాస’ విధానంలో వెలగా సిద్ధ‘హస్తు’డని వావిలాల శ్లాఘించారు. ‘విజ్ఞానం, కృషి ఈ రెండింటి దృష్ట్యా వెలగా స్థానం అగ్రశ్రేణిలో ఉన్నదనే దేవులపల్లి రామానుజరావు ప్రశంసలో ఆలోచనాత్మక విశే్లషణ ఇమిడి వుంది. కొందరు ఉద్యమపు పెద్దలు, కొందరు శాస్ర్తియ రంగపు పెద్దలూ వున్న కాలంలో గ్రంథాలయ ఉద్యమానికి ఆధునిక గ్రంథాలయ శాస్త్ర విజ్ఞానానికి వారధిగా నిలవడం వెలగా ప్రత్యేకత. తెలుగు సాహిత్యశాఖల్లో గ్రంథాలయ సాహిత్యశాఖ కూడా సరస్వతీ నదిగా సాక్షాత్కరిస్తుంది. ఎప్పుడో కాశీనాధుని నాగేశ్వరరావు ఆంధ్ర వాఙ్మయ సూచిక ఇప్పటికీ సాహితీ పరిశోధకులకు మార్గదర్శిగా ఉంటున్నట్లే వెలగావారి గ్రంథ సూచులు గ్రంథాలయ సాహితీ పరిశోధకులకు నూతన శాస్ర్తియ పద్ధతుల్లో మార్గదర్శకాలవుతాయి.
1956లో గుంటూరు జిల్లా రేపల్లె శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ పాలకునిగా చేరికనుండి తీరిక లేకుండా ఒక ప్రక్క సాంకేతిక సంబంధ గ్రంథాలు వ్రాస్తూ మరోప్రక్క తెలుగు సాహితి వెలగాలని తమవంతు సేవలు ఆయన అందిస్తూనే వున్నారు అని ఆయన దినచర్యా విశేషాలయ్యాయి. చిన్న స్థాయినుండి పెద్ద స్థాయివరకు గ్రంథాలయ పాఠ్యగ్రంథాల రచయితగా ఆయన వనె్నకెక్కారు. ఆంగ్లంలో కూడా గ్రంథ రచన చేయడంతో దేశీయంగానూ పేరుపొందారు. కడపలో సి.పి. బ్రౌను గ్రంథాలయానికి నిర్మాణ పథక రూపకల్పన వెలగావారే చేశారని జానుమద్దివారే ప్రకటించారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వాషింగ్టన్, భారత ప్రభుత్వాలు కలసి చేబట్టిన భారతీయ ప్రచురణల మైక్రో ఫిల్ముల పథకానికి వెలగా సహకారమందించారు.
నార్ల వెంకటేశ్వరరావు శత జయంతి స్మరణిక సంపాదకుని ఆయన ‘సాహిత్య రంగంలో నార్ల’ అనే ప్రకరణాన్ని ప్రయోజనవంతంగా తీర్చారు. భావ విప్లవకారుడు నార్ల వంటి విశేష వ్యాసాలను ఆయన సాహితీ లోకానికందించారు. సాహితీ పరిశోధకులకు ఆయన గాంధీ వాఙ్మయ సూచి, రవీంద్ర వాఙ్మయ సూచి వంటివి వినియోగార్హతను తెలిపాయి. దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత చక్రపాణిపై ఆయన సంపాదకుడుగా వచ్చిన చక్రపాణీయం పసగల వైవిధ్య భరిత ‘చక్రపాణి’ రుచుల్ని ఎన్నో అందించింది. చక్రపాణి అనువాదకథా రచనలు సినిమా సాహిత్య రచనా నైపుణ్యాలపై ఆ గ్రంథం ఉత్తమోత్తమ గ్రంథం అని అందలి వింగడింపులు హేమాహేమీ రచనల సేకరణలే చెబుతాయి. చక్రపాణిపై వెలగావారు రాసిన గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించి రచయిత ప్రతిభని తెలిపింది. మహీధర జగన్మోహనరావుతో కలిసి వెంకటప్పయ్య తయారుచేసిన ఆంధ్ర వాఙ్మయ సంగ్రహ సూచిక శ్రమైక సాధ్యఫలం ‘తెలుగు చదువు చాలా తేలిక’ అనే వెలగా వయోజన విద్యాపుస్తకం ప్రయోజనదాయకమై పలు పునర్ముద్రణల్ని చూసింది. మూడువేల పైచిలుకు పొడుపు కథల్ని సేకరించి, వింగడించి శాస్ర్తియ దృష్టితో మనకందించిన సాహిత్య సేవకుడు వెలగా. రాయలసీమ పొడుపు కథల్ని ప్రత్యేకంగా ఆయన సేకరించారు. తెలుగు బాల సాహితీ వికాసం ఆయన నుండి వచ్చిన మంచి సిద్ధాంత గ్రంథం. పెద్దగా లోతులు లేకపోయినా ఆయన ‘తెలుగు ముద్రణ వికాసం’ గ్రంథం సేకరణాధిషణత్వం కలిగి వెలిగింది. సి.పి.బ్రౌను నిఘంటువుల్ని పునర్ముద్రింపజేయడంలో శంకర నారాయణ తెలుగు- ఇంగ్లీషు, ఇంగ్లీషు తెలుగు నిఘంటువులను పునర్ముద్రింపజేయడంలో ఆయన పరిశ్రమ ప్రశంసనీయం. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన తెలుగు నిఘంటు వికాసం గ్రంథాన్ని రాసి నిఘంటు పరిణామాల్ని అక్షరబద్ధం చేశారు. తెనాలి చరిత్ర- సంస్కృతి వంటి ఎన్నో గ్రంథాలకు ఆయన సంపాదకుడయ్యారు. విశిష్ట గ్రంథ సంపాదకులలో ఆయన ఒకరుగా నిలద్రొక్కుకున్నారు.
పొడుపు కథలకు ఆయన ‘పర్యాయ పదాలిస్తూ’ అడ్డుకతలు, ఒడ్డుకతలు, కథ కట్టు పద్యాలు, చిక్కుముళ్ళు, చిట్కాలు, చిటుకులు, మారుతట్లు, యక్ష ప్రశ్నలు, విడుపు కథలు అని ఇస్తూ శాత్రాలు (శాస్త్రాలు), సమచ్చలు (సమస్యలు) అని ఇవ్వడంలో ప్రజావ్యవహారాన్ని కాదనక పోవడంలో కొంచెం ముందుకు వచ్చారనే అనిపిస్తుంది. బాల గేయాలు ఇవ్వడంలోనూ, క్రైస్తవ బాలగేయాలు ప్రత్యేకంగా ఇవ్వడంలో ఆయన విశాల దృష్టి తెలుస్తోంది. విజయవాడ నవరత్న బుక్‌హౌస్ వారిచే ఆయన పాత బంగారం పేర ధారావాహిక ఉద్గ్రంథ ప్రచురణలు జాతి మరువలేనివి వేయించారనిపిస్తుంది.
పాత బంగారం/ తెలుగు శతక మంజరి ఉద్గ్రంథం. ఇందులో మూడువేల పద్యాలుంటాయి. వేమన భాస్కరాది శతకాలతోపాటు గుమ్మా సాంబశివరావు రాసిన సెల్‌ఫోన్ శతకంలో కొన్ని పద్యాల్ని ప్రచురించడం ఆయన ఆధునిక కాలజ్ఞాన ఉదాహరణం.
‘‘శిశువు ఏడ్చుచుండ చెంత జేరిన తల్లి/
జోలపాట లేక లీలగాను/ సెల్లుఫోను తెచ్చి
చెవిలోన మోగించె/ సెల్లుఫోను మహిమ చెప్పతరమె – వంటివి అందులో ఉన్నాయి.
పాత బంగారం-2గా పొడుపు కథల పెద్ద పుస్తకం తయారుచేశారు. పొడుపు కథల తాత్త్విక భూమికలందులో ఇచ్చారు. పాత బంగారం-3గా తెలుగు సామెతల పెద్ద పుస్తకం ప్రకటింపజేశారు.
తమకు ముందు వచ్చిన పరిశోధనా గ్రంథాల్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ స్వీయ సేకరణల్నీ, శాస్ర్తియ సమాచారాన్ని చేర్చి ప్రజలకందించాలనే ఆయన నిత్యతపన ప్రతి సాహితీ గ్రంథంలో కనబడుతుంది. వంద పరిశోధనలకు ఇంద సమాచారం, విజ్ఞానం అంటూ స్వాగతిస్తాయి ఆయన గ్రంథాలు. తెనాలి, ఐతానగరంలో గ్రంథాల మధ్యలో వెలిగే వెలగా ఇప్పుడు మన మధ్యలో లేరు. కాలధర్మమైనా వెలితే. ఆయన భౌతిక కాయానికి వీడ్కోలు పలికామే కాని, ఆయన గ్రంథాలకి గ్రంథాలయాలు స్వాగతాలాపనలు చేస్తూనే వున్నాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వంద సినిమాలకు ”పాత్రోచిత ”రచన చేసిన గణేష్ పాత్రో

ప్రముఖ సినీ రచయిత గణేష్‌ పాత్రో కన్నుమూత

కేన్సర్‌తో చెన్నైలో మృతి
కేన్సర్‌తో చెన్నైలో కన్నుమూత

చెన్నై, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): దేవుడు సర్వాంతర్యామి అని మనం అనుకుంటాం. కానీ.. అసలు సిసలు సర్వాంతర్యామి ఆకలి అని చెప్పిన మాటల మాంత్రికుడు.. గణేష్‌ పాత్రో(69)! మరోచరిత్ర.. ఇది కథ కాదు.. ఆకలి రాజ్యం.. అంతులేని కథ.. రుద్రవీణ.. స్వాతి.. సీతారామయ్యగారి మనవరాలు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇలా ఎన్నో హిట్‌ చిత్రాలకు సంభాషణలు సమకూర్చిన ఆ ప్రముఖ రచయిత ఇక లేరు! సముద్రమంత లోతున్న జీవితసత్యాలను సైతం అలతి అలతి పదాల్లో అల్లి సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా.. గుండె ఆర్ద్రమయ్యేలా.. రాసిన ఆ కలం ఆగిపోయింది!! చాలాకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. తొలుత నోటి కేన్సర్‌కు గురైన పాత్రో దాన్నుంచి బయటపడినా తర్వాత అది ఎముకలు, కాలేయానికి కూడా వ్యాపించడంతో కొన్ని రోజుల క్రితం స్థానిక నందనంలోని వెంకటేశ్వర ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పాత్రోకు భార్య లక్ష్మీకుమారి, ఇద్దరు కుమార్తెలు కనకమహాలక్ష్మి, సంయుక్త, కుమారుడు సీతారాం పాత్రో ఉన్నారు. కెనడాలో ఉంటున్న సీతారామ్‌.. నాలుగురోజుల క్రితమే చెన్నైకి వచ్చారు. స్థానిక టి.నగర్‌ కన్నమ్మపేట శ్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం 3గంటల తర్వాత ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
పార్వతీపురంలో పుట్టి..
బీఎస్‌ గణేష్‌ పాత్రోగా అందరికీ సుపరిచితులైన ఆయన అసలు పేరు బెహర సత్య గణ గంగ వెంకట రమణ మహా పాత్రో. విజయనగరం జిల్లా పార్వతీపురం ఆయన స్వస్థలం. 1945 జూన్‌ 22న పాత్రో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు.. ఆదిలక్ష్మి నారాయణ పాత్రో, సూర్యకాంతం. ఆ దంపతులకు 17 మంది పిల్లలు. తొలుత ఐదుగురూ ఆడపిల్లలే కావడంతో మగబిడ్డ కోసం ఎందరో దేవుళ్లను ప్రార్థించాక పుట్టిన బిడ్డ కావడంతో పాత్రోకి అంత పెద్ద పేరు పెట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గణేష్‌ పాత్రో విద్యాభ్యాసమంతా పార్వతీపురంలోనే సాగింది. బి.ఎ. పూర్తయ్యాక విశాఖపట్టణంలో పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్స్‌ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా కొన్నాళ్లు పనిచేశారు. చిన్నతనం నుండే ఆయనకి నాటకాలు, రచనలపై మక్కువ ఏర్పడింది. క్రమేపీ నాటక రచనలో ఆయనకి పట్టు దొరికింది. ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’, ‘లాభం’, ‘అసుర సంధ్య’, ‘ఆలోచించాలి’ వంటి అద్భుతమైన నాటకాలను రాశారు. ఆ సమయంలోనే ఆనాటి ప్రముఖ రంగస్థల నటుడు కుప్పిలి వెంకటేశ్వర రావుతో పాత్రోకి పరిచయం కలిగింది. ఇద్దరూ కలిసి నాటకాలు వేసేవారు. ‘‘అయితే రచన లేదా నటన ఏదో ఒకదానినే ఎంచుకుంటే అద్భుతంగా రాణించగలవు. రచయితగా నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావని నాకు నమ్మకముంది’’ అని వెంకటేశ్వరరావు సలహా ఇచ్చారు. దాంతో పాత్రో పూర్తిగా రచనపైనే దృష్టి సారించారు. కుప్పిలి కుమార్తెనే పాత్రో పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి, పెద్దల అంగీకారంతో లక్ష్మీ కుమారిని జీవిత భాగస్వామిగా చేసుకొన్నారు. అక్కినేని అంటే ఇష్టపడే పాత్రో.. ఆయన సినిమాలు చూసి చిత్రరంగంపై మక్కువ పెంచుకున్నారు. విశాఖ నుంచి చెన్నైకి చేరుకుని సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పట్లో బాలచందర్‌ పరిచయంతో ఆయన తీసిన చిత్రాలకు తెలుగులో తానే మాటలు రాశారు. మొత్తం తన కెరీర్‌లో 100కి పైగా సినిమాలకు మాటలు రాశారు. అందులో ఎక్కువ భాగం సూపర్‌ హిట్‌లే. వెంకటేష్‌, మహేష్‌బాబుల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013లో) పాత్రో ఆఖరి సినిమా. ఇక అతికొద్ది సినిమాల్లో నటుడిగానూ మెరిశారు పాత్రో. వడ్డే నవీన్‌ నటించిన ‘శ్రీ బాలాజీ’ చిత్రంలో కీలకపాత్ర పోషించి మెప్పించారు.

మాటల సవ్యసాచి (03-Jan-2015)
నాటక రంగం నుంచి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి, కె. బాలచందర్‌ వంటి దిగ్దదర్శకుడిని మెప్పించి, ఆయన తెలుగు చిత్రాల ఆస్థాన సంభాషణల రచయితగా పేరుపొందడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి చరిత్రను సాధించిన రచయిత గణేశ్‌ పాత్రో. ఆయన సంభాషణలు రచించిన సినిమాలే రచయితగా ఆయన గొప్పతనమేమిటో తెలియజేస్తాయి. ఫ్యామిలీ సినిమాలైనా, సీరియస్‌ సినిమాలైనా, ప్రేమకథలైనా.. ఏదైనా సరే, తనదైన ప్రత్యేకశైలి సంభాషణలతో మెప్పించిన మాటల సవ్యసాచి పాత్రో. విశాఖ నుండి చెన్నైకి వచ్చారు. 100కిపైగా సినిమాలకు మాటలు రాశారు. 1976లో కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ‘అత్త వారిల్లు’ చిత్రంతో సినీ మాటల రచయితగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. 1978లో వచ్చిన కె. బాలచందర్‌ సినిమా ‘మరోచరిత్ర’ ఆయన కెరీర్‌ని మలుపుతిప్పింది. అక్కడ నుండి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. బాలచందర్‌ తీసిన తెలుగు సినిమాలన్నింటికీ పాత్రోనే మాటల రచయిత. వాటిలో ‘గుప్పెడు మనసు’, ‘ఇది కథ కాదు’, ‘తొలికోడి కూసింది’, ‘ఆకలి రాజ్యం’, ‘రుద్రవీణ’ వంటి ఎన్నో అపురూ పమైన సినిమాలున్నాయి. ఇక 1984లో వచ్చిన ‘మనిషికో చరిత్ర’, ‘మయూరి’, ‘మంగమ్మగారి మనవడు’, ‘స్వాతి’, 1985లో వచ్చిన ‘ప్రేమించి పెళ్లాడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, 1988లో వచ్చిన ‘మురళీకృష్ణుడు’, 1989లో వచ్చిన ‘ముద్దుల మావయ్య’, 1991లో వచ్చిన ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘నిర్ణయం’, ‘జానకిరాముడు’, 2001లో వచ్చిన ‘9 నెలలు’ చిత్రాలు పాత్రోకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ‘9 నెలలు’ తర్వాత పన్నెండేళ్ల విరామంతో 2013లో వచ్చిన వెంకటేశ్‌, మహేశ్‌ సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, పాత్రో ఆఖరి సినిమా. ‘అందమైన అనుభవం’, ‘నిర్ణయం’ చిత్రాల్లో పాటలు రాశారు. ఇక అతికొద్ది సినిమాల్లో నటుడిగాను మెరిశారు పాత్రో. వడ్డే నవీన్‌ నటించిన ‘మా బాలాజీ’ చిత్రంలో కీలకపాత్ర పోషించి మెప్పించారు.
అవార్డులు…
పాత్రో ప్రతిభకి పలు అవార్డులు పాదాక్రాంతమయ్యాయి. ‘స్వాతి’, ‘మయూరి’, ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘ఆకలిరాజ్యం’ చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో సంస్థల సన్మానాలు అందుకున్నారు.
‘మనవడా.. నీతో సినిమా
చెయ్యాలి అనేవారు
‘‘గణేష్‌ పాత్రోగారు నాకు తాతయ్య వరుస. ఆయ నకి గొల్లపూడి మారు తీ రావుగారు క్లోజ్‌ ఫ్రెండ్‌. వారిద్దరూ గంటలు గంటలు మాట్లాడుకునే వారు. మధ్యలో ఆయన ఫోన్‌ చేసి ‘మనవడా… నీ సంగీతం, సినిమాల గురించే డిష్కషన్‌ చేసుకుంటున్నాం’ అనే వారు. ఆ సమయంలో చాలా గర్వంగా అనిపించేది. పనిమీద ప్రేమ ఉండే వ్యక్తి. చేసే పనికి వందశాతం న్యాయం చేయాలనే ఆయన ఆలోచన నాకు స్ఫూర్తి. చిన్న డైలాగ్‌తో సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేట్లు చెప్పగల ఇంటెలెక్చువల్‌ ఆయన. ‘ఆకలిరాజ్యం’, ‘రుద్రవీణ’ చిత్రాల్లో ఆయన రాసిన సంభాషణలంటే నాకు ఆరాధన. నేను చేసిన ‘బ్రోకర్‌’ చిత్రం చూసి ‘మనవడా… నీతో సినిమా చెయ్యాలి, నీ థాట్‌ నాకు చాలా బాగా నచ్చింది… నీ తదుపరి చిత్రానికి నేను వర్క్‌ చేస్తా… ఏమంటావ్‌?’ అన్నారాయన. చాలాసార్లు ‘నేను నీ తాతను కాబట్టి పొగడకూడదు కానీ.. గ్రేట్‌ మనవడా’ అనటం నా మనసుకి మంచి అనుభూతి కలిగింది.
చాలామందికి తెలీని విషయం కృష్ణ, రామ్మోహన్‌ను హీరోలుగా పరిచయం చేస్తూ ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘తేనె మనసులు’ చిత్రానికి మిగతావాళ్లతో పాటు పాత్రో సైతం ఓ పాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్ర్కీన్‌ టెస్ట్‌కు సైతం ఆయనను పిలిచారు. అయితే ఆ ఉత్తరాన్ని అందుకున్న వాళ్ల నాన్న దీనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వెళ్లలేకపోయారు.
పాత్రో దర్శకత్వంలో ‘ప్రతిమ’ అనే చిత్రం 1986లో ప్రారంభమైంది. విశాఖపట్నంలో కొంత షూటింగ్‌ జరిగాక, ఆగిపోయింది. అది పూర్తయివుంటే, నటి గౌతమికి అదే మొదటి సినిమా అయ్యేది. ఉషాకిరణ్‌ మూవీస్‌ తలపెట్టిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పనిచేశారు. తెలీని కారణాల వల్ల సినిమా ఆగిపోవడంతో దీని కోసం రికార్డ్‌చేసిన పాటలను ఆ తర్వాత వేరే సినిమాలకు ఉపయోగించుకున్నారు.
ఆత్రేయ – పాత్రో
ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ (పీఏపీ) నిర్మించిన ‘అత్తవారిల్లు’ చిత్రానికి రచయితగా పాత్రోకు అవకాశమిచ్చారు, దాని దర్శకుడు కె. ప్రత్యగాత్మ. ఆ రోజుల్లో పాత్రో వద్ద పెద్దగా డబ్బులు లేవు. స్కూల్లో చదువుకుంటున్న ఆయన ఇద్దరు పిల్లలకు ప్రవేశ రుసుము కూడా కట్టలేని దుస్థితి! పెద్ద బేనర్‌లో అవకాశం వచ్చిందన్న ఆనందం ఓ వైపు, తన పారితోషికాన్ని ఎలా అడగాలనే సంశయం మరోవైపు. అప్పుడు ఆత్రేయ ఆయనను ఆదుకున్నారు. పీఏపీ సంస్థ నుంచి పారితోషికం డబ్బులేవైనా అందాయా, లేదా అని పాత్రోని అడిగారు. అందలేదని పాత్రో చెప్పడంతో, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని వాకబుచేసి, తన అసిస్టెంట్‌ను పంపి, పిల్లల స్కూలు ఫీజులు కట్టేశారు. మరికొంత డబ్బు పాత్రో చేతుల్లో పెట్టారు. అయితే ఆ తర్వాత పీఏపీ నుంచి ఆయనకు పారితోషికం అందింది. ఈ విషయం చెప్పి, ఆత్రేయ సాయం చేసిన డబ్బును తిరిగివ్వబోయారు పాత్రో. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్‌కు పాత్రోను పరిచయం చేసింది కూడా ఆయనే. మలయాళంలో హిట్టయిన ఓ సినిమాని ఈరంకి శర్మ తెలుగులో ‘చిలకమ్మ చెప్పింది’ పేరుతో రూపొందించారు. దానికి బాలచందర్‌ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. సెట్స్‌ మీద కూడా దర్శకుడితో ఎక్కువ సమయం వెచ్చించగల రచయిత కావాలని బాలచందర్‌గారు అనుకున్నారు. అప్పట్లో ఆత్రేయ బాగా బిజీగా ఉన్నారు. బాలచందర్‌ అసిస్టెంట్‌ అయిన అనంతుకు పాత్రోని పరిచయం చేశారు. పాత్రో రంగస్థల నేపథ్యం తెలుసుకున్న అనంతు ఆయనను బాలచందర్‌ వద్దకు తీసుకుపోయారు. అలా ‘చిలకమ్మ చెప్పింది’ చిత్రానికి పనిచేశారు పాత్రో. ఆయన పనితనం బాలచందర్‌కు బాగా నచ్చింది. కమల్‌హాసన్‌ హీరోగా ‘మరో చరిత్ర’ను తెలుగులో తీయాలని బాలచందర్‌ సంకల్పించారు. ఆత్రేయతోటే సంభాషణలు రాయించాలని ఆయన అనుకున్నారు. అయితే ఆరోగ్య కారణాలతో ఆయనతో పాటు సెట్స్‌పై పూర్తి సమయం వెచ్చిం చే స్థితిలో ఆత్రేయ లేరు. అందుకని ఆయన స్థానంలో రచయితగా పాత్రోని తీసుకుంటానని ఆత్రేయకు చెప్పారు బాలచందర్‌. ఆత్రేయ ఏమాత్రం నొచ్చుకోకుండా పాత్రోని మనసారా ఆశీర్వదించారు. అలా బాలచందర్‌తో పాత్రో అనుబంధం మొదలైంది. అందుకే చిత్రసీమలో రచయితగా తను ఎదగడానికీ, పేరు తెచ్చుకోవడానికీ ఆత్రేయ ఆశీస్సులే కారణమని పాత్రో ప్రగాఽఢంగా నమ్మేవారు.
బాలచందర్‌ – పాత్రో
చిత్రసీమలో బాలచందర్‌తో దాదాపు ఇరవై ఏళ్లపాటు కలిసి ప్రయాణించారు పాత్రో. సున్నిత మనస్కుడిగా పేరున్న బాలచందర్‌ తన చుట్టూ ఉన్న మనుషుల పట్ల చాలా శ్రద్ధ చూపుతారు. అయితే నిర్లక్ష్యాన్ని ఆయన ఏమాత్రం సహించరని పేరు. అలాంటి ఆయన ముందు సిగరెట్‌ తాగడానికి అనుమతి ఉన్న ఏకైక వ్యక్తి పాత్రో అనేది నిజం. ఆ రోజుల్లో పాత్రో చైన్‌ స్మోకర్‌గా పేరుపొందారు. బాలచందర్‌ ముందు సిగరెట్లు తాగడానికి ఎవరూ ధైర్యం చేసేవాళ్లు కాదు. షూటింగ్‌ మధ్యలో సిగరెట్‌ తాగడం కోసం సెట్స్‌ బయటకు వెళ్లేవారు పాత్రో. ఆయన కంటిముందు కనిపించకపోవడంతో వాకబు చేసేవారు బాలచందర్‌. పాత్రో సెట్స్‌ మీదకు వచ్చాక, ఎక్కడికెళ్లావని అడిగేవారు. సిగరెట్‌ తాగడానికి వెళ్లానని పాత్రో చెప్పేవారు. ఓ వారం రోజుల పాటు ఇదే కొనసాగడంతో ఆయన పాత్రోని పిలిచి ‘‘ఇక్కడున్న వాళ్లలో దాదాపు అందరూ సిగరెట్‌ తాగేవాళ్లే. కానీ అలాంటి అలవాటే లేని మంచివాళ్లుగా నా దృష్టిలో పడాలని ప్రయత్నిస్తుంటారు. నువ్వొక్కడివే ధైర్యంగా సిగరెట్‌ తాగుతున్నానని చెప్తున్నావ్‌. షూటింగ్‌ జరిగే టైమ్‌లో నువ్వు సెట్స్‌ మీదే ఉండటం నాక్కావాలి. కాబట్టి, నా ముందే నువ్వు నిరభ్యంతరంగా సిగరెట్‌ తాగొచ్చు. దానివల్ల ఇద్దరికీ సమయం కలిసొస్తుంది’’ అన్నారు. షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పాక తర్వాత తీయాల్సిన సన్నివేశాల గురించి చర్చించుకుని, ఎవరి వెర్షన్‌లో వాళ్లు డైలాగ్స్‌ రాసేవాళ్లు ఆ ఇద్దరూ. మరుసటి రోజు షూటింగ్‌ మొదలుపెట్టే ముందు మాత్రమే వాళ్లు ఒకరి డైలాగ్స్‌ను మరొకరు చూసుకునేవాళ్లు. ఇక్కడ విశేషమేమంటే, పాత్రో సంభాషణల స్థాయిలో తన తమిళ వెర్షన్‌ డైలాగ్స్‌ లేవని భావించిన బాలచందర్‌, వాటిని మరింత బాగా రాయడం కోసం షూటింగ్‌ను వాయిదా వేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఓ ద్విభాషా చిత్రం తమిళ వెర్షన్‌కు ‘నూల్‌ వేలి’ (దారపు హద్దు) అనే టైటిల్‌ పెట్టారు బాలచందర్‌. తెలుగుకు ఆ టైటిల్‌ నప్పదని చెప్పిన పాత్రో, ‘గుప్పెడు మనసు’ టైటిల్‌ సూచించారు. దాన్నే తెలుగు సినిమాకు పెట్టారు బాలచందర్‌. ఆ టైటిల్‌ ఆయనకు ఎంత నచ్చిందంటే తర్వాత కాలంలో తను తీసిన ఓ టీవీ సీరియల్‌కు ‘గుప్పెడు మనసు’ అనే పేరు పెట్టారు. అదీ పాత్రోకు ఆయనిచ్చిన గౌరవం, విలువ!

డెభ్బై – తొంభైలలో సినిమాలు చూసిన వాళ్లకు –
సినిమాల పేర్లు గుర్తుకున్నాయో లేదో తెలియదు కానీ.. ‘కథ, మాటలు – గణేష్‌పాత్రో’ అనే టైటిల్‌ మాత్రం కళ్లకు కట్టినట్లు మిగిలుంది. ఎందుకంటే ఆయన డైలాగులు నవరసాల నైవేద్యం కాబట్టి! పదుల సంఖ్యలో నాటకాలు, వందకు పైగా సినిమాల రచయితగా కీర్తిగడించిన ఆయన నిన్ననే కన్నుమూశారు. ఆ సందర్భ్బంగా పాత్రో జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు ప్రముఖ తెలుగు సినీ రచయిత దివాకర్‌బాబు..
‘‘కథకు పొంతన లేకుండా, పాత్రలకు సంబంధం లేకుండా రాసే రైటర్‌ కాదు ఆయన. ఒక క్యారెక్టర్‌కు ఒక మాట రాశాడంటే.. ఆ మాట సినిమా చూస్తున్న ప్రేక్షకుడి గుండెలోతుల్లోకి దూసుకెళ్లేది. కదిలించేది. నవ్వించేది. ఏడిపించేది. ఎంతటి విషయాన్నైనా వీలైనంత క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా చెప్పడం గణేష్‌పాత్రోకు వెన్నతోపెట్టిన విద్య. ఆయన పాత్రలతో మాట్లాడించే ప్రతీమాట కథతో మమేకం అయ్యుండేది. హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రోజు రాయలేదు. అందుకే పాత్రో మాటలు పాత్రోచితంగానే మురిపిస్తాయి.
కదిలించిన నాటకాలు..
గణేష్‌పాత్రో నాటకాలు ఈ తరానికి తెలియకపోవచ్చు కాని.. మా తరాన్ని కదిలించాయవి. ఆయన ఎంత వేగవంతమైన రైటర్‌ అంటే- అప్పటికప్పుడు అనుకుని చకచకా రాసేయడంలో దిట్ట. ఒకసారి ఢిల్ల్లీలో నాటక పోటీలు జరుగుతున్నప్పుడు.. ఒక నాటకాన్ని రాయాలనుకున్నారు. అనుకున్నదే తడువు రాసి పోటీలకు పంపించి.. బహుమతి సాధించడం ఆయనకే చెల్లింది. పాత్రో రాసిన నాటకాల్లో నన్ను బాగా ఇన్‌స్పైర్‌ చేసింది ‘త్రివేణి’ నాటకం. జాతీయ భావాన్ని పెంపొందించే ఇతి వృత్తంతో వచ్చిందది. ఆ రోజుల్లో నేను కూడా అందులో ఒక పాత్ర వేసి స్టేజీ మీద నటించాను. దర్శకత్వమూ వహించాను. నన్ను నేను రైటర్‌గా తీర్చిదిద్దుకునేందుకు ఆ నాటకం ఎంతో ప్రేరణనిచ్చింది. ‘త్రివేణి’తో పాటు ‘కొడుకు పుట్టాలా?’, ‘పావలా’ వంటి నాటకాలు సైతం యువతను బాగా ఆకట్టుకున్నాయి.
మాటలు కాదు.. తూటాలు..
‘మరో చరిత్ర’ సినిమాను మనం ఎప్పటికైనా మరిచిపోగలమా? అది సాధ్యం కాదు. ప్రతి తరం ఆ సినిమాను చూస్తుంది. సినిమాతో పాటు దాని రచయిత గణేష్‌ పాత్రోను గుర్తుపెట్టుకుంటుంది ప్రేక్షకలోకం. ఆ చిత్రంలో ఒక సీను – హీరోయిన్‌ను వేధిస్తుంటాడు దుకాణం నడిపే విలన్‌. హీరోయిన్‌ ఆ షాపుకు వచ్చినప్పుడు ఒక ఫోటో ఆల్బమ్‌ తెరిచి.. నగ్నంగా ఉన్న అమ్మాయిల బొమ్మలు చూపిస్తాడతను. ఆ సందర్భంలో హీరోయిన్‌ వైపు అదోలా చూస్తూ ‘‘ఎలా ఉన్నాయ్‌?’’ అని అడుగుతాడు విలన్‌. అప్పుడు ఆ అమ్మాయి ‘‘చాలా బాగున్నాయ్‌! ఎవరివి మీ అమ్మవా?’’ అంటుంది. వాడికి అంతకంటే తగిన సమాధానం ఇక ఏ మాటలో దొరుకుతుందో చెప్పండి? ఇలా ప్రతీ డైలాగు ఎంత శక్తివంతమైనదో సినిమా చూసినవాళ్లకు అర్థం అవుతుంది.
ఇదే సినిమాలో మరోచోట – హీరోయిన్‌ను ‘‘అమ్మా, నీ బొట్టు ఏమైంది?’’ అనడుగుతాడు వాళ్ల అన్నయ్య. అప్పుడామె ‘‘కన్నీటి బొట్టు అయ్యింది’’ అంటుంది. అతను అడిగిన ప్రశ్నకు, ఆమె ఇచ్చిన సమాధానంతో ఆ సన్నివేశపు భావం ప్రేక్షకులకు సులువుగా అర్థం అవుతుంది.
రచయితలంటే గౌరవం..
నేడు రచయితలకు తోటి రచయితల మీద ఏమాత్రం గౌరవం ఉంటున్నదో అందరికీ తెలిసిందే! ఎవరో రాసిన కవితలను, పాటలను సినిమాల్లో వాడుకుని పేర్లు వేసుకునేవాళ్లున్న కాలం ఇది. ఆ రోజుల్లో గణేష్‌పాత్రోకు తోటి రచయితలంటే గౌరవం ఉండేది. ‘ఆకలిరాజ్యం’ తీస్తున్నప్పుడు- బాలచందర్‌, కమల్‌హాసన్‌లు ఇద్దరు తమిళులు. తెలుగులో ఏమి రాసినా వారేమీ పట్టించుకోరు. అలాంటిది.. ఈ సినిమాలో కమల్‌హాసన్‌కు శ్రీశ్రీ కవితలను మాటలుగా పెట్టారు గణేష్‌పాత్రో. ప్రతిచోట గమనిస్తే.. ‘శ్రీశ్రీ అన్నట్లు’ అంటూ రచయితను గుర్తుచేస్తూనే కవితను ఎత్తుకుంటాడు హీరో. అంతటి గొప్ప రచయితతో నేను కలిసి పనిచేయలేదు కానీ.. చాలాసార్లు కలిసే అవకాశం వచ్చింది. నేను రాసిన ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’ చిత్రాలు కూడా ఆయనకు బాగా నచ్చాయి..’’

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుట్టుకతో అంతా ముస్లింలే! అసదుద్దీన్ ఉవాచ

పుట్టుకతో అంతా ముస్లింలే!

  ఇతర మతాలవారు ఇస్లాంను ఆశ్రయించడమే అసలైన ఘర్‌వాపసీ
ఈ దేశం మా తాతముత్తాతల గడ్డ: అసద్‌

తల్లిదండ్రులే పిల్లల మతాన్ని మార్చేస్తున్నారు
అన్ని మతాలకూ అసలైన ఇల్లు ఇస్లామే
ఇస్లాంను ఆశ్రయించడమే అసలైన ఘర్‌వాపసీ
ఆరెస్సెస్‌ వాళ్లూ వినండి.. మీరే వాపస్‌ రండి
భారతదేశం మా తాతముత్తాతల గడ్డ: అసద్‌

భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులేనని.. ముస్లింలు, 
క్రైస్తవులు ఘర్‌వాపసీలో భాగంగా హిందూమతంలోకి రావాలని ఆరెస్సెస్‌, వీహెచ్‌పీ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ బదులిచ్చారు. ‘ఆరెస్సెస్‌ వాళ్లూ వినండి..’ అని పేరు పెట్టి
ప్రస్తావించి మరీ సమాధానమిచ్చారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పుట్టుకతో ముస్లింలేనని, ఇతర మతాల వాళ్లంతా ఇస్లాంను ఆశ్రయించడమే అసలైన ఘర్‌ వాపసీ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌, జనవరి 5: సెగలు పుట్టిస్తున్న ‘ఘర్‌వాపసీ’ వివాదానికి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత ఆజ్యం పోశారు. మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘‘(మతం మార్చుకున్న) ముస్లింలకు రూ.5 లక్షలు.. క్రైస్తవులకు రూ.2లక్షలు ఇస్తారా? ఐదు లక్షలు కాదు.. ఐదు కోట్లు కాదు.. ఐదువేల కోట్లు కాదు.. ఐదు వందల కోట్ల డాలర్లు కాదు.. ప్రపంచంలో ఉన్న సంపదనంతా తెచ్చి మన కాళ్ల మీద పడేసినా అప్పుడు కూడా మనం ఇస్లాంను వదిలిపెట్టం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ.. వినండి ఆరెస్సెస్‌ వాళ్లల్లారా.. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ముస్లింగానే పుడతారు. పరిస్థితులు, వారి తల్లిదండ్రులు వారిని ఇతర మతాల్లోకి మారుస్తారు. అది మీ ఇష్టం. మీ విశ్వాసం ఏదైనాగానీ.. మా విశ్వాసం ప్రకారం ప్రతి ఒక్కరూ ముస్లింగానే పుడతారు. మీరే రండి వాపస్‌’’ అన్నారు. తమ విశ్వాసం ప్రకారం ప్రపంచంలోని అన్ని మతాలకూ అసలైన ఇల్లు ఇస్లామేనని.. ఇస్లాంలో బలవంతపు మతమార్పిడులు ఉండవని అన్నారు. అన్ని మతాలకు చెందినవారినీ మళ్లీ ఇస్లాంలోకి ఆహ్వానిస్తున్నామని, అయితే ఇందులో బలవంతం మాత్రం ఏమీ లేదని ఆయన అన్నారు. ‘‘తిరిగొస్తే మేం మీకేం పైసలివ్వం. ఇవ్వడానికి మా దగ్గరేం లేవు. కానీ, ఆ తర్వాతి కాలంలో మీరు ప్రపంచాన్నే జయిస్తామన్న గ్యారెంటీ మాత్రం ఇస్తాం. రండి’’ అన్నారు. ఇతర మతాలవారందరూ ఇస్లాంను ఆశ్రయించినప్పుడు మాత్రమే అసలైన ఘర్‌వాపసీ జరిగినట్టని పేర్కొన్నారు. అల్లా పంపితే ఆదం హిందుస్థాన్‌కు వచ్చారని.. ఇది తమ తాతముత్తాతల గడ్డ అని, మొత్తం దేశమే తమదైనప్పుడు తాము ఎవరి ఇంటికి తిరిగి రావాలని వ్యాఖ్యానించారు. కాగా, దేశవ్యాప్తంగా పలు పార్టీల నాయకులు ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంకు కోసమే ఒవైసీ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మజీద్‌ మెమన్‌ అన్నారు. హిందూ, ముస్లిం ఛాందసవాదులు ఒకే నాణేనికి రెండు ముఖాల వంటివారని, ఇలాంటి వారి వ్యాఖ్యలు యావద్దేశానికీ హాని చేస్తాయని జేడీ(యు) నేత అలీ అన్వర్‌ అన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, వీహెచ్‌పీ నేత ప్రవీణ్‌ తొగాడియాలకు ముస్లిం ప్రతిరూపమంటూ జేడీ(యు)కే చెందిన మరో నేత కేసీ త్యాగి అభివర్ణించారు. ఒవైసీ, ఆయనలాంటి వారు చేసే వ్యాఖ్యలను ప్రజాస్వామ్యంమీద నమ్మకం ఉన్నవారెవరూ లక్ష్యపెట్టరాదని సీపీఐ నేత అతుల్‌ అంజాన్‌ అన్నారు. ఇక ఆరెస్సెస్‌, ఎంఐఎం నేతలను ఒకే గదిలో పెట్టి తాళం వేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు. కాగా… తన వ్యాఖ్యలపై జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో అసదుద్దీన్‌ వివరణ ఇచ్చారు. మహ్మద్‌ ప్రవక్తకు సంబంధించిన ఉత్సవంలో తాను ఆ మాటలు చెప్పానని, మొత్తం గంటన్నర ప్రసంగంలో ఇంకా చాలా విషయాలతోపాటు అదీ చెప్పానని పేర్కొన్నా రు. ప్రజాస్వామ్యంలో తన అభిప్రాయాలు చెప్పుకొనే హక్కు తనకూ ఉందని, అవతలివాళ్లు నమ్మొచ్చు లేదా నమ్మకపోవచ్చని వ్యాఖ్యానించారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెనాలిలో లక్షా పదకొండు వేల భక్తులతో మహా హనుమాన్ పారాయణ -31-1-15 శనివారం -ఉదయం 6 గం లకు

tenali chalisa2 001 tenalichalisa1 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గోదారిలో యెన్ టి ఆర్

 

ఆహుతి ప్రసాద్‌కు చిత్రసీమ నివాళి (03-Jan-2015)

విలక్షణ శైలి
‘‘ఎన్నో మంచి పాత్రలకు తన విలక్షణ శైలితో ప్రాణం పోసిన నటుడు ఆహుతి ప్రసాద్‌. అనారోగ్యం పాలైన అతను త్వరగా కోలుకుంటారనుకున్నాను. కానీ అంతలో ఘోరం జరిగిపోయింది. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు.’’ – మోహన్‌బాబు
తీరని లోటు
‘‘ఆహుతి ప్రసాద్‌గారు కన్నుమూయడం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. చాలా మంచి సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌ ఆయన. వాళ్ల కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.’’ – ఎన్టీఆర్‌
వద్దన్నారు
‘‘రెండు రోజుల క్రితం ఫోనులో మాట్లాడా. వచ్చి కలుస్తానంటే వద్దన్నారు. ఆయన పోయారన్న వార్త విని షాక్‌లో ఉన్నా.’’ – వి.వి.వినాయక్‌
ఇటీవల కలిశా
‘‘ఆహుతి ప్రసాద్‌గారి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెళ్లి పరామర్శించా. ఇతర థెరపీలను కూడా సజెస్ట్‌ చేశా. ఈ మధ్య ఆయన నాకు బాగా దగ్గరయ్యారు. అంతలోనే ఇలా జరిగింది.’’ – రాజశేఖర్‌
మంచి కుటుంబం
‘‘‘ఆహుతి’ సినిమాలో కలిసి నటించాం. అప్పటి నుంచీ ఫ్రెండ్లీగా ఉండేవారు. వాళ్లది అందమైన కుటుంబం. ఆయన లేని లోటును భరించే ధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలి. ఇటీవల కూడా ఆసుపత్రికి వెళ్లి కలిశాం. తనకున్న వ్యాధిని గురించి పెద్దగా లెక్కచేయకుండా నవ్వుతూ మాట్లాడారు. ఆయన ఎప్పుడూ మరణాన్ని చూసి భయపడలేదు. చాలా ధైర్యవంతుడు.’’ – జీవిత
కలుపుగోలు వ్యక్తి
‘‘ఆహుతి ప్రసాద్‌ కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ‘మా’ అసోసియేషన్‌కు కార్యదర్శిగా పనిచేశారు. ఎప్పుడూ పేద నటీనటులకు సాయం చేయాలన్న సంకల్పంతో పనిచేసేవారు. గతేడాది పలువురు సినీ ప్రముఖులు పోయారనే బాధతో ఉన్నాం. ఈ ఏడాది మొదలైన నాలుగు రోజుల్లోపే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు.’’  – మురళీమోహన్‌
ఒదిగిపోయే నటుడు
‘‘ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల అరుదైన నటుడు ఆహుతి ప్రసాద్‌గారు. ‘తులసి’, ‘దమ్ము’, ‘లెజెండ్‌’ సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలను మర్చిపోలేను’’ – బోయపాటి శ్రీను
టిపికల్‌ కామెడీ
‘‘టిపికల్‌ కామెడీని పండించగలిగిన వ్యక్తి ఆహుతి. తను నవ్వకుండా ఎదుటివారిని నవ్వించగలిగే సత్తా ఆయన సొంతం. ఎన్ని సీరియస్‌ పాత్రల్ని చేసినా ఆఫ్‌ స్ర్కీన్‌లో చాలా జోవియల్‌గా ఉండేవారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో పలు కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించే వారు.’’ – శ్రీకాంత్‌
పలు పాత్రల్లో..
‘‘కమెడియన్‌గా, క్యారక్టర్‌ ఆర్టిస్టుగా రకరకాల పాత్రల్లో నటించిన నటుడు ఆహుతి ప్రసాద్‌గారు. హీరోగా తప్ప అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించారు.’’ – అలీ
అద్భుత నటుడు
‘‘నవ్వించడం, ఏడిపించడం, విలనిజం… ఏ పాత్రనైనా అద్భుతంగా పండించగల నటుడు ఆహుతి ప్రసాద్‌. ఆయనతో కలిసి నటించిన ప్రతి సినిమా నాకు మెమరబుల్‌ మూవీనే. అందరినీ కలుపుకుని పోయే ఆయన లేరని తెలిసి షాక్‌తిన్నాను.’’ – అల్లరి నరేష్‌
రెండు సినిమాలు
‘‘‘రైడ్‌’, ‘జండాపై కపిరాజు’ సినిమాల్లో నేను ఆహుతిప్రసాద్‌గారితో కలిసి నటించాను. వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ ఆయన. ఆయన్ని పోగొట్టుకున్నందుకు బాధగా ఉంది.’’ – నాని
హృదయాల్లో ఉన్నారు
‘‘భౌతికంగా మనకు దూరమైనప్పటికీ అద్భుతమైన పాత్రలతో మన హృదయాల్లో ఉన్న వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ ఆహుతి ప్రసాద్‌గారు.’’ – పీవీపీ
అన్నయ్య అనేవాడిని

‘‘మధు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫస్ట్‌ బ్యాచ్‌ స్టూడెంట్‌ ఆహుతి ప్రసాద్‌. నేను రెండో బ్యాచ్‌లో ఉండేవాడిని. అన్నయ్యా అని పిలిచేవాడిని. కొన్ని చిత్రాల్లో ఆయన పాత్రలకు డైలాగులు కూడా రాశా. ఎప్పుడు కనిపించినా ‘త్వరగా సెటిలవ్వండ్రా’ అంటూ ఆప్యాయంగా చెప్పేవారు.’’ – ఉత్తేజ్‌
విశిష్ట వాచకం విలక్షణ అభినయం (03-Jan-2015)
‘ఇతనితో డిఫరెంట్‌ కేరక్టర్లు చేయించొచ్చు’, ‘ఇతనిని పెట్టుకున్నామంటే ఆ పాత్రకు ప్రాముఖ్యం ఉండాలి’ అని దర్శకులు భావించే నటునిగా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ‘ఆహుతి’ ప్రసాద్‌ కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ అర్ధంతరంగా కన్నుమూయడం తెలుగు చిత్రసీమను విచారంలో ముంచేసింది. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకుని పేరు సంపాదించుకున్న అతి కొద్దిమంది నటుల్లో ఆయన ఒకరు. చొరవగా ముందుకెళ్లే మనస్తత్వం లేకపోవడంతో కెరీర్‌ మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ మితభాషి మరణం తర్వాతే ఆయన ఎంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్నారో లోకానికి తెలిసింది. ‘ఆహుతి’ చిత్రంతోటే మొదటిసారిగా అందరి దృష్టిలో పడి, ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నప్పటికీ, ‘చందమామ’ చిత్రంలో చేసిన రామలింగేశ్వరరావు పాత్రే ఆయనకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్‌. కృష్ణాజిల్లా, ముదినేపల్లి పక్కన కోడూరు గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రంగారావు, హైమావతిల దంపతులకు నలుగురు అమ్మాయిల తర్వాత కలిగిన మగ సంతానం వరప్రసాద్‌. ఆయన తండ్రికి కర్ణాటక ట్రాన్స్‌ఫర్‌ కావడంతో మూడో తరగతి వరకు ఆయన చదువు అక్కడే సాగింది. నాలుగో తరగతి నుండి ఆరవ తరగతి వరకు కర్నూలులో ఆయన అక్క దగ్గర చదువుకున్నారు. తర్వాత కోదాడ, మిర్యాలగూడలో పదో తరగతి వరకు చదివి, అక్కడే ఇంటర్‌లో చేరారు. ఇంట్లో ఒక్కడే మగబిడ్డ కావడంతో కుటుంబం ఆయనను ఎంతో గారాబంగా పెంచింది. స్కూల్‌ రోజుల్లోనే ప్రసాద్‌కు నటన అంటే పిచ్చి. క్లాసులు ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసేవారు. నాగార్జున సాగర్‌లో చదువుతున్న
సమయంలో ‘అభినయం’ అనే నాటకం వేసి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. అలాగే ఆయన వేసిన రెండో నాటకం ‘అన్నాచెల్లెళ్లు’ కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. దానికిగాను నాగార్జున సాగర్‌ డ్యామ్‌ ఛీప్‌ ఇంజనీర్‌ అప్పట్లో విదేశాల నుండి తెప్పించిన ఓ పెన్నును బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మరువలేని అనుభూతిగా ఆహుతి ప్రసాద్‌ చెప్పేవారు. చదువులో బిలో ఏవరేజ్‌గా స్టూడెంట్‌గా ఉన్న ఆయనకు నాటకాల్లో ప్రశంసలు దక్కడంతో సినీ నటుడు కావాలనే ఆశ మరింత బలపడింది. సినిమాల్లోకి వెళ్తానంటే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో చదువుపై అంతగా దృష్టిసారించక కోదాడలో డిగ్రీ మధ్యలో వదిలేశారు. పెళ్లి చేస్తే సినిమాల గొడవ పక్కన పెడతాడనే ఉద్దేశ్యంతో విజయనిర్మలతో పెళ్లి చేశారు పెద్దలు.
కెమెరా ముందుకు… 
పెళ్లి తర్వాత 1983 జనవరిలో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అందులో ఈయనదే మొదటి బ్యాచ్‌. రాంజగన్‌, శివాజీరాజా, అచ్చుత్‌, సుబ్బారావు ఈయనకు కొలీగ్స్‌. ఏడాది తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కి షిప్ట్‌ చేశారు. మధుసూధనరావుగారి ద్వారా తాతినేని ప్రకాశరావుగారితో పరిచయాన్ని పెంచుకున్నారు. ఆ పరిచయంతో ప్రకాశరావు ‘మీరు ఆలోచించండి’ సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ప్రతాప్‌ ఆర్ట్స్‌లో ఓ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్తే రాఘవగారబ్బాయి తీస్తున్న ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమాలో మెయిన్‌ విలన్‌గా బుక్‌ చేశారు. ఈలోగా మధుసూధనరావుగారికి మరో రెండు సినిమాలొచ్చాయి. ఒకటి ఉషాకిరణ్‌ మూవీస్‌లో ‘మల్లెమొగ్గలు’, రెండోది నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్‌’. ఈ రెండింటికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ నటించారు. ఆయన మొదట తెర మీద కనిపించిన సినిమా ‘విక్రమ్‌’. ఆ తర్వాత ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమా విడుదలైంది. మద్రాస్‌లో ఆ సినిమా చూసిన శ్యాంప్రసాద్‌ రెడ్డి ‘ఆహుతి’ సినిమాలో అవకాశమిచ్చారు. 1987 డిసెంబర్‌ 3న విడుదలైన ‘ఆహుతి’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో, రాజశేఖర్‌, జీవితతో పోటీపడుతూ హోమ్‌ మినిస్టర్‌ శుంభుప్రసాద్‌ పాత్రను ప్రసాద్‌ ఎంత బాగా చేశారో అందరికీ తెలిసిందే.
నష్టం తెచ్చిన ‘ఆహుతి’ పేరు
ఆహుతి ప్రసాద్‌ సినిమా కెరీర్‌ను పరిశీలిస్తే ‘చందమామ’ ముందు, ‘చందమామ’ తర్వాత – అని విభజించవచ్చు. ‘ఆహుతి’తో తొలి బ్రేక్‌ వచ్చినా, దానిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. మంచి మంచి అవకాశాలు వస్తున్న టైమ్‌లో మిత్రులైన నటులు రఘుబాబు, హరిప్రసాద్‌తో కలిసి కన్నడంలో సినిమాలు నిర్మించే పనిలో మునిగిపోయారు. దీంతో ఆయన నటించడం మానేశాడేమోనని అడగడం మానేశారు. పైగా జనార్దన వరప్రసాద్‌ పేరు కాస్తా, ‘ఆహుతి’ ప్రసాద్‌గా మారడంతో, ఆ పేరే ఆయనకు మైనస్‌గా మారింది. ‘ఆహుతి’ అనే పదాన్ని నిర్మాతలు నెగటివ్‌గా భావించడం వల్ల కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడారు. ఏదైనా పాత్రకు ఆయనను తీసుకుందామని దర్శకులు అంటే, ‘ఆహుతా.. వద్దు లేవయ్యా. ఆ సౌండే బాగాలేదు’ అని నిర్మాతలు అనడం వల్ల పెద్ద పెద్ద సినిమాలే చేజారిపోయాయి. పైగా ఆయనది చొరవ తీసుకునే మనస్తత్వం కాదు. మొహమాటం, తనను తాను బూస్టప్‌ చేసుకునే తెలివితేటలు లేకపోవడం వల్ల కూడా అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ టైమ్‌లో కృష్ణవంశీ నుంచి ఆయనకు మంచి ఆఫర్‌ వచ్చింది. అది నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’లో హీరోయిన్‌ టబు తండ్రి కేరక్టర్‌. ఆ పాత్ర ఆయన కెరీర్‌కు రెండో బ్రేక్‌.

‘చందమామ’తో దశ తిరిగింది

‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత నుంచి ఆయన అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది. అనేక కుదుపులతో అతలాకుతలమైన ఆయన కెరీర్‌ను ఆ సినిమా మంచి మలుపు తిప్పింది. చాలా సినిమాల్లో చేసిన పాత్రల్లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కానిస్టేబుల్‌ నుంచి ఐజీ దాకా అన్ని రకాల పోలీస్‌ పాత్రలను ఆయన చేశారు. దాదాపు తొంభై సినిమాల్లో పోలీస్‌ పాత్రలను పోషించిన రికార్డ్‌ ఆయనది. అయితే ‘ఆహుతి ప్రసాద్‌ ఇట్లా కూడా చేస్తాడు’ అనే పేరు తెచ్చిపెట్టిన చిత్రం ‘చందమామ’. దాని దర్శకుడూ కృష్ణవంశీయే. అందులో గోదావరి యాసతో మాట్లాడే రామలింగేశ్వరరావు పాత్ర ఆయన కెరీర్‌కు బోనస్‌లా మారింది. ఆలస్యంగానైనా ఆ కేరక్టర్‌ ఆయన సినీ జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. అప్పటివరకూ విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా సీరియస్‌గా కనిపిస్తూ వచ్చిన ఆయన కామెడీ కూడా గొప్పగా చేయగలడని ఆ సినిమా నిరూపించింది. రామలింగేశ్వరరావు పాత్రలో ఆహుతి ప్రసాద్‌ నటనను, ఆయన డైలాగ్స్‌ను ఆస్వాదించడానికే ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు చాలామందే. ‘చందమామ’తో ఆయనకు ఎంత పేరొచ్చిందనేదానికి నిదర్శనం – విజయవాడలో ఆ సినిమా ఆడుతున్న థియేటర్‌ వద్ద నలభై అడుగుల ఆహుతి ప్రసాద్‌ కటౌట్‌ పెట్టడం. ‘‘ఈ సినిమాలో రామలింగేశ్వరరావు కేరక్టర్‌ వల్ల రిపీట్‌ ఆడియెన్స్‌ ఎక్కువగా ఉన్నారు కాబట్టే ఆయన కటౌట్‌ పెట్టాం’’ అని డిసి్ట్రబ్యూటర్లు చెప్పారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో చేసినప్పట్నించీ, కృష్ణవంశీకి సన్నిహితుడు కావడం, ఆయన వద్ద గోదావరి యాసలో జోకులు చెప్తుండటం వల్లే రామలింగేశ్వరరావు పాత్ర ఆయనకు లభించింది. కృష్ణవంశీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు.
రెండు నందులు
ఇరవై ఏడేళ్ల కెరీర్‌లో 250కి పైగా చిత్రాలు చేసిన ఆయన నటనా ప్రతిభకు గుర్తింపుగా రెండు నంది అవార్డులు లభించాయి. మొదట ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా అవార్డు పొందిన ఆయన, రెండోసారి ‘చందమామ’లోని రామలింగేశ్వరరావు పాత్రను పోషించిన తీరుకు ఉత్తమ కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా అవార్డు అందుకున్నారు. ‘విక్రమ్‌’ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్‌ను శివాజీ గణేశన్‌ చేతులు మీదుగా అందుకోవడం, హిందీ ‘సూర్యవంశ్‌’లో అమితాబ్‌తో పద్దెనిమిది రోజులు కలిసి పనిచేయడం, కమల్‌హాసన్‌తో ఓ తమిళ సినిమా చేయడం తన జీవితంలో మరపురాని క్షణాలని ఓ సందర్భంగా ఆయన చెప్పుకున్నారు. అలాగే విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీ రామారావుతో కలిసి నటించకపోవడం తీరని లోటుగా ఆయన భావించేవారు. తెరపై నటుడు కావాలనే కోరికను తీర్చుకుని, స్వయంకృషి, పట్టుదలతో ఓ చక్కని నటునిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వరప్రసాద్‌ మరణంతో తెలుగు చిత్రసీమ ఓ నిఖార్సయిన తెలుగు నటుణ్ణి అర్ధంతరంగా కోల్పోయినట్లయింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముక్కలవుతున్న మగ్గం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుస్తక సరస్వతీ సం ”దర్శనం ”-అనే 26 వ విజయవాడ పుస్తక మహోత్సవం అనే బుక్ ఫెస్టివల్ 4-1-15-ఆదివారం

This gallery contains 40 photos.

More Galleries | Tagged | Leave a comment

ఇండస్ట్రీని నిలబెట్టిన ఘనత వాళ్ళదే! దర్శకుడు తాతినేని రామా రావు

ఇండస్ట్రీని నిలబెట్టిన ఘనత వాళ్ళదే!

తెలుగు, తమిళ, కన్నడ వంటి దక్షిణాది భాషల్లో సినిమాలు తీసేవాళ్లకు.. 
బాలీవుడ్‌లో అడుగుపెట్టడం ఒక కల! ఇప్పటికీ ముంబయికి వెళ్లి హిందీలో సినిమా చేయడం ప్రిస్టీజ్‌గానే భావిస్తారు సినీ నిర్మాతలు, దర్శకులు. అలాంటిది ఆ రోజుల్లోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి – బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, అనీల్‌కపూర్‌, రాజ్‌బబ్బర్‌, జితేంద్ర, ధర్మేంద్ర, రేఖ, హేమమాలిని వంటి హేమాహేమీలతో కలిసి పనిచేసిన స్టార్‌ దర్శకులు తాతినేని రామారావు. తెలుగు, హిందీలలో సుమారు నాలుగు దశాబ్దాలపాటు కొనసాగి ముప్పావు వంతు సినీ విజయాలు సొంతం చేసుకున్న ఆయన తన జ్ఞాపకాలను ‘నవ్య’తో పంచుకున్నారు..
‘‘మాది కృష్ణా జిల్లా, వ్యవసాయ కుటుంబం. కపిలేశ్వరపురంలో పుట్టాను నేను. ఏలూరులో ఇంటర్‌ వరకు చదువు సాగింది. ఇంజనీరింగ్‌ చేయాలనుకున్నాను కానీ, ముల్కీ నిబంధనల వల్ల సీటు రాలేదు. ఇతర కోర్సుల్లో చేరడానికి సమయం ముగిసిపోయింది. దీంతో ఏడాదంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్ధితి. అలా 18 ఏళ్ల వయసులో 1957లో చెన్నై చేరుకున్నాను. మా వూరి మనిషి, మాకు బంధువు కూడా అయిన తాతినేని ప్రకాశరావు అప్పట్లో పెద్ద పేరున్న దర్శకుడు. ఎల్‌వి ప్రసాద్‌ దగ్గర పనిచేశారాయన. ప్రసాద్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ (పిఎపి)లో ‘ఇల్లరికం’ సినిమాను నాగేశ్వరరావుతో తీస్తున్నారప్పుడు. ఆ సినిమాకు నేను తొలిసారిగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. ఆ సమయంలో నా నెల జీతం రూ.100 మాత్రమే. దాంతోనే తిండీతిప్పలన్నీ నడిచిపోయేవి. నాతో పాటు ప్రత్యగాత్మ, సుబ్బారావు కూడా దర్శకత్వ శాఖలో పనిచేసేవారు. అవకాశం రావడంతో ప్రత్యగాత్మ ‘భార్యాభర్తలు’ సినిమాకు దర్శకుడయ్యాడు. ఆయన నన్ను అసోసియేట్‌ దర్శకునిగా తీసుకున్నారు.
టర్నింగ్‌ పాయింట్‌
అలా 1964 వరకు ‘భార్యాభర్తలు’, ‘కులగోత్రాలు’, ‘మనసులు-మమతలు’, ‘పునర్జన్మ’ వంటి చిత్రాలకు పనిచేసే అవకాశం చిక్కింది. తమిళంలో వచ్చిన ‘నవరాత్రి’ చిత్రాన్ని సావిత్రి కొనుగోలు చేశారు. తెలుగులో తీయాలనుకున్నారు ఆవిడ. ఈ సినిమా రీమేక్‌లో సావిత్రితో పాటు పిఎపి కూడా భాగం పంచుకుంది. సావిత్రి కుమార్తె పేరు మీద ‘విజయచాముండేశ్వరి’ బ్యానర్‌పై తెరకెక్కింది. దర్శకునిగా ఇదే నా తొలి సినిమా. ఇందులో నాగేశ్వరరావువి తొమ్మిది పాత్రలు. ఒక్కో పాత్రకు ఒక్కో భావం, భాష, రంగు, రుచి ఉంటాయి. నవరసాలతో నిండిన అన్ని భావాలను ఆయన అలవోకగా పండించారు. మళ్లీ నాగేశ్వరరావు-జయలలితలతో ‘బ్రహ్మచారి’ చిత్రాన్ని తెరకెక్కించాను. తరువాత కృష్ణ, శోభన్‌బాబులతో ‘మంచి మిత్రులు’ తీశాను. ఇందులో విజయనిర్మల కథానాయకి. వరుస విజయాలు రావడంతో వరుసగా సినియాలు వచ్చాయి. అవకాశాల కోసం వెతుక్కోనవసరం లేకపోయింది. 1964లో ‘మంచి మనిషి’ చిత్రానికి ఫస్ట్‌ అసిస్టెంట్‌గా ఉన్నపుడే వివాహం జరిగింది. పెళ్లి అయ్యాకే దర్శకునిగా నిలదొక్కుకున్నాను. హరనాధ్‌తో కూడా ‘నడమంత్రపు సిరి’ అనే సినిమా చేశాను. శోభన్‌బాబుతో ‘జీవనతరంగాలు’ తీస్తే చాలా బాగా ఆడింది. ఆ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి.
ఎన్‌టీఆర్‌ నుంచి పిలుపు..

మొదటి నుంచీ పిఎపి వారితో కలిసి ఉండడంతో అక్కినేని నాగేశ్వరరావుతో సినిమాలు తీయగలిగాను. ఆయనతో చేసిన సినిమాలు పదిహేను. అలా ఉండగా 1978లో ఎన్‌టిఆర్‌తో సినివ ూ తీసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. కెమెరామెన్‌ వెంకటరత్నానికి సినిమా చేస్తానని ఎన్‌టీఆర్‌ మాట ఇచ్చి ఉన్నారు. ఆ సినిమా పుండరీకాక్షయ్య తీయాల్సి ఉంది. కానీ ఆలస్యం అవుతోంది. ఇలా ఏవో డేట్లు సర్ధుబాటులో భాగంగా 28 రోజులు కాల్షీట్లు ఉన్నాయి. ‘‘త్వరగా సినిమా తీస్తానంటే చెప్పు, నేను సిద్దం’’ అని ఎన్‌టిఆర్‌ అనగానే, వెంకటరత్నం ఒప్పేసుకుని, సరే అన్నాడు. దీనితో డివి నరసరాజుగారి కథ ఆధారంగా ‘యమగోల’ తీశాం. 28 రోజుల్లో తీసిన సినిమా అది. పరుగు పరుగున చిత్రీకరణ జరిపాం. నెల్లూరు సమీపంలోని ఓ గ్రామంలో నాలుగు పాటలు పూర్తి చేశాం. అదే సమయంలో ఎన్‌టీఆర్‌ మరో సినిమా రీ రికార్డింగ్‌తో బిజీగా ఉండేవారు. ఉదయం మాకు కాల్షీట్‌ ఇచ్చేవారు. ఆయన రాగానే ఆయన సీన్లు అన్నీ తీసేసే వాణ్ని. 12 గంటల తరవాత ఆయన రికార్డింగుకు వెళ్లి 3 గంటల ప్రాంతంలో వచ్చే వారు. తిరిగి సాయంకాలం వరకూ ఆయనతో ఉన్న కాంబినేషన్‌ సీన్లు చిత్రీకరించే వాణ్ని. ఎంత హడావుడిగా తీసినా, నాణ్యతలో రాజీ లేదు. అన్నీ పక్కా, రాసి పెట్టుకుని, జాగ్రత్తగా తీసేవాళ్లం. ఆ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. అప్పటి రాజకీయాలపై సెటైర్లు ఎన్‌టీఆర్‌ నోట బాగా పండాయి. ఆ తరువాత ఎన్‌టీఆర్‌తో ‘ఆటగాడు’, ‘అనురాగదేవత’ వంటి మూడు సినిమాలు చేశాను.
హిందీలో హవా..
అక్కినేని నాగేశ్వరరావు, వాణీశ్రీ జంటగా తీసిన ‘ఆలుమగలు’ పెద్ద హిట్‌. దీన్ని హిందీలోను తీయాలనుకున్నాం. అంతకు ముందు ‘ఇల్లరికం’, ‘భార్యభర్తలు’ వంటి సినిమాలను కూడా హిందీలో రీమేక్‌ చేశాను. అవన్నీ 25 వారాలకు పైగా ఆడి, ఘనవిజయం సాధించాయి. ఒక దశలో జితేంద్ర ఈ రీమేక్‌లలో నటిస్తూ, మద్రాసులోనే ఉండిపోయారు. ‘ఆలుమగలు’ జితేంద్ర- రేఖ జంటగా హిందీలో తీశాను. విజయం సాధించింది. అయితే ‘యమగోల’ మాత్రం అక్కడ నిరాశ పరిచింది. ఈ దశలో డూండి, సునంది, పిఎపి, జగపతి, నా స్వంత సంస్థ లక్ష్మీ ప్రొడక్షన్స్‌ వంటి తెలుగు నిర్మాతలకే వరుసగా పలు హిందీ సినిమాలు చేశాను. దీనితో పరిశ్రమ హైదరాబాదుకు మారుతున్న సమయంలో నేను ముంబైలో ఉండిపోయా. హైదరాబాద్‌ షూటింగ్‌లకు వెళ్లినా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయాను. ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాను ‘అంధాకానూన్‌’ పేరుతో హిందీలో చేశాను. ఇందులో అమితాబ్‌ పాత్ర నిడివి పెంచా. అలాగే రజనీకాంత్‌కి ఇదే తొలి హిందీ సినిమా. అతనితో హిందీ సినిమా ఏమిటని చాలా మంది వారించారు. అయినా సరే తీశాను. విజయం వరించింది. 1979-2000 మధ్య హిందీలో 30 సినిమాలు చేశాను. అందరూ అప్పట్లో ప్రముఖ తారలే, ఎవరితోనూ ఇబ్బంది కలగలేదు. రెండేళ్ల క్రితం కుటుంబంతో ముంబై వెళ్లినపుడు అమితాబ్‌ని కలిశాను. ఆయనలో మునుపటి ఆదరణే కనిపించింది.
పరుగు ఆపడం ఒక కళ..
‘‘మనం ఎక్కడ పరుగు ఆపాలో తెలుసుకుంటే, జీవితంలో ఏ చింత ఉండదు. తెలుగు, హిందీ సినిమా రంగంలో 40 ఏళ్లకు పైగా కొనసాగాను. 65 చిత్రాలకు దర్శకత్వం చేశాను. ఎన్నడూ హద్దు దాటలేదు. నిత్యం వ్యాయామం చేయడం, మితాహారం తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తున్నాను. 43 సంవత్సరాల సుదీర్ఘసినీ ప్రస్థానంలో 65 సినిమాలే చేశాను..’’
రేటు తగ్గించుకున్నారు..
‘‘ఒక సందర్భంలో – సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న అగ్రనటులు ఎన్‌టిఆర్‌-ఏఎన్‌ఆర్‌లు తమ పారితోషికాలను సైతం భారీగా తగ్గించి నిర్మాతలకు సహకరించిన రోజులున్నాయి. అక్కినేని గారు అయితే, చాలా అరుదుగా తన రేటును పెంచే వారు. రేటు పెంచుతానంటే, దుక్కిపాటి మధుసూధనరావే నాగేశ్వరరావుని కసురుకునేవారు. ‘నీవు రేటు పెంచితే, నిర్మాత ఎలా భరిస్తాడు? పెంచవద్దు’ అని స్నేహపూర్వకంగానే వారించేవారు. ఆ వాతావరణం ఇప్పుడు ఎక్కడుంది?’’
అలా బయటపడ్డాను..
‘‘అనిల్‌కపూర్‌, రవీనాటాండన్‌, రేఖలు ప్రధాన పాత్రల్లో ‘బులంది’ సినిమా చేశాను. అది పోయింది. పెద్దగా ఆడలేదు. ఆ తరువాత ఇక సినిమాలు మనకు పనికిరావని తెలుసుకున్నాను. గౌరవంగా విరమించుకోవడం మంచిదని భావించా. చెన్నై సమీపంలో గుమ్మడిపూండి వద్ద ఒక పరిశ్రమ ఏర్పాటు చేశాను. నా కుమారుడు ఇంజనీర్‌. అతనే ఆ వ్యాపారం చూస్తాడు. ప్రస్తుతం ఆ సంస్థలో 200పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇంతమందికి పని కల్పించడం కాస్త గర్వంతో కూడిన సంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది..’’
మన్నవ గంగాధర ప్రసాద్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాసులు
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముతక కథనం మూలింటామె – తెలకపల్లి రవి

ముతక కథనం మూలింటామె – తెలకపల్లి రవి
పచ్చనాకు సాక్షిగా జీవిత సత్యాలను చెప్పే నామిని తాజా నవల ‘మూలింటామె’పై చాలా చర్చలే జరిగాయి. మూలింటామె నవలపై చర్చలో అధిక భాగం అందులో వున్నది వాస్తవమా కాదా పల్లెల్లో అలాటి వారు వున్నారా లేదా అనే నైతిక కోణంలోనే నడిచినట్టు కనిపిస్తుంది. రచనగా, రచయిత దృక్పథ సూచికగా దాన్నెలా చూడవలసి ఉంటుందనేది నా పరిశీలన.
చెప్పాలంటే పచ్చనాకు సాక్షిగా నుంచి నామిని నెంబర్‌ వన్‌ పుడింగి రాసేనాటికి ఈ రచయితలో మార్పు అంతకంతకూ ప్రస్ఫుటమవుతూ వచ్చింది. జీవిత సత్యాలను సహజ భాషలో చెబుతాడన్న ప్రశంస కాస్త వికటించింది. ప్రకృతిలో ప్రపంచంలో ప్రథమ సత్యమైన అమ్మ ప్రేమను చెప్పినంత వరకూ ఆయన శైలి అంత స్వచ్ఛంగానూ ఉంది. ఆ పైన మిట్టూరులో మట్టి మనుషుల గురించి చెప్పినప్పుడు కూడా జీవన భాష్యంలానే అనిపించింది. ఒక దశ తర్వాత రచనా శైలి ఇంకా చెప్పాలంటే రచయిత శైలి మారుతూ వచ్చింది. వీరారాధనలూ విచక్షణారహితమైన స్వీయారాధనల దుష్పలితంగానే ఇది కనిపిస్తుంది. ఇలా జరక్కూడదంటే రచయితలకు చాలా స్వీయ నిబద్ధత లేదా నియంత్రణ ఉండాలి. నీతి రీతి ఎవరి ఇష్టం వారిది అని చెప్పడానికి నియతి నిజాయితీ ఉండాలి.
ఏ పల్లెల్లో ఏఏ పదాలతో తిట్లతో బూతులతో ఆడజనం మాట్లాడుకుంటారో తెలియదు గాని నామిని ఎంచుకున్న ఈ మూలింటామె కథ పొడుగునా ప్రతి పేజీకి కనీసం పది పలకలేని మాటలుంటాయి. మూలింటామె మొదటామెతో సహా ఆడవాళ్లందరూ లోలోపల చాలా చేశామని చెప్పుకుంటుంటారు. మరోవైపున వయసులో చాలా చిన్నదైన పందొసంతను పెళ్లి చేసుకున్న నారాయుడు మాత్రం ఇవేవీ పట్టకుండా ఆమెతో ‘సహజీవనం’ చేస్తున్న గుడుగుడు చంద్రుడికి తోకలా వ్యవహరిస్తుంటాడు. ఈ ముగ్గురూ ఒక జట్టుగా మెలగడం, ప్రత్యేకించి వసంత చంద్రుల పోకడలు రచయిత విపులంగా వివ రంగా పొందుపరుస్తాడు. మూలింటామె నవల (నిజానికి పెద్ద కథ) పల్లెటూళ్ళలో మారుతున్న పరిస్థితులను చిత్రించిందని కొంతమంది చేస్తున్న సమర్థన వాదనకు నిలవదు. కథ ప్రకారమే చూసినా ఇవన్నీ ఈ రోజునే జరిగినవి కావు. చెట్లు కొట్టేయడం, సేద్యం మానేయడం వంటివి పందొసంతలే గాక అన్ని రకాల వారూ చేస్తారు. ఇక సహజ భాష అన్న మాటకొస్తే ఇంతకంటే పచ్చిగా మాట్లాడుకోవడం అందరికీ తెలుసు. ఆమె కన్నా ఘోరమైన పాత్రలూ తెలుసు. అయితే వాటిని ఏ మేరకు ఏ తీరుగా చిత్రిస్తామన్నదే ప్రశ్న. పందొసంత-గుడుగుడు చంద్రుడు-నారాయుడు త్రయం చుట్టూనే కథ తిప్పడం ద్వారా నామిని అదనంగా చెప్పిన కొత్త విషయమేమీ లేదు. ఇలాటి వ్యవహారాలు వుంటాయని ఎవరికీ తెలియదనీ కాదు. ఒక ఆర్థిక సామాజిక కథాక్రమాన్ని చెప్పే సందర్భంలో ఎలాటి ఘటనలనైనా పాత్రలనైనా రచయితలు పొందుపర్చవచ్చు. మాలపల్లి నుంచి మైదానం వరకూ తెలుగు సాహిత్యంలో అర్ధశతాబ్ది కిందటే ఇలాటి అంశాలు వచ్చాయి. అయితే ఏ నేపథ్యంలో ఏ సందేశంతో చెప్పారన్నదే కీలకం. మూలింటామె చదివితే మాత్రం రచయిత అక్రమం అనుకున్న రాసలీలలపైనే కలం నడిపించారు. పోనీ పల్లెల్లో అది సహజం అని చెప్పడానికి రాశాడనుకుందామా అంటే జనం అలా అనుకున్న ప్రతి సందర్భాన్ని వ్యంగ్యంగా చిత్రించారు. పైగా అనేక ముఖ్య ఘట్టాల్లో పరస్పర విరుద్ధమైన కథనాలు ఇస్తూ ఏది వాస్తవమో తేల్చకుండా వదిలేశారు. వ్యభిచారం అన్న భావన ఆధారంగా ఉద్భవించిన అనేక జుగుప్సాకర పదాలను అదే పనిగా గుప్పించి వదిలిపెట్టారు. అవన్నీ మహిళను కించపర్చేవిగా వుండగా గుడుగుడు చంద్రుడి వంటి పాత్రలను మాత్రం ఘనంగానే వర్ణించారు.
నామిని హఠాత్తుగా సీ్త్రల నైతికతపై ఈ కాలంలో ఇంత కథనం వదలడం ఆశ్చర్యకరం. పైగా అనైతికత వారిలో సార్వత్రికమన్నట్టు చెప్పే అనేకానేక సంభాషణలనూ సన్నివేశాలనూ గుప్పించి వదలిపెట్టారు. వాటిని బేఖాతరు చేసినట్టుగాక సమాజమే నీతి బాహ్యమైందన్నట్టు చిత్రించారు.ఆయనకు ఆధారమైన ఉదాహరణలు ఏమిటో తెలియదు గాని మన సమాజం ఇంత అస్తవ్యవస్తంగా అనాగరికంగా లేదని మాత్రం చెప్పొచ్చు. ఆయన అలా అనుకున్నా మహిళలను మాత్రమే ఆడిపోసుకోవడం సంస్కారం కాదనీ చెప్పకోవాలి. నామిని మీద ప్రేమతోనో ఆయన భాషపైన మోజుతోనో కొందరు ఈ నవల ప్రపంచీకరణకు ప్రతిబింబం అన్నట్టు పల్లెలు నిజంగానే పాడైపోయినట్టు సమర్ధించడం కూడా పాక్షికంగానే నిలబడుతుంది. ఎవరు ఏ కథ రాసినా అందులోని వైరుధ్యాలను భిన్న శక్తుల సంఘర్షణను చెబితే అప్పుడు సమాజీకులు పరిణామక్రమాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంతా పాడై పోయిందనీ పాడై పోవడం మామూలేననీ సాధారణీకరణ చేసిపారేస్తే వాస్తవికత కాదు. పిల్లులను తీసుకొస్తేనో మొక్కల కోసం విచారిస్తేనో ఒక రచన ప్రకృతి సిద్ధమై పోదు, వికృతి మాసిపోదు.
తెలుగునాట అమ్మపైన నాకు పేటెంటు వుందని గర్వపడిన ఒక రచయిత ఆడాళ్లందరిలోనూ అదే అమ్మతనం చూడలేకపోవడం బాధాకరం. లావుగా ఉన్న వారిని పంది అంటారు గనక పుస్తకం పొడుగునా పందొసంత అని రాయడం, కుల సీ్త్రల కులటతనాన్ని పేజీల కొద్ది చిత్రించడం సహజత్వం ముద్రతో నడిచిన మనో చాపల్యం మాత్రమే. రచయిత తన కులం పేరే వాడుతున్నారు గనక దీనిపై ఏది రాసినా చెల్లిపోయినట్టేనా? కొడవటి గంటి కుటుంబరావు కూడా చాలా దశాబ్దాల కిందటే పతివ్రత అనే కథ రాశారు. అయన కథలు నవలలు చాలా వాటిలో శారీరక సంబంధాల ప్రస్తావనలుంటాయి. బాలచందర్‌ చిత్రాల్లోనూ నైతిక విలువల ఘర్షణను, జీవితపు వికార పార్శ్వాన్ని చూపించే పాత్రలు ఎన్నో ఉంటాయి గాని ఆ తరహా వేరు. సమాజంలో పౌరుల్లాగే రచయితలు కూడా ఐచ్ఛికంగా కొన్ని ప్రమాణాలు పాటించడం రచనా శిల్పంలో భాగం తప్ప ప్రత్యేక నైతిక సూత్ర బోధన కాదు. రచయిత అనుకున్నా లేకున్నా కొంతమంది ఇందులో ప్రపంచీకరణ ప్రభావాలను చూడటానికి ప్రయత్నించడం కృత్రిమ సమర్థన కోసమే అక్కరకు వస్తుంది. మూలింటి మొదటామె గురించిన కథ నాటికి ఏ ప్రపంచీకరణ ఉంది? నెంబర్‌ వన్‌ పుడింగిలో కేవలం ఆత్మస్తుతి, అనుచితమైన పరనింద, ఆదరించినవారిపట్ల అపహాస్యం వుంటే మూలింటామెలో మొత్తం సమాజాన్ని చులకన చేసే జుగుప్సాకర ధోరణి ఉంది. ఇందుకు విచారిస్తూ తొలినాటి సహజ వాస్తవికతకు తిరిగి వస్తారని ఆశిస్తున్నాను.
– తెలకపల్లి రవి
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కేన్సర్ కు”ఆహుతి ” ప్రసాద్

కేన్సర్ కు”ఆహుతి ” ప్రసాద్

విశిష్ట వాచకం విలక్షణ అభినయం (03-Jan-2015)
‘ఇతనితో డిఫరెంట్‌ కేరక్టర్లు చేయించొచ్చు’, ‘ఇతనిని పెట్టుకున్నామంటే ఆ పాత్రకు ప్రాముఖ్యం ఉండాలి’ అని దర్శకులు భావించే నటునిగా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు ‘ఆహుతి’ ప్రసాద్‌ కేన్సర్‌ వ్యాధితో బాధపడుతూ అర్ధంతరంగా కన్నుమూయడం తెలుగు చిత్రసీమను విచారంలో ముంచేసింది. సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకుని పేరు సంపాదించుకున్న అతి కొద్దిమంది నటుల్లో ఆయన ఒకరు. చొరవగా ముందుకెళ్లే మనస్తత్వం లేకపోవడంతో కెరీర్‌ మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ మితభాషి మరణం తర్వాతే ఆయన ఎంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్నారో లోకానికి తెలిసింది. ‘ఆహుతి’ చిత్రంతోటే మొదటిసారిగా అందరి దృష్టిలో పడి, ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నప్పటికీ, ‘చందమామ’ చిత్రంలో చేసిన రామలింగేశ్వరరావు పాత్రే ఆయనకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
ఆహుతి ప్రసాద్‌ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్‌. కృష్ణాజిల్లా, ముదినేపల్లి పక్కన కోడూరు గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రంగారావు, హైమావతిల దంపతులకు నలుగురు అమ్మాయిల తర్వాత కలిగిన మగ సంతానం వరప్రసాద్‌. ఆయన తండ్రికి కర్ణాటక ట్రాన్స్‌ఫర్‌ కావడంతో మూడో తరగతి వరకు ఆయన చదువు అక్కడే సాగింది. నాలుగో తరగతి నుండి ఆరవ తరగతి వరకు కర్నూలులో ఆయన అక్క దగ్గర చదువుకున్నారు. తర్వాత కోదాడ, మిర్యాలగూడలో పదో తరగతి వరకు చదివి, అక్కడే ఇంటర్‌లో చేరారు. ఇంట్లో ఒక్కడే మగబిడ్డ కావడంతో కుటుంబం ఆయనను ఎంతో గారాబంగా పెంచింది. స్కూల్‌ రోజుల్లోనే ప్రసాద్‌కు నటన అంటే పిచ్చి. క్లాసులు ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసేవారు. నాగార్జున సాగర్‌లో చదువుతున్న
సమయంలో ‘అభినయం’ అనే నాటకం వేసి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. అలాగే ఆయన వేసిన రెండో నాటకం ‘అన్నాచెల్లెళ్లు’ కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. దానికిగాను నాగార్జున సాగర్‌ డ్యామ్‌ ఛీప్‌ ఇంజనీర్‌ అప్పట్లో విదేశాల నుండి తెప్పించిన ఓ పెన్నును బహుమతిగా ఇవ్వడం ఎప్పటికీ మరువలేని అనుభూతిగా ఆహుతి ప్రసాద్‌ చెప్పేవారు. చదువులో బిలో ఏవరేజ్‌గా స్టూడెంట్‌గా ఉన్న ఆయనకు నాటకాల్లో ప్రశంసలు దక్కడంతో సినీ నటుడు కావాలనే ఆశ మరింత బలపడింది. సినిమాల్లోకి వెళ్తానంటే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో చదువుపై అంతగా దృష్టిసారించక కోదాడలో డిగ్రీ మధ్యలో వదిలేశారు. పెళ్లి చేస్తే సినిమాల గొడవ పక్కన పెడతాడనే ఉద్దేశ్యంతో విజయనిర్మలతో పెళ్లి చేశారు పెద్దలు.
కెమెరా ముందుకు… 
పెళ్లి తర్వాత 1983 జనవరిలో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అందులో ఈయనదే మొదటి బ్యాచ్‌. రాంజగన్‌, శివాజీరాజా, అచ్చుత్‌, సుబ్బారావు ఈయనకు కొలీగ్స్‌. ఏడాది తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కి షిప్ట్‌ చేశారు. మధుసూధనరావుగారి ద్వారా తాతినేని ప్రకాశరావుగారితో పరిచయాన్ని పెంచుకున్నారు. ఆ పరిచయంతో ప్రకాశరావు ‘మీరు ఆలోచించండి’ సీరియల్‌లో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ప్రతాప్‌ ఆర్ట్స్‌లో ఓ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్తే రాఘవగారబ్బాయి తీస్తున్న ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమాలో మెయిన్‌ విలన్‌గా బుక్‌ చేశారు. ఈలోగా మధుసూధనరావుగారికి మరో రెండు సినిమాలొచ్చాయి. ఒకటి ఉషాకిరణ్‌ మూవీస్‌లో ‘మల్లెమొగ్గలు’, రెండోది నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్‌’. ఈ రెండింటికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ నటించారు. ఆయన మొదట తెర మీద కనిపించిన సినిమా ‘విక్రమ్‌’. ఆ తర్వాత ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమా విడుదలైంది. మద్రాస్‌లో ఆ సినిమా చూసిన శ్యాంప్రసాద్‌ రెడ్డి ‘ఆహుతి’ సినిమాలో అవకాశమిచ్చారు. 1987 డిసెంబర్‌ 3న విడుదలైన ‘ఆహుతి’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో, రాజశేఖర్‌, జీవితతో పోటీపడుతూ హోమ్‌ మినిస్టర్‌ శుంభుప్రసాద్‌ పాత్రను ప్రసాద్‌ ఎంత బాగా చేశారో అందరికీ తెలిసిందే.
నష్టం తెచ్చిన ‘ఆహుతి’ పేరు
ఆహుతి ప్రసాద్‌ సినిమా కెరీర్‌ను పరిశీలిస్తే ‘చందమామ’ ముందు, ‘చందమామ’ తర్వాత – అని విభజించవచ్చు. ‘ఆహుతి’తో తొలి బ్రేక్‌ వచ్చినా, దానిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. మంచి మంచి అవకాశాలు వస్తున్న టైమ్‌లో మిత్రులైన నటులు రఘుబాబు, హరిప్రసాద్‌తో కలిసి కన్నడంలో సినిమాలు నిర్మించే పనిలో మునిగిపోయారు. దీంతో ఆయన నటించడం మానేశాడేమోనని అడగడం మానేశారు. పైగా జనార్దన వరప్రసాద్‌ పేరు కాస్తా, ‘ఆహుతి’ ప్రసాద్‌గా మారడంతో, ఆ పేరే ఆయనకు మైనస్‌గా మారింది. ‘ఆహుతి’ అనే పదాన్ని నిర్మాతలు నెగటివ్‌గా భావించడం వల్ల కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడారు. ఏదైనా పాత్రకు ఆయనను తీసుకుందామని దర్శకులు అంటే, ‘ఆహుతా.. వద్దు లేవయ్యా. ఆ సౌండే బాగాలేదు’ అని నిర్మాతలు అనడం వల్ల పెద్ద పెద్ద సినిమాలే చేజారిపోయాయి. పైగా ఆయనది చొరవ తీసుకునే మనస్తత్వం కాదు. మొహమాటం, తనను తాను బూస్టప్‌ చేసుకునే తెలివితేటలు లేకపోవడం వల్ల కూడా అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ టైమ్‌లో కృష్ణవంశీ నుంచి ఆయనకు మంచి ఆఫర్‌ వచ్చింది. అది నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’లో హీరోయిన్‌ టబు తండ్రి కేరక్టర్‌. ఆ పాత్ర ఆయన కెరీర్‌కు రెండో బ్రేక్‌.

‘చందమామ’తో దశ తిరిగింది

‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత నుంచి ఆయన అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది. అనేక కుదుపులతో అతలాకుతలమైన ఆయన కెరీర్‌ను ఆ సినిమా మంచి మలుపు తిప్పింది. చాలా సినిమాల్లో చేసిన పాత్రల్లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కానిస్టేబుల్‌ నుంచి ఐజీ దాకా అన్ని రకాల పోలీస్‌ పాత్రలను ఆయన చేశారు. దాదాపు తొంభై సినిమాల్లో పోలీస్‌ పాత్రలను పోషించిన రికార్డ్‌ ఆయనది. అయితే ‘ఆహుతి ప్రసాద్‌ ఇట్లా కూడా చేస్తాడు’ అనే పేరు తెచ్చిపెట్టిన చిత్రం ‘చందమామ’. దాని దర్శకుడూ కృష్ణవంశీయే. అందులో గోదావరి యాసతో మాట్లాడే రామలింగేశ్వరరావు పాత్ర ఆయన కెరీర్‌కు బోనస్‌లా మారింది. ఆలస్యంగానైనా ఆ కేరక్టర్‌ ఆయన సినీ జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. అప్పటివరకూ విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా సీరియస్‌గా కనిపిస్తూ వచ్చిన ఆయన కామెడీ కూడా గొప్పగా చేయగలడని ఆ సినిమా నిరూపించింది. రామలింగేశ్వరరావు పాత్రలో ఆహుతి ప్రసాద్‌ నటనను, ఆయన డైలాగ్స్‌ను ఆస్వాదించడానికే ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు చాలామందే. ‘చందమామ’తో ఆయనకు ఎంత పేరొచ్చిందనేదానికి నిదర్శనం – విజయవాడలో ఆ సినిమా ఆడుతున్న థియేటర్‌ వద్ద నలభై అడుగుల ఆహుతి ప్రసాద్‌ కటౌట్‌ పెట్టడం. ‘‘ఈ సినిమాలో రామలింగేశ్వరరావు కేరక్టర్‌ వల్ల రిపీట్‌ ఆడియెన్స్‌ ఎక్కువగా ఉన్నారు కాబట్టే ఆయన కటౌట్‌ పెట్టాం’’ అని డిసి్ట్రబ్యూటర్లు చెప్పారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో చేసినప్పట్నించీ, కృష్ణవంశీకి సన్నిహితుడు కావడం, ఆయన వద్ద గోదావరి యాసలో జోకులు చెప్తుండటం వల్లే రామలింగేశ్వరరావు పాత్ర ఆయనకు లభించింది. కృష్ణవంశీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు.
రెండు నందులు
ఇరవై ఏడేళ్ల కెరీర్‌లో 250కి పైగా చిత్రాలు చేసిన ఆయన నటనా ప్రతిభకు గుర్తింపుగా రెండు నంది అవార్డులు లభించాయి. మొదట ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా అవార్డు పొందిన ఆయన, రెండోసారి ‘చందమామ’లోని రామలింగేశ్వరరావు పాత్రను పోషించిన తీరుకు ఉత్తమ కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా అవార్డు అందుకున్నారు. ‘విక్రమ్‌’ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్‌ను శివాజీ గణేశన్‌ చేతులు మీదుగా అందుకోవడం, హిందీ ‘సూర్యవంశ్‌’లో అమితాబ్‌తో పద్దెనిమిది రోజులు కలిసి పనిచేయడం, కమల్‌హాసన్‌తో ఓ తమిళ సినిమా చేయడం తన జీవితంలో మరపురాని క్షణాలని ఓ సందర్భంగా ఆయన చెప్పుకున్నారు. అలాగే విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీ రామారావుతో కలిసి నటించకపోవడం తీరని లోటుగా ఆయన భావించేవారు. తెరపై నటుడు కావాలనే కోరికను తీర్చుకుని, స్వయంకృషి, పట్టుదలతో ఓ చక్కని నటునిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వరప్రసాద్‌ మరణంతో తెలుగు చిత్రసీమ ఓ నిఖార్సయిన తెలుగు నటుణ్ణి అర్ధంతరంగా కోల్పోయినట్లయింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు కవితలు –

— 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపరాధ శాతం -డా యు ఏ అనంత మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవితమే సఫలం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చినుకు -జనవరి

katyayani1 001katyayani2 001katyayani3 001sripada1 001 sripada2 001katyayani1 001 katyayani2 001 katyayani3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాటి ఏకచక్రపురమే నేటి బోధన్‌ – శంకరుల వాణి విశ్వవాణి

నాటి ఏకచక్రపురమే నేటి బోధన్‌

andhraprabha –   Sun, 7 Dec 2014, IST

తెలంగాణాలోని పుణ్య క్షేత్రాల్లో ఏకచక్రపురం ప్రముఖమైంది. ఈనాటి బోధన్‌ పట్టణమే అలనాటి ఏకచక్రపురం. ఈ ప్రాంతంలో వరి ధాన్యం అధికంగా పడటం వల్ల బహుధాన్యపురమనే పేరు కూడా వాడుకలో ఉంది. అదే క్రమంగా బోధన్‌గా మారింది. పాండవులు అజ్ఞాత వాసంలో బ్రాహ్మణులుగా ఈ పురంలో నివసించారన్నది పౌరాణిక కథనం.

బోధన్‌లో చక్రేశ్వరాలయం, రేణుకాదేవి ఆలయం ప్రసిద్ధమైనవి. ఇవి 12 వందల సంవత్సరాల క్రితం నాటివి. చక్రేశ్వరాలయంలో అతి పెద్ద లింగం దర్శనమిస్తుంది. దక్షిణ భారతంలోనే ఇది అతిపెద్ద శివలింగం. ఇది స్వయంభూ శివలింగం. దీని ప్రస్తావన శివలీలామృతంలో ఉంది. ఈ ఆలయం ప్రాంగణంలో శాండిల్య మహర్షి తన శిష్యులకు వేదవిద్యను బోధించాడట. ఈ ఆలయం నెలకొనడంతో ఏకచక్రపురాన్ని దక్షిణ కాశిగా కూడా పిలుస్తారు.

రేణుకాదేవి ఆలయంతో పాటు కార్తికేశ్వర ఆలయం, నాగేశ్వరస్వామి ఆలయం, రామాలయం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, బొజ్జ గణపతి ఆలయం, హనుమాన్‌ టేకడీ, ఆనంద హనుమాన్‌, దక్షిణ ముఖి హనుమాన్‌ వంటి పేర్లతో ఎన్నో హనుమాన్‌ ఆలయాలు ఉన్నాయి. ఇవి కాక సాయిబాబా ఆలయాలు కూడా ఉన్నాయి.

బోధన్‌లోని చక్రేశ్వరాలయాన్ని కాకతీయులు బాగా అభివృద్ధి పర్చారు. మహ్మదీయుల దండయాత్రల కాలంలో ఈ ఆలయాన్ని కాపాడేందుకు భూస్థాపితం చేశారనీ, 1959లో త్రవ్వకాలు జరిపినప్పుడు పెద్ద శివలింగం బయటపడిందని చెబుతారు.

జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌కి 27 కిలో మీటర్ల దూరంలో ఉన్న బోధన్‌ బౌద్ధ. జైన ధర్మాల సంగమం. తమిళకవి పంపకవి ఇక్కడే నివసించాడని చెపుతారు. ఈ చక్రేశ్వరస్వామివారికి మొక్కుకుంటే సంతానహీనులు సంతానవంతులవుతారని నమ్మకం. స్వామివారికి క్రమం తప్పకుండా, దీక్షగా ప్రదక్షిణాలు చేస్తే, సంతానవంతులు అవుతారన్నది భక్తుల నమ్మకం. చక్రేశ్వరాలయాన్ని సందర్శించేందుకు హైదరాబాద్‌, నిజామాబాద్‌ల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుంచికూడా భక్తులు వస్తుంటారు. చక్రేశ్వరాలయం, రేణుకాదేవి ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఇక్కడ ప్రతిపర్వదినంలోనూ ఉత్సవాలు జరుగుతాయి. ఇరుగుపొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతం పర్యాటక పరంగా కూడా ప్రసిద్ధి చెందింది. పాండవులకాలం నాటి ఏక చక్రపురమే నేటి బోధన్‌. పౌరాణిక, చారిత్రక ప్రశస్తి చెందిన బోధన్‌లో బౌద్ధ, జైన మందిరాలు కూడా ఉండటం వల్ల ఆ మతాలకు చెందినవారు కూడా ఈ పట్టణానికి వస్తూంటారు. హిందువులకూ, బౌద్ధ, జైనులకు పవిత్రమైన క్షేత్రంగా బోధన్‌ విరాజిల్లుతోంది.

– స్వామి అనంత

 

శంకరుల వాణి విశ్వవాణి

andhraprabha –   Sun, 4 Jan 2015, IST

ఉదయనుడు, కుమారిలభట్టుక, వీరి పిదప ఆదిశంకరులు, బౌద్ధజైనములను పండితులతో వాదించి ఎదుర్కొన్నారు. ఇందులో ఆదిశంకరులు చేసిన కార్యం అద్వితీయం. అయితే ఆదిశంకరుల అద్వైతం ఎవరో పండితులే అర్థంచేసుకోగలరు. దానిని అనుభవంలోనికి తెచ్చుకొనగలిగినవారు కోటికి ఒక్కరు. బౌద్ధజైనములను ఖండించుటతో బాటు వారొక మహోన్నతమైన కార్యం చేశారు. ఆ కాలంలో దేశంలో ప్రబలిన దుర్మతములను వారు ఖండించి వైదిక కర్మానుష్ఠానములను మరల వాడుకలోకి తెచ్చి బ్రాహ్మణ్యమును, దాని నాయత్వాన్ని పున: స్థాపనం చేశారు.

నాయత్వం అంటే ఈ కాలంలో మాదిరిగా జెండాలు పట్టుకొని ఊరేగింపులూ, సభాధిపత్యములూ పూలమాలలై. బంగారుశాలువలూ కాదు. ఆ నాయత్వం మౌనంగా జరిగింది. అహింస, భక్తీ, ప్రేమ, అపరిగ్రహం, స్వార్ధరాహిత్యం మొదలైన ఆత్మగుణములతో బ్రాహ్మణులు ఉన్న చోటుననే డంభాచారాలకు పోక ప్రజలలో నిర్భయత్వం పెంపొందారు. ఇతరులకు వారు ఆదర్శంగా వున్నారు. భారత దేశమంటే ఏమి? భారతం అంటే ధఱ్మం, భక్తీ, అత్మైశ్వర్యమూ శంకరుల విషయంలో ఆచార్యపదం అర్థవంతమైనది. వారి బోధలు ఒక్క భారతదేశానికీ కాదు. ప్రపంచమంతటికీ.

వారు దేశమంతా విజయ యాత్రలు చేశారు. దుర్మతాలు దేశాన్ని వదలి పారిపోయినవి. వారి విజయం. వారు ధర్మాన్ని పున: ప్రతిష్ట చేశారు. ప్రజలలో జ్ఞానం, భక్తీ, అద్వైతం, పున: స్థానం చేశారు. కర్మం ధర్మమూ ఎప్పుడూ ఇస్తున్నాడు. అంతేకాదు. పాపలక్షణానికి వలసిన సదుపాయాలు అయిన గురువు, శాస్త్రాలను క్షేత్రం కలిపించి సాయపడుతున్నాడు. పాపి కూడస్వర్గానికి పోతాడన్న ఇతర మతస్థుల నమ్మకం కంటే, మన మతంలోచెప్పిన విధానమే చక్కగా వున్నదని వివేచన చేసేవారికి విశదమౌతుంది. ఇందులో పురుషయత్నానికి సమకూర్చటం అతని కరుణావిశేమని చెప్పాలి.

సైన్స్‌ ప్రకారం పునర్జన్మ ఉందా? అని చాలామంది పరిశోధనలు చేయటానికి ప్రారంభించారు. ఈ శాస్త్ర విభాగాన్ని పారా సైకాలజీ వారి పరిశోధనల వల్ల తేలింది ఏమంటే పునర్జన్మ ఉందని. గడిచిన జన్మలో వృత్తాంతాలు మరువక కొందరు ఏకరువు పెట్టగా, వారు చెప్పిన ప్రదేశాలకు వెళ్లి పరిశోధిస్తే, ఆ వృత్తాంతాలు జరిగినట్లే ఆ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. ఇట్టు పూర్వజన్మ స్మృతులున్నవారు అందరు పోయిన జన్మలో సాధారణంగా చనిపోక ఆకస్మిక దుర్మరణ ప్రాప్తిచేత చనిపోయారని కూడా ఆ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత రత్నాలు

భారత రత్నాలు

  • 04/01/2015
  • -మాధురి

ఏదైనా ఘనత సాధించిన పిల్లల్ని చూస్తే ఏ తల్లి అయినా మురిసిపోతుంది. రత్నాల్లాంటి పిల్లలని గర్వపడుతుంది. ఇప్పుడు భరతమాత కూడా మురిసిపోతోంది. దేశ సేవలో వెన్నుచూపని రత్నాల్లాంటి వాజపేయి, మదన్‌మోహన్ మాలవ్యలకు భారతరత్న పురస్కారం ప్రకటించడంతో జాతి యావత్తు గర్వపడుతోంది. ‘రైట్ మేన్ ఇన్ రాంగ్ పార్టీ’గా ప్రతిపక్ష నేతల ప్రశంసలు పొందిన గొప్ప రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజపేయి. ప్రధానిగా కీలక బాధ్యతలు నిర్వహించిన కాలంలోనూ, సుదీర్ఘ రాజకీయ జీవితంలోనూ ఎలాంటి వివాదాలకు లోనుకాకుండా విజ్ఞతతో ఎదిగిన విలక్షణ నేత ఆయన. ప్రధానమంత్రిగా ఆయన పాలన దేశాన్ని సమూలంగా మార్చలేకపోయిందన్న వాదనల సంగతి పక్కన పెడితే- పాకిస్తాన్‌కు స్నేహహస్తం అందించడంలోనూ, జమ్ము కాశ్మీర్ విషయంలోనూ, అణ్వస్త్ర పరీక్షల సమయంలోనూ, కార్గిల్ యుద్ధం వేళ ఆయన తీసుకున్న నిర్ణయాలు సర్వజన ఆమోదాన్ని పొందాయన్నది కాదనలేని వాస్తవం. లౌకిక వాదం, ప్రజాస్వామ్యం పట్ల వాజపేయికి ఉన్న అచంచల విశ్వాసం, గౌరవం ఆయన కీర్తిని పెంచాయి. జనసంఘ్ పుట్టుక, జనతా పార్టీ ఆవిర్భావం- దాని వైఫల్యం, ఆ తర్వాత అది భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందడం వంటి పరిణామాలతో పాటే ఆయన రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఎదిగింది. సొంతపార్టీలో సహచర నాయకులను విభేదించిన సందర్భాలు లేకపోయినా, అవసరమైన సమయంలో ఆయన విభిన్నంగా వ్యవహరించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపు అర్ధ శతాబ్దం పాటు అత్యంత క్రియాశీలకంగా ఉండడం, సంకీర్ణ శకంలో ప్రధాని పదవిని అధిష్ఠించడం, అత్యున్నత పదవిలో అందరి మన్ననలు పొందడం ఆషామాషీ కాదు. ఆ అరుదైన ఘనతను పొందడం ఆయనకే సుసాధ్యమైంది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్నప్పటికీ ఆయనను ‘ఉదారవాది’గా అభిమానించి విపక్షాలు అక్కున చేర్చుకున్నాయి. సొంత పార్టీలో నిరసన సెగలు రాజుకుంటాయని తెలిసినా- ‘బాబ్రీ మసీదు కూల్చివేతను ఓ చీకటి ఘడియ’గా అభివర్ణించిన సాహసం ఆయనకే చెల్లింది. ‘సంఘ్ పరివార్’తో సన్నిహితంగా ఉంటూనే స్వతంత్రంగా వ్యవహరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను ఎవరూ తప్పుపట్టలేకపోయారు. లోక్‌సభలో వాజపేయి సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు విపక్ష నేతలంతా ప్రభుత్వ వైఫల్యాలపై దుమ్మెత్తిపోసినా- వ్యక్తిగతంగా ఆయనను కీర్తించక తప్పలేదు. బహుముఖ ప్రతిభ.. ఎన్నికలు, రాజకీయాలంటేనే ప్రజల్లో విరక్త్భివం కలిగిన సమయంలో వాజపేయి ఓ ఆదర్శనేతగా కనిపించారు. ప్రభుత్వాధినేతగా, పాలనాదక్షుడిగా, కవిగా, పాత్రికేయుడిగా, దౌత్యదూతగా, స్వయం సేవకుడిగా, దేశభక్తుడిగా.. ఇలా ఎనె్నన్ని పాత్రలు పోషించినా వాజపేయిది ఓ విభిన్న శైలి. విపక్షంలో ఉన్నా, అధికార పగ్గాలు చేపట్టినా పదవులకే వనె్న తెచ్చి, జాతి జనుల మనోఫలకాలపై బలమైన ముద్ర వేసుకోవడం ఆయనకే సాధ్యమైంది. సున్నిత సంస్కారం, మృదుభాషణ, విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం. మితవాదిగా ఉంటూ పార్టీలో సమన్వయ గళం వినిపించిన విజ్ఞుడు.. పొరుగు దేశాలతో స్నేహం కోసం పరితపించిన ఆత్మీయ మిత్రుడు.. ఇన్ని విశిష్టతలున్నందునే కాంగ్రెసేతర ప్రధానిగా సుదీర్ఘకాలం పాటు దేశానికి సేవలందించిన నేతగా కీర్తి గడించారు. ‘స్వయం సేవకుడు..’ సువిశాల భారత దేశానికి పదకొండో ప్రధానిగా సేవలందించిన వాజపేయి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినాన కృష్ణ బిహారీ వాజపేయి, కృష్ణాదేవి దంపతులకు జన్మించారు. బ్రిటిష్ వలస పాలకుల నియంతృత్వ పోకడలను వ్యతిరేకించి కౌమార దశలోనే ఆయన జైలుశిక్ష అనుభవించారు. తొలుత కమ్యూనిజం పట్ల ఆసక్తి ఉన్నా, ఆ తర్వాత ఆయన ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆర్‌ఎస్‌ఎస్) పట్ల ఆకర్షితుడై ‘జనసంఘ్’ నేతగా ఎదిగారు. 1950 ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్ పత్రికలో పనిచేసేందుకు లా కాలేజీలో చదువుకు స్వస్తి పలికారు. దేశ స్వాతంత్య్రం కోసం 1942-45 మధ్య జరిగిన ‘క్విట్ ఇండియా’లో పాల్గొన్నారు. హిందూత్వ, హిందూ జాతీయత మాత్రమే రాజకీయాలకు సరైన వేదిక అని భావించి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. కాశ్మీర్‌ను సందర్శించే భారతీయ పౌరులు ప్రత్యేక అనుమతి పత్రాలు కలిగి ఉండాలంటూ అప్పటి పాలకులు విధించిన ఆంక్షలను నిరసిస్తూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953లో చేసిన ఆమరణ దీక్షకు వాజపేయి బాసటగా నిలిచారు. ముఖర్జీ దీక్ష ఫలితంగా అనుమతి పత్రాల నిబంధన రద్దు కావడమే కాకుండా, కాశ్మీర్‌ను అఖండ భారత్‌లో కలిపేందుకు అప్పటి పాలకులు అంగీకరించక తప్పలేదు. నిరాహార దీక్ష ఫలితంగా ఆరోగ్యం క్షీణించి ముఖర్జీ మరణించడం యువనేత వాజపేయి మనసును తీవ్రంగా కలచివేసింది. ముఖర్జీ భావాలను, నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న వాజపేయి 1957లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009 వరకూ ఆయన ఎం.పీగా 11సార్లు గెలిచారు. మిత్రపక్షాల మద్దతుతో అయిదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన ఘనత ఆయనకే దక్కింది. నాలుగు దశాబ్దాల పాటు ప్రతిపక్షంలో కొనసాగి, 1996లో తొలిసారి ప్రధాని పదవిని చేపట్టారు. పార్లమెంటులో తగినంత సంఖ్యాబలం లేనందున ఆయన 13 రోజులు మాత్రమే ( 1996 మే 16 నుంచి 31 వరకూ) ప్రధాని పదవిలో కొనసాగారు. 1998లో రెండోసారి ప్రధాని పదవి చేపట్టినా 13 నెలలు మాత్రమే అధికారంలో కొనసాగారు. అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన రెండోసారి ప్రధాని పదవిని కోల్పోయారు. 1999లో మూడోసారి ప్రధాని పదవిని చేపట్టి మిత్రపక్షాల మద్దతుతో అయిదేళ్ల పూర్తికాలాన్ని సునాయాసంగా పూర్తి చేశారు. ఎమర్జెన్సీ అనంతరం కేంద్రంలో జనతాపార్టీ అధికార పగ్గాలు చేపట్టాక మురార్జీ దేశాయ్ మంత్రివర్గంలో వాజపేయి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో హిందీలో ప్రసంగించిన తొలినేతగా రికార్డు సృష్టించారు. మన దేశంలో ప్రధాని పదవిని చేపట్టిన వారిలో చాలామంది కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమో లేదా ఆ పార్టీ మద్దతు తీసుకోవడం వల్లో అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించారు. అయితే, వాజపేయి మాత్రం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ కాంగ్రెస్‌లో చేరలేదు, ఆ పార్టీ మద్దతుతో అధికారం చేపట్టలేదు. అనేక ఏళ్ల పాటు విపక్ష నేతగా వ్యవహరించి ప్రధాని పదవిని చేపట్టిన నేతగా ఆయనది అరుదైన రికార్డు. ప్రధానిగా ఉన్న కాలంలో జాతీయ భద్రత, సామాజిక ఆర్థికాభివృద్ధి, విదేశాంగ విధానంలో ఆయనది విలక్షణమైన పంథా. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అంతటి రాజనీతిజ్ఞుడిగా దేశంలోనూ, విదేశాల్లోనూ కీర్తిప్రతిష్ఠలు సాధించిన నేత వాజపేయి మాత్రమే. అవివాహితుడైన ఆయన రాజకీయాలతో మమేకమై ఉంటూనే తీరిక వేళల్లో పుస్తక పఠనం, కవితలు రాయడంలో కాలాన్ని గడిపేవారు. నెహ్రూ ఏమన్నారంటే… జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం కాశ్మీర్ వ్యవహారంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వైఖరిని దునుమాడుతూ వాజపేయి దేశమంతటా పర్యటించి ప్రసంగాలు చేశారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధాని పదవులు ఉండరాదంటూ ముఖర్జీ సిద్ధాంతాన్ని విస్తృత ప్రచారం చేశారు. ఆ తరువాత లోక్‌సభకు ఎన్నికై తొలి ప్రసంగంతో యావత్తు పార్లమెంటును ఆకట్టుకున్నారు. నెహ్రూ అయితే వాజపేయి ప్రసంగానికి తన్మయత్వం చెందారు. ఆ సమయంలో వచ్చిన ఓ విదేశీ ప్రతినిధికి- ‘యువకుడైన వాజపేయి .. ఈ దేశానికి భవిష్యత్తులో కాబోయే ప్రధానమంత్రి’ అని పరిచయం చేశారు. అంటే వాజపేయిలోని నాయకత్వ లక్షణాలను 1957 నాటికే నెహ్రూ గుర్తించారన్నమాట. అప్పటి ఆయన మాట 1996లో నిజమైంది. భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన సమయంలో వాజపేయి తన అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పేవారు. నెహ్రూ అవలంబించిన కొన్ని విధానాలను ఆయన మెచ్చకపోయినా స్ఫూర్తిదాయక నేతగా ఆయనను గౌరవించేవారు. ఆ మాటే బయటకూ చెప్పేవారు. అంతెందుకు..? 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి నెగ్గిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ‘అపర దుర్గ’గా అభివర్ణిస్తూ పార్లమెంట్‌లో వాజపేయి చేసిన ప్రసంగం ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పింది. మహాత్ముడు మాలవ్య భారతరత్న పురస్కారంతో బహుముఖ ప్రతిభావంతుడు మదన్ మోహన్ మాలవ్య ఈ తరం వారికి మరోసారి స్ఫురణకు వచ్చారు. మాలవ్య, వాజపేయి డిసెంబర్ 25నే జన్మించడం, ఇద్దరికీ ఒకేసారి అవార్డులు ప్రకటించడం యాదృచ్ఛికమే అయినా విశేషం. మహా విద్వాంసుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నేత, పాత్రికేయుడు, న్యాయకోవిదుడు అయిన మదన్‌మోహన్ మాలవ్యను జాతిపిత గాంధీజీ ‘మహామన’ అని సంభోదించేవారు. అంతటి గౌరవం పొందిన వ్యక్తి మాలవ్య. హిందూమత వ్యాప్తికి ఆయన ఎంతో కృషి చేసినా కుల, ప్రాంతీయ అసమానతలు, అంటరానితనాన్ని వ్యతిరేకించి పోరాడారు. ఆయన తొలుత కాంగ్రెస్‌వాది. మధ్యప్రదేశ్‌లోని మాల్యా ప్రాంతం నుంచి అలహాబాద్‌కు వలస వచ్చిన కుటుంబం వారిది. అలహాబాద్‌లో ఆయన 1861 జన్మించారు. 1911లో మనదేశంలో ఉంటున్న విదేశీ పిల్లల కోసం ‘్భరత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’ (బిసిజి) సంస్థ ఉండేది. భారతీయులకూ ఆ సౌకర్యం కావాలని ఆయన గట్టిగా పోరాడి 1913లో సాధించారు. ఆయనకు లాలాలజపతి రాయ్, అనిబిసెంట్ వంటివారు తోడ్పాటును అందించారు. 1933 నాటికి పూర్తిగా భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభమైంది. అంటే మనదేశంలో బిఎస్‌జి వ్యవస్థాపకుల్లో ఆయనొకరన్నమాట. అందులో పిల్లలను చేర్పించేలా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సేవాసమితిని నడిపారు. 1915లో కళలు, సాహిత్యం, విద్య బోధించేందుకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని వారణాసి (కాశీ)లో స్థాపించారు. ప్రస్తుతం ఈ విద్యా సంస్థ ఆసియాలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం. ఇప్పుడక్కడ 30వేల మంది యువతీ యువకులు విద్యను అభ్యసిస్తున్నారు. వారిలో 15వేలమంది వర్శిటీ హాస్టళ్లలోనే ఉంటున్నారు. కాశీలోని పవిత్ర గంగానదీ తీరంలో ఇప్పుడు అత్యంత ఆదరణ పొందుతున్న ‘హారతి’ ఆనవాయితీని హిందూ ధర్మంగా ప్రారంభించినది మాలవ్యే. గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఓ చిన్నదీవికి ‘మాలవ్య దీవి’గా పేరుందంటే ఆయనకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఊహించొచ్చు. హిందూధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా, ప్రాచుర్యం, వ్యాప్తికి తోడ్పడిన నేతగా చెప్పుకునే మదన్‌మోహన్ మాలవ్య కాంగ్రెస్‌లో పనిచేశారు. ఆ పార్టీకి నాలుగుసార్లు అధ్యక్షునిగా వ్యవహరించారు. మోతీలాల్ నెహ్రూ సహకారంతో లీడర్ అనే ఆంగ్లపత్రికను నడిపారు. అంతకుముందు సొంతంగా హిందీ పత్రికను నడిపారు. హిందూస్థాన్ టైమ్స్‌కు ఎడిటర్‌గా, అధిపతిగా వ్యవహరించారు. మర్యాద, హరిశ్చంద్ర చంద్రిక, మకరంత్, అభ్యుదయ వంటి పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. న్యాయవాదిగానూ ప్రాక్టీసు చేశారు. గాంధీజీ, లాలాలజపతి రాయ్, మోతీలాల్‌నెహ్రూ వంటి ప్రముఖులతో కలసి పనిచేశారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి కొన్ని నెలల ముందు 1946 నవంబర్ 12న 84 ఏళ్ల వయసులో ఆయన తనువు చాలించారు. వీరికెందుకు ఆలస్యం..? దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘్భరతరత్న’ను 1954లో ప్రవేశపెట్టాక- ఆ అవార్డులిస్తున్న తీరుపై వివాదాలు, విమర్శలకు అంతులేకుండా పోతోంది. ఇప్పటి వరకూ 45 మంది విశిష్ట వ్యక్తులకు ఆ గౌరవాన్ని ప్రకటించారు. అయితే, కేంద్రంలో అధికారం పగ్గాలు చేపట్టిన రాజకీయ పార్టీలు కొన్ని ప్రయోజనాలను ఆశించి ‘్భరతరత్న’ ఇవ్వడంలో వివక్ష చూపుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. అవార్డు గ్రహీతలను ఎంపిక చేయడంలో రాజకీయ కోణాలున్నాయన్న విమర్శలూ లేకపోలేదు. కారణాలు ఏమైనా 2002 నుంచి 2008 వరకూ ఈ అవార్డును ఎవరికీ ఇవ్వకపోవడం గమనార్హం. కొంతమంది నాయకులకు ఈ అవార్డు ప్రకటించకపోవడంతో వివిధ వర్గాల నుంచి ఇప్పటికీ నిరసన ధ్వనులు వినపడుతూనే ఉన్నాయి. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అరుదైన రికార్డు నెలకొల్పిన దివంగత నేత జ్యోతి బసు (పశ్చిమ బెంగాల్), సినీనటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు (ఆంధ్రప్రదేశ్), చరణ్ సింగ్, దళిత నేత కాన్షీరామ్, సంచలన హాకీ క్రీడాకారుడు, ఒలింపిక్స్ విజేత ధ్యాన్ చంద్, ప్రపంచ చెస్ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ వంటి ప్రముఖులకు ‘్భరతరత్న’ ప్రకటించకపోవడం పట్ల నిరసన ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ అత్యున్నత అవార్డును ఇప్పటి వరకూ ఇద్దరు విదేశీయులకు ప్రకటించినా, సొంత గడ్డపై కీర్తిశిఖరాలకు చేరుకున్న కొందరిని అలక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 1987లో పాకిస్తాన్‌కు చెందిన ‘సరిహద్దు గాంధీ’ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు, 1990లో దక్షిణాఫ్రికా పోరాట యోధుడు డాక్టర్ నెల్సన్ మండేలాకు ఈ అవార్డులు దక్కాయి. రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సైతం ఈ అవార్డును కొందరికి ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంతమందికి మరణానంతరం ఈ అవార్డును ప్రకటించడంలో రాజకీయ కారణాలున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. తమిళనాడులో సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్‌కు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించగా, మరో నట దిగ్గజం, తెలుగువారి కీర్తిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఎన్‌టిఆర్‌కు ఇంతవరకూ ‘్భరతరత్న’ ప్రకటించక పోవడం వివాదాస్పదమైంది. అన్ని అర్హతలున్నప్పటికీ రాజకీయేతర రంగాలకు చెందిన కొందరు ప్రముఖులకు ఈ అవార్డు దక్కలేదన్న వాదనలు ఉన్నాయి. 1928, 1932, 1936 ఒలింపిక్ పోటీల్లో మన దేశానికి బంగారు పతకాలు సాధించిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌కు ఈ అవార్డు ఇంతవరకూ దక్కలేదు. గత ఏడాది ధ్యాన్‌చంద్‌కు అవార్డు ప్రకటిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ, సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాలను ఆశించి క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ఆఖరి నిమిషంలో హడావిడిగా ఎంపిక చేయడంలో యుపిఎ ప్రభుత్వం అత్యుత్సాహం చూపిందన్న విమర్శలు చెలరేగాయి. హిందీ చలనచిత్ర సీమలో ఆరు దశాబ్దాల పాటు సేవలందించిన నటుడు దిలీప్‌కుమార్‌కు ఈ అవార్డు ప్రకటించకపోవడం సినీ అభిమానులను నిరాశకు గురి చేసింది. కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఆ దేశంలోని అత్యున్నత అవార్డు ’నిషాన్ -ఇ- ఇంతియాజ్’తో దిలీప్‌కుమార్‌ను గతంలోనే సత్కరించింది. 2007 నుంచి 2013 వరకూ ప్రపంచ చెస్ చాంపియన్‌గా భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన విశ్వనాథన్ ఆనంద్‌కు, ప్రముఖ అంతరిక్ష శాస్తవ్రేత్త విక్రమ్ సారభాయ్‌కు, ఇరవై భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లో పాటలు పాడిన ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లేకు, క్షీర విప్లవం సాధించిన వర్గీస్ కురియన్‌కు, సామాజిక కార్యకర్త బాబా ఆమ్టేకు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్తవ్రేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు, సంస్కరణల పర్వంతో దేశ ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించిన దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ‘్భరతరత్న’ ప్రకటించాలన్న వాదనలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. అవార్డు రద్దు.. ఒక్కసారే.. స్వాతంత్య్ర సమర యోధుడు, ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు ‘్భరతరత్న’ అవార్డు ఇస్తున్నట్లు 1992లో వచ్చిన ప్రకటన వివాదాస్పదమైంది. పురస్కారాన్ని స్వీకరించేందుకు ఆయన కుటుంబ వారసులు తిరస్కరించారు. ఈ అవార్డుపై వివాదం సుప్రీం కోర్టుకు చేరగా, ప్రభుత్వం తన ప్రకటనను రద్దు చేసుకుంది. ఈ ఏడాది అవార్డు గ్రహీతల జాబితాలో వాజపేయి, మదన్‌మోహన్ మాలవ్యతో పాటు బోస్ పేరు కూడా చేర్చాలని ప్రయత్నించినా కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించారన్న కథనాలు వెలువడ్డాయి. 1945 ఆగస్టులో విమానంలో ప్రయాణిస్తుండగా విదేశాల్లో బోస్ ‘అదృశ్యం’ అయ్యారన్న ప్రచారాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ నమ్మడం లేదు. ఆ సంఘటన జరిగి 70 ఏళ్లు గడిచినా, బోస్ ఇంకా బతికే ఉన్నారని ఆయన వారసులు భావిస్తున్నారు. ఆయన మరణం గురించి ఎలాంటి స్పష్టత లేనందున ‘మరణానంతరం’ భారతరత్న అవార్డు ఎలా ఇస్తారని వారు వాదిస్తున్నారు. ఒకటి, రెండు సందర్భాల్లో వివాదాలు వచ్చినా మొత్తమీద భారతరత్న ఓ సమున్నత పురస్కారమే. పతకం విశిష్టత భారతరత్న పతకానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ఆదేశం మేరకు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని తన మింట్‌లో తయారు చేయిస్తుంది. భారతదేశంలో ఇదే అత్యున్నత పౌర పురస్కారం. ఇది బిరుదు కాదు. ఓ గౌరవం మాత్రమే. అవార్డు గ్రహీతలు తమ పేరుకు ముందుగానీ, వెనుక గానీ ‘్భరతరత్న’ పదాన్ని వాడరాదు. ఈ పురస్కారాన్ని అందుకునేవారికి పతకం, రాష్టప్రతి ఇచ్చిన ధ్రువపత్రం అందజేస్తారు. ఎటువంటి నగదు బహుమతి లేదు. ఫలానా కాలానికి అంటూ ఏడాదికో, రెండేళ్లకో ఇవ్వాలనేం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇవ్వవచ్చు. ఒక విడతకు ముగ్గురికి మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఉంది. 1954లో ఈ పతకం వృత్తాకారంలో 35 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో బంగారంతో తయారు చేసేవారు. పతకంపై ఓ వైపు మధ్యలో సూర్యుడు, కిరణాల వ్యాప్తి బొమ్మలా ఉంటుంది. దేవనాగరి లిపిలో సంస్కృతంలో రాసిన భారతరత్న అన్న అక్షరాలుండేవి. పతకం అంచున వెండిలైన్ ఉండేది. ఆ పతకానికి రెండోవైపు మధ్యలో ప్లాటినంతో చేసిన నాలుగు సింహాల చిహ్నం, దానికింద ‘సత్యమేవ జయతే’ వాక్యం ఉండేవి. ఏడాది తరువాత దానిని సమూలంగా మార్చారు. ప్రస్తుతం ఈ పతకాన్ని రావి ఆకు ఆకారంలో 59 మిల్లీమీటర్ల పొడవు, 48 మిల్లీమీటర్ల వెడల్పు, 3.2 మిల్లీమీటర్ల మందంతో పూర్తిగా ప్లాటినంతో తయారు చేస్తున్నారు. పతకం మధ్యలో ప్లాటినంతో చేసిన కిరణాలు ప్రసరించే సూర్యుని బొమ్మ ఉంటుంది. ఈ కిరణాలు పొడవు, 16, 13 మి.మీ. చొప్పున ఉంటాయి. దేవనాగరి లిపిలో సంస్కృతంలో ‘్భరతరత్న’ అన్న అక్షరాలు ముద్రించి ఉంటాయి. పతకం రెండోవైపు నాలుగు సింహాల గుర్తు, సత్యమేవ జయతే నినాదం కన్పిస్తాయి. ఈ పతకానికి 51 మిల్లీమీటర్ల పొడవున్న తెల్లటి రిబ్బన్ ఉంటుంది. మెడలో ధరించడం కోసం ఇది ఇస్తారు. 1957లో ఈ పతకంపై ఉండే వెండిలైనింగ్‌ను కాంస్యంతో చేయడం మొదలైంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈశ్వర వశం విశ్వం -రామకృష్ణ ప్రభ -జనవరి -2015 మతసామరస్యం

eesvara vasham 2 001 esvara vasham1 001kalam 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయ వాద బ్రాహ్మణ సంఘం చే సామూహిక ఉచిత ఉపనయన మహోత్సవం 26-1-2015

విజయ వాద బ్రాహ్మణ సంఘం చే సామూహిక ఉచిత ఉపనయన మహోత్సవం 26-1-2015uchitaupanayanam -1 001 uchitaupanayanam 2 001

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం

(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 12015)                          

 

గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే “మన్మధ ” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 21, 2014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం – 20వ సారి పోటీ నిర్వహణ

ఏ వయస్సు వారైనా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

 

మొట్ట మొదటి రచనా విభాగం” –6 వ సారి పోటీ నిర్వహణ

కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆరవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.

“నా మొట్ట మొదటి కథ”: (ఉత్తమ కథ):  $116

“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): $58

యువతరం విభాగం- 2 వ సారి నిర్వహణ

ఈ నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని ఈ నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ పత్రం, కళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

 

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
  • తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
  • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు కాని, అంతకు ముందు కానీ  (మార్చ్ 21, 2015) ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితల ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries is:  March  1, 2015

Please send entries by e-mail attachments (PDF, JPEG or Unicode fonts)

sairacha2012@gmail.com  &  vangurifoundation@gmail.com

 

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు, (అధ్యక్షులు) & శాయి రాచకొండ (సంపాదకులు)

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

హ్యూస్టన్ & హైదరాబాద్

Phone: 832 594 9054

E-mail: vangurifoundation@gmail.com

www.vangurifoundation.blogspot.com

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రాగాల తోట.. వీటూరి పాట

రాగాల తోట.. వీటూరి పాట
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి… (దేవత-1965), బలేబలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు (భక్తతుకారాం-1973), మబ్బే మసకేసిందిలే, పొగమంచే తెరగా నిలిచిందిలే (వయసు పిలిచింది-1978), నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా (మల్లెపువ్వు-1978)… తెలుగువారు ఏనాటికీ మరిచిపోలేని గీతాలు ఇవి. కానీ ఈ మధుర గీతాలు రాసిన మహాకవి ‘వీటూరి’ని మాత్రం చాలామంది మరిచిపోయారు. కారణం… ఆయన పేరు మరో మహాకవి వేటూరి పేరును పోలి ఉండడం! వీటూరి రాసిన గొప్ప పాటల వల్ల అప్పుడప్పుడూ ఆ పేరు వినిపించినా, దానిని వేటూరిగా భ్రమపడే అవకాశమే ఎక్కువ. వేటూరి, వీటూరి – ఇద్దరూ పాటలు రాసిన ‘యమగోల’ చిత్రం (1977) పాటల పుస్తకంలో చివరి పాటకు కవి పేరు ‘వీటూరి సుందరరామమూర్తి’ అని పొరబాటుగా ప్రచురించడం ఇలాంటి ప్రమాదానికి ఓ ఉదాహరణ!
వీటూరి పూర్తిపేరు వీటూరి వేంకట సత్యసూర్య నారాయణమూర్తి. 1934 జనవరి 3న విజయనగరం జిల్లా ‘రెల్లివలస’లో ఆయన జన్మించారు. భీమిలిలో ఉపాధ్యాయ శిక్షణను పూర్తిచేసి స్వల్ప కాలం ఆ వృత్తిలో ఉన్నారు. ‘అక్కాచెల్లెలు’ చిత్రానికి రచనా సహకారం అందించడానికి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఆయన పేరు వెండితెరకెక్కింది మాత్రం శ్రీ మురళీకృష్ణా ఫిలింస్‌ వారి డబ్బింగ్‌ చిత్రం ‘శ్రీ కృష్ణ లీలలు’(1956)తోనే! ఆ చిత్రంలో ‘మురళీధరా కృష్ణయ్య, నిన్నే నమ్ముకొంటినయ్యా’ అనే చివరి పాటను వీటూరి రాశారు. ఆ తర్వాత ‘మహారథి కర్ణ’, ‘జగదేకసుందరి’ అనువాద చిత్రాలకు ఇతరులతో కలిసి పాటలందించినా, 1962లో ‘ఏకైక వీరుడు’(మన్నాది మన్నన్‌) డబ్బింగ్‌ చిత్రానికి రచనతోనే పరిశ్రమలో స్థిరపడ్డారు. అదే ఏడు కృష్ణకుమారి, కాంతారావు జంటగా నటించిన ‘స్వర్ణగౌరి’ చిత్రానికి కూడా మాటలు, పాటలూ రాసే అవకాశం వచ్చింది. వీటూరి ప్రతిభను గుర్తించి విఠలాచార్య, పద్మనాభం, హీరో కాంతారావు ఆయనను ఎక్కువగా ప్రోత్సహించారు.
ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ గాయకుడిగా పరిచయమైన ‘ఓ! ఏమి ఈ వింత మోహం…’ (శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న 1967) గీతం వీటూరి (సు)కృతమే! అద్భుతమైన భావాలు కలిగిన ఎన్నో మధుర గీతాలతోపాటు నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన (బంగారు తిమ్మరాజు-1964), గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు (ఇదాలోకం-1973), గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను (యమగోల 1977) వంటి హుషారైన పాటలూ రాసి ఆయన శభాష్‌ అనిపించుకున్నారు.
వీటూరి రచన చేసిన శతాధిక చిత్రాలలో దాదాపు సగం డబ్బింగ్‌ చిత్రాలే! తెలుగులో తీసిన నాలుగు భాషల (హిందీ, తమిళ, కన్నడ, మలయాళ) డబ్బింగ్‌ చిత్రాలకూ రచన చేసిన ముగ్గురు కవుల్లో వీటూరి ఒకరు. ‘ఏకైక వీరుడు’ (మన్నాదిమన్ననే), మన్మథలీల’ (మన్మదలీలై), ‘ఎర్ర గులాబీలు’ (సిగప్పురోజాక్కళే), ‘ధనమే ప్రపంచలీల’ (తాయిక్కుతలైమగనే), ‘అమరగీతం’ (పయనంగళ్‌ ముడివదిల్లె), ‘పట్నంపిల్ల’ (మనిదరిల్‌ ఎత్తనయో నిరంగళ్‌) మొదలైనవి వీటూరి ప్రసిద్ధ అనువాద చిత్రాలు.
తమిళ చిత్రం ‘మన్నాది మన్నన్‌’లో ఎంజీఆర్‌ కథకూ, తన అన్నాడీఎంకే పార్టీకి రెంటికీ అన్వయించేలా ‘కణ్ణదాసన్‌’ చేత ఒక పాట రాయించారు. ‘అచ్చమ్‌ ఎలేబదు మడమైయడా, అంజామై ద్రావిడర్‌ ఉడమైయడా, ఆరిలుమ్‌ సావు నూరిలుమ్‌ సావు తాయగమ్‌ కాప్పదు కడమైయడా’ అనే ఈ పాటకు ‘‘భయమనేది మూర్ఖత్వం. సాహసం ద్రావిడ లక్షణం. ఆరేళ్లకు చచ్చినా, నూరేళ్లకు చచ్చినా మాతృభూమిని కాపాడడం మన కర్తవ్యం. చేర, పాండ్య రాజులు తమ వీరత్వంతో జన్మభూమిని పునీతం చేశారు. తమిళ తల్లులు తమ బిడ్డలకు పుట్టుకతోనే వీరత్వాన్ని నూరిపోస్తారు. ఆ తల్లి గౌరవానికి భంగం కలిగితే ఆ పుత్రులు శూరులై పైకి లేస్తారు’’ అని భావం. దీని తెలుగు డబ్బింగ్‌ ‘ఏకైక వీరుడు’ లో ‘న్యాయం ధర్మం మరువకురా, ఏనాడూ ఎవరికి వెరువకురా, ఆంధ్రుల త్యాగం, ఆంధ్రుల శౌర్యం అవనిలో స్థిరముగ నిల్పుమురా…’ అంటూ ప్రాంతీయ భావాన్ని ప్రభోదిస్తూ స్వేచ్ఛానువాదం చేశారు వీటూరి. చరణాల్లో రుద్రమదేవి, మాంచాల, బ్రహ్మన, బాలచంద్రుడు మొదలైన వారి వీర ప్రశంస చేయడం ద్వారా ఈ పాటకు పూర్తి తెలుగుదనాన్ని అద్దారు.
‘మన్మదలీలై’లోని ‘హలో మైడియర్‌ రాంగ్‌ నంబర్‌, కేట్కవే ఉందన్‌ కురల్‌ సొర్గమే, నెరితే పార్తాల్‌ ఎన్న వెట్కమే’ అనే మూల గీతానికి ‘హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌, గొంతుకే వింటే ఎంత మధురం, చెంతకే వస్తే ఎంత స్వర్గం’ అనే పాట తెలుగుదనం ఉట్టిపడే వీటూరి అనువాద ధోరణికి మరో నిదర్శనం. సె్ట్రయిట్‌ చిత్రాల్లోని పాటలతో సమంగా ప్రాచుర్యాన్ని పొంది నేటికీ చెవిమరుగు కాని వీటూరి అనువాద గీతాలకు మరికొన్ని ఉదాహరణలు 1. ఎదలో తొలి వలపే, విరహం జత కలిసే, మధురం ఆ తలపే నీ పిలుపే (ఎర్రగులాబీలు-1979) 2. నెలరాజా, పరుగిడకు, చెలి వేచే నా కొరకు (అమరగీతం-1982) 3. పయనించే చిరుగాలీ, నా చెలి సన్నిధిలో చేరి (పట్నం పిల్ల-1980), 4. త్రిపుర సుందరీ, దర్శనలహరీ (జగద్గురు శంకరాచార్య- 1981).
అనువాదకవిగా తన సత్తా నిరూపించుకున్న వీటూరి పట్ల ఆ రంగానికి చెందిన నిర్మాతలకు గల గురికి నిదర్శనమైన ఓ ఉదంతాన్ని గుర్తు చేసుకోవాలి. ‘శుభలేఖ’ చిత్రానికి ముహూర్త గీతంగా రికార్డు చేసిన వీటూరి పాట కారణాంతరాల వల్ల ఆ చిత్రంలో చోటుచేసుకోకపోతే – ఆ పాట నచ్చిన ‘బందిపోటు విప్లవ సింహం’ (తమిళంలో ‘రాణువవీరన్‌’) నిర్మాతలు దానిని తమ చిత్రంలో అదనపు పాటగా (మూలంలో లేదు) వినియోగించుకున్నారు. శ్రీదేవి, రజనీకాంత్‌, చిరంజీవి ప్రముఖపాత్రల్లో నటించిన ఈ భారీ చిత్రంలో దీనిని ఓ ఐటం సాంగ్‌గా చిత్రీకరించారు. వ్యక్తిగతంగా వీటూరి ఎలాంటి భేషజాలు లేని నిరాడంబరుడు, సహృదయుడు. ‘దేవత’ చిత్రానికి ‘సింగిల్‌ కార్డ్‌’ పడాల్సిన ఆయన నిర్మాత పద్మనాభం కోరిక మేరకు తను రాసిన బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, మావూరు మదరాసు, నా పేరు రాందాసు… అనే పల్లవులను ప్రసిద్ధులైన సహకవులకిచ్చి వారిచేత పాటలను రాయించారు. పై రెండింటిలో మొదటి పాటను రాసిన శ్రీశ్రీ వీటూరి ఔదార్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు కూడా! (‘పాడవోయి భారతీయుడా’ పుస్తకంలో).
వీటూరి చివరి అనువాద చిత్రం 1985 డిసెంబరు 6 న విడుదలయిన ‘యవ్వనం పిలిచింది’. ఆ చిత్రం విడుదల కాకుండానే వీటూరి 1985 సెప్టెంబర్‌ 21న అనారోగ్యంతో అకాల మరణం పాలయ్యారు. చనిపోయే నాటికి ఆయన పేరు తప్ప ఏమీ మిగుల్చుకోలేదు. అటు అనువాదాల్లోనూ, ఇటు నేరుగా తీసిన తెలుగుచిత్రాల్లో నేటికీ నిలిచిన ఆణిముత్యాల్లాంటి పాటలెన్నిటినో రచించిన వీటూరి ప్రతిభకు తగ్గ గుర్తింపు మాత్రం లభించకపోవడం బాధాకరం.
ఫ డా. పైడిపాల
సెల్‌:9989106162
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాజమహేంద్రి వైభవానికి ప్రతిబింబం..

రాజమహేంద్రి వైభవానికి ప్రతిబింబం..

  • -సన్నిధానం నరసింహశర్మ
  • 03/01/2015
TAGS:

నరసింహావలోకనం (స్వీయ చరిత్ర)
-యాతగిరి శ్రీరామనరసింహారావు;
366 పుటలు; వెల: రూ.125/-లు
ప్రతులకు: ఎమెస్కో బుక్స్, 1-2-7,
భానూకాలనీ, గగనమహల్‌రోడ్,
దోమలగూడ, హైదరాబాదు- 500 029
మరియు సాహితీ ప్రచురణలు,
29-13-53, కాళేశ్వరరావురోడ్, విజయవాడ-2

ధారణాశక్తిగల బుద్ధిమంతుణ్ణి మేధావి అంటారు. ఇది శబ్దసంబంధ అర్థం. మేధావి వావిలాల వారు రాజమహేంద్రిలో పురపాలక సంఘ ప్రాంగణ వేదికపై ఓ సందర్భంలో ప్రకాశంపై అనర్గళ ఉపన్యాసం ఇస్తున్నారు. వేదికపై తెనే్నటి విశ్వనాథం, క్రొవ్విడి లింగరాజు మొదలైన వారున్నారు. తమ ప్రకాశ ప్రసంగధారలో వావిలాల వారు మధ్యమధ్య కొన్ని తేదీల వంటివి వచ్చినపుడు- కరెక్టే కదండీ అని వేదికపైనున్న ఓ వ్యక్తితో చూపుల సంప్రతింపులు చేసుకునేవారు. ఆ సంప్రతించబడిన వ్యక్తే శ్రీయాతగిరి శ్రీరామనరసింహారావు. ఆయన స్వీయచరిత్రే ఈ ‘నరసింహావ లోకనం’.
ఆంగ్లంలో స్వీయచరిత్ర రాసుకున్న మొదటి భారతీయుడు డీన్‌మహమ్మద్ (1759-1851). వెనె్నలకంటి సుబ్బారావు తమ ఆత్మకథను ఆంగ్లంలో రాసుకున్న ఆంధ్రుడు, శతక ప్రక్రియలో మండపాక పార్వతీశ్వర శాస్ర్తీ రాసిన దినచర్యారూప గ్రంథం ‘హరిహరేశ్వర శతకము’ లేక ఆత్మపర్యాయ- కార్యసపర్య తెలుగులో మొదటి ఆత్మచరిత్ర. ఇటువంటి పెద్దలు అనుకునేవి వకుళాభరణం రామకృష్ణ- చిలకమర్తి స్వీయచరిత్ర పీఠికలో విశే్లషణా పూర్వకంగా ఇచ్చారు.
వచనంలో వచ్చిన తెలుగు స్వీయచరిత్ర మొదటిది కందుకూరి వారిదనేది చారిత్రక వాస్తవం. ఒకనాటి కాలంలో కందుకూరి, చిలకమర్తి, ప్రకాశం వంటివారి స్వీయ చరిత్రలు వచ్చి ఎందరికో స్ఫూర్తినిచ్చి సామాజిక సాంస్కృతిక, రాజకీయ కాలనాళికలుగా వెలుగొంది ప్రథమశ్రేణి స్వీయచరిత్రలై పరిఢవిల్లాయి.
చిత్రమేమిటంటే- కందుకూరి, ఆంధ్రకేసరి వంటి స్వీయచరిత్రలు కంఠోపాఠం అన్నంతగా అధ్యయనం చేసిన ఒకనాటి యువకుడు శ్రీ నరసింహారావువారి సేవా చైతన్యస్ఫూర్తులతో, సాంస్కృతిక చారిత్రక సామాజిక కార్యకలాపాలతో ఎదిగి డెబ్భై ఏళ్ళు దాటిన వాడయి తానూ స్వీయచరిత్ర రాసుకునే స్థాయికి, రాయమని అడిగించుకునే స్థాయికి ఎదగడం! ఇందులోగల పట్టుదల, దీక్ష, సేవాతత్త్వం వంటి వాటిని వర్తమాన తరంవారు గ్రహించడానికి ఈ నరసింహావలోకనాన్ని అవలోకించాలి.
కర్ణాటకలోని యాదగిరినుండి 1703లో రాజమహేంద్రికి వలస వచ్చిన మధ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు శ్రీరావు. వీరేశలింగం స్వగృహం, ప్రకాశం అద్దెయిల్లూ వీరింటికి దగ్గరలో ఉండడంతో తమ తాతలకూ వారికీ రాకపోకలుండేవి. చిననాట నాటిన స్ఫూర్తిబీజాలు జీవన వృక్షాల్ని పెంచుతాయి. పనిచెయ్యని కొందరు ప్రజాప్రతినిధుల్ని కూడా ఇంద్రుడూ, చంద్రుడూ అని పొగడే కొందరి మధ్యకు వృద్ధ స్వాతంత్య్రయోధుల్ని తీసుకువచ్చి ఇదిగో మనం అర్చించుకోవలసిన వారు, వీరు. వీరి వీరగాథా ఘటనల్ని వినండి అంటూ వారిని రప్పించడం, ఉపన్యాసాలిప్పించడం, వారిని సత్కరించడం జీవితం నిండా చేసిన వీరి స్వీయ చరిత్ర నిండా ఏముంటాయో మనం వూహించుకోవచ్చు. ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపించి నిత్య సంచలన సంస్థగా పెంచారు. ఆంధ్రకేసరి జూనియర్ కళాశాల, ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలను స్థాపించారు. గౌతమీ గ్రంథాలయ ప్రభుత్వ స్వీకరణ ఉద్యమాన్ని చేబట్టి సఫలత చెందారు. రాజమహేంద్రవరంలో మార్కండేయేశ్వరస్వామి దేవాలయం ఉందనేది అందరకూ తెలుసు. మార్కండేయేశ్వరస్వామి తండ్రి పేర మృకండేశ్వర దేవాలయం వుండేదని, సంబంధ శివలింగం వంటి చారిత్రక పరావస్తు త్రవ్వకాల ద్వారా వెల్లడయ్యాయంటే దానికీ ఓ స్థానిక ఉద్యమం వచ్చింది. ఉద్యమాలనేవి ఏ ఒక్క వ్యక్తివల్ల మాత్రమే జరిగేవి కావు నిజమే. కానీ, వీటన్నిటికి ‘పిల్లిమెడలో గంటకట్టే వారెవరంటే శ్రీ నరసింహారావే. ఆ ఉద్యమాల్లో తన పాత్ర, సహకరించినవారి పాత్ర, ప్రసిద్ధులదీ, అప్రసిద్ధులదీ కూడా వుండడం ఈ గ్రంథ విశేషం.
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రాజమహేంద్రవరంలో ప్రభుత్వ సమగ్ర బోధనాభ్యసన కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేసేటప్పుడు ఆయన తానున్న వీరభద్రపురం పేట నుండి కళాశాలకు గుర్రంమీద వెళ్ళేవారట. ఈ సంగతి తొంభై ఆ పేట వాసి జనమంచి కామేశ్వరరావు చెప్పారని ఈ పుస్తకంలో ఆయన రాశారు. ఇటువంటి చెప్పుడు మాటలు- మంచివి ఇంకా ఇందులో ఎన్నో వున్నాయి.
14 ప్రకరణాలుగా ఈ గ్రంథం సాగింది. ఇందులో స్వాతంత్య్ర సమరవీరులు, సత్రాలు, చెరువులు, ఆదర్శమూర్తులు, టౌన్ హాలు, ఇతర సంస్థలు, వివిధ రంగాల ప్రముఖులు వంటి శీర్షికల్లోని అంశాలు అత్యంత ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఇందులో స్వీయాంశాలతో, ఎంతోమంది హేమాహేమీలైన వారి చారిత్రక సంఘటనా స్పర్శలుండడంవల్ల బంగారానికి తావి అబ్బింది. ‘సమాచారమ్’ అనే స్థానిక దినపత్రికలో గుర్తుకొస్తున్నాయ్ పేర రాసిన ధారావాహికల సమాహారమే ఈ ‘స్వీయ నది’.
362వ పుటలో ఒక ఛాయాచిత్రం క్రింద శ్రీశ్రీ, మధునాపంతుల, దామెర్ల, పోతుల, వై.యస్.ఎన్‌లతోపాటు శ్రీ మద్దూరి అన్నపూర్ణమ్మ ఉన్నట్టు రాశారు. అది పొరపాటు. ఆయన లేరు. ఉన్నవారు మద్దూరి శివరామకృష్ణయ్య. తరువాత అచ్చులో మార్చుకోవాలి. ముఖ్యమైన ఛాయాచిత్రాలు కూడా చారిత్రక ఘటనల్ని చూపించాయి.
రాజమహేంద్రిలో కోటిపల్లి బస్‌స్టాండుకు ఎదురుగా ‘ఫ్రీడం పార్కు’ అనేది నరసింహ స్వప్న దృశ్యంగా ఉంది. అందులో స్వాతంత్య్రయోధుల విగ్రహాలు, ఛాయాచిత్రాలు, వస్తువులు భద్రపరుస్తున్నారు. స్వా.స. యోధుల జీవిత చరిత్రల వంటితో ఓ గ్రంథాలయాన్నీ నడపడం నగర కీర్తికి ఓ హెచ్చింపు.
రాజరాజనరేంద్ర పట్ట్భాషేక సంచికలో ముఖచిత్రంపై అలనాటి చాళుక్య ద్వారం చూపి అటువంటి ద్వారాన్ని గోదావరి గట్టుపై తమకు చెందిన నరసింహస్వామి దేవాలయ ముఖద్వారంగా కట్టించి ఏర్పాటుచేసుకున్నారంటే సామాన్యమా?
రాజమహేంద్ర చరిత్రను ప్రశ్నోత్తరాల రూపంలో ‘నృసింహ ప్రశ్నోపనిషత్’గా రాశి స్థానిక చరిత్ర రాశికి ఓ రూపకల్పన చేశారు.
వీరేశలింగ సంస్థలను ఎంతగానో సేవించిన ఈయన విగ్రహారాధకుడే కాక, నిరీశ్వర, హేతువాద ప్రముఖులతో స్నేహం చేయడం ఒక సహజీవనాంశం.
రాష్టప్రతులందర్నీ కొందరు ప్రధానమంత్రుల్నీ- ఇంకా ఎంతోమందిని ఈయన కలిసేటప్పుడు స్థానిక నగర సమస్యల్ని సైతం వారిదృష్టికి తీసుకువచ్చేవారు.
1962 అక్టోబరు 2వ తేదీన రాజమండ్రి వాసి- భారత రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో ఇరవై రెండు నిముషాలు సంభాషించడం.. ఇటువంటి సంఘటనలున్న వ్యక్తి స్వీయచరిత్ర ఇది. ఇందులో అయిదు దశాబ్దాల సేవాసంచలనాలు, ఎంతోమంది చారిత్రక వ్యక్తుల సంఘటనా పరిమళాలూ నిండి వున్నాయి. ఈ గ్రంథం సాంతం చదివితే ‘‘ఇది గతానికి, అగతానికీ లోచనం. ఇంతెందుకూ రాజమహేంద్రి నగరం తనను తాను అద్దంలో చూసుకుంటే శ్రీనరసింహారావే కన్పిస్తారని చెప్పిన డా. అరిపిరాల నారాయణరావు వెనుక అట్టహాస వాక్యం అక్షరాలా నిజమనిపిస్తుంది.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన కళల విశిష్టతపై సమగ్ర శోధన

ప్రాచీన కళల విశిష్టతపై సమగ్ర శోధన

  • -జిఆర్కె
  • 03/01/2015
TAGS:

భారతీయ స్వతంత్ర
కళాశాస్త్రం
– ప్రథమభాగం –
కళాబ్రహ్మ

హిందీ మూలం:
డా.కాంతి చంద్రపాండె
తెలుగు అనువాదం: డా.బొద్దుల వేంకటేశం
పుటలు: 282;
వెల: రూ.280/-
ప్రతులకు: శ్రీమతి బి.సరోజ
9-8-49, రాంనగర్
కరీంనగర్- 505001

చాలా ప్రపంచ దేశాలలో నాగరికత ప్రాథమికంగానైనా రెక్కతొడగకముందే భరతభూమి సముజ్వల నాగరికతా నిలయంగా భాసించింది, అనేక కళలకు కాణాచిగా నిలిచింది. ప్రాచీన వాఙ్మయం, చారిత్రక ఆధారాలు, పురాతన అవశేషాలు, వస్తుసామగ్రి వంటివి దీనిని నిరూపిస్తున్నాయి.
సమీక్షిస్తున్న గ్రంథం ఒక అనువాదకృతి. అనువాదకులు డా.బొద్దుల వేంకటేశం బహుభాషావేత్త. తెలుగు, హిందీ, ఆంగ్లంలో స్నాతకోత్తర పట్టాలు పొందిన విద్యాధికులు. సంస్కృతంలో కూడా మంచి పాండిత్యం సముపార్జించారు. ‘‘అన్యభాషల్లో సాహిత్య- కళాశాస్త్ర విషయంలో డి.లిట్. పట్టాలను సాధించిన సిద్ధాంత వ్యాసాలను ఇతర విశిష్ట గ్రంథాలను అనువదించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారాయన. ఈ క్రమంలో లోగడ కొన్ని ప్రామాణిక గ్రంథాలు తెనిగించారు. ప్రస్తుత గ్రంథం ‘్భరతీయ స్వతంత్ర కళాశాస్త్రం (ప్రథమభాగం)’ డా.కాంతిచంద్రపాండె హిందీ మూలానికి అనువాదం. డా.పాండె 1950లో డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పర్యవేక్షణలో లక్నో విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్.కోసం ‘కంపెరెటివ్ ఈస్థెటిక్స్’పైన బృహత్ సిద్ధాంత గ్రంథం సమర్పించారు. ఇందులో డా.పాండె ఎన్నో విషయాలు ఆవిష్కరించారని ప్రశంసిస్తూ డా.రాధాకృష్ణన్ ఇలా అంటారు. ‘‘హీజ్ వర్క్ డీల్స్ విత్ ఎ రిలెటివ్‌లీ అన్ ఎక్స్‌ప్లోర్డ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ థాట్.’’ సిద్ధాంత గ్రంథంలో ‘ఇండియన్ ఈస్థెటిక్స్’, ‘వెస్టర్న్ ఈస్థెటిక్స్’అనే రెండు భాగాలున్నాయి. ప్రథమభాగాన్ని డా.పాండె హిందీలో భారతీయ ‘స్వతంత్ర కళాశాస్త్రం’అన్నారు. అనువాదకులు ఈ ప్రయోగానే్న స్వీకరించారు. అనువాదం కళాబ్రహ్మ, శబ్దబ్రహ్మ, రసబ్రహ్మ అనే మూడుభాగాలలో సాగింది. ఏడు అధ్యాయాలలో మొదటి భాగం వాస్తు కళ, సంగీత కళ, నాట్యకళ గురించి సర్వ సమగ్రంగా వివరిస్తుంది. డా.పాండె ‘అధ్యేయ గ్రంథ సూచిక’లో 92 అత్యంత ప్రామాణిక కృతులను పేర్కొన్నారు. ఇవిగాక తమ గ్రంథంలో అనేక ఇతర కృతులు ప్రస్తావించారు. ‘ఈస్థెటిక్స్’ పదాన్ని ‘సౌందర్యశాస్త్రం’ బదులు ‘స్వతంత్ర కళాశాస్త్రం’ అనడానికి కారణం రచయిత ఇలా చెప్పారు.
‘‘స్వతంత్ర కళాకృతులు వ్యంజించే సౌం దర్య స్వరూపమేమి? దాని రచనా విధి ఎట్టిది? ఉత్కృష్టతమ రూపంలో దాని ప్రభావమేవిధంగా ఉంటుంది?- ఈ ప్రశ్నలు మన ప్రతిపాద్య విషయానికి ఘనిష్ఠంగా సంబంధించి ఉన్నాయి’’. ప్రతి అంశాన్ని కూలంకషం గా చర్చించారు. వేదోపనిషత్తులు, స్మృతులు, సూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, మహాకావ్యాలు, అనేక మహాకావ్యాలు, ప్రామాణిక శాస్త్రగ్రంథాలు ఇత్యాదుల నుంచి ఆధారాలు చూపారు. ‘వాస్తుకళ’లో వాస్తు శబ్దార్థమిచ్చి నిర్మాణం, వివిధ రీతులు, చిత్రశిల్ప విశేషాలు, ఇతర దేశాలలో భారతీయ వాస్తుప్రభావం మొదలైన పెక్కు సంగతులు విశదీకరించారు. ఈ కళపై ‘అధర్వవేదం’ అత్యంత ప్రాచీన ప్రమాణమని చెప్పి- అర్థశాస్త్రం, శుక్రనీతి, నాట్యశాస్త్రం, మత్స్యపురాణం, కామికాగమనం, అంశుమద్భేదం, తంత్ర సముచ్ఛయం, సమరాంగణ సూత్రధార, విష్ణ్ధురోత్తర పురాణం, రామాయణం, భారతం, మానసార వంటి ఎన్నో గ్రంథాలను ఉటంకించారు. సామవేదం సంగీతపరంగా ప్రాచీన ప్రమాణమని వివరిస్తూ పూర్వం ‘‘స్వర సమూహం మూడుగా ఉండేది. ఎందుకనగా వేదాలన్నింటిలో మూడు రకాలైన స్వరాలే అంగీకరింపబడినాయి’’ అని తెలియజేశారు. తర్వాత సప్తస్వరాలను గురించి విశదీకరించారు. ప్రామాణిక గ్రంథాలు, మూర్ఛనలు, ఉచ్చారణ కాలం, శాస్తక్రారులు, గీతకర్తలు, సంగీత సంప్రదాయాలు, ఇస్లాం ప్రభావం మున్నగు అంశాలు విపులీకరించారు. ‘‘నాట్యకళాకృతికి మించి వేరే ఏ స్వతంత్ర కళాకృతిని కూడా రసానుభవ విషయంగా పేర్కొనడం సముచితం కాదని అభినవగుప్తుని మతం’’తో ‘నాట్యకళ’ చర్చ ఆరంభమవుతుంది.

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Gabbita Durga Prasad
Rtd. head Master   Sivalayam Street
Vuyyuru  521165  Krishan District
Andhra Pradesh
India
Cell :     9989066375
  8520805566
Land Line : 08676-232797

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ముక్కోటి ,మహా పర్వదినమ్1-1-2015 నూతన సంవత్సరంసందర్భం గా లడ్డూలతో పూజ మరియు ఉత్తర ద్వార దర్శనం 

http://wp.me/p1As8O-1Aj

laddu puja 001

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు

Posted on 01/01/2015 by అరసి

1mucchatlu-001వృత్తి రీత్యా సైన్స్ లో ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నా , ప్రవృత్తిగా సాహిత్యంలో విశేషంగా కృషి చేస్తున్న వారు గబ్బిట దుర్గా ప్రసాద్ .ఇప్పటి వరకు 800 లకు పైగా వ్యాసాలూ , 500లకు పైగా కవితలు అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి . సరసభారతి అధ్వర్యంలో స్వీయ సంపాదకత్వంలో 13 పుస్తకాలను ప్రచురించారు .గబ్బిట దుర్గాప్రసాద్ ఎనిమిదవ రచన ఈ “ పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు” . ఈ పుస్తకంలో సుమారుగా 123 మంది ఆంగ్ల కవుల చరిత్ర , వాళ్ల రచనలు , సాహిత్య విశేషాలు వ్యాసాల రూపంలో ఈ పుస్తకంలో పొందుపరిచారు .

మొదటి వ్యాసం ‘జియోఫ్రీ చాసర్’ 1340 లో ఇంగ్లాండు లో పుట్టాడు . ఇంగ్లాండు దేశపు మొదటి నవలగా గుర్తింపు పొందిన Troilur and Criseyde” నవల రచయిత ఈయనే . ఆంగ్ల నాటక పితామహుడుగా పేరు పొందిన విలియం షేక్స్ పియర్ . ఆయన చనిపోయిన 100 సంవత్సరాలకు కాని విలియం షేక్స్ పియర్ జీవిత చరిత్ర రాకపోవడం నిజంగా దురదృష్టకరం . అప్పుడే ఈయన రాసిన రచనలు సమగ్ర నాటకాలు ముద్రించారు . మొట్టమొదటి రాజస్థాన కవి బెన్ జాన్సన్ . అసలు పేరు బెంజమిన్ జాన్సన్ . ఈయన రాసిన చారిత్రక ట్రాజెడీలను సీజనాస్ , హిస్ ఫాల్ అండ్ కార్తిలిన్ , హిస్ కాన్స్పిరసీ విజయవంతమయ్యాయి .

కొంటెతనం , చిలిపిదనంతో తన తరాన్ని ప్రభావితం చేసిన వాడు రాబర్ట్ హీర్రిక్ . లండన్ లో 1591 లో వజ్రాలకు నగిషీ చేసే కంసాలి కుటుంబంలో జన్మించాడు . తన చుట్టూ ఉన్న పల్లె వాతావరణాన్ని, తనని ఆకట్టుకున్న వాటిని ప్రేరణగా కవిత్వం రాయడం మొదలుపెట్టాడు .జాన్ డ్రైడేన్ హేతువాద యుగంలో అగ్రగామి కవిగా నిలిచాడు . అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్న నేర్పరి . లాటిన్ కవి పెర్సియాస్ రచనను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసాడు .

స్త్రీవాద రచయిత్రుల ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయిత . మార్గ రెట్ లూకాస్ కేవండిష్ . ఈమె కవిత్వంలో ప్రాధమికంగా ఉన్న మహిళా ప్రభావం కన్పిస్తుంది . హాబ్స్ “ ఏ నీతి పుస్తకంలోను లేననంత నీతి మార్గ రెట్ దగ్గర ఉంది “ అన్నాడు . కవిగా అంత గుర్తింపు లేకపోయినా సామ్యూల్ జాన్సన్ ఆగస్టస్ కాలంలో విశేష ప్రాభవం ఉన్న వ్యక్తి . ఈయన విశేషాలు కూడా తెలుసుకోవచ్చు .

చిత్ర , శిల్ప కవి విలియం బ్లేక్ రాసిన “ది లాంబ్ ‘, “ ది లిటిల్ బ్లాక్ బాయ్ ‘, ‘ యాన్ అనదర్ సారో నైట్ వివరాలు అందించారు రచయిత . ప్రకృతి కవిగా పిలవబడే విలియం వర్డ్స్ వర్త్ కంబర్ లాండ్ లో జన్మించాడు . తన స్వీయ చరిత్రని ప్రిల్యుడ్ పేరుతో రచించాడు . తన విపరీత ధోరణులకు తానే బాలి అయినవాడు , 90 ఏళ్ల జీవితంలో ఎన్నో పోరాటాలు , తగాదాలతో గడిపిన వాల్టర్ సావేజ్ లాండర్ జీవిత విశేషాలు , ఆయన రాసిన రచనలు వివరాలు తెలుసుకోవచ్చు . 19 వశతాబ్దంలోని చీకటి వెలుగుల్లో ఆల్ర్ఫేడ్ లార్ట్ టెన్నీస్ , మాధ్యూ ఆర్నోల్డ్ , ప్రిరా ఫెలై ట్స్, పాట్ మోర్ రచయితల వివరాలు పొందుపరిచారు . ఇంకా ఈ పుస్తకంలో అమెరికా కవులు వాల్డో ఎమర్సన్ , జాన్ గ్రీల్ లీఫ్ విట్టర్ , లాంగ్ ఫెలో చరిత్ర విశేషాలు కన్పిస్తాయి. ఇంగ్లీష్ షార్ట్ స్టోరీస్ రచయితలలో కిప్లింగ్ మొదటి తరం వాడు . నియో రొమాంటిక్ కవి డైలాన్ థామస్ చరిత్రతో ఈ కవుల ముచ్చట్లు ముగుస్తాయి .

19 ,20 శతాబ్దాలకు వారధిగా నిలిచే ఆంగ్ల కవి ఎవరు ? అతని కవితలకు , నవలలకు నేపథ్యం ఏమిటి ? ,పునరుజ్జీవనం , రొమాంటిక్ కవిత్వాలకి మధ్య వారధిగా నిలిచిన వాడు ఎవరు ?, బ్రిటన్ జాతీయ గీతాన్ని రచించిన కవి ఎవరు ?, జంగిల బుక్ రచయిత ఎవరు ? అతని జీవితానుభవాలు ఏమిటి ?, మొదటి నోబెల్ బహుమతి అందుకున్న ఐర్లాండు కవి ఎవరు ?ఇటువంటి ఆసక్తి కరమైన విషయాలు గురించి తెలుసుకోవాలంటే ఈ పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు చదవాల్సిందే .

ఈ పూర్వాంగ్ల కవుల జీవిత విశేషాలున్న ఈ వ్యాసాలలోని ప్రతి రచయిత ఒక ప్రత్యేకతని కలిగినా వారే . ఆంగ్ల సాహిత్యం పై ఆసక్తి , అభిమానం ఉన్న వారికి , ఆంగ్ల సాహిత్యం గురించి తీసుకోవాలి అనుకునేవారికి ఆ పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ఒక మంచి కరదీపిక అనడంలో అతిశయోక్తి లేదు .

ప్రతులకు :
రచయిత : గబ్బిట దుర్గా ప్రసాద్
వెల :200 /-
ఇంటి సంఖ్య: 2-405 , శివాలయం వీధి ,
రాజుగారి తోట దగ్గర , ఉయ్యూరు ,
కృష్ణా జిల్లా -521165,
సంచార వాణి – 9989066375 .

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged , | Leave a comment

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన – శ్రీమతి చుండూరి రత్నమ్మ

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన – శ్రీమతి చుండూరి రత్నమ్మ

దేశం అంటే వీరాభిమానం మహాత్మా గాంధీ అంటే గొప్ప ఆరాధనా భావం ఉండి ,భారత దేశ స్వాతంత్ర్యం కోసం మహిళాభ్యున్నతికోసం సర్వం త్యాగం చేసిన మహిళా మాణిక్యం శ్రీమతి చుండూరి రత్నమ్మగారు .

బాల్యం –వివాహం – దేశ సేవ :
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ,రావు బహదూర్ పైండా వెంకట చలపతి అనే జమీందార్ గారి పుత్రికా రత్నం రత్నమ్మ ..7-2-1891 న కాకినాడలో జన్మించింది .ప్రముఖ ఏలూరు వ్యాపారి చుండూరి సుబ్బారాయుడు గారి కుమారుడు ,విద్యాధిక సంపన్నుడు అయిన శ్రీరాములుగారితో 1901 ఫిబ్రవరి పది న వివాహం జరిగింది . చిన్నతనం నుండి దేశం పరాయి వారిపాలన నుండి విముక్తం కావాలని కలలు కనేది .అప్పటికే దేశమంతా స్వాతంత్రోద్యమ కాంక్షతో రగిలిపోతోంది .తానూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని ఈ మహిళా మాణిక్యం భావించింది .సరైన సమయం వచ్చింది .1932లో సమిష్టి శాసనోల్లంఘనలో ఉత్సాహం గా పాల్గొని అరెస్ట్ అయి ,ఆరు నెలలు కారాగార శిక్ష ,రెండు వందల రూపాయల జరిమానా అనుభవించిన నిష్కళంక దేశ భక్తురాలు .

ఉద్యమ నాయకురాలు :
మహిళను కదా అని రత్నమ్మ ఏనాడూ నిరుత్సాహ పడలేదు .మరింత ఉద్వేగం గా ఉద్యమాలలో పాల్గొని చరిత్ర సృష్టించింది .1940లో జరిగిన వ్యక్తీ సత్యాగ్రహం లో పాల్గొని ఫలితం గా మళ్ళీ అర్ధ సంవత్సరం జైలు శిక్ష అనుభవించింది .అయినా ఆమె కుంగిపోలేదు .రెట్టించిన ఉత్సాహం తో దేశ స్వాతంత్ర్య సిద్ధికోసం ,ఆంగ్ల దొరల పెత్తనాన్ని తిరస్కరిస్తూ ,సత్యాగ్రహాలు చేస్తూ, చేయిస్తూ, స్పూర్తినిస్తూ మన రాష్ట్రం లోనే కాక దేశం లో పలు ప్రాంతాలు బళ్ళారి,సేలం మొదలైన ప్రదేశాలు పర్యటించి ఉత్తేజ పరిచి అందరినీ ఉద్యమ భాగస్వాములను చేసిన నేర్పు రత్నమ్మ గారిది.

త్యాగ శీలి –సేవా పరాయణి –వితరణ శీలి :
మహాత్ముడు ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు సందర్శించి ప్రేరణ పొంది తన ఒంటి మీది బంగారు నగలన్నీ సమర్పించిన త్యాగ మూర్తి మహిళా రత్నం రత్నమ్మ .భోగరాజు పట్టాభి సీతారామయ్య ,సర్ విజయ వంటి మహా దేశ భక్తులైన జాతీయ నాయకులే రత్నమ్మ గారిని చూడటానికి ఆమె ఇంటికి ఏలూరు వచ్చేవారు. అంతటి ప్రభావ శీలి .ఆ రోజుల్లో కొల్లేరుకు వరద వచ్చి అంతా భీభత్సం చేసినప్పుడు ,స్వంత కారులో ఆ ప్రాంతాలన్నీ పర్య టించి వరద బాధితులను పరామర్శించి ,వారికి కావాల్సిన ఆహార ధాన్యాలు బియ్యం ఉప్పు ,పప్పు ,కూరలు ,వంట సామాగ్రి స్వయం గా పంపిణీ చేసిన ఉదార హృదయ ,వితరణ శీలి .

స్త్రీ –జీన జనోద్దరణ :
ప్రముఖ గాంధేయ వాది ,సంఘ సేవకురాలు ,సంస్కర్త అయిన రత్నమ్మ 1940లో ఎన్నో వితంతు వివాహాలు జరిపించి సంస్కరణను ఆచరణ లోకి తెచ్చిన ఉద్యమ శీలి .స్త్రీలు స్వతంత్రం గా తమ కాళ్ళ మీద నిలబడాలన్నది ఆమె ధ్యేయం .అందుకోసం వారి ఉపాధికోసం ‘’మహిళా పారిశ్రామిక సంఘం ‘’ఏర్పరచింది .ఇందులో కుల మత విచక్షతను పాటించకుండా దళిత ,హరిజన ,అనాధ మహిళలకు స్థానం కల్పించి వారికి కుట్టుపని లో శిక్షణ నిప్పించి ,కుట్టు మిషన్లు కొని అంద జేసిన దీన జన బాంధవురాలు .

ఇంకొక అడుగు ముందుకు వేసి ఆనాడు విపరీతం గా ఉన్న వేశ్యా వ్రుత్తి లో మగ్గి పోతున్న మహిళలకు మార్గోపదేశం చేసి వారి దృష్టిని మరల్చి ,జన జీవన స్రవంతిలోకి మళ్లించిన పుణ్యాత్మురాలు .వేశ్యా జీవితం గడిపిన వారికి మంచి సంబంధాలు చూసి వివాహం చేసి వారి జీవితాలలో వెలుగులు నింపిన మహోదయురాలు .రత్నమ్మ గారు చేస్తున్న మహిళాసేవకు ,ఆ రంగం లో తల పండిన ప్రముఖ సంఘ సేవకులు ,మహిళా ఉద్యమ నాయకులు దుర్గా బాయి దేశ ముఖ్ ,కమలాదేవి చటోపాధ్యాయ మొదలైన వారు స్వయం గా వచ్చి చూసి ఆమె సంకల్ప బలానికి. సేవాతత్పరతకు బహు ప్రశంసలను అంద జేశారు ఇందరి హృదయాలను చూర గొన్న సేవా రత్నం రత్నమ్మ గారు .

విద్యా సేవ :
విద్య అందరి హక్కు అని రత్నమ్మ నమ్మారు .అందుకోసం విద్యా,గ్రంధాలయాలు ఏర్పరచారు .సంస్కృతం తెలుగు నేర్పటమే కాక సంగీతం ,నృత్యం మొదలైన కలలలో ఆసక్తి ఉన్న బాల బాలికలకు ,ఆర్ధిక సాయం అందించారు .తనలాగే స్త్రీ జనాభ్యుతి కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థలను గుర్తించి వారికి కావలసిన ఆర్దికాది అన్ని సదుపాయాలూ అందజేసి చేయూత నిచ్చి వికాసానికి తోడ్పడ్డారు .సమాజం లో అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ఇతోధికం గా ఆర్ధిక సహకారం ఇచ్చారు .విద్యార్ధినులను ప్రోత్సహించటానికి స్వర్ణ పతకాలు వెండి షీల్డులు ,రజత పతకాలు తయారు చేయించి బహూకరించి మహిళాభ్యుదయానికి ఎన లేని సేవచేశారు .

ప్రధమ మహిళా చైర్మన్ :
ఏలూరు లోని స్వగృహం లో భర్త తోడ్పాటుతో ప్రశస్ట మైన స్వంత ‘’గ్రంధ భాండాగారా’న్ని ‘’ 1920లోనే ఏర్పాటు చేసుకొని అందరికి ఆదర్శం గా నిలిచారు .ఏలూరు కాంగ్రెస్ కమిటీలో ఎక్సి క్యూటివ్ సభ్యులుగా ,యువజన కాంగ్రెస్ సంఘాధ్యక్షులుగా బాధ్యతలను నిర్వహిస్తూనే శాసనోల్లంఘన ఉద్యమాలకు నాయకత్వం వహించారు . బాపూజీ పిలుపు నను సరించి ఖద్దరు, ధారణా.హిందీ భాషా వ్యాప్తి ,మద్య పాన నిషేధం ,హరిజనాభ్యుదయం , మహిళాభ్యుదయం వంటి అనేక నిర్మాణ కార్యక్రమాలు చేబట్టి ,విస్తృత ప్రచారం చేశారు . 1937ఏలూరు పురపాలక సంఘ సభ్యురాలుగా ఎన్నికై ,మూడేళ్ళ తర్వాత 1940పురపాలక సంఘ చైర్మన్ అయ్యారు .ఒక మహిళ ఇలాచైర్మన్ గా ఆంద్ర దేశం లో మొదటి సారిగా ఎన్నికవటం చరిత్ర కెక్కి, గొప్ప సంచలనమే సృష్టించింది .

నెల్లూరు లో జరిగిన ఆర్య వైశ్య మహిళా జన సభ లో రత్నమ్మకు ‘’సంఘ సేవా పరాయిణి’’ బిరుదు నిచ్చి సత్కరించారు .నిరంతర సేవాకార్యక్రమాలలో జీవితాన్ని సార్ధకం చేసుకొన్న స్త్రీ మాణిక్యం మహిళా రత్నం చుండూరి రత్నమ్మ డెబ్భై నాలుగు సంవత్సరాల ఫల ప్రద జీవితాన్ని గడిపి ,స్వాతంత్ర్యానంతరం పది హేదేళ్ళు బ్రతికి స్వాతంత్ర్య ఫలాలను కళ్ళారా చూసి సంతృప్తి చెంది 4-8-1965 న ఏలూరు లో పార్ధివ దేహాన్ని వదిలి కీర్తి శరీరాన్ని ధరించింది .ఆమె మరణానంతరం ‘’ఇండో ఇంగ్లీష్ హైస్కూల్ లో ‘’శ్రీమతి చుండూరి రత్నమ్మ స్మారక గ్రంధాలయం ‘’ను వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఏ.వి రాజు గారు ప్రారంభించారు .రత్నమ్మ చేసిన అపూర్వ త్యాగం,సేవా నిరతి చిరస్మరణీయం .భావి తరాలకు స్పూర్తి దాయకం,ఆదర్శం .

– గబ్బిట దుర్గా ప్రసాద్

“~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీమతి భవానిగారికి భర్త రాంబాబు గారు కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఉదయం ఇంటికి దంపతులిద్దరూ వచ్చి సంతోష పడిన దృశ్యమాలిక –

శ్రీమతి భవానిగారికి భర్త  రాంబాబు గారు  కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఉదయం  మన శ్రీ ఆంజనేయస్వామి temple ,   ఇంటికి దంపతులిద్దరూ వచ్చి సంతోష పడిన దృశ్యమాలిక –  DSCN0248 DSCN0249 DSCN0251 DSCN0252 DSCN0253

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నూ తన సంవత్సర మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు .

సాహితీ బంధువులకు శుభకామనలు .నూ తన సంవత్సర మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు .Ramya's rangoli - 1 Ramya's rangoli - 2 Ramya's rangoli - 3 Ramya's rangoli - 4 Ramya's rangoli - 5 Ramya's rangoli - 6

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ వెలగా వెంకటప్పయ్య శ్రీ గూడపాటి కోటేశ్వర రావు గార్ల మృతికి సంతాప సభ

శ్రీ వెలగా వెంకటప్పయ్య శ్రీ గూడపాటి కోటేశ్వర రావు గార్ల మృతికి సంతాప సభ

సరసభారతి ఈ రోజు 31-12-14బుధవారం సాయంత్రం అర్గంతలకు ఏ సి లైబ్రరీలో ప్రత్యెక సమావేశం జరిపి డా శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు శ్రీ గూడపతి కోటేశ్వర రావు గార్ల మృతికి సంతాపం ప్రకటించి శ్రద్ధాంజలి ఘటించింది .సభాధ్యక్షునిగా నేను మాట్లాడుతూ ముందుగా వెలగా వారి బహుముఖీన సేవను ,ఉయ్యూరు సాహితీ మండలి నిర్వాహకులు శ్రీ గూడపాటి కోటేశ్వరా రావు గారిగురించి మాట్లాడాను .తర్వాత శ్రీ పెదప్రోలు విజయ సారధి శ్రీ సి హెచ్ భవానీ శంకరరావు ,శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ,శ్రీ వీరమాచనేని బాల గంగాధర రావు తమ ప్రసంగాలలో వారిసేవాలను ప్రస్తుతించారు .వారిద్దరి ఆత్మలకు శాంతికలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించాం .వారి చిత్రపటాలకు పూలు సమర్పించి నివాళులు అర్పించాము .నాప్రసంగా విషయాలు

శ్రీ వెలగా వెంకటప్పయ్య

గ్రంధాలయ శాస్త్ర పారంగత ,ఉత్తమ గ్రంధ పాలక ,బాల బంధు ,గ్రంధాలయ గాంధి ,గ్రంధాలయ బోధనాశాస్త్ర పితామహ నడిచే విజ్ఞానసర్వస్వం ,పలికే పుస్తకం అయిన డా .వెలగా వెంకటప్పయ్య గారు ఎనభై రెండవ ఏట 29-12-14-సోమవారం రాత్రి స్వగ్రామం తెనాలిలో మరణించారు .సాహిత్య అకాడెమీ అడ్వైజరీ బోర్డు సభ్యులుగా సాహిత్య అకాడెమీ మెంబర్ గా సేవలందించారు .ఇండియన్ లైబ్రరీ లేజిస్లేషన్ ,పబ్లిక్ లైబ్రరిలేజిస్లేషన్ దిన్యు మిలీనియం మోడల్ లైబ్రరి లేజిస్లేషన్ వంటి పుస్తకాలు రాశారు .వీరి గ్రంధాలు అమెరికాలోని వాషింగ్టన్ లైబ్రరీలో  భద్రపరచిగౌరవించారు .లైబ్రరీ టేర్మినాలజీ మీద రంగ నాధన్ డిక్షనరీ రాశారు. ఇరవై వ శతాబ్దపు తెలుగు వెలుగులు ను స్వీయ సంపాదకత్వం లో రెండుభాగాలుగా తెచ్చారు  వీటిని  పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది .రష్యా ఆహ్వానం పై వెళ్లి లెనిన్ గ్రంధాలయ విధానం లైబ్రరి  సైంటిఫిక్  అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్రంధాలు రాశారు .తెలుగుప్రముఖుల జీవిత చరిత్రలను రాశారు .పౌర గ్రందాలయ చట్ట రూప శిల్పి .గ్రంధాలయ శాస్త్ర పాఠ్య గ్రంధ రచయిత .భారత గ్రంధాలయోద్యమం ,మార్చ్ ఆఫ్ లైబ్రరి సైన్స్ గ్రంధాలకు ఎడిటర్ గా ఉన్నారు .సామాన్య లైబ్రేరియన్ గా ప్రవేశించి వివిధ హోదాలలో సేవ చేశారు .

గ్రామీణ ఆటలు  బాలల కృష్ణ శతకం ,వేమన బొమ్మల శతకం ,బాలానంద బొమ్మల దాశరధీ శతకం సుమతీ సహ్టకం తెలుగు సామెతలు ,మన గ్రంధాలయాలు  గ్రంధా లయ సేవానిరతులు తలుగు ముద్రణ ,ప్రచురణ తెనాలి మహా వైభవం చక్రపాణి మొదలైన రచనలు చేశారు దాదాపు 60,000పేజీలు  రాశారు .ఎనభైకి పైగా గ్రంధాలు రచించారు .మూడు వందల వ్యాసాలూ రచించారు .అనేక ప్రత్యెక సంచికలను స్మారక సంచికలను సంపాదకత్వం లో వెలువరించారు .

వెలగా పై ప్రముఖులు గొప్ప ప్రశంసల జల్లు కరిపించారు.గ్రంధాలయోద్యమం లో నా వారసుడు వెంకటప్పయ్య అని  అయ్యంకి వారు ,ఆయన ఊపిరి ,ప్రాణం ఆహారం  గాలి అంతా గ్రందాలయమే అని ఆవుల సాంబశివరావు అన్నారు .గ్రంధాలయానికి మారుపేరు వెలగా అన్నారు శ్రీ నాగ భైరవ కోటేశ్వర రావు  నిర్వహణ దక్షత ఉన్నవాడు అని వావిలాల గోపాల క్రిష్నయ్య గారు సంచార గ్రంధాలయం అని రేడియో అన్నయ్య న్యాయ పతి రాఘవరావు గారు వెలగా లాఅందరూపని చేస్తే దేశం ఎప్పుడో బాగుపడేది అని పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు కీర్తించారు .కృషి రూపెత్తిన రుషి  నవ్వే తెలుగు అక్షరం ,హిత ,మిత భాషి అని బాలసాహిత్య రచయిత్రి శ్రీమతి డి సుజాతా దేవి మెచ్చారు .సమాచార నిధి ,నడిచే విజ్ఞాన సర్వస్వం అని శ్రీ రావి నూతల శ్రీరాములు అన్నారు .

గ్రంధాలయోద్యమాన్ని ఆచరణ లోకి తెచ్చిన వారు వెలగా .అయ్యంకి ,సర్వోత్తమ రావు ,వావిలాల కోదాటి వంటి మొదటి తరం గ్రందాలయోద్యం నాయకులైతే రెండో తరానికి ముఖ్య ప్రతినిధి వెలగా .కోదాటి నారాయణ రాగారు గ్రంధాలయ చైర్మన్ గా ఉండగా ,తానూ సెక్రెటరీగా ఉండి పబ్లిక్ లైబ్రరీలతో బాటు ప్రైవేట్ లైబ్రరీలకూ ఆర్ధిక సాయం ప్రభుత్వం చేసేలాగా కృషి చేశారు.

కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 2013లో ఆలూరి బైరాగి స్మారక పురస్కారాన్ని పాతిక వేల రూపాయలను అందుకొన్నారు.విజయ వాడలో టాగూర్ గ్రంధాలయం ఏర్పడటానికి ప్రముఖ పాత్ర వహించారు .అదొక రిసెర్చ్ సెంటర్ గా మార్చారు. వివిధ గ్రందాలయాలావు ఉన్న రిసెర్చ్ పుస్తకాలను సేకరించి ఇక్కడ మూడు బీరువాలో భద్ర పరచారు .వెలగా వారి జీవితం పై శ్రీ పావులూరి శ్రీనివాసరావు గ్రంధం రాశారు. .పుస్తకానికి ప్ర్ప్రత్యామ్నాయం లేదని చెప్పేవారు . ఆయన చూడని పరిశీలించని పుస్తకమే లేదు అంటే అతిశయోక్తి కాదు .

ప్రముఖ గ్రంధాలను మైక్రో ఫిలిం లుగా తీయటం డిజిటలైజ్ చేయటం లో ముందడుగు వేశారు .ఆధునిక పద్ధతిలో గ్రంధాలను భద్రపరచే చర్యలు చేబట్టారు .బాలల రచయితల సంఘాన్ని స్థాపించి కార్య దర్శిగా పని చేశారు బాలల ఆకాడేమీలో సభ్యులుగా ఉన్నారు .జానపద సాహిత్యం లోనూ కృషి చేశారు .హాలంత శబ్దాలు ఇష్టపడే వారుకాదు డుము వులు చేర్చి రాయాలని చెప్పేవారు .పనికి రాని పుస్తకం  అంటూ లేదుఅనేవారు.ఇన్ని సుగుణాలున్న వ్యక్తీ నడిచే పుస్తకం పలికే గ్రంధం శ్రీ వెలగ వెంకటప్పయ్య గారు .

వెలగా వారికి ఉయ్యూరుకు గొప్ప సంబంధం ఉంది  .ఉయ్యూరులోఅమెరికా లోని  శ్రీమైనేని గోపాల కృష్ణ గారి భూరి ఆర్ధిక సహాయంతో ఏ సి లైబ్రరీ ఏర్పాటు చేయటానికి వెలగా వారి కృషి ఏంతోఉంది .ప్రతి నేలా వాచ్చి పని తీరును పర్య వేస్క్షించేవారు ఆనాటి జిల్లా గ్రంధాలయ చైర్మన్ గొర్రెపాటి గోపీ చంద్ గారితోను  యై విబి రాజేంద్ర ప్రసాద్ తోనూ వచ్చి. ఆ నిర్మాణ కమిటీ కన్వీనర్ గా నేను వారిని అప్పుడు కలిసి మాట్లాడేవాడిని. 2004జూలైలో లైబ్రరీ ప్రారంభోత్సవానికీ వచ్చి కార్యక్రమం నిర్వహించారు .తరచు  సభల్లో కలిసేవారు .రెండుమూడు సార్లు సరసభారతి సభలకు ఆహ్వానించినా రాలేదు .ఆలూరి బైరాగి అవార్డ్ ప్రదానం నాడు వెలగా వారిని సభకు పరిచయం చేసే అవకాశం నాకు కల్పించారు కృష్ణ జిల్లా రచయితల సంఘం వారు . సరసభారతి ప్రచురించిన పుస్తకాలన్నీ వారికి పంపేవాడిని. అందుకొని బాగుందని మెచ్చుకొంటూ జవాబు రాశారు ‘ .ఈ మధ్యనే ‘’పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’అందుకొని ఉత్తరం రాసి అభినందించి అయ్యంకి వారి పై సభ జరుపమని కోరారు .ఎందుకో చేయలేకపోయాం .

శీ గూడపాటి కోటేశ్వర రావు

గరిక పర్రు వాసి ఉయ్యూరు హైస్కూల్ విద్యార్ధి మొదటి ఎస్ ఎస్ ఎల్ సి బాచ్ వారు గూడపాటి .సాహితీ మండలిని మా గురువుగారు స్వర్గీయ లంకా బసబా చారి గారు పాతికేళ్ళ క్రితం ప్రారంభించినపుడు నాతోబాటు వ్యవస్తాపక సభ్యులు .నిత్య సాహితీ వ్యాసంగం అయన హాబీ .మంచిమనిషి క్షేత్రయ్య పదాలపై రసోల్లాసం రాశారు. నన్ను చదివిఅభిప్రాయం రాయమంటే ముప్ఫై  ఏళ్లక్రితమే రాశాను నాటకాలు  రాసి వేసి దర్శకత్వం చేసేవారు. రేడియోలో చాలా ప్రసంగాలు చేశారు .తామాషాగా మాట్లాడే నైజం .కుండ బద్దలు కొట్టినట్లు మొహమాటం లేకుండా మాట్లాడే వారు ద్వర్ది త్ర్యర్దికావ్యాలన్నా ,చేమకూర వేంకటకవి కవిత్వం అన్నా మహా మోజు .చేతిలో యాభై గ్రాముల క్రేన్ వక్కపొడి పొట్లం ఎప్పుడూ ఉండేది తానూ నములుతూ పక్కనున్న వారికీ ఆఫర్ చేసేవారు .సహృదయులు స్నేహ శీలి  .శ్రీ గూడ పాటి కోటేశ్వర రావు .ఈ ఇద్దరు లేని లోటు తీరనిదే .

2015 నూతన సంవత్సర శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-14-ఉయ్యూరు

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వైకుంఠ ఏకాదశి మరియు 2015నూతన సంవత్సర శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఈ ఉదయం పది గంటలకు సరసభారతి బ్లాగ్ ఒక్క దానికే రెండు లక్షల యాభై వేల యాభై అయిదు మంది వీక్షకులు ఉన్నట్లు చూసి నాటో బాటూ మీరూ ఆనందాన్ని పంచుకోవాలని తెలియ జేస్తున్నాను .ఏఏ విజయం మీది మాది మనందరిదీ అని మరొక్క మారు  తెలుపు కొంటున్నాను  సరసభారతి కొత్త సంవత్సరం లో మరింత అభి వృద్ధి చెందటానికి మీ అందరికి సహకారం అభ్యర్ధిస్తూ శుభా కాంక్షలు అంద జేస్తున్నాను  .మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ -29-12-14-ఉదయం 10-14

0001

  
Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment