నా దారి తీరు -80 శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో

నా దారి తీరు -80

శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో

ఉయ్యూరు నుంచి పెనుగంచిప్రోలుకు వెళ్ళాలంటే విజయవాడ వెళ్లి ,నందిగామ ,మీదుగా వెళ్ళాలి .లేకపోతె జగ్గయ్య పేట దగ్గర చిల్ల కల్లు అనే హైదరాబాద్ రూట్ లో ఉన్న సెంటర్ నుంచి మక్కపేట మీదుగా వెళ్ళవచ్చు .నేను జాయిన్ అవటానికి వెళ్ళినప్పుడు నందిగామ నుంచే వెళ్లాను .అక్కడ హెడ్ మాస్టారు నేనెప్పుడో  బాడ్మింటన్ ఆటల్లో చూసిన ఏం .ఆంజనేయులుగారు .ఎర్రగా చాలా ఎత్తుగా తెల్లని గ్లాస్గో పంచె ,చొక్కా తో ఉండేవారు .చొక్కాకి గుండీలు పెట్టేవారు కాదు. కంకిపాడు దగ్గర గొడవర్రు స్వగ్రామం .మంచి వాలీబాల్ ,బాడ్మింటన్ ప్లేయర్ .వీటికి తోడూ చెస్ అంటే విపరీతమైన క్రేజ్ .పేకాట సరే సరి .ఫిజికల్ సైన్స్ టీచర్ .ప్రమోషన్ పై హెడ్ మాస్టారుగా ఇక్కడికి వచ్చారు .సరదా మనిషి ఈజీ గోయింగ్ వారు .,ఇది కమ్మ టూరు .శ్రీ తిరుపతమ్మ దేవత అమ్మ వారి ఆడ బడుచు .కృష్ణా  జిల్లాలో గొప్ప తిరుణాల ఇక్కడే జరుగుతుంది .శక్తిగల దేవత గా ప్రసిద్ధి .మునేరు నది ఒడ్డున ఆలయం ఉంది .నదిదాటితే  మరో ఊరు వస్తుంది . అక్కడా హైస్కూల్ ఉంది .

పెనుగంచి ప్రోలు హైస్కూల్ పెద్దదే .దాదాపు అయిదు వందల ,మంది విద్యార్ధులున్నారు అన్నీ డబల్ సేక్షన్లే.కింది తరగతుల్లో మూడు నాలుగు సెక్షన్లు ఉన్నాయి .ఒక పెద్ద బిల్డింగ్ ,దానికి  ఆనుకొని రేకుల షెడ్లూ ఉన్నాయి .వీటిలో లోయర్ క్లాసులు ఉండేవి .సుందరరావు అనే ఫిజికల్ సైన్స్ మేష్టారు స్తానికుడే .సబ్జెక్ట్ లో ఏమీ దమ్ము లేనివాడు .క్లాసుకు  వెళ్లి పాఠం చెప్పాలంటే విసుక్కొనే వాడు .లాబ్ కూడా పెద్దదికాదు .దాదాపు విద్యార్ధులందరూ కింద కూర్చోవటమే .సెక్షన్ కు కనీసం యాభై మంది ఉండేవారు .ఆడపిల్లలకు విడిగా సెక్షన్లున్నాయి .కింద కూచుని పైకి లేచే ఆడపిల్లలను చూస్తుంటే జాలి వేసేది .చదువు ఇక్కడ చాలా తక్కువే .నేను పది ,తొమ్మిది ఎనిమిది తరగతులకు ఫిజికల్ సైన్స్  చెప్పేవాడిని .ఇంగ్లీష్ కూడా టెన్త్ కుచెప్పేవాడినని జ్ఞాపకం  .పిల్లలకు ఏమీ రాదు కనుక మనం ఏమీ చెప్పక్కర లేదని అందరి మేస్టార్ల అభిప్రాయం .

లెక్కల మేష్టారు ఆచార్యులు గారు నాతొ పాటే భుజబల పట్నం దగ్గర ఉండే హైస్కూల్ నుండి బదిలీపై వచ్చారు .ఉయ్యూరు దగ్గర కపిలేశ్వర పురానికి చెందినా సాయిబు గారుకూడా లేక్కల టీచర్  .ఇంకో ఆతను వెంక టేశ్వర్లుకూడా  ఉండేవాడు .మంచి వాడు . బ్రాహ్మణుడు రోజూ బేజా వాడ నుండి వచ్చేవాడు . .సోషల్ మేస్టర్ లలో ఎవరూ గుర్తులేరు .తెలుగుకు ఒక శాస్త్రి గారుపంచె చొక్కా ,పిలకా తో ఉండేవారు .భార్యా విధేయుడని పేరు .కలతల కాపురం అని చెప్పుకునే వారు .పింగళి లక్ష్మణ రావు అనే తెలుగు ఏం .ఏ .జూనియర్ తెలుగు పండిట్ .కాకాని నరసింహా రావు ,దాసుగారు ,సుందరీ గ్రేడ్ టీచర్లు .దాస్ గారు జిల్లా లో పేరుమోసిన బాడ్మింటన్ ప్లేయర్ .వాలీ బాల్ ఆటగాడు కూడా . క్రాఫ్ట్ మేష్టారు వెంకటేశ్వర రావు నల్లగా బారుగా ఉండేవాడు .డబ్బు వడ్డీలు తిప్పేవాడు .మేస్టర్లకు అప్పు లిచ్చి ఒకటో తేదీ జీతాల రోజున కాబూలీ వాలా లాగా అయిదు రూపాయల వడ్డీ తో గోళ్ళు ఊడ కొట్టి లాక్కునే వాడని అనుకొనే వారు .గార్దేనర్ గా భర్త చనిపోయిన ఒక  అమ్మాయి ఉండేది .ఆమెకు క్రాఫ్ట్  కూ’’ ఏదో ఉందని ‘’గుసగుసలున్దేవి .డ్రిల్ మేష్టారు గా కాకాని రంగయ్య గారు చాలా వృద్ధులు .పంచ చొక్కా తో ఉండేవారు .లోకల్ కాంగ్రెస్ లీడర్ .గోపయ్య గారనే పెద్దాయన డ్రాయింగ్ ?టీచర్ గా ఉండేవాడు .ఈయనదీ పంచె కట్టే .మామిడి వెంకటేశ్వర రావు డ్రిల్ మేష్టారు కుర్రాడు మంచిప్లేయర్ .తమిరిస నుంచి వెంకటేశ్వర రావు అనే వెడల్పు ముఖం ఉన్న ఒక కుర్రాడు చెవుల పోగులతో గొల్లతను లాబ్ అసిస్టంట్ గా ఉండేవాడు .ఇక్కడికి వచ్చి ఎదేనిమిదేళ్ళయిందని చెప్పేవాడు .అలాగే ఆక్కడి నుంచే వచ్చిన ఒక క్రాఫ్ట్ మేష్టారు మంచి ఆంజనేయ భక్తుడు .ఏ రోజుకా రోజు మళ్ళీ వెళ్ళిపోతా నని చెప్పేవాడు ‘’ఇన్ ఫ్లు ఎంషియల్ పెర్సన్ ‘’ లా ఉండేవాడు . నాకూ అదే కోరిక ఉండేది .ఆయన ఎక్కువ కాలం ఉండ కుండానే   ట్రాన్స్ ఫర్  చేయించుకొని వెళ్ళిపోయాడు .

స్కూలు కు మంచి ప్లే గ్రౌండ్ ఉంది .మంచినీటి సరఫరా ,లైబ్రరి ,తోట ఉన్నాయి .సాయంకాలం ఆటలు ఆడేవాళ్ళం .ఊళ్ళో తిరుపతమ్మ దేవాలయమే కాక యోగానంద  నరసింహాలయం ,పాత శివాలయం మొదలైనవి ఉన్నాయి .ఒకప్పటి బౌద్ధ క్షేత్రం కూడా .తిరుపతమ్మ తిరుణాలు మూడు రోజులు జరిగే ఉత్సవం .ఎక్కడెక్కడి నుండో జనం తీర్ధ ప్రజల్లాగా చేరుతారు .మునేరు ఒడ్డున గుడారాలు వేసుఒని  వండు కొంటారు .పొంగళ్ళు వండి నైవేద్యం పెడతారు .నేను పని చేసినప్పుడు అంటే 1985లో అమ్మవారి గుడి చాల ఇరకుగా ఉండేది .ఇప్పుడు అన్ని వసతులతో సర్వాంగ సుందరం గా ఉంది .తిరుపతమ్మ ,ఆమె భర్త గోపయ్య విగ్రహాలుంటాయి .శివాలయం చాలా పాతది .అయిదు వందల యల్లా ఆలం నాటిది .కార్తీక  మాసం లో ఉత్సవాలు బాగా జరుగుతాయి .ఊరికీ దగ్గర లో పెద్ద చెరువు ఉంది .దీని నీళ్ళు వ్యవసాయానికి బాగా ఉపయోగ పడుతాయి .వరి పండిస్తారు .మెత్తచేలల్లో పోగాకు పండుతుంది .మినుము ,పెసర వేరు సెనగ కూడా పండుతాయి .యోగానంద నరసింహాలయం లో ప్రతి శుక్రవారం రాత్రి పూట పూజ  భజన ,పవళింపు సేవ  పాటలు భక్తిగా నిర్వహిస్తారు వైష్ణవ పూజారిగారు .ఆయన్ను అందరూ ‘’అయ్యా వారు ‘’అంటారు .రోడ్డుకు కొంచెం ఎత్తైన ప్రదేశం లో ఈ ఆలయం ఉంది .పూజారి గారు అక్కడే కాపురం .వ్రుద్దులైనా ఏంతో చదువుకొన్నవారు .గౌరవం మర్యాదా ఊరందరి చేతా పొందుతారు .  కొత్త వారెవరైనా బ్రాహ్మలు ఊర్లోకి  వస్తే ఆచార్యుల గారింట్లోనే భోజనం .అతిధి మర్యాద బాగా ఉన్న వారు .వీరు కాక పది బ్రాహ్మణ  కుటుంబాలున్నాయి .కోమట్లు కూడామంచి స్తితి పరులే .వ్యాపారం వారిదే .చిన్న భోజన హోటల్ ఉంది .ముందుగా చెబితే వంట చేసి పెడతారు .స్కూలుల్ కు వెళ్ళేదారిలో ఒక పాక లో  ఒక టిఫిన్ హోటల్ ఉండేది .ఉదయం టిఫిన్ ,కాఫీ మధ్యాహ్నం టిఫిన్ ,టీ అక్కడే బాగా బిజీ గా ఉండేది .

మెయిన్ రోడ్డు ఒకటే .బస్సులు ఈ మార్గం గుండానే గుడి దాకా  వెడతాయి .చెరువు ప్రక్కగా నందిగామ కు వెళ్ళే బస్సులు తిరుగుతాయి .మెయిన్ రోడ్డు మీదుగా మక్క పేట సెంటర్ కు చేరి చిల్లకల్లు మీదుగా జగ్గయ్య పేట  వెడతాయి .మెయిన్ రోడ్డు మీద ,దాని వెనకాల రోడ్డు మీదే బ్రాహ్మణుల కుటుంబాలున్నాయి .మెయిన్ రోడ్డు మీద ఉన్న బ్రాహ్మణులలో విష్ణుభొట్ల బాబు గారు బాగా సంపన్నులు. వేద విదులు .అనేక దేవాలయ ప్రతిస్ట లు  నిర్వహించిన  కర్మిష్టి.వారింటిలో ఒక  గది ని నాకోసం మా లాబ్ అటెండర్ మాట్లాడి ఉంచాడు .అద్దె యాభై రూపాయలని జ్ఞాపకం .అక్కడ కాపురం వగైరా ఈ సారి రాస్తాను .

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-11-14-ఉయ్యూరు

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

”టెలి ట్రాన్స్ పోర్టే షన్”ద్వారా 40 సార్లు కుజుదిమీడకు వెళ్లి వచ్చిన ఇద్దరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి

కష్టాలకు కుంగిపోలేదామె. ఊరంతా అప్పులే అయినా ఏనాడూ ధైర్యం వీడలేదు. ఎన్నోచోట్ల చిన్నాచితక ఉద్యోగాలు చేసినా అవి ఆమె కుటుంబం కడుపునింపలేదు. దీంతో ఆటోడ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె జ్ఞానాపురం నివాసి సిరిపురపు నర్సలక్ష్మి. ‘నువ్వు ఆటో నడుపుతావా..’ అంటూ కొందరు హేళన చేశారామెను.
మరికొందరు ‘నీవల్ల కాదం’టూ చులకన చేసి మాట్లాడారు. అయినా లక్ష్మి కుంగిపోలేదు. ఆటో నేర్చుకుని విశాఖ నగరంలో నేడు పలువురు మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడందరూ ఆమెను ఆటో లక్ష్మి అని పిలుస్తారు. తన జీవన ప్రయాణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను లక్ష్మి ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘నాకు ఎర్రినాయుడుతో 1987 వివాహమైంది. పెళ్లికి ముందు నుంచే నా భర్త వ్యసనపరుడు. దీంతో చూస్తుండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. చివరకు మా పేరిట ఉన్న ఒక్క ఇల్లూ అమ్మేసి ఓ ఆటో కొన్నాడు. అది కూడా ఎన్నో రోజులు ఉండలేదు. మాకు ఓ కొడుకు పుుట్టాడు. అప్పటికి మా పరిస్థితి మరింత దిగజారింది. ఇల్లు గడవడం కష్టమయింది. మా అత్తగారు ఆడపడుచులు మమ్మల్ని ఎప్పుడూ ఆదుకునేవారు. కానీ ఎన్నాళ్లిలా? గత్యంతరం లేక నేనే ఓ హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ ఉద్యోగంలో చేరాను. అక్కడ నెలకు రూ.3,500 ఇచ్చేవారు. దుర్వ్యసనాలకు బానిసైన నా భర్తకు టీబీ సోకింది. ఒకరోజు నా భర్త ఎక్కడో పడిపోవడంతో వెన్నుపూసకు గాయమైంది. దీంతో పగలే కాదు రాత్రిపూట కూడా ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. హోటల్‌లో నెలకు మించి సెలవు ఇవ్వలేమన్నారు. దీంతో ఆ ఉద్యోగం పోయింది. రోజులు గడవడం కష్టంగా మారింది. తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసి కొన్నాళ్లు గడిపాను.
బట్టల వ్యాపారం…
లక్ష రూపాయలు అప్పు చేసి బట్టల వ్యాపారం ప్రారంభించాను. అది కొన్నాళ్లు బాగానే గడిచింది. బట్టలు కొన్నవాళ్లు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ సరిగా చెల్లించకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఈ వ్యాపారం కోసం చేసిన అప్పు రూ.నాలుగు లక్షలకు చేరింది. దీంతో వచ్చిన కొంత ఆదాయం కాస్తా వడ్డీలకే పోయేది. నా భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించి గత ఏడాది మరణించాడు. ఒకపక్క బాబు చదువు, మరోపక్క ఇంటి నిర్వహణా ఖర్చులు నన్ను వెన్నాడేవి. ఏం చేయాలో పాలుపోలేదు నాకు.
ఆటో నేర్చుకోవాలనుకున్నాను…
ఒక టీవీ చానెల్‌లో నాలాగే కష్టాలు పడి చివరకు ఆటో డ్రైవర్‌గా మారి జీవితాన్ని చక్కదిద్దుకున్న ఒక వ్యక్తి గురించిన కార్యక్రమం చూశాను. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. దాంతో నాకు ఆటో నేర్పించమని స్థానికంగా ఆటోలు నడుపుతున్న కుర్రాళ్లను అడిగాను. ‘మీరా ఆంటీ.. కష్టం నడపలేరు..’ అన్నారు వాళ్లు. చిన్నప్పటి నుంచి తెలిసిన ఓ అబ్బాయి నాకు నేర్పడానికి ముందుకొచ్చాడు. రోజూ రెండు, మూడు గంటలు చొప్పున నెల రోజుల పాటు ఆటో నడపడాన్ని బాగా సాధన చేసి నేర్చుకున్నాను. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేశాను. ఆర్టీఏ అధికారులు కూడా నన్ను ఎంతో అభినందించారు. నగరంలో ఆటో లైసెన్స్‌ తీసుకున్న తొలి మహిళ నేనని చెప్పారు.
డ్రైవింగ్‌ సరే..ఆటో మాటేంటి…
ధైర్యం చేసి ఆటో నేర్చుకున్నాను కానీ.. ఎవరూ ఆటోని అద్దెకిచ్చేందుకు సాహసించలేదు. సొంతంగా ఆటో కొనడం తప్ప మరో మార్గం కనిపించలేదు. కానీ సుమారు రూ.మూడు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నేను? మళ్లీ జీవితం మొదటికి వచ్చింది. అప్పుకోసం ప్రయత్నించాను. ఎక్కడకు వెళ్లినా ఆస్తులున్నాయా? హామీ ఎవరిస్తారు? అనే ప్రశ్నలు నాకు ఎదురయ్యేవి. ప్రభుత్వ సాయం దక్కదని అర్ధమైంది. గతంలో అప్పు ఇచ్చిన ఒకామె నా పరిస్థితి చూసి జాలిపడి నన్ను ఆదుకుంది.
తొలి రోజు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు..
ఆటో తీసిన మొదటి రోజు జ్ఞానాపురం జంక్షన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు సుమారు ఐదు కిలోమీటర్లు సర్వీసు ప్రారంభించాను. ఆటోను 40 కిలోమీటర్ల వేగానికి మించి నడపలేదు. రోజూ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహం ఒంటి గంట వరకు.. తిరిగి మూడు నుంచి ఐదు గంటల వరకు ఆటో నడుపుతాను. ఎక్కువగా కాలేజీ యువతులు, మహిళలు నా ఆటో ఎక్కేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు నగర పరిధిలో 20 కిలోమీటర్లకుపైగా ఆటో నడపగలుగుతున్నాను. రోజుకు రూ.500 వరకు సంపాదించగలుగుతున్నాను. ఆటో ఫైనాన్స్‌ కట్టి మిగిలిన సొమ్ముతో ఇంటిని నడుపుతున్నాను. నా కొడుకు ఇప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. వాడు డిగ్రీ పూర్తి చేసి స్థిరపడితే నా జీవిత లక్ష్యం నెరవేరినట్టే.
వాసు, విశాఖపట్నం,
ఫొటోలు.. కోటేశ్వరరావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్

దర్శనీయ దైవ క్షేత్రాలు

శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్

తెలంగాణాలో హైదరాబాద్ కు 48కి.మీ .దూరం లో మెదక్ జిల్లాలోకరీం నగర్ రహదారి లో కొంచెం ప్రక్కగా  వర్గల్ గ్రామం లో  కొండపై ఉన్న శ్రీ విద్యా సరస్వతీ దేవాలయం తప్పక దర్శింప దగిన క్షేత్రం .చుట్టూ లోయ ,ప్రక్కన కొండ తో బహు సుందరం గా కనిపిస్తుంది .ప్రక్కనే మూడడుల రాతి శనైశ్చర విగ్రం తో ఉన్న దేవాలయమూ దర్శింప దగినదే .ఇంత ఎత్తున్న శనీశ్వర విగ్రహం ఆంధ్ర దేశం లో లేదు .శ్రీ విద్యా సరస్వతీ దేవి తో పాటు ,కొండపై లక్ష్మే గణపతి ,శనీశ్వర ,శివ ,దేవాలయాలున్నాయి .కొన్ని వైష్ణవ దేవాలయాలు కూడా పూర్వం ఇక్కడ ఉండేవి .మూల విగ్రహాలు లేని శిధిల దేవాలయాలే .

ఆలయ ప్రాచీనత

సరస్వతీదేవి మహా భక్తుడు ,మంత్రోపాసకుడు ,వాస్తు పండితుడు ,జ్యోతిశ్శాస్త్ర వేత్త ,వ్యాపార దక్షులు అయిన శ్రీ యామవరపు చంద్ర శేఖర శర్మ ఈ ఆలయ కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్య కారకులు .1998లో ఈ ఆలయ నిర్మాణానికి కొద్దిమంది ఉత్సాహ వంతులు ‘’సత్య పధం సేవా సమితి ‘’గా ఏర్పడి మంచి ప్రదేశం కోసం అన్వేషించారు .వారు ఇక్కడున్న వర్గల్ వచ్చి ప్రదేశం నచ్చి ,ఆలయనిర్మాణం చేద్దామని భావించారు .ఈ ప్రదేశం లో400సంవత్సరాల క్రిందటి శంభు దేవాలయం ఉండేది .ఆలయం భూ మట్టానికి రెండు అడుగుల లోతులో ఉండేది .దైవ దర్శనం చేయాలంటే ఒంగి ,పాక్కుంటూ వెళ్లి  శంభు  స్వామిని  దర్శించాల్సి వచ్చేది .శంభు దేవాలయం ప్రక్కనే రెండు వైష్ణవ దేవాలయాలుండేవి .వీటిని కాకతీయ రాజులు నిర్మించినట్లుతెలుస్తోంది .ముప్ఫై అడుగుల ఎత్తున్న  ఒక రాతి జయ స్థంభం ఉండేది .ధ్వజ స్థంభం పై సీతారామ ,లక్ష్మణ ,లక్ష్మీ దేవి విగ్రహాలతో బాటు  పెనవేసుకొన్న జంట నాగ సర్పాలవిగ్రహాలున్నాయి . ఇది చాలా ప్రాచీన చరిత్ర ఉన్న ప్రదేశం కనుక ఇక్కడే ఆలయ నిర్మాణం చేయాలన్న దృఢ సంకల్పం సమితి సభ్యులకు కలిగింది .

ఆలయ నిర్మాణం –విస్తరణ

1989లో వసంత పంచమి నాడు సుముహూర్తం లో శ్రీసరస్వతీ ఆలయ నిర్మాణానికి శంకు  స్థాపన చేశారు .ఆ రోజున సమితి వారి చేతిలో ఉన్న రొక్కం కేవలం 2,700రూపాయలు మాత్రమే .సరస్వతి ఆలయ నిర్మాణం ఇక్కడ జరుగుతోందని తెలియగానే విరాళాలు ప్రవాహం లా వచ్చి చేరాయి .సరస్వతీ అమ్మవారి కృపతో లక్ష్మీదేవి కూడా సహకరించి  నిధులకు కొరత లేకుండా నిర్విఘ్నం గా నిర్మాణపు పనులు కొన సాగాయి .1992లో మాఘ శుద్ధ త్రయోదశినాడు పుష్పగిరి పీఠాదిపతులు శ్రీ శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి ఈ ఆలయం లో  శ్రీ విద్యా సరస్వతి ,శ్రీ  శనైశ్చర విగ్రహాలను ప్రతిస్టించారు .తరువాత ఆలయాన్ని కంచి పీఠానికి అప్పగించేశారు .వారి ఆధ్వర్యం లో ఇక్కడ వేదపాఠశాలను 1999లో కంచి పీఠానికి చెందిన శ్రీ శ్రీ శంకర విజయ సరస్వతీ స్వామి ప్రారంభించారు .ఇందులో మూడు వందల మంది విద్యార్ధులకు వసతి సౌకర్యం ఉన్నది .2001లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం లో విగ్రహ ప్రతిష్ట జరిగింది .ఈ మొత్తం నిర్మాణానికి కోటి రూపాయలకు పైగానే ఖర్చయింది .ఆలయానికి తూర్పున పదమూడున్నర ఎకరాల భూమి ఉంది .ఇందులో ఒక పార్కు ,లైబ్రరి ,హాస్పిటల్ లను నిర్మించటానికి పధకాలను సిద్ధం చేశారు .

తల్లీ నిన్ను దలంచి

పిల్లల అక్షరాభ్యాసానికి ఇక్కడ మంచి వసతి ఉంది .రోజూ ఎందరొ తలిదండ్రులు  తమ   పిల్లలకు అక్షరాభ్యాసం చేయించు కొంటారు .దీనికి రుసుం ఉంటుంది .నిత్యం భక్తులకు ఉచిత భోజన సౌకర్యం ఉంది .సరస్వతీ దేవి ఆలయం చాలా ఎత్తుమీద ఉంటుంది నుక మెట్ల మీద నుంచి నడిచి వెళ్ళలేనివారికి లిఫ్ట్ సౌకర్యం కల్పించారు .మేయింటి నెన్స్ కోసం మనిషికి అయిదురూపాయలు వసూలు చేస్తారు .

సాధారణ రోజుల్లో శ్రీ విద్యా సరస్వతీ ఆలయ సందర్శకులు కనీసం రోజూ  వంద మందికి తక్కువ ఉండరు .నిత్యం ఇక్కడ తామరపూలతో అష్టోత్తర పూజ ఉంటుంది .దీనికి టికెట్ ఇరవై ఒక్క రూపాయలు .కుటుంబం అంటా కూర్చుని పాల్గొని చూడవచ్చు .ఆలయం బయట తామరపూలు కొనుక్కొని భక్తులు తెచ్చుకోవాలి . .దసరా ఉత్సవాలలో వేలాది భక్తులు నిత్య దర్శించి తరిస్తారు .నవరాత్రి ఉత్సవాలు విఘ్నేశ్వర పూజ తో ప్రారంభమవుతాయి .మహాభిషేకం ,నవ రాత్రి కలశ స్థాపన ,చతుశ్శష్టి ఉపచార పూజ ,హారతి , మంత్రం పుష్పం కుంకు మార్చన నిత్యం జరుగుతాయి .ప్రత్యెక పూజలుగా లక్ష పూల అర్చన ,పుస్తక రూపిణిసరస్వతీ పూజ నిర్వహిస్తారు .సరస్వతీ దేవి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజున అంటే సరస్వతీ పూజ నాడు  విశేషమైన పూజలు నిర్వహిస్తారు .నవరాత్రులలో చివరి రోజున విజయ దశమి నాడు , అష్టోత్తర శత లక్ష అభిషేకం జరిపి అమ్మవారికి వివిధ విశేష అలంకారాలను చేస్తారు .చండీ హోమం ఇక్కడ మరోప్రత్యేకత.

శనైశ్చర పూజ

ప్రతి నెల త్రయోదశినాడు శనీశ్వర పూజ నిర్వహిస్తారు .అది శనివారం రోజున వస్తే మహా విశేషం .దీన్ని శని త్రయోదశి అంటారు .ఉదయం అయిదు గంటలకే వినాయక పూజ తో ప్రారంభిస్తారు .జపం ,హోమం తర్పణ తైలాభిషేకం హారతి పూర్ణాహుతి నిర్వహిస్తారు .ఇదంతా పూర్తీ అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది .ఈ పూజకు వేలాది మంది దేశం లో పలు  ప్రాంతాలలనుండి భక్తులు వచ్చి పాల్గొంటారు .శనిదొష నివారణ చేసుకొంటారు .

విద్యా సరస్వతీ దేవి

ప్రశాంత వాతావరణం లో సకల సౌకర్యాలతో ఉన్న శ్రీ విద్యా సరస్వతీ  దేవాలయాన్ని దర్శించి అభీష్ట సిద్ధి పొందవచ్చు .అమ్మవారుఆరు అడుగుల  చాలా భారీ విగ్రహం .వెడల్పు ముఖం  వీణా ,పుస్తక దారిణి .వెండి తొడుగుతో ధగ దగా మెరిసి పోతూ తెల్లని శుభ్ర వస్త్రాలతో దర్శనమిస్తుంది .భక్తులు ‘’ విశ్వకారిణీం,విశాలాక్షీం ,వర్గల్ గిరి నివాసినీం, విద్యా సరస్వతీం వందే వీణా పుస్తక ధారిణీం ‘’అనుకొంటూ దర్శించి పరమానందాన్ని ,అనుభూతిని పొందుతారు .

రత్నాలయ శ్రీ వెంకటేశ్వర స్వామి

వర్గల్ కు పదిహేను కిలో మీటర్ల దూరం లో నాచారం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయాన్ని ,ఆరుకిలో మీటర్ల దూరం లో రత్నాలయం లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించి సంతృప్తి చెందుతారు .ఈఆలయం లో విశాలమైన పార్కు ,అందమైన విగ్రహాలు చెట్లూ ఉన్నాయి .సరదాగా పిక్నిక్ కూడా వచ్చితెచ్చుకోన్నవి తిని కాలక్షేపం చేస్తారు .శ్రీ టి.ఆర్ .వెంకటేష్ ,శ్రీమతి రమాదేవి దంపతుల ఆలోచనే ఈ ఆలయ నిర్మాణం .వీరికుమారుడు శ్రీ రత్నయ్య ఈ బ్బ్రుహన్నిర్మాణాన్ని2001లో  పూర్తీ చేసి తలిదండ్రుల సంకల్పానికి రూపం కల్పింఛి  ,పితృ ఋణం దైవ ఋణం తీర్చుకొన్నారు . .చాల ప్రశాంత వాతావరణం లో ఆలయం అందమైన ప్రక్రుతి మధ్య నిర్మితమైనదేవాలయం .స్వామి విగ్రహమూ చాలా భారీగా ఉంటుంది .అభయ వరదుడుగా, పద్మావతీ ఆండాళ్ సహితం గా భక్త కల్ప ద్రుముడుగాఉన్న కలియుగ దేవుడు .  తిరుమల శ్రీనివాసుని దర్శించలేని భక్తులకోసం ఏర్పడిన ఆలయం. ఇక్కడ కూడా తిరుమలలో లాగానే బ్రహ్మోత్సవాలను నిర్వహించి ,ఇక్కడే అక్కడి వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చేయటం ఈ ఆలయం ప్రత్యేకత .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-14-ఉయ్యూరు .

Inline image 1       Inline image 2Inline image 3

Inline image 4   Inline image 5

vargal                               ratnalayam

Inline image 6 vargal teple Inline image 7

ratnalayam

 

Posted in దేవాలయం | Tagged | Leave a comment

కవిత్వంలో ఆత్మకధ రాసుకొన్న మేరీ జాన్ తొత్తం

కవిత్వంలో ఆత్మకధ రాసుకొన్న మేరీ జాన్ తొత్తం

మేరీ జాన్ తొత్తం కేరళకు చెందిన కవయిత్రి .మధ్య కేరళలో ఇతికార గ్రామం లో తోత్తాహిల్ కుటుంబం లో 1901లో జన్మించింది .కుటుంబం లో పెద్దమ్మాయి .చిన్నప్పటి నుండే కవిత్వం రాయటం ప్రారంభించింది .మొదటి కవితా సంపుటి ‘’గీతా వళి’’ని 1927లో ప్రచురించింది .ప్రేమలో విఫలమై విరక్తికలిగి సన్యాసిని గా మారింది .ఆ కాలం లో సెయింట్ థామస్ దేశమంతా పర్యటించి  క్రిస్టియన్ మత ప్రచారం బాగా చేసి  ,మత మార్పుకు ఎక్కువ తోడ్పడ్డాడు  .సిరియాలోని క్రిస్టియన్ చర్చి కేరళలో ఒక  బ్రాంచి ని ఏర్పాటు చేసింది .కేధాలిక్ మతనికి చెందిన మేరీ జాన్ వెంటనే అవకాశాన్ని ఉపయోగించు కొని చేరింది .ఒక్క కేరళలోనే కాదు  ఆ సమయం లో దేశం లో చాలాచోట్ల మత మార్పిడులు జరిగి ఎకువ మంది క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు .మేరీ తానూ ప్రపంచాన్ని రోసి అవివాహితగా ఉండిపోయి సన్యాసినిగా మారిపోతానని చేసిన నిర్ణయం ఆ నాడు పెద్ద సంచలనమే కల్గించింది .ప్రజలందరూ కధలూ గాధలుగా ఆ విషయాన్ని  చెప్పుకొన్నారు .unnamed

మేరీ జాన్ ఇప్పుడు ‘’సిస్టర్ మేరీ బెగీనా’’గా మారింది .తన కవితా ధారను మాత్రం ఆపకుండా నిరంతరం ప్రవహింప జేస్తూనే ఉంది .1929లో ‘’కవితారామం ‘’ను ,1934లో ‘’ఈశ ప్రసాదం ;;(జీసెస్ బ్లెస్సింగ్స్ ),1936  లో ‘’ఆత్మ వింతే సంగీతం’’ (ఆత్మ సంగీతం )1968లో ‘’అంతి నక్షత్రం ‘’(ట్విలైట్ స్టార్ )రాసి ముద్రించింది .అసలైన ఆమె మాగ్నం ఓపస్ రచన 1970లో ‘’మార్ తోమా విజయం ‘’(ది విక్టరి ఆఫ్ సెయింట్ ధామస్).దాదాపు ఆమె కవిత్వం అంతా రొమాంటిక్ గానే ఉంటుంది .కవితారామం ఇరవై ప్రచురణలు పొందటం దానికున్న ఆదరణ తెలియ జేస్తుంది .ప్రకృతిని వాస్తవ స్వరూపం గా భావించి ఆరాధించింది .ఆమె కవిత్వం లో ఆత్మ ప్రయాణం కనిపిస్తుంది .ఎనభై నాలుగేళ్ళు జీవించి సిస్టర్ మేరీ బెగీనా1985లో మరణించింది .

మేరీ రాసిన కవితలకు  డాక్టర్ వారియర్ అనే సంగీతజ్ఞుడు  ,-మోహన ,హిందోళ ,తోడి ,మధ్యమావతి అనే నాలుగు రాగాలలో వరుసలు కూర్చాడు .1928లో తన ఆత్మకధ గా ‘’లోకేం యాత్ర ‘’(ఫేర్వెల్ టు ది వరల్డ్ )రాసిన కవితలు కేరళలో చదువురాని వారు కూడా విని బట్టీ పట్టి అనుభూతి పొందుతారు .ఇందులో ఆమె జీవన గమనం ,కస్టాల కడలిలో ధైర్యం తో ఎదురీది అనుకొన్నది సాధించే ప్రయత్నం అంతా ఉంటుంది .అందుకే అది వారికి ఒక పారాయణ గ్రంధమే అయింది .తన స్నేహితులను ,బంధువులను ,ప్రకృతిని ,గత జీవితానిన్ని ,చుట్టూ ఉన్న భౌతిక వాతావరణానికి,’’నన్’’అంటే సన్యాసినిగా మారటానికి ముందున్న సమస్తానికి ఇది వీడ్కోలు గీతం .తానూ ఎమీమి కోల్పోతున్నానో ప్రతిదానినీ నెమరేసుకొని’’ టాటా బై బై ‘’చెప్పే కవితలివి .తాను  వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం పొందే వెలితికి ప్రాధాన్యం ఇవ్వలేదు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-11-14-ఉయ్యూరు

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నిర్యోస్త్య కావ్య కవి -మరిం గంటి సింగరాచార్య -మూసి -నవంబర్

singaracharya-1 001 singaracharya2 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తురగా జానకీ రాణి గురించి సుధామ -చినుకు -నవంబర్- చాసో గూర్చి కె బి లక్ష్మి

turaga1 001turaga2 001turaga3 001chaso1 001 chaso2 001 chaso3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విలనిజంలో హస్యం.. నాన్నకే చెల్లింది..! రామణా ”రెడీ”-కుమారుడు ప్రభాకర రెడ్డి

విలనిజంలో హస్యం.. నాన్నకే చెల్లింది..!

‘గుండమ్మకథ’, ‘మాయాబజార్‌’, ‘రోజులు మారాయి’, ‘కులగోత్రాలు’… తెలుగు సినీజగత్తుల్లో ఆణిముత్యాల్లాంటి ఆ సినిమాలను తలుచుకుంటే చాలు. ఠపీమని గుర్తుకొచ్చే పేరు రమణారెడ్డి. హీరోహీరోయిన్లు ఎవరైనా, పాత్ర ఏదైనా ఆయన నటనాశైలి తీరే వేరు. విలనిజంలో హాస్యం చొప్పించినా- హాస్యానికి విలనీ జోడించినా.. ‘అయయో జేబులొ డబ్బులు పోయెనే’ అంటూ ఓ సోమరిపోతు పేకాటరాయుడి జీవనశైలి వివరించినా ఆయనకే చెల్లింది. హాస్య నటనకు సరికొత్త భాష్యం చెప్పిన తిక్కవరపు రమణారెడ్డి 1950వ దశకం నుంచి తెలుగు సినిమాల్లో వినూత్న కామెడీ విలనిజాన్ని ఆవిష్కరించారు. నేడు రమణారెడ్డి40వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు ప్రభాకర్‌రెడ్డి తండ్రి స్మృతులను గుర్తు చేసుకున్నారు.

మాది నెల్లూరు జిల్లా జగదేవిపేట. నాన్నగారు అక్కడే 1921లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా నెల్లూరులోనే జరిగింది. వీఆర్‌ కళాశాలలో ఇంటర్మీడియేట్‌ చదివేందుకు చేరారు. ముగ్గురు సంతానంలో నాన్న రెండో అబ్బాయి. మా పెదనాన్న గారబ్బాయే కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త టి.సుబ్బిరామరెడ్డి. మాది మొదటి నుంచీ ఉన్నతమైన కుటుంబమే. అయితే నాన్నకు చదువు పెద్దగా అబ్బలేదు. కానీ ఆయన ఆంగ్లం బాగా మాట్లాడేవారు. నాడు సినీ పరిశ్రమలో అతికొద్దిమందికే ఆంగ్లం వచ్చు. స్కూలు నుంచే నాన్నగారికి నాటకాల పిచ్చి వుండేది. ఆయన నాటకాల్లో మొట్టమొదట వేసిన వేషం గిరీశం పాత్ర అని ఓ చోట ఆయనే స్వయంగా రాసుకున్నారు. ఆ పాత్రలో బాగా ఇమిడిపోవడంతో చాలా అవకాశాలు వచ్చేవి. దాంతో చదువు పక్కనపెట్టేసి నాటకాల కోసం తిరగడం మొదలుపెట్టారు. నెల్లూరులోని అమెచ్యూర్‌ అసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో ఈ నాటకాలు వేసేవారు.
గిరీశం ధూమపానం సేవిస్తూ కనిపించే పాత్ర. ఓరోజు నాటకంలో గిరీశం వేషం వేసిన సమయంలో వేదిక ముందు చాలామంది గ్రామపెద్దలు, కలెక్టర్‌ వంటివారు కూర్చొని వున్నారట. మా ముందే రమణారెడ్డి సిగరెట్‌ తాగుతాడా అంటూ వారంతా మండిపడ్డారట. ఈ విషయాన్ని మా బంధువొకరు నిత్యం చెబుతుండేవారు. అప్పట్లో మద్రాస్‌లో ‘ఆంధ్ర నాటక కళా పరిషత్‌’ జరిగేది. అందులో పోటీలో కాకుండా వేరేగా ఓ నాటకం వేశారు. నేపథ్య గాయని ఎస్‌.జానకి మామగారైన మోనో యాక్టర్‌ చంద్రశేఖరంతో కలిసి ‘దొంగాటకం’ నాటిక వేశారు. చంద్రశేఖరంగారు రకరకాల పాత్రలకు స్వయంగా మేకప్‌ వేసుకునేవారు. నాటకాలపై వున్న పిచ్చితో నాన్నకు సరిగ్గా చదువు అబ్బలేదు. దాంతో ఆయన ఇంటర్మీడియేట్‌ పాస్‌ కాలేకపోయారు. ఆ తర్వాత పెద్దల బలవంతం మీద శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ట్రైనింగ్‌ కోర్సు చేశారు.
ఎదిరించి ఉద్యోగం పోగొట్టుకున్నాడు..
గుంటూరు మున్సిపాలిటీలో టీకాలు వేసే ఇన్‌స్పెక్ట్టర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పట్లో టీకాలంటే చాలామందికి భయం వుండేది. ఓ రోజు గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌కు, ఆయన కుటుంబీకులకు టీకాలు వేయడానికి వెళితే వాళ్లు వద్దన్నారు. కానీ వేయించుకోవాల్సిందేనని ఈయన పట్టుబట్టారు. దాంతో కమిషనర్‌నే ఎదిరిస్తావా? అంటూ అధికారులు నాన్నని ఉద్యోగం నుంచి తొలగించేశారు. తరువాత మద్రాస్‌లో ఓ తమిళ కంపెనీలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా చేరారు. కొన్నాళ్లకు ఆ కంపెనీ మూతబడడంతో నెల్లూరు వెళ్లి ఓ పత్రికలో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పని చేశారు. వెంకటగిరి అమెచ్యూర్‌ నాటక కళా పరిషత్‌ ప్రోత్సాహంతో నెలజీతం మీద ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు బయలుదేరారు. ఆ పర్యటన ఆర్థికంగా జయప్రదం కాకపోవడంతో ఆ తరువాత అది కూడా మానుకుని కొంతకాలం ఇన్స్యూరెన్స్‌ కంపెనీలో పని చేశారు.
అలా సినిమాల్లోకి..
ఇన్స్యూరెన్స్‌ కంపెనీలో పని చేస్తున్నా నాటక ప్రదర్శనలు మాత్రం మానలేదు. ఓ రోజు ఏదో నాటకంలో ‘లవకుశ’ సినిమా నిర్మాత ఎ.శంకర్‌రెడ్డి నాన్నగారి నటన చూసి మెచ్చుకున్నారు. నాన్నగారంటే ఆయనకు మంచి అభిమానం. ఆయన మద్రాస్‌లో సినిమా కంపెనీ పెట్టినప్పుడు తొలి సినిమాలోనే నాన్నగారికి మంచి పాత్ర ఇచ్చారు. అదే ‘మానవతి’ చిత్రం. అందులో ఆయనది విలన్‌ పాత్ర. ఆ సినిమాకు దర్శకుడు ఇప్పటి సీనియర్‌ నటి లక్ష్మి తండ్రిగారైన వైవీ రావ్‌. ఆ తరువాత ప్రకాష్‌ ప్రొడక్షన్స్‌ వారి ‘దీక్ష’ సినిమా చేశారు. కానీ ఇందులో హాస్యపాత్ర. తొలిగా నటించింది ‘మానవతి’ అయినా, విడుదలైన సినిమా మాత్రం ‘దీక్ష’. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం 200 సినిమాలకు పైగానే సాగింది.
అదే ఇల్లు కొన్నారు..
ఇప్పుడు మేం వుంటున్న ఇంట్లో ఒకప్పుడు చిత్తూరు వి.నాగయ్యగారు అద్దెకు వుండేవారు. నాన్న ఓసారి నెల్లూరు నుంచి మద్రాస్‌ వచ్చి చిత్తూరు నాగయ్యగారిని ఇదే ఇంట్లో కలిశారట తనకు ఓ అవకాశం ఇవ్వాలని. అయితే అప్పట్లో అవకాశం లేకపోవడంతో ఓ సినిమాలో తన శిష్యుల్లో ఒకరిగా నటించాలని, అందుకు బోడిగుండు కొట్టించుకోవాలని సూచించారట. అందుకు ‘మీరిచ్చే బోడి వేషానికి నేను గుండు గీయించుకోవాలా?’ అని నాన్న ఆ అవకాశాన్ని తిరస్కరించి వెళ్లిపోయారట. అయితే నాన్న సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న తరువాత 1959లో అదే ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటికీ నాగయ్యగారు ఈ ఇంట్లో అద్దెకుంటున్నారు. నిజానికి ఈ ఇల్లు కొనుగోలు చేయాలని నాగయ్యగారే నాన్నకు సూచించారు. వాసి బాగా వున్న ఇల్లు కాబట్టి దీనిని కొనుగోలు చేయాలని ఆయన సూచించడంతో నాన్న అంగీకరించారు. తను అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన ఇల్లే స్వంతం కావడమంటే మాటలు కాదు.
దానధర్మాలు అధికం
నాన్నకు దానధర్మాలు అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా గుప్త దానాలు. ఆ రోజుల్లో సినిమావాళ్లు గృహప్రవేశాన్ని అందరినీ పిలిచి బ్రహ్మాండంగా చేసుకునేవారు. కానీ 1960లో మేం ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు నాన్న ఎవ్వరికీ చెప్పలేదు. ఓ వెయ్యిమంది పేదలను రప్పించి అన్నదానం చేశారు. ఆయన ఆలోచనా తీరు అలానే వుండేది. ఇంకా చాలా మంచి పనులు చేశారు. కానీ అవేవీ ఆయన చెప్పుకునేవారు కాదు.
మెజీషియన్‌గా..
నాన్నా చాలా బాగా మ్యాజిక్‌ చేసేవారు. ఆయన ‘అక్కాచెల్లెళ్లు’ అనే సినిమాలో మెజీషియన్‌ పాత్ర పోషించారు. ఆ పాత్రలోని విశేషం బాగా నచ్చడం వల్లనేమో నాన్న మ్యాజిక్‌ నేర్చుకున్నారు. ఎం.శేషాద్రి (మెస్ర్డీ) అనే మెజీషియన్‌ వద్ద రెండుమూడు నెలలు మ్యాజిక్‌ నేర్చుకున్నారు. మొట్టమొదటిసారిగా 1957లో నెల్లూరులో ‘మ్యూజిక్‌-మ్యాజిక్‌’ పేరుతో ఘంటసాల గారితో కలిసి ప్రదర్శన ఇచ్చారు. ఆయన పాటలు పాడితే, ఈయన మ్యాజిక్‌ చేశారు. అప్పటి నుంచి మెజీషియన్‌గా నాన్నకు ఎన్నో అవకాశాలు వచ్చేవి. ఎక్కువగా సహాయాల కార్యక్రమాలకే ఉచితంగా ప్రదర్శనలిచ్చేవారు. ఈ ప్రదర్శనల వల్ల వచ్చినదానికన్నా పోయిందే ఎక్కువ. ఈ విషయం నాకు బాగా తెలుసు. సినిమాల్లో కూడా నిర్మాతలు ఇచ్చింది తీసుకునేవారు. ఇప్పటిలా ధనార్జనే లక్ష్యంగా వుండేది కాదు.
ఇంట్లో చాలా సీరియస్‌..
సినిమాల్లో ఆయన చేసిన విలనీ, కామెడీ పాత్రలకూ, ఆయన నిజజీవితానికీ పొంతనే లేదు. నిజ జీవితంలో ఆయన చాలా సీరియస్‌గా వుండేవారు. సమాజ సేవా తత్పరత ఎక్కువ. షూటింగ్‌ లేకపోతే ఆంధ్రా క్లబ్‌ (ఆస్కా), టి.నగర్‌ క్లబ్‌, మద్రాస్‌ రేస్‌ క్లబ్‌లలో ఉత్సాహవంతమైన సభ్యుడిగా వుండేవారు. పద్మనాభం నిర్మించిన సినిమా ‘దేవత’లో పద్మనాభం పాత్ర మద్రాస్‌ వచ్చి సినిమావాళ్లను పలుకరించి వెళ్తుంది. ఇందుకోసం ఓ రోజు పద్మనాభం గారు ఫోన్‌ చేసి కెమెరాతో మీయింటికి వస్తున్నాం అన్నారు. నాన్న చాలాసేపు చూసి బయటకు బయలుదేరారు. అంతలోకి పద్మనాభం రావడం, నాన్న పలుకరించడం జరిగిపోతుంది. ఇదంతా ఆ సినిమాలో కనిపిస్తుంది. అదంతా నిజ సన్నివేశమే. ‘ఏంటి మీరు సినిమాలో బాగా హాస్యం పండిస్తారు. నిజజీవితంలో ఇంత సీరియస్‌గా వున్నారు?’ అని పద్మనాభం పాత్ర అడుగుతుంది. ‘సినిమాల్లో కమేడియన్‌గా చేస్తే, బయట కూడా నవ్వించాలా?’ అని నాన్న అడుగుతారు. అదంతా షూటింగ్‌లో భాగమని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజమైన సన్నివేశమే. నాన్న సినిమాల్లో వున్నా పబ్లిసిటీకి దూరంగా వుండేవారు. ఆయన అజాత శత్రువు. పరిశ్రమలో ఆయనకు ఎవ్వరూ శత్రువులు లేరు, ఆయనకు ఎవ్వరిపైనా శత్రుత్వ భావం లేదు.
మాకు పూర్తి స్వేచ్ఛ

మేం ఐదుగురం సంతానం. నేనే పెద్దవాణ్ని. ముగ్గురు చెల్లెళ్ల తరువాత తమ్ముడు పుట్టాడు. నేను, తమ్ముడు ఇంజనీరింగ్‌ పూర్తి చేశాం. నేను ఎల్‌ అండ్‌టీలో పదేళ్లు, ఆ తరువాత కోరస్‌ ఇండియాలో కొంతకాలం పని చేసి స్వచ్ఛంద పదవీవిరమణ చేశాను. నా వయసు 67. మా పెద్ద చెల్లెలు వసుమతి ఇంగ్లాండ్‌లో, 2వ చెల్లెలు స్వర్ణలత నెల్లూరులో, 3వ చెల్లెలు పద్మావతి పుదుచ్చేరిలో, తమ్ముడు శ్రీనివాస్‌ అమెరికాలో వుంటున్నారు. నాన్న ఏనాడూ మాకు ఫలానా చదవండి అనో, ఫలానా అవ్వండి అనో చెప్పలేదు. మాకేం కావాలో, మేమేం చదవాలో మేమే నిర్ణయించుకునేలా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నిజానికి మేమేం చేస్తున్నామన్నది ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఓ రోజు ఎస్‌వీ రంగారావు మాయింటికి వచ్చారు. ‘మీ పెద్దవాడు ఏం చేస్తున్నాడు’ అనడిగితే… నాన్న నన్ను పిలిచి ‘ఇంజనీరింగ్‌ ఏ సంవత్సరం చదువుతున్నావురా?’ అని అడిగారు. అంటే ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదన్నమాట. అంతా అమ్మే చూసుకునేది. ఇప్పుడు అమ్మ సుదర్శనమ్మ వయసు 90. నా వద్దే వుంటోంది. భగవంతుడు మాకు నాన్న వారసత్వంగా నటన ఇవ్వలేదు గానీ, మంచి చదువు మాత్రం ఇచ్చాడు. బహుశా అదే మాకు మైనస్‌ కూడా అయిందేమో అనిపిస్తుంటుంది. 1974 నవంబర్‌ 11న మరణించారు నాన్న. అంటే 53 ఏళ్లకే ఆయన కన్ను మూశారు. చాలామంది ఆయన శరీరాకృతి చూసి మంచి వృద్ధాప్యంలో చనిపోయారనుకుంటారు. కానీ పిన్నవయసులోనే మరణించారు. ఆయనకు అల్సర్‌. ఇప్పటిలా ఆ కాలంలో అల్సర్‌కు మందులు లేవు. 1968లో ఆయనకు ఆపరేషన్‌ కూడా జరిగింది. అప్పటి నుంచే ఆయన యాక్టివ్‌గా లేరు. ఆ తరువాత సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి.

చొక్కా ధరించిన నారదుడు 
తెలుగు సినిమాలో నారదుడికి చొక్కా వేసింది నాన్నగారే. ‘పార్వతీ కల్యాణం’ అనే చిత్రంలో నాన్న నారదుడి వేషం వేశారు. అయితే బాగా బక్కపల్చగా వుండడంతో దర్శకుడు ఆయనకు జుబ్బా తొడిగించారు. ఇది చాలా పెద్ద వివాదమైంది. ఓ పెద్దాయన వచ్చి ‘ఏమయ్యా నారదుడి వేషం వేస్తూ జుబ్బా తొడిగావే? ఏం చేస్తాం కలికాలం’ అన్నారట. అందుకు నాన్నగారు ‘కలికాలం కాదు… అది చలికాలం’ అన్నారు. అంతటి సమయస్ఫూర్తి నాన్నది.

మాటలతో ఏడిపిస్తారు 
మాటలతో ప్రేక్షకులను ఏడిపిస్తారు. ఆయన ప్రతిభకు తగిన సీరియస్‌ పాత్రలు రాలేదన్న భావన ఆయనకు కూడా వున్నట్లుంది. నాన్నగారు కమెడియన్‌ కన్నా విలనీ పాత్రలే ఎక్కువగా చేశారు. ఆయన శరీరానికి అనుగుణంగా విలనిజానికి కామెడీ జోడించడంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోగలిగారు. అందుకే ఇన్నేళ్లయినా నాన్న తెలుగు ప్రేక్షకుల మదిలో వుండగలిగారు.

ఎన్నో అపోహలు
నాన్న 1973లో ‘కీమత్‌’ సినిమాకు అసిస్టెంట్‌ స్టంట్‌ మాస్టర్‌గా పని చేశారని ఓ టీవీ షోలో చెప్పారట. ఆయన పర్సనాలిటీకి స్టంట్‌మాస్టర్‌గా చేయగలరా? అదే విధంగా ఆయన జన్మదినం కూడా కరెక్టు కాదు. ఆయన పుట్టిన సంవత్సరం మాత్రమే కరెక్టు. ఆయన తొలి సినిమా ‘మాయపిల్ల’ అని చాలాచోట్ల వుంది. అదీ కరెక్టు కాదు. ఆ సినిమాలో ఆయన అసలు నటించనేలేదు.

డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై

Posted in వార్తా పత్రికలో | Leave a comment

కొత్త రాజధాని తుళ్ళూరు -ఆనందం తో తుళ్ళి పడుతోంది –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వర్గల్ లో శ్రీ విద్య సరస్వతి దేవాలయం మరియు రత్నలయం లో శ్రీ వెంకటేశ్వరా దేవాలయ సందర్శనం 9/11/14 ఆదివారం .

వర్గల్ లో శ్రీ విద్య సరస్వతి దేవాలయం మరియు రత్నలయం లో శ్రీ వెంకటేశ్వరా దేవాలయ సందర్శనం 9/11/14 ఆదివారం .

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆదివారం హైదరాబాద్ లో మా అక్క బావ శ్రీమతి వేలురి దుర్గ శ్రీ వివేకానంద్ ల మరియు తిరుమలగిరిలో మా కజిన్ శ్రీమతి/ శ్రీ చెరుకుపల్లి రామ చంద్ర మూర్తి గారాల కుటుంబాల తో మేము 

9/11/14 ఆదివారం హైదరాబాద్ బోవేన్పల్లీ  లో మా అక్క బావ శ్రీమతి వేలురి దుర్గ శ్రీ వివేకానంద్ ల మరియు తిరుమలగిరిలో మా కజిన్ శ్రీమతి చెరుకుపల్లి సరదా , బావ గారు శ్రీ రామ చంద్ర మూర్తి గారాల కుటుంబాల తో మేము

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు

వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు

నికొనార్‌ పారా కవితలు నిర్మొహమాటంగా మాటాడతాయి. ఖచ్చితమైన అభివ్యక్తి వాటిల్లో కనిపిస్తుంది. భౌతిక శాస్త్రపు గణిత సిద్ధాంతాల్ని పోలి ఉంటాయి. తన చుట్టూ ఉండే వాటినే కవిత్వం చేశారు పారా. సాధారణ భాష నుంచి, స్వీయపోరాటాలు, అనుభవాలు, తననితాను ప్రశ్నించుకునే తాత్వికత వరకూ పారా కవిత్వం కొనసాగుతుంది. అయినా ఆయన కవిత్వమంతా ఏదో వెదుకులాట!
ప్రసిద్ధుల శతాబ్ది ఉత్సవాలు ఇటీవల విరివిగానే జరుగుతున్నాయి. మనకు తెలిసిన ఈ ఉత్సవాలు అన్నీ మరణానంత రం జరిగేవే. శతాబ్ది ఉత్సవాన్ని, జీవించి ఉండగానే చూసుకునే అదృష్టవంతులు అరుదుగానే ఉన్నా, అసలే లేకపోలేదు. అలాంటి అరుదైన వారే ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాల్ని జరుపుకుంటున్న- అనేక ప్రశంసలు, విమర్శలకు నోచుకున్న, లాటిన్‌ అమెరికా చిలీ దేశపు ప్రముఖ కవి నికొనార్‌ పారా (1914-). ఇటీవలే సెప్టెంబరు5కు, నూరేళ్లు పూర్తిచేసుకున్న సజీవ కవి పారా. పారా లాటిన్‌ అమెరికా సమకాలికుల్లో నోబెల్‌ బహుమతి గ్రహీతలు – చిలీ దేశానికే చెందిన కవయిత్రి గబ్రియేలా మిస్ర్టాల్‌ (1889-1957), పాబ్లో నెరూడా (1904-1973) మెక్సికోకి చెందిన ఒక్టా వియో పాస్‌ (1914-1998) లాంటి వారున్నారు. కాకతాళీయంగా పాస్‌ శతాబ్ది ఉత్సవాలు కూడా ఈ ఏడాదే జరుపుకుంటున్నారు. పారా సైతం నోబెల్‌ బహుమతికోసం అర్హుడుగా రెండుసార్లు పరిశీలనలో ఉన్నారు.
అకవిత్వం అన్న ప్రక్రియకు పారా సృష్టికర్త. సాంప్రదాయక కవిత్వ పద్ధతుల్ని శైలుల్ని తిరస్కరించే కవిత్వం. సరళమైన ప్రత్యక్ష భాషతో, విలక్షణం తరచుగా విడ్డూరమైన సాధారణ అనుదిన ప్రపంచ సమస్యల్ని ప్రస్తావిస్తూ, పరిహాసంగా సాగే కవిత్వం. కవిని ఒక ప్రవక్తలా భావించి, కవిత్వానికి ఏదో మహాత్మ్యం ఉందన్న నమ్మకాన్ని తిరస్కరించడానికి మొదలెట్టిన ఒక ప్రక్రియ. వ్యావహారిక భాషని, ఒక్కోమారు అమర్యాదకర భాషని, ప్రాచీన పద్ధతుల్ని తేలికచేస్తూ, చమత్కారంగా రాసే ప్రక్రియ. రోజువారీ అనుభవాల్ని, భాషని, వస్తువుగా తీసుకోవడం ఇందులో కనిపిస్తుంది. శుద్ధ అలంకారప్రాయమైన కవిత్వం నుంచి రోజువారీ అభివ్యక్తిలోకి మార్చడం, గూఢార్ధాలు లేకుండా చేయడం, అలా సాహిత్య సంప్రదాయాల్ని ఎదిరిస్తూ తన స్వీయ స్వరాన్ని తెలుసుకోవ డం, కవిత్వ సంప్రదాయాల్ని ప్రశ్నించమని పాఠకుడ్ని ప్రోత్సహించడం, ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం. పారా ఈ కవిత్వ ప్రక్రియ మొదలెట్టకముందు, యుక్తవయస్సులోను అంతకుముందు కూడా, పూర్తిగా అధివాస్తవికతావాది.
1930 చివర్లో, పారా ప్రసిద్ధ అమెరికన్‌ కవి వాల్ట్‌ విట్మన్‌ కవిత్వం ఇష్టపడ్డా, ఆ తరువాత వారి కవిత్వమూ నచ్చక, అధివాస్తవికతావాదం వైపు మొగ్గారు. కాఫ్కాని చదువుకున్నారు. వీరిని ఎక్కువ ప్రభావితం చేసి, 1940 చివర్లో వారి అకవిత్వ ప్రక్రియకు దోహదం చేసినవారిలో ముఖ్యులు- జాన్‌డోన్నె (1572-1631), డబ్ల్యూహెచ్‌ ఆడెన్‌ (1907-1973), సెసిల్‌ డే లెవిస్‌ (1904-1972), స్టీఫెన్‌ స్పెండెర్‌ (1909-1995), సెజార్‌ వల్లెజో (1892-1938), మరీ ముఖ్యంగా టి.ఎస్‌. ఎలియట్‌ (1888-1965).
ఈ ప్రక్రియకు రావడానికి ఆయనకు అనేక సంవత్సరాలు పట్టింది. కవిత్వానికి జీవితానికి మధ్య ఎంతో దూరం ఉందని, 1930లో వారి వైజ్ఞానిక సాపేక్ష నేపథ్యంతో తెలుసుకున్నారు. సాధారణ జీవితం మీద ఆధారపడ్డ సామాన్య జనుల సర్వసాధారణ సమస్యల్ని ప్రతిబింబించే స్థానిక భాషా కవిత్వం అవసరం అని తేల్చుకున్నాక ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఆరంభంలో పారా కవిత్వ అవగాహన నెరూడా అపరిశుద్ధ కవిత్వం వైపే ఉండింది. అది సాధారణ అనుభవాన్ని ముతక భాషతో మానవజాతిని కలపడంలా వీరికి ఆ తరువాత అనిపించింది. మరీ అలంకారపూరిత నెరూడా పద్ధతిని, కవిత్వ భాషని కాదని- పక్షులు పాడనీ, మనుషులు మాటాడనీ అన్న పద్ధతిలో తన కవిత్వాన్ని మళ్లించుకున్నారు. దానికి మూడు లక్ష్యాలు వీరు నిర్దేశించుకున్నారు. 1. రూపకాలనుండి కవిత్వాన్ని తప్పించి పాఠకుడితో ప్రత్యక్ష వర్తమానం జరపడం 2. కవిత్వ భాష, ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే సాధనం కావడం 3. నిర్దిష్టమైన సామాజిక వాస్తవికతని ప్రతిబింబించే కవిత్వ భాషని స్థానీకరించడం.
గత వ్యామోహంతో బాటు ప్రపంచంలోని అరాజకత్వం మానవస్థితుల పట్ల ఏవగింపు, పారా కవిత్వంలో కనిపించే సాధారణ విషయాలు. వీరి అకవిత్వ ప్రక్రియలో, కవిత్వంలోని కాల్పనికతకు బదులు ప్రపంచంలోని వాస్తవికతని వాడుకున్నారు. సామాజిక రాజకీయ హింసను నిష్కపటంగా ఎదిరించే మనస్తత్వం. ఏ ఒక్క భావజాలానికీ లొంగలేదు. సాంస్కృతిక ప్రపంచం, మానవ పరిస్థితుల పట్ల వీరి స్థిరమైన ప్రతిక్రియ ఎప్పుడూ చమత్కారం, వ్యంగ్య పూరితం.
పారా గణిత శాస్ర్తాన్ని, భౌతిక శాస్ర్తాన్ని చదువుకున్నారు. 1952 నుంచి 1991లో పదవీవిరమణ వరకూ సైద్ధాంతిక భౌతిక శాస్ర్తాన్ని చిలీ విశ్వవిద్యాలయంలో బోధించారు. మార్క్సిస్ట్‌ పక్షపాతిగా పారాని అనేకులు విమర్శిస్తారు.
పారా కవితలు వ్యక్తిగతంగా నిర్మొహమాటంగా ఎవరి ప్రమేయం లేకుండా మాటాడతాయి. ఏ విధమైన వ్యాఖ్యానం అవసరం లేకుండా ఆయన అనుభవపు ఖచ్చితమైన అభివ్యక్తి వాటిల్లో కనిపిస్తుంది. భౌతిక శాస్త్రపు గణిత సిద్ధాంతాల్ని పారా కవితలు పోలి ఉంటాయి- పదాల వాడుకలో పొదుపు, రూపకాలు లేకుండా, అలంకారిక భాష లేకుండా. అవి నెరూడా ప్రతీకాత్మక వ్యక్తి ప్రధాన వాదానికి వ్యతిరేకంగా వాడుకున్నట్టుంటాయి.
తన పిల్లల పిల్లలు మాటాడుకునేది, పనిపిల్ల రోసిట అవెండనో మాటాడేవి, యాదృచ్ఛికంగా తిరిగేవారి మాటలు, ఆయన రచనకు పనికొచ్చాయి. మనచుట్టూ కవిత్వం ఉందని నమ్మే పారా, తన చుట్టూ ఉండే వాటినే కవిత్వం చేయడానికి అలవాటుపడ్డారు. అమితమైన తన అసంతృప్తిని పారా, నిందాస్తుతి, వ్యంగ్యం, క్రౌర్యం ద్వారా తెలియజేస్తారు. సాధారణ భాషనుంచి, స్వీయపోరాటాలు, అనుభవాలు, సమయాన్ని, తననితాను ప్రశ్నించుకునే తాత్వికత వరకూ పారా కవిత్వం కొనసాగుతుంది. అయినా పారా కవిత్వమంతా ఏదో వెదుకులాట, పోరాటం, మనస్ఫూర్తైన అభివ్యక్తి, చివరికి ఒక ఆశగా మనకు తారసపడుతుంది. అయితే కొందరికి పారా అకవిత్వం నీతిబాహ్యంగా అనిపించింది. కారణం – స్ర్తీలు, మతం, సుగుణం, అందం పట్ల ఒక విధమైన చులకన భావం అందులో కనిపించడం. కానీ అది, పారా అకవిత్వంతో చెప్పాలనుకునేదాన్ని అపార్థం చేసుకోవడమేనని, పారా ఏదో నీతిబాహ్యమనుకున్నవి రాయాలని రాయలేదని, సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో వారితో మాటాడటంగా దానిని అర్థం చేసుకోవాలని విమర్శకులు అంటారు. ‘రచనలు లేవనెత్తే ప్రశ్నలకు రచయిత జవాబు చెప్పడు/ అది పాఠకుడికి కఠినంగా ఉండొచ్చు/ కానీ ఇప్పటినుంచీ అది వారు అంగీకరించక తప్పదు’ అని ‘పాఠకుడికి హెచ్చరిక’ అన్న కవితలో పారా జవాబు చెప్పుకున్నారు.
1938లో పారా ‘అనామక పాటల పుస్తకం’ కవిత్వ సంకలనం వచ్చింది. 1949లో మొదటిసారి ‘కవితలు అకవితలు’ సంకలనం వచ్చింది. 1958-1967 మధ్య కాలంలో వీరివి నాలుగు కవితా సంకలనాలొచ్చాయి. 1969లో వీరి కవిత్వ కృషిని గుర్తిస్తూ చిలీ జాతీయ సాహిత్య బహుమతి పొందారు. వీరి షేక్స్‌ పియర్‌ ‘కింగ్‌ లియర్‌’ స్పానిష్‌ అనువాదం అందరినీ అకట్టుకుని అమితంగా అమ్ముడుపోయింది. రష్యన్‌ భాష నుంచి స్పానిష్‌ లోకి జరిగిన అనువాదాలకు పర్యవేక్షకుడు గా ఉన్నారు. దాదాపు 20 వరకూ కవిత్వ సంకలనాలొచ్చాయి. ఆంగ్లంలో వీరి కవిత్వ అనువాదాన్ని చేసి ప్రపంచానికి వీరిని పరిచయం చేసిన వారు మిల్లర్‌ విలియమ్స్‌. తెలుగులో పారాని మొట్టమొదట పరిచయం చేసినవారు స్వర్గీయ స్మైల్‌.
రానురాను పారా కవిత్వం రాజకీయ రంగు పులుముకోవడం మొదలయింది. ఎగతాళి చమత్కార పూరితమైన లఘు కవితలు బొమ్మలతో సహా రాయడం మొదలెట్టారు. కొన్నాళ్లకు అదే, ఊరూరు తిరిగి ప్రచారం చేసేవాడిలా బోధనల కవిత్వంగా మారింది. అది చిలీలోని మతం, విత్తం, మానవహక్కుల ఉల్లంఘన, రాజకీయాల మీద వ్యాఖ్యానాలుగా పనికొచ్చింది.
మొట్టమొదటి నోబెల్‌ కవయిత్రి గబ్రియేలా మిస్ర్టాల్‌, పారాని ఎంతగానో ప్రోత్సహించింది. అయితే నెరూడాతో ఈతడి సంబంధాలు అంత గొప్పగా లేవు. తనకంటే పదేళ్లు పెద్దవాడైన నెరూడాతోను, నెరూడా కవిత్వంతోను పారా విభేదించేవారు. నెరూడా మాత్రం పారా అత్యంత తెలివైనవాడని, మా స్పానిష్‌ భాషలోను పశ్చిమ దేశాల్లోను, గొప్ప కవి అని, బాగా చదువుకోని వారికి, కొత్త తరానికి, పారా సరికొత్త మార్గాన్ని చూపించారని ఒప్పుకున్నారు. పారా కవిత్వ వ్యూహాల్ని కొన్ని నెరూడా కూడా అనుకరించారు.
పేరుబడ్డ కుటుంబం నుంచి 5 సెప్టెంబర్‌ 1914లో సాన్‌ ఫాబియన్‌, చిలీలో, నికొనార్‌ పారా జన్మించారు. సముద్రాన్ని నిరంతరం చూసేందుకు కొండకొమ్ముమీద కట్టుకున్న ఇళ్లు. అకవిత్వం అని రాసి ఉన్న ఇంటి ముందుగది తలుపు. 1940లో మొదటి వివాహం, 1951లో మరొకటి, వివాహం చేసుకోకుండా మరికొన్ని అలా చేసుకుంటూ పోతూ 1998 నుంచి దాదాపు ఒంటరిగానే ఉంటున్నారు.
‘స్వేచ్ఛ, విగ్రహంగా మారిన దేశం అమెరికా’ అని చెప్పగలిగిన కవి పారా. ‘అతి చెడ్డది వెనకుంది. జీవనం కంటే చెడ్డ అవమానం మరేదీ లేదు.’ అని తన సమాధిమీద రాయించుకోవాలనుకున్న కవి. మరణం తప్ప అన్నీ తెలుసుకోగలిగారు, దానిమీద ఎవరైనా ఎందుకు దృష్టి కేంద్రీకరించరు అని అందరన్నీ అడుగుతారు. ప్రణాళిక అన్న కవితలో వారి కవిత్వ ప్రణాళికని ఇలా చెప్పుకున్నారు – ‘మనం తిరస్కరిస్తు న్నాం/ రంగుటద్దాల కవిత్వాన్ని/ కత్తి కటార్ల కవిత్వాన్ని/ తురాయి టోపీల కవిత్వాన్ని/ దాని బదులు మేము ప్రతిపాదిస్తున్నాం/ మామూలు దృష్టి కవిత్వాన్ని/ రోమమయ ఛాతీ కవిత్వాన్ని/ టోపీలేని బోడి కవిత్వాన్ని’. ‘యువకవులు’ అన్న మరో కవితలో వారికి సలహాగా అన్నట్టు – ‘నీకు నచ్చని శైలిలో/ నీకెలాతోస్తే అలా రాయు/ ఒకే మార్గం సరైందని నమ్మిస్తూ/ వంతెనకింద చాలా రక్తం పారింది/ అనుమతులు అన్నింటికీ ఉన్నాయి కవిత్వంలో/ ఒకే ఒక్క షరతు/ తెల్ల కాగితాన్ని బాగుపరుస్తే చాలు’ అని చెప్పుకున్నారు.
నికోనార్‌ పారా – తాను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రక్రియని, అద్భు తంగా నిర్వహించి వందేళ్లకు పైగా జీవించడం లాటిన్‌ అమెరికాలోని చిలీ ప్రజలకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కవులందరికీ ఆనందదాయకమైన విషయం. వారు మరో వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు.
కొందరికి పారా అకవిత్వ ప్రక్రియ నీతిబాహ్యంగా అనిపించింది. ‘రచనలు లేవనెత్తే ప్రశ్నలకు రచయిత జవాబు చెప్పడు. అది పాఠకుడికి కఠినంగా ఉండొచ్చు. కానీ ఇప్పటినుంచీ అది వారు అంగీకరించక తప్పదు’ అంటూ ‘పాఠకుడికి హెచ్చరిక’ అన్న కవితలో పారా జవాబిచ్చారు.
– ముకుంద రామారావు
9908347273
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు

సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు

ఆంధ్ర సాహిత్యాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన కవివరేణ్యుడు దువ్వూరి రామిరెడ్డి. ఆయన 120వ జయంతి నేడు. 1895లో నెల్లూరుజిల్లా గూడూరులో దువ్వూరి సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు రామిరెడ్డి జన్మించారు. భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్య్రం, జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్న రోజులవి. కవిత్వంలో కొత్త రుచులు మేళవించి సాహిత్యప్రియుల దృష్టిని దువ్వూరు రామిరెడ్డి తన వైపు మరల్చుకున్నారు. ఆయన బహుబాషాకోవిదుడు, నిరాడంబరుడు, ప్రకృతి ఉపాసకుడు.

దువ్వూరి వారి జీవితమే ఓ సాహిత్య సాహసగాథ. నెల్లూరులో థర్డ్‌ ఫారం చదివే రోజుల్లోనే ఆయన విదేశీ కెమెరాతో పోటీ పడగల కెమెరాను తయారు చేశారు. ఆ తర్వాత చిత్రలేఖనం, శిల్పకళపై ఆయన దృష్టి మరలింది. ఈ విజ్ఞాన పిపాస ఆయనను కలకత్తాలోని రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి చేర్చింది. తాను సాధించాలనుకున్న దానికోసం ఎంత కష్టానికైనా, త్యాగానికైనా సిద్ధపడే కార్యదీక్ష, పట్టుదల రామిరెడ్డిది. అందుకే రామకృష్ణ మఠంలో సంస్కృతం, బెంగాలీని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. తర్వాత రామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి ఆదేశానుసారం తిరిగి తన స్వస్థలానికి చేరుకున్నారు. 1913లో కోవూరు తాలూకా (ప్రస్తుతం కొడవలూరు మండలం) పెమ్మారెడ్డిపాళెం గ్రామంలో తన పినతల్లి కోడూరు రంగమ్మ ఇంట్లో ఉంటూ సమీపంలోని గండవరంలో గ్రంథాలయంలో పుస్తకాలపఠనంలో నిమగ్నమయ్యారు. తన 19వ ఏట తల్లి కోరిక మేరకు శేషమ్మను తన జీవిత భాగస్వామిగా రామిరెడ్డి స్వీకరించారు. ఆయనలోని సాహిత్యాభిలాషకు సతీమణి తోడ్పాటు కూడా లభించింది. ఆ సమయంలో కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ‘ముసలమ్మ మరణం’ అనే పుస్తకం రామిరెడ్డిని ఎంతో ప్రభావితం చేసింది. దీంతో ఆయన ‘నలజారమ్మ’ కథ ఆధారంగా 1915లో తొలి పద్యకావ్యం రచించారు. ఈ కావ్యంతో రామిరెడ్డిలోని కవితా ప్రతిభ వెలుగు చూసింది. అనంతరం ‘వనకుమారి’ అనే కావ్యంతో ఆయన కీర్తి మరింత ప్రకాశించింది. అణగదొక్కబడుతున్న రైతుల జీవితాలే పాత్రలుగా ‘కృషీవలుడు’ అనే మహత్తర కావ్యం రచించారు. ఈ కావ్యం ఆయనను ముందుతరం కవులకు మార్గదర్శకుడిగా నిలిపింది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు ఆయన నట్టింటికి నడిచి వచ్చాయి. 1929లో ఆంధ్రదేశం ‘కవికోకిల’ బిరుదును అందించి గౌరవించింది. స్వాతంత్య్రం నేపథ్యంలో ఆయన రచించిన ‘మాతృశతకం’లో ఒక్కో పద్యం అగ్నిశిఖను తలపించింది. ఈ విషయం పసిగట్టిన బ్రిటిషు ప్రభుత్వం ఆ పుస్తకం ముద్రణను అడ్డుకుంది. దువ్వూరి రామిరెడ్డి 1920-1925 మధ్య కాలంలో మద్రాసు నుంచి వెలువడే ‘సమదర్శిని’ అనే పత్రికకు 9 నెలల పాటు సంపాదకుడిగా పనిచేశారు. 1923లో ఆయన తన కావ్యాలను ‘ది వాయిస్‌ ఆఫ్‌ ది రీడ్‌’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఇది ఆంగ్లేయులను సైతం విశేషంగా ఆకట్టుకుంది.
1925 రామిరెడ్డి సతీమణి శేషమ్మ బాలింత వ్యాధితో మరణించింది. తర్వాత కొద్దిరోజులకే కుమార్తె కుముదమ్మ కూడా గతించడం ఆయనపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆసమయంలో ఉమర్‌ఖయ్యూం ‘రుబాయతులు’ ఆయనకు ఊరటనిచ్చాయి. పర్షియన్‌ భాషలో ఉన్న ఖయ్యూం ‘రుబాయతులు’ను రామిరెడ్డి తెలుగులోకి అనువదించారు. 1926లో ఓ ఫ్రెంచి ఆర్కిటెక్ట్‌ను సంప్రదించి పెమ్మారెడ్డిపాళెంలో ఓ సుందర భవనాన్ని నిర్మించేందుకు ఆయన నడుంబిగించారు. ఆ ఇంట్లోని గోడలకు, స్తంభాలకు ఎన్నో చిత్రాలను రామిరెడ్డి సొంతంగా అమర్చుకున్నారు. 1936లో రామిరెడ్డి సినీరంగ ప్రవేశం చేశారు. వేంకటేశ్వర మహత్యం, గరుడగర్వభంగం, సతీతులసి, సీతారామజననం తదితర సినిమాలకు మాటలు, పాటలు రాశారు. 1937లో నెల్లూరీయులైన శ్రీరామా ఫిలిం కంపెనీ వారు నిర్మించిన ‘నల దమయంతి’ సినిమాకు స్ర్కీన్‌ప్లే, మాటలు, పాటలు రాసి దర్శకత్వం వహించారు. 1938 వరకు రామిరెడ్డి సినీరంగంలో ఉన్నారు. ఆ తర్వాత పారశీకం నుంచి సౌదీ కవి రచించిన రెండు కావ్యాలను ‘గులాబీ తోట’ పండ్ల తోట’ పేర్లతో తెలుగులోకి అనువదించారు. ‘కవి-రవి’, ‘ఫలితకేశం’ ద్వారా మూఢనమ్మకాలను ఎండగట్టారు. ‘జలదాంగన’తో భూగోళ రహస్యాలను చర్చించారు. రామిరెడ్డి రచనల్లో నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, పానశాల, గులాబీ తోట, పండ్ల తోట, కుంభరాణా, సీతావనవాసం, నైవేధ్యం, భగ్న హృదయం, మాధవ విజయం, జలదాంగన, కవి-రవి, ఫలితకేశం ఎంతో ప్రాచూర్యం పొందాయి. 1947 సెప్టెంబర్‌ 11న సాహితీ ప్రేమికులను విషాదంలో ముంచి అనంతలోకాలకు తరలివెళ్లారు. ఆంధ్రసాహిత్య నందనంలో అమరజీవిగా నిలిచారు.

– కె.వి. నాగేశ్వరరావు
(నేడు దువ్వూరి రామిరెడ్డి 120వ జయంతి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి

కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి

మాలాంటి వారికి నేడు వామపక్ష పార్టీలు ఉన్న స్థితిని చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. అనేక ఆకర్షణీయ పథకాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి పాలకవర్గ పార్టీలు పోటీలు పడి చేస్తున్న రాజకీయ జూద క్రీడ నుంచి ప్రజల్ని కాపాడవలసిన వామపక్ష పార్టీలు ఎవరికి వారే యమునా తీరుగా ఉండటం బాధాకరం. నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కమ్యూనిస్టులు అడ్రస్‌ లేకుండా పోయిన తరువాతనైనా తాము ప్రజలకు ఎంతో దూరంగా జరిగిపోయామనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తారా?
ముఖ్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు పార్లమెంటరీ ఎన్నికల ఊబిలో కూరుకుపోయి పాలకవర్గ పార్టీలతో పొత్తుల కోసం ఎగబాకిన ఫలితంగా తమ కాళ్ళ కింద మట్టి జారిపోయిందన్న నగ్నసత్యాన్ని గుర్తిస్తారా! ఈనాడు పాలకవర్గ పార్టీలలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నది మీమీద అసంతృప్తితో చేరినవారే కీ లక బాధ్యతలు నిర్వహిస్తున్నారన్న విషయం మీకు తెలియందికాదు. 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్‌ సీఈఓనని చెప్పుకున్న చంద్రబాబు విద్యుత్‌ ఛార్జీలను భారీగా పెంచినదానికై ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలను ఆర్గనైజ్‌ చేయటానికి తొమ్మిది వామపక్ష పార్టీలు ఒక తాటిమీదికి వచ్చి బషీర్‌బాగ్‌ కాల్పులను ఎదుర్కొనే స్థాయికి ఉద్యమాన్ని నిలబెట్టాయి. ఈ ఐక్య కార్యాచరణను నిరంతరం ప్రజాసమస్యలపై కొనసాగించి ఉద్యమాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళాల్సిన వామపక్ష పార్టీలు ముఖ్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు 2004, 2009 ఎన్నికల సీజన్లలో సీట్ల కోసం పాలకవర్గ పార్టీలతో పొత్తుల రాజకీయంలో పడిపోయి ఐక్యకార్యచరణ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పొత్తులు బెడిసికొట్టి ఉన్నసీట్లు కూడా గల్లంతై పోవడటంతో తిరిగి ఐక్య కార్యాచరణ ఎజెండాకి రావలసి వచ్చింది. ఈ విధంగా రావటానికి తమశ్రేణుల నుంచి వత్తిడేకాక వివిధ రంగాల వామపక్ష మేధావుల వత్తిడి కూడా కారణంగా ఉంది. మొత్తంగా చూస్తే దేన్ని దేనికి లోబరచి ఉం చాలో రాజకీయ స్పష్టత లేనంత కాలం ప్రజా ఉద్యమాలు ఈ దుస్థితిని ఎదుర్కొనక తప్పదేమో! అలానే సమిష్టి నిర్ణయాలతో ఐక్యకార్యాచరణ ఉద్యమాన్ని నిరంతరంగా, బలీయంగా నడిపించటంలో పెద్దన్న, ఆధిపత్య వైఖరులు ఆటంకంగా నిలిచాయన్న వాస్తవాన్ని మిత్రులు మరచిపోకూడదు. సమిష్టి నిర్ణయాలు ఎల్లవేళలా సజీవ ఉద్యమానికి ప్రతీకలుగా నిలుస్తాయి కదా!
అలానే వామపక్ష పార్టీల ఐక్యత వేరు, ఐక్యకార్యాచరణ వేరు అన్న విషయంలో స్పష్టత ఉండాలి. ఇప్పుడు ఐక్య కార్యచరణ కొనసాగిస్తున్న వామపక్ష, విప్లవశక్తుల ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల మధ్య తీవ్రమైన సిద్ధాంత, రాజకీయ విభేదాలు ఉన్న ఫలితంగా ఏర్పడటం అసాధ్యం. అంతేకాక ఎందుకు సిద్ధాంత, రాజకీయ విభేదాలు ఉన్న ఫలితంగా ఒకే పార్టీగా ఏర్పడటం అసాధ్యం. కావున పార్టీల ఐక్యత విషయం పక్కనబెట్టి ప్రజా సమస్యలపై ఐక్యకార్యాచరణను పటిష్టంగా కొనసాగించటం ఎలా అన్న అంశంపై అందరూ దృష్టి పెట్టి ఒక నిర్దిష్టమైన అవగాహనకు రావటం అవసరం. వీరి ఐక్యతా సమస్య ఎట్లా ఉన్నా ఎంఎల్‌ పార్టీలైనా ఐక్యత అవుతాయన్న ఆశ ఉండేది.
ఎందుకనంటే ఎంఎల్‌ పార్టీలన్నీ ఆఖరికి మావోయిస్టు పార్టీ కూడా వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఉండే జనతా ప్రజాస్వామిక విప్తవ లక్ష్యసాధనే ప్రధానమని ప్రకటించాయి. అయితే మావోయిస్టు పార్టీ ఎత్తుగడల రీత్యా సాయుధ పోరాట పంథా ప్రకటించి తనకు తాను దూరం పెంచుకుంది. కాబట్టి మిగతా ఎంఎల్‌ పార్టీలైనా ఒకే విప్లవ పార్టీగా ఏర్పడతాయన్న ఆశ మాలో ఉంది. అయితే ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఎంఎల్‌ పార్టీల్లో చీలికలు సంభవించటం బాధాకరంగా ఉంది. ఈ పరిణామాలన్నీ విప్లవ శక్తులు బలహీనపడటానికే తోడ్పడతాయి కదా. ఈ ముఖ్యమైన అంశం విప్లవ పార్టీలకు తెలియదని అనుకోలేము కదా! అంతేకాదు చీలిపోయిన తరువాత ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ‘విమర్శ’లు చూస్తుంటే విప్లవ పార్టీ లు ఇంత చౌకబారు విమర్శలు చేసుకుంటాయా అనిపిస్తోంది.
గత ఆచరణల నుంచి బయటపడటానికి బదులు మరింతగా అవే విధానాలలో కూరుకుపోవటం బాధాకరం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఎంఎల్‌ పార్టీలు ఐక్యతా క్రమాన్ని పూర్తిచేసుకోవటానికి ప్రజా సమస్యలపై ఐక్య కార్యచరణ చాలా అవసరం కదా! ఈ అవసరాన్ని గుర్తించి ఐక్యకార్యచరణ ప్రయత్నాలు చేశాయి. కానీ దాన్ని ఏ కారణాల చేత కొనసాగించలేకపోయాయో అర్థంకాని స్థితి! దీన్ని కొనసాగించలేకపోవటానికి ఏ యిజాలు ఆడ్డపడుతున్నాయో పరిశీలించుకోవటం అవసరం కదా! విప్లవ పార్టీల మధ్య ఐక్య కార్యాచరణ ఒక క్రమంలో పార్టీ ఐక్యతకు తోడ్పడిన అనుభవాలు కూడా ఉన్నాయి కదా. ఈ పరిస్థితులు ప్రజా వ్యతిరేక విధానాలను అమలుపరిచే పాలకవర్గ పార్టీలకు ఎదరులేకుండా పోతుంది కదా. ఇప్పటికే కమ్యూనిజానికి కాలం చెల్లిందని పథకం ప్రకారం దాడి చేస్తున్న పాలకవర్గాలు మరింతగా పెట్రేగిపోవటానికి చేతులారా అవకాశం ఇవ్వటమే కదా. మరోవైపు అస్తిత్వ వాద శక్తులు మార్క్స్‌ చాలడు అంబేడ్కర్‌ కావాలంటూ సంఘటిత ఉద్యమాలను బలహీనపరచే విధంగా చాప కింద నీరులా కదలాడుతున్నాయి. పాయలు పాయలుగా ప్రవాహాలు (ఉద్యమాలు) సాగింనంతకాలం పాలకవర్గ పార్టీ ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుంది కదా! వామపక్ష, కమ్యూనిస్టు శక్తులు బలహీనంగా ఉండబట్టే ఈ ప్రవాహాల ఉధృతి పెరిగిందనేది కూడా గమనించాల్సిన విషయం. వామపక్ష, కమ్యూనిస్టు శక్తులు మరింతగా బలహీనపడటానికి ముఖ్యకారణం ఉద్యమంలో కలసి వచ్చే విస్తృతం చేసే, బలీయం చేసే, ఒక దశలో నాయకత్వం వహించే ప్రజాస్వామిక శక్తులను నానాటికి దూరం చేసుకోవటం ముఖ్యకారణం కాదా! ఆఖరికి వామపక్ష మేధావులను కూడా దూరం చేసుకోవటం మరింత బాధాకరం. విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, పౌరహక్కుల రంగాలు నిర్వహించే సభలు, సదస్సులలో సామాజిక అవగాహనతో మాట్లాడే మేధావులను వెతుక్కోవలసి రావటం విచాకరం కాదా! ఇది వాస్తవం కాదా!
ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న, ప్రజలకు చెందాల్సిన ప్రకృతి వనరులను ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో పార్లమెంటు సాక్షిగా చట్టాలు చేసి బహుళజాతి విదేశీ సంస్థలకు కట్టబెడుతూ ఉంటే, గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఏకంగా చట్టాలు చేసి హరించి వేస్తుంటే, సమస్త రంగాలను విదేశీ పెట్టుబడులతో ముంచేస్తూ ఉంటే, భవిష్యత్తులో ప్రజల జీవితాలు ఎంత ఘోరంగా మారబోతున్నాయో తలచుకుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది. అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్న సంక్షోభం నుంచి విశాల ప్రజానీకం హక్కులను కాపాడాలంటే, దేశభక్తియుత, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమ నిర్మాణానికి వామపక్ష, కమ్యూనిస్టు శక్తులు నడుం కట్టాలి. ఈ ఉద్యమంలో ఇంతకాలం దూరం చేసుకున్న వామపక్ష మేధావులను, ప్రజాస్వామిక,, లౌకికశక్తులను ఉద్యమ శక్తులుగా నిలబెట్టి నిరంతర ప్రజా ఉద్యమాన్ని నిర్మించే లక్ష్యానికి పూనుకోవటం ఎన్నటికంటే నేడు ఎంతో అవసరం. సమస్త రంగాల ప్రజలు ఉద్యమ బాటలో అడుగుపెట్టి వడివడిగా అడు గులు వేసినప్పుడే అది ప్రజా ఉద్యమంగా రూపుదాలుస్తుంది. లాంగ్‌ మార్చ్‌ విజయవంతం కావాలంటే ఈ ఉద్యమ దశలు అన్నీ దాటి తీరాలి కదా! నేడు తరుముకొస్తున్న సామాజిక పరిణామాల నేపథ్యంలోనైనా వామపక్ష, కమ్యూనిస్టు శక్తులకు జ్ఞానోదయం కావాలని కోరుకోవటం అత్యాశ మాత్రం కాదు.
– ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి
వ్యవసాయరంగ శాస్త్రవేత్త
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ స్రవంతి – కవితల పోటీ – మత తత్వం – కవిత – సమర్పణ. – బందా.

                      మత తత్వం !!

 సర్వేజనా సుఖినోభవంతని అన్నది హైందవ ధర్మం !
 అహింస పరమ ధర్మం అని అన్న భౌధ్ద ధర్మం !
 పొరుగువానిని ప్రేమించమని అన్నది క్రైస్తవ ధర్మం !
 దానధర్మాలతో పేదవారిని బ్రతికించమని అన్నది ఇస్లాం ధర్మం !!
           మతం ఏదైనా జన హితాన్ని కోరుకున్నదనుట నిజం ! 
           మానవత్వాన్ని గౌరవించే మతమేదైనా మంచిదే !
           ఆ మత తత్వాన్ని ప్రతిపాదించినవారు మాన్యులు !
           ఆ మత తత్వాన్ని అనుసరించేవారు సామాన్యులు !!
మత మౌఢ్యాన్ని పెంచుతూ! పరులపై విద్వేషాన్ని కక్కుతూ !
 అధికారపు అందలాలు ఎక్కతూ ! మతాన్ని మలంలో కుక్కుతూ !
స్వార్ధమనే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ! అసామాన్యులు  !
వారే శ్రమను దోచుకునే పెట్టుబడిదార్లు ! సాటివారిని చంపే విప్లవకారులు !!
            బ్రతికే హక్కును కాలరాస్తున్న కాప్టలిజం ! కమ్యూనిజాలకన్నా !
            సెక్యులర్ భావాలున్న మాన్యుల మత తత్వం మిన్న !
            ఇది కాలం కని పెంచిన నిజం ! కదిలే కాలానికి సాక్ష్యం !
            అందుకే ! ఇది ఓ త్రి కాల వేదం ! ఈ బందా నాదం !!
                            రచన :     బందా వేంకట రామారావు, 9393483147,
                                          బందా భవనం, యాదవుల బజారు , పటమట సెంటరు    
                                        , విజయవాడ – 520010 .
Posted in కవితలు | Tagged | Leave a comment

నాన్న సంపాదించినదంతా మాకోసమే ఖర్చు పెట్టారు- ఏవీఎస్‌ తనయుడు ప్రదీప్‌

 

నాన్న సంపాదించినదంతా మాకోసమే ఖర్చు పెట్టారు- ఏవీఎస్‌ తనయుడు ప్రదీప్‌

తెలుగులో అతి తక్కువ కాలంలో చక్కని గుర్తింపు తెచ్చుకొన్న హాస్యనటుడు ఏవీఎస్‌. నటుడుగానే కాదు దర్శకునిగా కూడా ఆయన తన ప్రతిభ చూపారు. ఇతరులకంటే బిన్నంగా ఉండాలనే మనస్తత్వం ఆయనతో ఎన్నో పనులు చేయించింది. పరిశ్రమలో చక్కని రిలేషన్స్‌ మెయింటైన్‌ చేస్తూ ప్రతి ఒక్కరితోనూ సరదాగా ఉండేవారు. అటువంటి వ్యక్తి కన్నుమూసి అప్పుడే ఏడాది గడిచిపోయింది. శనివారం ఏవీఎస్‌ ప్రథమ వర్థంతి సందర్భంగా చిత్రజ్యోతితో ఆయన తనయుడు ప్రదీప్‌ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…
చిన్నప్పటి నుండి నాన్నకు పది అడుగుల దూరంలో ఉండేవాణ్ణి. అది ఇష్టంతో కూడిన భయం. అక్కకి నాన్న దగ్గర చనువు ఎక్కువ. ప్రేమను మాత్రం ఇద్దరికీ సమానంగా పంచేవారు. అక్కని అమ్మా అనీ, నన్ను నాన్న అనీ పిలిచేవారు. పేరు పెట్టి పిలిచిన సందర్భాలు చాలా తక్కువ. నాన్నకు పనే లోకం. షూటింగ్‌ నుండి ఇంటికి వచ్చాక రెస్ట్‌ తీసుకోకుండా ఏదొకటి రాస్తూ కూర్చునేవారు. ఆయన సంపాదించిన ప్రతి రూపాయిని మా కోసమే ఖర్చుపెట్టారు. మా అందరినీ అనాథల్ని చేసి వెళ్ళిపోయారు. అమ్మ, అక్క, నేను ఆయనతో గడిపిన క్షణాలు గుర్తొస్తే తట్టుకోలేకపోతున్నాం. అమ్మయితే మరీ ఒంటరిగా ఫీలవుతోంది.
చివరి సారి కొట్టింది అప్పుడే
నాన్న ‘మిస్టర్‌ పెళ్ళాం’ సినిమాలో యాక్ట్‌ చేసినప్పుడు నాకు ఎనిమిదేళ్లు. అప్పటి నుండే మా కుటుంబ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేసినప్పుడు నెలకు ఆయన జీతం రూ.500. అప్పట్లో ఇంటి అద్దె రెండు వందలకు పైగా ఉండేది. నెలకి వంద రూపాయిలు ఆయన బండి పెట్రోల్‌కి ఖర్చయ్యేది. మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవారు. అయినప్పటికీ కష్టం తెలియకుండా పెంచారు. చిన్నప్పుడు అల్లరి చేస్తే ఏ తండ్రైనా మందలిస్తారు. అలా నాన్న కొట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. నేను ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో చివరిసారి కొట్టారు. ఆ తర్వాత ఏ రోజు నా మీద దెబ్బ వెయ్యలేదు.
అమ్మ చేసిన సర్వీస్‌ మరెవ్వరూ చెయ్యలేరు
నాన్న అనారోగ్యం పాలయినప్పుడు ఆయనకి అమ్మ ఎంత సేవ చేసిందో మాటల్లో చెప్పలేం. రోజుల పిల్లాడిని చూసుకున్నంత జాగ్రత్తగా సేవలు చేసింది. ‘నా బిడ్డ లివర్‌ దానం చేసి ప్రాణం పోస్తే.. నా భార్య సేవ చేసి ప్రాణం పోసింది’ అని తరచు అంటుండేవారు. నాన్నకి లివర్‌ మార్చాలన్నప్పుడు అక్క, నేనూ లివర్‌ ఇవ్వడానికి ముందుకొచ్చాం. కానీ అక్కది సరిపోయింది. నా లివర్‌ కుదరదని రిజెక్ట్‌ చేశారు. దీనికి కూడా నాన్నకు ఉపయోగపడలేకపోయానని ఆ సమయంలో నేను పడిన మనోవేదన మాటల్లో చెప్పలేను. మా పక్కనే తిరిగిన నాన్నను ఇప్పుడు టీవీల్లో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంటుంది.
ఆయనతో ఆనందంగా గడపలేకపోయాను
నా పెళ్ళికి ముందు కూడా నాన్నంటే నాకు భయమే. పెళ్ళాయ్యాక ఆయన దగ్గర చనువు పెరిగింది. అప్పుడప్పుడే ఇద్దరం కలిసి అన్ని విషయాలు మాట్లాడుకొనేవాళ్ళం, కలిసి సినిమాలు చూసేవాళ్ళం. నాన్నతో ఎంతో ఆనందంగా గడపాలనుకొనేవాణ్ణి. నాతో ప్రీగా మూవ్‌ అవుతున్న సమయంలోనే ఆయన దూరమైపోయారు. నాన్నతో నేనుండాలనుకున్న విధంగా ఉండలేకపోయాను. ఆనందంగా సమయాన్ని గడపలేకపోయాను. ఈ బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతుంటుంది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళా వారధి సలాది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పెను విపత్తులో భూ మండలం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్

ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్

unnamedబెంగాలీ ,ఆంగ్ల భాషల్లో విపులమైన రచనలు చేసిన కేతకీ కుశారి దిసాన్ పశ్చిమ బెంగాలోని కలకత్తా నగరం లో 1940లో జన్మించింది .కలకత్తా ,ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి రెండు చోట్లా సర్వ ప్రధమురాలిగా ఉత్తీర్ణత సాధించింది  .1964లో ఇంగ్లాండ్ దేశీయుడిని వివాహం చేసుకోవటం వలన ఆమె అక్కడే ఉంటోంది .బెంగాలీ ఆంగ్లాలలో రచనలు చేసి సవ్య సాచి అనిపించుకొన్నది .ఇలా చేసిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు .సాహిత్యం లోని దాదాపు అన్నిప్రక్రియల్లోను రచనలు  చేసింది కేతకీ .కవిత్వం ,కద, నవల ,విమర్శ, నాటకం ,వ్యాసం అనువాదాలు చేసి తన సామర్ధ్యాన్ని నిరూపించుకోన్నది .ఆమెది పరిశీలనాత్మకమైన పరిశోధనాత్మకమైన దృక్పధం .అందువలన విషయాల లోతులను తరచి రాసి  సంపూర్ణత నిస్తుంది .బెంగాలీ భాషలో ఆరు కవితా సంపుటాలను ,ఇంగ్లీష్ లో నాలుగు సంపుటాలను రాసి ప్రచురించింది .1944లో మాంచెస్టర్ సిటీ ఆఫ్ డ్రామా లో మొదటి నాటకాన్ని బెంగాలీ భాషలో ప్రదర్శించారు. 91ఆతర్వాత ఆమె దాని ఆంగ్ల అనువాదం తో ఇంగ్లాండ్, వేల్స్ దేశాలు పర్యటించి ప్రదర్శనలను నిర్వహించింది .1991లో రవీంద్ర నాద టాగోర్ కవితలను ఆంగ్లం లోకి అనువదించి ‘’పోఏట్రి బుక్ సొసైటీ రికమండెడ్ ట్రాన్స్ లేషన్ ‘’గా ఆమోదం పొంది ఘన విజయాన్ని సాధించింది .2003బెంగాలీ ప్రముఖ కవి బుద్ధ దేవ బోస్ కవితలను ఇంగ్లీష్ లోకి అనువదించి పై రీతిగానే ఆ సొసైటీ ఆమోద ముద్ర సాధించింది .

   కేతకీ పరిశోధనాత్మకమైన రచనలలో రెండు చాలా ప్రసిధమైనవి ఉన్నాయి. వీటిని’’ స్కాలర్లీ బుక్స్ ‘’అన్నారు .అందులో ఒకటి 1765-1856మధ్యకాలం లో వచ్చిన బ్రిటిష్ జర్నల్స్ ,మరియు జ్ఞాపకాలు .దీనికి  ‘’ది వేరియస్ యూని వర్స్ –ఏ స్టడీ ఆఫ్ జర్నల్స్ అండ్ మెమాయిర్స్ బ్రిటిష్ మెన్ అండ్ విమెన్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్’’అని పేరు పెట్టింది .దీన్ని ధిల్లీ లోని ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి ప్రెస్ ముద్రించింది . రెండవ రచన రవీంద్రునికి ,అర్జెంటీనా దేశపు విదుషీమణి ‘’విక్టోరియా  ఒకాంపో ‘’మధ్య ఉన్నసాహిత్య ,సాంస్కృతిక  సంబంధాలు .దీనిపేరు ‘’ఇన్ యువర్ బ్లాసమింగ్ ఫ్లవర్ గార్డేన్ –రవీంద్ర నాద టాగోర్ అండ్ విక్టోరియా ఒకాం పో ‘’ఇది కేంద్ర సాహిత్య అకాడెమి ప్రచురణ .ఈ రెండూ కూడా పునర్ముద్రణ పొందాయి .మరొక ప్రసిద్ధ పరిశోధనాత్మక రచన ఇతరపరిశోధకులతో  కలిసి చేసిన టాగోర్ రచనలు ,కళల పై ‘’ప్రోటానోపిక్ కలర్ విజన్ ‘’ప్రభావం .ప్రోటానోపిక్ అంటే  దృష్టిలో వచ్చే ఒకరక మైన రంగు దోషం .2002 జనవరిలో కేతకి రాసిన రెండవ  బెంగాలీ నాటకం కలకత్తా నగరం లో ప్రదర్శింప బడింది .బెంగాలీ సాహిత్యానికి ఆమె చేసిన సేవలకు ‘’ఆనంద పురస్కారాన్ని’’రెండు సార్లు  అందుకొన్నది .కలకత్తా  విశ్వ విద్యాలయం కేతకీ కుశారి కి ‘’భువన మోహిని దాసీ ‘’అవార్డ్ నిచ్చి సత్కరించింది .’’ఉత్తమ బెంగాలీ నారీమణి’’పురస్కారాన్ని అందుకొన్నది . కేతకీ కొంతకాలం ‘’ఆక్స్ ఫర్డ్ సెంటర్ ఫర్ క్రాస్ కల్చరల్ రిసెర్చ్ ఆన్ విమెన్ ‘’లో రిసెర్చ్ అసోసియేట్ గా పని చేసింది .ఈ అనుభవం తో ‘’బై లింగ్యువల్ విమెన్ – యాంత్ర పోలాజికల్ అప్రోచెస్ టు సెకండ్ లాగ్వ్వేజ్ యూజ్ ‘’అనే వ్యాస సంకలానికి  సంపాదకత్వం వహించింది .

 బెంగాలీ ఇంగ్లీష్ భాషలలో తాను  రచనలు చేసి అందరికి సంతృప్తి  కలగా జేయటమే  తన ధ్యేయం గా కేతకీ చెప్పుకొంటుంది . ఇంగ్లాండ్ లో ఉంటున్నప్పటికీ తన మాతృభూమి బెంగాల్ ను ,అక్కడి విద్యా వేత్తలను ఎన్నడూ మరచిపోలేదని నిరంతర సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నానని చెప్పింది . తన రచనలు పుస్తక రూపం దాల్చక ముందు బెంగాలీ మేగజైన్ లలోనే అచ్చు అయ్యేవన్నది .బెంగాలీ భాష మాట్లాడే బంగ్లాదేశ్ లోను ,ప్రపంచం లో ఎక్కడెక్కడో ఉన్న బెంగాలీలు తన రచనలను ఇష్టపడి చదవటం తన అదృష్టం అన్నది . అందుకే తాను  ద్విభాషా రచయిత్రిగా బాగా గుర్తింపు పొందానని చెప్పింది .తన కవితలు రెండుభాషల  పత్రికలలోనూ ముద్రింప బడేవని ,కనుక ఆ భాషల మూలాలు తనకు బాగా తెలుసునని ,అందుకే ఇంతటి ఆదరణ లభిస్తోందని కేతకీ అభిప్రాయ పడింది .తాను  రాసిన ఫిక్షన్ కాని నాటకాలు కాని బెంగాలీ భాష లోనే రాశానని చెప్పింది .ఆ సమాజం ,జీవన విధానం భాషా ఆలోచనలు ప్రతి  బింబించాలి లంటే తన మాతృ భాష బెంగాలీ  మాత్రమె ఉపయోగపడుతుంది అని  తనకళ్ళు బెంగాలీ నేపధ్యాన్ని బాగా చిత్రీకరించటానికి కేంద్రీకరిస్తాయని భావించి రాయటం జరిగింది అని చెప్పుకొన్నది .అందుకనే ఇంగ్లాండ్ లో కూర్చుని రాసినా బెంగాలీ కదా ,నవల నాటకాలు రాశానని చెప్పింది .సృజనకు ,మేధ కు మధ్య ఉన్న  అంతరాన్ని  తగ్గించాలనే దృక్పధం తోనే తానూ మొదటినుంచి రచనలు చేశానని చెప్పింది .ఇది దీర్ఘ కాలం గా తన మనసులో ఉన్న  కోరిక  అని, దాన్ని నెరవేర్చటానికి  శాయ శక్తుల కృషి చేసిన సంతృప్తి తనకు లభించిందని అన్నది .తన రెండవ నవలలో విక్టోరియా ఒకాం పో  ,జూడో స్పానిష్ రచయిత లాడినో లు రాసిన పాటలను చేర్చానన్నది .తన పరిశోధనలన్నీ హేతు బద్ధం గా, బుద్ధి కుశలత తో చేసినవే నని చెప్పింది ..తాను రెండు భాషల, రెండు దేశాల సంస్కృతులకు చెందిన దాన్ని అని ,అంతర్ జాతీయ సంస్కృతీ అవసరం అని భావిస్తానని చెప్పింది .అందుకే తన అనువాదాలలో ఆయా దేశాల సంస్కృతిని గురించి  ముందే విపులమైన  ఉపోద్ఘాతం  రాస్తానన్నది .దీనివలన ఇతర జాతీయ సంస్కృతీ పట్ల అవగాహన ఏర్పడి గౌరవం కలుగుతుంది అని విశ్వసించింది

 ఆమె తాజా రచనలలో ఒకటి ‘’తిసిదోర్’’.ఇందులో .ఇరవై వ శతాబ్దికి చెందినప్రముఖ రచయితలైన  ‘’జీవనానంద దాసు’’, ‘’బుద్ధ దేవ బోస్’’ ల పై రాసిన పుస్తకం .ఇది డాక్యుమెంటరి కి అనువైన ఆంగ్ల నేపధ్యం ఉన్న రచన .ఈ రచనకు 2009లో ఉత్తమ బెంగాలీ రచన గా పేరుపొంది ట్రోఫీని సాధించింది .రెండవది ‘’ఏక బింఘా శతాబ్ది తే రబీంద్ర చర్చ –ఒ అనన్య ప్రబొందో ‘’.ఇందులో అనేక విషయాలపై  వ్యాసాలూ ,సమీక్షల తో బాటు రవీంద్రునికి సంబంధించిన వ్యాసాలూ ఉన్నాయి .ఈ పుస్తకాన్ని 2010లో కలకత్తాలో ప్రచురించారు .

 పశ్చిమ  బెంగాల్ లోని లోని విశ్వ భారతి విశ్వ విద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేసింది .జర్మనీలో టాగోర్ రచనలు కళలు పై అధ్యయనం చేయటానికి జర్మన్ దేశపు గాలరీలు మ్యూజియం లను స్టడీ టూర్ లో సందర్శించింది .1997లో హాల్స్ యూనివర్సిటి సదరన్ ఆర్ట్స్ ట్రెయినింగ్ అండ్ ట్రాన్స్లేషన్ సదస్సులో పాల్గొన్నది .సమకాలీన నవలా సదస్సు లో తన అనుభవాలను పంచుకోన్నది .విక్టోరియా ఒకాం పో  పై జరిగిన రిసెర్చ్ ప్రాజెక్ట్ కు ప్రాతినిద్యం వహించింది .యునేస్కోలో అర్జెంటీనా తరఫున శాశ్వత ప్రతినిధిగా గౌరవ స్థానాన్ని పొందింది .’

2010లో కలకత్తావచ్చి    ‘’రవీంద్రుని రచనా ప్రభావం ‘’పై ‘’అమేయ గుప్తా స్మారక ఉపన్యాసం’’ ఇచ్చింది కేతకీ .అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం లో ఉన్న’’ నాష్ విల్’’ లో ‘’బంగ మేళ ‘’లో పాల్గొన్నది .స్లావేనియాలోని జుబ్లానా యూని వర్సిటిలో జరిగిన రవీంద్రుని నూట యాభై వ శత జయంతి సంబరాలలో భాగ స్వామిని అయింది .లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లో ‘’ఉద్యానవనాలు ,ప్రక్రుతి ,లపై భారతీయ కవిత్వం ‘’పై సెమినార్ నిర్వహించింది .లండన్ లో భారతీయులకు వేసవి శిక్షణా  తరగతులు నిర్వహిస్తోంది .2009లో కలకత్తా లో యునేస్కో ఆధ్వర్యం లో రామకృష్ణా మిషన్ నిర్వహించిన ‘’అనేకత్వం లో ఏకత్వం ‘’సదస్సులో కీలక ఉపన్యాసం చేసి, పాల్గొన్న వారితో ఇస్తా గోష్టి నిర్వహించింది .ఈ విధం గా ఇంగ్లాండ్ లో ఉంటున్నా భారత దేశం తో ను ముఖ్యం గా బెంగాలీ సమాజం తోనూ బెంగాలీ భాషతోను సత్సంబంధాలను నెలకొల్పుతూ భిన్నత్వం లో ఏకత్వాన్ని దర్శిస్తూ  ,బోధిస్తున్న కేతకీ  కుశారీ దిసాన్ ‘’డెబ్భై అయిదేళ్ళ వయసులోనూ భారత్ బ్రిటన్ దేశ సాంస్కృతిక రాయబారిగా సేవాలిందిస్తూ కేతకీ పుష్ప సుగంధాన్ని పంచుతున్నది .దీర్ఘాయుష్మాన్ భవ .

                                                                                                                                    –  గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆంద్రా లోకనాయక్ గార్ధబోపన్యాసం – ఎన్నికల నుంచి గాడిదల దాకా- రవీంద్రనాథ్

2014

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు -79 సైన్స్ ఫెయిర్లూ –ఆటల కబుర్లూ

నా దారి తీరు -79

సైన్స్ ఫెయిర్లూ –ఆటల కబుర్లూ

పామర్రు సైన్స్ లాబ్ చాలా పెద్దది .క్లాసులు అక్కడే తీసుకొనే వాడిని .నన్ను చూసి సీనియర్ సైన్స్ మేస్టర్ నందిపాటి వీరారెడ్దిగారు కూడా అక్కడే తీసుకొనే వాడు . నేచురల్ సైన్స్ కు కేశవరావు గారికి పెద్దహాలే ఉంది అందులోనే క్లాసులు చెప్పేవాడు .మిగతావారికి అంతగా లాబ్ పరిచయాలు తక్కువ .నరసయ్య గారికి అసలీ గొడవే పట్టేదికాడు .వాళ్ళ అమ్మాయిల చదువు ఫీజులు వడ్డీ  డబ్బు లెక్కలే తప్ప చదువు చెప్పే ధోరణి లేనే లేదు. హాయిగా ఒక పావుగంట పుస్తకం చదివేసి అయిందనిపించి తన ఉత్తరాలు వ్యాసంగం లో మునిగిపోయేవాడు .

ఫిజికల్ సైన్స్ కు కొత్తగా ధనుంజయ రావు అనే కుర్రాడు వచ్చాడు .చలాకీ మనిషి సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉన్న వాడు .ప్రాక్టికల్ నాలెడ్జి బాగా ఉంది .కనుక నాకు మంచి సపోర్ట్ దొరికింది .దానితో జిల్లా సైన్స్ ఫెయిర్ ఎక్కడ జరిగినా పామర్రు హై స్కూల్ నుండి ప్రదర్శనకు వెళ్ళేవాళ్ళం .అతని కొత్త ఆలోచనలకు సపోర్ట్ చేసి డబ్బులు కావాలంటే మేమే పెట్టుకొని ఎక్సీ బిట్స్ తయారు చేసి చేయించి పిల్లలతో వెళ్ళేవాళ్ళం .ఏదో ఒక బహుమతి మా స్కూల్ కు వచ్చేది ఇన్నోవేటివ్ గా ఆతను చేసేవాడు .ఏది చేసినా వర్కింగ్ మోడల్ గా ఉండాలని మా ఇద్దరి ఆలోచన .అలా ఆలోచించి తయారు చేసేవాళ్ళం .అందుకని ఫస్ట్ సెకండ్ లలో ఒకటి మాకు ఖాయం గా ఉండేది .బెజవాడ బందరు గుడివాడ మొవ్వ ఉయ్యూరు ఆర్ కేం స్కూల్ కాటూరు హైస్కూల్ లకు సైన్స్ ఫెయిర్ లకు రెగ్యులర్ గా వెళ్లి బహుమతులు సాధించేవాళ్ళం .సైన్స్ లో క్విజ్ లో పిల్లలకు శిక్షణ నిచ్చేవాళ్ళం కనుక అందులోనూ గణనీయ మైన గుర్తింపు వచ్చేది .

ఆ రోజుల్లో సైన్స్ ఫెయిర్ అంటే అందరికి పండగే పండగ .మూడు రోజులు భోజనాలు టిఫిన్లు బహుమతులు భలే సరదాగా ఉండేది .మోవ్వలాంటి స్కూల్ లో లోకల్ సపోర్ట్ బాగా ఉండేది .కనుక షడ్రసోపేత భోజనం పెట్టేవారు అలాగే కాటూరు, ఆర్కేయం  స్కూల్ లో కూడా .మా అబ్బాయిలు హైస్కూల్ లో చదివే రోజుల్లో వాళ్ళనీ వీటిలో పాల్గోనేట్లు చేయటం లేక తీసుకొని వెళ్లి చూపించటం చేసేవాడిని .

పామర్రు లో ఒకప్పుడు మంచి గొప్ప డ్రిల్ మాస్టార్లు ఉండేవారు .వాలీ బాల్ బాద్మిమింటన్ ,కబాడీ వగైరా ఆటల్లో మొనగాళ్ళు వాళ్ళు .ఇప్పుడు ‘’అంత దృశ్యం’’ లేదు.కాలు లేని ఆయనొకడు కదలలేని ఆయనొకడు ,మందుకొట్టి హడావిడి చేసి రోడ్డుమీద బస్సుల్ని ఆపే ఆయనొకడు ,మందు కొడుతూ క్లాస్ కు వెళ్ళకుండా సొల్లు కబుర్లు చెప్పే ఆయన ఒకడు ,కనుక ఆటల్లో వెనక బడింది .కాని ఆఫీసు అటెండర్లు ,రికార్డ్ అసిస్టంట్ క్రాఫ్ట్ మేస్టారు నేను ,పిచ్చి రెడ్డి అనే కాలు కుంటి అయినా బాగా సర్వీస్ చేసే లెక్కల మేస్టారు ,సోషల్ మేస్టారు రాళ్ళబండి సాంబశివరావు కలిసి టీం లు తయారు చేసి గ్రిగ్ ఆటలలో టీచర్స్ తరఫున ఆడేవాళ్ళం .ఆడవాళ్ళలో సీతా మహా లక్ష్మి అనే గ్రేడ్ వన్తెలుగు పండిట్ ,విజయ లక్ష్మి అనే సెకండరీ గ్రేడ్ టీచర్ రింగ్ టెన్నిస్ అనబడే టేన్నికాయిట్ బాగా ఆడేవారు .నేనూ గాంధీ గారు అనే తెలుగు మేష్టారు ,క్రాఫ్ట్ ప్రకాశ రావు కలిసి మగవారి తరఫున టేన్నికాయిట్ ఆడి బహుమతులు కొట్టేవాళ్ళం .ఆటలు కూడా చాలా సందడిగా జరిగేవి .ఆన్ డ్యూటీ లో వెళ్ళే వాళ్ళం. రాను పోను ప్రయాణపు ఖర్చులు ఎవరివి వారివే .భోజనం టిఫిన్ వగైరా అక్కడ సెంటర్ వాళ్ళు ఫ్రీ గా పెట్టేవారు .ఉండాలనుకొన్న వారికి స్కూల్ లో అకామడేషన్ ఇచ్చేవారు .నేను యెంత దూరమైనా ఉయ్యూరు నుండే వెళ్లి వచ్చేవాడిని ఫెయిర్ కైనా గ్రిగ్ ఆటలకైనా .ఈ ఆటల వలన కూడా పేరు బాగా వచ్చేది .నాది మంచి సర్వీసింగ్ హాండ్ .కనుక పాయింట్లు బాగా వచ్చెవి.అదీ ఫెచ్చింగ్ .

కొత్త హెడ్మాస్టారు –లోకేశ్వర రావు గారు

పామర్రు హైస్కూల్ కు పటమట నుంచి కోనేరు లోకేశ్వర రావు గారు బదిలీ పై వచ్చి చేరారు .అదే పేరున్న ఒక గొప్ప కాంట్రాక్టర్ కూడా ఉండేవారు .హెడ్ గారిది  కూచిపూడి దగ్గర పల్లెటూరు .పేరు జ్ఞాపకం లేదు .కమ్మ వారేకాని ఆరోగ్య రీత్యా పూర్తీ శాకా హారి .పచ్చి కూరల రసం తాగేవారు .మమ్మల్నీ తాగమని ప్రోత్సహించేవారు .నల్లగా భారీ పర్సనాలిటి .నేత పంచె చొక్కా తెల్లవి కట్టేవారు .పైన ఉత్తరీయం ఉండేది .వామ భావాలున్నమనిషి. పి శ్రీరామ మూర్తిగారి వర్గం .మనిషి  మంచి సందడి మనిషి .గలగలా మాట్లాడతారు .సైకిల్ తొక్కు కుంటూ వచ్చే వారు .సబ్జెక్ట్ లో ఏమీ పేరున్న వారు కాదని అనిపించింది .ఇంగ్లీష్ లో కూడా అంతంత మాత్రమె .ఎక్కడ పని చేసిన ఆ స్కూలు డబ్బు అంతామటుమాయం చేస్తారని కీర్తి ,ఆయనకంటే ముందే వచ్చి చేరింది అందరికి .రిటైర్ మెంట్ కూడా దగ్గరలో ఉంది .కనుక ఇక ఇష్టమే ఇష్టం .నాతొ చాలా మర్యాదగా ఉండేవారు .అన్నిటిని నాతొ సంప్రదించే వారు .కూడా ఆలోపమేమీ లేదు .మాటకారి .ఒక రకం గా ఈజీ గోయింగ్ .సరే ఆయన ఎలా ఉన్నా మా డ్యూటీ మాకు తప్పదు .ఇంకొంచెం కష్ట పడిచదువు చెప్పేవాడిని .

టైం టేబుల్స్ వేయటం, వర్క్ అలాట్ మెంట్ ,ఏక్ స్ట్రా వర్క్ వేయటం మొదలైన వన్నీ ఫస్ట్ అసిస్టంట్ గా వీరారెడ్డి చూసేవారు .ఇలాంటి పనులు ఆయనకు కొట్టిన పిండి .కాని క్లాసు బోధన విషయం లో అంత సీను ఉండేదికాదు .వీరారెడ్డి గారి జేబులో బస్తాలకు బస్తాలు (యాభై గ్రాముల )క్రేన్ వక్క పొడి ఉండేది .పావుగంటకోసారి వక్కపొడి వేసుకొని నమలంది ఉండే వారు కాదు .దగ్గర ఉంటె ఎవరికైనా ఆఫర్ చేసి తిని పించేవారు .నాకు చాలా ఆత్మీయ మిత్రుడు .కురచగా లావుగా కుది మట్టం గా ఉండి  పాంట్ స్లాక్ తో ఉండేవారు .పామర్రులో మంచి స్తితిపరుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు .కాని మనిషి భేషజం హల్లూ పెళ్లూ లేని వారు. మహా సరదాగా మాట్లాడేవారు .ఆయన ఎన్ని జోకులు చెప్పేవారో యెంత పెద్దగా నవ్వించేవారో తలచుకొంటే ఆశ్చర్య మేస్తుంది .పామర్రు నుండి హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొంది కాటూరు హైస్కూల్ లో చేరి  అక్కడే రిటైర్ అయ్యారు .తరచూ కలుసుకొనే వాళ్ళం .ఆ వెడల్పు నవ్వుమొహం మర్చిపోలేనిది. పెదిమల చివర వాక్క పొడి చార ఇంకా గుర్తుందినాకు .రిటైర్ అయిన మూడు నాలుగేళ్ళకు చనిపోయారు .అంజిరెడ్డి అనే ఆఫీస్ అసిస్టంట్ ,ఆయనా మామా అల్లుళ్ళ వరుస సరదాగా జోకులేసుకోనేవారు .

క్రాఫ్ట్ మాస్టారు బి ఎస్ ప్రకాశ రావు తాడంకి వాడు .రోజూ ఇక్కడికి వచ్చేవాడు. భార్య ఎలిమెంటరిలోనో హెల్త్ డిపార్ట్ మెంట్ లోనో ఉద్యోగం .సరదా మనిషి .పొట్టిగా గలగలా నవ్వుతూ మాట్లేడేవాడు .కాంగ్రెస్ సానుభూతిపరుడు .అతనినే స్టాఫ్ సేక్రేటరిని చేశాం .అందరితో మంచిగా ఉండేవాడు .కన్విన్సింగ్ నేచర్ ఉన్న వాడు .కబాడీ సాఫ్ట్ బాల్ ప్లేయర్ కూడా ..కొడాలి నుంచి ఒక లెక్కల మేష్టారు వెంకటేశ్వర రావు వచ్చేవాడు .ఎప్పుడూ లేటే .అక్కడ ఎరువుల వ్యాపారం ఉండేది .క్లాసుకు వెళ్లి పాఠం చెప్పటం పరమ బద్ధకం .పొద్దుటూరు నుంచి జి వెంకటేశ్వర రావు అనే లెక్కల మేష్టారు రోజూ సైకిల్ మీద వచ్చేవాడు .నిర్దుష్టమైన మనిషి .బోధనా టాప్ గా  ఉండేది . మాతో పాటు హెడ్ మాస్టర్ అయి ప్రొద్దు టూరులో పని చేసి రిటైర్ అయ్యాడు .వర్క్ హాలిక్ అని చెప్పచ్చు .కాని కూపీ మనిషి .బయటికి కనిపించడు .యెన్ ఏ టి శాస్త్రి అనే లెక్కల మేస్టారు గొడవర్రు నుంచి రోజూ వచ్చేవాడు .సబ్జెక్ట్ లో నిధి .సర్వీస్ రూల్స్ లో దిట్ట .ఆయన మాట్లాడుతుంటే ఆయనకే తప్ప మనకు వినిపించదు .చాలా స్లో .బి యి డిఅసోసియేషన్ లో ,లెక్చరర్ గా ప్రమోషన్ పొందే స్కూల్ అసిస్టంట్అసోసియేషన్ లో శాస్త్రి మహా బిజీ .ఎప్పుడూ సభలూ సమావేశాలూతో ఖాళీ ఉండేదికాదు .పొట్టి శాస్త్రి అనేవారందరూ ..అందరికి ఆప్తుడు .డబ్బు మనిషి కాదు సర్వీస్ మోటోఉన్న పెద్దమనిషి .నాకు చాలా మిత్రుడు .అలాగే జగదీశ్ అనే కుర్రాడు లెక్కల్లో ఎం ఏ చదువుతూ పసుమర్రు నుండి వచ్చేవాడు .ఒరిజినాలిటీ ఉన్న వాడు .నవ్వుతూ పలకరించే టైప్ .చాలా చలాకీ గా ఉండేవాడు .కొత్తగా మారిన లెక్క పుస్తకం లో లెక్కల మేస్స్టర్లకు వచ్చే అనుమానాలన్నీ తీర్చేవాడు అతి సునాయాసం గా .కనుక పైన చెప్పిన లెక్కల మేస్స్టర్లందరూ ఖాళీ ఉన్నప్పుడల్లా లెక్కల్లో చర్చలు చేస్తూ కొత్త విషయాలు గ్రహిస్తూఉండే వారు .అంత సబ్జెక్ట్ నాలెడ్జి జగదీశ్ కు ఉండేది నాకు ఆత్మ్మీయుడు .చంచారావు కు బంధువు .అతనిభార్య పసుమర్రులో టీచర్ .ఎం ఏ పాసై తర్వాత ప్రభుత్వకాలేజిలో లెక్చరర్ గా ప్రమోషన్ పొంది రిటైర్ అయ్యాడు .

కొమరవోలు   శివరామ కృష్ణ శర్మ గారు  అనే సోషల్ మేష్టారు పెదమద్దాలి నుండి రోజూ వచ్చేవారు పంచె కట్టు వల్లే వాటు తో బారుగా చామన చాయగా ఉండేవారు .ఇంగ్లీష్ సోషల్ లలో పట్టున్నవారు .కొత్తగా మారిన ఇంగ్లీష్ పుస్తకం లో పాఠాలపై మాలో మేము డిస్కస్ చేసేవాళ్ళం .కోల్డ్ కు కూల్ కు ఉన్న అర్ధ భేదాన్ని చర్చించిన గుర్తునాకు ఇంకా  ఉంది .నవ్వుతూ పలకరించేవారు .పెద్దమనిషి వ్యక్తిత్వం .సోషల్ మేస్టరు రాళ్ళ బండి సాంబశివరావు మాటల మనిషి .కాని సబ్జెక్ట్ లోతు లేనివాడు .యద్దన పూడి సులోచనా రాణికి చదువు చెప్పానని డాబు ప్రదర్శించేవాడు .దేనికీ బయట పడేవాడు కాదు కాని నాతొ బాగానే ఉండేవాడు .రామ శాస్త్రులు అనే ఆయన సోషల్ కు భార్య సెకండరీ గ్రేడ్ గా పని చేసేవారు ..గోపాల కృష్ణ కూడా సోషలే .ఆఫీసు వర్క్ యమ వేగం గా చేసేవాడు .ఆయనా నేనూ ,కూర్చుని బిల్స్ ఇంక్రిమెంట్ లు ,ఫిక్సేషన్లు దాదాపు ఎనభై మంది స్టాఫ్ కు చేసేవాళ్ళం .ఆయన భార్య సెకండరీ టీచర్ .గోపాల కృష్ణ గారు అమెరికా వెళ్లి అక్కడ అమ్మాయో అబ్బాయో దగ్గర ఉంటున్నాడు రిటైర్ అయి .అలాగే మొగుడూ పెళ్ళాం సోషల్ టీచర్స్ ఉండేవారు పేరు గోవర్ధన రావు .దుర్గా రావు అనే లెక్కలు  భార్య కనక దుర్గ ?లేక విజయ లక్ష్మి ?అనిజ్ఞాపకం సైన్స్ .రావి శోభనాద్రిగారి బంధువులు .సైన్స్ లో నాకు డిస్కస్ చేయటానికి ఎవరూ లేకపోవటం ఇబ్బంది గా ఉండేది .ఉంటె మహా బాగా ఉండేది .తెలుగు గాంధీ గారు స్థానిక బలం ఉన్న వాడు .స్కూలు లోకేశ్వర రావు గారి ఆధ్వర్యం లో సాదా సీదా గా నడుస్తోంది .గుర్తుంచుకోదగిన సంఘటనలు లేనట్లే .

లోకేశ్వర రావు గారు పామర్రులోనే రిటైర్ అయ్యారు .ఘనమైన పార్టీ ఇచ్చాం .ఇన్చార్జిగా లెక్కల మేష్టారు నూతక్కి వెంకటేశ్వర రావు ఉన్నారు . లోకేశ్వర రావు రిటైర్ అయ్యే లోపు ఇకటి రెండు బీరువాలు ,ఇంకేవో సామాను కొని అక్యూములేటేడ్ ఫండ్ అంతా పూర్తిగా గీకేసి ఖాళీ ఖజానా అప్పగించారని తర్వాత నూతక్కి ఆయన అంటే మాకు తెలిసింది .చేతివాటం ఉన్న వాడు ఎక్కడైనా నొక్కటం మామూలే .అలానే ఇక్కడా చూపించాడు .ఇదివరకే చెప్పినట్లు ఇక్కడ కొడాలి రంగా రావు అనే డ్రిల్ మాస్టారు మహా ముదురు రాజకీయ వ్యక్తీ. నాతొ బాగానే ఉంటూ తెర వెనుక గోతులు తవ్వుతూనే ఉన్నాడు .ఈ  సారి నా ట్రాన్స్ ఫర్ ఖాయం అనే వార్తలు బాగా వ్యాపించాయి .నైట్ వాచర్ ,అటెండర్ లను ‘’ఒరే బాబూ !ఇక్కడే పరీక్షల సెంటర్ ఉంది ,సప్ప్లి మెంటరి పరీక్షలు కూడా ఇక్కడే జరుగుతున్నాయి .కనుక మీరు టెన్త్ పరీక్షలు రాయండి .ఎవరో ఒకరు దయ తలిచి సహాయం చేసి గట్టేక్కిస్తారు .బంగారం లాంటి జీతాలు వచ్చి జీవితం లో సెటిల్ అవుతారు ‘’అని చెవికి ఇల్లు కట్టుకొని పోరేవాడిని .వాళ్ళు నా సలహా పాటించి పరీక్షకు కట్టి ఒకటి రెండు ‘’డింకా  ‘’లు కొట్టినా పాసై సర్టిఫికేట్ సాధించి ప్రమోషన్ లు పొందారు .ఇది నాకు ఏంతో ఆనందం వేసింది .

ఇక్కడ పని చేస్తుండగానే నాకు రీ గ్రూపింగ్ స్కేల్స్ లో స్పెషల్ అసిస్టంట్ బి యి డి గ్రేడ్ లోbasik pay 910గా  జీతం ఫిక్స్ అయింది ;ఆ స్కేలు750-30-1020-35-1300 .1-1-84కు 990.నెలలో ఏ తేదీన ఇంక్రిమెంట్ డేట్ ఉన్నా ఆ నెల మొదటి తేదీకే ఇంక్రిమెంట్ తీసుకొనే ప్రభుత్వ ఉత్తరువుకూడా వచ్చింది .కనుక రెగ్యులర్ గ ఆగస్ట్ పందొమ్మిది అయిన నా ఇంక్రిమెంట్ డేట్ ఇప్పటినుంచి ఆగస్ట్  ఒకటినాటికే వచ్చింది .దీనికి తోడూ ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకొంటే ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇచ్చారు .భార్యా భర్త లలో ఎవరు చేయిమ్చుకొన్నా ఇచ్చారు .ఇది బేసిక్ పే లో కలవదు .ప్లస్ వేసి బేసిక్ ప్రక్కన చూపిస్తారు .అమలు జరిగిన తేదీ కి ఏ స్కేలు లో ఇంక్రిమెంట్ ఉంటె ఆ ఇంక్రిమెంట్ మాత్రమె ప్లస్ అవుతుంది .స్కేలు మారితే ఇది మారదు.మా ఆవిడ చేయిన్చుకోన్నదికనుక నాకు ఇంక్రిమెంట్ 13-6-85నుండి 320-14-460-15-580 స్కేలులో నాబెసిక్ 446ఉంటె 14 రూపాయలు ఫామిలీ ప్లానింగ్ ఇంటెన్సివ్ కలిపి 446+14(f.p.i.) గా ఫిక్స్ చేశారు .

అలాంటి సమయం లో నా బదిలీ పెనుగంచిప్రోలుకు జరిగింది .వినటమే కాదు అదెక్కడుందో తెలియదు .1-8-1985సాయంత్రం పామర్రు హైస్కూల్ లో రిలీవ్ అయి రెండు నుండి ఏడవ తెదే వరకు ట్రాన్సిట్ వాడుకొని 8-8-85ఉదయం పెనుగంచిప్రోలు హైస్కూల్ లో చేరా .పామర్రులో పని చేసింది ఈ స్పెల్ లో రెండు నెలలు తక్కువ రెండేళ్ళు .కాని నాకు పామర్రు అంటే అప్పుడూ ఇప్పుడూ చాలా ఇష్టం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ -14-

 

 

 

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆఖరి చూపుల ఆత్మబంధువు -శ్రీ బాషా

ఆఖరి చూపుల ఆత్మబంధువు

శ్మశానానికి వెళ్లిన విక్రమార్కునిలాగే భుజం మీద శవాన్ని వేసుకుని కథ చెప్పడం మొదలుపెడతాడు చాంద్‌బాషా. ఒక్కో మృతదేహానిది ఒక్కో కథ. అవన్నీ తెలంగాణలో పుట్టి అరబ్బుదేశపు ఎడారుల్లో ముగిసిన కన్నీటి కథలు. దిక్కులేని దేశాల్లో అనాధలుగా పడున్న మృతదేహాలను.. వాళ్ల కుటుంబీకులకు అప్పగించేందుకు పెద్ద పోరాటమే చేస్తున్నాడీ బాషా. ఆ విధంగా – ఇప్పటి వరకు ఖతార్‌, దుబాయ్‌, బహ్రెయిన్‌ దేశాలలో చనిపోయిన మూడొందలకు పైగా మృతదేహాలను తీసుకొచ్చేందుకు చొరవ చూపాడు..

‘‘ఎడారి దేశంలో పడున్న మృతదేహాలను తెప్పించడానికి పడేకష్టాలు అన్నీ ఒక ఎత్తు. హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి శవాలు వస్తే.. అక్కడి నుండి తెలంగాణలోని సొంతూర్లకు తీసుకెళ్లేందుకు అంబులెన్సులకు కూడా పైసలు లేనోల్లే ఎక్కువమంది ఉన్నరు. చనిపోయిన మనిషికోసం పోరాటం చేయాల. ఆ మనిషిని ఊరికి తీసుకెళ్లలేని పేదరికం మీద మరొక పోరాటం చెయ్యాల. ఏమి దౌర్భాగ్యం ఇది! మా బతుకులు ఎన్నడు బాగుపడేను’’
అద్దె కారులో సిటీ మొత్తం గిర్రున తిరుగుతున్న చాంద్‌బాషా సెక్రటేరియట్‌ దగ్గర నిలిపాడు. ఆయనతోపాటు కారులో నుంచి పీక్కుపోయిన దిగులు ముఖాలతో కొందరు పల్లెటూరోళ్లు మెల్లగా దిగారు. వాళ్లలో ఒకపెద్దాయన చేతిలో నలిగిపోయిన కాగితాల కట్ట కనిపించింది. ‘‘ఈయన పేరు మల్కప్ప. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కుదురుమల్ల సొంతూరు. ఈ పెద్దాయన కొడుకు రాములు పదహారేళ్ల కిందట బతుకుదెరువు కోసమని సౌదీకి వెళ్లిపోయాడు. పోయినోడు పోయినట్లే కనిపించకుండా పోవడంతో.. ఈయన తిరగని ఆఫీసు లేదు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ పిటీషన్లు ఇచ్చిండు. తన కొడుకు బతికున్నాడా? లేడా? ఏమయ్యాడు? అని ఏడ్వని దినం లేదు. ఆయన గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని మల్కప్ప గురించి చెప్పుకొచ్చాడు చాంద్‌బాషా. ఆ గుంపులోనే ఉన్న ఇంకో కుర్రాడ్ని చూపిస్తూ ‘‘ ఈ అబ్బాయిది తూర్పుగోదావరి జిల్లా కూనవరం. ఏడాది కిందట వీళ్ల అమ్మ ఖతార్‌ దేశానికి వెళ్లింది. అక్కడే చనిపోయింది. మృతదేహం తెప్పించడానికి నా వద్దకు వస్తే – ఏపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు తీసుకెళ్లి విజ్ఞాపన పత్రం ఇచ్చొస్తున్నాను..’’ అని చెప్పాడు బాషా. అతని పక్కనే మౌనంగా నిల్చున్న శ్రీశైలం అనే మరో యువకుడు భుజానికి తగిలించుకున్న గుడ్డసంచిని తెరిచి.. ‘‘మాది నిజామాబాద్‌ జిల్లా క్యాసంపల్లి. మా ఇంట్లో నా తమ్ముడు భాస్కర్‌ ఒక్కడే డిగ్రీ చదివిండు. మా అప్పులన్నీ తీర్చేస్తానని ఖతార్‌ వెళ్లాడు. అక్కడ ఒంటెలకాపరిగా చేసేటోడు. ఎడారి ఎండలకు నీళ్లు లేక, తిండి సరిగా తినక.. వెనక్కి వచ్చేందుకు డబ్బుల్లేక.. ఒకటి కాదు. నానా తిప్పలు పడుతున్నట్లు ఫోన్‌లో చెప్పేటోడు. ఒక రోజున హఠాత్తుగా ఎంబసీ ఆఫీసు నుంచి ఉత్తరం వచ్చింది. ‘భాస్కర్‌ చనిపోయాడు. మీ ఊరికి శవాన్ని పంపాలంటే ఒకటిన్నర లక్షలు పంపండి’ అనుంది అందులో. ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. తమ్ముడు చేసిన అరవైవేల అప్పుతీర్చుకోలేకే కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు వాడి మృతదేహాన్ని ఎలా తెప్పించుకోను..’’ అంటున్న శ్రీశైలం కళ్లలో నీళ్లు మెదిలాయి. అతను కూడా బాషా సాయం కోసం వచ్చాడు.
వీళ్లందరూ కలిసి రెండు రాషా్ట్రల ఎన్‌ఆర్‌ఐ సెల్‌లకు వెళ్లి.. అయినవాళ్ల మృతదేహాలను తెప్పించమంటూ విజ్ఞప్తి చేసి ఊరికి వెళ్లిపోయారు. బతుకుపోరాటంలో ఎడారి దేశం వెళ్లి.. చనిపోయిన సంబంధీకులకు చాంద్‌బాషానే దిక్కు అవుతున్నాడిప్పుడు. జగిత్యాల నుంచి వారంలో రెండుమూడు రోజులు హైదరాబాద్‌కు వచ్చే బాషాకు నిత్యం ఇదే పని. ఏదో ఒక ఊరి నుంచి ఫోన్‌ వస్తుంది. ‘‘అన్నా.. మా అన్న సచ్చిపోయిండు. సంవత్సరమైన శవం రాలె. మీరే ఏదన్నా చెయ్యాల’’ అని అడుగుతారు. ఆ ఫోన్లు మాట్లాడాక నా ప్రాణం నిలవదు అంటాడు బాషా.
దుబాయ్‌ రేడియో ప్రోత్సాహం..
జగిత్యాలకు చెందిన చాంద్‌బాషా అందరిలాగే ఉపాధి కోసం పాతికేళ్ల కిందట బహ్రెయిన్‌ వెళ్లాడు. సౌదీ, దుబాయ్‌లలోను కొన్నాళ్లు పనిచేశాడు. పెద్దగా చదువులేకపోయినా అరబ్బుదేశాల మంచీచెడు తెలిసినోడు. ‘‘దుబాయ్‌లో ఉన్నప్పుడు కారు డ్రైవర్‌గా పనిచేసేవాడ్ని. దూరాభారం వెళుతున్నప్పుడు కారులో ఎఫ్‌ఎం రేడియో వినడం నాకు అలవాటు. దుబాయ్‌లో ‘మీ రంజని’ అనే తెలుగు ఎఫ్‌ఎం రేడియో బాగా పాపులర్‌. ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చిన పేదల కష్టాలు కడగండ్లు వినిపించేటోళ్లు. సాయంత్రం ఆరు గంటలకు ‘మనసులోమాట’ ప్రోగ్రాం వచ్చేది. అందులో ఎవరి కథ వారు చెప్పుకోవచ్చు. ఒక రోజున నేను కూడా – అంతదూరం నుంచీ అయినవాళ్లందర్నీ వదులుకుని ఎడారి దేశం ఎందుకొచ్చిందీ శ్రోతలకు చెప్పాను. తెలంగాణ ప్రజలు గల్ఫ్‌ దేశాలలో పడే బాధలు ఎలాగుంటాయి? ఇంటి దగ్గర కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి? వంటివన్నీ చెప్పాను. ఆవిధంగా రేడియోకు తరచూ నేను ఫోన్లు చేయడం, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వారి దృష్టికి తీసుకెళ్లడం చేసేవాడ్ని. అలా రేడియో నిర్వాహకులకు తలలో నాలుకనయ్యాను. ఆ ఆసక్తితోనే – దుబాయ్‌లో జరిగే సంఘటనలను సేకరించి జగిత్యాలలోని ఆంధ్రజ్యోతికి ఫ్యాక్స్‌ ద్వారా వార్తల్ని పంపించేవాడ్ని. ఒకరకంగా గల్ఫ్‌దేశాలకు వెళ్లిన వాళ్లకు – టీవీలు, రేడియోలు, పత్రికల వాళ్లకు మధ్యన సమాచార వారధిగా పనిచేశాను..’’ అని పేర్కొన్నాడు బాషా.
ఒకసారి – దుబాయ్‌లో వీసాలు లేని తెలుగోళ్లను సొంతదేశం వెళ్లమని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే విమాన టికెట్లకు ఎవరివద్ద డబ్బులు లేవు. ‘‘అప్పట్లో వాళ్లు పడిన అవస్తలు చెప్పేవి కావు. ఆ విషయాన్ని ‘మీ రంజని’ రేడియోలో చర్చనీయాంశం అయ్యేలా చేసినవాళ్లలో నేను ఒకడ్ని. రేడియోలో లైవ్‌ పెట్టినప్పుడు కొందరు తెలుగు ప్రజాప్రతినిధులను కదిపాను. అప్పుడు వైఎస్‌ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్‌ నేతలు విమాన టికెట్లు కొనిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్లు అందించి.. సొంతూర్లకు పంపింది..’’ అంటున్న ఆయన.. ఆవిధంగా గల్ఫ్‌ ప్రవాసుల మనసు చూరగొన్నాడు.
దోస్తు మరణంతో మొదలు..
ఈ తిరుగుళ్ల వల్ల.. దుబాయ్‌లో ఉద్యోగం పోవడంతో జగిత్యాలకు వచ్చిన చాంద్‌బాషా.. మిత్రుడు నర్సయ్య ఇంటికి వెళ్లాడు. ‘‘నర్సయ్య ఎలా ఉన్నాడు? గల్ఫ్‌లో ఉండేవాడు. తిరిగొచ్చాడా?’’ అని అడిగాడు కుటుంబసభ్యులను. ‘‘ఎక్కడి నర్సయ్య అయ్యా! సచ్చిపోయి ఏడాది పొద్దయ్యింది. ఈనాటికీ శవం రాలే. ఎవర్ని కలవాలో యేడ చెప్పాల్లో కూడా మాకు తెల్వదు’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు వారు. ‘‘అప్పటి నుంచే మృతదేహాలను తెప్పించే పోరాటం మొదలయ్యింది. నర్సయ్య తమ్ముడిని వెంటబెట్టుకుని.. హైదరాబాద్‌ వెళ్లి ఎంబసీకి ఫోన్లు, ఫ్యాక్స్‌లతోపాటు ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు సమాచారం పంపించాను. ఆ తర్వాత ఇరవై తొమ్మిది రోజులకు మృతదేహం వచ్చింది. నేను దీన్ని ఒక పనిగా భావించలేదు. ఒక దోస్తుకు కష్టం వచ్చిందని స్పందించాను అంతే! అయితే ఆ స్పందించే గుణమే నన్ను అటువైపు లాక్కుపోతుందని అనుకోలేదు..’’ అన్నాడు. ఆ తర్వాత కొడిమెల, నమిలికొండలకు చెందిన ఇద్దరు దుబాయ్‌ వెళ్లి చనిపోయారు. సంవత్సరం నుంచి శవాలు ఆస్పత్రి మార్చురీలోనే పడున్నాయి. విషయం బాషాకు తెలిసింది. కుటుంబ సభ్యులను వెంట తీసుకుని.. వెంటనే పత్రికలకు సమాచారం ఇవ్వడం, విజ్ఞప్తి పత్రాలను అధికారులకు పంపించడం, ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకురావడం వరకు అన్ని పనులు చేశాడు. ‘‘ఎడారి దేశంలో పడున్న మృతదేహాలను తెప్పించడానికి పడేకష్టాలు అన్నీ ఒక ఎత్తు. హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి శవాలు వస్తే.. అక్కడి నుండి తెలంగాణలోని సొంతూర్లకు తీసుకెళ్లేందుకు అంబులెన్సులకు కూడా పైసలు లేనోల్లే ఎక్కువమంది ఉన్నరు. చనిపోయిన మనిషికోసం పోరాటం చేయాల. ఆ మనిషిని ఊరికి తీసుకెళ్లలేని పేదరికం మీద మరొక పోరాటం చెయ్యాల. ఏమి దౌర్భాగ్యం ఇది! మా బతుకులు ఎన్నడు బాగుపడేను’’ అని చెబుతున్నప్పుడు బాషా కళ్లు చెమర్చాయి. కొన్నిసార్లు విమానాశ్రయం నుంచి తీసుకెళ్లేందుకు పైసలు పెట్టుకోలేని వాళ్లకు.. దాతలు, ప్రభుత్వ సహాయంతో తనే ముందుండి కార్యం పూర్తయ్యే వరకు అండగా నిలుస్తున్నాడు ఇతను. 2008 నుంచి బాధితులకు మృతదేహాలు అప్పగించే పనిని భుజానికెత్తుకున్న బాషా.. ఇప్పటి వరకు 365 మృతదేహాలను తెప్పించేందుకు కృషి చేశాడు. ‘‘నాకు ఫోన్లు చేసేటోళ్లు అందరు పేదోళ్లే. అది తెలంగాణ కావొచ్చు. ఆంధ్ర కావొచ్చు. పేదోళ్ల బతుకులు ఎక్కడైనా ఒకటే! అరబ్బు దేశాలలో చనిపోయిన.. తూర్పుగోదావరి, కడప జిల్లాలకు చెందిన వాళ్ల మృతదేహాలను కూడా.. వాళ్ల ఊళ్లకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి’’ అంటున్న చాంద్‌బాషా.. మరణించిన వాళ్ల మృతదేహాలను అయిన వాళ్లకి అప్పగించి వాళ్ల కన్నీళ్లు తుడిచేటోడు!!
నవ్య డెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి

జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి

జీవితంలో ఎదురయ్యే అశాంతిని పారద్రోలి, ప్రశాంతతతో జీవించే మార్గాన్ని చూపించేది ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’. సుదర్శన క్రియ ద్వారా ఇటు ఆరోగ్యాన్ని, అటు ఆధ్యాత్మిక సాంత్వనను పొందవచ్చంటారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్‌. ఆయన ఇటీవల హైదరాబాద్‌ వచ్చినప్పుడు ‘నవ్య నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు…

మత మార్పిడుల గురించి ఏమంటారు?
మతమార్పిడిలు రాజకీయపరమైన విషయం. దానికీ ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. ఆఫ్రికాను చూస్తే… సగం జనాభా ఇస్లాంలోకి, మిగిలిన సగం జనాభా క్రైస్తవ మతంలోకి మారిపోయారు. మతంలోకి మారకపోతే దేవుడు శిక్షిస్తాడని భయపెట్టడంతో వారందరూ మతాన్ని మార్చుకోవటం మొదలుపెట్టారు. మతం అనేది మనిషి ఉన్నతికి కారణమవ్వాలి. అంతే తప్ప ప్రజల్లో భయాన్ని రేకెత్తించకూడదు. వారిలో తప్పు చేస్తున్నామనే భావనను రేకెత్తించి… మతమార్పిడులకు గురిచేయకూడదు. హిందూ ఆధ్యాత్మికవాదం ఎప్పుడూ అలా చేయదు. అందరినీ కలుపుకుపోతుంది.

మనుషులు ఆనంద స్వరూపులు కదా.. అటువంటప్పుడు ఇంత సంఘర్షణ ఎందుకు ఏర్పడుతోంది?

జీవితం మంచి, చెడుల మిశ్రమం. మంచి, చెడు- దైవం, దెయ్యం-ఇలా పూర్తిగా విభిన్నమైన భావాల స్వరూపమే మన జీవితం. చెడు మీద మంచి విజయం సాధిస్తుందని చెప్పేదే మానవ జీవితం. ఎప్పుడైనా చూడండి.. వెలుతురు వస్తే చీకటి పోతుంది. ఈ మొత్తమంతా ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. ఇందుకు మీకో ఉదాహరణ చెబుతాను. ఒక విత్తును నాటితే చెట్టు వస్తుంది. ఆ చెట్టు నుంచి మళ్లీ విత్తు వస్తుంది. ఇలా చక్రం తిరుగుతూ ఉంటుంది. జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించటం ద్వారా ఈ చక్రాన్ని ఛేదించవచ్చు. దీనిని ఎలా పొందాలనే విషయాన్ని జీవితమే మనకు బోధిస్తుంది.

ప్రజలు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నారు?

అజ్ఞానం వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది. జ్ఞానం దారిని చూపిస్తుంది. కానీ ఆ జ్ఞానం పొందటం ఎలా అనేది ఒక సమస్య. దీనిని పొందగలిగినప్పుడు సంఘర్షణలు తొలగిపోతాయి. దీనికి సాధనే మార్గం. అందరిని గౌరవించమని.. అందరి ధర్మాలను సమదృష్టితో చూడమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకొమ్మని, మన సనాతన ధర్మం చెబుతుంది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ దీనిని నమ్ముతుంది. అందుకే ఎక్కడ సంఘర్షణ జరిగినా- ఆ సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. లంక, ఇరాక్‌, ఇరాక్‌, గాజా – ఇలా ఎక్కడ అశాంతి ఏర్పడినా అక్కడి ప్రజలను ఆదుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఇరాక్‌లో సంక్షోభం ఏర్పడింది. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. వారిని ఆదుకునేందుకు మా వలంటీర్లు అక్కడకు వెళ్లారు. ఈ నెల 19వ తేదీన నేను కుర్థిస్థాన్‌ వెళ్తున్నాను. అక్కడ ‘యజ్ది’ తెగకు చెందిన 500 కుటుంబాలను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ దత్తత తీసుకుంది. ఒకప్పుడు యజ్ది తెగకు చెందిన వారు రెండు కోట్ల మంది ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పది లక్షలు మాత్రమే. మిగిలిన వారందరినీ హతమార్చారు. మిగిలిన వారిలో చాలా మందిని ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. వీరందరికీ బతకటానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కావాలి. మన దేశంలో వారికి ఆశ్రయం ఇస్తే బావుంటుంది.

ప్రపంచంలో హిందు మతం ఎలాంటి ప్రభావం చూపగలదు?

ప్రపంచంలో అన్ని చోట్ల హిందూ ఆధ్యాత్మికత అవసరం ఎంతైనా ఉంది. ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా- చివరకు చేరేది పరమాత్మ దగ్గరకే. ఆ పరమాత్మకు రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు. ‘నీ పాపాలన్నింటినీ నేను కడిగేస్తాను.. రాత్రి పగలు నీతోనే ఉంటాను..’ అని క్రీస్తు చెప్పాడు. కృష్ణుడు చెప్పాడు. వేల దేవుళ్లు మనకు కనిపిస్తారు. ఒకరే దేవుడు.. మిగిలిన వారు సైతానులు అనే భావన హిందూ ధర్మంలో కనిపించదు. ఇదే హిందూ మతం గొప్పతనం. అయితే భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్న లోపమేమిటంటే- మన శాస్త్రాలలో, పురాణాలలో ఉన్న విషయాలను స్థానిక భాషల్లో ప్రజలకు చెప్పలేకపోతున్నాం. ఇలా చెప్పగలిగితే ప్రజలకు వాటి గొప్పదనం తెలుస్తుంది.

హిందూమతంలో కొన్ని వర్గాలు, కొన్ని వర్ణాలకే ప్రాధాన్యం ఉందనే విమర్శలున్నాయి….
కొందరికే ప్రాధాన్యం ఉందనే వాదన సరికాదు. ఇది కూడా కొందరు కావాలని చేసిన ప్రచారమే. మీకో ఉదాహరణ చెబుతాను. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంధాలను రాసిన వ్యాసుడు, వాల్మీకి- దళితులేగా.. మనకు వేల సంఖ్యలో రుషులు ఉంటే వారిలో బ్రాహ్మణులు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. మధ్య యుగాల దాకా మన సమాజంలో కులవ్యవస్థ బలంగా లేదు.
జాతి నీతి కులగోత్ర దుర్గం
నామరూప గుణదోష వర్జితం

అని శంకరుడు ఎప్పుడో చెప్పాడు. మానవులందరూ పరబ్రహ్మ స్వరూపాలే. చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే- మనను పాలించిన రాజుల్లో కూడా 70 శాతం మంది వెనకబడిన వర్ణాల వారేగా.. బ్రిటిష్‌ వారు మన దేశంలో కులవ్యవస్థ ప్రోది చేశారు. క్రమేపీ అది బలంగా వేళ్లూనింది. దీనితో హిందూ మతంలో ఇలాంటి తేడాలు తీవ్రంగా ఉన్నాయని భావించటం మొదలుపెట్టారు. కొన్ని దేశాల్లో హిందూ మతానికి సంబంధించి ఒక ఆట ఆడిస్తారు. అదెలా ఉంటుందంటే బ్రాహ్మణుడు కుర్చీలో కూర్చుంటాడు. క్షత్రియుడు వెనక నిలబడతాడు. వైశ్యుడు వంగి ఉంటాడు. దళితుడు నేల మీద కూర్చుంటాడు. ఇలాంటి ఆటలు ఆడించటం వల్ల మన దేశంలో కుల భావన బాగా చొచ్చుకుపోయిందనే ఆలోచన పిల్లల్లో కూడా కలుగుతోంది.

మన దేశాన్ని పాలించిన విదేశీయులందరూ- విభజించి పాలించు అనే సూత్రాన్ని అనుసరించినవారే. ఒక సమాజంలో ప్రజలను విభజించాలంటే ఏదో ఒక ప్రాతిపదిక కావాలి. అది కులం కావచ్చు.. మతం కావచ్చు. నా దృష్టిలో ఈ కులాలు కేవలం రాజకీయ లబ్ది కోసం కొందరు సృష్టించినవి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

చాలా మంది హిందూమతాన్ని విడిచివెళ్తున్నారు కదా..

ఆకర్షణ.. భయం- ఈ రెండింటి వల్ల హిందూమతాన్ని విడిచివెళ్తున్నారు. ఒకప్పుడు తమకు అదనంగా ఏదో చేకూరుతుందనే ఆశతో.. తృణమో, ఫణమో లభిస్తుందనే ఆకర్షణతో ఇతర మతాలకు మారిపోయేవారు. కానీ ఇప్పుడు నరకం అనే భయంతో మారిపోతున్నారు. మన చరిత్రలో ఈ విధంగా భయంతో మతం మారటం చాలా అరుదైన విషయం. ఇప్పుడది జరుగుతోంది. తమ దేవుడిని నమ్ముకోకపోతే నరకానికి పోతారని బలంగా నూరిపోస్తున్నారు. ఉదాహరణకు ఆఫ్రికానే తీసుకోండి. ఈ భయం వల్లే ఆ ఖండంలో మతమార్పిడులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఆసియాపై దృష్టి సారించారు. హిందూ ధర్మంలో బయటకు వెళ్లటమే తప్ప.. లోపలికి తీసుకువచ్చే మార్గమే లేదు. శంకరుడి తర్వాత హిందూ ధర్మానికి సంబంధించి విప్లవాత్మక మార్పులు ఏమీ రాలేదనే విమర్శ కూడా ఉంది.. పరమాత్మ అందరివాడని సనాతన ధర్మం చెబుతుంది. ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మ మొక్కటే..’ అని అన్నమయ్య కూడా చెప్పాడు కదా.. అయితే కొందరు తమ స్వార్థం కోసం కులాల గోడలను నిర్మించారు. దాని వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఇక హిందూమతంలో రావాల్సిన మార్పుల గురించి చర్చ అప్పుడే ప్రారంభమయ్యింది. ఈ ఆధునిక సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. వాటికి తగ్గట్టుగా మతం కూడా మారాలి. ఒకప్పుడు ఇలాంటి చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు చర్చ ప్రారంభమయింది. ముఖ్యంగా యువతీయువకుల్లో ఇలాంటి విషయాలపట్ల ఆసక్తి మొదలయింది. ఇది చాలా మంచి పరిణామం.

యువతకి మీరిచ్చే సందేశమేమిటి?

గతంతో పోలిస్తే యువత చాలా త్వరగా పరిణతి చెందుతోంది. చిన్నవయస్సులోనే లోకజ్ఞానం అలవడుతోంది. యువత చెడుమార్గంలో ప్రయాణించకుండా తల్లితండ్రులు, గురువులు మార్గం చూపించాలి. అందుకు తగ్గ వాతావరణాన్ని ఏర్పాటు చేయగలగాలి. ‘మీ పరిధిని విస్తృతం చేసుకోండి.. మీ మూలాలను బలోపేతం చేసుకోండి..’ ఇదీ నేను యువతకు ఇచ్చే సందేశం.. మా సంస్థలో ఎక్కువగా యువతే కనిపిస్తారు. ప్రతి యువకుడిని రోజుకు ఒక గంట సమయాన్ని దేశం కోసం కేటాయించమని కోరుతున్నాం. ఒక ఏడాది కాలాన్ని దేశంలోని గ్రామాలకు, ప్రజలకు కేటాయించమని కోరుతున్నాం.

మీరు ఐసిస్‌ ఉగ్రవాదులతో శాంతి గురించి మాట్లాడారా?
లేదు.. భవిష్యత్తులో వారితో మాట్లాడతాననే ఆశ మాత్రం ఉంది. వారితో మాట్లాడటం కూడా ఒక సవాలే. ఎందుకంటే- ఇద్దరి మధ్య సంభాషణ అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడే వీలవుతుంది. అవతల వ్యక్తి డెవిల్‌ అని భావిస్తే- చర్చకు ఆస్కారమే ఉండదు కదా. గత 35 ఏళ్లుగా ఈ ప్రక్రియను నడుపుతున్నాం. ఆ అనుభవాలను రంగరించి వారితో కూడా మాట్లాడగలమనే విశ్వాసం ఉంది.
నవ్యడెస్క్‌

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కర్మయోగం అంటే -శ్రీ కె అరవింద రావు –

కర్మయోగం అంటే

గత రెండు వ్యాసాల్లో కర్మ, దాని ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడం అనే వాటి నేపథ్యం తెలుసుకున్నాం. ప్రస్తుతం కర్మయోగం గురించి తెలుసుకుందాం.
ఫలితంపై కోరికలేకుండా పనిచేయడానికి (నిష్కామకర్మకు) భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం. గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది. లక్ష్మీయోగం పట్టింది అంటుంటాం. లేనిదాన్ని పొందడం. పొందినదానిని రక్షించుకోవడం . యోగమంటే ఇక్కడ కర్మయోగం. అంటే కర్మ అనే ఉపాయాన్ని పట్టుకొని మరొకదాన్ని సాధించడం. ఆ మరొకటి ఏమంటే అదే ఆత్మజ్ఞానం.
నిష్కామకర్మ వల్ల ప్రయోజనాన్ని పై వ్యాసాల్లో చూశాం. అదేమిటంటే కర్మయొక్క ఫలితమైన పుణ్యం లాంటివి లేకుండటం. దాని పర్యవసానాలు లేకుండా చూడటం మరొక ప్రయోజనం కూడా ఉంది. ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు క్రమక్రమంగా పవిత్రంగా మారటం. దీన్నే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నపుడు మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తి పొందుతుందో మనం సొంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక శాండల్‌ సోపు లాంటిదని చెబుతారు. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తియే ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలడని ఉపనిషత్తుల సిద్ధాంతం.
కర్మయోగం గూర్చి చెబుతూ శ్రీకృష్ణుడు ‘యోగ: కర్మసు కౌశలం ’ అంటాడు. కర్మయోగం అంటే పనులు చేయడంలో నేర్పరితనం అంటాడు. ఏమిటి ఆ నేర్పరితనం అంటే కర్మచేస్తూ ఉండి కూడా దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు.
కర్మయోగి కానివాడు స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ పుట్టుక, మరణం అనే చక్రంలో తిరుగుతూంటాడు. ఇతనికి మోక్షం ప్రస్తావన లేదు. అలా కాకుండా కర్మయోగి లోకం మేలు కోసం ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే తాను భగవంతుడి కాస్మిక్‌ ప్లాన్‌ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా భావిస్తూ పనిచేయడం. దీనివల్ల ప్రయోజనం చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని వేదాంతం చెబుతుంది.
పనిచేయడమే దైవ పూజ. కృష్ణుడు చెప్పే మరొక సూత్రమిది. ప్రతి మనిషికీ వాడి వాడి స్వభావాన్ని బట్టి సమాజం కొన్ని కర్మల్ని విధిస్తుంది. ఆ పనుల్ని చేయడమే దేవుడిని పూజించడం అని గీత చెబుతుంది. స్వకర్మణా తమభ్యర్చ్య అంటాడు శ్రీకృష్ణుడు .మనవంతు పనిని శ్రద్ధగా చేస్తే సృష్టి నియమాల్ని, ప్రపంచధర్మాన్ని పాటించినట్లే . ఇదే ఆ సృష్టిచక్రానికి, ప్రపంచఽధర్మాన్ని పాటించినట్లే. ఇదే ఆ సృష్టిచక్రానికి, ప్రపంచధర్మానికీ కారణమైన శక్తిని పూజించడం అంటే పూర్వకాలం నియమాల ప్రకారం కేవలం అఽధ్యయనం. అఽధ్యాపనం ,యాగాలు చేయించడం, దానం స్వీకరించడం మొదలైనవి బ్రాహ్మణుడి ధర్మం. ప్రజల్ని రక్షించడం ధర్మాన్ని రక్షించడం క్షత్రియుడి ధర్మం. ఇలాగే మిగతావారికి కూడా భగవద్గీతలో అర్జునుడు తన ధర్మాన్ని భిక్షాటనం అనే బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తానంటాడు. ఆ సమయంలో అతని ధర్మాన్ని గుర్తుచేయడమే శ్రీకృష్ణుడి పని.
స్వధర్మాన్ని గురించి రాముడు కూడా చెబుతాడు. శ్రీరాముడు సీతతో పాటు అడవులకు వెళ్ళిన సమయంలో అడవుల్లో ఉన్న ఋషులు ఆయన్ను సమీపించడం, రాక్షసబాధను తొలగించమని ఆయన్ను కోరడం, ఆయన వాళ్ళ వెంబడి వెళ్ళడం,వీటన్నింటినీ చూసి సీతకు ఒక సందేహం వస్తుంది. అయ్యా ..మనం మీ తండ్రిగారి మాట పాటించడానికి మాత్రమే అడవులకి వచ్చాం కదా. నీవు ఎప్పుడూ నీ శస్ర్తాలు పట్టుకునే ఉంటున్నావు. రాక్షసులతో యుద్ధాలు చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకూ? ఎప్పుడూ ఆయుధాలు దగ్గర పెట్టుకోవడం వల్ల మనిషి బుద్ది కూడా కలుషితమవుతుంది కదా అంటుంది. ఆయుధం చేతిలో ఉంటే అనవసరంగా అందరిపై దానిని ప్రయోగించే మనస్తత్వం వస్తుంది అంటూ ఒక కథ కూడా చెబుతుంది. అప్పుడు రాముడు ఆమెకు క్షత్రియ ధర్మాన్ని గూర్చి చెబుతూ కష్టాల్లో ఉన్నవారి కష్టాల్ని తొలగించడం ధర్మం అని వివరి స్తాడు. ఉపనిషత్తులు కర్మయోగాన్ని చెప్పిన నేపథ్యం చూస్తే ఆ కర్మలన్నీ వేదంలోనూ, స్మృతుల్లోనూ చెప్పిన యజ్ఞాలు మొదలైనవి అని గమనిస్తాం. మరి మనం ఈనాడు యజ్ఞాలు చేయడం లేదు. కనీసం నిత్యం చేయాల్సిన పనులు కూడా చేయడం లేదు. ఆనాడు ఒక్కొక్క వర్గానికి విధించిన పనులు నేడు లేవు. మరి కర్మయోగం మనకు ఎలా ఉపయోగిస్తుంది లేదా వర్తిస్తుంది. కర్మయోగమనే కాన్సెప్టును ప్రస్తుతం మన పని వాతావరణానికి ఎలా అన్వయించుకోవాలి.
ఆధునిక ఆచార్యులు దీన్ని ఇలా చెబుతారు. కర్మఫలం ఆశించకుండా ఎవరూ పనిచేయరు కదా. కర్మఫలానికి నేనే కారణం. నేనే బాధ్యుణ్ణి అనే ఉద్దేశంతో పనిచేస్తే ఆ పనిలో జయాపజయాలు కల్గినపుడు సంతోషించడం లేదా బాధపడటం జరుగుతుంది. అలాకాకుండా నీ పనిని శ్రద్దగా చేయి. ఎలాంటి పనిని చేయాలి అని ఎంపిక చేసుకునే అధికారం లేదా చాయిస్‌ నీకుంది. దాని ఫలంపై నీకు అధికారం . అనగా నియంత్రణ లేదు. దానికి ఇతర పరిస్థితులు,దైవం అనుకూలించాలి. అవి నీ చేతిలో లేవు.ఆశించిన ఫలితం రానపుడు దాన్ని నీ అపజయం క్రింద భావించవద్దు అంటూ వివరిస్తారు.
మనందరం సమాజంలోని ఏదో ఒక వ్యవస్థలో పనిచేస్తూంటాం. ఆ వ్యవస్థకు కొన్ని నియమాలు ఉంటాయి. అన్ని వ్యవస్థలూ అందులో ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రజల జీవితాలకూ, సౌకర్యాలకూ ముడిపడి ఉంటాయి. నేటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ చెప్పే పనులు కూడా శ్రీకృష్ణుడు చెప్పే వైదికకర్మలాంటిదే. ఈ పనుల్ని ఎలాంటి స్వార్థభావన లేకుండా శ్రద్ధగా చేయడం కర్మయోగమే.

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ
అభిప్రాయాలను
navya@andhrajyothy.com కు పంపండి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుష్క లేని ‘రుద్రమదేవి’ని ఊహించలేం -గుణశేఖర్‌

అనుష్క లేని ‘రుద్రమదేవి’ని ఊహించలేం -గుణశేఖర్‌

గతేడాది అనుష్క పుట్టినరోజు సందర్భంగా కాకతీయ సామ్రాజ్యపు వీరనారి గెటప్‌ ఇదంటూ ‘రుద్రమదేవి’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్‌. ఈ ఏడాది కూడా అనుష్క బర్త్‌డే గిప్ట్‌గా మరో పోస్టర్‌ విడుదల చేశారు. మొదటి పోస్టర్‌ రుద్రమదేవి రాజసాన్ని తెలియజేస్తే, రెండవ పోస్టర్‌ ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.
అనుష్క పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని గుణశేఖర్‌ మాట్లాడుతూ ‘‘రుద్రమదేవి సినిమా కోసం నేనెంతో రీసెర్చ్‌ చేశాను. ఈ కథ విన్నప్పటి నుండి పాత్ర పండాలని అనుష్క కసరత్తులు మొదలు పెట్టింది. షూటింగ్‌ ప్రారంభానికి ఐదు నెలల ముందే గుర్రపు స్వారీలు, కత్తిసాములు నేర్చుకుంది. దర్శకుడు నాకిచ్చింది చారిత్రాత్మక పాత్ర. ఇటువంటి అరుదైన పాత్ర దొరకడం వరం అని భావించి నా కన్నా ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టి పనిచేసింది.

షాకయ్యేలా
ఇందులో అనుష్క రెండు విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతోంది. ఒకటి వీరనారిగా అయితే రెండోది గ్లామరస్‌ ప్రిన్సెస్‌. ఈ రెండు గెటప్‌ల కోసం కేవలం మూడు నెలల వ్యవధిలో తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుంది. తనలో ఆ మార్పును, డెడికేషన్‌ చూసి మా యూనిట్‌ అంతా షాకయ్యారు. ఆ తేడాను ఆడియన్స్‌ కూడా గుర్తిస్తారు.
యజ్ఞం పూర్తయింది
పాత్ర డిమాండ్‌ మేరకు ఒక యాక్షన్‌ హీరో ఎన్ని ఫీట్స్‌ చేస్తాడో అవన్నీ అనుష్క చేసింది. 100-150 అడుగుల ఎత్తున్న క్రేన్‌ నుండి వేలాడడానికి ఏమాత్రం భయపడేది కాదు. వీరనారి అనిపించుకోవడానికి కావలిసిన క్వాలిటీస్‌ అన్ని అనుష్కలో ఉన్నాయి. ఆమె సహకారంతోనే మహా యజ్ఞం పూర్తయింది. ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం ఆమె పెట్టిన ఎఫర్ట్‌ని మాటల్లో చెప్పలేను. దర్శకనిర్మాతల మంచి గురించి ఆలోచించే చక్కని నటి ఆమె.
స్ఫూర్తి పెరుగుతుంది
‘రుద్రమదేవి’ అనేది చిన్నప్పుడు చదువుకున్న ఓ కథ. అప్పట్లోనే నన్ను ఇన్‌స్ఫైర్‌ చేసిందీ కథ. దర్శకుణ్ణి అవుతానో లేదో అప్పుడు తెలీదు కానీ దర్శకుణ్ణి అయ్యి కొన్ని సినిమాలు చేశాక ఇటువంటి ఓ హిస్టారికల్‌ సినిమా చెయ్యాలనిపించింది. చారిత్రాత్మక సినిమాకు కథ ఎంత ముఖ్యమో, కథానాయిక కూడా అంతే ముఖ్యం. సినిమా ప్రారంభమై సగం పూర్తయ్యాక అనుష్క లేకపోతే అసలు ఈ సినిమా పరిస్థితి ఏంటా? అనిపించింది. సింగిల్‌ లైన్‌లో చెప్పాలంటే ‘అనుష్క లేనిదే రుద్రమదేవి లేదు’. ఆ ఊహ కూడా సాధ్యం కాదు. ‘అరుంధతి’లో ఆమె పొటన్షియాలిటీ ఏంటనేది చూశాం. ఈ సినిమా మరో మెట్టేకించేలా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. అనుష్కలాంటి నాయికతో ఇలాంటి సినిమాలు చేస్తే నాలాంటి దర్శకుల్లో ఎంతో స్ఫూర్తి పెరుగుతుంది. ఇలాంటి పాత్రలెన్నో ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధిక్కార కాంగ్రెస్ సేన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒబామాకు చుక్కలు చూపించిన రిపబ్లికన్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదారికి హారతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అయిన వాడే అందరికి – అయినా అందడు ఎవ్వరికి – సీతారామ శాస్త్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీక పూర్ణిమ విశేషాలు

కార్తీక పూర్ణిమ విశేషాలు

కార్తీక పౌర్ణమిని ‘’త్రిపుర పౌర్ణమి’’ అని ,’’దేవ దీపావళి ‘’అనీ పిలుస్తారు .తారకాసురిడి ముగ్గురుకోడుకులు త్రిపురాసురులని పిలువ బడతారు .పరమ శివుడు కార్తీక పున్నమి నాడు త్రిపురాసుర వధ చేశాడు .కనుక త్రిపుర పౌర్ణమి అనే పేరొచ్చింది .త్రిపురాసురులు లోక కంటకులై ఆకాశం లో త్రిపురాలను నిర్మిచారు .వారినీ,వారి పురాలను ఒకే ఒక్క బాణం తో శివుడు ధ్వంసం చేసి దేవతలకు సంప్రీతి కలిగించాడు .అందుకు దేవతలు తమ ఆనందాన్ని తెలియ జేయటానికి ఆకాశం లో దీపావళి పండుగ చేసుకొన్నారు .అందుకే దివ్య దీపావళి అనే పేరొచ్చింది .

కార్తీక పౌర్ణమి నాడే శ్రీ మహా విష్ణువు దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం దాల్చాడు .ఈ రోజే తులసికి మారురూపమైన బృందా దేవి జన్మించింది .కార్తికేయుని జన్మ తిదికూడా ఈ పౌర్ణమి యే.శ్రీకృష్ణుని ప్రియురాలు రాదా దేవి కి పరమ ప్రీతికరమైన రోజు కార్తీక పున్నమి .ఈ రోజుననే రాదా మాధవులు’’ రాస లీల’’నిర్వహించిన రోజు .ఇదే అయితే గొప్పేముంది -కృష్ణుడు రాధను అర్చించిన రోజుగా ఈ పౌర్ణమి చరిత్ర ప్రసిద్ధిపొందింది . కార్తీక పౌర్ణమి నాడు పితృ దేవతలను స్మరిం చటం అనాదిగా మనకు వస్తున్న ఆచారం కూడా .పూర్వకాలం లో శత్రువులను జయించ టానికి కార్తీక పూర్ణమి నాడు ‘’శాఖా మేధం ‘’అనే దాన్ని చేసే వారట .

పొర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటున్దికనుక ఈ మాసం కార్తీక మాసం అని పిలువ బడుతుంది అన్న విషయం అందరికి తెలిసిందే .కనుక ఈ రోజును ‘’మహా కార్తీకం ‘’అని అంటారు .ఈ పౌర్ణమినాడు భరణి నక్షత్రం ఉంటె ఇంకా విశేష ఫలం అని ,రోహిణి నక్షత్రం ఉంటె అనేక రెట్లు ఉత్తమ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది .కార్తీక పున్నమి నాడు చేసే దాన ధర్మాల ఫలితం పది యజ్ఞాలు చేసిన ఫలితం కన్నా అధికం .

కార్తీక పౌర్ణమి కి ముందు వచ్చే  ఏకాదశిని ‘’ప్రబోదిని  ఏకాదశి ‘’అంటారు .దీనితో చాతుర్మాస్య దీక్ష పూర్తీ అవుతుంది .నాలుగు నెలల నిద్ర తరువాత విష్ణు మూర్తి నిద్ర లేస్తాడు .ఈ ఏకాదశి రోజున అనేక ఉత్సవాలు ప్రారంభమై పౌర్ణమి నాటితో ముగుస్తాయి .పండరి పురం లో, పుష్కర తీర్ధం లో ఉత్సవాలను ఘనం గా నిర్వహిస్తారు .కార్తీక పూర్ణిమ నాడు తులసీ వివాహ వేడుకలను జరిపి ముగిస్తారు .పుష్కర తీర్ధం లో ఉన్న ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం లో విశేషం గా ఉత్సవ నిర్వహణ ఉంటుంది .పుష్కర ఘాట్ లో పవిత్ర స్నానాలు చేస్తే సరాసరి మోక్ష ప్రాప్తి కలుగు తుందని విశ్వాసం .ఎక్కడెక్కడో ఉన్న సాదు సంతులు ఏకాదశికి ఇక్కడికి చేరి కార్తీక పున్నమి వరకు ఉండిపోతారు .పుష్కర ఉత్సవానికి రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు చేసి బ్రహ్మ దేవుని దర్శించి పునీతులై ముక్తి పొందుతారు .దాదాపు ఇరవై వేల ఒంటెలు ఈ ఉత్సవం లో పాల్గొనటం మరో విశేషం .అలాగే ఈ పౌర్ణమి రోజున గంగా యమునా మొదలైన పవిత్ర నదులలో స్నానాలు చేసి దైవ దర్శనం చేయటం అలవాటుగా ఉంది .

దేవతలకు ప్రత్యేకం గా ‘’అన్న కూటం ‘’అనే పదార్ధాన్ని తయారు చేసి నైవేద్యం పెట్టి ప్రసాదం గా అందజేస్తారు .అశ్విని నక్షత్రం నాడు పౌర్ణమి నాడు హింస చేయం అని ప్రతిజ్ఞలు తీసుకొంటారు .ఎక్కడా ఈ రోజుల్లో పశువద జరగదు .బంగారాన్ని దానం చేస్తారు .శివుడికి శివరాత్రి తర్వాత అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి .రాత్రికి దీపాలతో ఆలయాలు వింత శోభను  సంత  రించు కొంటాయి .మూడు వందల అరవై ,ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు .దీప తోరణం అని దీన్ని పిలుస్తారు .దీన్ని దర్శించటానికి భక్తులు విరగ బడి వస్తారు. చూసి పుల  కింఛి పోతారు .ధ్వజ స్థంభాలకు ఆకాశదీపాల శోభ చెప్పనే అక్కరలేదు .నదులలో కాలువలలో అరటి దొప్ప లో అవునేటి దీపాలు వెలిగించి వదులుతారు .కన్నుల పండువుగా కనిపిస్తుంది .’’హర హర శంభో ‘’నినాదాలతో శివాలయాలు అపర కైలసాలుగా దర్శన మిస్తాయి .తమిళనాడు లోని అరుణాచలం కొండపై కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం వారం రోజులు వెలుగుతూనే ఉంటుంది .దీన్ని దర్శించటానికి లక్షలాది భక్తులు అక్కడికి చేరుకొంటారు .

హిందువులకే కాక జైనులకూ కార్తీక పున్నమి విశేషమైనదే .శత్రుం జయ కొండల పైన ఉన్న ’’పాలితాన ‘’ అనే జైన క్షేత్రానికి విశేషం గా ఈ రోజు జైనులు చేరుకొంటారు .దీనికి’’ శత్రుం జయ తీర్ధ యాత్ర ‘’ అని పేరు .216కిలో మీటర్ల దూరం కాలి నడకన నడిచి ఈ యాత్ర పూర్తీ చేసి జైనుల మొదటి తీర్ధంకరుడైన ‘’ఆది నాద ‘’ను దర్శించి తరిస్తారు . .జీవితం లో ఒక్క సారైనా శత్రుమ్జయ యాత్ర చేసి తీరుతారు .

శిక్కులకూ కార్తీక పౌర్ణమి విశేషమైనదే .ఈ నాడే గురునానక్ జయంతి కూడా .1469కార్తీక పౌర్ణమి నాడు సిక్కుల మతగురువు గురునానక్ జన్మించాడు .సిక్కులతో పాటు ‘’నానక్ పద హిందువులు ‘’కూడా ఈ ఉత్సవం లో పాల్గొంటారు .ఇన్ని విశేషాలు కార్తీక పౌర్ణమి లో ఉన్నాయి .

 

      Guru Nanak with Bhai Bala, Bhai Mardana and Sikh GurusGateway tower with multiple storeys

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-11-14-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కార్తీక పౌర్ణమి నాడుసత్యనారాయణ స్వామి వ్రతం -హైదరాబాద్ లో మా ప్పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో 

కార్తీక పౌర్ణమి నాడు ఉదయం ఎడున్నరనుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అభిషేకక్మ్ తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం -హైదరాబాద్ లో మా ప్పెద్దబ్బాయి శాస్త్రి ఇంట్లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?

కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?

ప్రతివాళ్లు ఇళ్లలో కార్తీకపౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యథార్థంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్లిపోతున్నారనుకోండి.
ఇంటి బ్రహ్మగారు ఉంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి 20 రోజులు పడుతుంది. ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్లాలి. ఆయన రోజూ దీపం పెట్టి వెళతారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్ని చోట్లా 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిథి కార్తీకపౌర్ణమి. అందుకే కార్తీకపౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగించేస్తుంటారు. పదిరోజులో, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడో తప్పు చేసిన రోజులెన్నెన్ని ఉన్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.

దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది. నేను టీవీ చూస్తాననకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దీపాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం ఉందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్న వాడవుతాడు. కాబట్టి ఎంతెంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీకదీపం పెడితే కార్తీకపౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రంనాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షలమంది వస్తారు. ఆ రోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే ఉండదిక. మొత్తం జనంతో నిండిపొతుంది. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు. భగవాన్‌ రమణులంతటి వారు కూడా అసురసంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన అక్కడకు వచ్చి నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే, అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి, అక్కడ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి.
అందుకే కార్తీకపౌర్ణమినాడు వెలిగించే దీపం కేవలం మన కొరకే కాకుండా, మనం చేసే దుష్కృతులను పోగొట్టి మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులనుద్ధరించడానికి పెట్టిన దీపం. కాబట్టి అశ్వయుజమాసం చివర వచ్చిన తిథినాడు వెలిగించిన దీపంతో మొదలుపెట్టి కార్తీకపౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనమిచ్చారు. ఈ దీపాలు వెళ్లిపోవాలి. దీపాలు వెళ్లిపోవటమంటే? నీటిలోకి తీసుకెళ్లి దీపాల్ని అరటిదొప్పలలో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే, నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్లిపోతూ ఉంటుంది. దీపం విడిచిపెట్టానండీ అంటారు. ఈ దీపం వెళ్లి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనమైపోతుంది ఆ నీటిలోనే.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలుష్య నివారనే గోదావరికి హారతి -తల్లా వఝల పతంజలి శాస్త్రి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -78 మారిన పుస్తకాలు

నా దారి తీరు -78

మారిన పుస్తకాలు

పదవ తరగతి సిలబస్ మారి కొత్తపుస్తకాలు వచ్చాయి .నేను చెప్పే ఫిజిక్స్ లో చాలా చాప్టర్లు మేము డిగ్రీ లో కూడా చదవనివి .ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాకు కొత్త .ఏదో మెండలీఫ్ ఆవర్తన పట్టిక మాత్రమే చదివాం .ఇవి చెప్పాలంటే చాలా నేర్చుకోవాలి .లేక పొతే చాలా కష్టం .అందుకని ప్రభుత్వం రీ ఒరిఎంటేషన్ క్లాసులను ఉపాధ్యాయులకు అన్ని సబ్జెక్ట్ లోలోను ఇచ్చే ఏర్పాటు చేసింది  .కాలేజీ లెక్చరర్ ల సేవలను ఉపయోగించి మాకు నేర్పారు. జిల్లా విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిక మీద నిర్వహించింది .మాకు గుడివాడ టౌన్ హై స్కూల్ లో శిక్షణా తరగతులు నిర్వహించారు .

నేను ఫిజిక్స్ మెయిన్ వాడినే అయినా ఈ సబ్జెక్ట్ అంతా కొరక రానికోయ్యగా ఉండేది .కొన్ని చాప్టర్లు మరీ అయోమయం గా ఉండేవి .అప్పటికే మా పెద్దబ్బాయి శాస్త్రి, రెండోవాడు శర్మ లు డిగ్రీలు పూర్తీ చేసిఉన్నారు .వాళ్ళను అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేశా .వాళ్ళు ‘’నాన్నా !నీకు మేము చెప్పగలమా ?ఈ చాప్టర్లున్న మేము చదివిన ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకాలిస్తాం చదివి నువ్వే నేర్చుకో .’’అని కాడిపారేశారు .సరే అని వాళ్ళు నాకు ఇచ్చిన పుస్తకాలు ,లైబ్రరీలో పుస్తకాలు ఇంగ్లీష్ లో ఉన్నవి చాలా శ్రద్ధగా ప్రతి విషయాన్ని చదివి జీర్ణం చేసుకొన్నాను .ఆ టాపిక్స్ లో ఏ రకమైన అనుమానాలున్నా చదివి నివృత్తి చేసుకొని సబ్జెక్ట్ ను కరతలామలకం చేసుకొన్నాను .ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ చాలా లావుగా చాలా పాఠాలతో ఉండేది .ప్రభుత్వానికి అందులో కొన్ని పాఠాలు విద్యార్ధుల స్థాయికి మిన్చిఉన్నాయని వాటిని సిలబస్ నుంచి తొలగించాలని కూడా మాలో కొందరం నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి డి .యి .ఒ. ద్వారా మేమోరాండాలు ఇచ్చాము .బహుశా ఆంద్ర రాష్ట్రం లో కృష్ణా జిల్లా గిల్డ్ ఇలాంటి వాటికి చాలా మార్గ దర్శకం గా ఉండేది .వారూ పునశ్చరణ తరగతులను నిర్వహించారు .అందులో మేమూ భాగస్వాములమయ్యాము .ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో నేను బోధించటానికి అన్నిరకాల అవకాశాలను సిద్ధం చేసుకొన్నాను .కనుక ఈ సబ్జెక్ట్ లలో నాకు అదనపు శిక్షణ అవసరం లేదు అని పించింది .

గుడివాడలో ఇంగ్లీష్ ,ఫిజిక్స్ కేమిస్ట్రి ,లెక్కలు ,నేచురల్ సైన్స్ ,సోషల్ లలో క్లాసులు జరిగాయి ,అప్పుడు  వీటికి ఇన్చార్జిగా గుడివాడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ సుబ్బారావు గారు ఉండేవారు .నేనూ ,తమిరిస సైన్స్ మేష్టారు మల్లికార్జున రావు గారు ఆయన్నుకలిసి మాకు ఫిజికల్ సైన్స్ లో శిక్షణ అవసరం లేదని లెక్కలలో శిక్షణ పొందటానికి అనుమతినివ్వమని కోరాం .లెక్కల మీద మా కున్న శ్రద్ధకు ఆయన ముచ్చటపడి ఒ.కే .అన్నారు .మేము గణితం క్లాసుల్లో కూర్చుని ఆ సబ్జెక్ట్ లో మెలకువలన్నీ తెలుసుకొన్నాం .ఇలా ఈ శిక్షణ  మా ఇద్దరికీ బాగా ఉపయోగ పడింది .మిగిలిన వారు వారి వారి సబ్జెక్ట్స్ లో శిక్షణ పొందారు .ఈ ట్రేయింగ్ ఉపాధ్యాయులకు సబ్జెక్ట్ లలో ఎక్స్పర్ట్ లు అవటానికి బాగా దోహదపడ్డాయి .ఇది వారికి వరం అయింది .ఉయ్యూరులో ఇంటి దగ్గర నా దగ్గరే ట్యూషన్ చదవాలి అనుకొనే వారికి బాగా ఉపయోగపడింది .అప్పుడు నా దగ్గర చదివిన వాళ్ళలో ఊర సుబ్బారావు కొడుకు మోహనరావు కొడుకు ,కళాయి మాట్లు పెట్టె సాయిబు కొడుకు ,మొదలైన వారుండేవారు వీరికి మార్కులు బాగా రావటం కోసం ఇంటర్ లెక్కలూ నేర్పెవాడిని లెక్కలంటే అంత ఉత్సాహం నాకు .వాళ్ళే స్కూల్ ఫస్ట్ మార్కులు సాధించారు .

ఇంగ్లీష్ పుస్తకమూ మారటం వలన మేము ఇంగ్లీష్ కూడా బోధిస్తున్నాం కనుక అందులోను శిక్షణ పొందాం .అశోకుడి కలింగ యుద్ధం మీద లెసన్ ఉంది .రాసిన వారేవరోకాని అందులో అశోకుని సైన్యం నడకను చాలా గొప్పగా రాశాడు .ఒక రిదం అందులో ఉంది .అది పట్టుకొన్నాను .అలా చదువుతూ ఉంటె అసలు గుర్రాలు కదను తొక్కుతున్నట్లు సైన్యం పద విన్యాసం చేస్తున్నట్లు ఉండి యుద్ధ దృశ్యాన్ని ఆవిష్కరింప జేసేవాడిని .నేను చదవటమే కాదు బాగా చదవ గల పిల్లలతో కూడా చదివించే వాడిని .దీనితో ఒక రకమైన ఉత్సాహం వచ్చేది క్లాసులో .నాకు తెలిసినంత వరకు ఇలా ఈ లెసన్ లో ఈ రిథం ను అనే నాడిని పట్టుకొన్న వాడిని నేనొక్కడినే అనిపించింది.ఎవరితో మాట్లాడినా ఈ విషయం వారికీ చెప్పే వాడిని ‘’అంత సీనుందా ‘’అనేవారు వాళ్ళు .పామర్రులో నేను చెప్పే టెన్త్ క్లాస్ సెక్షన్ లో సరస్వతి అనే ఒక అమ్మాయి ఉండేది .ఆ అమ్మాయి నేను ఎలా చదివితే అలా చదివేది .ఆమె ఒక రిటైర్డ్ మాస్టారి మనవ రాలు అనిజ్ఞాపకం .అలాంటి పిల్లలకు విద్య చెప్పటం భలే  ఆనందం గా సంతృప్తిగా ఉండేది .ఆ పిల్ల కూడా నేను ఒక పేరా చదివి ఎక్స్ ప్లైన్ చేసి అందులోని సారాంశాన్ని ఇంగ్లీష్ లో చెప్పితే వెంటనే చెప్పగలిగేది నాకు బహుముచ్చటగా అనిపించేది ..మగ పిల్లల్లో అంత స్పార్క్ ఉన్న వారు ఉన్న జ్ఞాపకం లేదు .ఆమె తాతగారు అప్పుడప్పుడు కనిపించి నా బోధనా తీరును మెచ్చుకొనేవారు .సహృదయుల మెప్పు కంటే సంతృప్తి ఏముంటుంది ?నిజం గా అవి మధురమైన అనుభవాలు జీవితం లో .

టెన్త్ పరీక్షలలో మధ్యాహ్నం క్లాసులు

ఇంగ్లీష్ కు న్యాయం చేయాలని టెన్త్ సప్ప్లి మెంటరి పబ్లిక్ పరీక్షలకు ఇన్విజిలేటర్ గా డ్యూటీ చేసే నేను, అది అవగానే టెన్త్ ఇంగ్లీష్ ను విద్యార్ధులకు బోధించేవాడిని .ఒక సారి గుడివాడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీ సుబ్బారావు గారు పరీక్షల ఇన్స్పెక్షన్ కు వచ్చి ,పిల్లలను చూసి వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితె తమకు ఇంగ్లీష్ క్లాస్ లను నేను బోధిస్తున్నట్లు వాళ్ళు తెలియ జేశారట .మధ్యాహ్నం పరీక్షవగానే అయన హెడ్ మాస్టారి సమక్షం లో అందరిని సమావేశ పరిచి ఇంగ్లీష్ బోధన లో నేను చేస్తున్న కృషిని అందరికి తెలియ జేసి నన్ను ప్రత్యేకం గా అందరి సమక్షం లో అభినందించారు .ఇది నేను మర్చిపోలేని విషయం .సుబ్బారావు గారు చాలా సహృదయులు. విధి నిర్వహణ లో నిర్దుష్టం గా ఉండేవారు .ఎలాంటి అవినీతినీ సహించేవారు కాదు .ఆయన సమర్ధత వలన వారు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిగా కూడా పని చేసి చాలా ఆదర్శ ప్రాయం గా విద్యాశాఖను తీర్చి దిద్దారు .పామర్రు సంఘటన ను అందరికి ప్రతి చోటా తెలియ జేసిన సంస్కారం వారిది .నాకు  ఫోన్ ద్వారావారితో  మాట్లాడే చనువు ఇచ్చిన పెద్ద మనసు వారిది .జనవరి ఫస్ట్ , ఉపాధ్యాయ దినోత్సవానికి పరస్పరం అభినందనలు తెలియ జేసుకొనే వారం .జిల్లా కు అలాంటి వారి సేవలు లభించటం అదృష్టం .అలాంటి సిన్సియర్ ఆఫీసర్ దగ్గర పని చేసే భాగ్యం నా లాంటి వాళ్లకు కలగటం మరీ అదృష్టం .ఆయన దాదాపు పదేళ్ళ క్రితం చనిపోయారు .మంచి మనసు, చేష్టలు ఉన్న దొడ్డ మనిషి శ్రీ సుబ్బారావు గారు .అన్నిటా నంబర్ వాన్ గా ఉండాలనే తలంపు వారిది .అలానే చేసి నిల బెట్టేవారు .డి. యి .ఒ  .గా పని చేసినకాలం లో ఏదైనా అభివృద్ధికి, సైన్స్ ఫెయిర్ నిర్వహణకు ,సలహాలు నన్ను అడిగి తీసుకొని చర్చించి అందులో పనికి వచ్చిన వాటిని అమలు జరిపిన విద్యాభి వృద్ధి అధికారి సుబ్బా రావు గారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-11-14-ఉయ్యూరు

 

 

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మండలి బుద్ధ ప్రసాద్ – ఆ దేవుడు కోరుకొనేదే అదేనని నా నమ్మకం

D26620894

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ సత్యనా రాయణ స్వామివ్రతం -హైదరాబాద్

శ్రీ సత్యనా రాయణ స్వామివ్రతం -హైదరాబాద్ లో మా పెద్దబ్బాయి శాస్త్రి వాళ్ళ ఇంట్లో -క్షీరాబ్ధి  ద్వాదశి -మంగళ వారం ఉదయం –  4-11-14

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విపత్తులో మహా మానవత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్యాంధ్ర రో జల రవాణా –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాంగ్రెస్ కనుమరుగైపోతోందా?

కాంగ్రెస్ కనుమరుగైపోతోందా?

 

కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలంటున్న బి.జె.పి కల లు నిజమవుతాయా? లోక్‌సభతోపాటు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బి.జె.పి కలలు నిజమవుతాయనే ఈ సంకేతాలిస్తున్నాయి. పదహారవ లోక్‌సభ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర, హర్యానా శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆశనిపాతం వంటివి. కాంగ్రెస్ పార్టీ మహారాష్టల్రో గత పదిహేనేళులగా, హర్యానాలో గత పదేళ్లుగా నుండి అధికారంలో కొనసాగింది. రెండు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్‌ను ఛీత్కరించటంతో ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకత్వం హోదా కూడా లభించటం లేదు.
మహారాష్ట్ర, హర్యానా ఓటమితో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఇది చెప్పుకునేందుకు పనికి వస్తుంది తప్ప రాజకీయంగా ఎందుకూ పనికి రాదు. దక్షిణాదిలోని కర్నాటక ఒక్కటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం. మిగతా ఎనిమిది రాష్ట్రాలు చిన్నవి, అతి చిన్నవి. కాంగ్రెస్ దక్షిణాదిలో కర్నాటక, కేరళలో అధికారంలో ఉంటే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించే హిందీ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి దశాబ్దాలవుతోంది. కాంగ్రెస్ పార్టీ హిమాలయ పర్వత ప్రాంతాల పార్టీగా రూపాంతరం చెందిందంటే ఆశ్చర్యపోకూడదు.హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్, అస్సాం, మిజోరం,మేఘాలయ,మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్నది. కర్నాటక మినహా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరే ఇతర రాష్ట్రం కూడా జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించలేవు.
దీనికి భిన్నంగా కేంద్రంలో స్వశక్తితో అధికారంలోకి వచ్చిన బి.జె.పి మధ్య ప్రదేశ్, చత్తీస్‌గడ్, గోవా,గుజరాత్, రాజస్తాన్‌లో అధికారం చెలాయిస్తోంది. ఇప్పుడు తాజా గా హర్యానాలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే మహారాష్టల్రో శివసేనతో కలిసి అధికారంలోకి రాబోతోంది. దీనికితోడు బి.జె.పి మిత్రపక్షాలైన తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే అకాలీదళ్ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. బి.జె.పి దాని మిత్రపక్షాలు జాతీయ రాజకీయాలకు అత్యంత ముఖ్యమైన తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. దేశంలోని మిగతా పదకొండు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, త్రిపుర, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, సిక్కిం, ఒడిశా,నాగాలాండ్, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్, బీహార్‌లలో ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని చెలాయిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతానికి సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నా 2016 ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కేవసం చేసుకునేందుకు బి.జె.పి సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఉత్తరాధిలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేకపోవటం గమనార్హం. కాంగ్రెస్‌కు ఇప్పుడు నాయకత్వం అనేది లేకుండాపోతోంది. సోనియా గాంధీ దేశానికి సమర్థ ప్రభుత్వాలను అందజేయటంలో ఘోరంగా విఫలమయ్యారు. డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను అడ్డం పెట్టుకుని అధికారం చెలాయించారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోలేదు. కాంగ్రెస్‌తోపాటు మిత్రపక్షాలకు చెందిన మంత్రులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నా ఆమె అదుపు చేయలేదు. కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణ యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం అసమర్థత, అవినీతికి అద్దం పట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉపనాయకత్వం బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి అసలు రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకపోవటం పార్టీకి తీరని నష్టం కలిగించింది. రాహుల్ గాంధీకి రాజకీయ నాయకత్వ లక్షణాలు లేకపోయినా అతన్ని బలవంతంగా కేంద్ర బిందువు చేయటం వలన కాంగ్రెస్‌కు ఎనలేని నష్టం వాటిల్లింది. ఆయన కు రాజకీయ పరిజ్ఞానం లేకపోవటం, అధికారం పట్ల సరైన అవగాహన రాకపోవటంతో కాంగ్రెస్ పునాదులు కదిలిపోయాయని చెప్పకతప్పదు.
ఇందులో రాహుల్ గాంధీ తప్పేమీ లేదు. సోనియా గాంధీకి మాదిరిగానే రాహుల్ గాంధీకి కూడా రాజకీయాలలోకి రావటం ఎంత మాత్రం ఇష్టం లేదు. తన జీవితమేదో తాను జీవించాలనుకున్నాడు. అందుకే ఆయన చాలా కాలం పాటు కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. సోనియాగాంధీ రాజకీయ వారసుణ్ణి సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీని అమేథీ నుండి లోక్‌సభకు ఎంపిక చేసి ఆ తరువాత ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అయితే రాహుల్ గాంధీ ఏ రోజు కూడా రాజకీయాధికారం నుండి ఆనందం పొందలేదు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రావటాన్ని సోనియా గాంధీ మొదట్లో చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించటం జగమెరిగిన సత్యం. రాజీవ్ గాంధీ హత్యానంతరం పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదు సంవత్సరాల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నిర్వహించారు. సోనియా గాంధీకి రాజకీయాలలోకి రావటం ఇష్టం లేకనే నరసింహారావు ప్రధాన మంత్రి పదవి చేపట్టవలసి వచ్చింది. నరసింహారావు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు ఆయనకు సోనియా గాంధీకి మధ్య రాజకీయ రగడ కొనసాగింది. సీనియర్ నాయకుడు అర్జున్ సింగ్ లాంటి వారి మూలంగా చివరకు సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఆ తరువాత 2004లో కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సోనియా గాంధీ రాజకీయ నాయకురాలిగా ఎదగలేకపోయారు. ఈ ఖాళీని భర్తీ చేసేందుకే ఆమె తన రాజకీయ వారసుడుగా రాహుల్ గాంధీని ముందుకు తెచ్చారు. కాంగ్రెస్ నాయకులకు అధికారం ముఖ్యం. తమను అధికారంలోకి తెచ్చే వారికే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద పీట వేస్తారు. రాహుల్ గాంధీ తమకు అధికారాన్ని సంపాదించిపెట్టలేడని విశ్వసిస్తున్నారు. అందుకే వారు ప్రియాంకాగాంధీ వైపు చూస్తున్నారు. ఆమె రాజకీయాల్లో రాణిస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్టీని కాపాడే పరిస్థ్థిలో లేరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టగలుగుతుందా?

 

Posted in రాజకీయం | Tagged | 1 Comment

కపిల గిత్త ఖరీదు ఏడు లక్షలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అసలు తుఫాను ఇప్పుడే మొదలవ్వాలి -కవిత

Posted in కవితలు | Tagged | Leave a comment

కారా మాస్టారి కధలు- పర్వత పదం నుండి శిఖరాగ్రం వరకు -కా రా గురించి రఘోత్తమ రెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు – కాసుల ప్రతాపరెడ్డి, 9848956375

విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు

ప్రముఖ కథా రచయిత ఎన్‌కె రామారావు నల్లగొండలో 16 అక్టోబర్ 2014న మరణించారనే వార్త ఓ వెలితిని కలిగించింది. అప్పటికి ఆయనకు 69 ఏళ్ళు. ఆ వార్తతో విషాదం కలగడం కన్నా హృదయంలో వెలితి ఏర్పడటం భరించడానికి కాస్త కష్టమే అయింది. ఓ సాహితీవేత్త సహృదయుడు కూడా అయితే ఎలా ఉంటాడో ఎన్‌కె రామారావు అలా వుండేవారు. మంచి కథా రచయిత, మంచి మనిషి కూడా కావడం అరుదైన విషయం. రాసిన కథలు పిడికెడే అయినా పదునైనవీ, ఎల్లకాలం గుర్తుంచుకునేవి. సమాజం పట్ల నిబద్ధతతో ఆయన కథా రచన చేశారు. స్వీయ మానసిక లోకంలోంచి ఇతివృత్తం ఇష్టపడడు. ఆయన కథా రచన రెండు విడతలుగా సాగింది. కాంచనపల్లి చినవెంకట రామారావు, బోయ జంగయ్య వంటి నల్లగొండ జిల్లా సీనియర్ కథా రచయితలతో ఆయన రచనలు ప్రారంభించారు. వారితోపాటు ఓ విడత కథలు రాసి ఆ తర్వాత వదిలేశారు. ఆ తరువాత కొంతకాలానికి తిరిగి రాయడం మొదలుపెట్టారు. ఆయనకు కథలంటే ప్రాణం.
రామారావు గారు ఆంగ్ల కథలు చదివి వాటి గురించి చెప్పేవారు. దేశదేశాల కథల గురించి అత్యంత ఆసక్తికరంగా ఆయన చెబుతుండేవారు. కథా రచనలోని మెలకువలు కూడా ఆయన మాటల్లో ఉండేవి. కథలు రాయడంలోనే కాదు, కథలు చెప్పడంలో కూడా రామారావు దిట్ట. ఆయన దేశవిదేశాల్లోని ఉత్తమ కథల గురించి చెబుతుంటే ఏమాత్రం విసుగొచ్చేది కాదు. రామారావు మంచి హాస్యప్రియుడు. హాస్యం ఆయన నోటివెంట అప్రయత్నంగా జారిపడేది. హాస్యం, వ్యంగ్యం ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఆయన శ్రీరమణను చాలా ఇష్టపడేవారు. అలాగే, బాపు-రమణల జంటకు రామారావు అత్యంత ప్రీతిపాత్రుడు. బాపుగారు రామారావు బొమ్మ కూడా గీశారు. ఆయన రాసిన విద్యుల్లత కథా సంపుటికి కవర్ పేజీ బొమ్మ కూడా గీసిపెట్టారు. కవర్‌పేజీల బొమ్మలు గీయడం మానేసిన తర్వాత బాపు రామారావు కోసం ఆ పని ప్రత్యేకంగా చేసిపెట్టేవారంటే ఆ అభిమానం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. ముళ్లపూడి రమణ రచనలను విపరీతంగా అభిమానించేవారు. వ్యంగ్య, హాస్య కథలు కూడా రామారావు రాశారు. అయినా, ఆయన తన సామాజిక నిబద్ధతను వదిలిపెట్టలేదు. ఆయన కథలు చెప్పడం గురించి అనుకున్నాం. విప్లవ గేయం రాసిన ఎన్‌కె అనుకుని తనను పోలీసులు నిర్బంధించిన తీరు, తాను తిరిగి బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలను ఆయన అత్యంత ఆసక్తికరంగా చెప్పేవారు. అలాగే శ్రీశ్రీ, రావిశాస్ర్తీ నల్లగొండకు వచ్చినప్పటి వివరాలను కూడా కథలు కథలుగా చెప్పేవారు. రావిశాస్ర్తీ రాచకొండ కోటని, గ్రామాన్ని చూద్దామని పట్టుబడితే వెళ్లారుట. తమ పూర్వీకుల నివాసం ఈ రాచకొండనే అని రావిశాస్ర్తీ చెప్పారని రామారావు చెప్పారు.
సాహిత్య లోకానికి సంబంధించి ఆయనకు కచ్చితమైన ఇష్టాఇష్టాలు ఉండేవి. శిల్పం లేని కథలను ఆయన ఏమాత్రం అంగీకరించేవారు కాదు. రచనలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ నిండుతనం ఉండాలని ఆయన భావించేవారు. ఆయన లోటు భర్తీ అయ్యేది కాదు. అంతటి పదునైన రచయిత తెలుగు సాహిత్య లోకంలో చాలా అరుదు. ఆయన రాసిన కథలు తక్కువే అయినా, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అనే రీతిలో ఆస్వాదించవచ్చు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా? – సన్నిధానం నరసింహశర్మ 9292055531

అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా?

ఉత్తమ వారసత్వం కొనసాగింపు లేదా పునర్వ్యవస్థీకరణ కోరుకోవడంలో తప్పులేదు. నలందాలో భారతదేశానికి అమందానందాన్ని చేకూర్చి ఖ్యాతి పెంచిన విశ్వవిద్యాలయం ఇప్పుడుండదు. గోడలో, శిథిలాలో, చరిత్ర శేష శకలాలో వుండడం సహజం. ఆ స్థానంలో జపాను వారు స్ఫూర్తి నిర్మాణానికి తలపెట్టడం ఆనందం. కడపలో సి.పి.బ్రౌను బంగళా శిథిల దశలో ఉంటే, అదే తావులో సి.పి. బ్రౌను గ్రంథాలయాన్ని నిర్మించడం వారసత్వ రక్షణ కృషే అవుతుంది. అయితే పాలక పక్షాల నిర్లక్ష్యాల వల్లో, ఆర్థిక దుస్థితుల వల్లో కొన్ని చరిత్రాత్మక సంస్థలు ఒకనాటి సేవల్ని అందించలేకపోవచ్చు. కాలగర్భంలో కొన్ని కలసిపోరుూ వుండవచ్చు. అంతమాత్రాన ఆ సంస్థల్నీ, వాటి రూపకర్తల ఆశయాల్నీ కొంచెపరచడం, కించపరచడం మెచ్చుపని అనిపించుకోదు. హైదరాబాదు, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం శతాబ్ది ఉత్సవ సంఘం వారు – ఆ భాషా నిలయం నూరేళ్ళ చరిత్రను వర్తమాన తరం వారికి స్ఫూర్తిదాయకంగా తెలియజేసే ప్రయత్నంగా ప్రఖ్యాత రచయిత శ్రీ అక్కిరాజు రమాపతిరావును ఒక పుస్తకం రాయమని గతంలో కోరడం ముదావహం. వీరేశలింగం పంతులు – సమగ్ర పరిశీలన, వీరేశలింగం లేఖలు – డైరీలు వంటి శ్రమైక గ్రంథాలు రాసిన, వీరేశలింగ గ్రంథాలు కొన్ని వెలుగులోకి తీసుకు వచ్చిన శ్రీ అక్కిరాజు ‘శరదశ్శతం’ అనే పేరుతో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంపై ఒక పుస్తకం రాయడం ఆ గ్రంథాలయాభిమానులుగా మనందరికీ ఆనందకారణం. పుస్తకాన్ని ప్రకటించిన భాషాలయ కార్యవర్గమూ అభినందనార్హమే. అయితే… ఆ పుస్తకంలో ఆ గ్రంథాలయేతరంగా ఆయన రాసిన కొన్ని అంశాలు చరిత్రాభిమానుల మనోభావాల్ని గాయపరిచేవిగా ఉన్నాయి. వాస్తవ ప్రదర్శనశాలలో వాటిని ఎత్తిచూపడం ఈ రచనోద్దేశం.
పుట రెండులో ‘‘వీరేశలింగం పంతులుగారి హితకారిణి వంటి సంస్థలే ఇప్పుడు లేవు’’ అన్నారు. కాగా ‘వంటి సంస్థలు’ అలా వుంచితే ‘హితకారిణీ సమాజ’మే ఓ సంస్థగా దేవాదాయ శాఖ క్రింద నడపబడుతోంది అనేది వాస్తవం. 2, 3 పుటల్లో ‘‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థగాని, అది నడపిన పత్రికగాని, రాజమహేంద్రవరంలోని ఆంధ్ర చారిత్రక పరిశోధన సంస్థగాని ఇప్పుడు లేవు. రాజమండ్రిలో శ్రీ వీరేశలింగ ఆనందోద్యానం, పురమందిరం నామమాత్రంగా తమ ప్రాణావసాన దశలో ఉన్నాయి. దామెర్ల రామారావు చిత్రకళా సంస్థ లేనట్లే లెక్క’’ అని తీర్మానించేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థ ఇప్పుడు లేదంటే కాకినాడలో ప్రతి పౌరుడూ ముక్కుమీద వేలేసుకుంటాడు.
కాకినాడలో రామారావుపేటలో ఆంధ్ర సాహిత్య పరిషత్తు గవర్నమెంటు మ్యూజియంగా ఆ సంస్థ సుమారు ఐదువేల రాతప్రతులతో, ప్రాచీన ముద్రిత గ్రంథాలతో, క్యూరేటరు సిబ్బందితో సేవలు నిర్వహిస్తోంది. నూతన దశాభివృద్ధికి కొన్ని లక్షలు వచ్చాయి కూడా.
అక్కిరాజు వారు చెప్పినట్లు వీరేశలింగపుర మందిరం నామమాత్రంగా ప్రాణావసాన దశలో మాత్రం లేదు. సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలతో, వీరేశలింగ గ్రంథ ప్రదర్శనతో ప్రాచీన సంస్థ ఎలా ఉంటుందో అలా వుంది.
‘‘దామెర్ల రామారావు ఆర్టు గేలరీ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ క్రింద రాజమండ్రి లక్ష్మివారపుపేటలో అభివృద్ధి దశలోనే ఉంది. నిత్యం సందర్శకులు ఎంతోమంది సందర్శిస్తున్నారు. ఇటువంటి సంస్థ ‘లేనట్లే లెక్క’ అక్కిరాజు వారి వినూతన గణితంలో. ‘మయసభ వీక్షణానుభూతి’ చెందారేమోమరి. గతానికే కాదు, వర్తమానానికి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రల్ని వాస్తవ దృష్టితోనే గమనించాలి. ఎన్నో పాతపత్రికలు, ప్రాచీన గ్రంథాలు కళ్ళల్లో వత్తి పెట్టుకుని మరీ పరిశీలించే అక్కిరాజు వారు వక్రీకరణలకి దూరంగా ఉండాలి మరి. ఎన్నో సంస్థలు, మరికొన్ని గ్రంథాలయాలు కాలగర్భంలో కలసిపోయినా, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని శతాధిక సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుని రావడాన్ని ఎంత కొనియాడినా తక్కువే అవుతుంది. కానీ దాని వైభవ ప్రాభవాలు చెప్పే సందర్భాలలో తక్కిన ఉన్నవాటిని సున్నగా చూడడం, చూపడం రమాపతిరావు గారికి తగదు.
16వ పుటలో ఒక దారుణ విశే్లషణకు ఒడిగట్టారు, రావుగారు. ‘‘రాజమండ్రిలో వీరేశలింగం, వడ్డాది సుబ్బారాయుడు, నాళం కృష్ణరావు ప్రభృతుల స్వీయగ్రంథ సముచ్చయ పరిపోషణ ప్రయత్నాలు ఉన్నా అవి సార్వత్రిక, సార్వజనిక గ్రంథ పఠనోద్దేశ నిలయాలు కావు. తరువాత ఈ పెద్దల గ్రంథ సంగ్రహాలు ఒక చోట కలిపి, దానిని గౌతమీ గ్రంథాలయమని నామముంచినా, ఈ గ్రంథాలయం పండితులకు మాత్రమే అందుబాటులో ఉండేది’’ – అని వ్యాఖ్యానించారు.
శ్రీ ‘గౌతమీ’ గ్రంథాలయానికి నాసికాత్రయంబకం వంటి వీరేశ గ్రంథాలయాన్ని నాళం కృష్ణారావుగారు 1898లో స్థాపించారు. అదే తరువాత సర్వజన గ్రంథాలయంగా నామధారణ చేసింది. ఈ గ్రంథాలయం ఉన్న కాలంలో వడ్డాది సుబ్బారాయ కవి పేర వ.సు.రాయ గ్రంథాలయంగా వేరే గ్రంథాలయం వృద్ధి చెందింది. 1920లో వసురాయ సర్వజన గ్రంథాలయాలు సమ్మేళనమై శ్రీ గౌతమీ గ్రంథాలయంగా రిజిస్టరయింది. గ్రంథాలయాలు స్థాపించడాన్ని ‘స్వీయగ్రంథ సముచ్చయ పరిపోషణ ప్రయత్నాలు’గా కొంచెపరచారు. అంతేకాక వాటిని ‘సార్వత్రిక, సార్వజనిక గ్రంథపఠనోద్దేశ నిలయాలు’ కావని స్థాపకుల ఆశయాల్నే కించపరచారు. ‘సర్వజన గ్రంథాలయం’ అనే నామకరణంలోనే సామాజికోద్దేశం ఉండగా రమాపతిరావు గారి దృష్టిలో అది శ్రీ మద్రమారమణ గోవిందో హరి అయింది. అంతేకాదు, ప్రయత్నాలు అనే మాటతో వారి ఆశయాల్ని విశే్లషించడంలో ఔచిత్యాన్ని పాటించలేదు.
ఆ గ్రంథాలయాలు ఎటువంటి పాత్ర వహించాయో తెలుసుకోవాలంటే ఒకనాటి పాత గ్రంథాలయ సర్వస్వాలూ, అవీ మరింతగా చూస్తే మంచిది, గ్రహించవచ్చు.
‘శ్రీ గౌతమీ గ్రంథాలయం పండితులకి మాత్రమే అందుబాటులో ఉండేది’ ఇది అక్కిరాజు వారి పరిశోధన. 116 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగల గ్రంథాలయానికి ఏవైనా కొన్ని సంవత్సరాల ఆటుపోటులు వుండి వుండవచ్చు. స్ర్తి విద్యాభ్యాసానికి వెన్నుదన్నులిచ్చిన వీరేశలింగం స్ఫూర్తితో – పురుషులకంటే స్ర్తిల వద్ద చందా తక్కువగా వసూలు చేసిన ఘనత ఆ గ్రంథాలయానిది. దశాబ్దాలపాటు గ్రంథాలయ గ్రంథాలు ప్రజావినియోగార్థం సైకిళ్లపై సంచులతో ఉద్యోగులతో ఇంటింటికీ వినియోగింప చేసిన గ్రంథాలయం గౌతమీ గ్రంథాలయం. పరిశోధక, సభ్య పాఠకులకు సేవ చేస్తే – కేవలం పండితులకే అనడం ఈ పండితునికే తగింది. వందల వందల సాహిత్య సాంస్కృతిక సభలు కంచుమర్తి బాబాయమ్మ హాలులో చేసి, జ్ఞానాన్ని ప్రజలకు పంచాలనే ఆశయ సిద్ధిగల గౌతమీ గ్రంథాలయం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంచే శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంగా నడపబడుతోంది.
వేటపాలెంలోని సారస్వత నికేతనం, రాజమహేంద్రవరంలోని శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం, హైదరాబాదులోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం, నెల్లూరులోని వర్ధమాన సమాజం వంటి గ్రంథాలయాలు ప్రతి తెలుగువాడూ గర్వించదగిన గ్రంథాలయాలు… వాటి చరిత్రలు అవశ్య పఠనీయాలు. ఇంతకీ అక్కిరాజు వంటి వారు చరిత్రను భూత, వర్తమాన కోణాలలో దేనినీ కొంచెపరచరాదు, కించపరచరాదు అనిపిస్తుంది. అక్కిరాజు గారు లేదన్నంత మాత్రాన చరిత్ర మరుగున పడిపోదు, కనుమరుగైపో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment